breaking news
Mulugu
-
పెసా మహోత్సవానికి పూసూరు సర్పంచ్
వాజేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్వహించిన పెసా మహోత్సవ సభకు హాజరైనట్లు మండల పరిధిలోని పూసూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ దబ్బకట్ల సుమన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని 10 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు ఈ సభకు హాజరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల జీవన విధానం, గ్రామ పంచాయతీల పాలన, పెసా చట్టం అమలు తదితర అంశాలపై చర్చ సాగినట్లు వివరించారు. గిరిజనుల సంస్కృతీ, సంప్రదాయాలు, పూర్వ కాలపు ఆటలు, విశిష్టత, సాంస్కృతిక వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ములుగు రూరల్: ఇండియన్ లీగల్ ప్రొపెషనల్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లా కోర్టు న్యాయవాది రంగోజు భిక్షపతి ఎన్నికయ్యారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నికై నట్లు భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తన ఎన్నికకు సహకరించి బాధ్యతలు అప్పగించిన ఐఎల్పీఏ జాతీయ కమిటీ నాయకుల ఆదేశాల మేరకు న్యాయసేవా కార్యక్రమాల్లో పాల్గొని ఐఎల్పీఏ బలోపేతానికి కృషి చేస్తానని భిక్షపతి తెలిపారు. ములుగు రూరల్: మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేసి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు కొయ్యడ సాంబయ్యను జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మంగళవారం గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి సాంబయ్య వస్తున్న క్రమంలో గట్టమ్మ ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ముంజాల భిక్షపతి, బొచ్చు సమ్మయ్య, మడిపెల్లి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. వాజేడు: ఏజెన్సీలో జెమిని, విల్ట్ వైరస్ మిర్చి రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. మిర్చి తోటలను తెగుళ్లు పట్టి పీడిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మండల పరిధిలోని పాయబాటలు గ్రామానికి చెందిన దాట్ల కాళికృష్ణ 6 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాడు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.2 లక్షల వరకు ఖర్చు చేయగా తోట కాపుకొచ్చింది. ఈ సమయంలో తోటల్లోకి జెమిని (కుచ్చు ముడుత), విల్ట్ వైరస్ వచ్చి చేరడంతో భూమిలో వేర్లు బూజు పట్టి మొక్కలు ఎండి పోయి ఆకులు మొత్తం రాలి చని పోతున్నాయని కాళికృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెమిని వైరస్ సోకిన తోటల్లో మొక్కల ఆకులు ముడుచుకుని ఎదగడం లేదని వివరించారు. ఇప్పటి వరకు మిర్చి పంట సాగుకు రూ. 12 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా పంటను కాపాడుకోలేక పోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆవిర్భావ వేడుకలను యాజమాన్యం నామమాత్రంగా నిర్వహించడం పట్ల నల్ల బ్యాడ్జీలు ధరించి వేడుకలను బహిష్కరించినట్లు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి ఆవిర్భావ వేడుకలను సింగరేణి యాజమాన్యం నామమాత్రంగా నిర్వహించడం కార్మికులను, సింగరేణిని అవమానించినట్లేనని గుర్తు చేశారు. యాజమాన్యం ఇలాంటి ధోరణి మానుకొని రాబోయే రోజుల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రామచందర్, సుధాకర్ పాల్గొన్నారు. -
త్వరలో మున్సిపల్ పోరు..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందనుకున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు... 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా. 25న ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లతో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీలలో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలలోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. మున్సిపాలిటీ జనాభా వార్డులు(2011 ప్రకారం)పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30 జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుమున్సిపాలిటీ జనాభా వార్డులు ములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16 -
‘ఎత్తు బంగారం’ సేకరించేదెలా?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరలో భక్తులు సమర్పించనున్న ఎత్తు బంగారం సేకరణ విషయంలో కార్యాచరణ కరువైంది. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణంతో పాటు సమ్మక్క– సారలమ్మ గద్దెల చుట్టూ రాతి స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణ పనులు బాగానే ఉన్నప్పటికీ ఈసారి జాతరలో భక్తులు సమర్పించనున్న ఎత్తు బంగారం(బెల్లం) సేకరణ పూజారులకు పెద్ద సమస్యగా మారనున్నట్లు ఆదివాసుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదుల వరుసలో క్యూలైన్ల ఏర్పాటుతో తప్పని తిప్పలు వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు మేడారంలో నాలుగు రోజులు సాగే మహాజాతర సందర్భంగా భక్తులు ఎత్తు బంగారం, ఒడిబియ్యం సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుటుందని ఆదివాసీ సంఘాల నాయకులు, భక్తుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూతన గద్దెల పునర్నిర్మాణంతో పాటు ఈసారి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పదుల వరుసలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునే విధంగా క్యూలైన్లు నిర్మించనున్నారు. క్యూలైన్లలో పదుల సంఖ్యలో వచ్చే భక్తులు ఎత్తు బంగారం, ఒడిబియ్యం సమర్పించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భక్తులు చర్చించుకుంటున్నారు. క్యూలో ముందు వరుసలో గద్దెల వైపు ఉన్న భక్తులు ఎత్తు బంగారం చెల్లించడం సులువుగా ఉంటుంది. వెనుకాల, అవతలి వైపు క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎత్తు బంగారం సమర్పించడం ఇబ్బందిగా మారడంతో పాటు భక్తుల మధ్య తోపులాట కూడా జరిగే ఆస్కారం ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. పూజారులకే బెల్లం సేకరణ బాధ్యత? ఈసారి ఎత్తు బంగారం సేకరించే బాధ్యతను అధికారులు పూజారులకే పూర్తి బాధ్యత అప్పగించనున్నట్లు తెలుస్తుంది. గద్దెల లోపల పూజారులు ఉండకుండా గద్దెల బయట క్యూలైన్ వద్ద అందుబాటులో ఉండి భక్తుల సమర్పించే ఎత్తు బంగారాన్ని సేకరించి భక్తులకు ప్రసాదంగా బెల్లం పంచి పెట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రతిఏటా పూజారులు గద్దెలపై భక్తులు సమర్పించిన ఎత్తు బంగారాన్ని పూజారులు సేకరిస్తుంటారు. ఈసారి గద్దెలపై బెల్లం, ఒడిబియ్యం విసిరేయడం భక్తులకు సాధ్యం కాదు. ఒక వేళ భక్తులు భక్తిభావంతో విసిరేసినా రాతి స్తంభాలకు తగిలి తిరిగి భక్తులపై పడే ప్రమాదం ఉంటుందనే విషయాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. పూజారులు జాతర సమయంలో వందల సంఖ్యలో వలంటీర్లను ఏర్పాటు చేసి క్యూలైన్లలో వచ్చే భక్తుల నుంచి గద్దెల వద్ద బెల్లం పొగు చేసుకుని ఎప్పటికప్పుడు బయటకు తరలించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే తరలింపు సాధ్యమవుతుందని ఆదివాసీలు, భక్తులు సూచనలు చేస్తున్నారు. మేడారంలో వనదేవతల గద్దెల చుట్టూ రాతి స్తంభాల ఏర్పాటు మహాజాతరలో భారీగా ఎత్తుబెల్లం సమర్పించనున్న భక్తులు పూజారులకు సమస్యగా మారనున్న సేకరణమేడారం జాతరలో అమ్మవార్లకు ఎత్తు బంగారం మొక్కుగా భక్తులు భారీ మొత్తంలో సమర్పిస్తుంటారు. గతేడాది జాతర వరకు భక్తులు నేరుగా అమ్మవార్ల గద్దెలపై ఎత్తు బంగారం సమర్పించే వారు. ఈ క్రమంలో గద్దెలపై సమర్పించిన ఎత్తు బంగారాన్ని పూజారులు వలంటీర్ల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు బయటకు తరలించే వారు. ఈ సారి గద్దెల విస్తర్ణతో పాటు చుట్టూ రాతి స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ సారి భక్తుల తీసుకొచ్చి వనదేవతలకు సమర్పించే బెల్లం సేకరణ విషయంలో అధికారుల్లో స్పష్టత కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
బ్యాంకుల సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: బ్యాంకుల ఆర్థిక సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవా విభాగం పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని సంక్షేమభవన్లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ డబ్బు–మీ హక్కుపై నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదేళ్లుగా ఆయా ఖాతాలలో ఉన్న పొదుపు సొమ్మును, ఇన్సూరెన్స్ ఖాతాలను క్లైయిమ్ చేసుకోవాలనే లక్ష్యంతో ఆర్బీఐ శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఆర్థిక పరమైన, ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు శిబిరంలో బ్యాంక్ శాఖ, బీమా శాఖ అధికారులు సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ వరంగల్ రీజినల్ మేనేజర్ సుబ్బారావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ హైదరాబాద్ ప్రతినిధి ఉదయ్, యూనియన్ బ్యాంక్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ ఆంజనేయులు, డీసీసీబీ మేనేజర్ తిరుపతి, బీమా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్ -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎతాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను మంగళవారం భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులోని స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద జల్లు స్నానాలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. యాటలను మొక్కుగా సమర్పించారు. అనంతరం భక్తులు మేడారం ప్రాంతంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు ఆరగించారు. అలాగే మేడారం పనుల పరిశీలనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్లు అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రుల పర్యటన, భక్తుల రద్దీతో మేడారం సందడిగా నెలకొంది. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ బాల్య వివాహ నిషేధిత చట్టాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యా యసేవ అధికార సంస్థల ఆదేశాలను మేరకు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్భారత్ ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహా నిషే ధిత చట్టం, పొక్సో, విద్యాహక్కు, ర్యాగింగ్ నిరో ధక చట్టం, మోటార్ వాహనాల చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. బాల్య వివాహా లు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహా యం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ చీఫ్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.లీగల్ చీఫ్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
మేడారం..ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
కుష్ఠు నిర్ధారణ సర్వే
గోవిందరావుపేట: మండల కేంద్రంలోని పీహెచ్సీ పరిధిలో చేపట్టిన కుష్ఠువ్యాధి నిర్ధారణ ఇంటింటి సర్వేను కేంద్ర, రాష్ట్ర బృందాలు మంగళవారం పరిశీలించాయి. ఈ సందర్భంగా బృందం సభ్యులు సర్వే అంశాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలు టీములుగా ఏర్పడి కుష్ఠు నిర్ధారణ సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కోరారు. గ్రామాల్లో కుష్ఠువ్యాధిపై అపోహలు తొలగించేలా కరపత్రాలు, సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. అనంతరం పీహెచ్సీలోని కార్యక్రమాల ప్రణాళికలు, రోజు వారీ రిపోర్టులను బృందాలు పరిశీలించాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ టీం అబ్జర్వర్ డాక్టర్ జయంత్, లెప్రో ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కమలేశ్వర్రావు, స్టేట్ బృందం సభ్యులు వెంకటేశ్వర చారి, సకల రెడ్డి, శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారులు చంద్రకాంత్, వైద్యాధికారులు శ్రీకాంత్, రణధీర్, డీపీఎం సంజీవరావు, డెమో సంపత్, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.పరిశీలించిన కేంద్ర, రాష్ట్ర బృందాలు -
ములుగు
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఉప్పేడు పాఠశాలలో మాక్ పార్లమెంట్7వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఉప్పేడు ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠశాల ఆవరణలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలు, మంత్రుల సమాధానాలపై పార్లమెంట్ సమావేశాలు సాగే తీరుపై మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సంతోష్, కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లూర్దురాజ్, సభ్యులు గొంది హనుమంతు, కామేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు కొత్త శోభ
రెండేళ్ల తర్వాత కళకళలాడిన గ్రామపంచాయతీలుములుగు/ములుగురూరల్: దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు.. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలాంటి పల్లెలకు రెండేళ్ల తర్వాత రథ సారధులుగా సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయా పంచాయతీల్లో అట్టహాసంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీంతో గ్రామాల్లోని పంచాయతీలు నూతన శోభను సంతరించుకున్నాయి. 144 జీపీల్లో ప్రమాణస్వీకారం జిల్లాలోని 9 మండలాల పరిధిలో గల 146 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు సోమవారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నాయి. వాజేడు మండలంలోని పూసూరు సర్పంచ్ దబ్బకట్ల సుమన్, కన్నాయిగూడెం మండలంలోని రాజన్నపేట సర్పంచ్ పొడెం నర్సింహారావు పెసా సభలకు వైజాగ్ వెళ్లడంతో ఇద్దరి సర్పంచ్ల ప్రమాణస్వీకారం నిలిచిపోయింది. ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. 144 గ్రామపంచాయతీల్లో మాత్రమే సర్పంచ్ల అధ్యక్షతన తొలి సమావేశం జరగగా మిగిలిన రెండు పంచాయతీల్లో సమావేశాన్ని నిర్వహించలేదు. కొలువుదీరిన కొత్త సర్పంచ్లు నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారుల సమక్షంలో సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టినట్లు రిజిస్టర్లో తొలి సంతకం చేశారు. అనంతరం వార్డు సభ్యులతో తొలి పంచాయతీ సమావేశాన్ని నిర్వహించి గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. పాలకవర్గాల ప్రమాణస్వీకారం సందర్భంగా పంచాయతీలను అధికారులు అందంగా ముస్తాబు చేశారు. మంత్రి సీతక్క పీఏగా పనిచేసిన బొమ్మకంటి రమేశ్ తన సతీమణి వంశావతితో లక్ష్మీదేవిపేట సర్పంచ్గా నామినేషన్ వేయించి గెలుపొందడంతో లక్ష్మీదేవిపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయించి నివాళులర్పించారు. అంబేడ్కర్, మంత్రి సీతక్క చిత్రపటాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.– మరిన్ని వార్తలు, ఫొటోలు 8,9లోu బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు 146 పంచాయతీలకు 144 జీపీల్లో తొలి సమావేశం -
ప్రమాణస్వీకారానికి దూరంగా వార్డు సభ్యులు
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు గ్రామ పంచాయతీలో ఆరుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. సర్పంచ్ రాజబాబు, ఉప సర్పంచ్ అట్టం శివ కృష్ణతో పాటు వార్డు సభ్యురాలు సులోచన మాత్రమే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో పాటు తాము ప్రమాణ స్వీకారం చేయమని అధికారులకు తెలిపారు. తమ వర్గానికి ఉపసర్పంచ్ పదవిని ఇస్తామని హామీనిచ్చి ఇప్పుడు మరొకరికి ఇవ్వడం సరికాదని ప్రశ్నించారు. ఉప సర్పంచ్ పదవి ఇస్తేనే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఆరుగురు వార్డు సభ్యులు కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర గుత్తేదారులను ఆదేశించారు. గద్దెల ప్రాంగణంలోని ప్రహరీ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి స్తంభాల ఏర్పాటు పనులను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఆర్కిటెక్షర్ శివనాగిరెడ్డి రాతి స్తంభాల పైభాగంలో అమర్చే రాతి చిహ్నాల వివరాలను కలెక్టర్కు వివరించారు. రాతి స్తంభాల నిర్మాణంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
విద్యార్థులకు నీళ్ల చారుతోనే భోజనం
ఏటూరునాగారం: మండల పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు నీళ్లచారుతో భోజనం వడ్డించడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో వివిధ హాస్టళ్లలో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కొండాయి ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ గత కొన్ని నెలలుగా నీళ్ల చారుతోనే భోజనం వడ్డిస్తూ నాణ్యతలేని ఆహారం పెడుతున్నారన్నారు. ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ గిరిజన సంక్షేమ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. విధులకు కూడా సదరు వార్డెన్ సక్రమంగా హాజరు కావడం లేదన్నారు. అలాగే హాస్టల్లో ఫ్యాన్లు, మరుగుదొడ్లు సరిగా లేవన్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి నెలకొందని తెలిపారు. తక్షణమే సదరు వార్డెన్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అశోక్ -
వినతుల పరిష్కారమే లక్ష్యం
ములుగు రూరల్: ప్రజావాణి వినతుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను అదనపు కలెక్టర్ ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గతంలో అందించిన దరఖాస్తుల పరిష్కారంలోని చొరవ చూపాలని సూచించారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరై శాఖల వారీగా దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. 35 అర్జీల రాక ప్రజావాణిలో వివిధ సమస్యలపై 35 దరఖాస్తులను బాధితులు అందించారు. ఇందులో అత్యధికంగా భూ సమస్యలపై 8, గృహ నిర్మాణశాఖ 4, పింఛన్లు 6, ఇతర శాఖలకు సంబంధించిన 17 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శాఖల వారీగా దరఖాస్తులను బదలాయించినట్లు తెలిపారు. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ మహేందర్జీ ప్రజావాణిలో 35 అర్జీల స్వీకరణ -
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలి
ములుగు రూరల్: విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటేనే కంటి సమస్యలు రాకుండా ఉంటాయని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పౌష్టికాహారం కలిగిన ఆహార పదార్ధాలతో పాటు ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ టీవీ, మొబైల్ చూడడం తగ్గించుకోవాలని సూచించారు. యోగాతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. జిల్లాలో 19,090 మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. 1,222 విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 24 మంది విద్యార్థులకు కంటి సమస్యలపై ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు రెఫర్ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీకాంత్, సంపత్, తిరుపతి పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ స్థాయి (రామ్సర్ సైట్గా) గుర్తింపు లభించనుంది. ఆ దిశగా సర్వేలు కొనసాగుతున్నాయి. – ఖానాపురంకామన్ కెస్ట్రాల్ లిటిల్ రింగ్డ్ ప్లవర్ టికెల్స్ బ్లూ ఫ్లైకాచర్ -
మేడారంలో నేడు మంత్రుల పర్యటన
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో నేడు (మంగళవారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్కలు పర్యటించనున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి, జాతర పనులను పరిశీలించనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏటూరునాగారం: గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్(జెడ్ఎస్టీఎస్) తెలంగాణ రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ కార్పొరేషన్ ద్వారా ములుగు రోడ్డు వద్ద హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ మోటార్ శిక్షణకు 30 రోజులు, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ 21 రోజుల పాటు ఉంటుందని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31 సాయంత్రం 5 గంటల వరకు ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. గోవిందరావుపేట: దివంగత పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి జి. వెంకటస్వామి వర్థంతిని పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్ కార్యాలయంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. కమాండెంట్ సుబ్రహ్మణ్యం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజాసేవకు ఆయన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. సామాన్యుల సమస్యలను పార్లమెంట్లో ధైర్యంగా ప్రస్తావించిన ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారామ్, అసిస్టెంట్ కమాండెంట్లు అనిల్, శ్రీనివాసరావు, వేణుగోపాల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, బెటాలియన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరంగా మారందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొమవారం నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశానికి సమ్మారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లాలో జరిగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత సమావేశాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి, నాయకులు రాజేందర్, శ్రీధర్, రమేశ్, రఫీపాషా, రమాదేవి, రామయ్య పాల్గొన్నారు. భూపాలపల్లి: భారీ వర్షాలు కురిసి వాగులు ఉప్పొంగి, చెరువు కట్టలు తెగినప్పడు ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. 2023 జూలై 27న భూపాలపల్లి మండలంలోని మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లిలో 280 ఇళ్లు నీట మునిగాయి. గ్రామానికి చెందిన నలుగురు వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరోమారు ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం మోరంచపల్లి గ్రామంతో పాటు, మోరంచవాగులో మాక్ డ్రిల్ నిర్వహించాయి. వాగులు ఉప్పొంగినప్పుడు పశువులు, మనుషులు నీటిలో కొట్టుకుపోతే, ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్లుగా డ్రిల్ నిర్వహించారు. అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించారు. వరద ప్రభావిత కాలనీలను ఎలా తరలించాలో తెలియజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆవిర్భావ దినోత్సవం రద్దు అన్యాయం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో నిధుల కొరత నెపంతో ఈ నెల 23న ఏరియా స్థాయిలో జరగాల్సిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని యాజమాన్యం రద్దుచేయడం అన్యాయమని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వేలబోయిన సుజేందర్ తీవ్రంగా ఖండించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలు నిర్వహించేందుకు తక్కువ బడ్జెట్ మంజూరు చేసిందన్నారు. దీనిపై కార్మికులు చాలా ఆగ్రహంగా ఉన్నారని.. కార్మికులు కష్టపడి లాభాలు తెస్తుంటే, తమ పండుగ లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని జరపకుండా నిధుల కోత విధించడం సరైనది కాదన్నారు. రాజకీయ నాయకుల మెప్పుల కోసం సింగరేణి నిధులను దుబారా చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పెద్ద మొత్తంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను నిధుల కొరతతో ఎలా నిర్వహిస్తారో వేచి చూడాలన్నారు. సింగరేణి యాజమాన్యం, కార్మికుల శ్రేయస్సు కోసం వెచ్చించాల్సిన నిధులను ప్రభుత్వ అవసరాలకు, మంత్రుల మెప్పుకోసం, ఫుట్బాల్ ఆటల కోసం వెచ్చిస్తుందన్నారు. సింగరేణి కార్మికుల ఆత్మగౌరవ పండుగలాంటి ఆవిర్భావ దినోత్సవాన్ని నిధుల కొరతతో నిర్వహించలేమని చెప్పడం సింగరేణి అస్తిత్వానికి ఆటంకంగా ఉందని యాజమాన్య వైఖరి విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి, నూతన బొగ్గు గనుల, భూనిర్వాసిత ప్రాంతాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సింగరేణి నిధులను యాజమాన్యం తన ఇష్టానుసారంగా మళ్లించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే సింగరేణి ఆవిర్భావ వేడుకలను గతంలో మాదిరిగా ఘనంగా నిర్వహించడం కోసం తగినన్ని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి యాజమాన్యం సింగరేణి నిధులను దుబారా చేయడం మానుకొని, కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి, పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, పాండ్రాల మల్లయ్య, కడారి శంకర్, నారాయణ, శీలం రాజు, ఓరం లక్ష్మణ్, అల్లం శ్రీనివాస్, భాస్కర్, శ్రీరాములు, రాజు, సాగర్, కొత్తూరు మల్లేష్ పాల్గొన్నారు. -
జాతర పనులు పరిశీలించిన ఎస్పీ
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదివారం పరిశీలించారు. గద్దెల పునరుద్ధరణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ కల్యాణ మండపం పక్కన నుంచి నిర్మిస్తున్న క్యూలైన్ పనులను పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పీఆర్ అధికారులకు సూచించారు. ఆయన వెంట ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్ ఉన్నారు. నేడు యథావిధిగా ప్రజావాణి ములుగు రూరల్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. నేటినుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 24న గట్టమ్మ దేవాలయం వద్ద వేలం మలుగు రూరల్: మేడారం జాతర సందర్భంగా గట్టమ్మ దేవాలయంలో కొబ్బరికాయలు, కుంకుమ పసుపు విక్రయించుకునే షాపులకు ఈ నెల 24న వేలం పాట నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ ఈఓ బిల్ల శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వేలం పాటలు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు. రామాలయంలో పారాయణం కాళేశ్వరం: ధనుర్మాసం సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయంలో ఆలయ అర్చకులు ఆరుట్ల రామాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పాశురం చొప్పున పారాయణం పఠిస్తున్నారు. ఆదివారం శ్రీసీత సమేత రామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. 24న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పసుల లక్ష్మణ్, పక్కల రాజబాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్హర్ మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్సాహమున్న మహిళలు, పురుషులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 85 కేజీలోపు బరువు ఉండాలని సూచించారు. క్రీడాకారులు ఆధార్కార్డుతో పాటు కబడ్డీ కిట్ను వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని ఈ నెల 26నుంచి ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 86393 46695, 90106 77080 ఫోన్నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమం భూపాలపల్లి అర్బన్: జిల్లా యువజన సర్వీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిట్ ఇండియా మిషన్ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలో నిర్వహించినట్లు డీవైఎస్ఓ చిర్ర రఘు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేడ్కర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు సండేస్ ఆన్ బైస్కిల్ అనే కార్యక్రమం విద్యార్థులతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రఘు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా కోట్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది శివసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజీమార్గమే రాజమార్గం
ములుగు రూరల్: జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకొని కక్షిదారులు తమ కేసులను రాజీకుదుర్చుకొని ప్రశాంత జీవితం గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్య చంద్రకళ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కోర్టులో లోక్ అదాలత్లో నాలుగు బెంచీలు ఏర్పాటు చేసి.. 413 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఎంవీఓపీ కేసులు 13 కాంపిన్సేషన్ రూ.66,39, ఆధార్ కేసులు 164 పరిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధులిక, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్చారి, రంగోజు భిక్షపతి, నర్సిరెడ్డి, సారంగపాణి, మేకల మహేందర్, సునిల్కుమార్, సుధాకర్, స్వామిదాస్, రాజేందర్, అశోక్, సూర్యం, దిలీప్ పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం ములుగు రూరల్: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ అన్నారు. ఆదివారం మండలంలోని జాకారంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి నిర్వహించిన క్రికెట్ మ్యాచ్కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోష్ణ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మధులిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్చారి, బానోత్ స్వామిదాస్, న్యాయవాదులు సునిల్కుమార్, రాజ్కుమార్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ జాతీయ లోక్అదాలత్లో 413 కేసులు పరిష్కారం -
కల్వర్టు నిర్మించాలి
మల్హర్: మండలంలోని కొండపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కుంభంపల్లి గ్రామం నుంచి మానేరు సమీపంలో పొలాలకు, శ్మశానవాటికకు వెళ్లడానికి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారిలో ఒర్రె మాటు నిత్యం నీళ్లు ఉండటంతో రైతులు అటుగా పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతిమయాత్ర కార్యక్రమాలకు, పొలం పనులకు వెళ్లడానికి వర్షాకాలం సీజన్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కుంభంపల్లి మాటుపై కల్వర్టు నిర్మించి, రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన నిఖిల్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్లో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్స్ అండర్ 18 పోటీల్లో పెద్దపల్లి జిల్లా జట్టు తరఫున నిఖిల్ అత్యంత ప్రతిభ కనబర్చాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 4 వరకు కర్ణాటకలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో నిఖిల్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. గురుకులం విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఖోఖో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అద్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి కుమార్, ప్రిన్సిపాల్ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం, పీడీ మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. -
ఎట్టకేలకు రోడ్డు పనులు
ఏటూరునాగారం: మేడారం జాతర సందర్భంగా మండలంలోని కొండాయి వద్ద ఎట్టకేలకు రోడ్డు పనులు చేపట్టారు. ఇప్పటికే కొండాయి బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్ తన మిషనరీ తరలించేందుకు, పనులు చేపట్టేందుకు రోడ్డు నిర్మించాడు. జాతర సందర్భంగా మంజూరైన రూ. 60 లక్షలతో మరో రెండు రోడ్లను నిర్మించేందుకు ఆదివారం పనులు ప్రారంభించాడు. మేడారం జాతర భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలను సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు జాతరకు వారం ముందుగానే చేయాలని ఆదేశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పైపులు సిద్ధం చేసి ఉంచారు. వాటిపై నుంచి మట్టి, ఇసుక బస్తాలతో తాత్కాలిక రోడ్డును నిర్మించనున్నారు. -
పంచాయతీ పట్టని ఓటర్లు!
