breaking news
Mulugu
-
గీత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలి
గోవిందరావుపేట: 50ఏళ్లు నిండిన గీత కార్మికులకు వృత్తి పింఛన్లు మంజూరు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం రిటైర్డ్ ఉద్యోగి కొత్తమల్లయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఏజెన్సీ పేరుతో 2001లో జిల్లాలోని 25 కల్లుగీత సొసైటీలు రద్దు కావడంతో అప్పటి నుంచి గీత కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. తాటిచెట్లపై నుంచి పడి గాయపడిన, మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు సైతం ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 350 ప్రకారం 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు వృత్తి పింఛన్లు అందాల్సి ఉన్నా ఏజెన్సీ నిబంధనల కారణంగా మంజూరు కావడం లేదన్నారు. ఇతర వృత్తుల వారికి లేని అడ్డంకులు గీత కార్మికులకు ఎందుకని ప్రశ్నించారు. కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా 50 ఏళ్లు నిండిన ప్రతీ గీత కార్మికుడుకి పింఛన్ మంజూరు చేసేలా మంత్రి సీతక్క తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం మండల అధ్యక్షుడు మల్లేశ్, కార్యదర్శి సారయ్య, నాయకులు భిక్షం, చంద్రయ్య పాల్గొన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ -
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
ములుగు: అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18లో ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవాలని, తెలంగాణ శాసనమండలిలోని పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితా పునఃసిద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం వివరాలను వెల్లడించారు. అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలతో జాబితాను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలని తెలిపారు. సాధారణ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లాగా ఈ ఓటర్ల జాబితా శాశ్వతం కాదని తతెలిపారు. గతంలో ఓటు హక్కు ఉన్నవారైనా తప్పనిసరిగా కొత్తగా ఫారం–18 ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అర్హులు ఎన్నికల ప్రధాన అధికారిక వెబ్సైట్ ceotelangana. nic. in ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ప్రతీ పట్టభద్రుడు నిర్ణీత గడువులోగా ఫారం–18 సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ తెలిపారు.బండారుపల్లి మోడల్స్కూల్కు హరియాణా రాష్ట్ర ప్రతినిధులు ములుగు రూరల్: బండారుపల్లి మోడల్ స్కూల్ను శనివారం ఏక్ భారత్ పోగ్రామ్లో భాగంగా హరియాణా రాష్ట్ర ప్రతినిధులు ప్రోమిలా, ప్రితి పన్వార్లు సందర్శించారు. ఈ సందర్భంగా హరియాణా రాష్ట్ర మాతృభాషా, వారి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, రాష్ట్ర గొప్పతనం గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు శాసీ్త్రయ సంగీతంపై వివరంచారు. ఈ సందర్భంగా పీఎం శ్రీ స్కీమ్లో భాగంగా పాఠశాలల్లో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి పాఠశాల ప్రిన్సిపాల్ సింగారం దేవకిని అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణికి మూడంచెల విధానం ములుగు: ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రజావాణిని మూడు అంచెల విధానంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టరేట్ కార్యాలయ అధికారి మంజుల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలోనే పరిష్కరించగల సమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు రావడం వల్ల సమయం, ప్రయాణ ఖర్చులు వృథా అవుతున్నాయని పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వీకరించిన దరఖాస్తులను తిరిగి క్షేత్రస్థాయి అధికారులకు పంపాల్సి రావడంతో పరిష్కారంలో జాప్యం అవుతుందని వివరించారు. మొదటి దశలో మండల స్థాయి ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను సమర్పించాలని తెలిపారు. రెవెన్యూ రికార్డులు, రేషన్ కార్డులు, తదితర సమస్యలపై ప్రతీ సోమవారం తహసీల్దార్ లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. రెండో దశలో డివిజన్ స్థాయి ప్రజావాణిని ఆశ్రయించాలని వెల్లడించారు. అక్కడా పరిష్కారం కాకపోతే మూడో దశలో జిల్లా స్థాయి ప్రజావాణి ఉంటుందని మంజుల వివరించారు. అక్టోబర్ 4న రెడ్క్రాస్ ఎన్నికలు ఏటూరునాగారం: అక్టోబర్ 4న జిల్లాలో రెడ్క్రాస్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికల నోటీస్ అధికారి ఎ.ధర్మనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు నిర్వహణ కమిటీ సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు. 25న నామినేషన్ల పరిశీలన, తుది జాబితా నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే నెల 4వ తేదీన ఉదయం 8 నుంచి 3 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. నామినేషన్ వేసే వారు రూ.10 వేలు ఫీజు చెల్లించాలని వెల్లడించారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 7032153610లో సంప్రదించవచ్చు తెలిపారు. -
పట్టాలెక్కిన ఆనందం
సార్తో సెల్ఫీ దిగుతున్న విద్యార్థులు, రోల్ఆఫ్ హానర్, డైరెక్టర్ గోల్డ్ మెడల్ అందుకుంటున్న సిద్ధి బర్పుటే, పీహెచ్డీ పట్టా అందుకుంటున్న ఆనంద్ రామమూర్తిస్నాతకోత్సవంలో పాల్గొన్న నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్రెడ్డి, టెక్సాస్ ఎండీ సంతోశ్కుమార్, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, అధ్యాపకులుమాట్లాడుతున్న నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్రెడ్డి, టెక్సాస్ ఎండీ సంతోశ్కుమార్కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ 24వ స్నాతకోత్సవ సంబురం అంబరాన్నంటింది. నిట్ క్యాంపస్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న కాన్వొకేషన్ మహోత్సవంలో తొలిరోజు శనివారం 930 మంది యూజీ, 22 మంది ఎగ్జిట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. గౌరవ అతిథిగా నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి హాజరై అధికారికంగా స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గోల్డ్మెడల్స్, డిగ్రీ పట్టాలు అందించారు. వ్యక్తిత్వానికి దిక్సూచి.. నిట్ విద్యార్థులు వ్యక్తిత్వానికి దిక్సూచిగా నిట్ విద్యార్థులు నిలవాలని, వ్యక్తిత్వమే భవిష్యత్ను నిర్ణయిస్తుందని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్కుమార్ తెలిపారు. టెక్నికల్ స్కిల్స్, డిగ్రీలు, రెజ్యూమ్ ఒక వ్యక్తి కెరీర్కు సాఫ్ట్వేర్ వంటివి కాగా, వ్యక్తిత్వం, నిజాయతీ, విశ్వసనీయత హార్డ్వేర్ వంటి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవనం కొనసాగించాలన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమలోని ఈల్డ్ను ఉదాహరణగా తీసుకుని వైఫల్యాలను అధిగమించి లక్ష్యాన్ని సాధించాలన్నారు. మైక్రో గ్రిడ్, వ్యవసాయ సెన్సార్లు, సురక్షిత తాగునీరు అందించడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం నూతన ఆవిష్కరణలతోనే సాధ్యమని తెలిపారు. ఏఐ యుగంలోనూ ఇంజనీర్ల పాత్ర కీలకం నేటి ఏఐ యుగంలోనూ ఇంజనీర్ల పాత్ర కీలకమైందని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్.