breaking news
Mulugu
-
పూజారుల గదులను పట్టించుకోరూ?
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో నిర్మించిన పూజారుల గదులు మరమ్మతులకు చేరుకున్నాయి.గతంలో మహాజాతర సందర్భంగా సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల కోసం దేవాదాయ శాఖ ఆవరణంలో ప్రత్యేక గదులు నిర్మించారు. జాతర సమయాల్లో పూజారులు గదుల్లో ఉండి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గదులు మరమ్మతుకు రావడంతో పూజారులకు మళ్లీ పాత తొమ్మిది గదుల రేకుల షెడ్డు దికై ్కంది. కొన్ని గదుల కిటీకిలు, తలుపులు పగిలిపోయాయి.అలాగే టైల్స్ సైతం దెబ్బతిన్నాయి. దేవాదాయశాఖ అధికారులు పూజారుల గదులను పట్టించుకోకపోవడంతో మరమ్మతుకు చేరుకున్నాయి. అమ్మవార్లను కొలిచే పూజారుల గదులే ఇలా ఉంటే భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయో సంబంధిత అధికారులకే తెలియాల్సి ఉంది. ఇటీవల పూజారుల కోసం నూతన భవనం నిర్మించారు. కానీ మహాజాతర సమయంలో పూజారులకు గదులు చాలా అవసరం. జాతర సమయంలో భక్తుల రద్దీకి పూజారులు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. గద్దెల దగ్గర గదులు ఉండడంతో పూజా కార్యక్రమాలకు, అధికారులకు వారు అందుబాటులో ఉంటారు. దేవాదాయశాఖ అధికారులు స్పందించి గదులకు మరమ్మతులు చేపట్టాలని పూజారులు కోరుతున్నారు. -
దేశభక్తి కలిగి ఉండాలి
ములుగు రూరల్ : ప్రతీ పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్కుమార్ శ్రీవాత్సవ, సెకండ్ ఇన్ కమాండెంట్ జెగ్షేర్, డిప్యూటీ కమాండెంట్ ఎస్ిపీ రజిత పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బెటాలియన్ ఆధ్వర్యంలో ఆదివారం సీఆర్పీఫ్ అధికారులు డీఎల్ఆర్ నుంచి గాంధీ విగ్రహం వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దేశ సౌరభౌమత్వాన్ని కాపాడేందుకు దేశభక్తి కలిగి ఉండాలని వివరించారు. ఎందరో పోరాట యోధులు స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆ విష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమ ంలో 39 బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. నియామకం ఎస్ఎస్తాడ్వాయి : మండలంలోని మేడారం సమీపంలో గల రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దండుగుల మల్లయ్యను తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలుమల్లు ఆదేశాల మేరకు ఆదివారం హైదరాబాద్లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్.. మ ల్లయ్యకునియామక పత్రం అందజేశారు. మల్లయ్య మాట్లాడుతూ వడ్డెర కులస్తుల సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నా రు. రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన సంఘ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రేపటితో రైతుబీమా గడువు ముగింపుభూపాలపల్లి రూరల్ : అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం రెన్యూవల్ గడువు ఈ నెల 12వ తేదీతో ముగయనుంది. జిల్లాలోని రైతులంతా రైతుబీమాను రెన్యూవల్ చేసుకోవాలని, అదేవిధంగా కొత్త పట్టా పాస్బుక్ పొందిన రైతులు సైతం సంబంధిత రైతు వేదికల్లో ఏఈఓల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయశాఖ అధికారి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18నుంచి 59 ఏళ్ల వయసు గలవారు 2025, జూన్ వరకు భూభారతి ద్వారా పట్టా పాస్బుక్ పొందిన రైతులు అర్హులని పేర్కొన్నారు. రైతులు ఏదైనా ప్రమాదం, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల మరణించిన పక్షంలో నామినికి ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తారని వివరించారు. ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, ప్రతి ఏటా ఆగస్టు 15నుంచి తదుపరి ఆగస్టు 14 వరకు బీమా చెల్లుబాటులో ఉంటుందని వెల్ల డించారు. రెన్యువల్ లేదా కొత్తగా నమోదు కావాలనుకునే రైతులు సమీపంలోని ఏఈఓ లేదా రైతు వేదికలో గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని బాబు సూచించారు. 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ిసీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రానికి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. -
విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి
ఎస్ఎస్తాడ్వాయి : నిరక్షరాస్యతను అంతం చేసి, విద్యను అందించడం ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మండల తోగులో నిర్మించిన నూతన పాఠశాలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొత్తికోయ గూడెల్లో చిన్నారులకు విద్య అందించాలని, అందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అభయారణ్యంలోని పిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో పీపుల్ హెల్పింగ్ సెంటర్ ఎన్జీఓ సంతోష్ 2020 నుంచి తమ సేవలను అందిస్తున్నాడన్నారు. విద్య ప్రాథమిక హక్కు అని, గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క, కలెక్టర్, ఇతర అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి, చక్రవర్తి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మంత్రి ధనసరి సీతక్క -
నులి పురుగులకు చెక్..
వెంకటాపురం(ఎం): ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ఎక్కువ మంది పిల్లలు బాధపడే సమస్యల్లో నులిపురుగులు ఒకటి. నులి పురుగులకు చెక్ పెట్టి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నప్పుడే చదువుతో పాటు జీవితంలో రాణిస్తారు. తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించి, శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పాటు అందించాలి. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నేడు (సోమవారం) మందుల పంపిణీకి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. అసలెందుకు వస్తాయి! అపరిశుభ్ర వాతావరణం, మురికి కాల్వలు, నీటి నిల్వ, జంతువుల మలం.. తదితర వాటితో నులి పురుగులు వ్యాప్తి చెందుతాయి. ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల ఈ సమస్య త్వరగా వ్యాప్తి చెందుతుంది. నిల్వ ఉన్న ఆహారంతో పాటు ఉడకని మాంసం, పులిసిన పదార్థాలు తీసుకోవడం వంటివి కూడా కారణమే. తీపి, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, మలబద్దకం ఉన్నా నులిపురుగులు తయారవుతాయి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోకపోవడం, చెప్పులు లేకుండా తిరగడం, పిల్లలు మట్టిలో ఆడుతూ ఆ చేతులను నోట్లో పెట్టుకోవడం కూడా ఈ సమస్యకు కారణమని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. నులిపురుగుల్లో బద్దె, నట్టలు, కొంకి, కొరడా, ఏలిక పాములు, దారపు, నీరుగడ్డ వంటి రకరకాల నులి పురుగుల రకాలు ఉన్నాయి. ఇవి ఎక్కువ శాతం చిన్నారుల పొట్టల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. లక్షణాలు ఇవే.. మలం వెళ్లే మార్గంలో దురద, అజీర్ణం, వాంతులు, విరేచనాలు, పొడి దగ్గు, నీరసం, కాలేయం పెరగడం, ఆడపిల్లల్లో తెల్లబట్ట కావడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన, బరువు తగ్గడం, పోషకాహారలోపం, కడుపు నొప్పి, చదువులో ఏకాగ్రత లేకపోవడం, ఎదుగుదల తగ్గడం, మలంలో రక్తం పడడం, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. జిల్లాలో 73,110 మంది పిల్లలు జిల్లా వ్యాప్తంగా 19 ఏళ్లలోపు పిల్లలు 73,110 ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. అంగన్వాడీ పరిధిలో 17,289 మంది, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 40,241 మంది పిల్లలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 15,580 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేడు(సోమవారం) 482 మంది ఆశ కార్యకర్తలు, 606 మంది అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఏఎన్ఎంలు సంబంధిత పాఠశాలలకు వెళ్లి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 11వ తేదీన గోలీలు వేసుకోలేని పిల్లలకు 18వ తేదీన మాప్ డేను పురస్కరించుకుని వేయనున్నారు.మాత్రలు వాడే విధానం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతనే పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి.అనారోగ్యంతో ఉన్న వారు పూర్తిగా కోలుకున్న తర్వాతనే మాత్రలు వేసుకోవాలి. ఏడాది వయస్సు ఉన్న వారికి, గర్భిణులు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులు, ఉదర సంబంధిత కేన్సర్ ఉన్న వారికి, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ఈ మాత్రలను ఇవ్వకూడదు. 1 నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారులకు సగం గోలి, 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకు ఒక టాబ్లెట్ను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 3 నుంచి 19 ఏళ్ల బాలురు మాత్రం గోలీని నమిలి మింగాలని చెబుతున్నారు. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ నేడు నులిపురుగుల నివారణ దినోత్సవం -
ఎండుతున్న పొలాలు
నీరులేక ఎండుతున్న వరిపొలంవెంకటాపురం(కె) : వానాకాలంలోనూ ఎండలు దంచికొడుతున్నాయి.. పాలెంవాగు ప్రాజెక్టు కింద సాగు చేసిన వరిపొలాలు నెర్రెలుబారి ఎండిపోతోంది. ఇంజిన్ల సాయంతో నీరు పారించేందుకు అన్నదాతలు నానాఅవస్థలు పడుతున్నారు. మండలంలో వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్న ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జూలైలో ఒక్కసారి భారీ వర్షం కురవడంతో అన్నదాతలు ముమ్మరంగా వరినాట్లు వేసుకున్నారు. ముందస్తుగా నాట్లు వేసుకున్న రైతులు సైతం వరుణుడి రాకకోసం ఎదురు చూస్తున్నారు. 20రోజులుగా వాన చినుకు జాడ లేకపోవడంతో వరి పొలాలు నీరులేక నెర్రెలుబారుతున్నాయి. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి వరిసాగు చేసిన అన్నదాతలు వాటిని కాపాడుకునేందుకు వాగులు, వంకల్లో ఇంజిన్ల పెట్టి వాటిసాయంతో నీటిని పారిస్తున్నారు. శిథిలావస్థలో కాల్వలు మండల పరిధిలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వఉన్న చివరి ఆయకట్టుకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. 10,125 ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రస్తుతం 2,000 ఎకరాలకు సాగు నీరు అందించలేక పోతోంది. ప్రాజ్టెకు పరిధిలోని కాల్వలు మరమ్మతుకు గురై శిథిలావస్థకు చేరుకున్నాయి. మల్లాపురం, రాచపల్లి, కర్రవానిగుంపు, ఒంటిమామిడి గ్రామ సమీపంలో ప్రాజెక్టు కాల్వలకు గండ్లు పడడంతో రైతులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రాజెక్టు కాల్వలకు మరమ్మతులు చేసి పూర్తిస్థాయి చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.పొలాల్లో చుక్కనీరు లేదు ఇరవై రోజులుగా వరి పొలానికి నీరు లేక ఎండిపోతుంది. వర్షం లేకపోవడంతో పొలాల్లో చుక్కనీరు లేదు. కిరాయికి ఇంజిన్ పెట్టి నీరు పెడదా మంటే, రోజుకు ఇంజిన్కు రూ.వెయ్యి, డీజిల్ కు మరో రూ.వెయ్యి ఖర్చవుతుంది. ప్రాజెక్టులో నీరు ఉన్న పంట పొలాలకు పూర్తిస్థాయిలో అందడం లేదు. – పోతురాజు, రైతు అప్పు చేసి సాగుచేసిన.. వరి పంట సాగుకు అప్పులు చేసిన. ప్రాజెక్టు ఉన్న పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేదు. మండలంలో 20రోజులుగా వాన చినుకు లేకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటినుంచి వరి పంటకు ఇంజిన్లతో నీరు పెట్టాలంటే కష్టంగా ఉంది. – కృష్ణ, రైతుకరుణించని వరుణుడు నెర్రెలుబారుతున్న పంటపొలాలు చినుకుజాడకు రైతుల ఎదురుచూపు పాలెం ప్రాజెక్టు ఉన్నా నిరుపయోగమే.. -
దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని, దేవాదుల పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనులు పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సందర్శించారు. తుపాలకుగూడేనికి హెలికాప్టర్లో చేరుకున్న మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వా నం పలికారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజీ వద్ద 59 గేట్లను పరిశీలించారు. నీటి నిల్వలు ఏ మేరకు ఉన్నాయని, గేట్లు ఎన్ని ఎత్తి, ఎన్ని మూశారని తెలు సుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయిలో దేవాదుల పంపుహౌస్ వద్ద ఉన్న గోదావరి నీటి నిల్వలను పరిశీలించి మోటార్ల ఎన్ని నడుస్తున్నాయని, ఎంత నీరు ఎత్తిపోశారని ఆరా తీశారు. ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు ప్రొజెక్టర్ ద్వారా మంత్రులకు దేవాదుల స్థితిగతులను వివరించారు. అనంతరం సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఈ హైలీ ప్రాజెక్టును టీడీపీ, బీఆర్ఎస్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అప్పుడు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్కు రూ.23వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే రూ.16 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందన్నారు. కావేరి, గోదావరికి అనుసంధానంగా 200 టీఎంసీల కెపాటీగల ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మంత్రులతో మాట్లాడి ఎన్ఓసీ కూడా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 6 లక్షల ఎకరాలకు సాగు నీరు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగాపెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు దీని అంచనాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 16.38 టీఎంసీల నుంచి 17.38 టీఎంసీలకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.16 కోట్లు దేవాదుల భూ నిర్వాసితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. 72 మీటర్ల నీటిని నిల్వ చేసుకొని మోటార్ల ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి అధికారుల పనితీరులో మార్పు రావాలి భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ పరిశీలనములుగు జిల్లాకు న్యాయం చేయాలి : మంత్రి సీతక్క ములుగు జిల్లాలో వంద కిలోమీటర్ల గోదావరి నీటి ప్రవాహం ఉందని మంత్రి సీతక్క అన్నారు. సమైక్య రాష్ట్రంలో ములుగుకు అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో న్యాయం చేయాలని ఆమె కోరారు. రామచంద్రపురం గ్రావిటీ కెనాల్ ద్వారా పాకాల, కొత్తగూడెం నీటి సరఫరా చేయాలి. పొట్లాపురం కెనాల్ కోసం సంబంధిత ఫైల్ను ప్రభుత్వం వద్ద ఉందని, దానిని పరిశీలించి బడ్జెట్ ఇవ్వాలి. గౌరారం, మల్లూరు, రామప్ప, లక్నవరం ప్రాంతాల్లోకి రైతులకు నీరు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసి పంటలకు నీళ్లివ్వాలని కోరారు. సమీక్షలో ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్పాటిల్, ఇరిగేషన్ ఈఈ జగదీశ్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, అప్సర్పాషా, తదితరులు పాల్గొన్నారు. -
రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ అద్భుతంగా ఉందని జపాన్ దేశానికి చెందిన టోమా సకా కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆమె ఆదివారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించారు. అదేవిధంగా ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సైతం అధికసంఖ్యలో రామప్పకు తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు.హేమాచలుడికి భక్తిశ్రద్ధలతో పూజలు మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల పేరిట పూజారులు గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. ముత్యాలమ్మకు బోనాలు వాజేడు: మండల పరిధిలోని పెద్దగొళ్లగూడెంకు చెందిన మహిళలు ముత్యాలమ్మకు ఆదివారం బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలంతా బోనాలతో గ్రామ సమీపంలో ఉన్న ముత్యాలమ్మ గుడికి ఊరేగింపుగా తరలివెళ్లారు. ముత్యాలమ్మ కొలువై ఉన్న చెట్టుచుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తమ కోర్కెలు నెరవేర్చాలని అమ్మవారికి బోనాలు సమర్పించారు. రైతులను, ప్రజలను చల్లంగా చూడుతల్లీ అంటూ వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. -
సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు
ములుగు రూరల్: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నవీన్మిట్టల్, రెడ్ కో సీఎండీ, ఎన్పీడీసీఎల్ సీఎండి, సింగరేణి కాలరీస్ సీఎండీలతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పాదకతకు నివేదికలు తయారు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా వివరాలకు ఎనర్జీ డిపార్ట్మెంట్కు పంపించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో రూ.6.17లక్షల ఎకరాల్లో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు, కార్యాలయాలు, భవనాల వివరాలను అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. వీసీలో ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క -
పొంచి ఉన్న ప్రమాదం
● రోడ్డు వెంట ఎండిపోయి శిథిలావస్థకు చేరుకున్న భారీ వృక్షాలుగోవిందరావుపేట: నిత్యం పర్యాటకులు, గ్రామస్తుల రాకపోకలతో రద్దీగా ఉండే బుస్సాపూర్– లక్నవరం రోడ్డు పై ఎండిపోయి ఉన్న భారీ వృక్షాలతో ప్రమాదం పొంచి ఉంది. కల్వరి, జాతీయత, రామవరం లాంటి వృక్షాలు పూర్తిగా ఎండిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎండిపోయిన చెట్ల కొమ్మలు రోడ్డు పై పడి ప్రమాదాలు తప్పిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అటవీ శాఖ, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులు ఎండిన చెట్లను తొలగించాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. -
యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించాలి
ములుగు రూరల్: సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ సహయ కార్యదర్శి అతిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం హెల్ప్లైన్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైబల్ యూనివర్సిటీ గత సంవత్సరమే ప్రారంభమైందని తెలిపారు. అయినా ప్రభుత్వం సొంత భవనం నిర్మించకుండా అద్దె భవనంలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. యూనివర్సిటీలో గిరిజనులకు 3 సీట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామెర కిరణ్, రవితేజ, తోకల రవి, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి అతిక్ -
అర్ధనారీశ్వరుడిగా రామలింగేశ్వరస్వామి
వెంకటాపురం(ఎం): శ్రావణమాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామప్ప ఆలయంలోని రామలింగేశ్వరస్వామిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించినట్లు ఆలయ ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీశ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు, పర్యాటకులు రామప్ప ఆలయానికి తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేసినట్లు హరీశ్ శర్మ పేర్కొన్నారు. రేపు విద్యుత్ ఉపకేంద్రం పనులకు శంకుస్థాపన కన్నాయిగూడెం: మండలంలో ఏర్పాటు చేయనున్న 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన పనులకు రేపు(ఆదివారం) రాష్ట్ర మంత్రులు రానున్నట్లు ఎన్పీడీసీఎల్ విద్యుత్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలంలో పర్యటించి తుపాకులగూడెంలో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు కోసం విద్యుత్ అధికారులతో కలిసి రాజు చౌహన్ స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆదివారం మంత్రుల పర్యటన ఉన్నందున కావాల్సిన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ మల్సుర్ నాయక్, ములుగు, ఏటూరునాగారం డీఈ నాగేశ్వర్రావు, కన్నాయిగూడెం ఏఈ స్వామి పాల్గొన్నారు. నిట్తో నోయిడా మిస్టోటెక్స్ టెక్నాలజీ ఎంఓయూ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో నోయిడాకు చెందిన మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత, చలనం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపర్చే ఏఐ ఆధారిత పరిశోధన కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్కుమార్ మెహతా, ప్రొఫెసర్లు వెంకట్రెడ్డి, శంకర్, కె.వి.ఆర్ రవిశంకర్, అర్పణ్ మెహర్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, మిస్టోటెక్స్ సంస్థ తరఫున చేతన్కుమార్, మాజీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు పాల్గొన్నారు. ఓసీ–2ను అడ్డుకుంటాం.. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2లో వ్యవసాయ భూములు కోల్పోయిన ఫక్కీర్గడ్డ, ఆకుదారివాడలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పించాలని భూనిర్వాసితులు బుర్ర మనోజ్, రమేష్, రాజయ్య, రవి కోరారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎనిమిదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాయమాటలతో మభ్యపెడుతుందన్నారు. సింగరేణి సీఎండీ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. క్షుద్రపూజల కలకలం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆర్చిగేట్ దగ్గర ఆదిముక్తీశ్వర స్వామి ఆ లయానికి వెళ్లే రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నల్లకోడి, గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మద్యం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
ముందస్తు రాఖీ వేడుకలు
ములుగు రూరల్ : జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పోలు రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేడి చైతన్య, సరిత, శ్రీవాణి, సునీత, రమేష్, శంకర్, తేజస్వీనిదేవి, హర్ష, సునీల్, పద్మ తదితరులు పాల్గొన్నారు. మల్లంపల్లి బ్రిడ్జి పరిశీలన ములుగు రూరల్: జాతీయ రహదారిపై మల్లంపల్లి వద్ద ఉన్న పాత బ్రిడ్జి కుంగిపోవడంతో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అక్కడికి చేరుకుని పనులను పరిశీలించినట్లు తెలిపారు. వాహనదారులకు, ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్పాషా, చింతనిప్పుల భిక్షపతి, నల్లెల్ల భరత్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవి ములుగు రూరల్: నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఆదివాసీల ఐక్యత చాటుకోవాలన్నారు. ఆదివాసీ ఉద్యోగులు, యువత, మేధావులు హాజరుకావాలన్నారు. ఉదయం 11 గంటలకు డీఎల్ఆర్ ఫంక్షన్హాల్ నుంచి వైద్యారోగ్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం సమావేశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం రవికాంత్, నారాయణ, నాగేశ్వర్రావు, కుమారస్వామి, లక్ష్మీనారాయణ, బాబురావు, కృష్ణ భాస్కర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాల అమలు బీజేపీతోనే సాధ్యం
● పార్టీ జిల్లా కార్యదర్శి నరేష్ ఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి భర్తపురం నరేష్ అన్నారు. మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను శుక్రవారం ప్రజలకు వివరించారు. కరపత్రాల పంపిణీతో పాటు ఇంటింటికీ డోర్ స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామపంచాయతీ ట్రాక్టర్లు, పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులకు రూ.6 వేలు ఖాతాల్లో జమచేయడం వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి మోసం చేస్తుందన్నారు. 42శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు 10శాతం ఇచ్చేందుకు కుట్రపని బీసీలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొర్నెబెల్లి సేనాపతి, పిన్నింటి సంజీవరెడ్డి, అలెం రాకేష్, శ్రీకాంత్, వెంకన్న, సందీప్ పాల్గొన్నారు. -
సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం
భూపాలపల్లి రూరల్: సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం నడుస్తుందని.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గట్టయ్య మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నాయకులు నోరుమెదపడం లేదన్నారు. సంఘాలు కార్మికుల హక్కులను కాపాడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మరోసారి పూజారుల సమావేశం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ అధికారులు, పూజారులు శుక్రవారం మేడారంలో మరోసారి సమావేశమయ్యారు. ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు పూజారులు సమావేశమయ్యారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేసే విషయంపై పూజారుల అభిప్రాయాలను దేవాదాయశాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై పూజారులు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరలకు వివరించిన తర్వాత తుది అభిప్రాయాలను ప్రకటిస్తామని పూజారులు సమావేశంలో తెలిపినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఈ నెల మేడారంలో 21న పొట్ట పండుగ నిర్వహించనున్నట్లు పూజారుల తెలిపారు. సంస్కృతి, సంప్రదాయంగా రెండు రోజుల పాటు పొట్ట పండుగ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పూజారులు సిద్ధబోయిన ముణిందర్, కొక్కర కృష్ణయ్య, చందా బాబురావు, చందా రఘుపతి, సారలమ్మ పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కాక కిరణ్, గోవిందరాజు పూజారి దబ్బగట్ల గోవర్ధన్, పూజారులు పాల్గొన్నారు. -
నేడు రక్షా బంధన్
● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు ● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులుఅక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బంధాలకు విలువనివ్వాలి.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలుబచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతోంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతీ సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. -
కారు.. ఆటో ఢీ
● ఎనిమిది మందికి గాయాలు ఏటూరునాగారం: ఓ కారు అదపుతప్పి కూలీ పనులకు వెళ్తున్న వారి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని ఏటూరునాగారంలో చోటుచేసుకుంది. ఈ క్రమంలో మొత్తంగా 8మంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కొండాయి వద్ద బ్రిడ్జి నిర్మాణం పనుల కోసం అస్సాం నుంచి కూలీలు వచ్చారు. బ్రిడ్జి వద్దకు పనులు చేసేందుకు వెళ్తుండగా హనుమకొండ నుంచి వెంకటాపురం మండలం ఆలుబాక వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను శుక్రవారం మండలం చిన్నబోయినపల్లి ప్రధాన రోడ్డుపై ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న అరుగురు కూలీలకు గాయాలు కాగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 8 మందిని హుటాహుటిన 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఇందులో కారులో ప్రయాణిస్తున్న ఆలుబాకకు చెందిన సాలురి యశ్వంత్కు తీవ్రగాయంకాగా కావడంతో అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్కు రెఫర్ చేశారు. మిగతా ఏడుగురికి గాయాలకు చికిత్సలు పొందారు. -
11న నులిపురుగుల నివారణ దినోత్సవం
ములుగు రూరల్: ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నులిపురుగుల నివారణపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. 11న అంగన్వాడీలు, ఆశ్రమ, గురుకుల, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు. దీంతో విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించడంతో పాటు శారీరక, మానసిక పెరుగుదల ఉంటుందని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు టీంలుగా ఏర్పడి విద్యార్థులకు మాత్రలు అందించాలని సూచించారు. పిలల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాలు ప్రోగ్రాం ఆఫీసర్ రణదీర్, జిల్లా తల్లి ఆరోగ్యము, పోషకాహార ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
అడవుల్లో చెత్త వేయొద్దు
ఏటూరునాగారం: అడవుల్లో చెత్తాచెదారం వేయవద్దని, ప్లాస్టిక్ను నివారించాలని ఏటూరునాగారం ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. గురువారం మండలంలోని చిన్నబోయినపల్లి నుంచి ఏటూరునాగారం వరకు 163 జాతీయ రహదారికి ఇరువైపులా తన సిబ్బందితో కలిసి ప్లాస్టిక్, చెత్తాచెదారం సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తుందన్నారు. అడవులు, నీరు, భూమి, గాలిని కాలుష్యం చేయకుండా నివారించేందుకు మనవంతు సాయంగా ప్లాస్టిక్ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నారాయణ, సెక్షన్ ఆఫీసర్ బాలాజీ, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి చేపట్టాలిభూపాలపల్లి అర్బన్: సింగరేణిలో ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) సత్యనారాయణ కోరారు. భూపాలపల్లి ఏరియాలోని ఇల్లంద్ క్లబ్హౌజ్లో గురువారం 18వ రక్షణ ట్రైపాక్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గని ప్రమాదాల్లో మరణించిన వారికి మౌనం పాటించి, రక్షణ గురించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ భూగర్భ గనులలో వివిధ విభాగాలలో సీనియర్ ఉద్యోగులు కొత్త ఉద్యోగులకు మెళకువలు నేర్పించాలన్నారు. సింగరేణిలో జీరో ప్రమాదాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంఎస్ ఉమేష్, డీఎంఎస్ఎస్ ఆనంద్వెల్, డీడీఎంఎస్ సనత్ కుమార్, ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, రక్షణ జీఎం మధుసూదన్, వివిధ ఏరియాల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.సమస్యలు పరిష్కరించడంలో విఫలం : ఐఎన్టీయూసీభూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కేటీకే 5వ గనిలో జరిగిన నిరసన కార్యక్రమానికి జోగు బుచ్చయ్య మాట్లాడారు. జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్మెన్, ఈపి ఆపరేటర్లకు సర్ఫెస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి 14వ తేదీన ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు రాజు, సంపత్ రావు, రాజేష్ ఠాకూర్, రవి, కిరణ్, అశోక్, అజీమ్, శ్రీనివాస్, నవీన్, కుమార్, రాము, సమ్మయ్య పాల్గొన్నారు.యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలిభూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కమిటీ సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదన్నారు. సమగ్రమైన వివరాలతో పూర్తి సమాచారంతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్, శ్రీకాంత్, దేవేందర్, సుజాత, కవిత, స్వర్ణ, స్వాతి పాల్గొన్నారు.నేడు కాళేశ్వరాలయంలో వరలక్ష్మీవ్రతాలుకాళేశ్వరం: శ్రావణమాసం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం శుక్రవారం సందర్భంగా (నేడు)సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ ఎస్.మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు. -
జ్వరాలపై దృష్టి పెట్టాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం/మంగపేట: జ్వరాలపై వైద్యులు, సిబ్బంది దృష్టిపెట్టాలని ఆరోగ్యశాఖ కీటక జనిత నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఏటూరునాగారం సామాజిక ఆరోగ్య కేంద్రం, బ్లడ్ బ్యాంక్, మంగపేట, చుంచుపల్లి పీహెచ్సీలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమర్సింగ్ మాట్లాడుతూ ఏజెన్సీలో డెంగీ, మలేరియా వచ్చే హైరిస్క్ గ్రామాలు ఉన్నందున విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అలసత్వం ప్రదర్శించకుండా వైద్యసేవలు అందించాలని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్న వారికి డెంగీ, మలేరియా, ఆర్టిటీ, ఎలిషా పరీక్షలు చేయాలని అన్నారు. బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపులకు సంబంధించిన రక్త నిల్వలను ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విఫిన్కుమార్, జిల్లా కీటక జనిత నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్, సైదులు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అడిషనల్ డైరెక్టర్ గఫూర్, టీహబ్ నోడల్ ఆఫీసర్ ప్రవీణ్, ఏఎంఓ దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రసాద్ పాల్గొన్నారు.కీటక జనిత నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ -
నాణ్యమైన విద్య అందించాలి
ములుగు రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర పరిశీలకుడు, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎంఈఓలు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6, 7 తేదీలలో ప్రాథమిక పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విద్యార్థులకు చేరేలా చూడాలని అన్నారు. ఉల్లాస్ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్ అప్పని జయదేవ్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గ్యాదరి రమాదేవి, సాంబయ్య, వయోజన విద్య నోడల్ ఆఫీసర్ వేణుగోపాల్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఉల్లాస్.. నిరక్షరాస్యత ఖల్లాస్!