ఓటుకు దూరంగా 2.93 లక్షల మందిఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలు : 1,682● 21.17 లక్షల మందికి ఓటేసింది 18.25 లక్షల మంది ● 87 శాతానికే పరిమితమైన ఓట్లు.. మూడు విడతల్లోనూ ఇదే పరిస్థితి ● పోలింగ్ శాతం తగ్గడంపై సర్వత్రా చర్చ.. ఇదే అంశంపై ఉన్నతాధికారుల ఆరాఓటేయని వారి శాతం : 13.82పోలింగ్ శాతం : 86.182,92,63821,17,18818,24,580మొత్తం ఓటర్లుపోలైన ఓట్లుసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 89 నుంచి 94 శాతం వరకు పోలింగ్ నమోదవుతుందని అధికారులు సైతం భావించారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించడంతోపాటు.. ఓటు సద్వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 21,17,188 మంది ఓటర్లు ఉండగా 18,24,580 (86.18 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామలో ఎక్కువగా నమోదు.. ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఓటు శాతం 87.07 దాటలేదు. 2,92,608 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జనగామలో ఓటింగ్ ఎక్కువగా నమోదైంది. మొదటి విడతలో అత్యధికంగా జనగామ జిల్లాలో 87.39 శాతం, రెండో విడతలో 88.52 శాతం కాగా, మూడో విడతలో 88.48 శాతంగా నమోదైంది. మూడో విడతలో మహబూబాబాద్లో 88.52 శాతం ఓట్లు పోలయ్యాయి. మండలాల వారీగా చూస్తే కూడా 8 మండలాలు మినహా ఏ మండలంలోనూ 90 శాతాన్ని మించి ఓటుహక్కు వినియోగించుకోలేదు. 1,682 గ్రామ పంచాయతీల పరిధిలో 21,17,580 మంది ఓటర్లకు 18,24,580 మంది (86.18 శాతం) ఓట్లు వేయగా.. 2,92,638 (13.82 శాతం) మంది ఓటుకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఓట్ల శాతం ఎందుకు తగ్గినట్లు..? పోలింగ్ శాతం తగ్గడంపై ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ కాకుండా.. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో మరిన్ని ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు పోలింగ్ బూత్స్థాయి అధికారులు (పీబీఎల్ఓలు) డివిజన్, జోనల్ ఇన్చార్జ్లు, రూట్ ఆఫీసర్ల వరకు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. ఓట్ల శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లను కొన్ని తొలగించలేదని ప్రాథమికంగా గమనించినట్లు చెబుతున్నారు. మృతుల పేర్లు జాబితాలో కొనసాగడంతోపాటు స్థానికేతరుల పేర్లను తొలగించకపోవడం వల్ల పోలింగ్ శాతంగా తగ్గినట్లు భావిస్తున్నామని, వాటన్నింటిపై కసరత్తు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏయే జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది.. అందుకు కారణాలు ఏమిటన్న విషయాలతో పాటు తక్షణమే తొలగించాల్సిన ఓటర్ల జాబితాను కూడా ఈ మేరకు జిల్లాల వారీగా సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపేందుకు ఓ నివేదికను అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం. -
కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు
ములుగు: జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ఈనెల 17తో పూర్తయ్యా యి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పాలక వర్గాలు కొలువు దీరడానికి సిద్ధమవుతున్నాయి. నేడు (సోమవారం) సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 146 పంచాయతీలు ఉండగా, ఈ నెల 11న మొదటి విడతలో 48 పంచాయతీలకు, 14న రెండో విడతతో 52 పంచాయతీలకు, 17న మూడో విడత 46 పంచాయితీలకు ఎన్నికలు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 146 గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. నేడు మొదటి సమావేశం నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి వీరితో నిబంధనల ప్రకారం ప్రమాణం చేయించిన అనంతరం ప్రమాణ పత్రంపై సంతకాలు చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రత్యేక అధికారుల పాలనకు తెర 23 నెలలుగా గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సైతం నిలిచిపోయాయి. సుమారు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు ఏర్పాటు చేయడంలో ప్రత్యేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండడంతో గ్రామాల్లో పంచాయతీలకు కొత్త కళ సంతరించుకోనుంది. నేడు సర్పంచ్ల ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టనున్న 146 మంది సర్పంచ్లు ఏర్పాట్లు చేసిన పంచాయతీ అధికారులు -
కిటకిటలాడిన హేమాచల క్షేత్రం
ప్రత్యేక అలంకరణలో స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామి, దర్శించుకుంటున్న భక్తులు మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఆదివారం కిటకిటలాడింది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు ఆటోలలో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగులకు సెలవు రోజు కావడంతో జిల్లాలోని రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని భక్తులు ఆలయంలో స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు. -
రూ.203 కోట్ల నిధులు మంజూరు
కాటారం: మంథని నియోజకవర్గంలోని మంథని–ఆరెంద మానేరు మీదుగా దామెరకుంట వరకు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్ల నిధులు విడుదలైనట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని మండలం ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 కిలోమీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుంచి బ్రిడ్జి వరకు మరో వైపు దామెరకుంట రోడ్డు వరకు 9.530 కిలో మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంథనితో పాటు ఇతర మండలాల ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాకు, మహారాష్ట్ర, కాళేశ్వరం దేవాలయానికి ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి వీలుగా ప్రజలకు రవాణా భారం తగ్గించేందుకు బ్రిడ్జి నిర్మాణానికి సంకల్పించినట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం ద్వారా మంథని, పెద్దపల్లి జిల్లా నుంచి కాళేశ్వరం వెళ్లడానికి 25 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మానేరుపై బ్రిడ్జి నిర్మాణం పట్ల ఈ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేయడంతో పాటు మంత్రి శ్రీధర్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. -
చదువుతోనే ఉన్నతస్థాయి
● బాలల పరిరక్షణ అధికారులు కృష్ణవేణి, హరికృష్ణవాజేడు: ఆడపిల్లలు ప్రణాళికతో చదువుకుంటేనే ఉన్నతస్థాయికి చేరుకుంటారని జిల్లా బాలల పరిరక్షణ అధికారులు కృష్ణవేణి, హరికృష్ణ అన్నారు. మండల పరిధిలోని పెద్ద గొళ్లగూడెం బాలికల అశ్రమ పాఠశాలలో శనివారం బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని సోషల్ వర్కర్ సుమన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకోవడం మూలంగా కుటుంబం, సమాజం బాగు పడుతుందని తెలిపారు. చట్టాలు, హక్కులు మొదలైన అన్ని అంశాలపై అవగాహన ఉంటుందని వివరించారు. బాల్య వివాహాల మూలంగా కలిగే నష్టాలను వివరించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన దాతల సహకారంతో శానిటరీ నాప్కిన్లు, ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన దాతల సహకారంతో నాప్కిన్లు, ప్లే కిట్లు అందించారు. -
వైభవోపేతంగా కల్యాణ మహోత్సవం
భూపాలపల్లి అర్బన్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీకోదండ రామాలయంలో శనివారం నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదోక్త విధానాలు, ఆగమ శాస్తోక్త్ర నియమాలను అనుసరించి మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణలు, సంప్రదాయ ఆచారాలతో ఈ కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. భూపాలపల్లి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి దివ్య దర్శనం చేసుకొని, కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి అపార కృపాశీస్సులను పొందారు. భక్తుల సౌకర్యార్థం సింగరేణి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ దేవస్థానానికి చెందిన అర్చక స్వాములు, వేద పండితులు, సిబ్బంది సమన్వయంతో శాస్తోక్త్రంగా కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించారు. ఈ కల్యాణోత్సవంలో జిల్లా ప్రధాన నాయమూర్తి రమేష్బాబు, జడ్జిలు నాగరాజు, దిలీప్కుమార్, అఖిల, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
చెక్ డ్యాం పరిశీలన
మల్హర్: జిల్లా సరిహద్దులోని వల్లెకుంట–పెద్దపల్లి జిల్లా మంథని అడవి సోమన్పల్లి మానేరుపై నిర్మించిన డ్యామేజ్ అయిన చెక్డ్యాంను స్టేట్ ఫొరెన్సిక్ టీమ్, క్లూస్ టీం సభ్యులు శనివారం పరిశీలించారు. ఈనెల 17న చెక్ డ్యాం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు కొయ్యూరు స్టేషన్లో ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టగా శనివారం ఈ ఘటనపై చెక్ డ్యామ్ డ్యామేజీ అయిన ప్రదేశాన్ని ఫొరెన్సిక్, క్లూస్ టీం సభ్యులు చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించి నమూనాలు సేకరించారు. సదరు నివేదిక ఆధారంగా చెక్ డ్యామ్ కూలిపోయిందా.. కూల్చేశారో తెలియనుంది. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్, ఎస్సై–2 రజన్కుమార్, మహదేవపూర్ ఎస్సై పవన్ ఉన్నారు. -
ఇప్పుడేం చేద్దాం?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా?.. త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్ లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్ లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ క్రమంలో జీపీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో విస్తృతంగా సాగుతోంది. సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్పై మళ్లీ మొదలైన చర్చ 2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లుమొత్తం సహకార సంఘాలు: 99 డైరెక్టర్ స్థానాలు: 1,260 ఏకగ్రీవంగా ఎన్నికై నవి: 509 ఎన్నికలు జరిగినవి: 751 -
క్రీడలతో మానసికోల్లాసం
గోవిందరావుపేట: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని వివిధ బెటాలియన్లకు చెందిన కమాండెంట్లు జమీల్ భాషా, సత్యనారాయణ, వెంకట్రాములు, పెద్దబాబు, రిటైర్డ్ డీఎస్పీ కుమారస్వామి అన్నారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో 5వ బెటాలియన్ ప్రాంగణంలో వార్షిక క్రీడోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. అనంతరం 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సిబ్బందికి ప్రతీ ఏడాది క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామపాలన అధికారుల జిల్లా కమిటీ ఎన్నిక ములుగు రూరల్: గ్రామపాలన అధికారుల జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో గ్రామపాలన అధికారుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా సబాక సర్వేశ్వరావు, ఉపాధ్యక్షుడిగా బల్గూరి సూరయ్య, ప్రధాన కార్యదర్శిగా అర్లె రాజేందర్, కోశాధికారి తొర్రం శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శగా బొప్ప సమ్మయ్య, ప్రచార కార్యదర్శిగా గంప నర్సయ్య, కార్యవర్గ సభ్యులుగా కాసర్ల రాజయ్య, బొచ్చు కృష్ణవేణి, సమ్మక్క, రుక్మిణిని ఎన్నుకున్నారు. గీత కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి ములుగు రూరల్: కల్లుగీత కార్మికులు హక్కుల సాధనకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పులి నర్సయ్యగౌడ్ అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో ఇటీవల జీపీ ఎన్నికల్లో సర్పంచ్లుగా విజయం సాధించిన అభ్యర్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులు కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలపై సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిపల్లి చైతన్య, సంఘం అధ్యక్షుడు గుండెబోయిన రవి, బుర్ర శ్రీనివాస్, తాడూరి సంపత్, బాబు, రాజశేఖర్, సోమయ్య, రజిత, రాజు, రమేష్, సత్యం, మల్లేశ్, శోభన్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ములుగు రూరల్: మేరా యువభారత్ మహాన్ వరంగల్ ఆధ్వర్యంలో యువజన సంఘాల నుంచి క్రీడా సామగ్రి పొందేందుకు గాను దరఖాస్తులు చేసుకోవాలని మేర యువ భారత్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మై భారత్ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన ఉమ్మడి జిల్లాలోని యువజన సంఘాలు, మహిళ మండలీల నుంచి దరఖాస్తులు ఈ నెల 31వ తేదీ లోపు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 08702958776లో సంప్రదించాలని సూచించారు. హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వయంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం పూజలు, అర్చనలు జరిపించారు. -
ధనుర్మాసం ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని శ్రీపట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ పట్టాభి సీతారామచంద్ర భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత ఆలయంలో ప్రతీ సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ తెలిపారు. అందులో భాగంగా స్వామి వారిన ప్రత్యేకంగా అలంకరించినట్లు చెప్పారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవాలన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి
● డీఈఓ సిద్ధార్థ్రెడ్డి ములుగు రూరల్: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్రెడ్డి సూచించారు. ఈ మేరకు బండారుపల్లి మోడల్ పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన వైజ్ఞానికి ప్రదర్శనలో 278 ప్రాజెక్టులను ప్రదర్శించగా డీఈఓ శనివారం పరిశీలించారు. అత్యుత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులు 5 ఆర్రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రీకనుక్ట్, రెన్యూవబుల్ సూత్రాలను పాటిస్తూ ముందుతరాలకు వనరుల కొరత లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర స్థాయికి 21 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని వివరించారు. జనవరి 7వ తేదీన కామారెడ్డి జిల్లాలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీలలో ఆయా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘టెన్త్’ టైం టేబుల్ మార్చాలి
● టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్యఏటూరునాగారం: టెన్త్ వార్షిక పరీక్షల టైం టేబుల్ అశాసీ్త్రయంగా ఉందని దానిని వెంటనే మార్చాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొడెం సమ్మయ్య అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో యూటీఎఫ్ మండల కమిటీ ఎన్నికను శనివారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏడు పరీక్షలకు 35రోజుల సమయం నిర్ణయించడం అనాలోచితమన్నారు. పరీక్ష పరీక్షకు నాలుగు నుంచి ఆరు రోజులు విరామం ఇవ్వడం వల్ల విద్యార్థుల ఆసక్తి తగ్గి అనవసర ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఒక పరీక్షకు ఒక్కరోజు విరామం చాలు అనేది విద్యావేత్తల అభిప్రాయం అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి టైం టేబుల్ సవరించాలని కోరారు. అలాగే సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు .ఏటూరునాగారం మండల అధ్యక్షుడిగా పత్రి కిరణ్, ప్రధాన కార్యదర్శిగా పోడెం ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా మడే చిట్టిబాబు, ఎట్టి స్వరూప, కోశాధికారిగా మండప సంతోష్, కార్యదర్శులుగా సీహెచ్.సుమన్, ఎం.శ్రావణ్ కుమార్, ఎన్.వంశీ, ప్రశాంత్, ఎన్.రజిని, బి.రూప, వి.జగన్, ఎండీ.మున్వర్, పి.సరిత, ఎన్.రామచందర్రావును ఎన్నుకున్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
● వీసీలో రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి ప్రభాకర్ములుగు రూరల్: రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, ఆర్అండ్బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, లాఅండ్ఆర్డర్ ఏడీజీ మహేశ్ ఎం.భగవత్లు జాతీయ రహదారులు, ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ సంపత్రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అదే విధంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, ఇతర పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, డీఈఓ సిద్దార్థరెడ్డి, నేషనల్ హైవే డీఈ కుమారస్వామి, పీఆర్ ఈఈ అజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు
ములుగు రూరల్: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీలు హాజరయ్యారు. వరదలు, పరిశ్రమ ప్రమాదాల నియంత్రణపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వరదలు, ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన తీరుపై ముందస్తుగా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఎస్ఓపీ తయారు చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జాతీయ విపత్తుల అథారిటీ సూచనలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆధికారులు సకాలంలో స్పందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గోపాల్రావు, వ్యవసాయ, పశు సంవర్ధక, అగ్నిమాపక, విద్యుత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు -
టీబీ నియంత్రణకు పాటుపడాలి
● డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగు రూరల్: టీబీ నియంత్రణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన మొబైల్ ఎక్స్రే యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. మొబైల్ ఎక్స్రే యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ యంత్రం ద్వారా రోజుకు 60 మందికి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయవచ్చన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తులను నిక్షయ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి చంద్రకాంత్, డెమో సంపత్, రమేష్, చంద్రమౌళి, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నుంచే.. యూరియా బుకింగ్
నేటి నుంచి అందుబాటులోకి మొబైల్ యాప్ ములుగు: రైతులు ఇక యూరియా కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పని లేదు. రైతు ఇంటి నుంచే మొబైల్లో యూరియా బుక్ చేసుకునేలా వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్ను రూపొందించింది. నేటి నుంచి యాప్ అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 1,02,250 ఎకరాల్లో పంటలు సాగు కానుండగా 25,600 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఈ మేరకు 80 వేల ఎకరాల్లో వరిపంట, 9,300 ఎకరాల్లో మొక్కజొన్న, 12,500 ఎకరాల్లో మిర్చి, 450 ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. ఈ పంటలకు వినియోగించేందుకు గాను 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 6,500 మెట్రిక్ టన్నుల డీఏపీ, 2,100 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. మొబైల్లో ఎరువుల యాప్ ఓపెన్ చేయగానే రైతులు, వ్యవసాయశాఖ, డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి. లాగిన్లో మొబైల్ నంబర్ను ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలర్లు, యూరియా స్టాక్ వివరాలు కనిపిస్తాయి. పాస్బుక్ నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. సాగు చేసే పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మోతాదులో యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తుంది. యూరియా బుక్ చేసిన తర్వాత 15 రోజుల్లో 4 దశల్లో యూరియా అందుతుంది. పాస్బుక్ లేని రైతులు పట్టాపాస్ బుక్ ఆఫ్షన్లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు సైతం యూరియా తీసుకోవచ్చు. వ్యయసాయ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా రైతు నేరుగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. ఏయే డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో తెలుస్తుంది. ఇందుకనుగుణంగా యూరియాను బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది. పరిమితికి మించి యూరియా తీసుకునే అవకాశం లేదు. కృత్రిమ కొరతకు ఆస్కారం ఉండదు. – సురేశ్కుమార్, డీఏఓవ్యవసాయశాఖ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చు. తనకు ఇష్టమైన డీలర్ నుంచి బుక్ చేసుకోవచ్చు. వెంటనే ఐడీ వస్తుంది. అందుకనుగుణంగా డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చు. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భూవిస్తీర్ణం, వేసిన పంటకనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా పరిమితికి మించి యూరియా వాడకుండా, పక్కదారి పట్టకుండా చూడొచ్చు. యాసంగిలో 1,02,250 ఎకరాల్లో పంటల సాగు 25,600 మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం -
‘మేడారం జాతరకు నిధులు కేటాయించాలి’
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డిని నాయకులు కోరారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఆధ్వర్యంలో మంత్రిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జాతరకు నిధుల కేటాయింపునకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ మ్యూజియం అభివృద్ధికి, ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. భద్రాచలం నుంచి మేడారం మీదుగా కాళేశ్వరం వరకు రోడ్డు అభివృద్ధి చేయాలని విన్నవించినట్లు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయడంతో పాటు మేడారంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం, ఐటీడీఏకు నిధుల మంజూరుతో పాటు మేడారం జాతర అభివృద్ధికి టూరిజం హెరిటేజ్ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారని బలరాం వివరించారు. మంత్రి కిషన్రెడ్డిని కలిసిన వారిలో పార్టీ జిల్లా ఉపాధ్యకుడు భరతపురం నరేశ్ మందాల లవన్ కుమార్, ఆదివాసీ రాష్ట్ర నాయకుడు పోదెం రవీందర్, మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, వనవాసీ కల్యాణ్ పరిషత్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ ఉన్నారు. -
ట్రాన్స్జెండర్లు పేర్లు నమోదు చేసుకోవాలి
ములుగు రూరల్: జిల్లాలోని ట్రాన్జెండర్లు నేషనల్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి తుల రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోర్టల్లో పేరు నమోదు చేసుకుని ట్రాన్స్జెండర్ ఐడీ కార్డు, సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. నిరుద్యోగులైన ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం తెలంగాణ పునరావాస పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. వాజేడు: మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గజ్జల కృష్ణయ్య ఇంట్లో కోడి 11 గుడ్లు పెట్టి పొదిగింది. పది పిల్ల లు రెండు కాళ్లతో జన్మించగా ఒక కోడి పిల్ల మాత్రం నాలుగు కాళ్లతో పుట్టింది. మిగితా వాటికంటే నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల చురుగ్గా ఉందని కృష్ణయ్య తెలిపారు. ములుగు రూరల్: విదేశాల్లో చదువుకునే సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పఽథకం ద్వారా పోస్టు గ్రాడ్యూయేట్ విదేశాల్లో చదివేందుకు దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అ ధికారి సర్ధార్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసిన పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, ములుగు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో నేడు(శనివారం) రెండు నూతన కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్సింగ్ వర్ుచ్యవల్గా ప్రారంభిస్తారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నామవారపు రాజేశ్వర్రావు, జస్టిస్ బిఆర్ మధుసూదన్రావు వర్ుచ్యవల్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్ను కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రావణ్రావు, విష్ణువర్ధన్రావు, శివకుమార్, రమేష్నాయక్, రాకేష్, వెంకటస్వామి, దివ్య పాల్గొన్నారు. టేకుమట్ల: గ్రూప్ త్రీ ఫలితాల్లో మండలంలోని రామకృష్ణపూర్ (టి)గ్రామానికి చెందిన కూలీ కొడుకు బొంపెల్లి బాలకృష్ణ మంచి ర్యాంకు సాధించి గురుకుల విద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. మండలంలోని రామకృష్ణపూర్ (టి) గ్రామానికి చెందిన బొంపెల్లి గొవిందం–విమల దంపతులది రెక్కడితేగానీ డొక్కాడని కుటుంబం. నిత్యం కూలి పని చేసుకుంటూ కుమారుడు బాలకృష్ణను ఉన్నత చదువులు చదివించారు. బాలకృష్ణ చదువులో కష్టపడుతూ సివిల్స్ కోసం సన్నద్ధమయ్యాడు. సివిల్స్ రాకపోవడంతో గ్రూప్ వన్, టూ, త్రీకి సన్నద్ధమయ్యాడు. గ్రూప్ త్రీలో 1,061 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు. మల్హర్: తాడిచర్ల పీఏసీఎస్ కార్యాలయంలో విక్రయించేందుకు ఆరబోసిన ధాన్యాన్ని పందులు తింటున్నాయి. ఽపనులు వదులుకొని పగలు, రాత్రి కావలి కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను కోరుతున్నారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
● అదనపు కలెక్టర్ సంపత్రావు ములుగు రూరల్: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ సంపత్రావు అన్నారు. మండల పరిధిలోని బండారుపల్లి మోడల్ స్కూల్లో శుక్రవారం 53వ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రతిభకు పేదరికం, గ్రామీణ నేపధ్యం అడ్డుకాదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఆధునిక వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథంతో కూడిన వినూత్న ప్రదర్శనలను తీసుకురావాలని సూచించారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ఫేర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు అన్ని విధాలుగా సహకరించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, వినోద్ కుమార్, రాజు, శ్యాంసుందర్, రజిత, శ్రీని వాస్రెడ్డి, దివాకర, శ్రీనివాస్, మల్లయ్య, రామ య్య, శ్రీనివాస్, మల్లారెడ్డి, సోమారెడ్డి, లక్ష్మీరెడ్డి, వి ద్యాసాగర్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు వసతులు కల్పించండి..