మోహన్రెడ్డి తెలిపారు. ‘ద రోల్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఇన్ ద ఏఐ ఎరా’ అంశంపై మాట్లాడారు. వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఇంజనీర్ల బాధ్యతలు మరింతగా విస్తరిస్తున్నాయని, సమాజానికి సేవ చేయడానికి నిట్ విద్యార్థులు ముందుండాలన్నారు. నేడు పట్టాలందుకోనున్న పీజీ విద్యార్థులు.. నిట్ వరంగల్లో 24వ స్నాతకోత్సవంలో భాగంగా రెండో రోజు ఆదివారం పీజీ (బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ)పీహెచ్డీ విద్యార్థులు బెస్ట్ పీహెచ్డీ ఽథీసిస్, బెస్ట్ ఎంటెక్ అవార్డులతో పాటు రోల్ ఆఫ్ హనర్ గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. పీజీ విభాగంలో 945 పీజీ, 100 పీహెచ్డీ, 22 ఎగ్జిట్ డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు.విద్యార్థుల జీవితాల్లో నూతన అధ్యయనం స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలను అందుకోవడం విద్యార్థుల జీవితాల్లో నూతన అధ్యాయానికి నాంది అని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్లో విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరంలో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ వెహికిల్స్, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంటెక్ విభాగంలో నూతన కోర్సులు ప్రారంభించినట్లు తెలిపారు. క్యాంపస్ సెలక్షన్స్లో యూజీ విద్యార్థులు 93.94 శాతం, పీజీ విభాగంలో 80.78 విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారని అత్యధిక ప్యాకేజీ రూ.1.27 కోట్లు నమోదైనట్లు తెలిపారు.నిట్లో అంబరాన్నంటిన 24వ స్నాతకోత్సవం పట్టాలందుకున్న 930 యూజీ, 22 ఎగ్జిట్ డిగ్రీ విద్యార్థులు నేడు 1,067 మంది పీజీ విద్యార్థులకు ప్రదానం -
లక్నవరం అందాలకు ఫిదా
గోవిందరావుపేట: లక్నవరం సరస్సు అందాలు, ఐలాండ్ల ప్రత్యేకత రామగుండం ఎన్టీపీసీ ఉన్నతాధికారులను ఆకట్టుకున్నాయి. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ చందన్కుమార్ సమంటా తదితర ఉన్నతాధికారులు శనివారం మండల పరిధిలోని లక్నవరం సరస్సును సందర్శించారు. ఐలాండ్–2లో బోటింగ్ చేశారు. ప్రకృతి అందాల నడుమ రాత్రి క్యాండిల్ లైట్ డిన్నర్ ఆస్వాదించి రాత్రి అక్కడే బస చేశారు. ముందుగా ఉన్నతాధికారులకు కోయ బృందంతో స్వాగతం పలికారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల మధ్య రాత్రి బస చేయడం తమకు మంచి అనుభూతిని కలిగించిందని ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేశారు. లక్నవరం ప్రకృతి సోయగాలను మరింతగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు తెలంగాణ టూరిజం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం హోటల్స్ జీఎం కె.నాథన్, అజీమ్ జంగయ్య, లక్నవరం హరిత మేనేజర్ శివశంకర్, హెచ్ఓడీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐలాండ్–2లో ఎన్టీపీసీ బృందం సందడి తెలంగాణ టూరిజం ఆతిథ్యం అద్భుతమంటూ ప్రశంసలు -
ఫీజుల దోపిడీకి చెక్
గోవిందరావుపేట: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక పోర్టల్ పీఎస్సీఎంఎస్(ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టం)ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అధిక ఫీజులు, వివిధ రకాల అదనపు వసూళ్లపై ఇక నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. దీంతో అధిక ఫీజుల భారం నుంచి బయటపడే అవకాశం ఉంది. అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేలా.. జిల్లా వ్యాప్తంగా 41 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 11,335 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ట్యూషన్ ఫీజుతో పాటు పుస్తకాలు, యూనిఫాం, పరీక్షలు, ఇతర కార్యకలాపాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఫీజుల విషయంలో స్పష్టత లేకపోవడం, తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తారనే భయంతో చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోర్టల్ ద్వారా అధిక ఫీజులు, నిబంధనలకు వ్యతిరేకంగా అధికంగా వసూళ్లు చేస్తే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని విద్యాశాఖ అధికారులు కల్పించారు. దీంతో విద్యాసంస్థల ఫీజుల వసూళ్లపై మరింత పారదర్శకత, పర్యవేక్షణకు అవకాశం ఏర్పడనుంది. అవగాహన కల్పిస్తేనే ఫలితం వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన పోర్టల్పై తల్లిదండ్రుల్లో ఎంతమందికి అవగాహన ఉందన్నదే కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ ఫిర్యాదు విధానం, పోర్టల్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాలల వద్ద, మండల విద్యాశాఖ కార్యాలయాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పోర్టల్లో నమోదయ్యే ఫిర్యాదులపై సకాలంలో విచారణ చేసి చర్యలు తీసుకుంటేనే ఈ విధానం సత్ఫలితాలనిస్తుంది. కేవలం పోర్టల్ ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన ప్రతీ ఫిర్యాదును పర్యవేక్షిస్తూ ప్రైవేట్ పాఠశాలలపై నిరంతర నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు.. తల్లిదండ్రులు తమ సమస్యను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు అవసరమైన ఆధారాలను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. సమస్యలు ఫిర్యాదులను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్లో పీఎస్సీఎంఎస్లో మొబైల్లో లాగిన్ కావచ్చు. ఓటీపీ ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. అలాగే ఫిర్యాదు పరిస్థితిని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఫీజు రశీదులు, పాఠశాల నుంచి వచ్చిన సందేహాలు, పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని ఇచ్చిన సూచనలు తదితర ఆధారాలను ఫిర్యాదుతో జత చేయవచ్చు. ఫిర్యాదు అందిన అనంతరం సంబంధిత అధికారులు అంశాన్ని పరిశీలించి అవసరమైతే పాఠశాల యాజమాన్యం నుంచి వివరణ అడుగుతారు. తదనుగుణంగా చర్యలు చేపడతారు. ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట ప్రత్యేక పోర్టల్ తీసుకొచ్చిన విద్యాశాఖ విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం పోర్టల్పై విస్తృత అవగాహన కల్పిస్తేనే ప్రయోజనంనిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే చర్యలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలను వారికి స్పష్టంగా తెలియజేస్తాం. నిబంధనలకు మించి అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలితే సంబంధిత పాఠశాలలపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక ఫీజుల విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికావాల్సిన అవసరం లేదు. పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేసినా, ఇబ్బందులకు గురి చేసినా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయవచ్చు. అందిన ఫిర్యాదులను పరిశీలించి, వాస్తవాలు నిర్ధారణ అయితే సంబంధిత పాఠశాల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటాం. – సిద్ధార్థరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