ఉల్లాస్ ప్రారంభానికి సన్నాహాలు.. స్వయం సహాయక సంఘాల్లోని 15 ఏళ్లపైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఇన్ సొసైటీ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఆగస్టు–సెప్టెంబర్లో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వయోజన విద్య అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. 2025–2026 సంవత్సరానికి ప్రతి జిల్లాలో కొంతమందిని గుర్తించారు.విద్యారణ్యపురి: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేంద్దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉల్లాస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ‘అందరికి చదువు–అందరి బాధ్యత’ అనే నినాదంతో 1,61,613 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేఽశం. అక్షరాస్యత ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్ష్యరాస్యులైన మహిళలకు ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ (ప్రాథమిక అక్షరాస్యత అభ్యసన సామర్థ్యాలు), జీవన నైపుణ్యాలు, అలాగే సమాంతర విద్యను బోధిస్తారు. ఆ తర్వాత అర్హులకు 3, 5 తరగతులు, ఆపైన ఇప్పటికే చదువుకున్న వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్లో ప్రవేశాలు కల్పించేలా ప్రోత్సహిస్తారు. అవసరమైన వారికి వృత్తివిద్య, నిరంతర విద్యను అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను ఇటీవల అధికారులు గుర్తించారు. వీరిని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా వయోజన విద్య అధికారులు ముందుకు సాగుతున్నారు. వారిని ఉల్లాస్ యాప్లో నమోదు చేస్తారు. మిగిలిపోయిన నిరక్షరాస్యులు ఉంటే 2026–2027 వరకు వంద శాతం అక్షరాస్యులుగా తీర్దిదిద్దాలనేది ఉల్లాస్ కార్యకమ లక్ష్యంగా ఉంది. టీచర్లకు శిక్షణ ఉల్లాస్ కార్యక్రమం అమలులో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ముగ్గురు రెగ్యులర్ టీచర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 18 మంది టీచర్లు శిక్షణ పొందారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశానుసారం గురువారం భూపాలపల్లి జిల్లాతోపాటు వరంగల్ రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు అధికారి రమేశ్రెడ్డి, హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి ఉపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన మూడు జిల్లాల్లో వెసులుబాటును బట్టి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 12న మండల స్థాయిలో ఒక టీచర్, అలాగే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19న గ్రామస్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లకు శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. సామాజిక చైతన్య కేంద్రాల ఏర్పాటు నిర్లక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి 8 లేదా 10 మందికి ఒక వలంటీర్ విద్యాబోధన చేస్తారు. అంతేకాకుండా టీవీ చానల్స్, ఉల్లాస్ యాప్, ఎస్సీఆర్టీఈ రూపొందించిన దీక్ష పోర్టల్ ద్వారా వయోజనులకు బోధన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బోధనకు ముందుకు వచ్చే వలంటీర్తో బోధన చేయిస్తారు. ఇందుకోసం వలంటీర్ టీచర్లను కూడా ఎంపిక చేశారు. వలంటీర్లతో విద్యాబోధన మహిళా స్వయం సహాయక సంఘాలల్లోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించాం. ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లు వయోజనులకు బోధన చేస్తారు. ఒక్కో మహిళకు అక్షర వికాసం వాచకం అందజేస్తారు. అవి ఇప్పటికే జిల్లాలకు కొన్ని చేరుకున్నాయి. ప్రతీ ఏడాది మార్చి– సెప్టెంబర్ నెలలో జరిగే ఎన్ఐఓఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పరీక్ష నిర్వహిస్తాం. – టి.రమేశ్రెడ్డి, వయోజన విద్య ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్నిరక్షరాస్యులైన మహిళల వివరాలు..హనుమకొండ 28,904 వరంగల్ 29,739. ములుగు 7,581 జనగామ 24,137 భూపాలపల్లి 29,484నిరక్ష్యరాస్యులైన అతివలను అక్షరాస్యతవైపు స్వయం సహాయక సభ్యులందరికీ చదువు జిల్లాల్లో టీచర్లకు శిక్షణ కూడా షురూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,61,613మంది నిరక్ష్యరాస్యుల గుర్తింపు -
నిఘానీడలో..
ఏటూరునాగారం: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. నేరాలను నియంత్రించేందుకు మండల కేంద్రాలతోపాటు మారుమూల గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, మండల ప్రధాన రోడ్లు, కూడళ్లు, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తూ నేరగాళ్ల ఆటను కట్టిస్తున్నారు ములుగు జిల్లా పోలీసులు. విద్యుత్ సరఫరా, ఓఎఫ్సీ, సోలార్ కనెక్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉన్న లేకున్నా నిరంతరం నడిచే విధంగా కావాల్సిన బ్యాటరీ బ్యాకప్, మెమరిలను అమర్చి రికార్డు అయ్యేలా చూస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 380 కెమెరాలను పోలీస్స్టేషన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు.సీసీ కెమెరాలతో పోలీసులు ఛేదించిన కేసులు..● ములుగు మండలం దేవగిరిపట్నానికి చెందిన వ్యక్తిని ఓ ప్రేమ్నగర్ సమీపంలో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ కేసులో బండారుపల్లి క్రాస్రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను గుర్తించి ఆ వాహనాల డ్రైవర్లను పిలిచి విచారణ చేపట్టారు. ప్రమాదం చేసిన డ్రైవర్ నేరాన్ని అంగీకరించాడు.● గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని ఆంజనేయస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయ పరిధిలో ఇటీవల చోరీ జరిగింది. పస్రా పోలీసులు ఆలయాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఒక టీం ఏర్పడి ఆ నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు.● ఏటూరునాగారం సాయిబాబా దేవాలయంలో ఇటీవల చోరీ జరిగింది. సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దొంగలను ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.సీసీ కెమెరాల పనితీరు ఇలా..బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలను చూసి రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై వాహన చట్టం ద్వారా కేసులు నమోదు చేస్తున్నారు. హైస్పీడ్ డ్రైవింగ్ను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టారు. అలాగే, రామప్ప, మల్లూరు, లక్నవరం, బొగత, తుపాకులగూడెం బ్యారేజ్ దేవాదుల, మేడారం సమ్మక్క–సారలమ్మ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెద్ద మాల్స్, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గోవులు, ఇసుక అక్రమ రవాణా, వేబ్రిడ్జి వద్ద తూకంలో తేడాలను సైతం గుర్తించేలా కెమెరాలు ఏర్పాటు చేశారు.మత్తుపదార్థాల నియంత్రణ..రాత్రి వేళ మత్తుపదార్థాలు రవాణా జరుగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. మహిళలపై జరిగే నేరాలు, కళాశాలలు, బస్టాప్ల వద్ద ఆకతాయిల వెకిలి చేష్టలను నియంత్రిస్తున్నారు. నిందితులకు తగిన పద్ధతిలో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. గంజాయి, కొకై న్, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న కొన్ని బేకరీలను గుర్తించి కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి.మూడో కన్నుతో పర్యవేక్షణఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రధాన రోడ్ల వెంట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మూడో కన్నులాగా పర్యవేక్షణ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లే విధంగా సీసీ కెమెరాలను అనుసంధానం చేశాం. నిరంతరం పనిచేసేందుకు సోలార్ కెమెరాలను కూడా అమర్చాం. ఎలాంటి సంఘటనలు అయినా వెంటనే పసిగట్టేలా ఏర్పాట్లు చేశాం. ప్రజల రక్షణే మాకు ధ్యేయంగా పనిచేస్తాం.– శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ ఏటూరునాగారంనేరం చేస్తే తప్పించుకోలేరుములుగు జిల్లా మొదలు కొని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దు వరకు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నేరం చేస్తే తప్పించుకునే అవకాశం లేదు. ఒక ప్రదేశం కాకుండా మరో ప్రదేశంలోనైనా సీసీ కెమెరాలకు చిక్కాల్సిందే. నక్సల్స్ ప్రాంతం కావడంతో మరింత కట్టుదిట్టంగా పక్కా ప్రణాళికతో కెమెరాలను ఏర్పాటు చేయించాం. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాలు అయినా వెంటనే పసిగట్టి నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం జరుగుతుంది. – శబరీష్, ఎస్పీమండలాల వారీగా ఏర్పాటు చేసిన కెమెరాలుమండలాలు; కెమెరాలుఏటూరునాగారం; 42మంగపేట; 54తాడ్వాయి; 39కన్నాయిగూడెం; 31వాజేడు; 32వెంకటాపురం(కె); 38గోవిందరావుపేట; 39వెంకటాపురం(ఎం); 40ములుగు; 65మొత్తం; 380 -
పోచమ్మ బోనాలు
గోవిందరావుపేట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం పోచమ్మ తల్లికి బోనాలతో తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నుంచే బోనం తయారుచేసుకున్న మహిళలు ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి నైవేధ్యాన్ని సమర్పించారు. భక్తులంతా పోచమ్మ తల్లిని వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని మొక్కుకున్నారు.ప్రతిఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలికన్నాయిగూడెం: గ్రామంలోని ప్రతిఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని ఆర్బీఐ డీజీఎం జగదీశ్ అన్నారు. మండల కేంద్రంలో ఎస్ఎస్తాడ్వాయి సీఎఫ్ఎల్ ఆధ్వర్యంలో పీఎంజేజేబీవై పథకంపై బుధవారం క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. 18 నుంచి 70 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండడంతో పాటుగా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన కింద సంవత్సరానికి రూ.20 కట్టుకోవాలన్నారు. 50ఏళ్ల లోపు వారు రూ.436 బ్యాంకు ఖాతాల్లో కట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఏపీఎం రెడ్డి, సీసీ సుదీష్ణ, టీజీఐపీపిల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.కేజీబీవీని తనిఖీ చేసిన డీఈఓములుగు రూరల్: ములుగు పరిధిలోని మాధవరావుపల్లి కేజీబీవీని డీఈఓ చంద్రకళ బుధవారం తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న భోజనం, మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి, విద్యార్థులకు బోధించడంతో పాటు పాఠ్యాంశాలపై వారికి ఉన్న మేధాశక్తిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ జీవనప్రియ, ఉపాధ్యాయులు ఉన్నారు.ముస్లిం రిజర్వేషన్ల అమలుకు కుట్రములుగు రూరల్: కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు సైతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద కుట్ర పూరితంగా ధర్నా చేపట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆరోపించారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 10 శాతం ముస్లింలకు కేటాయించాలని ప్రయత్నం చేస్తుందన్నారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, సురేందర్, స్వరూప, జవహర్ లాల్, రవీంద్రాచారి, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
వెంకటాపురం(ఎం): ఆయిల్పామ్ తోటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సంజీవరావు అన్నారు. మండల కేంద్రంలో కేఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ బుధవారం నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన నరెడ్ల శ్రీనివాస్ వ్యవసాయ భూమిలో ఐదెకరాల విస్తీర్ణంలో ప్లాంటేషన్ ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుకు రైతులు ఎకరానికి రూ.1140 లు చెల్లిస్తు రైతులకు 57 మొక్కలు అందిస్తామన్నారు. నాలుగేళ్ల వరకు ఎకరానికి రూ.4,200 చొప్పున అంతర పంటల సాగుకు ఇస్తారని తెలిపారు. జిల్లాలో 2022–23లో 820 ఎకరాలు, 2023–24లో 834 ఎకరాలు, 2024–25లో 909 ఎకరాల్లో ఆయిల్పామ్ పంటలు సాగు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 343 ఎకరాల్లో అయిల్పామ్ సాగు అయినట్లు వెల్లడించారు. నాలుగవ సంవత్సరంలో మొదటి కోత 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. 7వ సంవత్సరం నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు. ఎరువుల వాడకం, నీటి యాజమాన్య పద్ధతులను రైతులు అవలంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారి శ్రీకాంత్, ఉద్యాన విస్తీర్ణ అధికారి రమేష్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సంజీవరావు -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ములుగు రూరల్: విధి నిర్వహణలో వైద్యాధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట ఆస్పత్రుల వైద్యాధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ ల్యాబ్లు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు రక్త పరీక్షలకు అవసరమయ్యే పరీక్ష సామగ్రి వర్షాకాలమంతా సరిపడేలా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న ప్రతీ వ్యక్తికి డెంగీ, మలేరియా పరీక్షలు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ శాఖ అధికారుల సమన్వయంతో పరిసరాల పరిశుభ్రత చేయించాలని వెల్లడించారు. దోమల నివారణకు యాంటీ లార్వా స్పెయింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత జిల్లా పోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, మధు, నిఖిల్, నాగన్వేష్, దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బొడ్డు ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
ఈఓ కార్యాలయంపై పట్టింపేది?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. అనుగుణంగా వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఐటీడీఏ కార్యాలయం మాత్రమే నిర్మించారు. ప్రస్తుతం రెవెన్యూ, అతిథిగృహం, పీఆర్ గెస్ట్హౌస్, పూజారుల భవనం నిర్మించారు.. ఇలా అన్ని వసతులు ఉన్నా ఈఓ కార్యాలయ భవన నిర్మాణం గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్లు గడస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏడాది పొడువునా భక్తులే.. మేడారంలో రెండేళ్లకోసారి ఏడాది మధ్యలో జరిగే చిన్న జాతర సమయంలోనూ కోటి మందికిపైగా భక్తులు హాజరవుతున్నారని అధికారుల అంచనా. మహాజాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా మేడారానికి భక్తులు తరలిస్తున్నారు. బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సుమారుగా ఐదు వేల మందికిపైగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కానుకల ద్వారా అదాయం వస్తున్నా దేవాదాయశాఖ అధికారులకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో కనీసం భక్తులకు తాగునీటి వసతి కూడా కల్పించకపోవడం గమనార్హం. మీడియా పాయింటే.. ఈఓ కార్యాలయం మేడారంలో మీడియా పాయింట్ మంచె ఈఓ కార్యాలయంగా మారింది. ప్రస్తుతం ఉన్న జాలి గదిని సైతం గత జాతరలో కూల్చివేశారు. ఆరు జాతరలకు రెగ్యులర్ ఈఓలను నియమించకుండా ఇన్చార్జ్లను నియమించడంతోనే ఆలయ అభివృద్ధి వెనుకబాటుకు కారణమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.మేడారంలో భవన నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని సర్కారు హనుమకొండలోని ధార్మిక భవనంలోనే మేడారం ఈఓ కార్యాలయం హనుమకొండలోని ధార్మిక భవనంలోనే.. భక్తుల సౌకర్యాలపై ధర్మాదాయ దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మేడారంలో ఈఓ కార్యాలయం నిర్మాణంపై ఏళ్లు గడుస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతర 2006లో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. స్వరాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఈఓ కార్యాలయం మాత్రం నిర్మాణానికి నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. హనుమకొండలో నిర్మించి న ధార్మిక భవనంలోనే మేడారం ఈఓ కార్యాల యం కొనసాగుతోంది. అక్కడి నుంచే జాతర నిర్వహణ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. జాతర పనుల నిమిత్తం మాత్రమే దేవాదాయశాఖ అధికా రులు మేడారానికి వస్తున్నారే తప్పా మిగితా రోజు లన్నీ కార్యాలయానికే పరిమిత మమవుతున్నారు. ఈఓ కార్యాలయం నిర్మించాలి.. మేడారంలో ఈఓ కార్యాలయం నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. మహాజాతర సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా మేడారానికి భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. ఎండోమెంట్ కార్యాలయం నిర్మించడం వల్ల భక్తులకు దేవాదాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సారి మహాజాతర నాటికి మేడారంలో ఈఓ కార్యాలయం ఏర్పాటు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సిద్ధబోయిన స్వామి, సమ్మక్క పూజారి -
జయశంకర్ సేవలు మరువలేనివి
ములుగు రూరల్: తెలంగాణరాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వరాష్ట్ర ఏర్పాటుకు చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. కలెక్టరేట్లో బుధవారం జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జయశంకర్ సార్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొని ఉద్యమానికి మార్గదర్శకుడిగా నిలిచారని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్, డీపీఆర్వో రఫిక్, కలక్టరేట్ ఏఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జెడ్పీ కార్యాలయంలో జయశంకర్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంపత్రావు సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అర్హులందరికీ పింఛన్లు ప్రతినెలా అర్హులందరికీ పింఛన్లు అందేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం అమలుపై ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్, పంచాయతీ కార్యదర్శులకు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పింఛన్ అర్హత ఉన్న వారికి ప్రతినెలా అందేలా కృషి చేయాలన్నారు. అనర్హులను గుర్తించి తొలగించాలని సూచించారు. ముఖచిత్రం ద్వారా పింఛన్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. టీజీ సెర్ప్ పెన్షన్ డైరెక్టర్ గోపాల్రావు, అదనపు కలెక్టర్ సంపత్రావు చేయూత పెన్షన్పై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవ్రాజ్, అదనపు డీఆర్డీఓ గొట్టె శ్రీనివాస్, ములుగు మున్సిపల్ కమిషనర్ సంపత్, టీజీ ఆన్లైన్ ప్రతినిధి రాజు అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును గమనించారు. ప్రతీ విద్యార్థి లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఉపాధ్యాయులకు, నిర్వాహకులను ఆదేశించారు. భోజనం మంచిగా ఉంటుందా లేదా అని విద్యార్థులను కలెక్టర్ ప్రశ్నించగా బాగానే ఉంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ కమిటీ చాలా కీలక పాత్ర పోషించాలని, తప్పనిసరిగా కమిటీ సభ్యులు భోజనం తిని మంచిగా ఉందని నిర్ధారణ చేసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని సూచించారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీలక్ష్మి, గార్ల -
స్టోన్ క్రషర్లపై ‘మైనింగ్’ కత్తి
అక్రమాలకు ఇక అడ్డుకట్ట.. ఉమ్మడి వరంగల్లో సుమారు 360కి పైగా కంకర క్రషర్లు, 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 29 బ్లాక్, 33 కలర్ గ్రానైట్, 64 స్టోన్ మెటల్, క్వార్ట్జ్, గ్రావెల్ క్వారీలు రెండు కలిపి 128 ఉన్నాయి. ఇందులో సగం వరకు రాజకీయ నాయకులు, వారి అనుచరులవే ఉన్నాయి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తున్నా, అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాడ్ చేసినా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.ఐదు లక్షల జరిమానా విధించే చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. కొన్నేళ్లుగా రూ.కోట్ల విలువ చేసే రాతి ఖనిజం కంకర, గ్రానైట్ రూపేణా దోపిడీకి గురైంది. తవ్వి తరలించిన దానికి.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టే సమయంలో చూపించే లెక్కలకు పొంతన లేకపోగా.. 30 నుంచి 50 శాతం వరకే చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లీజు పరిమితి తీరినా.. ఇంకా గ్రానైట్, కంకర క్వారీలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్స్టిక్స్ను సరైన భద్రతా చర్యలు లేకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై సమీక్షలు చేసిన గనులశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్వారీల వారీగా లీజు అగ్రిమెంట్లు పరిశీలిస్తూ లీజు, రాయల్టీ బకాయిల లెక్కలు తీస్తోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్ల అక్రమ దందాను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని రూ.లక్షల్లో కాజేస్తున్న నిర్వాహకులపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలు, రోడ్, స్టోన్ మెటల్ (కంకర) క్రషర్ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు గనులశాఖ దృష్టి సారించింది. ఇందుకు ప్రభుత్వ భూముల్లో గుట్టలు, మైనింగ్కు అనువైన స్థలాలను గుర్తించి టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొదట ఏడు క్వారీలు.. ప్రభుత్వ స్థలాలు, గుట్టలను గుర్తించి గ్రానైట్, కంకర క్వారీలను టెండర్ల ద్వారా కేటాయించేందుకు శ్రీకారం చుట్టిన గనులశాఖ.. మొదట ఉమ్మడి జిల్లాలో ఏడు క్వారీల టెండర్లు ఈ నెల 12 ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఊరుగొండలో రెండు స్టోన్ మెటల్, రెండు కలర్ గ్రానైట్ క్వారీలు, ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఈ టెండర్లలో ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో కంకర క్వారీ, జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఒకటి, జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో ఒకటి చొప్పున రెండు క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. కాగా, గనుల శాఖ నోటిఫికేషన్ మేరకు జూలై 17న డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 6 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూముల్లో క్రషర్లు నడుపుతూ రాయల్టీ, లీజు డబ్బులు చెల్లించని 22 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, కంకర, గ్రానైట్ కోసం తీసిన రాయికి రాయల్టీ కట్టని వారు.. గనులశాఖకు సూచించిన క్యూబిక్ మీటర్లను మించి రాయి తీసి తనిఖీల్లో దొరికి పెనాల్టీ చెల్లించని వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 10–15 రోజుల్లో సదరు నిర్వాహకులు స్పందించకుంటే ఆ లీజులు సైతం రద్దు చేసి టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు.రాయల్టీ, లీజు తదితర బకాయిదారులపై దృష్టి లీజు రద్దు చేసి టెండర్ల ద్వారా కేటాయించే యోచన ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏడు గ్రానైట్ క్వారీలు, క్రషర్లు ముగిసిన టెండర్ల ప్రక్రియ.. త్వరలో అర్హులకు కేటాయింపు -
గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు
సాక్షి, మహబూబాబాద్ : గిరిజన(లంబాడ) కన్నెపిల్లలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. ఈ నెలలో పండుగను ప్రతీ గురువారం ఏదో ఒక తండాలో జరుపుకుంటారు. నేడు (గురువారం) ఉమ్మడిజిల్లాలోని పలు తండాలు తీజ్ పండుగకు ముస్తాబయ్యాయి. ప్రకృతి సిద్ధంగా శ్రావణంలో వర్షాలు కురవడంతో ఆకాశం నుంచి కిందికి వచ్చే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అంటారు. ఆ అందమైన పురుగులు దేవుడు మనకోసం కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు కన్నె పిల్లలు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. మా తాండేరో జోత్ తీజ్ (తండాల్లో వెలుగు తీజ్) అంటూ పండుగకు సిద్ధమయ్యారు. ● ఏడో రోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో(రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి నేవైద్యం పెడతారు.● ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటిని గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేస్తారు. ● తొమ్మిదో రోజున డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను ఇచ్చి ఆశీర్వాదం అందిస్తారు.● లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు.● తీజ్ (గోధు మ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు(ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగ లతో బుట్టలు అల్లుతారు.● పెండ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సి న పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలుపెడతారు.సంప్రదాయ పాటలు● లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. తీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలిస్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీనిని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత.మొదటి రోజు : లాంబి లాంబియే లాంబడీ ఏకెరీయో... తోన కుణ బొరాయో తీజ్.. సేవాభాయ బొరాయో తీజ్.. (గునుగుపూల వలె ఎదుగుతవమ్మా.. నిను కొలిచే వారెవరమ్మా.. సేవాలాల్ మహరాజ్ అలికి కొలుస్తారమ్మా తీజ్..) అని పాడుతూ తొలిరోజు వేడుకలు జరుపుకుంటారు.చివరి రోజు : తూ కతేతి ఆయోరే దుదియా తళవో.. మారో తీజేరో జోత్ లేయి చాలో.. డగేరేచాలో.. (ఎక్కడినుంచి వచ్చావో దుదియా చెరువు.. తొమ్మిది రోజులు పెంచుకున్న తీజ్ తండా వెలుగును తీసుకుని వెళ్తున్నావు) అంటూ పెళ్లికాని అమ్మాయిలు పాటలు పాడుతూ తీజ్ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. -
డుమ్మాలకు చెక్ పడేనా!