ఐనవోలు: ఐనవోలు మల్లన్న జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ఎండోమెంట్ అధికారులు సమష్టిగా పనిచేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జాతర నిర్వహణపై శనివారం కలెక్టరేట్లో వివిధ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భక్తుల కోణంలో చర్చించి వారికి అవసరమయ్యే సౌకర్యాలు కల్పించడంపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డార్మెటరీ నిర్మాణానికి గతంలోనే ఆమోదం.. మల్లన్న ఆలయంలో కమ్యూనిటీ హాల్ కం డార్మెటరీ హాల్ నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) గతంలో ఆమోదం తెలిపింది. బేస్మెంట్ వరకు పనులు జరిగి నిధులు మంజూరు లేకపోవడంతో నిలిచిపోయింది. మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయించాలి. గతంలో ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ, నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు చేయడంతోపాటు గతంలో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐమాస్ట్ లైటింగ్ టవర్స్ రిపేర్ చేయించాలని కోరుతున్నారు. భక్తుల డిమాండ్లు ఆలయ ప్రాంగణంలో పట్నాలు, ఇతరత్ర ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక లైన్ ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలి. ● సేవా టికెట్ కొనుక్కున్న భక్తుల నుండి ఒగ్గు పూజారులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి. ● మల, మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడుతుండగా భక్తులకు సరిపోయే విధంగా సులభ్ కాంప్లెక్స్లు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. ● భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి గదులు, పెద్ద డార్మెటరి హాలు నిర్మించాలి. ● ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలి. ● ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా మరమ్మతులు చేపట్టాలి, ఆర్కియాలజి శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. ఆలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పేరిణి నృత్య మండపాన్ని ఆధునీకరించాలి. ● రాజగోపురం, కోనేరు ఏర్పాటు, అలాగే ఆలయం చుట్టూ ఉన్న నేల బయ్యారాన్ని నిపుణుల సాయంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. ● పూర్వం ఊరగుట్టపైనే మల్లికార్జునస్వామి వెలిశాడని ఐనవోలువాసుల నమ్మకం. ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరఫున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊర గుట్ట, కింద ఉన్న చెరువును అభివృద్ది పరిచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష మల్లన్న భక్తుల్లో ఉంది. ● జాతర ప్రాంగణంలో 10 స్నాన ఘట్టాలు ఉండగా సీ్త్రల డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ● గత జాతరలో నీటి సరఫరాలో ఇబ్బందులు పడిన కారణంగా 10 హెచ్పీ మోటార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● 40 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, రెండు అదనపు హైమాస్ట్ లెటింగ్ టవర్స్, భద్రతపరంగా మరో 50 సీసీ టీటీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అగ్నిమాపక వాహనం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. ● ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ స్టేషన్ను మరో చోటకు మార్చాలి. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో పోలీసులు పట్టుకున్న, యాక్సిడెంట్ వాహనాలను ఉంచడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, వెంటనే మరోచోటకు తరలించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఈఓ కందుల సుధాకర్ కోరుతున్నారు. ఐనవోలు జాతర నిర్వహణపై నేడు సమావేశం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షకు సిద్ధం తాత్కాలిక, శాశ్వత అభివృద్ధిపై దృష్టి సారించాలంటున్న భక్తులు -
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
ములుగు రూరల్:/గోవిందరావుపేట: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. ఈ మేరకు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా చౌరస్తాలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆ ప్రతులను దహనం చేశారు. దేశంలోని వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం వ్యవసాయ కూలీల ప్రయోజనాలకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందని వివరించారు. సంవత్సరానికి 100 రోజుల పనిదినాలు లభిస్తుండగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిథిగా ఉంచాలని కోరారు. అదేవిధంగా వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని తాళ్లపాడ్ సెంటర్లో సైతం బిల్లు ప్రతులను సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటరీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకురావడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, గొంది రాజేశ్, అంబాల మురళి, గుండు రామస్వామి, కడారి నాగరాజు, కొట్టే కృష్ణారావు, క్యాతం సూర్యనారయణ, కన్నోజు సదానందం, గుండు లెనిన్, కందుల రాజేశ్వరీ, మంచాల కవిత, పిట్టల అరుణ్, సిరిపల్లి జీవన్, డాక్టర్ ఐలయ్య, మడకం రాజు తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శి సాంబశివ -
సహకార సంఘాల నిర్వహణ భారం
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ములుగు రూరల్: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ, జీసీసీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం కమీషన్ అందించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం రెండు సీజన్ల కమీషన్ డబ్బులను నిర్వాహకుల ఖాతాలలో జమ చేయలేదు. దీంతో ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, గిరిజన సహకార సంఘాల నిర్వహణ భారంగా మారుతుంది. మహిళా సంఘాలు, రైతు సంఘాల నిర్వాహకులు కమీషన్ల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. సహకార సంఘాల నిర్వహణ భారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గిరి జన సహకార సంఘాలు, ఐకేపీ, రైతు సంఘాలు ధాన్యం కొనుగోలు చేయగా వచ్చిన కమీషన్ డబ్బులను సంఘాల అభివృద్ధికి వినియోగిస్తారు. గత రెండు సీజన్ల నుంచి కమీషన్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారుతుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వా రా ధాన్యం సేకరించి మిల్లులకు తరలించిన అనంతరం రైతులకు డబ్బులను చెల్లిస్తుంది. నిర్వహకులకు క్వింటాకు రూ.32 చొప్పున టన్నుకు రూ.320 అందిస్తుంది. నిర్వాహకులు సేకరించిన ధాన్యం లెక్కల ప్రకారం కమీషన్ అందించాల్సి ఉంటుంది.కొనుగోలు కొనుగోలు చేసిన ధాన్యం కమీషన్ పెండింగ్ కేంద్రాలు (మెట్రిక్ టన్నులు) (రూపాయల్లో) ఐకేపీ 2,00,097.20 59,65,808.52 పీఏసీఎస్ 7,23,732.40 2,26,37,680.42 జీసీసీ 47,601.20 14,95,068.42 ఎఫ్పీఓ 9,711.60 2,78,842.54 ఓడీసీఎంఎస్ 30,737.60 9,61,438.54 మొత్తం 10,11,880.00 3,13,38,838.44 ఐకేపీ 82,386.00 23,48,478.35 పీఏసీఎస్ 3,58,926.00 1,12,46,646.90 జీిసీసీ 16,968.00 4,72,287.90 ఎఫ్పీఓ 4,901.20 1,55,554.10 ఓడీసీఎంఎస్ 4,014.40 1,25,668.7 మొత్తం 4,67,195.60 1,43,48,635.952023–2024 వర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 1,01,188 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రావాల్సిన కమీషన్ రూ. 3,13,38,838.44 పెండింగ్లో ఉన్నాయి. యాసంగి సీజన్లో 4,67,195.60 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కమీషన్ రూ.1,43,48,635.95 పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన కమీషన్ 4,56,87,473.91 పెండింగ్లో ఉంది. ఎదురు చూస్తున్న ఐకేపీ సభ్యులు రెండు సీజన్ల డబ్బులు పెండింగ్2023–24 ఖరీఫ్, యాసంగి సీజన్కు సంబంధించిన కమీషన్ డబ్బలు ప్రభుత్వం నుంచి రాలేదు. ధాన్యం కొనుగోలు పూర్తి అయిన వెంటనే కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన కమీషన్ వివరాలను ఉన్నతాధికారులకు అందించాం. కమీషన్ వచ్చిన వెంటనే నిర్వాహకుల ఖాతాలలో జమ చేస్తాం. కొన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సివిల్ సప్లయీస్ నుంచి స్వీకరించిన గన్నీబ్యాగ్స్ తిరిగి అప్పగించని కారణంగా కమిషన్లలో కోతలు విధిస్తున్నాం. – రాంపతి, జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ -
‘పంచాయతీ‘పై పోస్టుమార్టం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. పార్టీ గుర్తు లేనప్పటికీ.. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఏ మేరకు సక్సెస్ అయ్యారు? ఎక్కడ, ఎందుకు పంచాయతీ స్థానాలు తగ్గాయి? పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి కారణాలు ఏంటి? అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే జరిగిందా? అలాగైతే రెబల్స్ ఎందుకు బరిలో ఉన్నారు? ఓటమికి వెన్నుపోట్లు కారణమా? అలాగైతే ఏయే జిల్లాల్లో ఈ వెన్నుపోట్లు ప్రభావం చూపాయి? అన్న కోణాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విశ్లేషిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఫలితాలపై విశ్లేషణ.. విడతల వారీగా వెలువడిన ఫలితాలపై ప్రధాన పార్టీలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్లో 1,682 గ్రామ పంచాయతీలకు మూడు వితల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కలిపి అధికార కాంగ్రెస్ 1,036 పంచాయతీలను గెలుచుకోగా, బీఆర్ఎస్ 479 స్థానాలతో వెనుకబడింది. బీజేపీ 31 స్థానాలు, ఇతరులు 136 గ్రామ పంచాయతీలు దక్కించుకున్నారు. మొదటి విడతలో 555 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 333, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, ఇతరులు 57 మంది గెలుపొందారు. రెండో విడతలో 563కు కాంగ్రెస్ 332, బీఆర్ఎస్ 181 గెలుచుకుని పుంజుకుంది. బీజేపీ 9, ఇతరులు 41 దక్కించుకున్నారు. మూడో విడత 564 స్థానాలకు 371 కాంగ్రెస్, 150 బీఆర్ఎస్, 5 బీజేపీ, 38 మంది ఇతరులను ప్రజలు సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. ఇంకొంత దృష్టి సారిస్తే మరిన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకునే అవకాశం ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి తగ్గడంపై ఎక్కడ లోపం జరిగింది? అన్న కోణంలో బీఆర్ఎస్ అగ్రనేతలు నియోజకవర్గ స్థాయి నాయకులను ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఎందుకు తగ్గాయి.. ఎక్కడ పెరిగాయి? ఫలితాలపై ఆరా తీస్తున్న అన్ని పార్టీల నాయకులు గెలుపు గుర్రాల ఎంపికలో ఏమరుపాటు.. చాలాచోట్ల ఫలితాలు తారుమారు పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోట్లు.. రెబల్స్గా బరిలో నెగ్గిన పలువురు భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు వెన్నుపోట్లు, రెబల్స్.. అధిష్టానాలు సీరియస్ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు, కొరవడిన సమన్వయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సీరియస్గానే స్పందించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 65 చోట్ల కాంగ్రెస్, 34 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులపై ఆయా పార్టీలకు చెందిన వారు రెబల్స్గా బరిలోకి దిగారు. 41 చోట్ల కాంగ్రెస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. మిగతా 24 చోట్లపార్టీ అభ్యర్థులు గెలిచినా.. నానా తిప్పలుపడి 30 నుంచి 50 ఓట్ల మెజార్టీనే వచ్చింది. అదేవిధంగా 20 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందగా, 14 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అతికష్టం మీద గెలిచారు. జనగామ, హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా ఇలాంటివి చోటు చేసుకున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధి ష్టానం కూడా భవిష్యత్లో ఇలాంటి పరిణామాలకు తావులేకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికలు రానున్న దృష్ట్యా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యనేతలను అప్రమత్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. -
పుణ్యస్నానాలు.. మొక్కులు
● మేడారానికి భారీగా తరలివచ్చిన భక్తులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు జరుగుతున్న సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా దగ్గరుండి చూడాలని సిబ్బందిని అదేశించారు. -
ఎరువుల బుకింగ్కు మొబైల్ యాప్
ములుగు: రైతులు ఎరువుల బుకింగ్కు మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎరువుల బుకింగ్ యాప్ రైతులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పట్టా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న రైతులు, కౌలు రైతులు, పట్టా లేని రైతులు కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎరువులను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ చేసుకునే సమయంలో రైతులు తమ పట్టా పాస్బుక్ నంబర్, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా నంబర్, పట్టా లేని రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలు వారి ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులు ఆర్డర్ కన్ఫర్మేషన్ అవ్వగానే ఆ సమీపంలోని ఫర్టిలైజర్ దుకాణం లొకేషన్ యాడ్ అవుతుందన్నారు. రైతులు మరుసటి రోజు సంబంధిత ఫర్టిలైజర్ దుకాణంలో యూరియా, ఎరువులు తీసుకోవచ్చని తెలిపారు. సాగు చేసే ఎకరాల ఆధారంగా పలు విడతల్లో యూరియా బస్తాలను రైతులు తీసుకోవాలని, ఎకరం విస్తీర్ణం లోపు సాగు చేసే రైతు ఒకే విడతలో తీసుకోవచ్చని వివరించారు. ఒక ఎకరం నుంచి ఐదెకరాల విస్తీర్ణం సాగు చేసే రైతులు రెండు వాయిదాలలో, ఐదు నుంచి 20 ఎకరాల విస్తీర్ణం సాగు చేసే రైతులు నాలుగు వాయిదాలలో ఎరువు బస్తాలను తీసుకోవచ్చని వెల్లడించారు. ఒక విడత ఎరువులు తీసుకున్న తర్వాత, తదుపరి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా 15 రోజుల వ్యవధి ఉండాలన్నారు. ఈ మొబైల్ అప్లికేషన్పై స్థానికంగా ఉండే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏఈఓలకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సహకార సంఘాలకు, డీఎస్డీఎస్ సభ్యులు అండ్ ఆల్ ఫర్టిలైజర్ షాప్ కీపర్స్కి కూడా అవగాహన కల్పించామని తెలిపారు. ఇతర సమాచారానికి రైతులు సమీప మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్ వెల్లడించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ టీఎస్.దివాకర -
తప్పుడు కేసులు పెట్టడం సరికాదు
జాతీయ రహదారిపై కాంగ్రెస్ ధర్నా ములుగు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ మీద కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఈడీ కేసులు పెట్టడం సరికాదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ మేరకు గురువారం ములుగు జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేంద్ర ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, వంగ రవి యాదవ్, చింతనిప్పుల భిక్షపతి, జయపాల్రెడ్డి, భగవాన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చాంద్పాషా, శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు బాల వైజ్ఞానిక ప్రదర్శన
ములుగు: జిల్లా కేంద్రంలోని బండారుపల్లి మోడల్స్కూల్లో 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన నేడు, రేపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ కొరకు స్టెమ్ అనే ప్రధాన అంశాన్ని ఆధారంగా తీసుకొని విద్యార్థులు సుస్థిరమైన వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ), అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతలు, వినోదకరమైన గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, జల సంరక్షణపై సృజనాత్మకత ప్రాజెక్టులు, నమూనాలు ప్రదర్శించాలని సూచించారు. 2024–25 విద్యా సంవత్సరానికి ఇన్స్పైర్ పథకం కింద ఎంపికై న 20 ప్రాజెక్టులతో పాటు బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సుమారు 500 ఎగ్జిబిట్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్భథం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరింతగా అభివృద్ది చెందుతాయని వివరించారు. జిల్లా ప్రజలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సందర్శించి బాల శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్లు అర్షం రాజు, శ్యాంసుందర్ రెడ్డి, రజిత, శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు తిరుపతి, సోమారెడ్డి, లక్ష్మారెడ్డి, విద్యాసాగర్, శ్రీనివాస్, స్థానిక మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ దేవకి దేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థ రెడ్డి -
గ్రానైట్ రాళ్లపై గ్రైండింగ్తో ఇబ్బందులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయిపరిచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కమ్రంలో ఆ రాళ్లపై గీతలు, ఎత్తువంపులు తొలగించడానికి గ్రైండింగ్ పనులు చేస్తుండడంతో దుమ్ము ఎగిసిపడుతోంది. గ్రైండింగ్ పనులతో గురువారం అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో భక్తులు దుమ్ముతో ఇబ్బందులు పడ్డారు. పనులు నిర్వహిస్తున్న సమయంలో నీటి స్ప్రే చేయకుండా గ్రైండింగ్ చేపట్టడమే కారణమని భక్తులు అంటున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ పనులు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ముతో శ్వాసకోశ సమస్యలు కూడా వ్యాపిస్తాయని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దుమ్ము రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
రామప్పలో సెంట్రల్ రైల్వే కమిషనర్
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం సెంట్రల్ రైల్వే సీనియర్ కమిషనర్ (ఆర్పీఎఫ్) సీహెచ్ చిత్రేష్ జోషి సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. ఆయన వెంట ఎస్సై చల్లా రాజు, టూరిస్ట్ పోలీసులు ఉన్నారు.కన్నాయిగూడెం: మండలంలో బుధవారం జరిగిన స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ఓట్ల లెక్కుంపు ఉత్కంఠ భరితంగా కొనసాగించింది. ప్రతీ రౌండులో ఇద్దరి మధ్య ఒకటి, రెండు ఓట్ల తేడాలు వస్తుండడంతో ఎవరి గెలుస్తారో తెలియక అభ్యర్థులతో పాటు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో మండల పరిధిలోని గూర్రేవుల సర్పంచ్ అంబాల సౌజన్య 3 ఓట్లతో, తుపాకులగూడెం సర్పంచ్గా పీరీల స్వప్న 4 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థులపై విజయం సాధించారు. ములుగు: పీఆర్టీయూ బలోపేతానికి సంఘం నాయకులు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వేం యాకూబ్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్టీయూ నుంచి సూర్యనారాయణ, మోహన్లాల్లు పీఆర్టీయూలో చేరగా సంఘం సభ్యత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండలాధ్యక్షుడు సానికొమ్ము ముకుందారెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణి గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల వేలం పాటలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఎందుకు పోరాటాలు నిర్వహించడం లేదన్నారు. భేషరతుగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాములు, కుమారస్వామి, రాజన్న, కుమారస్వామి, జనార్దన్, జైపాల్, ప్రసాద్ పాల్గొన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరాలయంలో దేవాదాయ, ఎన్పీడీసీఎల్ శాఖల నిర్లక్ష్యం భక్తులకు శాపంగా మారనుంది. రామాలయం వెనుకాల భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన మరుగుదొడ్ల ఎదుట విద్యుత్స్తంభం ప్లోరింగ్తో కలిసి, ఎర్త్ వైర్ బండరాళ్లకు కట్టి ఉంచి నిర్మాణం చేశారు. దీంతో అధికారులు, ఇంజనీర్ల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు ఎర్త్వైర్కు విద్యుత్ సరఫరా జరిగితే ప్రమాదం పొంచి ఉంది. అఽధికారుల స్పందించి తొలగించాలని భక్తులు కోరుతున్నారు. -
హస్తం జోరు
ములుగు: పల్లెపోరులో హస్తం పార్టీ జోరు కొనసాగింది. మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంది. మంత్రి సీతక్క చేసిన అభివృద్ధితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. జిల్లాలో 9 మండలాల్లోని 146 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 102, బీఆర్ఎస్ 32, సీపీఎం 1 స్థానాన్ని, ఇతరులు 11 స్థానాలను గెలుచుకున్నారు. ప్రతి విడతలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. అదే విధంగా జిల్లాలోని 146 జీపీల్లో 25 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా అందులో 24 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఉండడం గమనార్హం. 22న ప్రమాణ స్వీకారం ఈ నెల 22న నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తొలుత ఈనెల 20న కొత్త సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ముహుర్తాలు లేకపోవడంతో వారి అభ్యర్థన మేరకు 22న ప్రమాణ స్వీకారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేండేళ్ల విరామం లోపే నూతన సర్పంచులు బాధ్యతలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ మూడు మండలాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో సర్పంచులుగా విజయం సాధించడంతో విజయోత్సవాల్లో మునిగి తేలారు. గెలిచిన అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చడంతో పాటు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సాగిన మూడు విడతల్లోని పల్లెపోరులో కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగింది. తొలి విడతలో జరిగిన 48 పంచాయతీ ఎన్నికల్లో 36 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, ఇతరులు ఒక స్థానాన్ని కై వసం చేసుకున్నారు. రెండో విడతలో జరిగిన 52 పంచాయతీలకు కాంగ్రెస్ 37, బీఆర్ఎస్ 13, ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు. మూడో విడతలో 46 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 8, ఇతరులు 8, సీపీఎం 1 స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ప్రతీ విడతల్లో అధికార పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక జోష్ సంతరించుకుంది. వెనుకబడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు 22న ప్రమాణ స్వీకారం చేయనున్న సర్పంచులు సంబురాల్లో కాంగ్రెస్ శ్రేణులు -
83.88
శాతం పోలింగ్ముగిసిన మూడో విడత పంచాయతీ పోరుములుగు: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి బుధవారంతో ముగిసింది. 9 మండలాల పరిధిలోని 146 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 26న విడుదల అయింది. మొదటి, రెండో విడతలో 100 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 24 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 పంచాయతీలకు ఈ నెల 11, 14 తేదీలలో ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. మూడో విడత ఎన్నికలు బుధవారం కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లోని 45 పంచాయతీలకు జరిగాయి. ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. ఏజెన్సీ ప్రాంతంలోని మూడు మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎప్పటికప్పుడు మూడు మండలాల్లో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తూ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులకు సలహాలు, సూచనలు అందిస్తూ ఎన్నికలు విజయవంతం అయ్యేలా కృషి చేశారు. అత్యధిక ఓటింగ్ వాజేడులో.. అత్యల్పం వెంకటాపురం(కె)లో.. జిల్లాలోని మూడు మండలాల పరిధిలో 83.88 శాతం పోలింగ్ నమోదు కాగా కన్నాయిగూడెం మండలంలో 82.87శాతం, వాజేడు మండలంలో 86.30 శాతం, వెంకటాపురం(కె) మండలంలో 82.40 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వాజేడు మండలంలో పోలింగ్ శాతం నమోదు కాగా, వెంకటాపురం(కె) మండలంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. కాలినడకన పోలింగ్ కేంద్రాలకు.. ఏజెన్సీలోని మూడు మండలాల్లో సుమారు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. పెనుగోలు, బొల్లారం, మండపాక, కలిపాక, పెంకవాగు, సీతారాంపురం, ముత్తారం, సర్వాయి, మల్కపల్లి, భూపతిపురం ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. చలిని సైతం లెక్కచేయకుండా వచ్చిన ఓటర్లు బుధవారం తెల్లవారుజామునుంచి పొగమంచు కురియడంతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లు ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం 9 గంటల తర్వాత ఓటర్ల రద్దీ విపరీతంగా పెరిగింది. కన్నాయిగూడెం మండలంలో 9,151 మంది ఓటర్లకు 7,576 మంది ఓటు వేశారు. వెంకటాపురం(కె) మండలంలో 25,336 మందికి 20,539 మంది, వాజేడు మండలంలో 19,431 మందికి 16,398 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను అధికారులు వెల్లడించారు. ముందుగా వార్డు మెంబర్ల ఫలితాలను వెల్ల డించి, తర్వాత సర్పంచుల ఫలితాలను అధికారులు వెల్లడించారు. అనంతరం మెజార్టీ వార్డు సభ్యులు కలిసి ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ట్రాక్టర్లలో వచ్చి ఓటు వేసి.. వెంకటాపురం(కె) మండలంలోని కలిపాక, తిప్పాపురం, ముత్తారం, పెంకవాగు, సీతారాంపురం గ్రామాలకు చెందిన ఓటర్లు 6కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలుబాక పంచాయతీ కేంద్రానికి ట్రాక్టర్లలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపురం, బోదాపురంలో టెంట్ కింద పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ -
కొంగాల ఉపసర్పంచ్ ఎన్నికపై ఆందోళన
వాజేడు: మండల పరిధిలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉప సర్పంచ్ ఎన్నికపై ఓ వర్గం వారు ఆందోళనకు దిగి ఎన్నికల సిబ్బంది బస్సు ఎదుట బైటాయించారు. కొంగాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవిని తమ వర్గానికే ఇస్తామని ఎన్నికల ముందస్తుగా హామీనిచ్చి తీరా పోలింగ్, కౌంటింగ్ అయిన తర్వాత ఎన్నిక నిర్వహించి తోట నాగేశ్వరావును ఉపసర్పంచ్గా ఎన్నుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికను వెంటనే రద్దు చేసి ఉప సర్పంచ్ పదవిని దళిత వర్గం నుంచి ఎన్నికై న వారికి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయడంతో వారు అక్కడికి వచ్చి ఽఆందోళన చేస్తున్న వారికి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని నచ్చజెప్పి పంపించారు. -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను భక్తులు బుధవారం దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు, చీరసారె, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలను, కోళ్లను అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. దర్శనం అనంతరం భక్తులు మేడారం అటవీ ప్రాంతంలో విడిది చేసి వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనాలు చేశారు. -
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
ములుగు: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ ఎన్నికల వివరాలను వెల్లడించారు. మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైందన్నారు. వాజేడులో విపరీతమైన మంచు కురిసినప్పటికీ చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులుదీరారని వెల్లడించారు. వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు మండలాల పరిధిలో ఓటింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. మూడో విడతలో సాగిన పంచాయతీ పోరులో 46 సర్పంచ్ స్థానాలకు ఒకటి ఏకగ్రీవ కాగా మిగిలిన 45 సర్పంచ్ స్థానాలకు, 329 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు వెల్లడించారు. మొత్తం మూడు విడతల్లో సాగిన పోరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయించామని, వెబ్ కాస్టింగ్తో పాటు మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి, పోలీస్ యంత్రాంగానికి, పాత్రికేయులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
24 వరకు పనులు పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులు ఈ నెల 24వ తేదీ వరక పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ అభివృద్ధి పనులు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణాలను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణం, రహదారులు, ఫ్లోరింగ్ సుందరీకరణ, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లోని పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మాట్లాడారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహా జాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు దేవాలయ ప్రాంగణం మహా కళాఖండంగా దర్శనమిస్తుందని తెలిపారు. ప్రతీ భక్తుడికి మధురానుభూతిని కలిగించే విధంగా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వివరించారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. గద్దెల పునర్నిర్మాణ పనులు పరిశీలించిన ఎస్పీ మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం పరిశీలించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా పగలు, రాత్రి విరామం లేకుండా పనులు చేయాలని ఎస్పీ కాంట్రాక్టర్ను ఆదేశించారు. గద్దెల ప్రాంణణం పునర్నిర్మాణం పనులను పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులకు విద్యుత్ సౌకర్యం కల్పించి రాత్రి సమయంలో సైతం పనులు చేసే వీలు కల్పించాలన్నారు. జాతరలో బందోబస్తుకు వచ్చే సిబ్బంది కోసం ఏర్పాటు చేస్తున్న క్యాంపు ప్రదేశాలను ఎస్పీ పరిశీలించారు. జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
‘ఫేక్ వాట్సాప్ మెసేజ్లు నమ్మకండి’
ములుగు: జిల్లా కలెక్టర్ పేరుతో వస్తున్న ఫేక్ వాట్సాప్ మేసేజ్లను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన ఫొటోను ఉపయోగించి డబ్బులు పంపాలని కోరుతూ నకిలీ సందేశాలు పంపిస్తున్న ఘటనలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తన ఫొటోను ప్రొఫైల్గా పెట్టుకొని కొందరు దుండగులు వివిధ అధికారులకు, వ్యక్తులకు వాట్సాప్ సందేశాలు పంపి డబ్బులు పంపించాలని అడుగుతున్నారని, ఇటువంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని తెలిపారు. ఎలాంటి లావాదేవీలు చేయవద్దని అధికారులకు, ప్రజలకు సూచించారు.కలెక్టర్ పేరు, ఫొటో లేదా హోదాను ఉపయోగించి వచ్చే సందేశాలు నకిలీవని, తన తరఫున వ్యక్తిగతంగా గాని, వాట్సాప్ ద్వారా గాని డబ్బులు అడగబోనని స్పష్టం చేశారు. ఇలాంటి నకిలీ మెసేజ్లు అందిన వెంటనే సంబంధిత వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేయాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్పూర్ పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బందికి ఆర్టీసీ సేవలు ములుగు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది సౌకర్యార్థం ములుగు నుంచి హనుమకొండకు ఆర్టీసీ అదనపు ట్రిప్పులు నడిపిస్తున్నట్లు వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 10, 12 గంటలకు, ఒంటి గంటకు సైతం అదనంగా మూడు ట్రిప్పులు నడిపిస్తున్నామని వివరించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు వినియోగించుకోవాలని కోరారు. బొగ్గుబ్లాక్ల వేలానికి అనుమతి ఇవ్వాలిభూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్కుమార్ మాట్లాడారు. కోలిండియా వ్యాప్తంగా 41బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రభుత్వం వేలంవేసే ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అందులో భాగంగా మణుగురు ఏరియాలోని డిప్సైట్ బొగ్గు బ్లాక్ను వేలంలో పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలైన ఆదాని, ఏఎంఆర్, మేఘా కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే ఏడు కంపెనీలు టెండర్ఫారాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ వేలం పాల్గొనేందుకు వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోకు వేలం వేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. మణుగురు ఓసీని సింగరేణి దక్కించుకోకుంటే మణుగురులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో వేలంలో పాల్గొనడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. -
జాతరలోగా బస్టాండ్ పనులు పూర్తిచేయాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం/మంగపేట: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులు మేడారం జాతరలోగా పూర్తి చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పను లను నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చే యాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. జాతర సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా 3,500 బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు. అందుకు గాను 10 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి విధులు కేటాయించి రూ.20 లక్షల మంది భక్తులకు ఆ ర్టీసీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే మేడారం జాతరకు 4 నుంచి 5 లక్షల మంది అదనపు ప్రయాణికులు రవాణా చేసే లా ఏర్పాట్లు పెంచుతామని వెల్లడించారు. నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షింంచాలని సూచించారు. ఆయన వెంట ఆర్టీసీ అధికారులు ఉన్నారు. మరో నాలుగు నెలల్లో బస్ డిపో పూర్తి ఏటూరునాగారం: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణం మరో నాలుగు నెలల్లో పూర్తవుతుందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నా రు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్డిపోను పరిశీ లించి వివరాల సేకరించారు. రూ.4.99 కోట్ల తో ఆర్టీసీ ఏటూరునాగారం డిపో నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. పనులు త్వరగా పూర్తి చేయించి సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో సిటీ బస్స్టేషన్ ఇన్చార్జ్ మల్లేషం, అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా మంగపేట మండలంలో ఎంపీడీఓ కార్యాలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. పనులను తనిఖీ చేసి సైట్ ఇన్ చార్జ్ను పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి -
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని చూసి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క మంగళవారం మీడియాతో మాట్లాడారు. మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు విడతల్లో ఇప్పటివరకు నిర్వహించిన జీపీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం పార్టీపరంగా బీసీలకు అవకాశం కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిందన్నారు. అందులో జిల్లాలో సైతం అత్యధికస్థానాల్లో గెలిచి కాంగ్రెస్ ముందంజలో ఉందని వివరించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటూరునాగారంలో ఒక్క సీటు గెలుపొందగానే తప్పుడు వార్తలను బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కీలక నేతల గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహిళ సమ్మక్క– సారలమ్మ దేవతలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మగౌరవం, అస్తిత్వం దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నాయకులు చింతనిప్పుల భిక్షపతి, వంగ రవియాదవ్, రవీందర్రెడ్డి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
మైన్స్ రెస్క్యూ బృందాల సేవలు కీలకం
భూపాలపల్లి అర్బన్: ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే మైన్స్ రెస్క్యూ బృందాల సేవలు అత్యంత కీలకమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అన్నారు. 54వ ఆలిండియా మైన్స్ రెస్క్యూ కాంపిటిషన్ నాగ్పూర్లో జరిగిన పోటీల్లో సింగరేణి రెస్క్యూ సిబ్బంది పాల్గొని పతకాలు సాధించిన సందర్భంగా మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి, అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఈ విజయానికి ఉద్యోగుల క్రమశిక్షణ, కఠిన శిక్షణ, అంకితభావమే ప్రధాన కారణాలని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించడం ద్వారా సింగరేణి సంస్థ ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింత పెరిగిందన్నారు. భవిష్యత్లో ఇలాంటి పోటీల్లో సింగరేణి ఉద్యోగులు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మైన్స్లో భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ఈ విజయం ఇస్తుందని చెప్పారు. యువ ఉద్యోగులు ఈ రెస్క్యూ బృందాల విజయాల నుంచి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. పతకాలు సాధించిన వారిలో భాను, మధు, శ్యామ్, ప్రమోద్, మహిళా రెస్క్యూ సిబ్బంది గాయత్రి, కృష్ణవేణి, మౌనిక ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, రెస్క్యూ ఇన్చార్జ్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
కుష్ఠువ్యాధి నిర్మూలనకు పాటుపడాలి
ములుగు రూరల్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు పాటుపడాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గోపాల్రావు సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో కుష్ఠువ్యాధిగ్రస్తుల గుర్తింపుపై వైద్య సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఐకమత్యంతో పనిచేసి జిల్లాను కుష్ఠ్టువ్యాధి రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. కుష్ఠువ్యాధిపై సమాజంలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్చంధ సంస్థలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసినప్పుడే కుష్ఠువ్యాధి సమగ్ర నివారణ సాధ్యమవుతుందని వెల్లడించారు. కుష్ఠ్టువ్యాధి మైకో బ్యాక్టీరియా సూక్ష్మ క్రిమి ద్వారా వచ్చే సాధారణ వ్యాధి అన్నారు. దీనిని ఎండిటి చికిత్సతో నయం చేయవచ్చని వివరించారు. పీహెచ్సీల్లో మందులు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం జిల్లా టీబీ, ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ మాట్లాడుతూ జిల్లాలో 487 టీంలను ఏర్పాటు చేశామని వివరించారు. రేపటి నుంచి 31వ తేదీ వరకు టీంల పర్యటన సాగుతుందని వివరించారు. కార్యక్రమంలో డీపీఎంఓ సంజీవరావు, పవన్కమార్, శ్రీకాంత్, ఏఎంఓ దుర్గారావు, ఎస్ఓ స్వరూపరాణి, సురేష్బాబు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
లెక్కలు చెప్పాల్సిందే..