హేమాచల క్షేత్రం అభివృద్ధిపై సమీక్ష
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, సంబంధిత అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేవాలయ ప్రస్తుత పరిస్థితి, భక్తుల రాకపోకలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దేవాదాయశాఖ అధికారులు, ఆర్కిటెక్టర్లతో విస్తృతంగా చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్ప న, క్షేత్ర ప్రాశస్త్యం, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. కల్యాణ మండపం, అన్నదాన సత్రం, డార్మెంటరీతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంపై చర్చించి వాటి పనులను చేపట్టాలని నిర్ణయించారు. అదేవిదంగా దేవాలయ ప్రధాన నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా క్షేత్ర పవిత్రతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయ నిర్మాణ స్వరూపం, పరిసర ప్రాంతాల ప్రత్యేకత, భక్తుల అవసరాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆర్కెటెక్టులు, అధికారులను ఆదేశించారు. డిజైన్ ఖరారుకు ఆలయ పరిశీలన అభివృద్ధి పనులకు సంబంధించిన డిజైన్ను ఖరారు చేసేందుకు త్వరలో ఆలయాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం దేవాలయ అభివృద్ధికి అనువైన డిజైన్ను ఖరారు చేయనున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించి భూమి స్థితిగతులు, నిర్మాణ సామర్ధ్యం తదితర అంశాలను నిర్ధారించేందుకు రాక్టెస్ట్ను త్వరితగతిన చేపట్టాలని ఖరారు చేశారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి నిర్మాణ పనులకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఖరారు చేయనున్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన హేమాచల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. అభివృద్ధి పనులు, నాణ్యతా ప్రమాణాలు, సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. పనుల డిజైన్ ఖరారుపై మంత్రి సీతక్క ఆదేశాలు -
ప్రతీ పౌరుడికి హక్కులు అందేలా పనిచేయాలి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి–కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్రావు, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్రావులు ప్రారంభించారు. ప్రజలకు న్యాయవస్థను మరింత చేరువ చేయడంతోపాటు పెండింగ్ కేసులు పరిష్కారంలో వేగం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. – మరిపెడ/మరిపెడ రూరల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ.వేణుగోపాల్ మరిపెడలో నూతన సివిల్ కోర్టు ప్రారంభం -
ఉచిత వైద్య సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ములుగు: తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులతో బా ధపడుతున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అర్హులైన రోగులు ‘డాక్టర్ అంబేడ్కర్ మెడికల్ ఎయిడ్ స్కీమ్’ కింద అందించే వైద్య సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కోరారు. జిల్లా నూతన కలెక్టరేట్లో శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రత్యేక వైద్య చికిత్స, శస్త్రచికిత్స అవసరమైన ఎస్సీ, ఎస్టీ వర్గాల రోగులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, మూత్రపిండ వ్యాధులకు డయాలసిస్, కేన్సర్కు కీమోథెరపీ, రేడియోథెరపీ, మెదడు సంబంధిత శస్త్రచికిత్సలు, మూత్రపిండాలు, కాలేయం తదితర అవయవాల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలతోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఈ పథకం కింద ఆ ర్థిక సహాయం పొందవచ్చన్నారు. జిల్లాలో ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన రోగులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకొని సహాయం పొందాలన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
కలలకు ‘పట్టా’భిషేకం!
కాజీపేట అర్బన్: కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏళ్ల కల నెరవేరనుంది. విద్యార్థుల శ్రమ, అకుంఠిత దీక్షకు నేడు(శనివారం), రేపు (ఆదివారం) ప ట్టాభిషేకం జరగనుంది. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో 24వ స్నా తకోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేశారు. క్యాంపస్లోని హోమీ బాబా సెమి నార్హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మా ట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో డిగ్రీ పట్టాల స్వీకరణ కీలక ఘట్టం అన్నారు. స్నాతకోత్సవం గురించి ఆయన తెలిసిన వివరాల ప్రకారం.. నిట్ 24వ కాన్వకేషన్–26లో రెండు రోజుల పాటు 1,997 మంది యూజీ, పీజీ విద్యార్థులు పట్టాలు అందుకో నున్నారు. తొలి రోజు శనివారం ఉదయం 10 గంటల నుంచి స్నాతకోత్సవం ప్రారంభం అవుతుంది. యూజీ విద్యార్థులు 930 మంది పట్టాలు స్వీకరిస్తారు. రెండో రోజు ఆదివారం పీజీ, పీహెచ్డీ వి ద్యార్థులు 1,067 మంది పట్టాలు అందుకుంటారు. ముఖ్యఅతిథి టెక్సాస్ ఇండియా ఎండీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్కుమార్ హాజరై పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సంలో నిట్ చైర్పర్సన్ సేయాంట్ సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్, డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి అధ్యక్షత వి హంచనున్నారు. ప్రతీ విభాగంలో టాపర్లకు గోల్డ్మెడల్, ఓవరాల్ టాపర్కు ఇన్స్టిట్యూట్ గోల్డ్మెడల్తో పాటు ఇంజనీరింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలకు ‘ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆటోమెటిక్ కంట్రోల్ టెక్నాలజీస్ టు ఏవియేషన్ అండ్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్’ అంశంపై పరిశోధనలకు డాక్టర్ పద్మనాభన్ కె.మీనన్కు, ‘డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, అడ్వాన్సింగ్ ఇండియాస్ సెమీ కండక్టర్ అంబీషన్స్ త్రూ విజనరీ టెక్నాలజీ లీడర్ షిప్’ అంశంపై పరిశోధనలకు ఆనంద్ రామమూర్తికి గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలా సఫీ (పీహెచ్డీ) పట్టాలు అందజేయనున్నారు. నిట్ వరంగల్లో నేడు, రేపు పట్టాల అందజేత స్వీకరించనున్న 1,997 మంది విద్యార్థులు విద్యార్థి జీవితంలో కీలక ఘట్టం : నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ -
ప్రతీ పనికి పైసలే!