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమలు– 10లోu337 స్కూళ్లలో 16,883 మంది విద్యార్థులు జిల్లాలోని 9 మండలాల పరిధిలో 337 పాఠశాలల్లో 16,883 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 1,557 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఇప్పటివరకు 1,510 మంది ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలులోకి వచ్చింది. సాంకేతిక సమస్యలతో మిగిలిన ఉపాధ్యాయులు ఇంకా ఎఫ్ఆర్ఎస్ పరిధిలోకి రాలేదు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే ఉదయం 9.15 గంటలకు ఒకసారి, సాయంత్రం 4.15 గంటలకు ఒకసారి యాప్లో వారి హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ ద్వారానే విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పక్కాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు గతేడాది నుంచి ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తుండగా ఉపాధ్యాయులకు ఈ నెల 1నుంచి అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్) యాప్ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్ఎంలు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల హాజరు అమలులోకి వచ్చింది. హెచ్ఎంలు తమ సెల్ఫోన్లోని డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లో టీచింగ్ మాడ్యుల్ టీచర్స్, నాన్ టీచింగ్ సిబ్బందిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సెల్ఫోన్లో సంబంధిత యాప్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ను వేయాల్సి ఉంటుంది. పాఠశాల ఆవరణలో ఉండి హాజరువేసేలా జియోట్యాగింగ్ చేశారు. సెలవు పెడితే తప్పనిసరిగా యాప్లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సెలవును మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన సమయానుగుణంగానే ఈ యాప్లో ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాలి.● జిల్లా వ్యాప్తంగా 337 పాఠశాలల్లో 16,883 మంది విద్యార్థులు ● గతేడాది నుంచే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ ● ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలువెంకటాపురం(ఎం): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గతేడాది నుంచి విద్యార్థుల హాజరును ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టగా తాజాగా టీచర్లకు సైతం ఆన్లైన్ విధానం ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషియన్ సిస్టమ్)ను ప్రవేశ పెట్టింది. దీని ద్వారా సమయానికి పాఠశాలకు ఉపాధ్యాయులు రావడంతో పాటు సమయం ముగిసే వరకు పాఠశాలలోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.● -
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ఏటూరునాగారం: విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలిసి మంగళవారం సందర్శించారు. వంటశాల, భోజనం నాణ్యత, స్టోర్ రూము, కూరగాయల నిల్వలు, హాజరు పట్టికపై విద్యార్థులు రాసిన ఫీడ్ బ్యాక్, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. ఉదయం చేసిన టిఫిన్ బాగుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో కలిసి వెళ్లి వైటీసీలో ఉన్న 25మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం పరికరాలను పరిశీలించారు. వాటి పనితీరును ఎన్డీఆర్ఎఫ్లు సీఎస్కు వివరించారు. ఆపదలో ఉన్న సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, మండల ప్రత్యేకాధికారి రాంపతి, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ -
కలెక్టర్ ఆకస్మిక పర్యటన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలో కలెక్టర్ దివాకర మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావాణిలో తమకు ఇంటిస్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేయాలని మండల కేంద్రానికి చెందిన వెంకటలక్ష్మి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. సాధ్యాసాధ్యాల మేరకు స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నూగూరు(జి)లో చేపట్టిన డ్రోన్ సర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను రెవెన్యూ అధికారులను ఆడిగి తెలుసు కున్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. అరవింద్కుమార్ను కలిసిన కలెక్టర్ దివాకర ములుగు రూరల్: జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను మంగళవారం కలెక్టర్ దివాకర మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. మాన్సూన్ అప్రమత్తత చర్యల నేపథ్యంలో జిల్లా పరిధిలో చేపడుతున్న విధానాలను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కోటకాల్వ పూడికతీత పనులు చేపట్టాలి గోవిందరావుపేట: లక్నవరం చెరువు పరిధిలోని కోటకాల్వ పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ఆదిరెడ్డి అన్నారు. తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కోట కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ కోటకాల్వ మొత్తం గడ్డి, చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. దీంతో రైతుల పొలాలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని వివరించారు. కోటకాల్వ కింద సుమారు 2500 ఎకరాలు కాస్తులో ఉందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కాల్వలోని పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే పూడికతీత పనులను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం జిల్లా నాయకులు సోమ మల్లారెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, ఆదిరెడ్డి, ధర్మారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ఏటూరునాగారం: సీజనల్ వ్యాధులైన చికెన్గున్యా, డెంగీ జ్వరాలపై వైద్యులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో ఆయన సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజనల్లో చికెన్ గున్యా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. జ్వరాల బారిన పడిన రోగులు వెంటనే వైద్యులు, సిబ్బందిని సంప్రదించే విధంగా రోగులను చైతన్య పర్చాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎంసీహెచ్ టీమ్ డాక్టర్లు, ఎపిడమిక్ టీమ్ వైద్యులతో గ్రామాల్లో, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించాలన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. జ్వర బాధితులందరికీ రక్త పరీక్షలు చేసి సంబంధిత పీహెచ్సీలకు సమాచారం అందించాలన్నారు. రోజువారి రిపోర్టును జిల్లా కార్యాలయానికి పంపించాలని ల్యాబ్ టెక్నీషియన్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి చంద్రకాంత్, వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రాం అధికారి రణధీర్, వైద్యులు సుమలత, యమునా, అఖిల, గౌతం పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
పాలెంవాగు దాటుతూ ట్రాక్టర్ పల్టీ
వెంకటాపురం(కె): మండల పరిధిలోని పాత్రాపురం గ్రామ సమీపంలోని పాలెంవాగు దాటుతుండగా ట్రాక్టర్ పల్టీకొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాత్రాపురం గ్రామ సమీపంలోని గోదావరి లంకల్లో పాలెం, పాత్రాపురం, వీరభద్రవరం గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయం చేపట్టారు. ఈ క్రమంలో వీరభద్రవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ గోదావరి లంకలో దుక్కిదున్నే పనుల నిమిత్తం వెళ్లేందుకు పాలెంవాగు దాటుతుండగా వాగు ఉధృతికి ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు పైన కూర్చొని ఉన్న మరో ఇద్దరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
ఫాస్టాగ్ పేరుతో అక్రమ వసూళ్లు
గోవిందరావుపేట: అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ఫాస్టాగ్ పేరుతో వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్ప డుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పొదిళ్ల చిట్టిబాటు అన్నారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ చెక్పోస్ట్ ఎత్తివేయాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజూ జాతీయ రహదారిపై నడుస్తున్న వాహనాల నుంచి ఫారెస్ట్ అధికారులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం టూరిస్ట్ కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి బొగత, మల్లూరులోని హేమాచలక్షేత్రం, మేడారం జాతరకు పర్యాటకులు వస్తుంటారని వివరించారు. ఇదే అదునుగా భావించిన ఫారెస్ట్ అధికారులు దురాశతో అక్రమంగా చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ఒక్కో వాహనానికి రూ.100 నుంచి 200వరకు వసూలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా పస్రా, ఏటూరునాగారం లో ఉన్న రెండు చెక్పోస్ట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోమ మల్లారెడ్డి, కొప్పుల రఘుపతి, తీగల ఆదిరెడ్డి, రత్నం ప్రవీణ్, నరేష్, రవీందర్, నాగరాజు, అరుణ్, కవిత, ఉదయ్, జానీ, శ్రావణ్, ప్రదీప్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చిట్టిబాబు -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ములుగు రూరల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు సమస్యలపై చేస్తున్న ధర్నాకు ఆమె మంగళవారం మద్దతు ప్రకటించి మాట్లాడారు. జీవో నంబర్ 25ను సవరించాలన్నారు, ప్రతీ పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలన్నారు. సబ్జెక్టు వర్కులోడ్కు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకులమర్రి లక్ష్మణ్బాబు, గోవిందనాయక్, రమేష్ రెడ్డి, చంద్రమౌళి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఓర్వలేకనే కాళేశ్వరంపై కుట్రలు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో నిర్మించారని ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి హరీశ్రావు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వివరించిన పవర్పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని వీక్షించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచా రాన్ని తిప్పికొట్టాలన్నారు. కాళేశ్వరం కూలిందని అబద్ధపు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోరిక గోవింద్నాయక్, తాటి కృష్ణ, భిక్షపతి, రమేష్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతి -
పౌష్టికాహారం అందించాలి
● జిల్లా సంక్షేమాధికారి తుల రవి ములుగు రూరల్: బాలసదనంలో ఆశ్రయం పొందిన బాలికలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలసదనంలోని బాలలకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు కల్పించాలని సూచించారు. బాలల నెలవారీ పరిశీలన పత్రాలను తప్పకుండా తయారు చేసుకోవాలన్నారు. అనంతరం బాలికలతో బాలసదనంలో అందుతున్న సౌకర్యాలు, భోజనం వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. బాలల ఎత్తు, బరువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శిరీష, సూపర్వైజర్ కావ్య, డీసీపీఓ ఓంకార్, ఐటీ కోఆర్డినేటర్ మహేశ్, సూపరింటెండెంట్ శ్యామల, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్య పాల్గొన్నారు. -
భక్తులు వర్సెస్ సిబ్బంది
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కొంతమంది భక్తులు, ఆలయ సిబ్బంది మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. గొడవకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రసీదు ఇవ్వాలిందే.. హైదరాబాద్(మెదక్)కు చెందిన భక్తులు సోమవారం సాయంత్రం లక్ష్మీనర్సిహస్వామిని దర్శించుకునేందుకు హేమాచలక్షేత్రానికి కారులో వచ్చారు. ఆలయానికి వచ్చిన వారి కారును మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆపి తాము ఆలయ సిబ్బందిమని కారు పార్కింగ్ రుసుము డబ్బులు ఇవ్వమని అడిగారు. రసీదు ఇస్తే తాము చెల్లిస్తామని చెప్పడంతో రసీదు ఇవ్వమని డబ్బులిస్తేనే కారును వెళ్లనిస్తామని దురుసుగా వ్యవహరించారు.. ఎదురు ప్రశ్నించిన తమపై దుర్బాషలాడి దాడి చేశారని తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహించారని ఆరోపించారు. ఈ క్రమంలో సిబ్బందికి, భక్తులకు మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకోవడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అర్చకులు గుట్టపైకి చేరుకుని భక్తులకు, సిబ్బందికి సర్ధిచెప్పి గొడవను నివారించి భక్తులను అక్కడి నుంచి పంపించారు. విచారణ జరిపి చర్య తీసుకుంటాం.. గుట్టపై సిబ్బంది, భక్తుల మధ్య జరిగిన గొడవ విషయం తెలిసిందే. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్చలు జరుగకుండా శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రావణం సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణ అధికారిహేమాచల క్షేత్రంలో మద్యంమత్తులో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలుభక్తులే దుర్భాషలాడారు.. గుట్టపైకి వచ్చి భక్తుల కారుకు సంబంధించిన పార్కింగ్ రుసుము అడిగితే రసీదు అడిగారని.. రసీదు బుక్కు తెప్పిస్తుండగానే ఎందుకు ఇవ్వాలంటూ మద్యం తాగి ఉన్న భక్తులే తమపై దుర్భాషలాడి దాడి చేశారని సిబ్బంది అజయ్ తెలిపారు. భక్తులు చేసిన ఆరోపణలు అవాస్తవమని వివరించారు. ఈ గొడవకు సంబంధించిన ఫొటోలు సో షల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టా రని వివరించారు. గొడవకు సంబంధించిన ఫొటోలు, సిబ్బందికి చెందిన వాహనం అంటు అందులో మద్యం, వాటర్ బాటిళ్లు ఉన్న ఫొటోలను సైతం పెట్టడంతో విషయం చర్చనీయాంశంగా మారింది. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలి
వెంకటాపురం(ఎం): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ బీజేపీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ఆరు గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. అధికారం కోసం మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్నాయని వివరించారు. కేవలం బీజేపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న గరీబ్ కల్యాణ్ యోజన, ఉజ్వల్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, కారుపోతుల యాదగిరి, కొత్త సురేందర్, భూక్య జవహర్లాల్, కృష్ణాకర్రావు, రవీంద్రాచారి, రవీందర్రెడ్డి, రమేష్, ఇమ్మడి రాకేష్, మల్లేష్, తిరుపతిరెడ్డి, విశ్వనాథ్, రెడ్డి శ్రీనివాస్, గంగుల రాజ్కుమార్ పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి -
సత్వరమే పరిష్కరించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణి, గిరిజన దర్బార్లో బాధితులు అందజేసిన దరఖా స్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో 65, గిరిజన దర్బార్లో 26 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. గిరిజనదర్బార్లో వచ్చిన వినతులు భూపాలపల్లి జిల్లా గుర్రంపేట గ్రామం నుంచి ములుగు జీసీసీలో గోదాం అసిస్టెంట్, డ్రైవర్గా విధులు నిర్వహిస్తుండగా నాలుగేళ్లుగా విధులు సక్రమంగా నిర్వహించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చి విధుల నుంచి తొలగించారని తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పీఓ చిత్రామిశ్రాకు గిరిజన దర్బార్లో విన్నవించారు. అలాగే కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామం నుంచి సీఆర్టీ ఉద్యోగం కోసం, మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ నుంచి కాంట్రాక్ట్ అటెండర్ను ఏటూరునాగారం, వాజేడు గురుకులాలకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం వీరాపురం నుంచి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇప్పించాలని విన్నవించారు. మంగపేట మండలం నుంచి వికలాంగుల పింఛన్, విద్యుత్ మోటరుకు కనెక్షన్ ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎస్ఎస్తాడ్వాయి మండలం నుంచి ఆదివాసీ హక్కుల పోరాట సమితికి జెండాలు మంజూరు చేసేందుకు ఆదివాసీ దినోత్సవాన్ని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఊరట్టంలో ట్రైబల్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. వెంకటాపురం(కె) మండలం పాత్రాపురం బీట్ లో సాగులో ఉన్న అటవి భూమికి హక్కుపత్రాలు ఇవ్వాలని, వాజేడు మండలం గుమ్మడి దొడ్డిలో అక్రమంగా భూ మి మీదకు వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేందర్ పాల్గొన్నారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల వివరాలుభూ సమస్యలు 20గృహ నిర్మాణశాఖ 15ఉపాధి కల్పన 07పింఛన్లు 09తదితర సమస్యలు 14ప్రజావాణి, గిరిజన దర్బార్లో వినతుల వెల్లువ స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా మొత్తంగా వచ్చిన దరఖాస్తులు 91 ఈ ఫొటోలోనిది గోవిందరావుపేట మండల పరిధిలోని మొద్దులగూడెంకు చెందిన జల్లెల్ల రమేశ్. నిరుపేద కుటుంబానికి చెందిన అతను రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై వెన్నెముక దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. తల్లితో పాటు నివసించేందుకు ఇల్లు కూడా లేదు. గతంలో కలెక్టర్ చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేయించారు. అది పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి భర్త అనార్యోగంతో ఉండగా భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాం. ఈ క్రమంలో తమ భూమిని కాజేశారని కోర్టును ఆశ్రయించాను. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి భూమి తిరిగి ఇప్పించాలి. – ఉప్పల లక్ష్మీ, వెంకటాపురం(కె) మండలం -
సమష్టి కృషితోనే రాష్ట్రస్థాయి అవార్డు
ములుగు రూరల్: సమష్టి కృషితోనే సంపూర్ణతా అభియాన్లో రాష్ట్రస్థాయి అవార్డును సాధించినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. సెర్ప్ ఆధ్వర్యంలో శనివారం రాజ్భవన్లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర గవర్నర్ జిష్ణుదేవ్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమష్టి కృషి ఫలితంగానే జిల్లాకు అవార్డు దక్కిందన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. తంగేడు మైదానంలో పంద్రాగస్టు వేడుకలకు స్టేజీ ఏర్పాటు ప్రొటోకాల్ ప్రకారం కూర్చునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు. వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని సూపరింటెండెంట్తో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో రిజిస్టర్లు, ఓపీ రికార్డులను పరిశీలించి మాట్లాడారు. వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. నిత్యం ఓపీ 150 నుంచి 200 మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఆస్పత్రులో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నులిపురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
లోవోల్టేజీ సమస్య పరిష్కారం
వాజేడు: మండలంలో లోవోల్టేజీ సమస్య పరిష్కారం అయినట్లు డీఈ సదానందం తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో సోమవారం 5 ఎంవీఏ ట్రాన్స్ ఫార్మర్ను చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు మొదలైన నేపథ్యంలో లోవోల్టేజీ సమస్య రాకుండా ఉండేందుకు అదనంగా 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు లోవోల్టేజీ సమస్య ఇక ఉండదన్నారు. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ ఉంటుందని వెల్లడించారు. 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మంగళవారం నుంచి విద్యుత్ సరఫరా అవుతుందని వివరించారు. ఆయన వెంట ఏడీఏలు ప్రశాంత్ రెడ్డి, స్వామిరెడ్డి, వాజేడు ఏఈ అర్షద్ అహ్మద్ ఉన్నారు. -
న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి
వెంకటాపురం(కె): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏటూరునగారం ఏపీవో వసంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ పొంది వీరయ్య మాట్లాడారు. ఆదివాసీల చైతన్యమే లక్ష్యంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ పనిచేస్తుందన్నారు. భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయటం వల్ల ఆదివాసీలకు న్యాయం చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంవెంకటాపురం(కె): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీపీఎంవో సత్యనారాయణ అన్నారు. మండల పరిఽధిలోని రామాంజపురం గ్రామంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహంచి మందులను పంపిణీ చేశారు. గ్రామంలో నలుగురు జ్వరపీడితులను గుర్తించి వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు కృష్ణకుమారి, లక్ష్మి, రాంబాబు, ఆశ వర్కర్లు రజిని, గంగా భవాని, బీర భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. సర్క్యులర్ జారీ చేయాలి భూపాలపల్లి రూరల్: స్ట్రక్చర్ మీటింగ్లో జరిగిన ఒప్పందాలపై సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీచేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని కొమురయ్య భవన్లో సోమవారం సంఘం సమావేశం రాంచందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సంక్షేమం, ప్రయోజనాల కోసం ఏఐటీయూసీ నిరంతరం పాటుపడుతుందన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం బాగా పెరిగి పోయిందన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు శ్రీనివాస్, విజేందర్ పాల్గొన్నారు. -
కాళేశ్వరాలయంలో శ్రావణ శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో శ్రావణశోభ నెలకొంది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్ల దేవాలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. సాయంత్రం గర్భగుడిలో భక్తులు లక్షపత్రి పూజలను ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలో ఆలయం మారుమోగింది. దీంతో భక్తులు సందడి కనిపించింది. -
తుల్డా వెదురు.. ఆదాయం ఫుల్
ఏటూరునాగారం: వ్యవసాయంలో మహిళా రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ మేరకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి జాబ్ కార్డు ఉండి 15 గుంటల స్థలం ఉన్న రైతులను గుర్తించి వారికి ఉచితంగా 60 వెదురు మొక్కలను అందజేసి సాగు చేయించనున్నాయి. దీంతో వారు నాలుగేళ్ల పాటు మొక్కలు పెంచినందుకు, ఆ తర్వాత ప్రతీ ఏడాది దిగుబడి కింద లక్షలాది రూపాయలు వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించాయి. జిల్లాలోని తుల్డా వెదురు మొక్కల పెంపకానికి ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైలట్ మండలాలుగా గుర్తించాయి. ప్రతీ మండలంలో 350 మంది రైతుల చొప్పున మొత్తం మూడు మండలాల్లో 1050 మంది రైతులకు ఈ వెదురు రకం మొక్కలను అధికారులు అందించనున్నారు. ఇప్పటికే ఈజీఎస్ ద్వారా మణిపూర్ నుంచి తుల్డా రకానికి చెందిన 60వేల మొక్కలను అధికారులు దిగుబడి చేసుకొని నిల్వ చేశారు. అంతేకాకుండా ఈ మొక్క దాదాపు వ్యాధులు, తెగులు లేని గడ్డి రకం, చావు అనేది కూడా లేని మొక్క. అటవీశాఖ అధికారులు సైతం వెదురు మొక్కల పెంపకానికి ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు. ఆ మొక్కలను ఎంతైనా ఎక్కడికై నా రవాణా చేసుకునే వెసులుబాటును రైతులకు కల్పించింది. ఉపయోగాలు.. వెదురు సాగు వల్ల అత్యధికంగా ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో పాటు అగర్బత్తులు, గృహ ఉపకార వస్తువులు, ఇస్తారాకులు, ప్లేట్లతో పాటు ఇతర ఆయుర్వేద మందుల్లో కూడా దీనిని ఉపయోగించనున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీలతో పాటు స్వచ్చంధ సంస్థలు సైతం రైతులను ఎంపిక చేసుకొని వారే స్వయంగా సాగు చేయించే పద్ధతిని కూడా అమలు చేస్తున్నాయి. పర్యవేక్షణ సెర్ప్ పరిధిలోని గ్రామైక్య సంఘాల సభ్యులకు ఈ వెదరు మొక్కల సాగు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. వీటికి తోడు గ్రూపు, బ్యాంకుల నుంచి రు ణ సదుపాయంతో పాటు పర్యవేక్షణ, మార్కెటింగ్, ఇతర సలహాలు, సూచనలతో పాటు సంఘ సభ్యులకు సెర్ప్ అధికారులు చేదోడు వాదోడుగా ఉంటారు. ఇటు ఈజీఎస్, అటు సెర్ప్ ఉండడం వల్ల మహిళా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.ఒక్కో మహిళా రైతుకు 60 మొక్కలు నెలనెలా ఆదాయం, నాలుగేళ్ల తర్వాత దిగుబడి జిల్లాలో మూడు పైలట్ మండలాలుగా గుర్తింపుఅమలు ఇలా.. ఒక్కో మహిళా రైతుకు గ్రామైక్య సంఘం ద్వారా ఈ మొక్కలను అందజేసి ఒక మొక్క నాటినందుకు నెలకు రూ.119లు, మొక్కకు నీరు పోసి కాపాడినందుకు రూ.12లు, ఇతర మెంటనెన్స్కు రూ. 1.50ల చొప్పున అందజేస్తారు. ఒక్కో రైతుకు 30 నెలల పాటు ఈ పై డబ్బులను క్రమం తప్పకుండా చెల్లిస్తారు. అలాగే ఒక మహిళా రైతుకు కేవలం వెదురు మొక్కలను పెంచినందుకు రూ.27 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత దిగుబడి వచ్చిన వెదురు కర్రను విక్రయిస్తే మార్కెట్లో టన్నుకు వచ్చి రూ.1.50లక్షల వరకు ఆదాయం రానుంది. ఈ ఆదాయం సుమారుగా 25 సంవత్సరాలు నిర్వీరామంగా రావడంతో పేద మహిళా రైతులు కేవలం నాలుగైదు సంవత్సరాల్లో లక్షాధికారి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.తుల్డా వెదురు సాగుతో అధిక లాభాలు.. తుల్డా వెదురు సాగుతో అధిక లాభాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వెదురు సాగుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో ఈజీఎస్, సెర్ప్తో పాటు స్వచ్చంధ సంస్థలను కూడా భాగస్వాములను చేస్తున్నాయి. ఆక్సిజన్తో పాటు మంచి దిగుబడిని ఇచ్చే పంట, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి. – చరణ్రాజ్, ఏపీఓ, ఏటూరునాగారం -
వ్యాధుల నియంత్రణకు కృషి
ములుగు రూరల్: జిల్లాలో కీటక జనిత వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ గోపాల్రావు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్ఓ సోమవారం జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, మానిటరింగ్ సూపర్వైజర్లు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ములుగులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, టీహబ్, ఏటూరునాగారంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వెంకటాపురం(ఎం)లలో చేపట్టిన నిర్ధారణ కేసుల వివరాలు రోజు వారీగా ఆయా ఆరోగ్య కేంద్రాలకు ఇవ్వాలన్నారు. వ్యాధుల నియంత్రణకు యాంటీ లార్వా స్పెయింగ్, ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని గర్భిణుల వివరాలు సేకరించి రెగ్యులర్గా వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అసంక్రమిత వ్యాధుల నాలుగో విడత స్క్రీనింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకాంత్, పవన్ కుమార్, శ్రీకాంత్, రణధీర్, డెమో సంపత్, ఏఎంవో దుర్గారావు, డీపీఎంవో సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు
● ఎస్పీ శబరీశ్ ములుగు రూరల్: మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష తప్పదని ఎస్పీ శబరీశ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ప్రతిరోజూ ప్రమాదాల నివారణకు డ్రంక్అండ్డ్రైవ్ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. తరుచూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని వివరించారు. జూలై మాసంలో 456 డ్రంక్ అండ్ డ్త్రెవ్ కేసులు నమోదు చేసి నిందితులకు శిక్షపడేలా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో మద్యం సేవించి పట్టుబడిన వారిలో 17మందికి రెండు రోజులు జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే వారిపై కేసులు నమోదు చేస్తామని వివరించారు. జిల్లాలో ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహనాల తనిఖీలు నిర్వహించనున్నట్లు వివరించారు. మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తులకు కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టుకు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించి మొదటి, రెండోసారి పట్టుబడిన వారి మోతాదును బట్టి శిక్షలు విధించబడుతాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యులు అవుతారని ఎస్పీ శబరీశ్ హెచ్చరించారు. -
మెడికల్ బోర్డు నిర్వాకంతో ఆందోళన
భూపాలపల్లి అర్బన్: సింగరేణి మెడికల్ బోర్డు విధానాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని, హయ్యర్ సెంటర్ పేరుతో నిమ్స్కు పంపిన 47మంది కార్మికులను వెంటనే మెడికల్ బోర్డులో ఆన్ఫిట్ చేసి వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి ఏరియాలోని కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీబీ, విజిలెన్స్ సోదాలని కార్మిక వర్గంలో ఇతరుల మీద సోదాలు నిర్వహించి భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఏఐటీయూసీ డైరెక్టర్తో చర్చించినట్లు చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ -
ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
కన్నాయిగూడెం: మావోయిస్టుల వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. దీంతో ఆదివారం చివరి రోజు మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు వెళ్లి వచ్చే రహదారులపై ప్రత్యేక నిఘా వేసి ఉంచారు. వచ్చి పోయే వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముత్యాలమ్మతల్లికి మొక్కులు వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని పెరిక వీధిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం ఆదివారం కావటంతో గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి తెల్లావారుజామునే భక్తిశ్రద్ధలతో బోనం వండుకుని ఆలయానికి తీసుకెళ్లి మొక్కును చెల్లించుకున్నారు. పాడిపంట బాగా పండాలని, పిల్లాపాపలతో సల్లంగా ఉండాలని కోరుకుని మొక్కులను చెల్లించుకున్నారు. యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా రమేష్ వాజేడు: యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన నల్లగాసి రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరాకుల నాగభూషయ్య ఆదివారం రమేష్కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గొల్ల కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని వెల్ల డించారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు. కళాశాలకు భవనం మంజూరు చేయాలి వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు భవనం మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చొక్కాల గ్రామంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. మండలంలో రోడ్లు గుంతలమయంగా మారాయని మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని కోరారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీపీఎం చేపట్టిన సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలు, హర్ష, అభిలాష్, హేమంతి, నిరంజన్, రామ్, చరణ్, నాగచైతన్య తదితరులు పాల్గొన్నారు. రాజబాబు గౌడ్కు సన్మానం కాళేశ్వరం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ను వారి స్వగహంలో కాళేశ్వరం గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు కొండ్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు పొన్నం లింగయ్య గౌడ్, గంట వెంకటస్వామి గౌడ్, బైరి రాజబాబు గౌడ్, దూది వెంకటస్వామి గౌడ్, సదాశివ్గౌడ్ పాల్గొన్నారు. -
స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
● అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ వెంకటాపురం(కె): స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్కావెంజర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యన్నమల్ల ప్రవీణ్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం స్కావెంజర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కారించాలన్నారు. ఆనంతరం స్కావెంజర్ల మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూనెం నిర్మల, కార్యదర్శిగా ఆమని, ఉపాధ్యక్షురాలిగా కెక్కం నాగమణిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రమణ, లక్ష్మి, సమ్మక్క, సరోజిని తదితరులు ఉన్నారు. -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత ఆలయ చరిత్రను వివరించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. వారి స్తోమత మేరకు అన్నదాన నిర్వహణకు విరాళాలను అందజేశారు. -
టేకుకలప స్వాధీనం
వెంకటాపురం(కె): మండలం నుంచి రెండు వాహనాల్లో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న టేకుకలపను స్వాధీనం చేసుకున్నట్లు మండల అటవీశాఖ అధికారి వంశీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను వెల్లడించారు. రెండు పికప్ వాహనాల్లో అక్రమంగా టేకుకలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఒక వాహనాన్ని, వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో మరో వాహనాన్ని అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు వాహనాల్లో 16 టేకు మొద్దులు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారుగా రూ.4లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టేకు కలప, వాహనాలను అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు. -
మహాసభలను జయప్రదం చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు ములుగు రూరల్: రేపు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబోయే సీపీఐ 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులాలు మతాల పేరుతో గొడవలు సృష్టిస్తుందని వివరించారు. మతతత్వవాదులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపాల రవీందర్, అంజద్ పాషా, అచంటి ప్రసాద్, ముత్యాల రాజు, కొమురయ్య, రవి, గోపి తదితరులు పాల్గొన్నారు. -
రుద్రేశ్వరున్ని దర్శించుకున్న రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్లో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. -
వేతనాలు రాని ఉపాధి
మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు వెంకటాపురం(ఎం): గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2005లో ప్రవేశపెట్టింది. ప్రతీ కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వానికి, కూలీలకు వారధిగా ఉంటూ పనులు కల్పించడంలో ఈజీఎస్ సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే ఈ పథకంలో పనిచేసే సిబ్బంది వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 9 మండలాల పరిధిలో ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు కలిపి 174 మంది పనిచేస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఏలదే కీలకపాత్ర.. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు వంద రోజుల పాటు పనులు కల్పించడంలో ఎఫ్ఏ (ఫీల్డ్ అసిస్టెంట్లు)లు కీలకపాత్ర వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో పనులను గుర్తించి, కూలీలతో పనులు చేపిస్తూ, వారం రోజులకోసారి ఉపాధి కూలీలకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటారు. కూలీల హాజరు నుంచి డబ్బులు అందే వరకు ఎఫ్ఏలే సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు. గత మూడు నెలలుగా ఎఫ్ఏలకు వేతనాలు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీరితో పాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి సైతం వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 174 గ్రామపంచాయతీల పరిధిలో 86,246 జాబ్కార్డులు ఉండగా 1,81,761 మంది కూలీలు పనిచేస్తున్నారు. 174 మంది ఈజీఎస్ సిబ్బంది.. జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఏలు 103 మంది, ఏపీఓలు 6, ఈసీలు 6, టీఏలు 29, కంప్యూటర్ ఆపరేటర్లు 30 మంది కలిపి మొత్తం 174 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా గ్రామాల్లో సంవత్సరానికి సరిపడా ఉపాధి పనులు గుర్తించి జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలకు పనులు కల్పిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు నూతనంగా గుర్తించిన పనులకు అంచనాలు వేయడం, పని ప్రదేశాల్లో కొలతలు వేయడం, రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో మస్టర్లు పొందుపర్చడం, ఎఫ్ఏలకు మస్టర్లు ఇవ్వడం, నిధులు జనరేట్ చేయడం, ఈసీలు, ఏపీఓలు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు. గత మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఈజీఎస్ సిబ్బంది వాపోతున్నారు. రూ.26వేల వేతనం అందించాలి.. ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ. 26వేలు అందజేయాలి. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎఫ్ఏలకు పే స్కేల్ అమలు చేసి అలవెన్స్లు వర్తింపజేయాలి. ఎఫ్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. – పోలోజు రామాచారి, ఫీల్డ్ ఆసిస్టెంట్ వెంకటాపురం(ఎం) ప్రతినెలా వేతనాలు ఇవ్వాలి.. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ప్రతినెలా వేతనాలు అందించాలి. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారుతుంది. ఉపాధి హామీ సిబ్బందికి ప్రభుత్వం వెంటనే వేతనాలు అందించి ఆదుకోవాలి. – రాజ్కుమార్, టెక్నికల్ అసిస్టెంట్, ఎస్ఎస్ తాడ్వాయి ఆర్థిక ఇబ్బందుల్లో ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు జిల్లాలో 174 మంది ఈజీఎస్ సిబ్బందిభారమవుతున్న కుటుంబ పోషణ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్ఏలు, ఇతర ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కూలీలకు ఎఫ్ఏలు ఉపాధి పనులు తప్పనిసరిగా కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఎఫ్ఏలు ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. వీరితో పాటు ఇతర ఉద్యోగులు సైతం నిత్యం కార్యాలయానికి రావాల్సిందే. కానీ నెలనెలా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
స్థానికం తర్వాతే..
పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పరిశీలనలో ఉన్న డీసీసీ అశావహుల పేర్లు ఇవే... వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మే నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.డీసీసీలకు కొత్త సారథులు!? బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం పునరాలోచనలో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం -
జనసురక్ష పథకంపై అవగాహన పెంచుకోవాలి
● లీడ్ బ్యాంకు మేనేజర్ జయప్రకాశ్ ఎస్ఎస్తాడ్వాయి: జన సురక్ష పథకంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని లీడ్ బ్యాంకు మేనేజర్ జయప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఆర్బీఐ సౌజన్యంతో ఎస్బీఐ సహకారంతో వీడ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షర్యాసతపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జన సురక్ష పథకంతో పాటు పీఎం ఎస్బీవై, పీఎం జేజేపీవై ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ బ్యాంక్ ఇన్సూరెన్స్, స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుమనవాణి, ఏఓ కుమార్యాదవ్, ఎంపీఓ శ్రీధర్రావు, ఏఈఓ దుర్గప్రసాద్, సీఎఫ్ కౌన్సిలర్ భాస్కర్, అనిల్, జానపాల్రాజ్ పాల్గొన్నారు. -
ఆడపిల్లలకు ఆర్థిక చేయూత
ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారు. వీరితో పాటే 6 నుంచి 9వ తరగతి చదివిన వారిని సైతం ఇదే గ్రూప్లో యాడ్ చేసుకున్నారు. ప్రస్తుతం సుమారు 50 మందితో గ్రూప్ సాగుతోంది. గ్రూపులో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 14 మంది స్నేహితుల కుమార్తెల వివాహాలకు ఆర్థికసాయం అందించారు. వివాహసమయాల్లో ఒక చోట కలిసి ఆనందంగా గడుపుతున్నారు. -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu3. నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. A) ఇద్దరికి మించి B) ఒకరు211. ఫ్రెండ్ షిప్ అంటే..మీ దృష్టిలో A) అవసరాలు తీర్చేది B) కల్మషం లేనిది84స్నేహం అంటే మనుషుల్ని కలిపే వారధి. కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి. కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ ‘చేయి’ అందించే ఓ రూపం.. ప్రపంచంలో ప్రతీ బంధానికి ప్రత్యేకత ఉంటుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు..బంధువులు సహజంగా లభిస్తారు.. కానీ స్నేహితులు మాత్రం మనం మన చేతిగా ఎంచుకునే బంధం. అలాంటి అపూర్వమైన అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజు స్నేహితుల దినోత్సవం. ఈ నేపథ్యంలో స్నేహబంధంపై ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంపై సాక్షి సర్వే నిర్వహించింది. ఇప్పటికీ, ఎప్పటికీ కల్మషం లేనిది స్నేహబంధమని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ స్నేహితులుండాలని, అప్పుడే ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటారని చెప్పారు. 36992. ఫ్రెండ్షిప్ కూడా.. కలుషితం అయిందా..! 4. నీ ఫ్రెండ్కు ఇచ్చేస్థానం..? A) అమ్మ, నాన్న, ఫ్రెండ్ B) నాన్న, అమ్మ, ఫ్రెండ్ A● ఇద్దరికి మించి స్నేహితులు అవసరం ● అమ్మానాన్న తరువాత ఫ్రెండ్కే ప్రాధాన్యం ● ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంA) లేదుB) అవును2932C) ఫ్రెండ్, అమ్మ, నాన్న 6159న్యూస్రీల్– సాక్షి నెట్వర్క్ -
బాల్యం.. భారం కాదు వరం
● బాలల ప్రొటెక్షన్ జిల్లా అధికారి హరికృష్ణఏటూరునాగారం: బాల్యం.. భారం కాదని గొప్ప వరమని బాలల ప్రొటెక్షన్ జిల్లా అధికారి హరికృష్ణ అన్నారు. మండలం కేంద్రంలోని వివిధ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఒత్తిడిని నివారించి, జీవితంలో వారు ఉన్నతంగా ఎదిగేలా శాఖ పరిధిలో పనిచేస్తున్న కౌన్సిలర్లతో బృందాలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ‘బాల్యం పై భరోసా’ శీర్షికన శనివారం నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్లైన్, సఖి, మహిళా సాధికారత కేంద్రానికి చెందిన కౌన్సిలర్లు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. విద్య అనేది విజ్ఞానానికి మాత్రమే అని తెలిపారు. ఆ విజ్ఞానం మన జీవితాన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని ఎలా బతకాలనేది తెలుపుతుందని వెల్లడించారు. విద్యార్థులు మార్కుల కోసం తపన పడవద్దని సూచించారు. తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేలా మంచి మార్పుల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒకరితో పోల్చుకుని జీవించకుండా పోటీ తత్వంతో ఎదిగేలా శ్రమించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సంపూర్ణత అభియాన్ అవార్డు ప్రదానం
ములుగు రూరల్: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సంపూర్ణత అభియాన్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికై న విషయం విదితమే. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ టీఎస్.దివాకర అవార్డు అందుకున్నారు. కన్నాయిగూడెం బ్లాక్లో కీలక పనితీరు, సూచికల పనితీరు బాగుండడంతో అవార్డు లభించిందని కలెక్టర్ తెలిపారు. ‘దివ్యాంగులకు ఇంటి వద్దే విద్య’ ఏటూరునాగారం: అంగవైకల్యం, ఇతర లోపాలు కలిగిన దివ్యాంగులు విద్యకు దూరం కాకుండా విద్య అభ్యసించే విధంగా శ్రీఇంటి వద్ద విద్యశ్రీ కార్యక్రమాన్ని భవిత సెంటర్ల ద్వారా చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్ అర్షం రాజు, భవిత సెంటర్ల జిల్లా కో ఆర్డినేటర్ సాంబయ్య, ఎంఈఓ మల్లయ్య తెలిపారు. మండల పరిధిలోని రాంపూర్లో దివ్యాంగుడు తోలెం జీవన్కు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కిట్లను శనివారం వారు అందజేసి మాట్లాడారు. దివ్యాంగులు ఇంటి వద్దనే విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కిట్లను పంపిణీ చేస్తుందన్నారు. ప్రత్యేక పరికరాలు కిట్లలో అందుబాటులో ఉంటాయని, వాటి ద్వారా ఐఈఆర్పీలు చదువు నేర్పుతారని వెల్లడించారు. బడికి దూరమైన దివ్యాంగులను గుర్తించి వారికి ఈ కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు స్వరూప, రమేష్లతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే బీజేపీ లక్ష్యం ములుగు రూరల్: రైతుల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆ పార్టీజిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 20వ విడత రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేశారని వెల్లడించారు. ఈ డబ్బులు రైతుల పంటలకు ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు రేష్మా ఎంపిక వెంకటాపురం(ఎం): మండలంలోని మైనార్టీ కళాశాలకు చెందిన ఎస్కే. రేష్మా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ వందన, పీఈడీ నవ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జాకారంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ అండర్–16 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో రేష్మా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. అదే విధంగా నేడు, రేపు హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో రేష్మా పాల్గొననున్నట్లు వారు వెల్లడించారు. కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి ములుగు రూరల్: వెంకటాపురం(కె) మండలం మర్రిగూడెం గ్రామ పంచాయతీ కార్మికుడు మడకం విజయ్ ఇటీవల విద్యుదాఘాతంతో మృత్యువాత పడిన అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విజయ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలన్నారు. పంచాయతీ కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి దావుద్, రఘుపతి, మల్లారెడ్డి, హుస్సేన్, సమ్మక్క, సరోజన, నీలాదేవి, సరిత, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
దిల్ఖుష్ దోస్తానా
ఆడపిల్లల్లో స్నేహితుడిని చూసుకుంటూ.. కేసముద్రం: బాల్యమిత్రుడు మృతి చెందాడు. అతని ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ఆ ఆడబిడ్డల్లో స్నేహితుడిని చూసుకుంటున్నారు కేసముద్రం మున్సిపల్ కేంద్రానికి చెందిన ఎస్వీవీ హైస్కూ ల్కు చెందిన 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గాండ్ల అశోక్కు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్యకు కూతురు పుట్టగానే ఆమె మృతిచెందింది. ఆతర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. రెండో భార్యకు మరో కూతురు జన్మించగానే అశోక్ చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆ ఇద్దరు ఆడపిల్లల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఏటా రూ.45వేల ఫీజు చెల్లిస్తూ పెద్దకూతురు శివానిని(6వ తరగతి) నర్సంపేటలోని ఓప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారి చదువుకున్నంత కాలం ఆ తాము చదివిస్తామని బాల్యమిత్రులు చెబుతున్నారు. ● కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు ● ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు నేడు ఫ్రెండ్షిప్ డేలింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం.. కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవా లన్నా.. సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్.. జిగేల్ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధుర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. స్నేహితం.. సేవే అభిమతం తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆపదలో స్నేహితులకు ఆర్థిక చేయూతనిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడు చాట్ల సంపత్ను బతికించాలని రూ.1.3 లక్షలు సమీకరించి చికిత్స అందించారు. అదేవిధంగా కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎన్ చారి అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోగా.. గుర్తించిన మిత్రులు రూ.50 వేలు జమ చేసి అందించారు. పదో తరగతి మిత్రుడు నాగేశ్వరావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తుండగా.. బస్సు ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. ఆరు నెలలు డ్యూటీ లేకుండా ఇంట్లోనే ఉండడంతో అతడి కూతురు చదువుకు ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ సహచర పదో తరగతి మిత్రులు రూ.70 వేలు అందించారు. స్నేహితుల సంఘం! గీసుకొండ: గ్రేటర్ వరంగల్లోని 16వ డివిజన్ ధర్మారంలోని కోట మెసమ్మ తల్లి పరపతి సంఘం (స్నేహితుల సంఘం) ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఆగస్టు 15న తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. రూ. 50 లక్షల టర్నోవర్తో సంఘం లావాదేవీలు నిర్వహిస్తోంది. అవసరం ఉన్నసభ్యులకు 0.5 వడ్డీతో రుణాలిస్తున్నారు. సంఘ సభ్యులెవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తున్నారు. ఏటా ఫ్రెండ్ షిప్ డే రోజున సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. కోటమైసమ్మ తల్లికి గొర్రెలను బలిచ్చి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ హన్మకొండ: సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో 10 మందితో మొదలైంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. ప్రస్తుతం వేయి మందితో నడుస్తోంది. ఆర్థిక సమస్య కారణంగా ఎవరూ చదువు మధ్యలోనే ఆపేయవద్దనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ పతంగి భాస్కర్తో పాటు మరికొంత మంది మిత్రులు. 2020లో మొదలైన ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పాలిసెట్ బుక్స్ పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందజేత, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకుసాగుతోంది. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్ ములుగు రూరల్: విద్యార్థులు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శనివారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహ నిరోధక చట్టం, బాల కార్మికుల నిషేధిత చట్టం, ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టాలపై వివరించారు. విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమాదేవి, ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కలిసి నడుస్తున్న బాల్యమిత్రులు..
దేవరుప్పుల: బడికెళ్లే వయసు నుంచి బతుకుదెరువు వరకు కలిసే నడుస్తున్నారు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన కొత్త జలంధర్రెడ్డి (రెడ్డి), కూతాటి నర్సింహులు. వీరు పదో తరగతి వరకు కలిసి చదువు కున్నారు. ఉన్నత చదువులు చదవక పోయినా ఆ ప్రాంత వామపక్ష భావజాలంతో ఇరువురు పలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో చురుగ్గా పనిచేశారు. రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో రాణిస్తూ ఆఖరికి బతుకుదెరువు కోసం సైతం ఇరువురు వ్యాపారంలోనూ కలిసే పనిచేస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. -
విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి
ములుగు రూరల్: గురుకుల పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు మెనూ ప్ర కారం పౌష్టికాహారం అందించాలని అన్నారు. సీజ నల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్ర పాటించాలని సూచించారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్లో విద్యార్థినులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత పాల్గొన్నారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ దివాకర అన్నారు. జగ్గన్నపేట, అన్నంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణా లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇంటి నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే సంపూర్ణ అభివృద్ధి కన్నాయిగూడెం: ప్రభుత్వ అధికారులు, ఫ్రంట్లైన్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆకాంక్షా బ్లాక్, సంపూర్ణ అభియాన్ కా ర్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న 500 ఆకాంక్షా బ్లాక్లలో కన్నాయిగూడెం ఆస్పేరేషనల్ బ్లాక్ ఒకటన్నారు. పథకాలు ప్రజలకు చేరడంలో, సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ముందుండాలన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, విద్య, వ్యవసా యం, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో కృషి చేసిన జిల్లా బ్లాక్స్థాయి అధికారులను ప్రశంసించారు. ఆకాంక్ష హట్ ప్రారంభం స్వయం సహాయక బృందాలు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులు, చేతి వృత్తుల వస్తువులకు వేదిక కల్పించడమే ఆకాంక్షా హట్ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. మహిళలు తయారు చేసిన వస్తులవులను మార్కెటింగ్ చేసేందుకు హట్ వేదిక అవుతుందన్నారు. ఏపీడీ వెంకటనారాయణ, తుల రవి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సాజిదా, రవీష్ పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం: రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని స్పెషల్ అఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి, ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శించారు. జ్వరంతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతర కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ సీజనల్వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో దోమల నియంత్రణకు యాంటీ లార్వా స్ప్రే చేయాలని, నీటినిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్య వ్యాధులను నియంత్రించాలని సూచించారు. ఆశా వర్కర్లు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఉపకేంద్రాల్లో మానిటరింగ్ సూపర్వైజర్లను నియమించి వ్యాధుల నియంత్రణకు ప్రణాళికు రూపొందించినట్లు తెలిపారు. ఏటూరునాగారంలో ఐసీటీసీ సెంటర్ను సందర్శించి ఎయిడ్స్, హెచ్ఐవీ టెస్టుల విషయాన్ని తెలుసుకున్నారు. షాపెల్లి గ్రామంలని సబ్ సెంటర్ను వెంకటేశ్వరెడ్డి తనిఖీ చేశారు. డెంగీ జ్వరంతో బాధపుతున్న బాలుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి పిల్లల ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు, డీపీఓ దేవరాజ, డీసీహెచ్ ములుగు వైద్యాధికారి జగదీశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఏటూరునాగారం ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్, జిల్లా పోగ్రామ్ ఆఫీసర్ పవన్కుమార్, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్ రావు, వెంకటరెడ్డి, సాంబయ్య, నర్సింహరావు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి వాసం వెంకటేశ్వరెడ్డి -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు.. దీని తీరే అమ్మతీరు.. కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా. –కాసర్ల శ్యామ్, పాటల రచయిత● జిల్లావాసి కాసర్ల శ్యామ్కు నేషనల్ అవార్డు ● ఉత్తమ లిరిక్రైటర్గా గుర్తింపు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు -
కోడి‘గుడ్’..విధానం!
సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ‘ఆన్లైన్’ ప్రక్రియసాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి 2025–26 సంవత్సరానికిగాను టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా గతనెల 23 నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించారు. ఈ మేరకు ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్ షెడ్యూల్లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. అంతకు ముందు ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్లతో కలెక్టర్లు ఫ్రీ బిడ్ సమావేశాలు కూడా నిర్వహించారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రేటు... హనుమకొండ, వరంగల్లో తక్కువ.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధికారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కొడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్లు ఈ టెండర్లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్లైన్ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్ కడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే.. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ ఆగ్మార్క్ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులై న కాంట్రాక్టర్లను ఎంపిక చేసేది. ఆ తర్వాత కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరిమా ణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్లో పేర్కొ న్న విధంగా కాకుండ తక్కువ గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు బిడ్ డాక్యుమెంట్లను టౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో బిడ్లను సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించారు. సమర్పించిన బిడ్ల హార్డ్ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్/షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటా యించిన విధంగా టెక్నికల్ బిడ్లు, ధరల బిడ్లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. విద్యాలయాల్లో 7.33 కోట్ల కోడిగుడ్లకు.. సుమారు రూ.40.60 కోట్లు ఉమ్మడి వరంగల్లో ఐదు జిల్లాలకే టెండర్లు.. భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ ఈ నెల 6 నుంచి 12 వరకు షెడ్యూల్ దాఖలు.. 12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్ అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలు అందుకే పాలసీ మార్చిన ప్రభుత్వం..జిల్లా సరఫరా కేటాయించిన చేయాల్సిన డబ్బులు (రూ.లలో) కోడిగుడ్లు హనుమకొండ 1,31,14,397 6,71,45,713 వరంగల్ 1,40,76,730 7,89,70,455 మహబూబాబాద్ 1,77,87,502 10,01,43,636 జనగామ 1,26,05,592 7,09,69,483 ములుగు 78,11,600 4,39,79,308 భూపాలపల్లి 79,54,004 4,47,81,042 మొత్తం 7,33,49,825 40,59,89,637 -
పింఛన్.. టెన్షన్
ఏటూరునాగారం: వేలిముద్రలు పడితే ఆసరా పింఛన్ ఇవ్వాలనేది గతంలో ప్రభుత్వ నిబంధన. అయితే చాలామంది లబ్ధిదారులు.. ప్రధానంగా వృద్ధులు వేలిముద్రలు చెరిగిపోవడంతో పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. దీంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏల వేలిముద్రలతో పింఛన్ డ్రా చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు వేలిముద్రలు పడని వృద్ధులకు ఐరిస్ స్కానింగ్తో పింఛన్ ఇచ్చే నిబంధనను జూలై 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఐరిస్ ఉంటేనే ఆసరా పింఛన్ అని అధికారులు చెబుతుండడంతో పోస్టాఫీసుల వద్ద లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. ఇటు వేలిముద్రలు లేక, అటు ఐరిస్ రాకపోవడంతో పింఛన్ పోతుందో ఏమో అని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. పోస్టాఫీసుల అధికారులకు పూర్తి అధికారులు ఇచ్చి యాప్ ద్వారానే ఐరిస్ స్కానింగ్ చేసి పింఛన్ ఇవ్వాలని ఆదేశించడంతో వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా కేవలం నాలుగు రోజుల సమయంలోనే పూర్తి స్థాయిలో పింఛన్ ఇవ్వాలని డెడ్లైన్ విధించడంతో పింఛన్లు పంపిణీ చేసే క్రమంలో తీవ్ర జాప్యం అవుతుంది. దాంతో కాలం ముగిసిందని, పింఛన్ ఈ నెల కాదు వచ్చే నెల తీసుకోవాలని పోస్టాఫీసు సిబ్బంది చెప్పడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉండడం.. పంపిణీ చేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో చాలాచోట్ల సమయం మించి పోతుంది. దీంతో లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడంలేదు. పారదర్శకతో అసలుకు ఎసరు.. ఆసరా పింఛన్లో అక్రమాలు జరుగుతున్నాయని అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఐరిస్ను అమల్లోకి తెచ్చారు. కానీ అర్హులైన ఆసరా లబ్ధిదారులకు సైతం వేలిముద్ర, ఐరిస్ క్యాప్చరింగ్ కాక పింఛన్ కోల్పోయే పరిస్థితి నెలకొంది. గత నెల తీసుకోని లబ్ధిదారులకు రెండు నెలల పింఛన్ అందాల్సి ఉండగా ఇప్పుడు కంటి ఐరిస్ పడక ఆ పింఛన్ పోతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే ఆటోమెటిక్గా లబ్ధిదారుడి పింఛన్ను తొలగించే నిబంధనలు ఉండడం గమనార్హం.పింఛన్ పొందేందుకు ఐరిస్ నిబంధన అవస్థలు పడుతున్న కంటిచూపు మందగించిన వృద్ధులు పోస్టాఫీసుల వద్ద పడిగాపులు సాంకేతిక సమస్యతో అందని ఆసరా -
తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు
ములుగు రూరల్: ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో తాత్కాలిక బస్టాండ్ను డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రవిచందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్ నిర్మాణానికి మంత్రి సీతక్క రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. బస్టాండ్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బస్టాండ్లోకి బస్సుల రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు సహకరించాలని కోరారు. -
విద్యారంగం బలోపేతానికి చర్యలు
ములుగు రూరల్: విద్యారంగాన్ని బలోపేతం చేసేందకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల క్లాస్రూమ్లను పరి శీలించారు. పదో తరగతి విద్యార్థులతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సబ్జెక్ట్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, ఇంగ్లిష్పై పట్టు సాధించాలని విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రభుత్వం అమ్మ అదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రణాళికతో చదవుకుని ఉన్నతస్థాయికి చేరుకోవా లని సూచించారు. పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలి గోవిందరావుపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జ్వరంతో వచ్చే ప్రతీవ్యక్తికి మలేరియా, డెంగీ రక్త పరీక్షలను నిర్వహించి మెరుగైన వైద్యాన్ని అందించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ రూంలో మలేరియా, డెంగీ ఆర్డీటీ పరీక్షలకు సరిపడా టెస్ట్ పరికరాలు ఉన్నాయా అని అడిగి తెలుపుకున్నారు. లేకుంటే వెంటనే సమకూర్చుకోవాలని ల్యాబ్ టెక్నీషియన్కి తెలిపారు. అనంతరం మందుల నిల్వల గదిని చూసి వర్షాకాలానికి సరిపడే మందులు అందుబాటులో ఉంచుకోవాలని, వాటితో పాటు అత్యవసర మందులైన పాము, కుక్క కాటుకు వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోవాలని ఫార్మసిస్టుకు సూచించారు. ఈ కార్యక్రమంలో పస్రా వైద్యాధికారి సుహానా, ఫార్మసిస్ట్ శారద, స్టాఫ్ నర్సులు సంధ్య, రమాదేవి, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ములుగు రూరల్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చిందని, ఫ్రీ బస్సు పథకం తప్ప మిగిలిన ఏ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతురుణమాఫీ, దళితబంధు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలు చేయలేకపోతుందన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావూద్, రఘుపతి, గ్యానం వాసు, కృష్ణబాబు, రమేష్, రత్నం ప్రవీణ్, హుస్సేన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య -
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ములుగు రూరల్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల ఆరోగ్యంపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ దివాకరతో కలిసి వైద్యాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏజెన్సీ గ్రామాలలో వైద్యశిబిరాలు నిర్వహించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయించాలని వెల్లడించారు. గతేడాది పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థులకు వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణకుమారి, డీసీహెచ్ జగదీశ్, తదితరులు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా నాగమణి ఎస్ఎస్తాడ్వాయి: పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోవిందరావుపేటకు చెందిన మద్దాలి నాగమణిని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు. దానికి నిదర్శనం మద్దాలి నాగమణి అన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే ఉన్నత పదవులు తప్పక లభిస్తాయన్నారు. నూతనంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికై న నాగమణి మంత్రి సీతక్కకు అభినందనలు తెలిపారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
పట్టాదారుల వివరాలు పరిశీలించాలి
ములుగు రూరల్: పట్టాదారుల వివరాలను పారదర్శకంగా పరిశీలించాలని రాష్ట్ర సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీలు పాల్గొన్నారు. భూమి రీ సర్వే నంబర్లకు సర్వే సిబ్బందిని పంపించి సర్వే పూర్తి చేసి పట్టాదారుల వివరాలను, పహానీలో క్షుణ్ణంగా పరిశీలించి రెండు రోజుల్లో రిపోర్టు అందించాలని సూచించారు. ఈ విషయంపై కలెక్టర్ దివాకర సిబ్బందితో మాట్లాడుతూ రెవెన్యూ సర్వే సిబ్బంది ఫీల్డ్కు వెళ్లి విచారణ చేపట్టి రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులు పారదర్శకంగా చట్టానికి లోబడి వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.వీసీలో సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్కుమార్ -
ఇళ్ల స్థలాలకు భూ పరిశీలన
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి గ్రామంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ నివాస గృహాలను ఏర్పాటు చేసేందుకు ఇళ్ల స్థలాల కోసం భూమిని గురువారం అదనపు కలెక్టర్ మహేందర్జీ పరిశీలించారు. ఈ మేరకు దొడ్ల, కొత్తూరు, ఊరట్టం ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించి అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. అయితే ఈ రెండు ప్రాంతాల్లో కూడా కొంత రిజర్వు ఫారెస్ట్, రెవెన్యూ భూమి ఉండడంతో క్లియరెన్స్ కోసం సంయుక్త శాఖల ద్వారా సర్వేలు చేయించాల్సి ఉందని అధికారులు అదనపు కలెక్టర్కు తెలిపారు. అంతేకాకుండా అటవీశాఖ భూమికి బదులుగా మరో చోట భూమి ఇస్తే అనుమతులు వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు మహేందర్జీకి వివరించారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదికస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జగదీశ్వర్, మాజీ సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్, పంచాయతీ కార్యదర్శి సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ సహజం
ములుగు రూరల్: ఉద్యోగులందరికీ ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ శబరీశ్ అన్నారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఆర్ఎస్సై సంపత్రావును ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్రావుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏఆర్హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న సంపత్రావు డినార్ట్మెంట్లో సుదీర్ఘ సేవలను అందించారని తెలిపారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలు అమోఘమన్నారు. పదవీ విరమణ చేసిన పోలీస్ కుటుంబాల్లో ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఐలు స్వామి, తిరుపతి, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ పోస్టర్ ఆవిష్కరణ ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని డీఆర్డీఓ ఆఫీస్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్, డీఆర్డీఓ ప్రాజెక్టు ఆఫీసర్ సంపత్రావు గురువారం ఓపెన్ స్కూల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ డీఆర్డీఓ శ్రీనివాస్, అడల్ట్ ఎడ్యూకేషన్ ఏబీఎస్ వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం తదితరులు పాల్గొన్నారు. పట్టుపరిశ్రమ భూముల పరిశీలన ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎక్కెల ప్రాంతంలోని పట్టుపరిశ్రమ శాఖకు కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ క్రమంలో ఆర్ఐ చిక్కుల కిరణ్కుమార్తో పాటు సిబ్బంది వెళ్లి పరిశీలించగా కొంతమంది ఆ భూములు తమవని, సాగులో ఉన్నామని వాగ్వాదానికి దిగారు. అయితే ప్రభుత్వానికి చెందిన భూములు ఎవరి ఆధీనంలో ఉన్నా ప్రభుత్వం చట్ట పరమైన తీసుకుంటుందని తెలిపారు. విధులకు ఆటంకం కలిగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని వెల్లడించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని వాగ్వాదం చేసే వారిని శాంతింపజేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఏటూరునాగారం: మావోయిస్టు ఏరియా ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్స్టేషన్ను ఏఎస్పీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు చేశారు. ప్రజలకు మర్యాదపూర్వకంగా సమస్యలను పరిష్కరిస్తూ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. పోలీస్స్టేషన్లో 5ఎస్ ఇంప్లిమెంటేషన్, వర్టికల్స్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పిటిషన్ మేనేజ్మెంట్, పోలీస్స్టేషన్ పనితీరును రిసెప్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలని, డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో నేరాలను నియంత్రించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై, రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. క్రైమ్ వాహనాలు, ఇతర వాహనాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వరదలు.. వలసలు
సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న కొండాయి గ్రామస్తులుఏటూరునాగారం: ముంచుకొస్తున్న వరదలతో ఎవరి ప్రాణాల పోతాయోనని భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని కొండాయి ప్రజలు వాగు దాటి వలసబాట పట్టారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడానికి సిద్ధమయ్యారు. ఏటూరునాగారం మండలంలోని పూర్తిగా ముంపు ప్రాంతమైన కొండాయి ప్రజల దీనగాథ ఇది.. గత ఇరవై ఏళ్ల నాటి కష్టాలు మళ్లీ వచ్చాయని కొండాయి ప్రజలు గొల్లుమన్నారు. 2023 సంవత్సరంలో ఇదే వర్షాకాలంలో జూలై 27న జంపన్న వాగు ఉగ్రరూపానికి వాగుపై ఉన్న వంతెన నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి గ్రామాన్ని ముంచెత్తింది. ఎనిమిది మంది ప్రాణాలు జంపన్న వాగు బలి తీసుకుంది. ఇళ్లన్నీ మునిగి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అయితే మళ్లీ ఈ ఏడాది కూడా వర్షాలు వస్తాయనే భయంతో కొండాయిలోని 28 దళిత కుటుంబాలు దొడ్ల, కొత్తూరు అటవీ ప్రాంతాలకు వలసబాట పట్టారు. అడవిలో గుడిసెలు రెండు రోజులుగా కొండాయి నుంచి దొడ్ల, కొత్తూరు అటవి ప్రాంతానికి మూటలను పట్టుకుని వలసవెళ్లిన ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు అనుమతి లేనిది గుడిసెలు వేయొద్దని ఆదేశించారు. ఇదే విషయాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క తెలుసుకొని భయ పడాల్సిన అవసరం లేదని, ముంపు ప్రాంతాల ప్రజలకు స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో అడవిని వీడి వారి ఇళ్లకు వెనుదిగారు. పక్కా ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ మంత్రి సీతక్క హామీతో వెనుదిరిగిన ప్రజలు -
రెండు నెలలు ఇంటింటి సర్వే
● డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ వాజేడు: రెండు నెలల పాటు వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేయాలని ఏటూరునాగారం ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. వైద్యశాలలోని ఫార్మసీ ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డు పరిశీలించి సీజనల్ వ్యాధులు, రోజు వారి ఓపీపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ లు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యులు ఇంటింటి సర్వే తప్పకుండా చేయాలన్నారు. ఆయన వెంట వాజేడు వైద్యాధికారి మహేందర్, కోటిరెడ్డి, రఘు, రజనీకాంత్ ఉన్నారు. -
నేడు విద్యుత్ సరఫరా బంద్
వాజేడు: వాజేడు మండలంలో నేడు(గురువారం) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అర్షద్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాజేడు సబ్స్టేషన్లో అదనపు లోడ్ కోసం ట్రాన్స్ఫార్మర్ అమర్చనున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ములుగు రూరల్: రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ పనిచేయాలని రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ యార్డులను పునరుద్ధరించాలన్నారు. మార్కెట్ కమిటీ కార్యవర్గం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. అనంతరం రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటి డైరెక్టర్ పద్మజలను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా, సూపర్వైజర్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య నియమాలు పాటించాలి భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ ఆరోగ్య నియమాలు పాటించాలని సింగరేణి ఆస్పత్రి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మ సూచించారు. ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులతో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రతీ రోజు వ్యాయామం చేయాలని, రోజుకు కనీసం 8నుంచి 9గంటల పాటు నిద్రపోవాలని చెప్పారు. పౌష్టికాహారం, విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. రక్తం పెరుగుదలకు ఆహారంలో పాలిష్ లేని దినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, ఉపాధ్యాయలు పాల్గొన్నారు. ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు ఒకటవ తరగతి ప్రవేశాలకు వచ్చే నెల 8వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కాటారం: మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–16 రన్నింగ్ విభాగంలో మొండి అనే విద్యార్థి రెండవ స్థానంలో నిలవగా అండర్–12 రన్నింగ్ విభాగంలో అవినాష్ ప్రథమ స్థానంలో, అభిరాం రెండవ స్థానంలో నిలిచి సత్తా చాటారు. హనుమకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నట్లు విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్రావు తెలిపారు. శాలువాలతో సన్మానించి మెమొంటో అందజేశారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఇద్దరికి రెండేళ్ల జైలు మొగుళ్లపల్లి: మహిళను అసభ్యకరంగా తిట్టి కొట్టిన కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ భూపాలపల్లి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి దిలీప్కుమార్ నాయక్ బుధవారం శిక్ష ఖరారుచేశారు. పోలీసుల కథనం ప్రకారం..ఇప్పలపల్లికి చెందిన దూడపాక రాజు, దూడపాక సంగీతపై 2016 సంవత్సరంలో పోలీస్స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదుచేసింది. రాజు, సంగీతపై అప్పటి ఎస్సై రమేష్ కుమార్ కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో దూడపాక రాజు, దూడపాక సంగీతకు శిక్ష ఖరారుచేశారు. శిక్ష పడే విధంగా ఆధారాలు సమర్పించిన ఎస్సై అశోక్, అడిషనల్ పీపీఏ కుమార్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ సుమలతను ఉన్నతాధికారులు అభినందించారు. -
వేగంగా.. సులువుగా..