ములుగు: సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును ఎంపీడీఓలకు తెలియజేసి రశీదు తీసుకోవాలి. లేదంటే వేటు పడే ప్రమాదం ఉంది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు ఎంపీడీఓలకు సమర్పించాలి. గ్రామ పంచాయతీలకు ప్రతినిధులుగా ఎన్నికై న వారు, మేమే గెలిచాం.. ఇక గ్రామానికి మేమే రాజులం అనే భావన వీడి సేవకులం అనే బాధ్యతను గుర్తించాలి. అధికారాలే కాదు.. కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని ఏ మాత్రం మరిచినా.. కుర్చీకే ఎసరు రావచ్చు. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం స్థానిక పాలకులకు పగ్గాలు వేసి ప్రజల చేతికిచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ. 2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.50 వేలు ఖర్చు చేయాలి. 5 వేల జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.30 వేల వరకు ఖర్చు చేయొచ్చు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 45 రోజుల లోపు సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీడీఓలకు నిర్దేశిత పద్ధతిలో లెక్కలు అప్పజెప్పాలి. సకాలంలో లెక్కలు చూపకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ రాజ్ చట్టం– 2018 కింద సదరు అభ్యర్థులు మూడేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటిస్తుంది. ఒక వేళ అభ్యర్థి సదరు ఎన్నికల్లో గెలిచి, నిర్ణీత సమయంలోగా ఖర్చు వివరాలు ఇవ్వకుంటే, పదవిని కోల్పోయినట్లు ప్రకటిస్తుంది. సర్పంచ్లకు నెలకు రూ.6,500 చొప్పున ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఉంటుంది. సర్పంచులు కనీసం నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, మూడు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. లేదంటే పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా పదవి నుంచి తొలగిస్తారు. అవినీతి ఆరోపణలు నిరూపితమైతే అనర్హత వేటు పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో చురుకుగా వ్యవహరించాలి. మొక్కలను నాటడం, అందులో 80 శాతం మేర మొక్కలు బతికేలా చూడటం వారి బాధ్యత. గ్రామంలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషించాలి. జిల్లాలో 10 మండలాల పరిధిలో 171 గ్రామపంచాయతీలు ఉండగా, మంగపేట మండలంలోని 25 పంచాయతీలపై హైకోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 9 మండలాల పరిధిలోని 146 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా, మొదటి, రెండో విడత ఎన్నికల్లో 100 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 24 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. మూడో విడతలో 45 పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ప్రజా ప్రతినిధులుగా ఎంపికై న వారితో పాటు ఓటమి చెందిన అభ్యర్థులు కూడా స్థానిక ఎంపీడీఓలకు ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు 45 రోజుల్లోగా అందించాలి. లేదంటే మూడేళ్లపాటు పోటీకి అనర్హుడిగా ప్రకటన గెలిచిన వారైతే పదవి కోల్పోయే ప్రమాదం -
నేడే తుది విడత పోరు
ములుగు: జిల్లాలో మూడో విడత పంచాయతీ పోరు బుధవారం జరగనుంది. జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో తుది విడత పోలింగ్కు అధికారులు సన్నద్ధమయ్యారు. ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయగా, తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది తరలివెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుండగా మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. తొలుత వార్డుల వారీగా ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందించనున్నారు. అలాగే ఎన్నికై న వార్డు సభ్యులలో మెజార్టీ సభ్యులు ఉపసర్పంచ్ను ఎన్నుకోనున్నారు. మూడు మండలాల పరిధిలో 46 గ్రామ పంచాయతీలు ఉండగా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. మూడు మండలాల్లో 408 వార్డులకు 78 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 45 గ్రామపంచాయతీలకు 157 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 329 వార్డు స్థానాలకు 866 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కన్నాయిగూడెం మండలంలో 9,992 మంది ఓటర్లు, వెంకటాపురం(కె) మండలంలో 25,336 మంది ఓటర్లు, వాజేడు మండలంలో 19,431 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం మూడు మండలాల పరిధిలో 330 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా సుమారు 500 మందితో ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లాలో మూడు మండలాలకు 922 మంది ీపీఓ (ప్రిసైడింగ్ అధికారులు), ఏపీఓలను (అసిస్టెంట్ ప్రిసైడింగ్అధికారులు) కేటాయించారు. వెంకటాపురం(కె) మండలంలో 200 మంది పీఓలు, 229 మంది ఏపీఓలు, వాజేడులో 152 మంది పీఓలు, 177 మంది ఏపీఓలు, కన్నాయిగూడెం లో 84 మంది పీఓలు, 80మంది ఏపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం 436 మంది పీఓలు, 486 మంది ఏపీఓలు విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి 45 జీపీలు.. 157 మంది అభ్యర్థుల పోటీ 329 వార్డు స్థానాలకు బరిలో 866 మంది 922 పీఓ, ఏపీఓల నియామకంమండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు ఓటర్లు వెంకటాపురం(కె) 18 62 150 381 25,336 వాజేడు 17 52 118 352 19,431 కన్నాయిగూడెం 10 43 61 133 9,992పోలింగ్కు సర్వం సిద్ధం కలెక్టర్ టీఎస్.దివాకర మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టీఎస్. దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు వెంకటాపురం, వాజేడు , కన్నాయిగూడెం మండలాల్లో 45 సర్పంచ్ స్థానాలకు, 329 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కన్నాయిగూడెం మండలంలో ఒక వార్డుకు ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేదని వెల్లడించారు. శాంతి భద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. -
నడిచొచ్చే ప్రజాస్వామ్యం
ములుగు: మూడో విడతలో భాగంగా ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో బుధవారం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు మండలాలు కూడా ఏజెన్సీ ప్రాంతాలే. ఆయా మండలాల్లోని పెనుగోలు, బొల్లారం, మండపాక, కలిపాక, పెంకవాగు, సీతారాంపురం, ముత్తారం, సర్వాయి, మల్కపల్లి, భూపతిపురం ఆదివాసీ గ్రామాల ప్రజలు ఓటు వేయాలంటే 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు అడవిబాటలో నడిచి రావాల్సిందే. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు గుట్టలు, కొండలు దాటుతూ బాధ్యతగా ఓటు వేసి అధికారులతో శభాష్ అనిపించుకుంటున్నారు. వాజేడు పరిధిలో ⇒ కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలులో 29 మంది ఓటర్లు ఉంటారు. వీరు కొండలు, గుట్టలు దాటుకుంటూ అడవి మార్గాన ప్రయా ణిస్తూ 20 కిలోమీటర్ల దూరంలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ⇒ మొరుమూరు పంచాయతీ పరిధిలోని బొల్లారం గిరిజన గూడెంలో 263 మంది ఓటర్లు ఉంటారు. వీరు 9 కిలోమీటర్ల దూరంలోని ప్రగళ్లపల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ⇒ ఏడ్జెర్లపల్లి పంచాయతీ పరిధిలోని మండపాకకు చెందిన 133 మంది ఓటర్లు 8 కిలోమీటర్ల దూరంలోని ఏడ్జెర్లపల్లికి వచ్చి ఓటేయాలి. వెంకటాపురం(కె) పరిధిలో ⇒ భోదాపురం పంచాయతీ పరిధిలో కలిపాక, పెంకవాగు గిరిజన గ్రామాల్లో 110 మంది ఓటర్లు ఉంటారు. వీరు కాలినడకన 5 కిలోమీటర్ల పరిధిలోని అలుబాక పోలింగ్ బూత్లో ఓటేయాలి. ⇒ అలుబాక పంచాయతీ పరిధిలోని సీతారాంపురం, ముత్తారం గిరిజన గ్రామాల్లో 100 మంది ఓటర్లు ఉంటారు. వీరు 6 కిలోమీటర్ల పరిధిలోని అలుబాక పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. గుట్టలు, కొండలు దిగుతూ అడవిలో 20 కిలోమీటర్లు నడుస్తూ ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న పెనుగోలు ఓటర్లు (ఫైల్) కన్నాయిగూడెం మండలంలో.. సర్వాయి గిరిజనగూడెంలో 198 మంది ఓటర్లు, మల్కపల్లిలో 99 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ట్రాక్టర్పై 12 కిలోమీటర్లు ప్రయాణించి చిట్యాల పో లింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ఇదే పంచాయతీ పరిధిలోని భూపతిపురంలో 295 మంది ఓటర్లు ఉంటారు. రవాణా సౌకర్యం ఉన్నా, బైక్లు, ఆటో ల్లో 8 కిలోమీటర్లు వచ్చి చిట్యాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వార్డు ఓట్లన్నీ గంపగుత్తగా... తొర్రూరు రూరల్: రెండో విడత ఎన్నికల్లో 100 శాతం ఓట్లతో ఓ వార్డు సభ్యుడు చరిత్ర సృష్టించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండాలోని 6వ వార్డు నుంచి బానోతు తేజానాయక్ పోటీ చేశాడు. ఈ వార్డులో 95 ఓట్లు ఉండగా, మొత్తం ఓట్లు తేజానాయక్కే పడ్డాయి. ప్రత్యర్థులెవరికి ఈ వార్డులో ఓట్లు లేవు. -
రెండు ఓట్లతో గెలుపు
వెంకటాపురం(ఎం) : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన జాటోత్ గణేష్ ప్రత్యర్థిపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో జర్పుల హేమాపై గణేష్ రెండు ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. తొలుత ఒక్క ఓటుతోనే గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగా, రీకౌంటింగ్ కావాలని ప్రత్యర్థి హేమా కోరడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ తలెత్తడంతో సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై రాజు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇరువురి మధ్య వీడియో చిత్రీకరిస్తూ ఓట్లను లెక్కించారు. చివరిగా రెండు ఓట్లు ఎక్కువ రావడంతో గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో జాటోత్ రుక్మాబాయిపై ఒక్క ఓటు తేడాతో జాటోత్ గణేష్ భార్య లతశ్రీ ఓడిపోయారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో గణేష్ రెండు ఓట్లతో గెలుపొందడం కొసమెరుపు. జోరుగా మద్యం విక్రయాలు కన్నాయిగూడెం : మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ మద్యం విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గ్రామాల్లో బెల్టు షాపుల్లో మద్యం జోరు మాత్రం తగ్గడం లేదు. ఒక్కో వాడకు రెండు, మూడు బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతోంది. స్థానికంగా పోలీసులు దాడులు చేసినప్పటికీ వారి కళ్లు గప్పి వ్యాపారులు మద్యం అమ్మకాలు ఆపడం లేదు. ఇలా మద్యం విక్రయాలు కొనసాగితే ఓటర్లను ప్రభావితం చేసే ప్రమాదముందని మండలవాసులు అనుకుంటున్నారు విధి నిర్వహణలో అప్రమత్తం చీఫ్ సెక్యూరిటీ అధికారి బాలరాజు భూపాలపల్లి అర్బన్: సింగరేణి సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించాలని చీఫ్ సెక్యూరిటీ అధికారి బాలరాజు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఏరియాలో పర్యటించి కేటీకే–6, ఓసీ–2 చెక్పోస్టులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థ భద్రతా వ్యవస్థలో సెక్యూరిటీ గార్డుల పాత్ర అత్యంత కీలమని తెలిపారు. క్రమశిక్షణ, అప్రమత్తత, అంకితభావంతో పని చేయాలని సూచించారు. భద్రత ప్రమాణాలను కఠినంగా పాటిస్తూ సంస్థ ఆస్తులు, సిబ్బంది రక్షణే ప్రధాన లక్ష్యమన్నారు. సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం ఎల్లప్పుడు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సెక్యూరిటీ అధికారి మురళీమోహన్, సీనియర్ ఇన్స్పెక్టర్ లక్ష్మిరాజం, జమేధార్ దేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యమబాధలు తొలగి.. ముక్తి పొందుతారుకాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్ప్రదేశ్లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ..అలహాబాద్లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు. ఆలయ ఉద్యోగి జేబునుంచి నగదు చోరీ కాళేశ్వరాలయ ఉద్యోగి జేబులో నుంచి రూ.48వేల నగదును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన పీఠాధిపతి మలూక్ రాజేంద్రదాస్జీ వస్తున్న క్రమంలో ఆలయ ఉద్యోగి రాజశేఖర్ తన ప్యాంటు జేబులో రూ.48వేల నగదు పెట్టుకున్నాడు. దీంతో భక్తజనం గుండా ఓ గుర్తుతెలియని వ్యక్తి తన జేబులోని నగదును దొంగిలించాడు. అక్కడి సీసీ కెమెరాలో ఉద్యోగి వద్దకు దొంగ వచ్చే వరకు మాత్రమే నిక్షిప్తమైంది. తర్వాత జేబు చూసుకొని ఉద్యోగి కంగుతిన్నాడు. ఈఓ మహేష్కు తెలుపడంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఆ జేబులోని డబ్బులు దేవస్థానం గదుల కిరాయికి సంబంధించినవని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. -
ముగిసిన ప్రచారం.. ప్రలోభాల పర్వం
రేపు కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మూడో విడత పంచాయతీలకు పోలింగ్ములుగు: తుది విడత పంచాయతీ పోరు బుధవారం జరుగనుంది. జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మూడో విడత ఎన్నికలు రేపు జరుగనుండగా సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడింది. 20 రోజులుగా పల్లెల్లో గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు సోమవారం రాత్రి నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందు, మాంసంతో పాటు ఓటుకు రూ.300ల నుంచి రూ.500 ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. మొదటి విడతలో 48 గ్రామపంచాయతీలకు 9 ఏకగ్రీవం కాగా 39 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 23 స్థానాలను, బీఆర్ఎస్ 7 స్థానాలను ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. రెండో విడతలో 52 గ్రామ పంచాయతీలకు 15 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 37 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 22 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు. 45 సర్పంచ్.. 157 వార్డులు జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల పరిధిలో 46 గ్రామ పంచాయతీలకు, 408 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా కేవలం కన్నాయిగూడెం మండల పరిధిలోని ముప్పనపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. మూడు మండలాల్లో 73 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 45 గ్రామపంచాయతీలకు 157 మంది సర్పంచ్ అభ్యర్థులు, 335 వార్డు స్థానాలకు 866 మంది వార్డు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కన్నాయిగూడెం మండలంలో 9,992 మంది ఓటర్లు, వెంకటాపురం(కె) మండలంలో 25,336 మంది ఓటర్లు, వాజేడు మండలంలో 19,431 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం మూడు మండలాల పరిధిలో 335 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా సుమారు 500 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నారు. కొనసాగుతున్న కాంగ్రెస్ జోరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకొని జోరు మీద ఉంది. జిల్లాలో పట్టు కోసం బీఆర్ఎస్ నాయకులు తాపత్రయపడుతున్నారు. జిల్లాలోని ఆరు మండలాల్లో జరిగిన మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 100 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగగా 73 స్థానాల్లో కాంగ్రెస్, 24 స్థానాల్లో బీఆర్ఎస్, 3 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ప్రజలంతా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. రెండు విడతల్లో విజయకేతనం ఎగరేసి జోరు మీద ఉన్న కాంగ్రెస్కు బీఆర్ఎస్ మూడో విడత ఎన్నికల్లో ఎంతమేరకు చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే. 45 సర్పంచ్ స్థానాలకు.. 157 మంది అభ్యర్థుల పోటీ 347 వార్డు స్థానాలకు బరిలో 866 మంది -
జనావాసాల మధ్య సెల్టవర్ వద్దు
● ఆగ్రహంతో రోడ్డెక్కిన స్థానికులు గోవిందరావుపేట : జనావాసాల మధ్య సెల్టవర్ నిర్మించొద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఓ వైపు గుడి, మరోవైపు పాఠశాలలు ఉండగా వాటి నడుమ సెల్ టవర్ నిర్మాణానికి ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రేడియేషన్ వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలను టవర్ కంపెనీ విస్మరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థాని కుల కథనం ప్రకారం.. టవర్ నిర్మాణం చేపట్టిన సంస్థ ప్రజలతో ఎలాంటి అవగాహన సమావేశం నిర్వహించలేదని, గ్రామసభ లేదా స్థానిక సంస్థ అనుమతి తీసుకోలేదని, పాఠశాలలు, దేవాలయం ఉన్న విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాల కోసమే కంపెనీ వ్యవహరిస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రజలు సెల్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకోని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ టవర్ వద్దు పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. -
ఓట్లు రాకపాయె!