ములుగు: ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కే సామాన్యుడికి తన పని సకాలంలో, ఎలాంటి అదనపు భారం లేకుండా పూర్తవుతుందనే నమ్మకం లేకుండాపోయింది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధికి పాటుపడాల్సిన అధికార యంత్రాంగం ముడుపుల కోసం చేతులు చాపుతుండడంతో ప్రజలు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదులు అందుకున్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. 2023 నుంచి ఇప్పటివరకు జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులు ఏసీబీకి చిక్కినా... చలనం ఉండడం లేదు. ఇప్పటివరకు వివిధ శాఖలకు చెందిన 8 మంది అధికారులు ఏసీబీకి పట్టుబడడం జిల్లాలో కలకలం రేపుతుంది. లంచగొండి అధికారులపై కొ రఢా ఝూలిపించాల్సిన ఉన్నతాధికారులు మౌనం వహిస్తుండడంతో లంచగొండి అధికారులే రాజ్యమేలుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తాజాగా శుక్రవారం గోవిందరావుపేట తహసీల్దార్ రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. 2019లో జిల్లా ఏర్పాటు అయ్యాక తొలిసారిగా 2023 జనవరి 20న ఏటూరునాగారం ఐటీడీఏలో పనిచేసే డీఈఈ నవీన్కుమార్, ఏఈఈ అబీద్ఖాన్లు కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 40 రోజులు గడవక ముందే 2023 ఫిబ్రవరి 27న ఏటూరునాగారం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సర్వేయర్ మహేందర్ భూ సర్వే విషయంలో రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 2025 మే 6న జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్యారెడ్డి ఏసీబీ ట్రాప్లో పడ్డారు. మెడికల్ లీవ్ కాలానికి సంబంధించిన రూ.3.50 లక్షల జీతం బిల్లులను తయారు చేసి ట్రెజరీకి పంపేందుకు రూ.60 వేల లంచం డిమాండ్ చేయగా, రూ.25 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 2025 జూన్ 16న డీఈఓ కార్యాలయంలో మరో ట్రాప్ జరిగింది. డీఈఓ పాణిని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్కుమార్లు ఉపాధ్యాయుడి జాయినింగ్ రిపోర్టును స్వీకరించి తిరిగి విధుల్లో చేరేందుకు లంచం డిమాండ్ చేయగా, జూనియర్ అసిస్టెంట్ దిలీప్కుమార్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా శుక్రవారం గోవిందరావుపేట తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సృజన్కుమార్ రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వారసత్వ వ్యవసాయ భూమికి సంబంధించిన వ్యవహారంలో అధికారిక అనుకూలత కల్పించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదు అందడంతో అధికారులు పథకం ప్రకారం ట్రాప్ నిర్వహించి కార్యాలయంలోనే డబ్బులు తీ సుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తాజాగా గోవిందరావుపేట తహసీల్దార్ అరెస్ట్ ఇప్పటివరకు 8 మంది ట్రాప్ -
రామప్పను సందర్శించిన టర్కీ దేశస్తులు
వెంకటాపురం(ఎం): మండలంలోని ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప దేవాలయాన్ని టర్కీ దేశానికి చెందిన విద్యావంతుల ఐక్యతా సంఘం ప్రతినిధులు మోసూత్ ఒమర్, నూరుల్లా, రోజ్, ఆ శ్విన్కుమార్లతో కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గు రించి గైడ్ విజయ్కుమార్ వివరించగా, ప్రతీ శిల్పం యొక్క ప్రాధాన్యం గురించి అడిగి తెలుసుకున్నా రు. నీటిలో ఇటుకలు తేలాడడం, సరిగమలు పలికే పొన్నచెట్టు, సాండ్ బాక్స్ టెక్నాలజీ, ముగ్గురికి నాలుగే కాళ్లు లాంటి శిల్పాలను చూసి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. వారి వెంట పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షం గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగం మహేంద్ర రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు యాకూబ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీరంగం, నాయకులు ఆడిచెర్ల రాజయ్య, కమలాకర్ తదితరులు ఉన్నారు. రామప్పను సందర్శించిన అమెరికా దేశస్తులు మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని అమెరికా దేశస్తులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గైడ్ వెంకటేష్ వివరించారు. -
గ్రాడ్యుయేట్ ఓటు.. దరఖాస్తు చేయకుంటే చేటు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ను విడుదల చేయడంతో కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు సైతం మళ్లీ ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాత జాబితాలో పేరు ఉన్నదనే కారణంతో కొత్త జాబితాలో పేరు ఆటోమేటిక్గా కొనసాగదు. 2021లో 5.05 లక్షల మంది.. 2024 ఉప ఎన్నికలో తగ్గిన ఓటర్లు.. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. అప్పటి జాబితాలో 5,05,565 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,32,634 మంది పురుషులు, 1,72,864 మంది మహిళలు, 67 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 1,81,313 మంది ఓటర్లు నమోదయ్యారు. ఆ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంనుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో 2024లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. 2024 ఉప ఎన్నిక తుది ఓటర్ల జాబితాలో 4,61,806 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు ఇతర ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎంతమంది? 2021 ఎన్నికతో పోలిస్తే 2024 ఉప ఎన్నిక నాటికి ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు మరోసారి కొత్తగా పట్టభద్రుల ఓటర్ల జాబితాను రూపొందించనుండడంతో ఈసారి ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటారు? తుది జాబితాలో ఓటర్ల సంఖ్య ఎంతకు చేరుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అర్హత ఉన్న ప్రతీ పట్టభద్రుడు ఫారం–18 దరఖాస్తు చేయడం కీలకం. నవంబర్ 6 తర్వాత మిగిలిన ప్రక్రియ కొనసాగి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఓటర్ల నమోదుపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు.. పోటాపోటీగా నమోదు చేయించేందుకు వ్యూహరచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021 ఎన్నికలకంటే ఈసారి 15 నుంచి 25 శాతం వరకు ఓటర్లు పెరగవచ్చన్న చర్చ జరుగుతోంది. అవసరమైన అర్హతలు ఉండాలి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించనున్నారు. ఇందుకోసం అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులో ఫారం–18 సమర్పించాలి. గతంలో ఇదే నియోజకవర్గంలో ఓటు వేసినవారు, ప్రస్తుతం ఓటు ఉన్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఓటు హక్కు పొందేందుకు డిగ్రీ ఉంటే సరిపోదు. ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణీత అర్హత తేదీ నాటికి పట్టభద్రుడై ఉండటంతోపాటు అవసరమైన అర్హతలతో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఓటుకు మళ్లీ ‘ఫారం–18’ సమర్పించాల్సిందే ఈనెల 28న నోటీసు.. నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 25న ముసాయిదా.. డిసెంబర్ 30న తుది జాబితా -
ఆరోగ్య సేవలు మరింత విస్తృతం చేయాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన వి ద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత పెరుగుపర్చాలని, అనారోగ్య సమస్యలు రాకుండా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఐటీడీఏ సమావేశం మందిరంలో ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే గిరిజనులకు అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై దృష్టి పెట్టాలని, దోమలు, వాహకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ (మలేరియా, డెంగీ, చికున్గున్యా, ఫైలేరియా వంటి కేసులను గుర్తించాలన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన మందులతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఐటీడీఏ ఇంజనీరింగ్ పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఈఈ ప్రవీణను ఆదేశించారు. సమావేశంలో ఏపీఓ దామోదరస్వామి, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, ఈఈ ప్రవీణ, పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. విధుల్లో అంకితభావంతో పనిచేయాలి వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వ త్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మండలపరిధి లోని ఎదిర వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. సిబ్బంది హాజరు పట్టిక, వైద్యశాలకు మంజూ రైన మొత్తం సిబ్బంది సంఖ్య, పోస్టుల వివరాలు, ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది క్రమం తప్పకుండా హాజరు కావటాన్ని పర్యవేక్షించాలని పల్లె దవాఖానా వైద్యాధికారిని ఆదేశించారు. అనంతరం రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో -
అక్రమాలకు కేంద్రంగా గోవిందరావుపేట తహసీల్..