భక్తులు వనదేవతలను దర్శించుకునేలా సమాలోచనలుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం భక్తులకు సులువుగా కల్పించేందుకు అధికారులు, పూజారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ టీఎస్. దివాకర, డీఎస్పీ రవీందర్, ఈఓ వీరస్వామి, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల పూజారులతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని సందర్శించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో చేయడం వల్ల భక్తులకు సులువుగా దర్శనం కలుగుతుందన్న ఆలోచనపై పూజారులతో చర్చించారు. ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్, అధికారులు తయారు చేసిన మ్యాప్లను పూజారులకు కలెక్టర్ వివరించారు. అంతిమ నిర్ణయం పూజారులదే.. ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్ వల్ల అమ్మవార్ల దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తల్తెత్తుతాయనే అభిప్రాయాన్ని పూజారులు అధికా రులకు వివరించారు. కానీ, అధికారులు సమ్మక్క– సారలమ్మ గద్దెల పక్కన వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఉంచడంపై పూజారులు సమాలోచనతో సానుకూల నిర్ణయానికి వచ్చారు. సారలమ్మ ఎంట్రెన్స్ గేట్ను సుమారుగా 20 ఫీట్ల దూరం విస్తరించి వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పూజారులు కొంతమేరకు ఏకీభవించారు. నలుగురు దేవతలు వరుస క్రమంలో ఉండడం వల్ల టీటీడీ కల్యాణ మండపం ద్వారా, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు రెండు వైపులా దర్శనం సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా రెండు వైపులా క్యూలైన్ల ద్వారా గద్దెల ప్రాంగణంలోకి వచ్చిన భక్తుల్లో ఒకేసారి పదిమంది వెళ్లేలా వెడల్పాటి మరో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. కాగా, గద్దెల మార్పుపై రెండుమూడు రోజుల్లో పూజారులతో చర్చించి అభిప్రాయాన్ని వెల్లడిస్తామని గోవిందరాజు పూజారి.. అధికారులకు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం దర్శనం పాస్లు.. ఈసారి మహాజాతరలో షెడ్యూల్ ప్రకారం వీఐపీ, వీవీఐపీలు, అధికారులు, మీడియాకు దర్శనం పాస్లు జారీ చేయాలనుకుంటున్నారు. అందరికీ ఒకేసారి పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈసారి జాతరకు ముందుగా నాలుగైదు తేదీల్లో పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. జాతర నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే, ఆపైస్థాయి వారికి పాస్లు జారీ చేసే ఆలోచన చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా సమ్మక్క మ్యూజి యం, సారలమ్మ ఎంట్రెన్స్నుంచి జంపన్నవాగు ఆర్అండ్బీ రోడ్డు వరకు దారిని విస్తరించాలని పూజారులు కలెక్టర్ను కోరారు. కాగా, రోడ్డును కూడా కలెక్టర్..ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.మొక్కుల చెల్లింపులో ఇబ్బంది లేకుండా.. మేడారంలో పూజారులతో కలిసి గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ పూజారులదే ఫైనల్ నిర్ణయంఅమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకల చెల్లింపులో భక్తులు ఇబ్బందులు పడకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా అధికారులు పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును వరుస క్రమంలో భక్తులు దర్శనం చేసుకునే సమయంలో పూజారులు సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద క్యూలైన్ లోపల ఉండి భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం తీసుకుని తిరిగి ప్రసాదం అందించడంతోపాటు మొక్కు బంగారాన్ని ఎప్పటికప్పుడు బయటకు తరలించే మార్గాలను పరిశీలించారు. నాలుగు గద్దెలు వరుసక్రమంలో ఉంటే వీఐపీ, వీవీఐపీల దర్శనం సమయంలోనూ సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీవీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా హెలిపాడ్ ప్రదేశానికి వెళ్లేలా సారలమ్మ ఎగ్జిట్ గేట్నుంచి ఐరన్తో ఫ్లైవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మరింత సులువుగా ఉంటుందని సమాలోచన చేశారు. పూజారులు తమ నిర్ణయాన్ని త్వరగా తెలిపితే పదిహేను రోజుల్లో పనులు మొదలు పెడతామని కలెక్టర్ దివాకర్ టీఎస్ చెప్పారు. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన ప్రతిఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుందన్నారు. జిల్లాలో 5వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలోని నిరుపేదల సంక్షేమానికి మంత్రి సీతక్క ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. పాఠశాలల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలపై మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతనిప్పుల భిక్షపతి, మండల అధ్యక్షుడు చాంద్పాషా, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపై వ్యాపారులు ప్రజలకు రవాణా ఇబ్బందులు కలిగించే విధంగా వ్యాపారాలు కొనసాగించడం సరికాదని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పత్తిపల్లిరోడ్డు, ఆస్పత్రి పరిసరాల్లో వ్యాపారా సముదాయాలను ఆయన బుధవా రం సందర్శించారు. వ్యాపారాలు కొనసాగించే విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. రోడ్డు పక్కన ప్రజలు నడిచే ఫుట్పాత్పై ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించాలని యజమానులకు సూచించారు. లేని పక్షంలో దుకా ణాదారులకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.మున్సిపల్ కమిషనర్ సంపత్ -
క్లోరినేషన్, బ్లీచింగ్ పనులు తప్పనిసరి
వెంకటాపురం(కె): మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్లోరినేషన్, బ్లీచింగ్ పనులు తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్తో కలిసి అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో బుధవారం, శుక్రవారం డ్త్రెడే తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు స్వయం సహాయక సంఘం సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత లేని ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు, రోడ్లు, డ్త్రెనేజీలు పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో జీపీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు తరలించి వర్మి కంపోస్టు తయారు చేయాలని సూచించారు. ప్రతీ వాటర్ ట్యాంక్ను వారానికి ఒక్కసారి బ్లీచింగ్తో శుభ్రం చేయించి వెయ్యి లీటర్లకు 100 గ్రాముల బ్లీచింగ్ కలపాలన్నారు. నిల్వ నీటిలో ఆయిల్బాల్స్ వేయాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు రాకుండా పైపులైన్ లీకేజీలను మరమ్మతులు చేయించాలని వివరించారు. పంచాయతీల్లో వారం రోజుల పాటు చేయాల్సిన పనుల ప్రణాళికలను రూపొందించారు. మినీగురుకులంలో తనిఖీ వాజేడు: మండల కేంద్రంలోని జంగాలపల్లిలోని బాలికల మినీ గురుకులాన్ని డీపీఓ దేవరాజు ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడుతో కలిసి తనిఖీ చేశారు. మినీ గురుకులం పరిసరాలు, వంట గది, కూరగాయల గదిని పరిశీలించారు. ఎన్నికల పనులు పూర్తిచేయాలి ఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుందని, పంచాయతీ కార్యదర్శులు ఎన్నికలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవాలని డీపీఓ దేవరాజ్ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలింగ్ బూత్లు, ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. దోమల నివారణకు మందులు పిచికారీ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
వెంకటాపురం(ఎం): ఆయిల్పామ్ పంటల సాగుతో రైతులు తక్కువ పెట్టుబడి అధిక లాభాలు పొందవచ్చని, ఆయిల్పామ్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్.దివాకర సంబంధిత అధికారులకు సూచించారు. మండల పరిధిలోని జవహర్నగర్లోని కేఎన్ బయోసైన్స్ ఆయిల్పామ్ నర్సరీని కలెక్టర్ బుధవారం సందర్శించారు. నర్సరీ విస్తీర్ణం.. మొక్కల పెంపకం.. నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కలు తదితర వివరాలను జిల్లా ఉద్యాన అధికారి సంజీవరావును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది రైతులకు నర్సరీలో ఒక సంవత్సరం వయస్సు గల మొక్కలను పెంచి ఇవ్వగా, ఇంకా 1.17 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒక మొక్క 1.2 మీటర్ ఎత్తులో, 12 ఆకులతో నాణ్యత కలిగిన మొక్కలు అందుబాటులో ఉన్నాయని సంజీవరావు కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆయిల్పామ్ పంట సాగుపై అవగాహన కల్పించి ఎక్కువ ఎకరాల్లో మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ నిబంధనల మేరకు నాణ్యమైన మొక్కలను రైతులకు సకాలంలో అందించాలన్నారు. నర్సరీ, కంపెనీ నిర్వాహకులకు కలెక్టర్ దివాకర పలు సూచనలు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సరీ ఇన్చార్జ్ ఉద్యాన అధికారి జే.శ్రీకాంత్, నర్సరీ నిర్వాహకుడు కర్ణాకర్, ములుగు, వెంకటాపూర్ ఆయిల్పామ్ కంపెనీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నవీన్ నాయక్, జైన్ డ్రిప్ కంపెనీ ప్రతినిధి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం ఎస్ఎస్తాడ్వాయి: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మేడారంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. మలేరియా, డెంగీ వ్యాధులను నియంత్రించాలన్నారు, ఫీవర్ సర్వే చేపట్టాలని సూచించారు. ఇంటింటినీ సందర్శించి నిల్వ నీటిలోని దోమల లార్వాను తొలగించాలని సూచించారు. ప్రతీ జ్వర పీడితుడికి మలేరియా, డెంగీ ఆర్డిటీ రక్త పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శిబిరంలో వైద్యసేవలు పొందిన వారి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సిబ్బందికి వివరించారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ములుగు రూరల్ : అట్రాసిటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ టీఎస్ దివాకర పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అట్రాసిటి కేసుల నమోదు, పురోగతి, బాధితులకు పరిహారం అందే విధంగా అధికారులు కృషిచేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను సందర్శిస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన బోరుబావులను అర్హులైన లబ్ధిదారులకు అందించామని వెల్లడించారు. అలా గే మానిటరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ప్రాధాన్యం కల్పించాలన్నారు. అనంతరం డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. అట్రాసిటి కేసుల విషయంలో త్వరగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్, చార్జిషీట్ పరిష్కారం అయిన కేసులు, విచారణలో ఉన్న కేసులను వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జన్ను రవి, రాంబాబు, నరేందర్, కృష్ణ, రామునాయక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. యువతపైనే దేశ భవిష్యత్.. దేశ భవిష్యత్ యువత, విద్యార్థులపైనే ఉందని కలెక్టర్ దివాకర అన్నారు. మండలంలోని బండారుపల్లి మోడల్ స్కూల్ పీఎంశ్రీ పథకంలో ఉత్తమ పాఠశాల ఎంపిక కావడంతో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని కోరారు. పీఎంశ్రీ నిధులను పాఠశాల అవసరాల నిమిత్తం ఖర్చు చేసి జిల్లాలో ఉత్తమ పాఠశాలగా నిలిపినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ దేవకి, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఇందులో భాగంగా పాఠశాలకు మంజూరైన సంగీత పరికరాలను విద్యార్థులకు అందించారు. మండల విద్యాశాఖ అధికారి తిరుపతి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు అర్షం రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు వెంకటాపురం(ఎం) : ఫర్టిలైజర్ దుకాణదారులు ఎరువుల కృత్తిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దివాకర హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, కొనుగోలు, అమ్మకాల రిజిస్టర్ను పరిశీలించారు. ఎరువులు, పురుగు మందులను రైతులకు సరిపడ అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ అధికారులు నిరంతరం ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని సూచించారు.అనంతరం మండల కేంద్రంలోని, పాలంపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రామప్ప సరస్సును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ఏఓ శైలజ, ఎంఈఓ ప్రభాకర్, ఇరిగేషన్ డీఈ రవీందర్రెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి శ్రీకాంత్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్ దివాకర -
హేమాచలుడి హుండీ ఆదాయం రూ.9లక్షలు
మంగపేట : మండలంలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.9.18లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ పరకాల డివిజన్ పరిశీలకులు నందనం కవిత పర్యవేక్షణలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు కానుకలను లెక్కించారు. ఆరు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని భక్తులు హుండీల్లో స్వామివారికి సమర్పించారు. అర్చకులు శేఖర్శర్మ, పరిచారిక ఈశ్వర్చంద్, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, లక్ష్మీనారాయణ, అజయ్, నవీన్, గణేష్, హైదరాబాద్, ఏటూరునాగారం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరుకు చెందిన శ్రీవారి సేవాబృదం భక్తులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతపై కేంద్ర బృందం సర్వే
ఏటూరునాగారం : మండలంలోని కోయగూడ ఎల్లాపురం గ్రామపంచాయతీలో గల ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సెంట్రల్ టీం మంగళవారం తనిఖీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఆలయాలు, ఆస్పత్రులను బృందం సభ్యులు పరిశీలించారు. తడి,పొడి చెత్తసేకరణ, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలను పరిశీలించి మండల పంచాయతీ అధికారి కుమార్ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, గ్రామ పంచాయతీ సంయుక్తంగా పనులు చేసి స్వచ్ఛత ఉండే విధంగా చూడాలని సభ్యులు పేర్కొన్నారు. ఈ తనిఖీలో కేంద్ర బృందం ఆర్ఐలు రాజు, రేవంత్, ఎస్బీఎం జిల్లా అధికారి మైమునిషా, ఐఈసీ షర్పునిషా, ఏపీఓ చరణ్రాజు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఎఫ్ఏ ముకుందరావు, కారోబార్ పాల్గొన్నారు. -
ఉత్తమ ఎస్సైగా శ్రీకాంత్రెడ్డి
ఎస్ఎస్తాడ్వాయి : తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్రెడ్డి జిల్లా ఉత్తమ ఎస్సైగా నిలిచి ఎస్పీ డాక్టర్ శబరీశ్ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శబరీశ్, ఎస్సై శ్రీకాంత్రెడ్డికి ప్రశంసపత్రం అందజేశారు. కేసుల విచారణ, అక్రమ పశువుల రవాణా, గుడుంబా కేసుల నమోదు, ఓవర్ లోడ్ లారీపై కేసులు, డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ ఉల్లంఘన, పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీ, సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలను నివారణ, గంజాయి నివారణ కోసం గ్రామాల్లో అవగాహన కార్యమ్రాలను నిర్వహించడంతో జిల్లా ఉత్తమ ఎస్సైగా మూడో సారి ప్రశంసపత్రం అందుకున్నారు. ఎస్పీ శబరీశ్, డీఎస్పీ రవీందర్లకు ఎస్సై శ్రీకాంత్రెడ్డి కృత్ఞతలు తెలిపారు. -
తనిఖీలు లేవు..!
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నాణ్యతను పట్టించుకోవాల్సిన అధికారులు తనిఖీలు చేయకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యం నడుస్తోంది. పదుల సంఖ్యలో అనుమతులు ఉండగా వందల సంఖ్యలో హోటల్, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. నాణ్యత పాటించకపోవడంతో ఏమైనా తినాలంటే ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది లేమితో సతమతం జిల్లాలో హోటళ్లు, ఇతర దుకాణాలలో పర్యవేక్షణ కరువైంది. జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ ఫుడ్సెఫ్టీ డిగ్జినేటెడ్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. ఈ కార్యాలయంలో గెజిటెడ్ ఆఫీసర్, ఇద్దరు ఫుడ్ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరు. కలెక్టరేట్లో కార్యాలయం ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. జిల్లా వైద్యారోగ్యశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రోగ్రాం అఽధికారికి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్గా ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండేళ్లుగా ఒక్క కేసు కూడా లేదు.. జిల్లా ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతుంది. మూడు నాలుగేళ్ల క్రితం వరకు 10లోపు కేసులను నమోదు చేశారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో యథేచ్ఛగా కల్తీ చేసిన వస్తువులను విక్రయాలు చేపడుతూ, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తినుబండరాలు అమ్ముతున్నా పట్టించుకునే నా థుడే కరువయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతి పదుల్లో.. జిల్లాలో సుమారు 500 వరకు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, 10 వరకు రెస్టారెంట్లు, 5 వరకు దాబాలు ఉన్నాయి. భూపాలపల్లి, కాటారం, గణపురం, టేకుమట్ల, చిట్యాల, కాళేశ్వరం వంటి ప్రాంతాలతో పాటు ప్రతీ మండల కేంద్రంలో హోటళ్లు, బేకరీలు, మెస్లు మొదలైనవి వందల సంఖ్యలో నడుస్తున్నాయి. జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా కేంద్రంలో కొన్ని తప్ప ఇతర ప్రాంతాల్లో నడిచే షాపులకు ఎటువంటి అనుమతులు పొందకుండా యఽథేచ్ఛగా నడిపిస్తున్నారు. హోటల్ యజమానుల ఇష్టారాజ్యం గెజిటెడ్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇన్చార్జ్లే..పై ఫొటోలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్. ప్రధాన రహదారిపై నిబంధనలు పాటించకుండా హోటల్లో అపరిశుభ్ర వాతావరణంలో తినుబండరాలు తయారు చేస్తున్నారు. ఈగలు వచ్చి తయారు చేసిన ఆహార పదార్థాలపై వాలుతున్నాయి. వాహనాల దుమ్ము ధూళి సైతం నూనెలో పడుతుంది. అపరిశుభ్ర వాతావరణమే కాకుండా రెండు మూడు రోజుల పాటు వినియోగించిన నూనెలోనే పదార్థాలను తయారు చేస్తున్నారు. నూనె పూర్తిగా నల్ల రంగుగా మారి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇక్కడ ఒక దగ్గరే కాదు.. ప్రతిచోటా ఇదే పరిస్థితి ఉంది. -
కేసుల దర్యాప్తును త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్ : దొంగతనాలు, ఆర్థిక నేరాల్లో ఫిర్యాదుదారుల కేసుల దర్యాప్తును త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, అనుమానితుల గురించి ఆరా తీస్తూ మానిటరింగ్ చేయాలని తెలిపారు. కోర్టు ట్రయల్లో ఉన్న కేసులపై ఆరా తీసి ప్రతి కేసులో సాక్షులకు, ముద్దాయిలకు కోర్టు సమాన్లు అందించాలని ఆదేశించారు. నేరస్తులకు శిక్షపడే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలను పోలీస్ స్టేషన్ల వారిగా అడిగి తెలుసుకున్నారు. వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. మహిళలపై జరిగే నేరాల్లో వీలైనంత త్వరగా విచారణ చేసి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత ఆన్లైన్ బెట్టింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్కుమార్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, సీఐలు శ్రీనివాస్, రమేశ్, దయాకర్, ఎస్సైలు పాల్గొన్నారు.ఎస్పీ డాక్టర్ శబరీష్ -
రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభిస్తాం..
వెంకటాపురం(కె) : మండలకేంద్రం నుంచి ఎదిర గ్రామపంచాయతీ వరకు ఉన్న ఆర్అండ్బీ రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభిస్తామని ఆశాఖ ఎస్ఈ రాఘవరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలో ఆయన పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీరభద్రవరం, బోదాపురం వంతెనలను పరిశీలించామని చెప్పారు. కుక్కతోగు వంతెనను పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. 40ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలను తనిఖీ చేస్తామని, ఆర్అండ్బీ రోడ్లు గుంతలమయంగా మారిందని మరమ్మతుల కోసం రూ.2కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటాపురం పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు ఎస్ఈని కలిసి మండలంలో రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట ఈఈ సాంసింగ్, డీఈ వెంకటరమణ తదితరులు ఉన్నారు.ఆర్అండ్బీ ఎస్ఈ రాఘవరెడ్డి -
ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025ఉమ్మడి వరంగల్ జిల్లాకు రూ.617.21 కోట్లు ● 589 కిమీ 49 హ్యామ్ రోడ్ల ఉన్నతీకరణకు నిధులు ● హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్ల పర్యవేక్షణ ● పల్లెల నుంచి పట్టణాలకు మెరుగవనున్న కనెక్టివిటీ ● హైదరాబాద్ను కలిపే జిల్లా, మండల కేంద్రం రోడ్లకు నిధులు సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లతో ఉమ్మడి వరంగల్కు కొత్త కళ రానుంది. హ్యామ్ మొదటి దశలో తెలంగాణ వ్యాప్తంగా 17 ప్యాకేజీల వారీగా మొత్తం 373 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ.6,478.33 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఆర్అండ్బీ ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లకు 588.65 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.617.21 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 49 రోడ్లకు మహర్దశ పట్టనుండగా.. 588.65 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో రోడ్లను ఉన్నతీకరించనున్నారు. ‘హ్యామ్’ విధానం ఇలా.. రోడ్లు ఎక్కడెక్కడంటే.. హ్యామ్ విధానంలో మేజర్ రోడ్లయితే 60 శాతం నిధులను ఉమ్మడి జిల్లాలో టెండర్ల ద్వారా పనులు పొందిన గుత్తేదారు సంస్థలే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. మిగిలిన 40 శాతం నిధులు కూడా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రోడ్లను అభివృద్ధి చేసేందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు సర్కిళ్ల పరిధిలో 49 పనులకు రూ.617.21 కోట్లు కేటాయించగా.. గ్రామీణ ప్రధాన రహదారుల ఉన్నతీకరణతో పాటు పల్లెల నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ ఉన్న రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఇదిలా ఉండగా 49 రోడ్లలో ప్రధానంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హైదరాబాద్ నుంచి హనుమకొండ రోడ్డు (ఓల్డ్ ఎన్హెచ్–163) (జీడబ్ల్యూఎంసీ పరిధి)ను 14 కిమీ మేర అభివృద్ధి చేసి, విస్తరించనున్నారు. కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు (కాజీపేట, ఫాతిమానగర్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ, పెద్దమ్మగడ్డ) 9.47 కిమీ రోడ్డుకు సుమారు రూ.20 కోట్లకు పైగా మంజూరు చేశారు. ఆత్మకూరు నుంచి పరకాల వయా శాయంపేట, పెద్దకోడెపాక వరకు ఒకటి 3 కిమీ, మరోటి 11 కిమీ కలిపి మొత్తం 14 కిమీ ఉన్నతీకరించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట టు కక్కిరాలపల్లి (వర్ధన్నపేట, నందనం, రాంనగర్, కక్కిరాలపల్లి) వరకు 14.50 కిమీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. స్టేషన్ఘన్పూర్లో మడికొండ నుంచి నారాయణగిరి (ఎలుకుర్తి, ముప్పారం, నారాయణగిరి) రోడ్డు 10.50 కిమీ మేర బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రం–నెల్లికుదురు రోడ్డు (కేసముద్రం, భూక్యారాం తండా, మహమూద్పట్నం, ఇనుగుర్తి, చిన్న నాగారం, తారాసింగ్బాయి తండా, భూక్యా దణ్యతండా, సపావత్ తండా, భోజ్యతండాను కలిపే)ను 20.60 కిమీ మేర అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మొదటి విడతలో మొత్తం 49 రోడ్ల కోసం రూ.617.21 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఈ నిధులతో మండలం, జిల్లా కేంద్రాలను కలిపే పల్లెరోడ్లు కళకళలాడనున్నాయి. న్యూస్రీల్సర్కిళ్ల వారీగా పనులు, నిధులు, పర్యవేక్షణ..రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఒక వరుస రోడ్లను రెండు వరుసలుగా విస్తరించేందుకు కూడా నిధులు మంజూరు చేశారు. అయితే కొత్తగా ఏర్పడిన సర్కిళ్ల వారీగానే టెండర్లు, పనుల పర్యవేక్షణ జరుగుతోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లు ఉండగా.. హనుమకొండకు 394.42 కిమీ మేర 39 రోడ్ల ఉన్నతీకరణ కోసం రూ.467.90 కోట్లు కేటాయించారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో 10 రోడ్లను 194.23 కిమీ మేర అభివృద్ధి, విస్తరణ కోసం రూ.249.31 కోట్లు విడుదల చేశారు. హ్యామ్ రోడ్లపై ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ సూచన మేరకు ఆర్అండ్బీ సర్కిల్ వారీగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వుల జారీ చేసింది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి నేషనల్ హైవేలకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆ రోడ్లకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టు సంస్థలు టోల్ప్లాజా ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇక్కడ చేపట్టే హ్యామ్ రోడ్లకు మాత్రం టోల్ట్యాక్స్ అనేది ఉండదు. ఆ రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా సదరు గుత్తేదారు సంస్థే అగ్రిమెంట్ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు. -
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ములుగు రూరల్: మధ్యాహ్న భోజన కార్మికులు తమ పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సోమవారం డీఈఓ చంద్రకళకు, కలెక్టరేట్లో వినతి పత్రాలను సీఐటీయూ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ 9నెలలుగా పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. కట్టెల పొయ్యి స్థానంలో గ్యాస్ సిలెండర్లను మంజూరు చేయాలన్నారు. పెరిగిన మెస్ చార్జీల ప్రకారం బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, రాజకుమారి, సవరూప, కమల, రాధ తదితరులు ఉన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ములుగు రూరల్: ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యామ్బాబు అన్నారు. ఎంఎస్పీ ముఖ్యకార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల పింఛన్ రూ.6వేలు, వితంతువుల పింఛన్ రూ.4వేలు తక్షణమే బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చేనెల 13న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన దివ్యాంగుల సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్, రమేష్, రవీందర్, జాషువా, నరేష్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ను కలిసిన రైస్మిల్లర్లు ములుగు రూరల్: ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నూతనంగా ఎన్నికై న కల్యాణిని సోమవారం రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోషియేషన్ సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట పీఏసీఎస్ చైర్మన్ ఎల్లారెడ్డి, ఎలగందల మోహన్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి ములుగు రూరల్: విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రీయ బాలల సంరక్షణ కేంద్రం డాక్టర్ మల్లికార్జున్ సూచించారు. జిల్లా కేంద్రంలోని మాదవరావుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. విద్యార్థినుల కు పౌష్టికాహారం అందించాలని సూచించారు. -
వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల పేరిట టోకరా
ఖమ్మంక్రైం: ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న తనకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో అందరూ తెలుసునని నమ్మించిన ఓ వ్యక్తి స్టాఫ్నర్స్, ఏఎన్ఎం ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు చేసిన ఘటన వెలుగు చూసింది. ఖమ్మం కవిరాజ్నగర్ ప్రాంతానికి చెందిన అనిల్ కొన్నేళ్ల క్రితం తన పేరు కేతన్ అని, ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నానంటూ ఖమ్మంతో పాటు జిల్లాలోని వాజేడు ప్రాంతానికి చెందిన పలువురితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో వాజేడుకు చెందిన మహిళకు మొదట ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పించాడు. ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవడమే కాక ఆ మహిళ ద్వారా మరికొందరితో పరిచయం పెంచుకున్నాడు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆయన వైద్య, ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల మేర వసూలు చేశాడు. అయితే, నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోగా అనిల్ ఇంటికి వెళ్లి అడితే కుటుంబీకులు తమకు సంబంధం లేదని బదులిచ్చారు. దీంతో చేసేదేం లేక బాధితుల్లో కొందరు సోమవారం ఖమ్మం టూటౌన్ పోలీపులను ఆశ్రయించారు. కాగా, బాధితుల్లో ఎక్కువ మంది గిరిజనులే ఉండగా.. విచారణ చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు. రూ.4లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూళ్లు బాధితుల్లో ఖమ్మం, ములుగు జిల్లా వాసులు -
గిరిజన దర్బార్కు వినతుల వెల్లువ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనులు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఓ వసంతరావు వినతులను స్వీకరించారు. గిరిజనులు అందజేసిన 57 దరఖాస్తులను పీఓ ఆదేశాల మేరకు పరిశీలిస్తామని తెలిపారు. గిరిజన దర్బార్కు వచ్చిన పలు వినతుల వివరాలు ఇలా ఉన్నాయి.. వాజేడు మండలంలో జిల్లా డీఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి పనిచేసిన బిల్లులు ఇప్పించాలని గిరిజనుడు ఏపీఓకు మొరపెట్టుకున్నారు. ఎస్ఎస్తాడ్వాయి మండలం కాల్వపల్లిలో సమ్మక్క–సారలమ్మ ఆదివాసీ మ్యూజియంలో అటెండర్గా పనిచేస్తున్నానని, ఏడాది వేతనం రావడం లేదని విన్నవించారు. భూపాలపల్లి జిల్లాలోని గుర్రంపేటలోని జీసీసీలో గోదాం అసిస్టెంట్గా, డ్రైవర్గా నాలుగేళ్లుగా పనిచేస్తున్నానని, తనను విధుల నుంచి తొలగించారని దీనిపై విచారణ చేపట్టి ఉద్యోగం ఇప్పించాలని బాధితుడు కోరారు. ఏటూరునాగారం మండలం గొత్తికోయగూడెం ఆదివాసీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు ఐటీడీఏ ద్వారా కేటాయించాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం గ్రామంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి విష పురుగులు, దోమలు వస్తున్నాయని, శానిటేషన్ పనులు చేయించడం లేదని గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో డీడీ పోచం, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, డీడీ అనిల్, పోగ్రాం ఆఫీసర్ మహేందర్, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్ మోహన్రెడ్డి పాల్గొన్నారు.స్వీకరించిన ఏపీఓ వసంతరావు -
మహితాపురం జలపాతం సందర్శన