నోట్లు పాయె..జీపీ ఎన్నికల్లో రూ.లక్షలు వెచ్చించిన అభ్యర్థులు ములుగు: జిల్లాలో తొలి, రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతల్లోని ఫలితాలపై ఓటమి చెందిన అభ్యర్థులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నోట్ల కట్టలు పాయె.. ఓట్లు రాకపాయె అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రెండో విడత ఫలితాలు వెలువడిన ఆదివారం వరకు అభ్యర్థులు చేసిన ఖర్చు తడిసి మోపైడెంది. తొలివిడత నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు నాటికి చేసిన ఖర్చు ఎంత.. వచ్చిన ఓట్లు ఎన్ని అని అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు చేసిన వారిలో గెలిచిన వారు సంబురాల్లో మునిగి తేలుతుండగా.. ఓడిన వారు ఎక్కడ బోల్తాపడ్డామని సమీక్షించుకుంటున్నారు. సొంతపార్టీ నేతలే కొంపముంచారని ఆవేదన ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండా ముందుకెళ్లిన అభ్యర్థులు పరాజయభారంతో చేసిన ఖర్చును లెక్కలేస్తున్నారు. కుల సంఘాల వారీగా ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బులకు ఓట్లు రాకపోవడంతో ఆవేదనకు లోనవుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేశారు. కుల సంఘాలకు, యువజన సంఘాలకు, సన్నిహితులకు మందు పార్టీల కోసం అభ్యర్థులు అదనంగా ఖర్చు చేశారు. మహిళా ఓటర్లకు చీరల పంపిణీ చేసిన ఫలితం లేకుండా పోయింది. నమ్మిన వారే నమ్మకంగా వంచించారంటూ సొంతపార్టీలో కోవర్టు రాజకీయాలు చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పైసా పట్టుపడలే.. జిల్లాలోని ఆరు మండలాల్లో ఇప్పటివరకు గ్రామపంచాయతీల ఎన్నికలు పూర్తి కాగా ఎన్నికలు జరిగిన మండలాల్లో ఇప్పటివరకు తనిఖీ బృందాలకు ఒక్కపైసా కూడా పట్టుబడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచేందుకోసం లక్షలాది రూపాయలు పట్టణాల నుంచి పల్లెలకు తరలివచ్చిన తనిఖీ బృందాలకు కంటపడకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలిస్తే తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అలాంటి సంఘటనలు ఇప్పటివరకు జిల్లాలో చోటుచేసుకోకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడో విడత ఎన్నికల్లోనైనా తనిఖీ బృందాలు ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాల్సిందే.. ఓట్ల ఖరీదు రూ.20 కోట్లుజిల్లాలో తొలి, రెండో విడతల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు రూ.20 కోట్ల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టినట్లు సమాచారం. జిల్లాలో 146 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మొదటి, రెండో విడతల్లో ఆరు మండలాల్లోని 100 పంచాయతీలకు 24 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 76 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 76 పంచాయతీల పరిధిలో 1,15,305 మంది ఓటర్లు ఉండగా 93,037 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో 20 రోజులుగా సగటున ఒక్కో అభ్యర్థి రూ. 5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అనాధికారికంగా ఖర్చు చేశారు. మేజర్ గ్రామపంచాయతీలతో పాటు, పెద్ద గ్రామపంచాయతీల్లో ఈ వ్యయం మరింత పెరిగింది. ఈ లెక్కన ఒక్కో ఓటు కోసం సగటున సర్పంచ్ అభ్యర్థులు రూ.3 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖర్చు చేసిన డబ్బుకు సరిపడా ఓట్లు రాలేకపోయాయని పరాజితులు కన్నీరు పెడుతున్నారు. విజయం సాధించిన అభ్యర్థులు లెక్కల జోలికి వెళ్లకుండా విజయోత్సవాల్లో పాల్గొంటున్నారు. పంచాయతీ ఫలితాలపై పరాజితుల పోస్టుమార్టం తొలి, రెండో విడత ఎన్నికల్లో ఖర్చు రూ.20 కోట్లు -
చెక్డ్యామ్ నిర్మాణంపై కదలిక
మంగపేట : మండలంలోని చీపురుదుబ్బ సమీపం నుంచి పారుతున్న కప్పవాగుపై చెక్డ్యామ్ నిర్మించేందుకు సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. సుమారు 600 ఎకరాలకు పైగా రైతులకు సాగునీరు అందించేందుకు 1986లో నిర్మించిన చెక్డ్యామ్పై ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా కొట్టుకు పోయింది. ఐటీడీఏ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఈ నెల 10న ‘చెక్డ్యామ్ నిర్మాణం కలేనా’ అనే కథనాన్ని సాక్షి దినపత్రిక ప్రచురించింది. దీంతో అధికారులు స్పందించారు. చెక్డ్యామ్ నిర్మాణానికి ఎస్టిమేట్ నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు ఏటూరునాగారం సబ్ డివిజన్ అధికారులు తెలిపారు. పరిశీలనలో రీమార్కులు రావడంతో సవరించి ఎస్ఎస్ఆర్ 2024–25లో రూ.3.41కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారుల్లో ఒకరు సాక్షికి తెలిపారు. సాక్షి కథనంతో వెలుగులోకి చెక్డ్యామ్ పనుల్లో చలనం రావడంతో గిరిజన రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
‘ముఖ గుర్తింపు’తో సమయపాలన
కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవి పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు. -
గడువులోగా పనులు పూర్తిచేయాలి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని జీపీ ఎన్నికలు సోమవారం మేడారంలోని అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, పగిడిద్దరాజు, గోవిందరాజు నూతన గద్దెల రాతి నిర్మాణం పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపులో గందరగోళం
● పోలైన ఓట్లకు..లెక్కింపు ఓట్లకు వ్యత్యాసం ములుగు రూరల్ : జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అధికారుల నిర్లక్ష్యంతో గందరగోళం నెలకొంది. ములుగు మండలంలోని కాశిందేవిపేట గ్రామంలో రెండో విడత ఎన్నికలు ఆదివారం నిర్వహించగా మొత్తం 1,914 ఓట్లు పోలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థితో పాటు 12 వార్డులకు గాను 2 వార్డులు ఏకగ్రీవం కాగా 10 వార్డులకు ఓటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి 527 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 489 ఓట్లు, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి 416 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 22 ఓట్లు, నోటాకు 63 ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4, 8వ వార్డులు ఏకగ్రీవం కావడంతో కేవలం సర్పంచ్ అభ్యర్థికి మాత్రమే అక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు వార్డులో పోలైన ఓట్లు 397 ఉండడంతో అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాశిందేవిపేటలో పోలైన ఓట్లకు..లెక్కింపు చేసిన ఓట్లతో సరిపోలలేదు. ఎన్నికల అధికారులు కౌటింగ్ అనంతరం అభ్యర్థులు, కౌటింగ్ ఏజెంట్ల సమక్షంలో గెలిచిన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఓడిపోయిన అభ్యర్థుల నుంచి సంతకాలు సేకరించాలనే నిబంధనలున్నాయి. ఎన్నికల అధికారులు అవేవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థిని సర్పంచ్గా ప్రకటించారు. పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లలో వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టిఎస్ దివాకరకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోంటారో వేచి చూడాల్సిందే. -
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింపును పూర్తి చేసినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్న కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు వాజేడు : మూడోదశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్.దివాకర ఆదేశించారు. మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, జోనల్ ఆఫీసర్స్, ఆర్ఓలు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అధికారులు ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేసి పోలింగ్ డే రోజున ఎలాంటి లోపాలు రాకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, అధికారులు విధులకు గైర్హాజర్ అయితే చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సిగ్నల్ అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. అధికారులతో సమీక్ష సమావేశం వెంకటాపురం(కె): మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల అధికారులతో కలెక్టర్ టీఎస్.దివాకర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్ పోలింగ్ బూత్ల వద్ద సౌకర్యాలపై సమీక్షించారు. ఎన్నికల విధి విధానాలపై దిశానిర్దేశం చే శారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణగోపాల్, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి సన్నిధిలో మోగ్లీ సినిమా యూనిట్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని సోమవారం మధ్యాహ్నం మోగ్లీ సినిమా కథానాయకుడు రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా వారు మోగ్లీ సినిమా పెద్ద హిట్ సాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ స్నపన మందిరంలో ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్కుమార్రెడ్డి, మోతుకూరి మయూరి, స్రవంతి, అనంతుల శ్రీనివాస్, సిబ్బంది అలుగు కృష్ణ పాల్గొన్నారు. -
కాళేశ్వరంలో సాధువుల బస
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు బస చేశారు. గోదావరి పరిక్రమణ(ప్రదక్షిణ)యాత్రలో భాగంగా యానాం నుంచి ఆదివారం రాత్రి ఉత్తర్ప్రదేశ్లోని వ్రిందావన్ పీఠాఽనికి చెందిన మలూక్పీత్ శ్రీరాజేంద్రదాస్జీ మహారాజ్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు సుమారుగా 500 వరకు స్థానిక దేవస్థానం 86 గదులు, ఇతర వసతి రూముల్లో రాత్రి బస చేశారు. అంతకు ముందు ఆ బృందంలోని ఓ శిశ్యుని గృహంలో అల్పాహారం తీసుకున్నారు. సోమవారం(నేడు) ఉదయం ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయనున్నారు. తరువాత శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తారు. వారికోసం కొంత మంది ముఖ్యులకు పూర్ణకుంభస్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో రాత్రిపూట దేవస్థానం వద్ద సాధువులతో పాటు వారి వాహనాలతో సందడి నెలకొంది. -
82.93 శాతం పోలింగ్
ములుగు రూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశా యి. మూడు మండలాల పరిధిలో మొత్తం 82.93 శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల వేళ ఎలాంటి ఘటనలకు తావులేకుండా ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టచర్యలు చేపట్టారు. ములుగు మండలంలోని జంగాలపల్లి, మల్లంపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్లు సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు రెండోవిడత పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛయుత వా తావరణలో నిర్వహించారు. మల్లంపల్లి మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పంచా యతీ అధికారులు ఆదర్శ పోలింగ్ కేంద్రంగా ముస్తాబు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది విధులు నిర్వహించారు. వైద్యాఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సిబ్బంది వీల్చైర్లు ఏర్పాటు చేసి వారిని కేంద్రాలకు తరలించారు. మల్లంపల్లి పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులుతీరారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో.. ములుగు: జిల్లాలో రెండో విడత ఎన్నికలు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీఎస్ దివాకర తెలిపారు. రెండో విడతలో వెంకటాపురం, ములుగు, మల్లంపల్లి మండలాల్లోని 37 సర్పంచ్, 315 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. మూడు మండలాల్లో 82.93 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. మండలాల వారీగా ములుగులో 78.81, మల్లంపల్లి 84.50, వెంకటాపురం(ఎం) 82.51 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 54,944 ఓట్లు ఉండగా, 45,565 మంది తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ప్రజలు ఎన్నికల సంఘం నియమాలు పాటిస్తూ జిల్లా యంత్రంగానికి స హకరించారని, 17న జరగనున్న మూడో విడత ఎన్నికలకు కూడా సహకరించాలని కోరారు. మండలాల వారీగా ఓటింగ్ శాతంములుగు78.81వెంకటాపురం(ఎం) 82.51 మల్లంపల్లి84.50ప్రశాంతంగా రెండో విడత ఎన్నికలు ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం)లో ఎన్నికలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్ -
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలన
ములుగు: జిల్లాలో జరుగుతున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూం నుంచి పోలింగ్ జరుగుతున్న విధానాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టీఎస్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటాపురంలో 116, ములుగులో 92, మల్లంపల్లి మండలంలో 53 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్, సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి నేరుగా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మూడు మండలాలకు సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లు) నియమించి, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్రావు, ఈడీఎం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ములుగు మండలంలోని ఇంచర్ల, బరిగలపల్లి, జవహర్నగర్, వెంకటాపురం మండలంలోని లింగాపూర్, ఎల్లారెడ్డిపల్లి, నల్లగుంట, పాలంపేట, రామంజపూర్, నారాయణగిరిపల్లె, నర్సాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
హస్తం జోరు
పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు03ఇతరులుకాంగ్రెస్ బీఆర్ఎస్020121010130706050421 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీఆర్ఎస్ విజయంమొత్తంమల్లంపల్లి ములుగు● జిల్లాలో విజయోత్సవ సంబురాలు ● నేటితో ముగియనున్న మూడో విడత ప్రచారంములుగు రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో హస్తం జోరు కొనసాగుతోంది. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా రెండో విడతలోనూ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుంది. ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. మూడు మండలాల్లో మొత్తం 52 సర్పంచ్, 462 వార్డు స్థానాలు ఉండగా ఇందులో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. 37 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మూడు మండలాల్లో 54,944 మంది ఓటర్లకు గాను 45,565 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ములుగు 13, మల్లంపల్లి 6, వెంకటాపురం(ఎం) మండలంలో 18 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ములుగు మండలంలో 7 స్థానాలు కాంగ్రెస్, 5 స్థానాలు బీఆర్ఎస్, 01 ఇండిపెండెంట్, మల్లంపల్లిలో 4 స్థానాలు కాంగ్రెస్, 2 స్థానాలు బీఆర్ఎస్, వెంకటాపురం(ఎం)లో 15 స్థానాలు కాంగ్రెస్, 6 స్థానాలు బీఆర్ఎస్, 2 ఇతరులు గెలుపొందారు. -
హేమాచల క్షేత్రంలో..
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రం వందలాది మంది భక్త జనంతో ఆదివారం కిటకిటలాడింది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిల తైలాభిశేకం పూజలను జరిపించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి కై ంకర్యాదులు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు నిత్యఅన్నప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ తమవంతు ఆర్థిక సాయాన్ని అందించారు.లక్ష్మీనర్సింహాస్వామి దర్శించుకుంటున్న భక్తులు -
మేడారంలో భక్త జనసందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినంకావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛతీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్యాప్ కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహఫంక్తి భోజనాలు చేసి సందడి చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి మొదలైన భక్తుల తాకిడి సాయంత్రం వరకు కొనసాగింది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కిటకిటలాడారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎస్సై శ్రీకాంత్రెడ్డి సమ్మక్క గద్దె వద్ద భారీకెడ్లను ఏర్పాటు చేసి భక్తులను క్రమపద్ధతిలో దర్శనానికి పంపించారు. వేలాది మంది ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వద్దకు వచ్చే దారిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు పోలీసులు వాహనాలను మళ్లించారు.జాతరలా తరలివచ్చిన భక్తులు కోలాహలంగా గద్దెల ప్రాంగణం స్తంభించిన ట్రాఫిక్ -
కేయూ పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్లూ, ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సుల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) మూడవ సెమిస్టర్ పరీక్షలు జనవరి 3వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3న మొదటి పేపర్, 5న రెండో పేపర్, 7న మూడవ పేపర్, 9న నాల్గవ పేపర్, 12న ఐదవ పేపర్, 16న ఆరవ పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. -
నేడే రెండో విడత పోలింగ్
ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం (ఎం) మండలాల్లో ఎన్నికలుపోలింగ్ సామగ్రితో గ్రామాలకు బయలుదేరిన ఎన్నికల సిబ్బందివాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బందిములుగు రూరల్: రెండో విడత ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో రెండో విడత ఎన్నికలు నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. మండల కేంద్రాల నుంచి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎన్నికల సామగ్రితో కేటాయించిన గ్రామాలకు బయలుదేరారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. 37 సర్పంచ్, 315 వార్డు స్థానాలకు.. ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో మొత్తం 52 స్థానాలకు 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 462 వార్డు స్థానాలకు 147 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మూడు మండలాల్లో 37 సర్పంచ్, 315 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ములుగు మండలంలో 6 ఏకగ్రీవం కాగా 13, మల్లంపల్లిలో 4 స్థానాలు ఏకగ్రీవం కాగా 6 స్థానాలకు, వెంకటాపురం(ఎం)లో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 18 స్థానాలకు, 315 వార్డు స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల సామగ్రితో బయలుదేరిన సిబ్బంది రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు శనివారం ములుగు, వెంకటాపురం (ఎం) మండలకేంద్రాల్లో ఎన్నికల సామగ్రిని ఎంపీడీఓ ఆధ్వర్యంలో అందజేశారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రిని అందించి వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మూడు మండలాల్లో మొత్తం పోలింగ్ అధికారులు 530, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 653 మందిని కేటాయించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ 37 సర్పంచ్లు, 315 వార్డు స్థానాల్లో ఓటింగ్ పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది -
మీరేదంటే అదే!
గుడులు కట్టిస్తాం.. బడులు బాగు చేస్తాం పరకాల మండలానికి చెందిన ఓ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజల డిమాండ్ నెరవేర్చేందుకు అడిగిందే తడవుగా గుడి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇది తెలిసిన మరో అభ్యర్థి సైతం ఆ సామాజిక వర్గం ఓటర్ల వద్దకు వెళ్లి తన సంసిద్ధతను వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇద్దరూ తేల్చుకునేలోపే రెండో విడత ప్రచారం ముగిసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ మండలాల్లో వివిధ గ్రామాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు గుడులు, బడుల మరమ్మతులకు హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మూడో విడత ప్రచారానికి రేపు తెరపడనుండగా.. నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపూర్ మండలాల్లో అభ్యర్థుల హామీల పరంపరతో ప్రచారం కొనసాగుతోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో రోజులు గడిచినా కొద్ది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పీక్కు చేరుతోంది. ‘మీరేం అడిగితే అది చేస్తాం. అభివృద్ధికి పాటుపడతాం. గుడులు కడతాం, బడులు బాగు చేస్తాం’ అంటూ అలవి కాని హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 15న (సోమవారం) సాయంత్రం 5 గంటలకు మూడో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. వ్యూహాలతో ముందుకు వెళ్తూ.. మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 53 ఏకగ్రీవమయ్యాయి. 502 చోట్ల ఈనెల 11న పోలింగ్ నిర్వహించారు. 333 జీపీలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, సీపీఐ 1, ఇతరులు 56 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. కొంచెం ఎఫర్ట్ పెడితే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తుండగా, మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ సైతం తమ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. ఇదే సమయంలో మొదటి విడతలో తలెత్తిన లోపాలను గుర్తించిన ఆ మూడు పార్టీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 564 పంచాయతీలకు 57 ఏకగ్రీవం కాగా, 507 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి శనివారం రాత్రే అధికారులు, సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. జోరుగా ప్రలోభాలు.. పంపకాలు రెండో విడత అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు శనివారం రాత్రి నుంచే విచ్చలవిడిగా ధనప్రవాహానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామ పంచాయతీలను బట్టి ఓటుకు రూ.500ల నుంచి రూ.2,500ల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఫుల్బాటిల్.. కిలో చికెన్ చొప్పున చాలా గ్రామాల్లో సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ సాగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఎన్నికల సంఘం కళ్లుగప్పి విచ్చల విడిగా పోల్ చిట్టీలతో పాటు డబ్బుల్ని పంపిణీ చేసేలా ఏర్పాటు చేసుకున్న కొందరు నాయకులు చాలా గ్రామాల్లో రెండో విడత కోసం శనివారం రాత్రంతా కొనసాగించారు. ఇదిలా ఉండగా, రెండో విడత పోలింగ్ సందర్భంగా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఎన్నికలను సజావుగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దన్నారు. కాగా ఆదివారం పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని బ్రాందీషాపులు, బార్లను అబ్కారీశాఖ అధికారులు శనివారం సాయంత్రం మూసివేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల పాట్లు డబ్బు, మద్యం కానుకల ఎర గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు రెండో విడతకు నేడు పోలింగ్.. 564లో 57 ఏకగ్రీవం 507 పంచాయతీలకు హోరాహోరీ ‘రెండో’ పోరులో గెలిచేదెవరో? పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి భారీగా భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు -
మేడారంలో పూజలు
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క సారలమ్మను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, ఏటూరునాగారం సర్పంచ్ శ్రీలత కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు వారికి సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని అందించి సన్మానించారు. అనంతరం మేడారం జాతర పనులు విషయాలను జగ్గారావుతో చర్చించారు. కార్యక్రమంలో ప్రదీప్రావు, ప్రవీణ్రావు, పూజారులున్నారు. ముళ్లకట్ట సర్పంచ్ ఎన్నికలో అక్రమాలు! ఏటూరునాగారం: ముళ్లకట్ట సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. శనివారం మండలంలోని ముళ్లకట్ట గ్రామ పంచాయతీ, గ్రామంలో ఎన్నికల సమయంలో జరిగిన గొడవపై ఆరా తీశారు. గ్రామంలో తక్కువ ఓటర్లు ఉండగా ఎక్కువ మంది ఓటు వేశారని, కొందరు నాయకులు రిగ్గింగ్ చేశారని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలు, సర్పంచ్ అభ్యర్థి మహేశ్వరి కోరారు. దీనిపై స్పందించి ప్రజలతో సంతకాలు తీసుకుని కమిషన్కు ఈమెయిల్ చేసినట్లు నాగజ్యోతి తెలిపారు. ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంములుగు: జిల్లాలో నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 515 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 433 మంది హాజరైనట్లు జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి వినోద్కుమార్ తెలిపారు. జిల్లాలోని ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 162 మంది విద్యార్థులకు 149 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. ములుగు జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 161 మంది విద్యార్థులకు 129 మంది హాజరుకాగా 32 మంది గైర్హాజరు కాగా, బండారుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో 192 మంది విద్యార్థులకు 155 మంది హాజరుకాగా 37 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. జిల్లాలో 515 మంది విద్యార్థుల కోసం మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 433 మంది విద్యార్థులు హాజరు కాగా 82 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. క్రీడలతో ఆరోగ్యం భూపాలపల్లి అర్బన్: క్రీడలు గెలుపోటములకే కాకుండా ఆరోగ్యం, ఉత్సాహానికి ఉపయోగపడతాయని ఏరియా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సునీత తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో మహిళలకు వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించారు. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. క్రీడా పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదని, మనలో ఉన్న సహకారం, క్రమశిక్షణ, ఆరోగ్యం, ఉత్సాహం వంటి విలువలను మరొకసారి మనకు గుర్తు చేస్తాయన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలే అని గెలుపోటములు సహజమన్నారు. ధైర్యం, కలిసికట్టుగా ముందుకు సాగే తపన అదే నిజమైన విజయమని చెప్పారు. సేవ సభ్యులు సేవాభావం, అంకితభావం సంస్థకు, సమాజానికి అమూల్యమైనవని అన్నారు. క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, ఉత్సాహంగా పాల్గొన్న సేవ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈనెల 23న జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బహుమతులను అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, స్పొర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, సేవా కార్యదర్శి రుబీనా, సభ్యులు పాల్గొన్నారు. మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలి భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో కార్మికులపై మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1వ గనిలో కొంత మంది మైనింగ్ అధికారులు కార్మికులను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు తెలిపారు. ఫిల్లింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికులపై అనవసరమైన ఒత్తిడి, అవమానకరమైన ప్రవర్తన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. నాయకులు రత్నం అవినాష్, దేవరకొండ మధు పాల్గొన్నారు. -
ఇసుక పనుల్లో మతలబేంటి?