గోవిందరావుపేట: రైతుల భూ సమస్యలకు పరి ష్కారం చూపాల్సిన తహసీల్దార్ కార్యాలయం లంచాలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. ప్రతీ పనికి లంచం అడుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తండ్రి మరణంతో వారసత్వంగా వచ్చిన 1.10 ఎకరాల భూమిని తన పేరున పట్టా చేయించుకునేందుకు చల్వాయికి చెందిన ఓ మహిళ నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో బాధితురాలి భర్త ఏసీబీని ఆశ్రయించడం.. గో విందరావుపేట తహసీల్దార్ సృజన్కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడం కలకలం రేపింది. కార్యాలయం ఉన్నా..లేకపోయినా.. ఒకటే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలియని వివిధ గ్రామాలకు చెందిన కొందరు రైతులు తమ పనుల నిమిత్తం అదే సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తమ పనులు సకాలంలో జరగడం లేదని, పైసలిస్తేనే కార్యాలయంలో పనులు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యాలయం ఉన్నా.. లేకపోయినా ఒకటే.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బయటకు వచ్చిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్యకు ఈ విషయం తెలియడం, ఏసీబీ దాడులు జరుగుతున్న సంగతి తెలియకుండానే రైతులు తమ సమస్యలను బయటపెట్టడం అధికారులను విస్మయానికి గురి చేసింది. -
‘క్షయ’ నిర్ధారణకు ఏఐ
ఏటూరునాగారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నిర్ధారణకు నూతన సాంకేతిక విధానాన్ని అ మల్లోకి తీసుకువచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో కంప్యూటర్ ద్వారా ఊపిరితిత్తుల్లో ఉన్న నిమ్మును పసిగట్టి అది టీబీనా లేక ఏదైనా జబ్బు ఉందా అని కేవలం ఐదు నిమిషాల్లోనే చెబుతుంది. దీనిని అనుగుణంగా జిల్లాలోని పది మండలాల్లో విడతల వారీగా శిబిరాలను నిర్వహిస్తూ ఏఐ ద్వారా అనుమానితులను పరీక్షించి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ విధంగా ఏడాదిలో 349 కేసులు నమోదు కావడంతో జిల్లాలో అధికారులు, ప్రజలను కలవరపెడుతుంది. ఇందులో 75 కేసులను తొలి దశలోనే గుర్తించి మందుల ద్వారా నివారించారు. మిగతా 274 కేసులు ప్రస్తుతం చికిత్సలు నడుస్తున్నాయి. ఈ కేసులు మరింత పెరిగితే ప్రమాదం ఉంటుందని నిపుణులు వాపోతున్నారు. మొదటి దశలోనే గుర్తించి వారికి సరైన పోషకాహారం, మందులను అందిస్తే నివారించే అవకాశం ఉందని వైద్యులు వాపోతున్నారు. గుర్తించడం ఎలా? క్షయ వ్యాధిని గుర్తించడానికి పలు కారణాలున్నాయి. రెండు వారాలకుమించి దగ్గు ఉండడం, కఫం రావడం, కొన్నిసార్లు రక్తంతో కఫం పడడం, జ్వరం రావడం, సాయంత్రం, రాత్రి వేళలో చెమటలు పట్టడం, క్రమక్రమంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, రోజురోజుకూ బలహీనంగా కనిపించే వంటి లక్షణాలు కూడా క్షయవ్యాధికి సూచనలుగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు వెంటనే ఆస్పత్రిలో చేరితే వారికి కావాల్సిన చికిత్సలు అందించే అవకాశాలున్నాయి. కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే వంటి పరీక్షలు ద్వారా నిర్ధారణ చేస్తారు. టీబీకి ప్రత్యేక ఆస్పత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని టీబీ రోగులకు హనుమకొండలోని క్షయవ్యాధి కేంద్ర ఆస్పత్రి ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్దారణ అయిన కేసులను అక్కడికి తరలించి ఉచితంగా మందులు ఇస్తారు. అంతేకాకుండా ప్రస్తుతం సామాజిక, ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక టీబీ నివారణ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వారం టీబీ పరీక్షలు చేసేందుకు రోగుల నుంచి కఫంను షాంపిల్స్ను సేకరించి వాటిని పరీక్షించి నిర్దారణ అయితే సంబంధిత రోగికి ప్రత్యేక చికిత్స అందిస్తారు. తొలి దశలో గుర్తిస్తే నివారణకు అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మండలం కేసులు ములుగు 52మల్లంపల్లి 7వెంకటాపురం(ఎం) 35గోవిందరావుపేట 46తాడ్వాయి 34ఏటూరునాగారం 22మంగపేట 53కన్నాయిగూడెం 18వెంకటాపురం(కె) 42వాజేడు 40 టీబీరహిత సమాజమే లక్ష్యంగా వైద్యఆరోగ్యశాఖ శిబిరాలు జిల్లాలో 349 అక్టివ్ కేసులు -
రోబోటిక్స్ ప్రయోగశాలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ ప్రయోగశాలను వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశా ల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేషం అన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాశాల రోబోటిక్స్ వర్క్షాప్ను హైదరాబాద్కు చెందిన సోహం అకా డమీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. సంస్థ రి సోర్స్ పర్సన్ శంకర్, పావని, కృష్ణతేజ, సుశ్మి త, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలివెంకటాపురం(ఎం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జారీ చేసిన నోటీసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి తనిఖీ చేశారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులు, జారీ చేసిన నోటీసులు, వాటిపై చేపడుతున్న విచారణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోటీసులకు సంబంధించిన విచారణను క్షేత్రస్థాయిలో సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఓటర్ల వివరాలను నిర్ధారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ భవానీ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నగేష్, బూత్ స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 27న బీసీ, ఎస్సీ, ఎస్టీల బహిరంగ సభములుగు: సామాజిక న్యాయం, రాజ్యాధికా రం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యంగా ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 27న హనుమకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్లో నిర్వహించనున్న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. సభకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. జేఏసీ జిల్లా చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉమ్మ డి వరంగల్ జిల్లా చైర్మనన్, రిటైర్డ్ ప్రొఫెసర్ చందా మల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి పొదిళ్ల సాయిబాబా, ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మేకల సుమన్ తదితరులు పాల్గొన్నారు. రూ.12లక్షల ఆదాయం భూపాలపల్లి: ఇసుక, కలప అక్రమ రవాణా తదితర కేసులలో అటవీశాఖ అధికారులకు పట్టుబడిన వాహనాలకు శుక్రవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో టెండరు ప్రక్రియ ద్వారా వేలం నిర్వహించి డ్రా తీశారు. మొత్తం 47 వాహనాలకు వేలం వేయగా శాఖకు రూ.12 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ కిష్టాగౌడ్, ఎఫ్డీఓ అప్పలకొండ, ఎఫ్ఆర్ఓ సృజనకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. -