వెంకటాపురం(కె): మండల పరిధిలోని మహితాపురం జలపాతాన్ని వెంకటాపురం, వాజేడు మండలాల ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జలపాతం వద్ద అటవీశాఖ సిబ్బంది విధుల వివరాలపై ఆరా తీశారు. జలపాతానికి రావడానికి అడవిలో అనేక మార్గలు ఉన్నాయని దీంతో సందర్శకులను జలపాతం వద్దకు రాకుండా నిలువరించలేకపోతున్నామని వివరించారు. ఈ విషయంపై స్పందించిన ఆయన జలపాతం వద్దకు రాకుండా గ్రామాల్లోని ఉమ్మడి పాయింట్ వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకులను నియంత్రించడానికి పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. -
డ్రగ్స్ నిషేధానికి యువత సహకరించాలి
ఏటూరునాగారం: డ్రగ్స్ నిషేధానికి యువత సహకరించాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీనివాస కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన అభయ మిత్ర కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా ప్రజలలో చైతన్యం తేవడానికి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత ను భాగస్వాములు చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. వాటికి అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని సూచించారు. గ్రామాలలో అక్రమంగా ఎవరైనా గంజాయి వంటి మత్తు మాదక ద్రవ్యాలను సరఫరా చేసినా, విక్రయించినా అటువంటి వారి ఆచూకీ తెలిపితే వారికి రూ.10 వేలు బహుమతి అందజేస్తామన్నారు. యువత పోక్సో చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ విధిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్ పాల్గొన్నారు. సమాచారం అందిస్తే రూ.10వేలు బహుమతి ఎస్పీ శబరీశ్ -
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025
చూడడానికి డిఫరెంట్గా ఉండే వైట్ టైగర్ (శరణ్, 13 సంవత్సరాలు మగ) పుట్టి పెరిగింది భాగ్యనగరంలోనే. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో 2012,అక్టోబర్ 20న జన్మించింది. శరణ్ తండ్రి పేరు బద్రి, తల్లి పేరు సురేఖ అని అటవీ రేంజ్ అధికారి మయూరి తెలిపారు. శరణ్ బరువు (180 కేజీలు) వరకు ఉంటుంది. దీని జీవితకాలం 15 ఏళ్లు. త్వరలో ఆడ తెల్లపులిని కూడా జూకి తీసుకొస్తామని వారు పేర్కొన్నారు.లీటర్ మిల్క్.. కేజీ చికెన్ ప్రతీరోజు ఉదయాన్నే రెండు ఎగ్స్, లీటర్ మిల్క్, కిలో చికెన్ను శరణ్కు అందిస్తారు. ఆర్ఓ ప్లాంట్ వాటర్నే తాగిస్తారు. పులి ఆరోగ్యంగా ఉండేందుకు ఎలక్ట్రాల్ పౌడర్, కాల్షియం సప్లిమెంట్స్తో కూడిన ద్రావణాన్ని అందిస్తారు. అనంతరం ఎన్క్లోజర్లోకి వదులుతారు. సాయంత్రం జూ క్లోజ్ అయ్యే వరకు ఎన్క్లోజర్లో సందర్శకులు వీక్షించేందుకు ఉంచుతారు. భారీ ఆహార్యం.. నడకలో రాజసం.. గాండ్రింపులో గాంభీర్యం.. దాన్ని చూస్తే ఏ జంతువైనా పారిపోవాల్సిందే. అలాంటి తెల్ల పులి(శరణ్)ని సందర్శకుల కోసం ఇటీవల వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్క్కు తీసుకొచ్చారు. క్రూర మృగాల్ని చూడాలన్నా.. చాలా మందికి భయమే కానీ.. ఆ భయం వెనుక వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా దాగి ఉంటుంది. అందులో భాగంగానే శరణ్ (వైట్ టైగర్) గురించి ‘సాక్షి’ కొన్ని ఆసక్తికర అంశాలు సేకరించింది. నేడు (మంగళవారం) అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మన తెల్ల పులిపై ప్రత్యేక కథనం. – న్యూశాయంపేటజూలో సందడే.. సందడి వరంగల్ నగరంలోని కాకతీయ జూలాజికల్ పార్క్లో సందర్శకులకు తెల్ల పులి కనువిందు చేస్తోంది. ఈ నెల 18వ తేదీన తెల్లపులిని బోనులో నుంచి ఎన్క్లోజర్లోకి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు. ఈ తెల్లపులిని చూసేందుకు నగర వాసులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు ఆసక్తిచూపుతున్నారు. బోన్లెస్ అంటే ఇష్టం..తెల్లపులి (శరణ్) బోన్లెస్ మాంసాన్ని ఇష్టంగా తింటుంది. అందులో భాగంగా వాటికి ప్రత్యేకంగా బీఫ్ మాంసాన్ని రోజుకు 6 కేజీల చొప్పున పెడుతున్నామని జూ పార్క్ వెటర్నరీ డాక్టర్ కార్తికేయ తెలిపారు. జంతు ప్రదర్శన శాలలో తెల్ల పులులకు బీఫ్ను మాత్రమే అందిస్తారని ఆయన పేర్కొన్నారు. వీటిలో లివర్, హార్ట్, స్ల్పీన్ ఇష్టంగా తింటుందని తెలిపారు. ప్రతీ శనివారం తెల్లపులిని ఉపవాసం ఉంచుతామని, ఆరోగ్య రీత్యా ఇది అవసరమని డాక్టర్ చెబుతున్నారు. ఆ రోజంతా లవణాలతో కూడిన నీటిని అందిస్తామంటున్నారు. శరణ్ అని పిలిస్తే చాలు.. ఉదయం నుంచి రాత్రి వరకు బాగోగులు చూసే టైగర్ కేర్ టేకర్ మూర్తి శరణ్ అని పిలిస్తే చాలు.. పరిగెత్తుకుంటూ వస్తుంది వైట్ టైగర్. అతను పెట్టిన ఆహారాన్ని తింటుంది. పులికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ దాని ఆలనాపాలన చూస్తూ కేర్టేకర్ అన్నీ గమనిస్తూ ఉంటాడు.● తెల్లపులి పుట్టి పెరిగింది హైదరాబాద్ జూ లోనే.. ● డేట్ ఆఫ్ బర్త్ : 2012, అక్టోబర్ 20 ● బోన్లెస్ మటన్ అంటే ఇష్టం.. శనివారం రోజంతా ఫాస్టింగ్ ● కాకతీయ జూ పార్కులో ప్రత్యేక ఆకర్షణ ● ఆసక్తికర విషయాలు వెల్లడించిన జూ పార్క్ అధికారులు -
అసంక్రమిత వ్యాధులపై దృష్టి పెట్టాలి
ఏటూరునాగారం: అసంక్రమిత వ్యాధులపై దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసంక్రమిత నియంత్రణ విభాగంలోని రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలన్నారు. కేన్సర్ రోగులలో బ్రెస్ట్, సర్వైకల్ కేన్సర్ రోగులకు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయాలని తెలిపారు. వివరాలను ఎన్సీడీ పోర్టల్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. టైపు–1 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వాలని తెలిపారు. నాలుగో విడత అసంక్రమిత వ్యాధుల నియంత్రణ స్క్రీనింగ్ పరీక్షలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి గోపాల్రావు -
బాలల భవితకు భరోసా
ఫలితాలిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ ● ప్రతిఏటా జనవరి, జూలైలో అధికారుల తనిఖీలు ● 2019 నుంచి 850 మంది చిన్నారులకు విముక్తిములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలతో చదువు మానేసి బాల కార్మికులుగా మారిన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నిరుపేద కుటుంబాలలో పిల్లలు హోటళ్లు, కిరాణం దుకాణాలు, ఇటుక బట్టీలలో, బైక్ మెకానిక్ల వద్ద పనులు చేస్తున్న బాల కార్మికులను గుర్తించి వెట్టిచాకిరి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మేరకు ప్రతిఏటా అధికారులు జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా శిశు సంక్షేమ, పోలీస్ శాఖ, చైల్డ్ హెల్ప్లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూ 18ఏళ్ల లోపు వయస్సు కలి గిన పిల్లలను, చదువు మానేసి కార్మికులుగా మారిన వారి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకున్న బాల కార్మికుల పరిస్థితులను బట్టి వారికి అందుబాటులో ఉండే పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి చదువు చెప్పిస్తున్నారు. 2019 నుంచి గుర్తించిన బాల కార్మికుల వివరాలు సంవత్సరం మాసం గుర్తించిన బాలకార్మికులు2019 జనవరి 19 జూలై 58 2020 జనవరి 138 జూలై 30 2021 జనవరి 190 జూలై 47 2022 జనవరి 129 జూలై 30 2023 జనవరి 32 జూలై 32 2024 జనవరి 63 జూలై 33 2025 జనవరి 47 జూలై 02 -
ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు
ఏటూరునాగారం: ఎగువప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చే వాగులు, గోదావరి వరదలతో లోతట్టు ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి, ఎఫ్సీడీఏ కమిషనర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలిసి భారీ వర్షాలు, వరదలు, సంసిద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ వరదలతో నష్టం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో గోదావరి, జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. ఆయా ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, జంపన్నవాగు, రామప్ప, లక్నవరం పరీవాహక ప్రాంతాలతో పాటు కాల్వలు, చెరువులు, ఇతర జలాశయాలలో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహా ఆయా శాఖలు సన్నద్ధమై సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ముంపు ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి వరదలపై ఆయనకు వివరించారు. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం, ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించి పలు వివరాలపై ఆరా తీశారు. వరదలు ముగిసే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను ఆదేశించారు. అలాగే చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పీఓ చిత్రామిశ్రా మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ఏపీఓ వసంతరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఇరిగేషన్ ఈఈ జగదీశ్, డీఈఈ నవీన్, తహసీల్దార్ జగదీశ్వర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శులు రమాదేవి, శ్రీనివాస్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జంపన్నవాగు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై దృష్టిపెట్టాలి కొండాయి బ్రిడ్జి, రామన్నగూడెంలోని గోదావరి పరిశీలన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి శశాంక -
సొంత ఊరు లేదు.. కొత్త ఊరు రానివ్వరు
హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని గోదావరి ముంపు గ్రామం కొండాయి ప్రజలు సొంత గ్రామంలో ఉండలేక, పొరుగు గ్రామస్తులు రానివ్వక దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. అధికారులు ఈ గ్రామాన్ని ఖాళీ చేయాలని చెప్పటంతో సోమవారం గ్రామస్తులు ఊరు ఖాళీ చేసి జంపన్నవాగు దాటి దొడ్ల అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారు. సుమారు 25 కుటుంబాలు కర్రలు, కవర్లతో తాత్కాలికంగా గుడిసెలు నిర్మించుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వాటిని తొలగించి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో మాత్రమే గుడిసెలు వేసుకోవాలని స్పష్టంచేశారు. మరోవైపు దొడ్ల గ్రామస్తులు సైతం కొండాయి ప్రజలు ఇక్కడికి రావద్దని అడ్డుకున్నారు. కాగా, కొండాయి వద్ద కూలిపోయిన వంతెనను పరిశీలించేందుకు వచ్చిన ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంకను సోమవారం కొండాయి ప్రజలు అడ్డుకుని తమకు పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్ల గ్రామ ప్రజలు కూడా శశాంకను అడ్డుకుని కొండాయి గ్రామస్తులకు వేరేచోట భూమి కేటాయించాలని నిరసన తెలిపారు. -
పంటలకు ప్రాణం..
వెంకటాపురం(ఎం): వర్షాధారంగా సాగుచేసిన వేలాది ఎకరాల మెట్ట పంటలకు నాలుగు రోజులు కురిసిన వర్షాలు ప్రాణం పోశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పొలాలన్నీ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. వరుణుడి కరుణతో జిల్లాలో వరినాట్లు సైతం జోరందుకున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయ్యారు. ప్రస్తుత వానకాలం సీజన్లో జిల్లాలో పత్తి 27,143 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 22,156 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. మొక్కజొన్న 6,009 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటివరకు అంచనాను మించి 8,365 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మిరప పంట 6,900 ఎకరాల్లో సాగు కానుండగా ఇప్పటివరకు రైతులు మిరపనారు పోశారు. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షంతో పత్తి పంటకు జీవం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మరంగా వరినాట్లు నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో అన్నదాతలు వరినాట్లపై దృష్టిసారించారు. జిల్లాలో ప్రధానంగా వరిపంటను రైతులు 1,30,117 ఎకరాల్లో వరిసాగు అవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటివరకు 17,598 ఎకరాల్లో వరినాట్లు రైతులు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూముల్లో వర్షపునీరు నిలవడంతో రైతులు పొలాలను సిద్ధం చేసుకొని వరినాట్లు వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి వరిసాగుపై అన్నదాతలు ప్రధానంగా దృష్టి పెట్టారని అధికారులు వెల్లడిస్తున్నారు. 120 చెరువులు, కుంటలకు మత్తళ్లు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో 805 చెరువులు, కుంటలు ఉండగా సుమారు 120 చెరువులు, కుంటలు మత్తళ్లు పడినట్లు ఇరిగేషన్ డీఈ రవీందర్రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా చెరువులు, కుంటలకు గండ్లు పడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప చెరువులోకి దేవాదుల నీటిని వారం రోజులుగా రెండు మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు దేవాదుల నీటితో 35 అడుగుల నీటిసామర్థ్యం గల రామప్ప సరస్సు ప్రస్తుతం 25 అడుగులకు చేరినట్లు వివరించారు. రామప్ప సరస్సు నుంచి ధర్మసాగర్ చెరువుకు నీటిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గాక ఎరువులు వేయాలి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తితో పాటు ఆరుతడి పంటలకు మేలు చేస్తాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వరిసాగు జిల్లాలో పెరగనుంది. ఆగస్టు చివరి వారం వరకు వరినాట్లు వేసుకోవచ్చు. వర్షాలు తగ్గిన తర్వాత పంటలకు ఎరువులు వేయాలి. – సురేష్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారివర్షాలతో ఆరుతడి, మెట్ట పంటలకు జీవం జిల్లాలో 805 చెరువులకు 120 చెరువుల మత్తళ్లు వ్యవసాయ పనుల్లో రైతన్న బిజీబిజీ ముమ్మరంగా వరినాట్లు -
సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్/మొగుళ్లపల్లి: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించి రైతు కూలీలతో మాట్లాడారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రం, జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతీ గురుకులాన్ని సందర్శించి అక్కడి సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, వచ్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ను గెలిపించాలని కార్మికులను కోరారు. కాంగ్రెస్ ఆగడాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. త్వరలోనే జిల్లాకో పార్టీ లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో 3,400 పల్లెలను జీపీలుగా, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసినవాటిని చెప్పుకోవడంలో విఫలం అయినందునే ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు. మరోమారు అలా జరుగకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రతీ గ్రామంలో ఇంటింటికి తెలుపాలని సూచించారు. గురుకులాలను గాలికొదిలిన ప్రభుత్వం జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం.. కేసులకు జంకొద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటనగండ్రకే ఎమ్మెల్యే టికెట్... తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు సోదరుడిగా ఉన్న సిరికొండ మధుసూదనాచారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసన సభాపతి పదవి ఇచ్చారన్నారు. అంతేకాకుండా కేబినెట్ హోదాకు సమానమైన శాసన మండలి ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చూసుకుంటారని, ఆయనకే టికెట్ అని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. గండ్ర నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గోరీల మీద మాదిరిగా ఇక్కడి ఎమ్మెల్యే శిలాఫలకాలపై ఫొటోలు వేయించుకుంటున్నాడని అన్నారు. తాను భూకబ్జా చేశానని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, స్థానిక నాయకులు కటకం జనార్దన్, గొర్రె సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
దేవాదులలో పంపింగ్ నిలిపివేత
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్ త్రీలోని నాలుగు మోటార్ల పంపింగ్ను అధికారులు ఆదివారం నిలిపివేశారు. కొన్ని రోజుల నుంచి పంపింగ్ వద్ద మూడు ఫేజ్ల్లో 10 మోటార్లు ఉండగా అందులో ఫేజ్ త్రీలో నాలుగు మోటార్లు, ఫేజ్ టూలో రెండు మోటార్లను ఆన్ చేసి, ఆరు మోటార్లతో పంపింగ్ను అధికారులు కొనసాగించారు. ఫేజ్ త్రీలోని నాలుగు మోటార్లను ఆప్చేసి ఫేజ్ టూలోని రెండు మోటార్లతో 494 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గొల్లబుద్దారాపు రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నట్లు దేవా దుల డీఈ శరత్బాబు తెలిపారు. ప్రస్తుతం పంపింగ్ వద్ద 80.85 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. సమ్మక్క సాగర్ గేట్ల ఎత్తివేత.. సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 6,05,340 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి 6,04,846 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద 83 మీటర్లకు 80.20 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. -
కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం
ఎస్ఎస్తాడ్వాయి: కాంగ్రెస్ పాలనలోనే పేదలకు తగిన న్యాయం జరుగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మేడారంలో పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మండల ఉపాధ్యక్షుడు నాగేశ్వర్రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాపోలు సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం నార్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్లో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మేడారం జంపన్నవాగు వద్ద టూరిజం పర్యాటకంగా తీర్చిదిద్దుతమని చుట్టూ పక్కల ఉన్న గ్రామాల్లోని యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇస్రం దయాకర్, కొడిశాల నవీన్, జీడీ అనిల్, గంధం రమేష్, తాలూకా వెంకన్న, మిరియాల తిరుపతి, దోమల రాజు కుమార్, నాగల్లి కుమార్, కన్నెబోయిన మహేష్, చీమల నితిన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చర్ప రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేడారంలోని ఊరట్టం స్తూపం వద్ద నూతనంగా నిర్మించిన కాక సారయ్య పెట్రోల్ బంక్ సమ్మక్క– సారలమ్మ కోమలి ఫిల్లింగ్ సేషన్ను బంక్ యజమాని, సారలమ్మ పూజారి కాక సారయ్య, బంక్ మేనేజర్ ఽశ్రీధర్ కిరణ్లతో కలిసి మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించి పలు సూచనలు చేశారు. నాటువేసే కూలీలకు ‘రెయిన్’ కవర్లు ములుగు రూరల్: వరినాట్లు వేస్తున్న కూలీలకు మంత్రి సీతక్క అందించారు. ఆదివారం తాడ్వాయి మండల పర్యటన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ సమీపంలో కూ లీలు నాట్లు వేస్తుండగా వెళ్లి వారిని అప్యాయంగా పలకరించారు. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం కూలీలకు రెయిన్ కవర్లను అందించారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
రామప్పలో సండే సందడి
వనదేవతలకు మొక్కులువెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో సండే సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆదివారం సూర్యభగవానుడి అలంకరణలో రామలింగేశ్వరస్వామి పర్యాటకులకు దర్శనమిచ్చాడు.ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. -
జలపాతాల సందర్శన నిలిపివేత
ములుగు రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని జలపాతాల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. జిల్లాలోని బొగత, ముత్యంధార, కొంగల, మామిడిలొద్ది జలపాతాలకు పర్యాటకులు వెళ్లకూడదని సూచించారు. జలపాతాల వద్ద వరద ఉధృతి కారణంగా భద్రత దృష్ట్యా సందర్శనను నిలిపి వేసినట్లు తెలి పారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘిస్తే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని వివరించారు.వర్షాల దృష్టా తక్షణ సహా యం కోసం టోల్ ఫ్రీ నంబర్ 18004257109లో సంప్రదించాలని సూచించారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో అధికారులు అందుబాటులో ఉంటారనిని వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ఉధృతి ఎక్కువైతే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పర్యాటకులు సహకరించాలని అన్నారు. వరదల కారణంగా ప్రాణనష్టం జరుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. -
జీపీఓ, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతం
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో గ్రామపాలన అధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షలు ప్రశాంతగా ముగిశాయి. ఈ మేరకు ఆదివారం పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మహేందర్జీ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పాలన అధికారి పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించగా 27 మంది అభ్యర్థులకు గాను 26 మంది ఒకరు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. సర్వేయర్ పరీక్షలు రెండు సెషన్లుగా నిర్వహించామని వివరించారు. రాత పరీక్షకు 80 మంది అభ్యర్థులకు గాను 71 మంది అభ్యర్థులు హాజరు కాగా 9 మంది గైర్హాజరయ్యారని వివరించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పోలీసు బందోబస్తు మధ్య పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి, సంబందిత అధికారులు పాల్గొన్నారు. -
ఇక.. భూసేకరణ వేగవంతం
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో పరిహారం విషయమై ఇప్పటికే డిస్టిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ చర్చించింది. వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887గా నిర్ణయించింది. పాత ఎయిర్ స్ట్రిప్నకు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లు కేటాయించింది. అందుకు శుక్రవారం పరిపాలన అనుమతులను మంజూరు ఇవ్వడంతో ఇక భూసేకరణ వేగవంతం కానుంది. కాగా, 50 శాతంమందికి పైగా మంది రైతులు తమ కన్సెంట్ (అంగీకార పత్రం) తెలపడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండానే భూసేకరణ జరుగుతుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రూ.205 కోట్లు కేటాయించిన జీఓ ఆధారంగా ఇప్పుడు బడ్జెట్ కేటాయించారంటున్నారు. మూడు జిల్లాలను అనుసంధానించేలా... కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూసేకరణ అవసరం. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ దిగి మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు ఆటంకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వరంగల్లోనే నేరుగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని భావించింది. అలాగే, ఉత్తర తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన కరీంనగర్తోపాటు ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు మామునూరు విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించేలా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్–కరీంనగర్ మధ్య 80 కిమీ మేర ఎన్హెచ్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. వరంగల్ –ఖమ్మం నేషనల్ హైవే ప్రస్తుత రద్దీకి అనుగుణంగా లేదు. నల్లగొండ జిల్లా ప్రజలను ఓరుగల్లుతో అనుసంధానించేందుకు వరంగల్–దంతాలపల్లి–సూర్యాపేట వరకు రెండు వరుసల ఎన్హెచ్ ఉంది. దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అలాగే, వరంగల్ నుంచి 15 కిమీ దూరంలో ఉన్న మామునూరుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట నుంచి రేడియల్ రోడ్లు నిర్మించాలి. నగర ఇన్నర్, ఔటర్ రింగురోడ్లను ఎయిర్పోర్టుతో అనుసంధానిస్తారు. పర్యాటకం, ఐటీ పరిశ్రమలకు బూస్ట్.. ● మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మాదిరిగానే భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి భక్తులు, సందర్శకులు పెరుగుతారు. ● టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణలో భాగంగా ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కై టెక్స్ మాదిరిగానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపారసంస్థలు ముందుకు వస్తాయి. దీంతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది. ● మామునూరు సమీప ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది.మరో రూ.112 కోట్లు అవసరమే.. విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 240 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు 13 ఎకరాల (61,134.5 చదరపు గజాల) వ్యవసాయేతర భూమి సేకరించాల్సి ఉంది. వ్యవసాయ భూమికి రూ.288 కోట్లు, వ్యవసాయేతర భూమికి రూ.29,87,61,858 భూనిర్వాసితులకు చెల్లించాలి. మొత్తంగా రూ.317 కోట్లు అవసరం అవుతుండగా.. మరోదఫా ప్రభుత్వం రూ.112 కోట్లు అవసరం. భూసేకరణ పూర్తయి, ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే 150 నుంచి 186 మంది ప్రయాణించే ఏ–320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.మామునూరు విమానాశ్రయంపై సర్కారు నజర్ తాజాగా 253 ఎకరాల కోసం రూ.205 కోట్లకు పాలనాపరమైన అనుమతులు విమానాశ్రయానికి 50 శాతం మందికిపైగా రైతులు అంగీకారం మరో రూ.112 కోట్లు అత్యవసరం -
ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్గా శశాంక
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్గా ఐఏఎస్ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్కు 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కమిషనర్గా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా పని చేశారు. ఇటీవల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కమిషనర్గా నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దరఖాస్తుల ఆహ్వానం ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్– 06, అసోసియేట్ ప్రొఫెసర్ –17, సీని యర్ రెసిడెంట్–39, ట్యూటర్ –04 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. మెడికల్ కళాశాల, అనుబంధ ఆస్పత్రిలో పని చేయడానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 01, 02వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. మరింత సమాచా రం కోసం https// gmcmulugu. org వెట్సైట్ సందర్శించాలని కోరారు. పీఏసీఎస్ కార్యాలయం తనిఖీ ఎస్ఎస్తాడ్వాయి: మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘాన్ని జిల్లా సహకార అధికారి మాలోత్ సర్థార్సింగ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల బస్తాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎరువుల బస్తాల సరఫరా గురించి సీఈఓ స్వాతిని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ ఎరువులను పంపిణీ చేయాలన్నారు. ఎరువుల పంపిణీలో రైతులను ఇబ్బందులకు గురి చెయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్గౌడ్, డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి, రంగరబోయిన జగదీశ్, సిబ్బంది ఉన్నారు. ఎరువుల షాపు తనిఖీ ఏటూరునాగారం: మండలంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని జిల్లా సహకార సంఘం అధికారి సర్దార్సింగ్ శక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఎరువులు విక్రయించారా.. లేదా.. అని పరిశీలించారు. ఎరువుల లోడ్తో ఎంత యూరియా నిల్వ వచ్చింది.. ఎంత విక్రయించారని రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. మరో లోడు యూరియా వస్తుందని, అర్హులైన రైతులకు మాత్రమే అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ గౌరి, పీఏసీఎస్ అధ్యక్షుడు కూనూరు అశోక్ పాల్గొన్నారు. అథ్లెటిక్స్ పోటీల ఎంపిక ములుగు రూరల్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించే జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ అండర్ 8, 10, 12, 14, 16, 18, 20సంవత్సరాల లోపు బాలబాలికలు, పురుషులు, మహిళల ఎంపిక పోటీల్లో పాల్గొన్నాలని అసోసియేషన్ సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలు మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఆగస్టు 03, 04 తేదీల్లో హనుమకొండలోని జేఎన్స్లో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జావెలిన్త్రోలో ఎంపికై న వారు ఆగస్టు 07వ తేదీన జనగామ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 09 గంటలకు హాజరు కావాలని తెలిపారు. -
ఇందిరమ్మకు చేయూత
లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ రుణాలు మంగపేట: ఇల్లు లేని పేదలకోసం ప్రభుత్వం ఇందిరమ్మ పథకం పేరుతో ఇళ్లను మంజూరు చేయడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సొంతింటి కల సాకారం అవుతుండడంతో ఆయా కుటుంబాలు సంబురపడుతున్నాయి. జిల్లాలో 9 మండలాలతోపాటు నూతనంగా ఏర్పడిన మల్లంపల్లిలో కలిపి మొత్తం 5,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరి చేసింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన గ్రామాల్లో పనులు 50 నుంచి 75 శాతం వరకు పూర్తికావచ్చాయి. లబ్ధిదారులకు ఎంసీపీ రుణాలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన మహిళా స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని సభ్యులు ఇంటి నిర్మాణం కోసం రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఎంసీపీ(మైక్రో క్రెడిట్ ప్లాన్) ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకుని సంఘ సభ్యుల తీర్మానం మేరకు బ్యాంకు నుంచి రూ.లక్ష అప్పు తీసుకున్న లబ్ధిదారు రూపాయి వడ్డీతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున 29 నెలలు చెల్లించే అవకాశం కల్పించారు. దీంతో ప్రభుత్వం ఇళ్ల మంజూరు చేయడంతోపాటు ఇంటి నిర్మాణానికి బ్యాంకులో రుణం తీసుకుని సులబ పద్దతిలో అప్పు చెల్లించే వెసులుబాటు కల్పించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మరంగా సాగుతున్న నిర్మాణ పనులు దశాబ్దాల కాలం నుంచి పక్కా ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక పూరిగుడిసెలు, రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్న నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలులోకి తెచ్చి అభయాన్ని ఇచ్చిందని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మంజూరు పత్రాలను పొందిన లబ్ధిదారులు వర్షాకాలం అయినప్పటికీ త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి కొత్త ఇంటిలో చేరాలనే ఆశతో బ్యాంక్ లింకేజీ రుణాలు తీసుకుని పనులను చేయిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం లబ్ధిదారులకు బిల్లులు సైతం చెల్లిస్తుండంతో ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు లోన్ ముమ్మరంగా నిర్మాణ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు -
పెరుగుతున్న గోదావరి