ములుగు: మేడారం జంపన్నవాగులో ఇసుక లెవలింగ్ పనులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది. జంపన్నవాగులో భక్తుల సౌకర్యార్థం ఇరిగేషన్శాఖకు రూ.4.96కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.1.29 కోట్లతో ఇసుక లెవలింగ్ పనులు చేస్తున్నారు. ప్రతీ ఏటా మహాజాతర సమయంలో గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు నుంచి జంపన్నవాగులోని భక్తుల పుణ్యస్నానాల కోసం నీటిని విడుదల చేస్తారు. రెడ్డిగూడెం నుంచి చిలకలగుట్ట వరకు వాగు సమాంతరంగా ఉండేందుకు ఇసుకను లెవలింగ్ చేస్తున్నారు. ఇసుక చదును పనుల్లో లోపాలు ఉన్నాయా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఇసుక లెవలింగ్ పనులను సంబంధించిన ఎస్టిమేషన్ పత్రాలను, రికార్డులను ఇరిగేషన్శాఖ నుంచి తీసుకున్నట్లు తెలిసింది. వాగులో ఇసుక చదును పనులపై విజిలెన్స్ బృందం శనివారం మేడారానికి వస్తున్నారనే సమాచారం ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారుల నుంచి మొదలుకుని కింది స్థాయి వరకు మేడారానికి ఇసుక పనులకు సంబంధించిన అన్ని రికార్డులతో మేడారానికి వచ్చినట్లు సమాచారం. పనులు నిలిపివేత మేడారం జంపన్నవాగులో ఇసుక చదును పనులను శనివారం నిలిపివేశారు. విజిలెన్స్ బృందం అధికారులు తనిఖీ నిర్వహించేంత వరకు పనులు ఆపేవేయాలని ఆదేశించడంతోనే నిలిపివేసినట్లు తెలుస్తుంది. భక్తుల జల్లు స్నానాల కోసం స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ నల్లాలను ఏర్పాటు చేస్తున్నారే తప్ప ఇసుక చదును పనులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. ఈనెల 12న మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్కలు వచ్చిన సమయంలో ఇరిగేషన్శాఖ అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడంతోపాటు సమీక్ష సమావేశానికి కొంత ఆలస్యంగా హాజరు కావడంతో మంత్రి ఆగ్రహించినట్లు తెలిసింది. జంపన్నవాగు ఇసుక లెవలింగ్ పనులపై విజిలెన్స్ అధికారుల ఆరా? -
ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా నేడు ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది శనివారం రాత్రి పోలింగ్కు కావాల్సిన బూత్లతో పాటు, నంబర్ల వారీగా బూత్లను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతి లేదని, ఓటర్లు ఎవరూ తమ వెంట సెల్ఫోన్లు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తున్న ఎన్నికల సిబ్బందివెంకటాపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ -
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు: రెండో విడతలో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టీఎస్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు–2025లో భాగంగా శనివారం కలెక్టర్ ములుగు మండల ప్రజాపరిషత్ కార్యాలయం, వెంకటాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతీ కౌంటర్, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం తనిఖీ చేసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఫామ్ 9 ప్రకారం సిబ్బంది తప్పనిసరిగా బ్యాలెట్ బాక్స్ చెక్ చేసుకోవాలని, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందించిన సామగ్రిని జాగ్రత్తగా సీల్ చేసి డిపాజిట్ చేయాలన్నారు. సిబ్బందికి సందేహాలు ఉంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేశామని, వాటి ద్వారా సందేహాలను నివృత్తి చేసుకొని ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన -
హేమాచలుడిని దర్శించుకున్న హిమాలయ యోగి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిస్టతను ఆర్చకులు వివరించి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మన సనాతన ధర్మం అన్నారు. హేమాచలుడిని దర్శించుకున్న ఆయన మల్లూరు కేసీఆర్ కాలనీలోని మంచర్ల మనేశ్వర్రావు, యశోద పిరమిడ్ ధ్యాన మాస్టర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహర్షి సంకల్పంతో కర్నూలులో ప్రారంభమైన ఒక పిరమిడ్ నేడు దేశ వ్యాప్తంగా లక్షల పిరమిడ్లు వెలిశాయన్నారు. సంకల్పంతో ధ్యానం చేసి శక్తిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన మాస్టర్లు ఉప్పలి రమేశ్, కవిత, ముత్తినేని వెంకటేశ్వర్లు, యరంకని ఆనందం, ఉమ గ్రామస్తులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు ఆకర్షణీయంగా చేపట్టాలి
ములుగు రూరల్: జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆకర్షణీయంగా చేపట్టాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ అన్నారు. ములుగు మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట, ఇంచర్ల ఏకో పార్క్ అభివృద్ది పనులను ఆమె శుక్రవారం పరిశీలించారు. ముందుగా దేవునిగుట్ట్ట లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకుని ట్రెక్కింగ్ పనులను పరిశీలించారు. అనంతరం ఇంచర్ల ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏకో పార్క్, వాచ్ టవర్, నీటికుంటలను పరిశీలించారు. వెదురు బొమ్మల తయారీదారులతో మాట్లాడారు. చేతివృత్తిదారులు వెదురు బొమ్మల తయారీతో ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ ప్రభాకర్, సీసీఎఫ్ కాళేశ్వరన్, ములుగు, భూపాలపల్లి డీఎఫ్ఓలు రాహుల్ కిషన్ జా దవ్, నవీన్రెడ్డి, పారెస్టు డివిజనల్ ఆఫీసర్లు, ఎఫ్ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విచారణలో నిందితుడు దోషిగా తేలడంతో న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో బండారుపల్లి గ్రామానికి చెందిన కొడబోయిన మహేందర్ పోక్సో కేసు 2020లో అదే గ్రామానికి చెందిన ఎల్పుల రవితేజపై ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు విచారణ దర్యాప్తు అధికారిగా దేవేందర్రెడ్డి, ఎస్సై ఫణి, కోర్టు మానిటరింగ్ డీఎస్ కిశోర్, కోర్టు లియాసోనింగ్ అధికారి ఎస్సై లక్ష్మణ్, కోర్టు సీడీఓ స్రవంతిలను ఎస్పీ అభినందించారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు గోదావరి పరిక్రమణ యాత్ర పేరిట ఈనెల 14న ఆదివారం కాళేశ్వరం రానున్నారు. 15న సోమవారం ఉదయం ముందుగా త్రివేణి సంగమగోదావరిలో పుణ్యస్నానాలు చేయనున్నారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేస్తారని ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరస్వాములు 500మంది వరకు తరలి రానున్నారని తెలిసింది. దీంతో వారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. మల్హర్: ఓపెన్ కాస్ట్లో ఉద్యోగులు, కార్మికులు రక్షణలో భాగస్వాములు కావాలని సేప్టీ కమిటీ కన్వీనర్ వెంకటరమణ సూచించారు. 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలో తాడిచర్ల ఓపెన్కాస్ట్ మైన్ను వెంకట్వేర్రావు సందర్శించి, రక్షణ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడాతూ.. ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణలో రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు. కార్మికుల రక్షణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద రహిత ఓపెన్కాస్ట్ మైన్గా నిలిచేలా ప్రతీ ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఓపీ, సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం సంస్థ నియమ నిబంధనలను అనుసరించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని వివరించారు. కార్యక్రమంలో మైన్ ఏజెంట్ జీవన్కుమార్, సభ్యులు జాకీర్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, జెన్కో జీఎం మోహన్రావు, ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీధర్, కేఎస్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేప్టీ అధికారి సురేష్బాబు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మండల పరిధిలోని అడవిమార్గంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ దారులను డీఎస్పీ రవీందర్తో కలిసి ఎస్పీ బైక్పై తిరుగుతూ శుక్రవారం పరిశీలించారు. మహావీర్ పార్కింగ్ నుంచి వెంగ్లాపూర్, గోనెపల్లి మీదుగా కొండపర్తి, కాల్వపల్లి నుంచి అడవి మార్గంలోని దారులను తనిఖీ చేశారు. మేడారం మహాజాతర సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రానున్న నేపథ్యంలో రహదారి వెడల్పు, మలుపులు, సేఫ్ జోన్లు, ట్రాఫిక్ డైవర్షన్కు అనుకూల ప్రాంతాల వివరాలను తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొండపర్తి రూట్ను కూడా ఉపయోగించుకునే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. మేడారం జాతర సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మార్గమధ్యలో సైన్ బోర్డ్స్, రేడియం స్టికర్స్, సిగ్నలింగ్ టీమ్స్, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట పస్రా సీఐ దయాకర్ ఉన్నారు. వాహనదారులు అప్రమత్తం ములుగు రూరల్: చలికాలంలో ఉదయం పొగమంచు కారణంగా వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉదయం సమయంలో వాహనదారులు ఫాగ్లైట్లు, హెడ్ లైట్లు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. వాహనాలను ఓవర్ స్పీడ్గా నడపరాదని తెలిపారు. ముందు వెళ్తున్న వాహనాలు సరిగా కనిపించని కారణంగా సురక్షిత దూరం పాటించాలని, ఇతర వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హారన్ ఉపయోగించాలని సూచించారు. రోడ్డు పక్కన వాహనాలు నిలుపవద్దని పేర్కొన్నారు. డ్రైవర్లు నిద్రలేమి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని హెచ్చరించారు. ఉదయం వాకింగ్ చేసే వారు హైవేలపై కాకుండా నిర్ణీత మైదానాల్లో వ్యాయామం చేయాలని సూచించారు. చలికాలంలో అత్యవసరమైతే తప్పా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో 100, 112 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ బైక్పై అడవిమార్గం దారుల పరిశీలన -
కాజీపేట టు పెంబర్తి..
విద్యారణ్యపురి : మూడేళ్లక్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. వివిధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా అప్పట్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో ఆ తర్వాత మహబూబాబాద్, ములుగులోని ఆ రెండు బీసీ మహిళా డిగ్రీ కళాశాలలను అదే పేర్లతోనే కాజీపేటలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ ఐదేళ్ల ‘లా’కోర్సు నడుస్తున్న భవనంలోనికి షిఫ్టింగ్ చేశారు. రెండేళ్ల నుంచి ఆ భవనంలోనే అరకొర సౌకర్యాలతోనే ఆయా డిగ్రీ కళాశాలలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐదు కోర్సుల్లోనే అడ్మిషన్లు అయ్యాయి. బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సుల్లో సుమారు 230మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఫస్టియర్, సెకండియర్ కోర్సులు కొనసాగుతుండగా వచ్చే సంవత్సరం ఫైనలియర్ విద్యార్థినులు కూడా ఉంటారు. పది మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీ విద్యాబోధన చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా వి శ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ‘లా’విద్యార్థినుల ఆందోళన ఒకే భవనంలో ఐదేళ్ల ‘లా’కోర్సులో మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థినులు చదువుతున్నారు. ఈభవనంలోనే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కూడా ఉండడంతో తమకు కూడా సదుపాయాలు సరిపోవడం లేదని ‘లా’విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. డిగ్రీ కళాశాలల వేరే చోట నిర్వహించుకోవాలని ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాలను పెంబర్తికి షిఫ్ట్ చేయాలని ఆదేశాలు ‘లా’కళాశాల భవనంలోనే కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాలల (మహబూబాబాద్, ములుగు)ల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు షిష్టింగ్ చేయాలని (ఈనెల 20వతేదీవరకు) బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి సైదులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులు ఉమ్మడి వరంగల్ బీసీ గురుకులాల ఆర్సీఓకు, మహబూబాబాద్, ములు గు డిగ్రీ కళాశాలల కలిపి నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాల స్పెషల్ ఆఫీసర్కు అందాయి. దీంతో కొన్నినెలలుగా ఈ కళాశాలకు వివిధ చోట్ల అద్దెభవనం చూశారు.కానీ అనువైన భవనం లభించడం లేదంటున్నారు. ఇప్పుడు కళాశాలలోని విద్యార్థినులను పెంబర్తి కళాశాలకు తరలించాలని యోచిస్తున్నారు. కాజీపేటలో కొనసాగుతున్న బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ఇక్కడే కొనసాగించాలి. పెంబర్తికి తరలించొద్దు. నా కూతురు కూడా డిగ్రీ చదువుతోంది. విద్యకుదూరమయ్యే పరిస్థితి తీసుకురావొద్దు. ములుగు జిల్లా గురుకుల డిగ్రీ కాలేజీని ములుగు జిల్లాలోనైనా ఏర్పాటు చేయాలి. – కె.రాజు, ఓ విద్యార్థిని తండ్రి, ములుగు జిల్లా దేవగిరి పట్నం ఈ కళాశాల మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించినది కావడంతో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కూడా కాజీపేటలోని ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. తాము పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లబోమని స్పెషల్ ఆఫీసర్ ,అధ్యాపకులతోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇటీవల కొందరు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి తరలించొద్దని స్పెషల్ ఆఫీసర్కు విన్నవించుకున్నారు. పలువురు తల్లిదండ్రులు బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్ ఆర్సీఓతోనూ మాట్లాడారని సమాచారం. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్డీసీ రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు పెంబర్తిలోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు తరలించాలనే యోచనలో ఉన్నారు. వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు కలిపి కాజీపేటలో ఏర్పాటు మరోసారి తరలింపునకు ఆదేశాలు జారీ -
ప్రలోభాల ఎర
ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు● రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు ● మూడు మండలాల్లో 52 జీపీలకు 15 ఏకగ్రీవం ● 37 సర్పంచ్ స్థానాలకు 129 మంది అభ్యర్థుల పోటీ ● 315 వార్డు స్థానాలు.. బరిలో 851 మందిములుగు: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రిని శనివారం అధికారులకు పంపిణీ చేయనున్నారు. ఉన్నతాధికారులు మండలాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ర్యాండమైజేషన్ను పూర్తి చేశారు. శుక్రవారంతో ఎన్నికల ప్రచారానికి తెర పడడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం మొదటి విడతలో గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లోని కాంగ్రెస్ 36 సర్పంచ్ స్థానాలను గెలుపొంది పైచేయి సాధించింది. బీఆర్ఎస్ 11 స్థానాలతో సరిపెట్టుకుంది. రెండో విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లోని 52 గ్రామ పంచాయతీలకు 15 ఏకగ్రీవం కాగా మిగిలిన 37 సర్పంచ్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 37 సర్పంచ్, 315 వార్డులు జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల పరిధిలో 52 గ్రామ పంచాయతీలకు, 462 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 15 గ్రామ పంచాయతీలు 147 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 37 సర్పంచ్ స్థానాలకు 129 మంది సర్పంచ్ అభ్యర్థులు, 315 వార్డు స్థానాలకు 851 మంది వార్డు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆదివారం జరగనున్న ఎన్నికల కోసం 462 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయగా 66,729 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 1,183 అధికారులు కేటాయింపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు 1,183 మంది పీవో, ఏపీవోలను కేటాయించారు. మల్లంపల్లి మండలానికి 78 మంది పీవోలు, 93 మంది ఏపీవోలు, ములుగు మండలానికి 207 మంది పీవోలు, 263 ఏపీవోలు, వెంకటాపురం మండలానికి 245 మంది పీవోలు, 297 మంది ఏపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఎన్నికలు ముగిసే వరకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించనున్నారు. రెండో విడత పోలింగ్పై.. తొలి విడత ఎన్నికల ఫలితాల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలో అఽత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ అభ్యర్థులు వెనుకబడిపోయారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు సతీమణి శ్రీలతను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని విజయఢంకా మోగించారు.రెండో విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ క్రమంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందు, మాంసం, నగదు రూపేణా ఆశపెడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమకే ఓటేసి గెలిపించాలంటూ ప్రాధేయపడుతున్నారు. డబ్బు, మందం పంపిణీకి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. -
విద్యుత్ పనుల నాణ్యతలో రాజీలేదు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా చేస్తున్న విద్యుత్ పనుల నాణ్యతలో రాజీపడేది లేదని ఎన్పీడీసీఎల్ అపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. శుక్రవారం మేడారంలో విద్యుత్ ఏర్పాట్ల పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ములుగు సర్కిల్ పరిధిలోని నార్లాపూర్లో కొత్తగా నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ సబ్స్టేషన్ను పరిశీలించారు. అనంతరం మేడారంలో విద్యుత్ ఏర్పాట్ల పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈనెలఖారుకల్లా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. నాణ్యతలో ఎలాంటి రాజీపడవద్దని, భక్తులకు విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. జాతర విజయవంతం కావడానికి విద్యుత్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. అందువల్ల ప్రతీపని నాణ్యతతో సమయానికి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈ ఆపరేషన్ రాజు చౌహన్, ములుగు ఎస్ఈ ఆనందం, డీఈ ఆపరేషన్ నాగేశ్వరరావు, ఏడీఈలు వేణుగోపాల్, సందీప్ పాటిల్ పాల్గొన్నారు.ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ -
ఇసుక రీచ్ నిలిపివేయాలని నిరసన
ములుగు రూరల్: రైతులకు నష్టం చేస్తున్న అబ్బాయిగూడెం ఇసుక రీచ్ను నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం అబ్బాయిగూడెం రైతులు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ అబ్బాయిగూడెంలోని ఇసుక రీచ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతుల పంటలకు నష్టం కలిగేలా విద్యుత్ స్తంభాలను విరగొట్టారని వివరించారు. దీంతో రైతుల పంట పొలాలు ఎండి పోతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్ను నిలిపి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తోట నాగేశ్వర్రావు, బొల్లె రాంబాబు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ములుగు రూరల్: ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సార్వత్రిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లీగల్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికై నా లీగల్ సమస్యలు ఉంటే సమస్యల పరిష్కారానికి హెల్ప్డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అడ్వకేట్ సుధాకర్, డాక్టర్ కపూర్, హేమంత్, ప్రేమ్సింగ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
కొడుకు చేతిలో తండ్రి హత్య
గూడూరు: మద్యం మత్తులో గొడవపడిన తండ్రిని కుమారడు కొట్టి చంపిన ఘటన మానుకోట జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ శివారు హఠ్యతండాలో గురువారం అర్ధరాత్రి జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఠ్యతండాకు చెందిన ధారావత్ నందీరాంనాయక్ (45) భార్యా పిల్లలతో హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నందీరాం గొడవ చేస్తున్నాడు. గొడవ వద్దని చెప్పిన భార్యపై మద్యం మత్తులో రోకలితో దాడి చేయడానికి యత్నించాడు. గుర్తించిన కుమారుడు కృష్ణ అదే రోకలితో తండ్రి ఛాతిపై కొట్టాడు. వెంటనే కింద పడి స్ప్రృహకోల్పోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు గూడూరు సీహెచ్సీకి తరలించారు. వైద్యుడు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి ధారావత్ సోమ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీటు వస్తే నవోదయమే.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతి పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
కాటారం: ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా కొనసాగించడానికి పోలింగ్ స్టేషన్లకు కేటాయించిన పీఓ, ఏపీఓలు, సిబ్బంది కృషి చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ తెలిపారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో శుక్రవారం ఎన్నికల విధులపై పీఓ, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్, కౌంటింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్ పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ మాట్లాడుతూ పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పీఓ, ఓపీఓలు పాల్గొన్నారు. మహాముత్తారంలో.. మహాముత్తారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధులు, నిర్వహణపై అధికారులు పీఓ, ఓపీలకు అవగాహన కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని అభ్యంతరాలకు తావివ్వవద్దని వివరించారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
‘మంత్రిపై చర్యలు తీసుకోవాలి’
ములుగు రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సాయంత్రం 5 గంటలు దాటి న తర్వాత సభలు, సమావేశాలు, మైక్లతో ప్రచారం నిర్వహించకూడదు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జాకారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తల్లి వార్డుమెంబర్..కొడుకు సర్పంచ్
కేసముద్రం: మండలంలోని మహముద్పట్నం గ్రామ వార్డుమెంబర్గా తల్లి, సర్పంచ్గా కొడుకు ఎన్నికయ్యారు. గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఏడుగురు మాత్రమే ఉండగా, సర్పంచ్ స్థానంతో పాటు, మూడు వార్డులు ఎస్టీ రిజర్వేషన్ అయ్యాయి. దీంతో రెండు కుటుంబాలకు చెందిన వారే పోటీలో నిల్చున్నారు. ఈ మేరకు గురువారం గ్రామంలో ఎన్నికలు నిర్వహించగా, 3వ వార్డు మెంబర్గా పోటీ చేసిన తల్లి బుచ్చమ్మకు 33 ఓట్లురాగా, ఆమె ప్రత్యర్థికి కూడా 33 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు టాస్ వేశారు. దీంతో బుచ్చమ్మ విజయం సాధించింది. బుచ్చమ్మ కొడుకు కట్ల ఎల్లయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీలో నిలిచి గెలుపొందారు. దీంతో ఒకే ఇంట్లో తల్లి వార్డుమెంబర్గా, కొడుకు సర్పంచ్గా విజయం సాధించడం విశేషం. -
సాయంత్రం కాంగ్రెస్.. రాత్రి బీఆర్ఎస్
కాంగ్రెస్ కండువాలు కప్పుతున్న నాయకులువెంకటాపురం(ఎం): మండల కేంద్రంలో ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్షనేతలు పోటీ పడుతుండడంతో విచిత్ర రాజకీయ సమీకరణాలు నెలకొన్నాయి. బీ ఆర్ఎస్కు చెందిన కొంతమంది వ్యక్తులు గురువారం సాయంత్రం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గురువారం రాత్రి అదే నేతలను తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకుని పార్టీ కండువా కప్పి ఫొటోలు దిగారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మళ్లీ వారికే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోనే కొనసాగుతారని ఫొటోలు దిగి వారితో నినాదాలు చేయించారు. దీంతో ఎవ రూ ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారో.. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అర్థంకాక ఇరుపార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కండువాలు మార్చిన నాయకులు -
సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి స్టేషన్ఘన్పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్హోమ్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. -
తొలి విడత సర్పంచ్లు వీరే..
సమ్మక్క, బయ్యక్కపేట ప్రవళిక, తాడ్వాయి శైలజ, ఊరట్టంనాగభూషణం, వెంగ్లాపూర్ మోహన్రావు, కాటాపూర్ సృజన, కాల్వపల్లి రవీందర్, లింగాలజిల్లాలోని ఏటూరునాగారం, ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం విజేతలను అధికారులు ప్రకటించారు. -
ఉత్సాహంగా..ఆసక్తిగా..
ఏటూరునాగారం: ఓటు హక్కు తొలిసారి రావడంతో హైదరాబాద్ నుంచి ఉత్సాహంగా తరలివచ్చారు యువ ఓటర్లు. ఏటూరునాగారంలో జరిగిన మొదటి దశ సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు యువ ఓటర్లు హాజరై వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. చాలా దూరం నుంచి ఇక్కడ ఓటు వేయాలని సంకల్పంతో వచ్చాను. నాకు ఎంతో సంతోషంగాను ఉంది. ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత దేనికి లేదన్నారు. అందరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి. – వావిలాల సునిత ఎన్నికలు ఉన్నాయని తెలిసి చంటిబిడ్డను ఎత్తుకొని వచ్చాం. ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఇక్కడి రావడం చాలా ఆనందంగా ఉంది. భార్య, పిల్లలతో కలిసి ఓటును వినియోగించుకొని తిరుగు ప్రయాణం చేస్తా. కష్టం ఉన్నప్పటికీ ఇష్టంగా ఓటును వినియోగించుకున్నా. – రాజశేఖర్, హైదరాబాద్ గోవిందరావుపేట: జీపీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం మరుపురాని అనుభూతి. ఇది నా జీవితంలో మరిచిపోలేను. గ్రామాభివృద్ధికి పాటు పడే వ్యక్తికి ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉంది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమెను సిబ్బంది అభినందించారు. యువత ముందుకు రావడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని పలువురు వివరించారు. – పులుసం మైత్రి -
హస్తందే హవా..
జీపీ ఎన్నికల్లో బోల్తాపడిన బీఆర్ఎస్ ములుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్ర భుత్వం రెండేళ్ల పాలనలో పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పంచాయతీ అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభు త్వ తీరును విమర్శిస్తూ ప్రజల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మూడు మండలాల్లో.. ఈ సందర్భంగా తొలి విడత జీపీ ఎన్నికలు గురువారం జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో జరుగగా ఓటర్లు కాంగ్రెస్కు బ్రహ్మరథం పట్టారు. మూడు మండలాల పరిధిలో 48 పంచాయతీలకు 9 ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 39 పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరగగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకున్నారు. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కై వసం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. మూడు మండలాల పరిధిలో 48 పంచాయతీలకు 9 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 39 స్థానాలకు ఎన్నికలు జరగగా 27 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక స్థానంలో ఇతరులు గెలుపొందారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కై వసం కావడంతో కాంగ్రెస్ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు, మూడో విడతల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బోల్తాపడిన బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థించిన తొలి విడతలో కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలు పట్టం కట్టారు. అదే విధంగా బీఆర్ఎస్ సర్పంచ్లకు ప్రజల నుంచి చుక్కెదురైంది. మూడు మండలాల్లో 48 పంచాయతీలకు 10 స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ కై వసం చేసుకోవడంతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత కొనసాగుతుందనే విమర్శలున్నాయి.మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇతరులు ఎస్ఎస్ తాడ్వాయి 13 05 0 ఏటూరునాగారం 08 03 1 గోవిందరావుపేట 15 03 0 మొత్తం 36 11 01 36 స్థానాల్లో కాంగ్రెస్.. 11 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు -
నిబంధనల మేరకు ప్రచారాలు నిలిపివేయాలి
ములుగు రూరల్: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రచారాలను నిలిపి వేయాలని కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగించాలని తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు. ఎన్నికలు జరిగే మండలాలలో 44 గంటల పాటు బహిరంగ ప్రచారం చేయరాదని సూచించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల సరళి పరిశీలన మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కలెక్టరేట్లో గురువారం వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ దివాకర పరిశీలించారు. మొదటి విడత ఎన్నికలు ఏటూరునాగారం, ఎస్ఎస్తాడ్వాయి. గోవిందరావుపేట మండలాల్లో నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ, కౌటింగ్ను సమర్థవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఈడీ దేవేందర్ పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రశాంతం
ఏటూరునాగారం: జిల్లాలో ఏటూరునాగారం, ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో గురువారం జీపీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతగా నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగగా ఉదయం 7 గంటల నుంచి మందకొడిగా ప్రారంభమైంది. 9 గంటల తర్వాత ఓటర్లు బారలుదీరడంతో ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. కాగా జిల్లాలోని మూడు మండలాల్లో పోలింగ్ 78.65 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలితో ఉదయం పూట మందకొడిగా.. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్ సరళి మందకొడిగా సాగింది. 9 తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కనిపించింది. క్రమ క్రమంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఎన్నికల సిబ్బంది ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించి ఒంటిగంట వరకు ముగించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మహిళల ఓట్లే అధికం గోవిందరావుపేట మండలంలో మొత్తం ఓట్లరు 20,402 ఉండగా 15,501 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఎస్ఎస్ తాడ్వాయిలో 16,680 మంది ఓటర్లు ఉండగా 13,928 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోగా ఏటూరునాగారం మండలంలో 23,279 మంది ఓటర్లు ఉండగా 18,043 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మూడు మండలాల్లో అత్యధికంగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు మండలాల్లో కలిపి 24,412 మంది మహిళలు ఓటు వేయగా 23,055 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకొని సత్తాచాటారు. క్యూలైన్లలో సైతం మహిళలు బారులుదీరి ఆహా అనిపించారు. 48 సర్పంచ్ స్థానాలకు గాను 9 ఏకగ్రీవం కాగా 420 వార్డు సభ్యులకు 128 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.మండలం మొత్తం పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు శాతంఏటూరునాగారం 23,279 18043 77.51 ఎస్ఎస్తాడ్వాయి 16,680 13,928 83.50 గోవిందరావుపేట 20,402 15,501 75.98 మూడు మండలాల్లో 60,361 ఓట్లకు 47,472 ఓట్లు పోలింగ్ ఉదయం మందకొడిగా సాగిన ఓటింగ్ -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: మొదటి విడత జీపీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను గురువారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు, జనరల్ అబ్జర్వర్ డి.ప్రశాంత్ కుమార్ గురువారం పరిశీలించారు. ఎస్ఎస్తాడ్వాయి మండలం పరిధిలోని బీరెల్లి, రంగాపూర్, గంగారం, కాటాపూర్, దామరవాయి, కామారం పోలింగ్ కేంద్రాలతో పాటు, ఏటూరునాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, చిన్న బోయినపల్లి, శివాపురం, తాళ్లగడ్డ, ఏకే ఘన్పూర్, ముళ్లకట్ట, రోహిర్, ఎక్కెల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లోని ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ రవీందర్, సీఐ శ్రీనివాస్, సీడీపీఓ ప్రేమలతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న పోలింగ్ సరళిని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ను నిష్పక్షపాతంగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని నాయకులు, ఓటర్లు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రాజ్కుమార్, సురేశ్ ఉన్నారు. అలాగే తాడ్వాయి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ సరళి, శాంతి భద్రత వివరాలను తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. -
అడవులతోనే మానవాళి మనుగడ
సౌత్ రేంజ్ అధికారి అప్సర్నిస్సా కన్నాయిగూడెం: అడవులతోనే మానవాళి మనగడ కొనసాగుతుందని, అడవికి నిప్పు పెడితే భవిష్యత్ తరాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఏటూరునాగారం సౌత్ జోన్ రేంజ్ అధికారి అప్సర్ నిస్సా అన్నారు. మండల పరిధిలోని బుట్టాయిగూడెం, లక్ష్మీపురం, చింతగూడెం, ఏటూరు, దేవాదుల గ్రామాల్లో అప్సర్ నిస్సా బుధవారం తిరుగుతూ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అడవులకు నిప్పు పెట్టడంతో అడవులు అంతరించిపోతాయని గుర్తు చేశారు. నేటి అడవులతోనే భవిష్యత్ తరాలకు మనుగడ ఉంటుందని వివరించారు. రానున్న వేసవిలో అడవికి పనుల నిమిత్తం వెళ్లిన రైతులు, కూలీలు అడవికి నిప్పు పెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారులు రవి కుమార్, శ్రీనివాస్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
గోవిందరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు జరగనున్న మొదటి విడత పోలింగ్ విధుల్లో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం సందర్శించి అక్కడి ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి బలగాల వినియోగం, రూట్ మ్యాప్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పకుండా అమలు చేయాలన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 140 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది పోలింగ్ స్టేషన్ పరిధిని దాటి వెళ్లకూడదని సూచించారు. పోలింగ్, లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పస్రా ఎస్సై నంబర్ 8712670085, పోలీస్ స్టేషన్ నంబర్ 8712670086 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎంపీడీఓ చిలువేరు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
వాజేడు: జీపీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనల మేరకే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మానస తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆమె రైతు వేదికలో పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ. 1.50 లక్షలు, వార్డు మెంబర్ రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చని వెల్లడించారు. అంతకు మించి ఖర్చు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. నిబంధనల కంటే ఎక్కువగా డబ్బు తీసుకెళ్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వారి ఖర్చుల వివరాలను మూడుసార్లు విచారణ జరిపించుకోవాలని సూచించారు. మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎన్సీసీ టీం తిరుగుతుందని తెలిపారు. నిబంధనల కంటే ఎక్కువ ఖర్చు చేసిన అభ్యర్థి పోటీల్లో గెలిచినా ఆ విషయం ఫిర్యాదు రూపంలో వస్తే విచారించి నిజమని తేలితే ఆ గెలుపును రద్దు చేసే అవకాశం ఉందన్నారు. మైక్తో ప్రచారం చేయాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీకాంత్ నాయుడు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మానస -
21న జాతీయ లోక్ అదాలత్
ములుగు: ఈ నెల 21న ములుగు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్వీపీ సూర్య చంద్రకళ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోక్ అదాలత్లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, ప్రీ–లిటిగేషన్ కేసులతో పాటు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లోక్ అదాలత్కు కక్షిదారులు హాజరై, తమ కేసులను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. రాజీపడదగు కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి రాజీ కుదుర్చుకోవాలని కోరారు. రాజీపడద గు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టు కు నేరుగా హాజరు కావాలని వెల్లడించారు. ములుగు రూరల్: మేడారం జాతరలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీని తన కార్యాలయంలో రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జాతరలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ను భక్తులకు అప్పగించడం అభినందనీయమని వివరించారు. ఈ ఏడాది జరిగే జాతరలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మూడు కేంద్రాల్లో భక్తులకు మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, సెక్రటరీ చుంచు రమేష్, కొట్టె రాజిరెడ్డి, సారయ్య తదితరులు పాల్గొన్నారు. కాటారం: కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన క్రీడాకారులు రాంచరణ్, దేవేందర్, అభిషేక్ 69వ ఎస్జీఎఫ్ అండర్ 19 హ్యాండ్ బాల్ జిల్లాస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ మాధవి బుధవారం తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మహబూబ్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, బలరాం, మహేందర్, శ్రీనివాస్, వెంకటేశ్ అభినందించారు. భూపాలపల్లి అర్బన్: భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవాలని జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల విద్యార్థులకు సూచించారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్జి అఖిల హజరై మాట్లాడుతూ.. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనకు ఉందని ఎందరో మహనీయుల కృషి ఫలితంగా మానవ హక్కుల, విధుల రూపకల్పన జరిగిందన్నారు. ఎక్కడైతే హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ చట్టం న్యాయం పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపారు. జీవించే హక్కు సమానత్వ హక్కుతోపాటు విద్యాహక్కు కూడా ఉందని అన్నారు. చదువుతోనే ఏదైనా సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ పుప్పాల శ్రీనివాస్, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు సేవానాయక్, న్యాయవాది మంగళపల్లి రాజ్కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత
ములుగు రూరల్ : జిల్లాలో మొదటి విడత పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు జిల్లాలో గోవిందరావుపేట, ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో మొదటి విడత ఎన్నికల నిర్వహణకు డీఎస్పీలు ఇద్దరు, సీఐలు ఆరుగురు, ఎస్సైలు 33 మందితో పాటు 400 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు భద్రత చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కంట్రోల్ రూం, క్విక్ రెస్పాన్స్ టీంలు, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పోలీస్ పికెటింగ్, మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు గుంపులుగా తిరగడం, బెదిరింపులకు పాల్పడకూడదని వెల్లడించారు. -
‘ప్రతీ మనిషికి పుట్టుకతోనే హక్కులు’
ములుగు: ప్రతీ మనిషికి పుట్టుకతోనే హక్కులు లభిస్తాయని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుకు మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోని మానవ జాతి మొత్తం ఒక కుటుంబం లాంటిదని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నట్టే, గౌరవం సైతం అందించడమే మానవ హక్కుల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, ఉపాధ్యాయులు ఖలీల్, వీరనారాయణ, మమత తదితరులు పాల్గొన్నారు. -
యాక్షన్ ప్లాన్ రెడీ!
గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు సాగు నీరు ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు అందించేలా ప్రణాళిక గతేడాదితో పోలిస్తే తగ్గిన 1,16,938 ఎకరాలు వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలుసాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకుగాను 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగి పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు గాను 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకుగాను 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు శ్రీస్కివంశ్రీ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు గాను 4,550లు, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500లు, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు గాను 1,500 ఎకరాలకే ఈ సారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఆన్అండ్ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్ -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టరేట్ చాంబర్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్న గోవిందరావుపేట, ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ దివాకర, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్కుమార్ సమక్షంలో మంగళవారం నిర్వహించారు. మొదటి విడత పోలింగ్కు సంబంధించి గ్రామాల వారీగా ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడంతో ర్యాండమైజేషన్ ప్రక్రియ నుంచి కొంతమంది సిబ్బందికి మినహాయింపు కల్పించినట్లు వివరించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందికి పోలింగ్ విధులు కేటాయించినట్లు వివరించారు. మొదటి విడతలో 379 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు ఉండగా, 20 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన గోవిందరావుపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్రావుతో కలిసి పరిశీలించారు. పంపిణీ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, సీల్ ట్యాగులు, స్టేషనరీ, పోలింగ్ బృందాల కిట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా చూడాలన్నారు. భద్రతా చర్యలు, రవాణా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
ప్రలోభాలు షురూ
రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలుములుగు: జీపీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సమయం దగ్గర పడుతుండంతో ప్రచారానికి తెర పడింది. రేపు(11వ తేదీ) జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లోని 39 సర్పంచులకు, 287 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కంటే 44 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచే ప్రచారాన్ని ముగించారు. వారం రోజుల పాటు పంచాయతీల్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించిన అభ్యర్థులు ప్రచారానికి చెక్ పెట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. 39 సర్పంచులు.. 287 వార్డులకు పోలింగ్ జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల పరిధిలో 48 గ్రామ పంచాయతీలకు, 420 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా 9 జీపీలు 128 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 39 సర్పంచ్ స్థానాలకు, 287 వార్డు స్థానాలకు రేపు(11వ తేదీ) ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం 436 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయగా 68,299 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మూడో విడత అభ్యర్థులకు గుర్తులు వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల పరిధిలోని పంచాయతీలకు మంగళవారం ఉప సంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మూడు మండలాల పరిధిలో 46 సర్పంచ్ స్థానాలు ఉండగా ముప్పనపల్లి పంచాయతీ ఏకగ్రీవం అయింది. మిగిలిన 45 పంచాయతీలకు 209 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 408 వార్డు స్థానాలకు 48 ఏకగ్రీవం కాగా మిగిలిన 360 వార్డు స్థానాలకు 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో వారు ప్రచారాన్ని మొదలు పెట్టారు. 122 మంది ఆర్వో, ఏఆర్వోలకు విధుల కేటాయింపు జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్లు(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల(ఏఆర్వో)కు విధులు కేటాయించారు. మొదటి విడత ఎన్నికలకు 20 మంది ఆర్వోలు, 20 మంది ఏఆర్వోలు, రెండో విడతకు 23 మంది ఆర్వోలు, 23 మంది ఏఆర్వోలు, మూడో విడతకు 18 మంది ఆర్వోలు, 18 మంది ఏఆర్వోలను కేటాయించారు. మూడు విడతల్లో 9 మండలాల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో 122 మంది ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తించనున్నారు. మొదటి విడత పోలింగ్కు 44 గంటల ముందు నుంచే ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుంది. పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిర్వహించవద్దు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామ పంచాయతీల్లో ఉండకూడదు. ఎన్నికల ఉల్లంఘనలు పాల్పడితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని విబాగాల నోడల్ అధికారులకు ఆదేశించాం. – టీఎస్ దివాకర, కలెక్టర్గ్రామాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాగైన సర్పంచ్, వార్డు సభ్యుడిగా గెలుపొందాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఆయా గ్రామాలను బట్టి ఓటుకు రూ.300ల నుంచి రూ. 500ల వరకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే మద్యం షాపులు బంద్ ఉండడంతో అభ్యర్థుల అనుచరులు మద్యం సమకూర్చుకునే పనిలో పడ్డారు. 39 సర్పంచ్ స్థానాలకు బరిలో 145 మంది అభ్యర్థులు 287 వార్డు స్థానాలకు 753 మంది మూడో విడత పోలింగ్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు -
‘హ్యూమన్ పాపిలోమా’పై శిక్షణ
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం హ్యూమన్ పాపిలోమా వైరస్పై వైద్యాధికారులకు, సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతులను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు హాజరై మాట్లాడారు. మహిళల్లో గర్భాశయ కేన్సర్ నిరోధించడానికి నూతనంగా కేంద్ర ప్రభుత్వం హ్యుమన్ వ్యాక్సిన్ ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ వ్యాక్సిన్ 14 ఏళ్లు నిండిన బాలికలకు వేయనున్నట్లు తెలిపారు. దీంతో ఎటువంటి దుష్పలితాలు ఉండవని వివరించారు. ఈ వ్యాక్సిన్ పై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, ఎస్ఓ స్వరూపరాణి, మానిటరింగ్ సూపర్వైజర్ సురేశ్ బాబు, వెంకట్రెడ్డి, ఫార్మసీ స్టోర్ ఇన్చార్జ్ వినోద్, డీఈఓ నిఖిల తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్టును జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, ఐఏఎస్ ఫణింద్రరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఏర్పాటుచేసిన గణాంక పర్యవేక్షణ బృందం కేంద్రాన్ని సందర్శించారు. ఆ బృంద సభ్యులతో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతీ ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వాహనాలలో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కలిగి ఉండి సరైన సాక్షాలు లేకుండా డబ్బులు ఉన్నట్లయితే ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు సీజ్ చేయాలని ఆదేశించారు. మెట్పల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన పోలింగ్కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న వసతులు, తాగునీరు, కరెంటు, మూత్రశాల వసతులు తప్పకుండా ఉండాలని పంచాయతీ కార్యదర్శి మంజూర్కు సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు ప్రతీ ఒక్కరు పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సిబ్బందికి పలు సూచనలు జారీచేశారు. ఆయన వెంట ఎంపీడీఓ రవీంద్రనాథ్, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు. ఎలక్షన్ అబ్జర్వర్ ఫణింద్రరెడ్డి అంతర్రాష్ట్ర వంతెన చెక్పోస్టు పరిశీలన -
చెక్డ్యాం నిర్మాణం కలేనా?
మంగపేట: మండల పరిధిలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి కొత్త చీపురుదుబ్బ గ్రామానికి సమీపంలో గల కప్పవాగుపై చెక్డ్యాం నిర్మాణం కలగానే మిగిలింది. గిరిజన, గిరిజనేతర రైతులకు చెందిన వందలాది ఎకరాలకు సాగునీరు అందించే చెక్డ్యాం కనీసం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయి ఆరేళ్లు గడిచింది. పునఃనిర్మాణం కోసం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా హామీలకే పరిమితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆదివాసీ గిరిజన రైతులకు శాపంగా మారింది. నిత్యం పారే కప్పవాగు మండలంలోని దోమెడ అటవీ ప్రాంతం నుంచి ఊటతోగులు, వాగుల నుంచి నిత్యం జీవనదిలా పారే కప్పవాగు నీటిని ఆదివాసీ గిరిజనుల భూములకు సాగునీటికి మళ్లించేందుకు రూపకల్పన చేశారు. ఈ మేరకు 1986లో అప్పటి ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ సీవీఎస్కే శర్మ వీడీసీ కమిటీ పర్యవేక్షణలో లక్షల రూపాయలు వెచ్చించి కప్పవాగుపై చెక్డ్యాంను నిర్మింపజేశారు. చెక్డ్యాం నిర్మాణంతో పాతచీపురుదుబ్బ, కొత్తచీపురుదుబ్బ, సంఘంపల్లి (రామచంద్రునిపేట) గ్రామాల గిరిజన రైతులకు చెందిన సుమారు 600 ఎకరాల భూములతో పాటు చెక్డ్యాం కింది ప్రాంతమైన నడిమిగూడెం, రాజుపేట, పెరకలకుంట గ్రామాలకు చెందిన గిరిజన, గిరిజనేతర భూములకు సాగునీరు అందింది. 20 ఏళ్ల నుంచి చెక్డ్యాం పరిరక్షణపై ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో ప్రతిఏటా వాగు వరద ఉధృతికి కోతకు గురికావడం, లీకేజీలు ఏర్పడటంతో శిథిలావస్థకు చేరింది. చెక్డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయకట్టు పరిధిలోని గిరిజన రైతులు అధికారులకు లిఖిత పూర్వకంగా వినతులు సమర్పించినా పట్టించుకోక పోవడంతో 2019లో చెక్డ్యాం ఆనవాళ్లు లేకుండా కొట్టుకు పోయి ఆరేళ్లు అయ్యింది. అయినా దాని నిర్మాణం ఊసే లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వందలాది ఎకరాల్లోని రెండు పంటలకు నిత్యం నీరందించే తోగుల వాగు నీరు వృథాగా వెళ్లి గోదావరిలో కలుస్తుంది. అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం వృథాగా పోతున్న కప్పవాగునీరు సాగునీటి కోసం గిరిజన రైతులకు తప్పని తిప్పలు -
అవినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకం
భూపాలపల్లి: అనినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అవినీతి నిర్మూళన వారోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతిని ఎవరూ ప్రోత్సహించవద్దని, ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. పారదర్శక పరిపాలన, అవినీతి నిర్మూలన కోసం పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
● ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ వాజేడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం మూడో విడత పోలింగ్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో పీవోలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలన్నారు. నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో విజయ, ఎంఈవో వెంకటేశ్వర్లు ఉన్నారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
చిట్యాల: పాఠశాలలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పింగిలి విజయపాల్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని జూకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల తరగతులను పరిశీలించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు అవుతున్న విద్యా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ప్రణాళికతో చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా ఎన్నికలను జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్వహించిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షుడిగా స్థానిక అయ్యప్ప టెంపుల్ ప్రధాన పూజా రి కుదురుపాక కృష్ణమాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా బలబత్తుల రాజేశ్వరచార్యులు, కోశాధికారిగా తంగేళ్లపల్లి వెంకటాచార్యులు ఎన్నికయ్యారు. వారితో కమిటీ సభ్యులు, పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నారు. ● ట్రాక్టర్కింద పడి బాలుడి మృతి.. తల్లిదండ్రులకు అప్పగించకుండా పూడ్చివేత గణపురం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్కింద పడి ఓ బాలుడు చనిపోయాడు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలుడి మృతదేహాన్ని ఓపెన్కాస్ట్ మట్టి డంపింగ్యార్డులో పూడ్చిపెట్టాడు. ఈ విషయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గణపురం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మరావుపేట గ్రామానికి చెందిన బందెల రాకేష్ (6) ఈ నెల8వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గంపల శంకర్ ట్రాక్టర్లో వడ్లు తీసుకొని ఐకేపీ సెంటర్కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ బాలుడిపైనుంచి వెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, తన కుమారుడు రాకేష్ కనిపించకపోవడంతో తండ్రి రాజు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు శంకర్ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను బాలుడు రాకేష్ మృతదేహాన్ని గ్రామ శివారులో ఓసీ–3 డంపుయార్డుకి తీసుకువెళ్లి మట్టిలో పూడ్చివేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శంకర్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మెట్పల్లి (కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వరకు ఉన్న పైప్లైన్ కాళేశ్వరంలోని జాతీయ రహదారి 353(సీ)పక్కనే ఉన్నటువంటి గేట్వాల్వ్ వద్ద లీకేజీ ఏర్పడింది. లీకేజీ అయి నెలలు గడుస్తున్నా సంబంధిత కేటీపీపీ ఇంజనీర్లు మొద్దునిద్ర వీడడం లేదు. దీంతో గోదావరి నీరు వృథాగా పోతోంది. దీంతో రోడ్డు పక్కనే పెద్ద నీటిగుంటగా ఏర్పడి నీరు నిల్వగా మారింది. దీంతో చెత్తాచెదారం చేరి దోమలు వృద్ధి చెంది స్వైరవిహారం చేస్తున్నాయి. పందులు మురికి నీటిలో సేదదీరుతున్నాయి. చుట్టుపక్కల ఇళ్లకు దుర్వాసన వెలజల్లుతోంది. రోగాలు ప్రబలుతున్నాయి. సంబంధిత ఇంజనీర్లు, ఉద్యోగులు అటువైపు చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
చెక్డ్యాం నిర్మాణం చేపట్టాలి..
కూలిపోయిన చెక్డ్యాం స్థానంలో నూతన చెక్డ్యాం నిర్మించి వందలాది ఎకరాలకు నీరందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. చెక్డ్యాం పూర్తిగా కొట్టుకు పోవడంతో పంటలు పండించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. సకాలంలో నీరందక పంటలు ఎండి పోతుండటంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. కలెక్టర్ స్పందించి ప్రభుత్వం ద్వారా చెక్డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గిరిజన రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. బాడిశ నాగరమేశ్, బీఆర్ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజుపేట -
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీపై 24 గంటల పాటు పోలీసుల నిఘా ఉంటుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నేరం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను, ఓటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ప్రతిరోజూ గస్తీ నిర్వహిస్తూ ఎన్నికల తీరును పరిశీలిస్తున్నాం. ప్రజలు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోపు ఎవరూ సంచరించవద్దు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు గొడవలు పెట్టుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తాం. ప్రజల సహకారంతో ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేస్తాం.జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెడుతున్నాం. పోలింగ్ రూట్లకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరే వరకు పటిష్ట బందోబస్తు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలో సుమారు 1300 పోలింగ్ కేంద్రాల పరిధిలో 200 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి చర్యలు చేపడుతున్నాం. ప్రతీ పోలింగ్ కేంద్రంపై ప్రత్యేక నజర్ ఉంటుంది. -
ప్రతీ రూపాయి లెక్క చెప్పాల్సిందే
భూపాలపల్లి అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడినా, గెలిచినా ప్రచారం కోసం పెట్టిన ప్రతీ రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్కు చెప్పాలి. ఏ విడత జరిగే ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసే రోజు వరకు (15 రోజులు) సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే. అందుకు ప్రతీ అభ్యర్థి బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిచి, ఆ ఖాతా ద్వారానే ఎన్నికలకు ఖర్చు చేయాలి. పాత ఖాతాను వినియోగించినట్టయితే అందులో నిర్వహించే ఇతర లావాదేవీలకు సైతం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులకు తల నొప్పిగా మారుతోంది. అందుకే కొత్త ఖాతాలు తెరవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. నామినేషన్ పత్రంతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతిని కూడా జతపరచడం తప్పనిసరి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5వేల జనాభాకు మించిన గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.50వేలు మాత్రమే ఎన్నికల వ్యయం చేయాలి. 5 వేల జనాభాలోపు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.30వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఖర్చు పరిమితి మించితే వేటు పడుతుంది. వ్యయ పరిశీలకుల నియామకం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు చేసే ఖర్చులను పరిశీలించడానికి జిల్లాలోని మండలానికి ఒక వ్యయ పరిశీలకుడిని అధికారులు నియమించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వినియోగించే పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రింట్, డిజిటల్ మీడియా ప్రకటనలు, వాహనం అద్దె, డ్రైవర్ వేతనం, ఇంధనం, మైకులు, సౌండ్ సిస్టమ్, టెంట్లు, కుర్చీలు, భోజనం, లాడ్జింగ్, బోర్డింగ్, కార్యకర్తలకు ఇచ్చే ఖర్చులు, జెండాలు, టీ, టిఫిన్, కాఫీలు, క్యాప్లు, టీ–షర్టులు, బ్యాడ్జీలు, ప్రచార వాహనాల అలంకరణ ఖర్చుల లెక్కలు చూపాలి. వాటి ధరలు ఎన్నికల అధికారులు నిర్ణయించిన మేరకే ఉండాలి. 45రోజుల్లో లెక్కలు ఇవ్వాలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు మూడు విడతలుగా ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించాలి. ప్రచార ప్రారంభంలో మొదటిసారి, ప్రచారం మధ్య దశలో రెండోసారి, పో లింగ్కు ముందు రోజు మూడోసారి లెక్కలు ఇవ్వాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో అభ్యర్థులు వారి ఖర్చు లెక్కలు ఎన్నికల అధికారులకు తగిన బిల్లులతో సమర్పించాలి. ఎన్నికల ఖర్చులు నామి నేషన్ పత్రంలో సూచించిన బ్యాంకు ఖాతా ద్వా రానే నిర్వహించాలి. ఓడినా, గెలిచినా ఖర్చు లెక్కలు ఇవ్వాల్సిందే. గెలిచిన అభ్యర్థులు ఖర్చు లెక్కలు ఇవ్వకుంటే పదవి పోతుంది. ఓడిన అభ్యర్థులు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. నూతన బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు 45 రోజుల్లో లెక్క చూపకుంటే పదవి గోవిందా మూడేళ్లు అనర్హత వేటు -
చేప పిల్లల పంపిణీ
వాజేడు : మండలంలోని మత్స్యకార సొసైటీలకు సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లా మత్స్యకార సంస్థ ఎఫ్ఓ రమేశ్, పెసా జిల్లా నాయకుడు కొమరం ప్రభాకర్ చేతుల మీదుగా 2.10 లక్షల చేప పిల్లలను అందజేశారు.15 గ్రామాలకు చేప పిల్లలను పంపిణీ చేసి చెరువుల్లో జాగ్రత్తగా వదిలారని వారు తెలిపారు. ములుగు : బీసీలకు 42శాతం రిజర్వేషన్ దక్కడం లేదనే మనస్తాపంతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం శాంతిర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమానికి విశ్వబ్రాహ్మణ బిడ్డ అమరుడయ్యాడని సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్కతుర్తి రాజన్న తెలిపారు. నాడు తెలంగాణ కోసం, నేడు బీసీల రిజర్వేషన్ల సాధనకు విశ్వకర్మలే అమరులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాంతి ర్యాలీలో సంఘం నాయకులు కడివెండి వీరాచారి, కాగితపు శ్రీనివాస్, శ్రీలమంతుల నరసింహచారి, నారాయణ, మహేశ్, బస్వోజు రమేశ్, శంకరాచారి, రవీంద్ర చారి, నాగరాజు, గుంటోజు పావని తదితరులు పాల్గొన్నారు. వాజేడు: ఓ వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన పెద్ద గొళ్లగూడెం గ్రామంలో జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల సతీశ్ ప్రకారం.. గ్రామానికి చెందిన గొంది సాంబశివరావు(40) అదే గ్రామానికి చెందిన సమ్మయ్య అనారోగ్యంతో మృత్యువాత పడిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొని హైవే పైనుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటి సమీపంలోకి రాగానే వ్యాన్ వచ్చి ఢీ కొట్టింది. దీంతో సాంబశివరావు ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు గౌరమ్మ, జగన్నాథరావుతో పాటు బంధువులు అక్కడికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలంలోని వివరాలను సేకరించారు. పోస్టు మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఏటూరునాగారం సివిల్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. కాటారం(మహాముత్తారం): ప్రభుత్వ వైద్యశాలలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో నిరంతరం వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మందుల నిల్వ, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పెగడపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను సందర్శించి సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. డీహెంఎచ్ఓ వెంట జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సందీప్, డాక్టర్ దీప్తి, డీడీఎం మధుబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాలెట్ బాక్సులు సిద్ధం
ఏటూరునాగారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత పోలింగ్ ఈ నెల 11న ఏటూరునాగారం, ఎస్ఎస్తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో జరగనుండగా ఈ మేరకు అధికారులు సోమవారం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఏటూరునాగారం మండలంలోని 12 జీపీలకు గాను 24,636 ఓట్లు ఉన్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులను శుభ్రం చేయించి సిద్ధం చేయించినట్లు తెలిపారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను సైతం అధికారులు నిర్వహించారు. 10వ తేదీన పోలింగ్ బూత్, రూట్ ఆఫీసర్లతో కలిసి ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ బూత్లకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తామని వెల్లడించారు. అలాగే ఎస్ఎస్తాడ్వాయి మండలంలో 16,680 మంది ఓటర్లు ఉండగా 130 పోలింగ్ కేంద్రాలకు 136 పోలింగ్ బాక్సులను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. 18 గ్రామ పంచాయతీలకు గాను 3 ఏకగ్రీవం కాగా మిగితా 15 గ్రామ పంచాయతీలకు 52 మంది సర్పంచులు, 239 మంది వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. గోవిందరావుపేట మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో 5 ఏకగ్రీవం కాగా 15 జీపీలకు 52 మంది బరిలో నిల్వగా 283 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. -
జిల్లాస్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
ములుగు రూరల్ : జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడాపోటీల్లో జాకారంలోని పీఎంశ్రీ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. జిల్లా స్థాయి పోటీల్లో అండర్–17 కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో, ఫుట్బాల్ క్రీడల్లో ప్రథమ స్థానం సాఽధించడం ఆనందంగా ఉందన్నారు. డీఈఓ సిద్ధార్థ్రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారని పేర్కొన్నారు. అథ్లెటిక్స్లో లాంగ్జంప్లో రాంచరణ్ గోల్డ్ మెడల్, షాట్ఫుట్లో క్యాంస పథకం సాధించారని తెలిపారు. 100 మీటర్ల పరుగులో చరణ్ కాంస్య పథకం సాధించి ఓవరల్ జిల్లా చాంపియన్గా నిలిచారని వెల్లడించారు. -
మహాజాతరకు అడవిమార్గంలో రోడ్డు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర సందర్భంగా అటవీ మార్గంలోని రోడ్డును అధికారులు చదును చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మండల పరిధిలోని వెంగ్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోనెపల్లి నుంచి అటవీ మార్గం గుండా మేడారం వీఐపీ పార్కింగ్ వరకు 8 కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా ద్విచక్ర, ఫోర్వీల్ వాహనాలు వెళ్లే విధంగా ప్రస్తుతం రోడ్డును ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు వచ్చే వీఐపీల వాహనాలను సైతం ఈ రోడ్డు మార్గం గుండానే మళ్లించేందుకు పోలీసుశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అటవీ మార్గన రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ సారి ట్రాఫిక్ సమస్య తీరనుంది. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ములుగు రూరల్: ఎన్నికల సంఘం నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం రెండో విడతలో మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు శిక్షణ తరగతులను వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సూచించారు. రెండో విడత పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు సకాలంలో చేరుకోవాలని, సదుపాయాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటింగ్ కంపార్ట్మెంట్, సిట్టింగ్ ఏర్పాట్లను నిబంధనలకు అనుగుణంగా చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల విధులను సజావుగా నిర్వహించాలని సూచించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఆర్వోలు, ఏఆర్వోలు, ఏపీఓలు పాల్గొన్నారు.ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్కుమార్ -