రామప్పలో ‘ఆశీర్వాద దీపం’
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం ఆవరణలో గురువారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దీపాలు వెలిగించారు. పీఎం బాగుండాలని వేడుకున్నారు. నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ మోదీ ప్రజాసేవకు అంకితమై దేశాభివృద్ధికి పాటు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణవేణి నాయక్, జవహర్లాల్, సుమలత తదితరులు పాల్గొన్నారు. దీపాలు వెలిగించి పూజలు చేసిన బీజేపీ నాయకులు -
గుర్తింపు కార్డులు అందించాలి
ములుగు రూరల్: మేడారం మహాజాతరలో నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు గుర్తింపు కార్డులు అందించాలని నాయీబ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పుగొండ సతీష్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో నాయీబ్రాహ్మనులకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గతంలో సంఘానికి కేటాయించిన భూమిని సర్వే నిర్వహించి తిరిగి అప్పగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నం మోహన్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి తంగేళ్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మురహరి శ్రీకాంత్, రవీందర్, సతీష్, వేణు, రఘువీర్, కృష్ణ, గౌతమ్, రాకేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ నలుగురు ఎక్కడ..?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు కేంద్రంగా సాగిన సైబర్ నేరాల వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వ్యక్తులు వరంగల్ పరిసరాల్లో మకాం వేసి.. స్థానికంగా పరిచయాలు పెంచుకుని సైబర్ నేరాలకు అవసరమైన మ్యూల్ బ్యాంకు ఖాతాల వ్యవహారానికి తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ కీలక నిందితులు నలుగురు ఎక్కడ? అనే చర్చ ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి వరంగల్లో పలువురితో దోస్తానా.. అరెస్టయిన 22 మందిలో గణనీయమైన సంఖ్యలో ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి చెందినవారే ఉండటం కేసులో కీలక అంశంగా మారింది. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లకు చెందిన నరేంద్ర హైల్, సంకల్ప్ ఖైతాన్, హషీమ్లు.. మరో నలుగురు వరంగల్లో మకాం వేశారు. వీరు హనుమకొండలోని భవానీనగర్లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారు. కరీంనగర్కు చెందిన ఇద్దరు, ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కూడా ఉన్నారు. దీంతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన వ్యక్తులకు స్థానికంగా ఎవరు సహకరించారు? పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? ఖాతాల సమకూర్చడంలో ఎవరి పాత్ర ఎంత? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. రెండు ఠాణాల్లో కేసులు.. కూపీ లాగితే కదిలిన డొంక.. మ్యూల్ ఖాతాలు, సైబర్ లింకులు, నేరాలకు సంబంధించిన ఈ వ్యవహారంపై మొదట వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో క్రైం నం.29/2026, ఆజంజాహీ మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్లో క్రైం నం.672/2026గా కేసులు నమోదయ్యాయి. నిందితులపై బీఎన్ఎస్ 316(2), 318(4), 319(2), 338, 336(3), 351(2), 111 ఆర్/డబ్ల్యు 3(5) సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 66–సి, 66–డి కింద కేసులు నమోదు చేశారు. అక్కడినుంచే విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతికత సహాయంతో అత్యంత గోప్యంగా నేరస్తుల కూపీ లాగారు. సైబర్ నేరాల్లో ఉపయోగించేందుకు బ్యాంకు ఖాతాలను సమకూర్చుకునే క్రమంలో స్థానికంగా పలువురిని సంప్రదించినట్లు కేసు వివరాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో నలుగురి కోసం ఇతర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. కమీషన్ ఇస్తామనే ఆశ చూపడం.. ఖాతాలు/బ్యాంకింగ్ వివరాలు సమకూర్చుకోవడం.. వాటిని నేర కార్యకలాపాలకు వినియోగించడం వంటి కోణాల్లో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలు, కొల్లగొట్టిన మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ దర్యాప్తు పూర్తయితే గాని తేలాల్సి ఉంది. రాష్ట్రాల సరిహద్దులు దాటిన నెట్వర్క్.. ఈ కేసులో నిందితుల వివరాలను పరిశీలిస్తే తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల అనుసంధానం కనిపిస్తోంది. బయట ప్రాంతాలనుంచి వచ్చిన వ్యక్తులు వరంగల్లో మకాం వేసి స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకున్నారా? లేక స్థానికంగా ఉన్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల నెట్వర్క్ సంప్రదించిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అరెస్ట్ చేసిన వారినుంచి లభించిన సమాచారం, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ ఆధారాలు, ఫోన్ కమ్యూనికేషన్ల ఆధారంగా నెట్వర్క్లోని మిగిలిన వ్యక్తులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పరారీలో ఉన్న నలుగురి ఆచూకీ లభిస్తే మ్యూల్ ఖాతాల వ్యవహారం వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్, నగదు లావాదేవీలు, స్థానిక–అంతర్రాష్ట్ర సంబంధాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ సూత్రధారులు ఎక్కడ?ఓరుగల్లుకు ‘సైబర్’ లింకులు.. తిష్టవేసిన నేరస్తులు ఢిల్లీ, హరియాణా, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మకాం మ్యూల్ ఖాతాల బాగోతానికి శ్రీకారం ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురితో దోస్తానా కమీషన్ ఆశ చూపి కోట్లు కొల్లగొట్టే స్కెచ్ గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, యూపీకి పోలీసు టీమ్లుఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్న ఖైతాన్ సుధాంశు, ఆమీర్ అలియాస్ జాన్, హేమరాజ్ బెహెరా, మహేష్ టాండీ ఇంకా పోలీసులకు చిక్కలేదు. వీరి ఆచూకీ కోసం ప్రత్యేక బందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లి నిందితులను పట్టుకొచ్చిన పోలీసులు.. పరారీలో ఉన్న నలుగురి కోసం కూడా ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత వెల్లడించారు. -