ములుగు రూరల్: లో లెవల్ వంతెన పై నుంచి ప్రవహిస్తున్న బొగ్గులవాగుకొండాయి వద్ద పడవలో ప్రయాణిస్తున్న ప్రజలుఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని రామన్నగూడెం వద్ద గోదావరి నది క్రమంగా పెరుగుతోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం 12.50 మీటర్ల నీటి మట్టంతో గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా గోదావరి శనివారం సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉండడంతో ఇరిగేషన్ అధికారులు కరకట్టకు ఉన్న షట్టర్లను శుక్రవారం సాయంత్రం మూసివేశారు. వరద నీరు గ్రామాల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పడవ ప్రయాణమే దిక్కు.. మండలంలోని కొండాయి వద్ద బ్రిడ్జి లేకపోవడంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, ఐలాపురం గ్రామాల ప్రజలు పడవలోనే ప్రయాణించి జంపన్నవాగును దాటుతున్నారు. ముసురుగా వర్షాలు పడుతుండడంతో వాగు ఉధృతి తగ్గలేదు. అలాగే ఎలిశెట్టిపల్లి వద్ద పడవల ద్వారా ప్రజలను, రైతులను దాటిస్తున్నారు. మండల కేంద్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలు ఉండడంతో జంపన్నవాగు ఉధృతి వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలను వినియోగించుకొని అవసరాలను తీర్చుకుంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గులవాగు ములుగు రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని సర్వాపూర్–జగ్గన్నగూడెం గ్రామాల మధ్యలోని బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా శుక్రవారం బొగ్గుల వాగు లో లెవల్ వంతెన పైనుంచి ప్రవహించింది. దీంతో ప్రజలు వాగు దాటకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాగుల్లో తగ్గని వరద ఉధృతి కరకట్ట గేట్లు మూసివేత -
జిల్లాలో వివిధ బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు పొందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు
మండలం లబ్ధిదారులు రుణగ్రస్తులు రుణం(రూ.లో) మంగపేట 564 126 1,35,65,000 ఏటూరునాగారం 285 95 97,00000 కన్నాయిగూడెం 282 73 49,10,000 వెంకటాపురం(కె) 387 83 61,55,000 వాజేడు 838 159 13,00000 ఎస్ఎస్ తాడ్వాయి 510 59 47,97,000 గోవిందరావుపేట 464 115 1,22,10,000 వెంకటాపురం(ఎం) 270 122 1,31,20,000 ములుగు, మల్లంపల్లి 675 142 1,34,70,000 -
అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందించాలి
ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ టీఎస్ దివాకర సూచించారు. మల్లంపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అంగన్వాడీ చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వపు ప్రాథమిక విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రాల్లో నెలవారీ సెలబస్ను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. టీచింగ్ లెర్నింగ్ మెటిరియల్ ఉపయోగించి చిన్నారులకు విద్యా బోధన చేపట్టాలని అన్నారు. క్రమం తప్పకుండా చిన్నారుల ఎత్తు, బరువులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కేంద్రానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారంపై అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలను ఆస్పత్రికి రెఫర్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ తుల రవి, సీడీపీఓ శిరిష, సూపర్వైజర్ కమురునిసాబేగం, అంగన్వాడీ టీచర్లు మల్లింకాంబ, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి సీజనల్ వ్యాధులు వాప్తి చెందకుండా అరికట్టాలని కలెక్టర్ దివాకర అన్నారు. మల్లంపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వలను పరిశీలించారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. విధుల్లో వైద్యులు నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే జ్వరపీడితులకు ఏఏ పరీక్షలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి ప్రజలు ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వస్తున్నారనే వివరాలపై ఆరా తీశారు. ఆశా కా ర్యకర్తలు ఫీవర్ సర్వే చేపట్టాలని అన్నారు. దోమల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. డాక్టర్ శ్రవణ్కుమార్, ఆయుష్ డాక్టర్ సంధ్య, ఫార్మసిస్టు ఉషారాణి, ఆరోగ్య కార్యకర్తలు మంజుల, వసంత, ఆశా కార్యకర్తలు సుధారాణి, రేణుక, రజిత, సుజాత పాల్గొన్నారు. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వెంకటాపురం(ఎం): వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి ఒంటేరు దేవరాజ్ పేర్కొన్నారు. ఎంపీడీఓ రాజు, ఎంపీఓ శ్రీనివాస్తో కలిసి మండల కేంద్రంలో చేపడుతున్న శానిటేషన్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. హెల్త్ సబ్సెంటర్, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో స్పెషల్ శానిటేషన్ పనులు చేపడుతున్నట్లు వివరించారు. గ్రామాల్లోని అంతర్గత రహదారులపై నీరు నిలవకుండా డ్రెయినేజీలను ఎప్పటికపుడు సిబ్బందిచే శుభ్రపరుస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రామప్ప సరస్సును సందర్శించి సరస్సు నీటిమట్టంతోపాటు తూముల పరిస్థితిని పరిశీలించామన్నారు. పర్యాటకులు చెరువులోకి దిగకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. డీపీఓ వెంట పంచాయతీ కార్యదర్శులు రేవతి, చందూలాల్, కారోబార్ వెంకటరమణ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.ములుగు డీపీఓ దేవరాజ్ -
రాతపరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు రూరల్: ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న గ్రామ పరిపాలన అధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ స్క్రీనింగ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాలలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పరిపాలన అధికారి పరీక్షకు 26 మంది అభ్యర్థులు హాజరవుతారని అన్నారు. లైసెన్స్ సర్వేయర్ రాత పరీక్ష, ప్రాక్టికల్స్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంటల వరకు, 02 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య పనులు, మంచినీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. పరీక్ష కేంద్రం సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, సూపరింటెండెంట్ శివకుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు
● ఎస్పీ శబరీశ్ వెంకటాపురం(ఎం): గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలతో పాటు రిసెప్షన్ సెంటర్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ అనంతరం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 5 ఎస్ విధానం అమలుపై తెలుసుకున్నారు. ప్రతీ వర్టికల్కు ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు రికార్డు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. అనంతరం విచారణలో ఉన్న కేసులను, కంప్యూటర్ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. మిస్సింగ్ కేసుల విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పని పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ములుగు సీఐ సురేష్, ములుగు ఎస్హెచ్ఓ రాజు తదితరులు ఉన్నారు. -
వరదలతో అప్రమత్తం
ఏటూరునాగారం: జిల్లాలోని వాగులు, గోదావరి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతుందని ప్రజ లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర సూచించారు. మండల పరిధిలోని దొడ్ల, కొండాయి బ్రిడ్జి వద్ద జంపన్నవాగు వరద ఉధృతిని కలెక్టర్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజులు కురిసిన వర్షానికి జంపన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగుపై గతంలో నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిందని తెలి పారు. కొండాయి గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు, వైద్యాధికారులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అత్యవసర పనుల కోసం బోటు అందుబాటులో ఉందని, అదనంగా రెండు బోటులు గు రువారం సాయంత్రానికి వస్తాయన్నారు. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు బోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు నాలుగు బోట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. అదే విధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదా వరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బోట్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధికారులు అందుబాటులో ఉండాలి మండలాల్లోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులతో పాటు మిగతా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించే ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రూంలో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు, తహసీల్దార్ జగదీశ్వర్, ఆర్ఐ కిరణ్కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎరువుల విక్రయ కేంద్రం తనిఖీ ఏటూరునాగారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న ఎరువుల విక్రయ కేంద్రంలోని రికార్డులు తప్పకుండా ఉండాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి పీఏసీఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిల్లు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లు బుక్కులను పరిశీలించారు. అనంతరం గోదాములో నిల్వ చేసి ఉన్న విత్తనాలు, ఎరువులు, మందులను పరిశీలించారు. అర్ధమయ్యేలా పాఠాలు బోధించాలి గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. మండల పరిధిలోని పస్రాలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను గురువారం కలెక్టర్ సందర్శించారు. టీచర్ల వివరాలతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం క్లాస్ రూంలకు వెళ్లి విద్యార్థులతో పలు అంశాలు పైన మాట్లాడారు. అందరికి యూనిఫామ్స్, నోట్ బుక్స్ వచ్చాయా అంటూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర కొండాయిలో జంపన్నవాగు ఉధృతి పరిశీలన టోల్ఫ్రీ నంబర్ 18004257109 -
రామదాసు స్ఫూర్తితో ప్రజాఉద్యమాలు
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గోవిందరావుపేట: రామదాసు స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో వీరపనేని రామదాసు వెంకటసుబ్బమ్మల 5వ వర్థంతి సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ సీనియర్ నాయకుడు గుండు సత్యనారాయణ జెండా ఆవిష్కరించి, ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని కమ్మ సంఘం ఫంక్షన్హాల్లో సోమా మల్లారెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామదాసు స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి జైలు జీవితం గడిపాడని తెలిపారు. కృష్ణా జిల్లాలో గన్నవరం తాలుకాలో కమ్యూనిస్టు పార్టీలో సుందరయ్యతో కలిసి పని చేశాడని తెలిపారు. అక్కడి నుంచి గోవిందరావుపేట కు వచ్చిన తర్వాత కూడా ఉద్యమాలను బలోపేతం చేశారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో సీపీఎం జిల్లాలో నాలుగు జెడ్పీటీసీలు 30ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి సాంబశివ పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్స్
జనగామ : ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలు చేస్తూ ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారుస్తోంది. ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, కనీస వసతి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం.. కొత్తగా ఏఆర్(అగ్మెంటెడ్ రియాల్టీ), వీఆర్(వర్చువల్ రియాల్టీ) ల్యాబోరేటరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో మొదటి విడత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 పీఎం శ్రీ పాఠశాలలను ఎంపిక చేశారు. బోధన.. ప్రయోజనాలిలా.. ● ఏఆర్, వీఆర్ ల్యాబ్లతో ఆస్ట్రోనమీ (ఖగోళ శాస్త్రం), రెండవ ప్రపంచ యుద్ధం, గుండె పనితీరు, మానవ శరీరంలోని అవయవాల కదలికలు, నాటి చరిత్రలు (హిస్టరీ) తదితర సబ్జెక్టుల వారీగా బోధన చేసే సమయంలో విద్యార్థులు ప్రత్యక్ష అనుభూతికి లోనవుతారు. ● దిగువ స్థాయి పిల్లవాడినుంచి బాగా చదువుకునే విద్యార్థి వరకు ఏఆర్, వీఆర్ బోధన పరికరాలతో టీచర్ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. ● విద్యార్థులు గుండె, కణాల నిర్మాణం వాటి విధులు, జీవశాస్త్ర, ఆస్ట్రానమీ లాంటి ఫిజిక్స్, గణిత, గతంలోకి వెళ్లి హిస్టరీ పాఠాలను ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ టెక్నాలజీలను ఉపయోగించి వీఆర్ ద్వారా వాటిలోకి ప్రవేశించి స్వీయ అనుభవంతో నేర్చుకుంటారు. ● పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతీ పాఠశాలకు 10 ఏఆర్, వీఆర్ పరికరాలు,ఒక బీన్ బ్యాగ్,ఒక చా ర్జింగ్ ట్రాలీ, ఒక టాబ్,ఒక టీచర్ సపోర్టింగ్ ట్యా బ్,ఒక స్టోరేజ్ కేస్,1కేవీఏ యూపీఎస్ పరికరాలను ల్యాబ్లో అమర్చనున్నారు. ● 5 నుంచి 10 తరగతి వరకు జనరల్ సైన్స్, గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాన్ని బోధించడానికి, విద్యార్థులు నేర్చుకోవడానికి అనుకూలంగా ఏర్పా టు చేస్తారు. 5డీ మోడ్లో.... వీఆర్ హెడ్గేర్ రాష్ట్ర పాఠ్యాంశాలకు మ్యాప్ చేసిన కంటెంట్తో లోడ్ చేశా రు. దీని ద్వారా విద్యార్థులు ఇంటరా క్టివ్ , 5డీ(ప్రస్తుత టెక్నాలజీ) మోడ్లో పాఠాలను నేర్చుకోగలుగుతారు. గుండె పనితీరును బోధించే సమయంలో ఉపాధ్యాయులు బోర్డుపై హృదయ రే ఖాచిత్రాన్ని గీసి చూపించాలి. వీఆర్ ఆధారిత అ భ్యాసం విషయంలో హెడ్గేర్ను ఉపయోగించడంతో త్రీడీలో హృదయం తెరపై కనిపిస్తుంది. మనిషి ఆర్గాన్ పనితీరును విద్యార్థులు చూడడంతోపాటు సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎం శ్రీ ఎంపిక చేసిన పాఠశాలల్లోనే.. ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన స్కూల్స్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తోంది. పరికరాలు సైతం వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి గైడ్లైన్స్ జారీ చేశారు. మెటీరియల్ వినియోగం, నిర్వహణ కోసం పాఠశాలలోని ఫిజికల్ లేదా బయాలజీ టీచర్ను నియమిస్తారు. ఏజెన్సీ ద్వారా ఏఆర్, వీఆర్ ల్యాబ్ల పరికరాలు వచ్చిన వెంటనే హెచ్ఎంలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. – బొమ్మన బోయిన శ్రీనివాస్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, జనగామఉమ్మడి జిల్లాలో 10 పాఠశాలలు ఎంపిక ప్రతీ సబ్జెక్టుతో అనుసంధానం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి ఉమ్మడి జిల్లాలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లా మండలం ఉన్నత పాఠశాల హనుమకొండ ఐనవోలు ఒంటిమామిడిపల్లి హనుమకొండ కాజీపేట మడికొండ భూపాలపల్లి భూపాలపల్లి గొల్ల బుద్దారం జనగామ అర్బన్ ధర్మకంచ మహబూబాబాద్ మహబూబాబాద్ బాలికల మహబూబాబాద్ తొర్రూరు తొర్రూరు మహబూబాబాద్ గూడూరు పొనుగోడు మహబూబాబాద్ దంతాలపల్లి దంతాలపల్లి వరంగల్ నర్సంపేట నర్సంపేట, బాలికల వరంగల్ రాయపర్తి కొండూరు -
నీరు వృథా కాకుండా చర్యలు
ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి చేరిన నీటిని ఆయకట్టు రైంతాంగానికి పూర్తి స్థాయిలో సాగు నీరు అందేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిత్యం ప్రాజెక్టులు, చెరువులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు నీరు వృథాగా పోకుండా ఉండేందుకు మరమ్మతులు చేస్తున్నాం. తమ అనుమతి లేకుండా ఎవరైనా తూముల షట్టర్లు తెరిచినా, ద్వంసం చేసినా వారిపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – వలీం మహ్మద్, ఇరిగేషన్ ఏఈఈ, మంగపేట -
ప్రాజెక్టులకు జలకళ
మంగపేట: జిల్లాలోని ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారాయి. పలుచోట్ల చెరువులు మత్తళ్లు పోస్తుండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. తొలుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు వర్షాలు ముఖం చాటేయడంతో ఆందోళన చెందిన రైతన్నలు మంగళవారం రాత్రి నుంచి బుధవారం మద్యాహ్నం వరకు దంచికొట్టిన వానకు నీరు లేని పంట పొలాల్లో వరదలు పారాయి. చెరువులు, కుంటలతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లోనిమత్తడి పోస్తుండటంతో అన్నదాతలు వరినాట్లు వేయిస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధాన జలాశయాల్లోకి భారీగా చేరిన నీరు జిల్లాలో ప్రధాన జలాశయాలు అయిన నూగూరు వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టు, మంగపేటలోని మల్లూరువాగు మద్యతరహా ప్రాజెక్టు, గోవిందరావుపేట లోని లక్నవరం, వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప వంటి జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆయా ప్రాజెక్టులు, చెరువుల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సరిపడా నీరు వచ్చి చేరడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. లక్నవరం జలాశయంలోకి 24 అడుగులు గోవిందరావుపేట: మండలంలోని లక్నవరం సరస్సులోకి వరద నీరు పోటెత్తింది. 34 అడుగుల సామర్థ్యం కలిగిన సరస్సుకు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో 24 గంటల వ్యవధిలోనే నాలుగు అడుగులు చేరి 24 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. తిరిగి ఇంక వరద పోటెత్తుతుండగా మరో రెండు అడుగులకు నీరు చేరే అవకాశం ఉంది. 24 అడుగుల్లో లక్నవరం జలాశయంజలాశయాల్లో నీటిమట్టం వివరాలుప్రాజెక్టు మొత్తం ప్రస్తుతం ఆయకట్టు నీటిమట్టం ఎకరాలుమల్లూరువాగు ప్రాజెక్టు 27 ఫీట్లు 21.3 ఫీట్లు 7,500 పాలెం ప్రాజెక్టు 136 మీటర్లు 132 మీటర్లు 10,125 లక్నవరం 33 ఫీట్లు 24 ఫీట్లు 8,794 రామప్ప 35 ఫీట్లు 22 ఫీట్లు 5,180 ఎడతెరిపి లేని వర్షంతో నిండుకుండల్లా చెరువులు, కుంటలు అన్నదాతల్లో హర్షం నీరు వృథాగా పోకుండా అధికారులు పర్యవేక్షించాలని విజ్ఞప్తినాలుగు గేట్లు ఎత్తి.. దిగువకు నీరు వెంకటాపురం(కె): మండల పరధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు ప్రాజెక్టు జలకళ సంతరిచుకుంది. పాలెం ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు చేరటంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. -
అధికారులు పర్యవేక్షించాలి..
రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి మత్తడి పోయడం సంతోషంగా ఉంది. చెరువుల శిఖం భూములను కబ్జా చేసి పంటలను సాగు చేస్తున్న కొందరు ఇప్పటికే నాట్లు వేయగా మరి కొందరు సాగు చేసేందుకు సిద్దం చేసిన భూములు నీట మునిగి ఉన్నాయి. దీంతో ప్రతిఏటా కబ్జాదారులు చెరువుల షట్టర్లను ద్వంసం చేసి చెరువుల్లోని నీటిని బయటకు వెల్లగొడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు చెరువులు. కుంటలు, ప్రాజెక్టులలో నీరు వృదాగా పోకుండా ఆయకట్టు రైతులకు ఉపయోగ పడే విదంగా పర్య వేక్షించాలి. – నూతులకంటి కృష్ణ, బోరునర్సాపురం, రైతు -
గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
గోవిందరావుపేట: ముంపు గ్రామాల్లో 15 రోజులలోపు డెలవరీకి ఉన్న గర్భిణులను వెంటనే సురక్షిత ప్రాంతానికి లేదా పీహెచ్సీలోని బర్త్ వెయిటింగ్హాల్లోకి తరలించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్ లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. జ్వరాలు ఉన్న గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. మలేరియా వ్యాధుల నియంత్రణలో భాగంగా కిట్లను, కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా వ్యాధి నిర్ధారణ చేసే ఆర్డీటీ కిట్లను, మందులను మూడు నెలలకు సరిపోయే విదంగా ఉండేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి చంద్రకాత్, ప్రోగ్రాం ఆధికారి శ్రీకాంత్, సూపర్వైజర్ హేమలత, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళల సంక్షేమానికి పెద్దపీట
ములుగు రూరల్: ప్రజా ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.200 కోట్ల ఉచిత ప్రయాణాలకు చేరుకున్న సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చేపట్టిన సంబురాలకు మంత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పాల్గొన్నారు. మహిళలకు సీట్లు పంపిణీ చేసి బహుమతులు అందజేసి సన్మానించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం, ఉచిత కరెంటు, రూ. 500 గ్యాస్, వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు. రూ.200 కోట్ల ఉచిత ప్రయాణాలతో మహిళలకు రూ. 6,700 కోట్లు ఆదా అయ్యాయన్నారు. ఉచిత ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అందిస్తుంటే కొంత మంది అవహేళన చేస్తున్నారన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలి పారు. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఆర్ఎం విజయభాను పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వెంకటాపురం(కె): జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నష్టం వాటిళ్లకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ఎదిర పంచాయతీ పరిధిలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలోని రాళ్లవాగును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. వచ్చే మూడు రోజులు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాగులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వర్షాల కారణంగా శిథిల భవనాలు, పాత ఇళ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట బోట్, రిస్క్టీమ్ ఏటూరునాగారంలో అందుబాటులో ఉందని తెలిపారు. గర్భిణులను స్థానిక ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ములుగు రూరల్: భారీ వర్షాల కారణంగా వరద ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో వరదల కారణంగా ప్రజలు ప్రాణ, ఆస్తినష్టం కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వరద ముప్పు ప్రాంతాల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయన్నారు. పర్యాటకులు జలపాతాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అఽధికారులు 24గంటలు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 100 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతం ఉందని తెలిపారు. గోదావరి నీరు గ్రామాల్లోకి రాకుండా ఏటూరునాగాం, మంగపేట ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణ పనులు సాగుతున్నాయని వివరించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాదులపై వైద్యాధికారులు అప్రమత్తం చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు అధికారులు సెలవులపై వెళ్లకూడదని తెలిపారు. జిల్లాను రెడ్జోన్గా వాతావరణశాఖ అధికారులు ప్రకటించారని అన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ వరద ముప్పును ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో నాలుగు బోట్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సైతం సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఉన్నారని అన్నారు. జిల్లాలో 800 చెరువులు ఉన్నాయని ప్రస్తుతం నీటి సామర్థ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అనంతరం ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ వర్షాల కారణంగా 11 ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని ముందస్తుగా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వివిద శాఖ అధికారులు పాల్గొన్నారు. పాఠశాల, వసతిగృహం సందర్శన వెంకటాపురం(కె): మండలంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పీఓ మండల పరిధిలోని ఆలుబాక ప్రభుత్వ పాఠశాలను, ఎస్టీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వసతిగృహం, పాఠశాలలోని కిచెన్షెడ్, కిటికీ మెస్, ఫెన్సింగ్ విరిగిపోవడంతో వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రధాన రహదారి సీసీ అప్రోచ్ ఎస్టీ బాలుర వసతి గృహం, జీపీఎస్ పాఠశాల వరకు ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలో అదనపు గది, మరుగుదొడ్లను మంజూరు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభం ములుగు రూరల్: జిల్లాలోని 20 గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను కేంద్ర బృందం ప్రారంభించిందని అదనపు కలెక్టర్, డీఆర్డీఓ సంపత్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏఎంఎస్ కేంద్ర బృందం సభ్యులు అదనపు కలెక్టర్కు నూల మొక్క అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రత్యేక యాప్ ద్వారా సర్వే నిర్వహించి ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేస్తారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 171 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. ఎంపిక చేసిన 20 పంచాయతీల్లోని 16 ఇళ్లలో సర్వే నిర్వహించనున్నారని తెలిపారు. సర్వేలో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తడి, పొడి చెత్త నిర్వహణ, సానిటేషన్, పరిశుభ్రత తదితర అంశాలను సర్వే చేస్తారన్నారు. గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎస్ బృందం సభ్యులు మధు, రాకేష్, రాజు, వెంకటనారాయణ, ఎస్బిఎం కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
జనజీవనం అతలాకుతలం
మంగపేట: మండల పరిధిలోని భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. బాలన్నగూడెం, అబ్బాయిగూడెం తదితర ప్రాంతాల్లోని వివిధ చెరువులు మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటికి తిమ్మంపేట ఊర చెరువు మత్తడి పోస్తుండడంతో నీటి ఉధృతికి సుమారు 100కు పైగా ఎకరాల్లో నాటు వేసిన వరి పంట నీట మునిగింది. మల్లూరు అత్త చెరువు తూము లీకేజీతో లోతట్టు ప్రాంతంలోని బెస్తగుంపు జనావాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రవీందర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి అక్కడకు చేరుకుని జేసీబీతో నీటిని బయటకు పంపించారు. ఇరిగేషన్ అధికారులు చెరువుల తూము ముందు ఇసుక బస్తాలను అడ్డుగా వేసి లీకేజీ నీటిని బయటకు రాకుండా నియంత్రించారు. అదే విధంగా మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద, బోరునర్సాపురం సమీపంలోని ఉప్పలనర్సయ్య చెరువు వరదనీరు కట్టమైసమ్మ ఆలయం వద్ద ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి పారింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదిక అటవీశాఖ రేంజ్ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు మధ్యాహ్నం వరకు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డు నుంచి గంపోనిగూడెం వరకు ఏటూరునాగారం– బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నిర్మించిన కల్వర్టులను వరద నీరు ముంచేసింది. గంపోనిగూడెంను వరదనీరు చుట్టు ముట్టడంతో ఇళ్లలోకి మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
నీటమునిగిన పొలాలు.. ఇళ్లలోకి చేరిన నీరు
వాజేడు: నీట మునిగిన పంట పొలాలు వాజేడు: మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో జగన్నాథపురం నుంచి వాజేడుకు వచ్చే ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగి పోయింది. వాజేడు, నాగారం, జగన్నాథపురం, మొరుమూరు ఇలా పలు గ్రామాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో తహసీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్నాయుడు, ఆర్ఐ కుమారస్వామి, వాజేడు, పేరూరు ఎస్సైలు సతీష్, కృష్ణ ప్రసాద్ అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు వర్షం సమాచారం అడిగి తెలుసుకుంటూ పరిస్థితిని సమీక్షించారు. జగన్నాథపురంలో వర్షం నీరు భారీగా నిలిచిపోవడంతో కాల్వలను తీయించి బయటకు పంపించారు. అదే విధంగా ముంపునకు గురైన పలు ఇళ్లను పరిశీలించిన అధికారులు ఆయా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపు బాధితులు తమకు సమాచారం అందిస్తే పునరావాస కేంద్రానికి తరలిస్తామని మైక్ ద్వారా ప్రచారం చేశారు. -
ఉప్పొంగిన వాగులు
జోరువానతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ ఏటూరునాగారం: జిల్లాలో రెండురోజులుగా జోరువాన కురుస్తోంది. ఈ మేరకు బుధవారం వెంకటాపురం(కె) మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా వెంకటాపురం(ఎం) మండలంలో నమోదు అయ్యింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఏజెన్సీలోని జంపన్నవాగు ఉప్పొంగి మేడారం, కొండాయి, ఏటూరునాగారం ప్రాంతాల మీదుగా వరద ప్రవహించి గోదావరిలో కలుస్తోంది. కొండాయి వద్ద తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. మంగపేట–ఏటూరునాగారం మధ్యలోని జీడివాగు వద్ద భారీ వృక్షం కూలిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని తొలగించారు. గోదావరి వెంట ఉన్న కరకట్ట గేట్లను ఇరిగేషన్ సిబ్బంది ఎత్తి గ్రామంలోని వర్షపు నీటిని బయటకు పంపించారు.ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా యంత్రాంగం అప్రమత్తం జోరుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించడంతో కలెక్టర్ దివాకర యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాగులు ఉన్న ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే వెంటనే రవాణా నిలిపివేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని పహారా పెట్టాలని సూచనలు చేశారు. పోలీసులు సైతం టీంలుగా ఏర్పడి గోదావరి, వాగులు ఉన్న ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రామన్నగూడెంలోని పుష్కరఘాట్ వద్ద గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 10.23 మీటర్లకు నీటిమట్టం చేరుకొని ప్రవహిస్తోంది. జల వనరుల అధికారులు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ నీటి కొలతల వివరాలను జిల్లా అధికారులకు చేరవేస్తూ అలర్ట్ చేస్తున్నారు. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా విపత్తు జరిగితే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడానికి స్థానిక ఐటీడీఏ పరిధిలోని వైటీసీలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. తెగిన కొండాయి రోడ్డు.. రాకపోకలు బంద్ మండలంలోని కొండాయి–దొడ్ల మధ్యలో ఉన్న మట్టి రోడ్డు జంపన్నవాగు ఉధృతికి తెగిపోయింది. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నేలకూలిన భారీ వృక్షాలు నీటమునిగిన పంట పొలాలు జలగలంచ వాగును పరిశీలించిన మంత్రి సీతక్క పునరావాస కేంద్రాలకు ముంపు ప్రజలుజలగలంచ వాగు పరిశీలన ఎస్ఎస్తాడ్వాయి: పస్రా– తాడ్వాయి మధ్యలోని జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం పరిశీలించారు. వాగుపై బ్రిడ్జి పైనుంచి వందలాది వాహనాల రాకపోకలు నడుస్తుండగా రాకపోకలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు(మిల్లీమీటర్లలో) వెంకటాపురం(కె) 214.5 మంగపేట 119.5 ఏటూరునాగారం 105.3 వాజేడు 82.5 మల్లంపల్లి 51.8 ఎస్ఎస్ తాడ్వాయి 40.5 గోవిందరావుపేట 29.3 ములుగు 6.5 వెంకటాపురం(ఎం) 4.5 -