భద్రత కార్మికుడి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: భద్రత అనేది సంస్థ అమలు చేసే నియమం మాత్రమే కాదని ప్రతీ కార్మికుడి వ్యక్తిగత బాధ్యత అని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, భద్రత కమిటీ కన్వీనర్ శ్రీనాద్ తెలిపారు. 56వ వార్షిక భద్రత పక్షోత్సవాలను సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో ప్రారంభించారు. ఈ పక్షోత్సవాల ప్రారంభోత్సవానికి జీఎం, భద్రత కమిటీ కన్వీనర్ హాజరై జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తికి భద్రత అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. సింగరేణి సంస్థలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతీ ఉద్యోగి విధులు ముగించుకొని ఇంటికి సురక్షితంగా చేరడమే సంస్థ లక్ష్యమన్నారు. ఉద్యోగుల నిర్లక్ష్యం, చిన్న తప్పిదం వల్ల పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరు భద్రత పరికరాలను వినియోగించుకోవాలని సూచించారు. భద్రత పక్షోత్సవాలు ఉద్యోగుల్లో అవగాహన పెంపుతో పాటు, సమగ్ర భద్రతా సంస్కృతిని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సూచించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మణ్, రాధాకృష్ణ, తిరుపతి, అఫ్సర్పాషా, కిరణ్కుమార్, అమరనాథ్, శ్రీనివాసరావు, డాక్టర్ రాహుల్, రాజు, కిరణ్కుమార్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్, కృష్ణప్రసాద్, రవీందర్, తిరుపతి, సదయ్య పాల్గొన్నారు. గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఏరియాలోని కేటీకే ఓపెన్కాస్ట్–2ప్రాజెక్ట్లో గైర్హాజరు ఉద్యోగులకు సోమవారం అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. గని మేనేజర్ రమాకాంత్ కౌన్సిలింగ్ నిర్వహించి సూచనలు చేశారు.ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
చిన్నారులకు మిల్క్
జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లు, చిన్నారుల వివరాలుప్రాజెక్టులు సెంటర్లు చిన్నారులుములుగు 142 2,536 ఎస్ఎస్ తాడ్వాయి 124 1,430 వెంకటాపురం(కె) 168 1,624 ఏటూరునాగారం 206 2,683అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు పంపిణీఏటూరునాగారం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు చిక్కటి పాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మేరకు గత నెల 17వ తేదీన పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు రోజుకూ 100 ఎంఎల్ చిక్కటి పాలను అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 549 ప్రధాన అంగన్వాడీ సెంటర్లు ఉండగా 91 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు 8,273 మంది ఉండగా ఈ పథకం ద్వారా పాలను అందిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా సెంటర్ల నిర్వహకులు చూస్తున్నారు. ఈ పాల పథకం అమలుపై చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలు అందుతున్నాయి..ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రంలో 100 ఎంఎల్ పాలు ఇస్తున్నారు. రోజు అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చి వదిలిపెడితే పిల్ల లకు టీచర్లు పాలు ఇవ్వడంతో పాటు ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నారు. దీనివల్ల ఏజెన్సీ గ్రామాల్లోని పిల్లలకు మరింత మేలు జరుగుతుంది. పిల్లలు కూడా అంగన్వాడీ బడికి రావడానికి ఇష్టపడుతున్నారు. – ఎట్టి మానస, చిన్నబోయినపల్లి, తల్లి పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక గత నెల 17న లాంఛనంగా పథకాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క జిల్లాలో 8,273 మంది చిన్నారులు -
భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రానికి భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించగా దర్శించుకున్న భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
కాళేశ్వరంలో భక్తుల పూజలు
కాళేశ్వరం: ఆదివారం సెలవురోజు కావడంతో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు చేశారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆల య పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తుల సందడితో కోలాహలంగా కనిపించింది. ఆర్టీఐ రక్షక్ జిల్లా అధ్యక్షుడిగా కమల్మిత్ర భూపాలపల్లి అర్బన్: ఆర్టీఐ రక్షక్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా లూయిస్ కమల్ మిత్రను నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కట్ట సురేష్బాబును నియమించారు. జిల్లాలో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడానికి బాధ్యతలు స్వీకరించినట్లు కమల్మిత్ర తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ప్రతీ పౌరుడికి సమాచారం సేకరించే హక్కు ఉందని తెలిపారు. ఈ బాధ్యత అప్పగించినందుకు వ్యవస్థాపక అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థుల ప్రతిభ టేకుమట్ల: మండలకేంద్రంలోని శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కుంగ్ఫూ–కరాటేలో రాష్ట్ర స్థాయిలో చాంపియన్షిప్ ట్రోఫీ సాధించినట్లు కరస్పాండెంట్ హరీశ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతినికేతన్ విద్యార్థులు వేములవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ– కరాటే చాంపియన్షిప్ 2025లో పాల్గొని విజయం సాధించినట్లు చెప్పారు. పిల్లలు చూపిన క్రమశిక్షణ, ధైర్యం, నైపుణ్యం అందరినీ ఆకట్టుకుందని చెప్పారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. వేయిస్తంభాల ఆలయంలో పల్లకీసేవ హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మార్గశిర బహుళ తదియ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరీరుద్రేశ్వస్వామి వార్లకు ఆదివారం పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 121 మంది దంపతులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీశ్రీరుద్రేశ్వస్వామి వార్లను పల్లకీసేవలో ప్రతిష్టించి మంగళవాయిద్యాలతో, హారతులతో ఆలయ పరిక్రమచుట్టూ పల్లకిసేవ నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. ‘శాంతితోనే అభివృద్ధి’హన్మకొండ: శాంతితోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వళన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాంతి దిశగా ఆలోచించాలన్నారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ మహమ్మద్ ఇక్భాల్ అలీ తదితరులు మాట్లాడారు. మహమ్మద్ సిరాజుద్దీన్ పుట్టిన రోజును పురస్కరించుకుని విశ్రాంత ఆచార్యులు గూడ నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు విజయ్బాబు, విప్పనపల్లి రవికుమార్, డాక్టర్ విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ఆదివారం అధికారులతో కలిసి వెంగ్లాపూర్ నుంచి బయ్యక్కపేట వరకు ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జాతర బందోబస్తుకు వచ్చే పోలీస్ అధికారులకు, సిబ్బందికి మేడారంలో వసతుల కోసం నిర్దేశించిన ప్రదేశాలను చూసి ఆయా ప్రదేశాల్లో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతర బందోబస్తుకు వచ్చే అధికారులకు, సిబ్బందికి లోటుపాట్లు లేకుండా వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర ప్రారంభానికి ముందుగానే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారంలో సాగుతున్న రోడ్ల విస్తరణ, గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో చేపట్టిన రాతి పిల్లర్ల ఏర్పాట్ల పనులను ఎస్పీ పరిశీలించారు. జాతరలో భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఆర్ఐలు స్వామి, వెంకటనారాయణ, తిరుపతి ఉన్నారు. -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. కోళ్లు, యాటలను అమ్మవార్లకు జడతపట్టి మొక్కుగా సమర్పించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, చిలకలగుట్ట, శివరాంసాగర్ పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దీంతో మేడారం పరిసరాల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపించారు. రోడ్ల పనులతో తప్పని తిప్పలు మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. మేడారంలో రోడ్ల నిర్మాణం పనులు జోరుగా సాగుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లే పలు దారుల రోడ్ల నిర్మాణం పనులు చేస్తుండగా అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మేడారం మహాజాతర సమయం దగ్గర పడుతుండడంతో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారంలో జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ, జంపన్నవాగు నుంచి గద్దెలకు వచ్చే దారిలో నీడ చెట్ల నుంచి హరితహోటల్ దారిలో, ఆర్టీసీ బస్డాండ్ భక్తుల క్యూలైన్ దారిలో రోడ్ల విస్తర్ణం పనులు సాగుతున్నాయి. పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా జంపన్నవాగు నుంచి గద్దెల వద్దకు వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా మేడారం ఐలాండ్ వద్దకు భక్తుల వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా తాడ్వాయి మీదుగా మేడారానికి వచ్చిన భక్తులకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మేడారం ఐలాండ్ వరకు రోడ్డు నిర్మాణం పనులు నడుస్తుండడంతో వాహనాలు వెళ్లలేని పరిస్దితి ఏర్పడింది. హరితహోటల్ దారిలో కూడా రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా భక్తుల వాహనాలు వెళ్లేందుకు దారి లేకుండా పోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. జంపన్నవాగు స్నానఘట్టాల రోడ్డుపై నుంచి రెడ్డిగూడెం ఊళ్లో నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్డాండ్ ప్రదేశాలకు వెళ్లారు. ఈ దారులు తెలియని భక్తులు జంపన్న వాగు వద్ద వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన అమ్మవార్ల దర్శనానికి గద్దెల వద్దకు తరలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న కొంతమంది భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రులు పొంగులెటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్కలు మేడారం పర్యటనకు వచ్చిన సందర్భాల్లో పదేపదే అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినా వారి తీరు మారడం లేదు. భారీగా తరలివచ్చిన భక్తజనం వనదేవతలకు మొక్కుల చెల్లింపు రోడ్ల నిర్మాణ పనులతో భక్తుల ఇక్కట్లు -
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పాలతో ప్రొటీన్స్ ప్రతిరోజూ 100 ఎంఎల్ చిక్కటి పాలను చిన్నారులు తాగడం వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి. పాలలో ఉండే కాల్షియం, భాస్వరం, విటమిన్ డీతో పాటు ఏ విటమిన్ వంటి పోషకాలు చిన్నారులకు అంది చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ప్రొటీన్స్, విటమిన్లతో పాటు పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తాయి. అలాగే అధిక బరువు పెరగకుండా చూస్తాయి. చిన్నారులకు పాలతో పాటు మహాలక్ష్మీ పథకం కింద కోడిగుడ్డు, అన్నం, కురుకురేలు, బాలామృతం, బాలామృతం ఫ్లస్ వంటివి కూడా అంగన్వాడీ టీచర్లు అందజేస్తున్నారు. -
మహాజాతర పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణం పనులు, సీసీ ప్లోరింగ్ పనులను, ప్రధాన ద్వారం ఆర్చీ స్తంభాలను ఆయన శనివారం పరిశీలించారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల విస్తరణ పనులను పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, యంత్రాలను ఉపయోగించాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. జాతర సమయంలో కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి వస్తుంటారని తెలిపారు. ఈ క్రమంలో భక్తులను దర్శనానికి పంపించే క్యూ లైన్లు అతి ముఖ్యమని వెల్లడించారు. క్యూ లైన్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను పూర్తిచేయాలన్నారు. రోడ్ల విస్తరణ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన గడువులోపు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గద్దెల ప్రాంగణం పనుల పరిశీలన మేడారంలోని గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం పర్యవేక్షించారు. జాతరలో పనుల పురోగతి పరిశీలించారు. గద్దెల ప్రాంగణం సాలహారం నిర్మాణం చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి పిల్లర్లను పరిశీలించారు. జాతర సమయంలో పోలీస్ అత్యవసర సేవలకు అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎస్పీ సూచనలు చేశారు. జాతర సమయంలో భారీగా మేడారానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టలో ఉంచుకుని గద్దెల ప్రాంగణంలో భక్తుల భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, అత్యవసర సేవలపై అధికారులతో ఎస్పీ చర్చించారు. తొలుత అమ్మవార్లను ఎస్పీ దర్శించుకున్నారు. -
జోరుగా ప్రచారం..
● జిల్లాలో ముగిసిన నామినేషన్ల పర్వం ● రెండు విడతల్లో 24 పంచాయతీలు ఏకగ్రీవం ● పట్టణాల్లో ఉన్న వారికి అభ్యర్థుల ఆఫర్లు ● ఓటర్లను ఆకట్టుకునేలా నాయకుల ప్రయత్నాలుములుగు: జిల్లాలోని 9 మండలాల పరిధిలో మూడు విడతల్లో జీపీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార జోరును అభ్యర్థులు పెంచారు. ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు ప్రణాళికలతో ముందుకుసాగుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ప్రధానంగా పోటీపడుతున్నారు. మొదటి, రెండో విడతలో జరగనున్న మండలాల్లో ఇప్పటికే పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తవగా బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు ఆయా పార్టీలు గ్రామాభివృద్ధికి అంటూ పలు ఆఫర్లు ప్రకటించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొన్నిచోట్ల సఖ్యత కుదిరి ఏకగ్రీవం అయ్యాయి. అధికార పక్షానికి సర్పంచ్, ప్రతిపక్ష పార్టీకి ఉప సర్పంచ్, వార్డులు కేటాయించి పరస్పరం సహకరించుకున్నారు. మిగిలిన చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరెవరనేది తేటతెల్లమైంది. మూడో విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ, పరిశీలన పూర్తయింది. జిల్లాలో 25 పంచాయతీలు ఏకగ్రీవం జిల్లాలో 146 గ్రామపంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మొదటి విడతలో 9 జీపీలు, రెండో విడతలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు, మూడో విడతలో కన్నాయిగూడెం మండల పరిధిలోని ముప్పనపల్లి పంచాయతీకి సింగిల్ నామినేషన్ దాఖలైంది. మొదటి విడతలో గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి, కోటగడ్డ, ముత్తాపూర్, రాఘవపట్నం, కర్లపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో అంకంపల్లి, పంబాపూర్, నర్సాపూర్, ఏటూరునాగారం మండలంలో శంకరాజుపల్లి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో ములుగు మండల పరిదిలోని అంకన్నగూడెం, రాయినిగూడెం, కొత్తూరు, జగ్గన్నపేట, పెగడపల్లి, బంజారుపల్లి, మల్లంపల్లి మండల పరిధిలోని గుర్తూరుతండా, ముద్దునూరుతండా, కొడిశలకుంట, దేవనగర్, వెంకటాపురం(ఎం) మండలంలో అడవిరంగాపూర్, నర్సింగాపూర్, తిమ్మాపూర్, పాపయ్యపల్లి, కేశవాపురం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకుంటే మరిన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి.. పల్లెల నుంచి పట్టణాలకు వలసవెళ్లిన వారు, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సర్పంచ్ అభ్యర్థులు ఫోన్లు చేసి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటు వేసేందుకు వస్తే ఓటుకు రూ.500 నుంచి రూ.1000 ఇవ్వడమే కాకుండా బస్ఛార్జీలు సైతం చెల్లిస్తామని చెబుతున్నారు. జిల్లా నుంచి సుమారుగా 3 వేలకు పైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. 10 మంది ఓటర్లు ఒకే ప్రాంతంలో ఉంటే ప్రత్యేకంగా వాహనాన్ని మాట్లాడుకుని రావాలని కిరాయి డబ్బులను ఓటర్లకు అభ్యర్థులు పంపుతున్నట్లు తెలిసింది. మండలం పంచాయతీలు ఏకగ్రీవం బరిలో ఉన్నవారు ఎస్ఎస్ తాడ్వాయి 18 3 52 గోవిందరావుపేట 18 5 52 ఏటూరునాగారం 12 1 41 వెంకటాపురం(ఎం) 23 5 43 మల్లంపల్లి 10 4 58 ములుగు 19 6 81 వాజేడు 17 0 65 వెంకటాపురం(కె) 18 0 87 కన్నాయిగూడెం 11 1 52గ్రామాల్లో సందడి వాతావరణం మొదటి, రెండో విడత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరెవరనేది స్పష్టత రావడంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో గ్రామాల్లో ప్రచార చేపట్టగా సందడి వాతావరణం నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. దీంతో ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థుల విజయానికి నాయకులు రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన నేతలతో పాటు, మండలాలకు చెందిన నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించి ముందుకు కదులుతున్నారు. మొదటి విడత పోలింగ్ 11వ తేదీ కాగా రెండో విడతకు 14న, మూడో విడతకు 17న పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. మెజార్టీ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. -
అంతులేని అవినీతి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టరేట్లో రూ.60వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకట్రెడ్డిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఓ వైపు భూ నిర్వాసితులు, మరోవైపు కొందరు రైస్మిల్లర్లు తమగోడును వెళ్లబోసుకుంటున్నారు. దామెర, ఊరుగొండ గ్రామాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులు ఏకంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ‘మా ఉసురు తాకింది’అంటూ టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎంఆర్ వేధింపులకు గురైన రైస్మిల్లర్లు కొందరు సీఎస్ కార్యాలయంలో వెంకట్రెడ్డిపై ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. ఆదినుంచి వివాదాస్పదుడే... రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఎ.వెంకట్రెడ్డి ఆదినుంచి వివాదాస్పదుడే. ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వంలోని తన సామాజిక నేపథ్యం ఉన్న నేతల పేర్లు చెబుతూ ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నం చేసేవారన్న ఆరోపణలున్నాయి. జనగామ ఆర్డీఓగా, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. భువనగిరి – వరంగల్ 563 జాతీయ రహదారి భూసేకరణలో ఈయన చేయని అక్రమాలు లేవన్న ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరాయి. జనగామ ఆర్డీఓగా పని చేసిన సమయంలో అప్పుడున్న నియోజకవర్గ కీలక నేత, ఆయన బావమరుదులు, బంధువుల ఒత్తిళ్లకు తలొగ్గి అసైన్డ్, ప్రభుత్వ భూములను పట్టాభూములుగా చిత్రీకరించి రూ.లక్షల్లో పరిహారం చెల్లించారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. సూర్యాపేటలో డిఫాల్టర్లయిన రైసుమిల్లర్ల నుంచి భారీగా వసూళ్లు చేసి సీఎంఆర్ కింద వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కట్టబెట్టినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడా విచారణ ఎదుర్కొన్నారు. అక్రమార్కులకు సీఎంఆర్.. ఉదంతాలు అనేకం.. ● హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా వెంకట్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులకు తీసుకునే నజరానాలు రెండింతలు పెరిగాయని కొందరు రైస్మిల్లర్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయంలో చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ● ఒక్కో సీజన్కు ఒక్కో రైసుమిల్లు నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు. ● ఇన్టైంలో సీఎంఆర్ ఇచ్చిన రైసుమిల్లర్లను పక్కన పెట్టి.. డిఫాల్టర్లయిన వారు ముడుపులివ్వగానే వారికి పెద్ద మొత్తంలో ధాన్యం కేటాయించారు. ● కమలాపూర్లో రెండు రైస్మిల్లులున్న ఓ వ్యాపారి సుమారు రూ.16 కోట్ల వరకు బకాయి ఉన్నా తిరిగి ఈ సీజన్లో భారీగా ధాన్యం కేటాయింపులకు ఆదేశాలిచ్చిన వెంకట్రెడ్డి.. ‘కన్నయ్య’కు అన్నయ్యలా మారాడని రైస్మిల్లర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ● సీతంపేట శివారులోని ఓ రైసుమిల్లర్కు రూ.15 కోట్ల మేరకు ధాన్యం కేటాయించగా.. ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు తిరిగి బియ్యం చెల్లించలేదని చెబుతున్నారు. ● ఇలా పలువురు రైస్మిల్లర్లకు ఇష్టారాజ్యంగా సీఎంఆర్ కేటాయించి.. ఉన్నతాధికారులకు ప్రభుత్వంలోని కొందరు కీలక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బెదిరింపు ధోరణిని కూడా ప్రదర్శించే వారన్న పేరు వెంకట్రెడ్డికి ఉంది. ● పౌరసరఫరాలశాఖలోని ఓ కింది స్థాయి ఉద్యోగి సీఎంఆర్ లావాదేవీలలో కీలకంగా వ్యవహరించగా.. ఇద్దరు ఉన్నతాధికారులు సైతం కొమ్ముకాశారన్న విమర్శలున్నాయి. ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు...? అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్, సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ గౌసుద్దీన్లకు ఏసీబీ అధికారులు శనివారం హనుమకొండ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు విచారణ జరిపిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి క్షమా దేశ్పాండే ముగ్గురికి ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వగా, ఖమ్మం జిల్లా జైలుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డిపై ఫిర్యాదుల పరంపర తవ్విన కొద్దీ అవినీతి, అక్రమాలు.. సీఎంఆర్లో అవకతవకలు కలెక్టరేట్ ఎదుట టపాసులు కాల్చి రైతుల సంబురాలు రెండో రోజు నాగోల్, హనుమకొండలో సోదాలు రూ.30.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు భూసేకరణ, సీఎంఆర్ రికార్డులపైనా విచారణవెంకట్రెడ్డి టీమ్పై ఏసీబీ ఆరా.. ఏసీబీ అధికారులు శుక్రవారం ఘటనా స్థలంలోనే రసాయన పరీక్షలు చేసి, లంచం డబ్బు వెంకట్రెడ్డి చేతిలో ఉండటాన్ని ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కలెక్టరేట్లో తనిఖీలు చేసిన ఏసీబీ టీమ్ పలు ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కార్యాలయ గదిలోని డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఫైళ్లను స్కాన్ చేశారు. ఈ రైడ్స్లో అదనపు ఆస్తులు, మరిన్ని అవినీతి ఆధారాలు దొరికినట్లు సమాచారం. సీఎంఆర్, భూసేకరణల్లో భారీ అక్రమాలు జరిగాయన్న నిర్ధారణకు వచ్చిన ఏసీబీ.. ఈ రెండు అంశాల్లో అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రెవెన్యూ, సివిల్సప్లయీస్ అధికారులు, సిబ్బంది వివరాలపై ఆరా తీస్తోంది. హనుమకొండ, నాగోల్లోని ఆయన ఇళ్లలో తనిఖీలు చేసి రూ.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మొదటి, రెండో దశ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా సంబంధిత గ్రామాలు, మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని తెలిపారు. మూడో దశలో ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోతుందన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో జిల్లాలోని సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, ప్రజలు నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జీపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. -
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ములుగు: జీపీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని అధికారులు నిశితంగా పరిశీలించాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు వీలుగా నియమించిన మైక్రో అబ్జర్వర్లకు శనివారం కలెక్టరేట్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు ముందురోజే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ జయ ప్రకాశ్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ ములుగు: జిల్లాలోని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ.వేణుగోపాల్ సూచించారు. జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల న్యాయ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై పెండింగ్లోని సివిల్, క్రిమినల్, ఇతర కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయ పరిపాలన విషయాలపై చర్చించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ పీ సూర్య చంద్రకళ, భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్ బాబు, మహబూ బాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. పూజారులు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్ పూజలు
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ దంపతులను స్వామి వారి శేషవస్త్రాలతో సన్మానించి స్వామి వారి ప్రసాదం అందించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. రామప్పలో ఎన్నికల పరిశీలకుడు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్ నాయుడు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్లా రాజు ఉన్నారు. ‘అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్’ ములుగు రూరల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ నరేశ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నియంతృత్వ పాలన సాగుతుందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధుల విజయం కోసం పోటీదారులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ బలరామ్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, రమేష్, రవీంద్రచారి, సురేందర్, తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సేవలు మరువలేనివి ఏటూరునాగారం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని 6వ వార్డులో గల అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలను యువత కొనసాగించాలన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్, చిన్ని కృష్ణ, వలిబాబా, ఖాజాపాషా పాల్గొన్నారు. భక్తుల రద్దీ మంగపేట: మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం పూజలు, అర్చనలు జరపించారు.