భూ పోరాటాలు నిర్వహించాలి
● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి ములుగు రూరల్: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో భూ పోరాటాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను రత్నం రాజేందర్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టులు చేసిన పోరాటాల ఫలితంగానే నిజాం రాచరిక ప్రభుత్వం రద్దు అయ్యిందని తెలిపారు. దున్నేవాడికే భూమి, వెట్టి చాకిరి రద్దు కావాలని ఆంధ్ర మహాసభ ప్రధాన డిమాండ్లతో పారాటం సాగిందని వెల్లడించారు. ఈ మహత్తర పోరాటాన్ని వక్రీకరించడానికి బీజేపీ ప్రయత్ని స్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మ వెంకటరెడ్డి, రత్నం ప్రవీన్, ఐలయ్య, రవి, రాజు, కోటయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలన వేడుకలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాపాలన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఎగురవేశారు. అనంతరం జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ దామోదరస్వామి, డీడీ జనార్దన్, డీటీ అనిల్, జేడీఎం కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, తిరుపతి, స్రవంతి, హేమంత్, వెంకట్తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి వేడుకలు ములుగు: జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ భవనంలో భగవాన్ మద్విరాజ్ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రామ్మోహన్ అతిథిగా హాజరై తెలిపారు. తొలుత భగవాన్ మద్విరాజ్ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భగవాన్ విశ్వకర్మను సృష్టికర్తగా, నిర్మాణకళకు అద్యుడిగా భావిస్తారని రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎల్కతుర్తి రాజన్న, నరసింహచారి, రేసోజు పద్మ, పానుగంటి రాజయ్య, కాగితపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ ఏఏఓగా మంజినాయక్ ములుగు: ములుగు ఎన్పీడీసీఎల్ ఏఏఓగా మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక మంజినాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వర్ధన్నపేట జేఏఓగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ములుగు ఏఏఓగా బదిలీపై వచ్చార. ఈ మేరకు గురువారం ఎస్ఈ భిక్షపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహచార ఉద్యోగులు, సిబ్బంది మంజినాయక్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. భూములు కబ్జా చేసేందుకే 22ఏ భూపాలపల్లి: భూములు కబ్జాచేసేందుకే అధికార కాంగ్రెస్ పార్టీ 22ఏను తీసుకువచ్చిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లిలోని 106 ఎకరాల అటవీ భూములపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించగా, అటవీశాఖ అధికారులతో మాట్లాడి సుప్రీంకోర్టులో కేసు వేయించి అటవీశాఖకే భూమి చెందేలా చూశానన్నారు. తాను 2023లో 1,400 ఎకరాలు, తాజాగా 106 ఎకరాలు కబ్జా చేశానని సీఎం నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తారా అని ప్రశ్నించారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపించాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. -
స్వచ్ఛమైన తాగునీటితోనే ఆరోగ్యం
● బాలవికాస ప్రోగ్రాం మేనేజర్ మంజులారెడ్డిగోవిందరావుపేట: స్వచ్ఛమైన తాగునీటితోనే ఆరోగ్యంగా ఉంటారని బాలవికాస ఆదర్శ ప్రోగ్రాం మేనేజర్ మంజులారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురంలో మంచినీటి శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటుపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంజులారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేయనున్న నీటి శుద్ధీకరణ ప్లాంట్ ద్వారా ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను వివరించారు. అనంతరం బాలవికాస వాటర్ ప్లాంట్ ప్రోగ్రాం మేనేజర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అధిక ప్లోరైడ్, ఇతర హానికర ఖనిజాలతో కూడిన నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లాంట్ను సద్వినియోగం చేసుకోవడంతో పాటు దాని నిర్వహణ, సంరక్షణలో భాగస్వాములు అవుతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్ బాలమోహన్రెడ్డి, ఫీల్డ్ కోఆర్డినేటర్లు విమల్, రాజుకుమార్, వినయ్, శంకర్, వార్డుస భ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. -
గొత్తికోయగూడెంలో వైద్యశిబిరం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని తిమ్మాపూర్ పరిధిలోగల చాకిరేవులు గొత్తికోయగూడెంలో గురువారం వెంకటాపురం పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించినట్లు తిమ్మాపూర్ పల్లె దవాఖానా వైద్యాధికారి చందన తెలిపారు. తిమ్మాపూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని ఆవాసానికి 10 కిలోమీటర్లు ట్రాక్టర్లో, మిగిలిన రెండు కిలోమీటర్ల దూరం నడిచి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. శిబిరంలో 52 మందికి వైద్య పరీక్షలు, నలుగురు గర్భిణులు, ముగ్గురు బాలింతలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు. జ్వర లక్షణాలతో వచ్చిన నలుగురికి మలేరియా, డెంగీ పరీక్షలు నిర్వహించగా ఎవరికీ వ్యాధులు నిర్ధారణ కాలేదని వివరించారు. అవసరమైన వారికి చికిత్స చేసి మందులు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు శోభ, సుశీల, మోతీలాల్, ఆశ కార్యకర్తలు మాధవి, కవిత తదితరులు పాల్గొన్నారు. -
చంద్రగిరి గుట్టలపైనుంచే గురి!