వెదురు ప్లాంటేషన్కు మొక్కలు సిద్ధం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్లాంటేషన్ కోసం వెదురు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఎన్ఆర్ఈసీఎస్ ఏపీఓ చరణ్రాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని మొక్కలను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. 21వేల మొక్కలను ప్రత్యేకంగా మణిపూర్ నుంచి తెప్పించినట్లు తెలిపారు. ఈ మొక్కలను మహిళా సంఘాల ద్వారా గ్రామాల వారీగా లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు కుటుంబాలకు సంబంధించి ప్రతీ ఏడాది రూ.లక్ష ఆదాయం వచ్చే విధంగా వారిని ప్రోత్సహించనున్నట్లు వివరించారు. ప్లాంటేషన్ ద్వారా నాలుగేళ్ల నుంచి 40 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం రావడానికి ప్రతీ రైతుకి 15 గుంటల భూమిలో 60 మొక్కలు నాటుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వెదురు మొక్కలు నాటే ఉద్దేశం ఉన్న వారందరికీ ఉచితంగా మొక్కలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొక్కలు తీసుకోదలచిన వారు ఉపాధి హామీ జాబ్కార్డు, పట్టా జిరాక్స్, ఆధార్కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏపీఓ చరణ్రాజ్ -
ఆర్టీసీకి మహాలక్ష్మి కళ
నేడు అన్ని బస్డిపోలు, స్టేషన్లలో సంబురాలు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి న సందర్భంగా నేడు(బుధవారం)రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ సంబురాలు జరుపుతోంది. ఈ మేరకు వరంగల్ రీజియన్లోని అన్ని డిపోలు, ప్రధాన బస్ స్టేషన్లలో మేనేజర్లు ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి పథకంపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇప్పటికే వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులో క్రమం తప్పకుండా ప్రయాణించే ఐదుగురు మహిళలను ఎంపిక చేసి సన్మానించనున్నారు. వారికి బహుమతులు అందించనున్నారు. ఈ సంబురాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులను ఆహ్వా నించారు. వరంగల్ బస్స్టేషన్లో జరిగే సంబురాల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. హన్మకొండ: ఆర్టీసీకి మహాలక్ష్మి కళ సంతరించుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ప్రగతి రథ చక్రాలు పరుగులందుకున్నాయి. గతంలో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు సైతం ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు. పథకానికి ముందు 70శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో పథకం అమలయ్యాక 93 శాతానికి పెరిగింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 110 నుంచి 120 శాతానికి చేరుకుంది. మహిళలకు ఫ్రీ జర్నీ కావడంతో వారి కుటుంబ సభ్యులు (పురుషులు) కూడా ఆర్టీసీలోనే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత బస్సు సొమ్మును ఆర్టీసీకి చెల్లిస్తుండడంతో సంస్థ ఆర్థిక లేమి నుంచి క్రమంగా బయటపడుతోంది. వరంగల్ రీజియన్లో ఇలా.. మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం 2023 డిసెంబర్ 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటినుంచి నేటి వరకు వరంగల్ రీజియన్లో 15,41,10,000 మంది మహిళలు ప్రయాణించి రూ.688,35,58,000 చార్జీలు ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నాటి నుంచి నేటి వరకు ఉచిత, చార్జీలు చెల్లించిన ప్రయాణికులు మొత్తం 23,98,67,000 ప్రయాణించగా.. రూ.1401,63,14,000 ఆదాయం వచ్చింది. ఇందులో చార్జీలు చెల్లించిన ప్రయాణికులు 8,57,58,000 ఉన్నారు. వీరి ద్వారా రూ.713,27,56,000 ఆదాయం వచ్చింది. మొత్తం ప్రయాణికుల్లో ఉచిత ప్రయాణం చేసిన వారు 64శాతం మంది ఉన్నారు. వీరి ద్వారా ఆర్టీసీకి 49శాతం ఆదాయం వచ్చింది. చార్జీలు చెల్లించిన వారు 36శాతం ప్రయాణించగా వీరి ద్వారా 51శాతం ఆదాయం వచ్చింది.వరంగల్ రీజియన్లోని డిపోల వారీగా ప్రయాణికులు, ఆదాయం వివరాలు (రూ.లక్షల్లో)...సంస్థకు అనూహ్యంగా పెరిగిన ప్రయాణికులు ఉచిత ప్రయాణంతో 93 శాతానికి పెరిగిన ఓఆర్ ఆర్థికలేమి నుంచి బయటపడుతున్న సంస్థ నేడు రీజియన్ పరిధి అన్ని డిపోల్లో సంబురాలుడిపో మహాలక్ష్మి నాన్ మహాలక్ష్మి ప్రయాణికులు ఆదాయం ప్రయాణికులు ఆదాయం హనుమకొండ 305.68 9658.61 128.93 8351.40 వరంగల్–1 132.63 5541.54 101.14 15325.45 వరంగల్–2 127.35 7818.34 105.23 12972.48 పరకాల 147.91 5920.53 83.28 4221.54 భూపాలపల్లి 144.71 7447.00 77.25 6428.55 జనగామ 226.64 10897.12 112.77 7492.23 మహబూబాబాద్ 138.31 5956.19 68.15 3389.06 నర్సంపేట 173.34 7335.12 98.55 6357.02 తొర్రూరు 144.52 8261.13 82.27 6789.83 -
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
ములుగు రూరల్: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగుపాటుకు గురికాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే పిడుగుపాటుకు సంకేతాలని వివరించారు. పిడుగుపాటుకు గురైన వారు ఎక్కువ శాతం చెట్ల కింది నిలబడడం, విద్యుత్ వైర్లకు అందుబాటులో ఉండడంతో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పిడుగులు పడే సమయంలో లోహపు వస్తువులను వినియోగించడం, నీటిలో ఉండకూడదని వివరించారు. భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల పై కూర్చోవడం, మోకాళ్లపై చేతులు తలపెట్టుకొని ముడుచుకొని కూర్చుంటే పిడుగు పడిన సమయంలో విద్యుత్ ప్రభావం తక్కువగా పడుతుందని వెల్లడించారు. వర్షాల కారణంగా ప్రమాదాలు సంభవించినప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 18004257109 కు సమాచారం అందించాలని కలెక్టర్ దివాకర సూచించారు. -
ఏజెన్సీలో భారీవర్షం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో గోదావరి, వాగులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు అలర్ట్ చేశారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వాగుల వద్ద సిబ్బంది గస్తీ ఉండే విధంగా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా గత నెల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాగులు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలు సురక్షితంగా ఉండే విధంగా సూచనలు, సహాయక చర్యలును చేపట్టారు. పోలీసులు, రెవెన్యూ, ఐటీడీఏ, గ్రామ పంచాయతీల అధికారులు, సిబ్బంది వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు 24గంటలు మానిటరింగ్ చేసేవిధంగా కలెక్టర్ దివాకర ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మంగళవారం ఉదయం కొండాయి వద్ద కురిసిన వర్షానికి మట్టిరోడ్డు బురదరోడ్డుగా మారింది. దీంతో ప్రజలు నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. -
రెండు ఫొటోలు దిగితేనే వేతనం
బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025పర్యవేక్షణ కట్టుదిట్టం ఎన్ఎంఎంఎస్ యాప్లో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసిన ఉపాధి కూలీల అటెండెన్స్ ఫొటోలన్నింటినీ ప్రతిరోజూ జిల్లాలోని 174 పంచాయతీల్లో సెక్రటరీలు వెరిఫై చేసి రిపోర్ట్ను ఎంపీడీఓలకు పంపించాల్సి ఉంది. మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజులో వచ్చిన మొత్తం ఫొటోల్లో కనీసం 20శాతం ఫొటోలు లేదంటే గ్రామానికి రెండు ఫొటోల చొప్పున ఎంపీడీఓ ఆఫీస్లోని ఏపీఓ, కాంట్రాక్ట్ స్టాఫ్, పర్మనెంట్ స్టాఫ్ అదే రోజు వెరిఫై చేసి రిపోర్ట్ను కలెక్టర్, డీఆర్డీఓకు పంపించాలి. జిల్లా స్థాయిలో ముందు రోజు క్యాప్చర్ చేసిన ఫొటోల్లో కనీసం 30 ఫొటోలను కలెక్టర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. డీఆర్డీఏ కాంట్రాక్ట్, పర్మనెంట్ స్టాఫ్ ఒక్కొక్కరు జిల్లా వ్యాప్తంగా వచ్చిన మొత్తం ఫొటోల్లో రోజుకు 10శాతం లేదా 200 ఫొటోలను వెరిఫై చేయాలి. అలాగే గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ రోజు కు 20 ఫొటోలను వెరిఫై చేయాల్సి ఉంటుందని సూచించారు.ఏటూరునాగారం: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొన్నిచోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శ్రామికుల డబ్బులు దోచుకోవడం, మరికొందరు పనికి రాకున్నా అటెండెన్స్ వేయించుకుంటున్నారు. దీంతో ఇకపై పనిచేసే చోట కూలీలకు రెండుసార్లు ఫొటోలు తీసి ఆన్లైన్లో పొందుపర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉపాధి హామీ కూలీల హాజరులో అవకతవకలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీలో పనిచేసేందుకు వచ్చిన కూలీల ఫొటోలను రెండు పూటలా తీయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని 9మండలాల పరిధిలో గల అధికారులు ఈ నెల 14 నుంచి గ్రామాల వారీగా శాంపిళ్లను తీస్తున్నారు. కొత్త అంశాలివే.. ఫొటోల వెరిఫికేషన్ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ నుంచి కమిషనర్ వరకు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మేట్, ఫీల్డ్ అసిస్టెంట్కు సంబంధం లేని ఫొటోని అప్లోడ్ చేశారా.. పని ప్రదేశంలో లైవ్ ఫొటో కాకుండా పాత ఫొటోను అప్లోడ్ చేశారా.. ఫొటోలో ఉన్న వ్యక్తుల సంఖ్య, మస్టర్లో హాజరైన వ్యక్తుల సంఖ్యలో తేడా ఉందా అన్న వివరాలు గమనించాలని సూచించింది. అలాగే ఫొటోల్లో ఉన్న సీ్త్ర, పురుషుల సంఖ్య, మస్టర్లో హాజరైన సంఖ్యతో సమానంగా ఉందా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వేర్వేరు మస్టర్లలో ఒకే వ్యక్తులను క్యాప్చర్ చేశారా అనే వివరాలను వెరిఫై చేయాలని కేంద్రం ఆదేశించింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు షరతులు వర్క్ సాంక్షన్ లేనిది ఏ పని కూడా స్టార్ట్ చేయొద్దు. డిమాండ్ చేసి మస్టర్ మేట్కు ఇచ్చిన తర్వాతనే పని ప్రారంభించాలి. ఒక ఫీల్డ్ అసిస్టెంట్కు రెండు, మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఒకే గ్రామ పంచాయతీలో పని ప్రారంభించాలి. వర్క్సాంక్షన్ లేకుండా పనిచేస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిగే నష్టం ఏమిటంటే ఒక వేళ ప్రమాదవశాత్తు ఎవరికై నా పనిప్రదేశంలో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్కు ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. రెండు ఫొటోలు తీయాలి కూలీలు పనులు చేసే ప్రదేశంలో ఉదయం, సా యంత్రం రెండు వేళల్లో రెండు ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అప్పుడే వారికి వేతనం వస్తుంది. ఫొటో ఉంటే హాజరు ఉన్నట్లుగా పరిగణలోకి తీసుకుంటారు. ఫొటోలు అప్లోడ్ చేయకపోతే వేతనం కూలీలకు వచ్చే అవకాశం లేదు. ఈజీఎస్లో అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 నుంచి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. – చరణ్, ఈజీఎస్ ఏపీఓ, ఏటూరునాగారంన్యూస్రీల్అర్హులందరికీ రేషన్కార్డులురాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర గ్రామీణావృద్ధిశాఖ ఒక ఫొటో తీస్తే సగం కూలి వర్తిస్తుందని స్పష్టం చేసిన కేంద్రం 14 నుంచి అన్ని స్థాయిల్లో శాంపిల్గా ఫొటోల పరిశీలన -
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● వీసీలో మంత్రి శ్రీనివాస్రెడ్డి ములుగు రూరల్: ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారులదేనని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయం నుంచి సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్.ప్రియాంక, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి జి.మల్సూర్లతో కలిసి అన్ని జిల్లాల పౌర సంబంధాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తుందని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రస్థాయి అధికారులు ఆర్జేడీ జగన్, అన్ని జిల్లాల డీపీఆర్వ్లు తదితరులు పాల్గొన్నారు. వేలం ఆదాయం రూ.6.46లక్షలు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయ ఆవరణలో మంగళవారం కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు వేలం పాటలు నిర్వహించగా రూ.6.46లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా పాట నిర్వహించగా గతేడాది కంటే లక్షా 26 వేల ఆదాయం ఎక్కువగా సమకూరిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ పరిశీలకులు కవిత, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, సిబ్బంది సంతోష్, అవినాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా పాఠకుల హర్షం ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మహిళా పాఠకులకు టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో మహిళా పాఠకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాంగణంలో టాయిలెట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మహిళా పాఠకుల అవస్థలను గమనించి టాయిలెట్స్ నిర్మించిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులపై పెరుగుతున్న దాడులు గోవిందరావుపేట: జిల్లాలోని రైతులపై రోజురోజుకూ ఫారెస్ట్ అధికారుల దాడులు పెరిగిపోతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మ ల వెంకట్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని పస్రాలో సీపీఎం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంటలకు లక్నవరం నీటిని అందించాలన్నారు. గోదావరిలోకి ప్రతిరోజూ లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్కసాగర్ బ్యారేజీ జిల్లాలో ఉన్నప్పటికీ రైతులకు నీరు అందకపోవడం బాధాకరం అన్నారు. రేపు స్వాతంత్య్ర సమరయోధుడు, పార్టీ సీనియర్ నాయకుడు వీరపనేని రామదాసు వర్ధంతిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరా వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు చిట్టిబాబు, ఆదిరెడ్డి, రాజేష్, మల్లారెడ్డి, అశోక్, రాజు, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
నానోతో మేలు
ములుగు రూరల్: నత్రజని ఎరువులు వినియోగంతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగానికి బదులుగా ద్రవరూపంలో నానో యూరియాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నానో యూరియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం యూరియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో గుళికల యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియాకు బదులు నానో యూరియాతో పంటలకు, భూసారానికి మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. సాగు ఖర్చులు ఆదా పంటల సాగులో నానో యూరియా వినియోగంతో పంట సాగు ఖర్చు తగ్గుతుంది. నానో యూరియా 500 మిల్లీ లీటర్ల ద్రావణం ఒక గుళిక యూరియా బస్తా 45 కేజీలకు సమానంగా పని చేస్తుంది. నానో యూరియా 500 మిల్లీ లీటర్లు రూ. 225, గుళికల యూరియా బస్తా రూ. 278కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం యూరియా కొరత కారణంగా యూరియా బస్తా రూ. 300 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారు. నానో యూరియా వినియోగంతో పంటలలో పచ్చదనం, చురుకుగా పెరుగుదల ఉంటుంది. గుళికల యూరియాను రైతులు పంట సాగుకు రెండు నుంచి మూడు సార్లు వినియోగిస్తున్నారు. ఇందులో నత్రజని 30 నుంచి 50 శాతం మాత్రమే పంట వినియోగించుకుంటుంది. మిగతా ఎరువు వృథా అవుతుంది. దీంతో నేల, గాలి, నీరు కలుషితం చేస్తుంది. నానో యూరియా మాత్రం కేవలం పైరుకు మాత్రమే ఉపయోగపడుతుంది. పంటకు బహుళ ప్రయోజనం నానో యూరియాతో పంటలకు 80శాతం మేరకు ప్రజయోజనం కలుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. మొక్కలకు అవసరమయ్యే నత్రజని అవసరాన్ని సమర్థవంతంగా తీరుస్తూ ఆ కుల్లో కిరణజన్య సంయోగక్రియ పెంచుతుంది. సాంప్రదాయ యూరియా వినియోగంతో పోలిస్తే 50శాతం, అంతకంటే తక్కువ అవసరమవుతుంది ని దీంతో రైతులకు ఖర్చులు తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు. నానో యూరియాను లీటర్ నీ టికి 2 నుంచి 4 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పంటలకు పిచికారీ చేయాలి. 20 నుంచి 25 రోజుల వ్య వధికి ఒకసారి వినియోగించాలని సూచిస్తున్నారు.జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు అంచనా(ఎకరాల్లో)వరి 1,30,117 పత్తి 27,143 మొక్కజొన్న 6,009 జనుము 1,000 జీలుగ 14,000 యూరియా అవసరం 24,225.12 మెట్రిక్ టన్నులుపంటలకు ఉపయోగంగా ద్రవరూప యూరియా ఎరువులు నత్రజని ఎరువుల వాడకంతో భూసారానికి ముప్పు రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖపర్యావరణ పరిరక్షణకు హితం పంటల సాగులో నానో యూరియా వినియోగం పర్యావరణ పరిరక్షణకు హితం. గుళికల యూరియా తయారీకి చైనా నుంచి న్యాప్టా ముడిసరుకు దిగుమతి భారంగా మారుతుంది. యూరియా బస్తాపై రైతులకు ప్రభుత్వం రూ.2వేల వరకు రాయితీ ఇస్తుంది. నానో యూరియాతో వాతావరణం కలుషితం కాదు. భూమి స్వభావం దెబ్బతినదు, గుళికల యూరియా వినియోగంతో భూమిలో సూక్షజీవులు చనిపోతాయి, భూ సారంలో కార్బన్శాతం తగ్గిపోతుంది. యూరియా భూమిలో కలిసి రైతులు కేన్సర్ బారిన పడుతున్నారు. నానో యూరియా పంటలపై పిచికారీ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. – సురేష్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
ప్రభుత్వ కళాశాలల్లో నిఘా
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్లు, స్టాఫ్ గది, ప్రిన్సిపాల్ గది, వరండా, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించారు. ఒక్కో కళాశాలలో 14 నుంచి 16 వరకు, అవసరమైన చోట 20వరకు సీసీ కెమెరాలు అమర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది. విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ గతంలో కేవలం ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో మాత్రమే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత వాటిని తీసివేసేవారు. ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రధానంగా విద్యార్థుల హాజరు, అధ్యాపకుల విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. ప్రతీ తరగతి గదిలో నిఘా ఉంటుంది. అకడమిక్ మానిటరింగ్ కమిటీలు, డీఐఈఓలతో పాటు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ ద్వారా సంబంధిత అధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా.. గతంలో ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు తమ ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోయేవారు. దాంతో హాజరు శాతం తక్కువగా ఉండడంతో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగా ఉండేది. ఈ క్రమంలో సరైన విద్యాబోధన, పరీక్షల ఫలితాలు మెరుగుపడేలా ఉన్నతాధికారులు ఇంటర్లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇకనుంచి అధ్యాపకులు కూడా సక్రమంగా విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు అధ్యాపకుడు ఒకరోజు రాకుంటే ఆ పీరియడ్లో వేరే అధ్యాపకుడు విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉంటుంది.హనుమకొండ 9 వరంగల్ 11 భూపాలపల్లి 5మహబూబాబాద్ 10జనగామ 7ములుగు 8ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల సంఖ్య ఇలా..నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఒక్కో జూనియర్ కళాశాలకు 14 నుంచి 16 వరకు కేటాయింపు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ల్యాబ్ సౌకర్యం, ఫిజిక్స్వాలా శిక్షణఫిజిక్స్వాలా శిక్షణపై.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఫిజిక్స్వాలా ద్వారా సంబంధిత వెబ్సైట్ ద్వారా జేఈఈ, ఐఐటీ, ఎప్సెట్, నీట్లాంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం ఇంటర్ విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఫిజిక్స్వాలా శిక్షణకు సంబంధించిన టైంటేబుల్ను డీఐఈఓల ద్వారా ఆయా జిల్లాల కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందించారు. ప్రతిరోజూ ఏదో ఒక సబ్జెక్టుపై శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం వివిధ కళాశాలల్లో ల్యాప్ట్యాప్లు, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ కళాశాలకు ఇన్ప్లాంట్స్ టేబుల్స్ కూడా రానున్నాయి. పెద్ద కంప్యూటర్ మానిటర్లో వెబ్సైట్ ద్వారా వీడియోలను విద్యార్థులు తిలకించనున్నారు. ఫిజిక్స్వాలా శిక్షణను విద్యార్థులు సరిగా వినియోగించుకుంటున్నారా లేదా అనేది హైదరాబాద్ నుంచి సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణకు ప్రతీజిల్లాకు ఒకరి చొప్పున ఇన్చార్జ్లను నియమించారని సమాచారం. అలాగే డీఐఈఓలు కూడా పర్యవేక్షిస్తారు. అందుకు డీఐఈఓ కార్యాలయాల్లో కూడా సీసీ కెమెరాలకు సంబంధించి డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక టెక్నీషియన్ చొప్పున నియమించారు.నిరంతర పర్యవేక్షణతో విద్యాబోధన మెరుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘాతో నిరంతర పర్యవేక్షణతో పారదర్శకత పెరగనుంది. అధ్యాపకుల బోధన, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ ఉండడంతో విద్యాబోధన మెరుగుపడుతుంది. విద్యార్థుల హాజరు పెరగడంతోపాటు అధ్యాపకులు విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రయోగాలు చేయడం, టైంటేబుల్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జిల్లాల్లో డీఐఈఓలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా నిఘా ఉండి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తారు. – శ్రీధర్సుమన్, వరంగల్ డీఐఈఓ -
మెరుగైన వైద్యం అందించాలి
● గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ములుగు రూరల్: వైద్యాధికారులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన సోమవారం సందర్శించి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి.చాంద్పాషా, భిక్షపతి, రేవంత్, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
ములుగు రూరల్: వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సీఎం సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో పిడుగుపాటుకు గురై ప్రజలు, పశువులు మృతి చెందితే పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్స్ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. వైద్యసిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మండలాల్లో అధికారికంగా రేషన్కార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. రేషన్కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. యూరియా అమ్మకాలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.వీసీలో సీఎం రేవంత్రెడ్డి -
నేడు మంత్రి సీతక్క పర్యటన
మంగపేట: నేడు మండల కేంద్రంతో పాటు రాజుపేటలో మంత్రి సీతక్క మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి సీతక్క పంపిణీ చేయనున్నారు. నాబార్డు, డీసీసీబీ వారి సహకారంతో మల్టీసర్వీస్ కో ఆపరేటీవ్స్(ఎంఎస్సీ) స్కీం ద్వారా మండల కేంద్రంలోని ఎఫ్ఎస్సీఎస్ కార్యాలయ ఆవరణలో రూ.76 లక్షల నిధులతో నిర్మించిన గోదాంను ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజుపేటలో రూ.59 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని 4.15 గంటలకు ప్రారంభించనున్నారు. అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం డిగ్రీ కళాశాలలో 2025–26 గాను వృక్షశాస్త్రం 1, రసాయనశాస్త్రం 1, జంతుశాస్త్రం 1, కామర్స్ 1, కంప్యూటర్ సైన్స్ 2, అర్ధశాస్త్రం 1, రాజనీతిశాస్త్రం 1 బోధించడానికి గాను అతిథి అధ్యాపకుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత సబ్జెక్ట్లో పీజీ, డిగ్రీ జనరల్ ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉన్న వారు పీహెచ్డీ, నెట్, సెట్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్లతో రేపు సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో సమర్పించాలని ఆమె కోరారు. డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తామని వివరించారు. ఫర్టిలైజర్ షాపుల తనిఖీ భూపాలపల్లి రూరల్: జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి బాబురావు సోమవారం జిల్లాకేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఎరువుల స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. షాపులకు వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా పురుగుమందులు, నానో యూరియాతో లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అర్చకుడికి ముఖ్య అర్చక ప్రమోషన్? కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వ రం దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అ ర్చకుడికి ముఖ్య అర్చక ప్రమోషన్ ఉత్తర్వులు సోమవారం వచ్చినట్లు సమాచారం. ప్రమోషన్ ఉత్తర్వులపైన దేవాదాయశాఖ అధికారులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కలు నాటిన పోలీసులుపలిమెల: వన మహోత్సవంలో భాగంగా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ రాంచందర్రావు, పలిమెల ఎస్సై జె.రమేష్ ఆధ్వర్యంలో సోమవారం పలిమెల పోలీస్స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు అధిక సంఖ్యలో మొక్కలు నాటి వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్సై వినోద్, సివిల్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఏఐతో విద్యాబోధన కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ అధ్యాపకులు ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. టెక్నాలజీ ఎనెబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అంశంపై నిట్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు కొనసాగనున్న వర్క్షాప్ను నిట్ డైరెక్టర్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తరగతి గదుల్లో పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా నిజజీవితంలోని ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వివరించాలన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ బాంబే ప్రొఫెసర్ కన్నన్ మౌధాల్యా, ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ సమీర్ సహస్ర బుదే, నిట్ టీటీఆర్ చైన్నె ప్రొఫెసర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డుగా కేన్ప్రాంతం
వెంకటాపురం(ఎం): తెలంగాణ రాష్ట్రంలోనే అరుదుగా లభించే కేన్ మొక్కల రక్షిత ప్రాంతం అధికారుల నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డుగా మారుతుందని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ఆరోపించారు. సోమవారం పరిశోధక బృందంతో కలిసి ఆయన మండల పరిధిలోని పాలంపేట పరిధిలో గల కేన్ రక్షిత ప్రాంతాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజలు అవగాహన లోపంతో కేన్ ప్రాంతంలో వ్యర్థ పదార్థాలు, చెత్త వేస్తూ డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కేన్ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా కేన్ ప్రాంతంలో అటవీ సంబంధ దేశీయ మొక్కలను నాటే విధంగా కృషి చేయాలని ఉన్నతాధికారులను సతీష్ కోరారు. -
కార్మికుల పక్షాన సీఐటీయూ పోరాటం
● రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ వాజేడు: కార్మికుల పక్షాన నిరంతరం పోరాడేది సీఐటీయూ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ అన్నారు. మండల పరిధిలోని గుమ్మడి దొడ్డిలో సోమవారం గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతుందన్నారు. పలుమార్లు సమ్మె చేసినా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా సమయంలో 29 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పని గంటల తగ్గింపు, బీమా సౌకర్యం, పని కల్పిస్తామని అధికారంలోకి రాక ముందు ప్రకటించిన కాంగ్రెస్ నేడు అధికారంలోకి వచ్చాకా పట్టించుకోవడం లేదన్నారు. మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో పచాయతీ కార్మికులను తీసుకుని 12గంటలు పనిచేయిస్తుందన్నారు. పలు సమస్యలపై సమ్మె చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. ఈ సందర్భంగా వాజేడు మండలంలోని 60 మంది గ్రామ పంచాయతీ కార్మికులు సీఐటీయూలో చేరారు. -
గోదావరి ముంపు ప్రాంతం పరిశీలన
వాజేడు: సరిహద్దులోని గోదావరి ముంపు ప్రాంతాన్ని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సోమవారం పరిశీలించారు. మండల పరిధిలోని పేరూరు పోలీస్స్టేషన్కు వచ్చిన ఆయన సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు స్టేషన్ సెక్యూరిటీకి సంబంధించి పలు వివరాలు సూచించారు. అనంతరం మండల పరిధిలోని టేకులగూడెం గ్రామం చివరన రేగు మాగు ఒర్రె వద్ద గోదావరి ముంపునకు గురయ్యే ప్రదేశాన్ని సందర్శించారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా కట్టు దిట్టమైన చర్యలను చేపట్టాలన్నారు. ఏఎస్పీ వెంట వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు
ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలో రాష్ట్ర మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల పరిధిలోని కాటాపూర్లో రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ఎల్లమ్మ గుడి ప్రహరీ, పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు పార్టీ నాయకులతో కలిసి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణి మాట్లాడుతూ మంత్రి సీతక్క ఇప్పటికే మండలంలోని రూ.6 కోట్లకు పైగా నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక ఇళ్లు కూడా ఇవ్వకున్నా నియోజకవర్గానికి 6వేల ఇళ్లు మంజూరు చేసిన సీతక్క గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా కాటాపూర్ గ్రామానికి వెళ్లిన రేగ కల్యాణికి పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి మధు, మండల యూత్ అధ్యక్షులు కోడి సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరం చిరంజీవి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముజఫర్, మాజీ సర్పంచులు శ్రీనివాస్, నరసింహస్వామి, నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముక్తి రామస్వామి, గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నరసయ్య, శ్రీధర్, గుండు సదయ్య, పులి రవి, రంగు రాజు, పద్మశాలి సంఘం నాయకులు సారయ్య, పల్నాటి సత్యం, కందకట్ల సాంబయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి రూ. 30లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
శాంతిభద్రతల పర్యవేక్షణకు కృషి
భూపాలపల్లి రూరల్/రేగొండ: శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపల్లిగోరి పోలీస్స్టేషన్, జిల్లా గంథ్రాలయం, వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమాజంలో శాంతి భద్రతలు, చట్టవ్యవస్థ పటిష్టంగా ఉండేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ కేంద్రాలు యువత తమపై తాము ఆధారపడేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. సింగరేణి, జెన్కో వంటి ప్రాంతాలలో ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువతకు ఈ కేంద్రాలు ఉపాధి కల్పన వేదికగా నిలవాలని చెప్పారు.