● తెలంగాణ సాయుధ పోరాటయోధులకు రహస్య స్థావరం ● రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసిన ఉద్యమకారులు ● చాందాలో శిక్షణ పొంది నిజాం సైన్యానికి చుక్కలుపరకాల: పరకాల సమీపంలోని చంద్రగిరి గుట్టలు తెలంగాణ సాయుధ పోరాటయోధులకు రహస్య స్థావరంగా మారాయి. జాతీయ జెండాతో ఊరేగింపు చేసినందుకు 1947 సెప్టెంబర్ 17న పరకాల చాపలబండ వద్ద రజకార్ల ఊచకోతకు 13 మంది అమరులయ్యారు. రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టి కాల్చిచంపారు. దీంతో పరకాల ప్రాంతంలో రజకార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు పోరాటం ఉధృతమైంది. ఇందులో భాగంగా రజకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ.. మరోవైపు నిజాంపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. నాడు తెలంగాణ సాయుధపోరాట యోధులు మందు గుండు సామగ్రి, తుపాకులు శత్రువులకు దొరకకుండా ఉండేందుకు గుట్టలపై దాచుకునేవారు. మహారాష్ట్రలోని చాందా (ముంబై) ప్రాంతంలో పరకాల ప్రాంతానికి చెందిన తెలంగాణ సాయుధపోరాట వీరులు బ్యాచ్ల వారీగా శిక్షణ పొందారు. సాయుధపోరాట యోధుడు కేవీ నర్సింగరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిని రహస్యంగా చంద్రగిరి గుట్టలకు చేర్చేవారు. అక్కడి నుంచి సాయుధపోరాట యోధులు నిజాం పోలీసులకు చుక్కలు చూపించేవారు. ఎత్తయిన గుట్టల పైనుంచి శత్రువుల రాకను గమనించేవారు. దీంతో చంద్రగిరి గుట్టలు పోరాటాలకు అడ్డాగా పేరుగాంచాయి. హైదరాబాద్ స్టేట్లో కాంగ్రెస్ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తాలుకా కాంగ్రెస్ సేవా సమితి బాధ్యులు అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు. నాటి సమావేశాలకు లేఖల ద్వారానే సమాచారం అందజేసేవారు. పరకాల పోరుగడ్డ బిడ్డలుగా చెప్పుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అందుకే నాటి తెలంగాణ సాయుధపోరాట యోధుల స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశాం. దేశశ భవిష్యత్ కోసం అన్యాయంపై ఎలాంటి పోరాటాలకై నా సిద్ధంగా ఉండాలనే ఆలోచన పెరిగింది. – ఏకు శంకర్, పరకాల -
‘రవాణా భత్యం’ విడుదల
పాఠశాల లేని నివాస ప్రాంతంలోని విద్యార్థులకు రవాణా భత్యం నిధులను సమగ్రశిక్ష మంజూరు చేసింది. జిల్లాల వారీగా సమగ్ర చిత్రం ఇలా..1 నుంచి ఎస్ఏ–1 పరీక్షలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు సమ్మిటివ్ అసెస్మెంట్ పరీక్షలు అక్టోబర్ 1 నుంచి నిర్వహించనున్నారు. అసంఘటిత సంస్థలు15,369ములుగు జనగామ వరంగల్ భూపాలపల్లి మహబూబాబాద్ హనుమకొండ84,067కార్మికులు13,97138,26042,84128,72740,67835,90216,71646,40135,59480,25356,7291,26,908హనుమకొండ85,144 -
వనదేవతల సన్నిధిలో
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఎస్ఎస్తాడ్వాయి : మండల పరిధిలోని మేడారంలో కొలువైన సమ్మక్క–సారలమ్మను బుధవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనమ్ ఆలువాలియా, అపూర్వ శెన్వీ, వెంకటరావు, నిత్య, నేహ ప్రవాష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ పూజారులు.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు డోలువాయిద్యాలతో గద్దెల వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి కండువా కప్పి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా హనుమకొండ హార్టికల్చర్, పర్యాటక శాఖ అధికారి శివాజీ.. మేడారంలో జరుగుతున్న వివిధ పనుల వివరాలు వివరించారు. అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు లక్నవరం సరస్సును సందర్శించారు. వారి వెంట గ్రూప్–1 అధికారి రవళి, పర్యాటక శాఖ అధికారులు ఉన్నారు. ఖిలా వరంగల్ కోట కూడా సందర్శన.. ఖిలా వరంగల్ : చారిత్రక ఖిలా వరంగల్ కోటను బుధవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సందర్శించారు. ఈసందర్భంగా అద్భుత శిల్ప కళా సంపదను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఖుష్మాహాల్, రాతి, మట్టికోట, ఏకశిలగుట్ట అందాలను వీక్షించారు. కాకతీయ చరిత్ర, విశిష్టతను గైడ్ రవి యాదవ్ వివరించారు.కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు. తల్లులకు ప్రత్యేక పూజలు ఘన స్వాగతం పలికిన పూజారులు -
యూపీఐ చార్జ్
ఆన్లైన్ లావాదేవీలపై కొత్త నిబంధనలుములుగు: చేతిలో నగదు లేకపోయినా.. ఫోన్లో యూపీఐ ఉంటే చాలు.. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు చెల్లింపులన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఇంతగా ప్రజల జీవితంలో భాగమైన యూపీఐపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ప్రజలు, వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు. రూ.2 వేలు దాటితేనే.. కొత్త యూపీఐ విధానం ప్రకారం రూ.2 వేలకు పైగా జరిగే నిర్ధిష్ట పర్సన్ టు మెర్చంట్(వ్యక్తి నుంచి వ్యాపారికి) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రైల్వే, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్స్ వంటి రంగాల్లో రూ. 2 వేలకుపైగా అర్హత కలిగిన లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై రూ.5 ఎండీఆర్ ఉంటుంది. రూ.75 వేలకు పైగా సాధారణ అర్హత కలిగిన లావాదేవీలకు ఎండీఆర్ గరిష్టంగా రూ.300లుగా పరిమితం చేశారు. ఈ యూపీఐ విధి విధానాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలో రోజు వారీగా సుమారు రూ.37.20 లక్షలకు పైగా ఆన్లైన్ లావాదేవీలే జరుగుతున్నాయి. రూ.37.20 లక్షల వ్యాపారం జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామపంచాయతీలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలో రోజుకు యూపీఐ లావాదేవీలు సుమారుగా రూ.37.20 లక్షల వ్యాపారం జరుగుతుంది. అంటే దాదాపుగా ప్రతిరోజూ జిల్లాలో జరిగే రూ.37.20 లక్షల వ్యాపారంపై యూపీఐ చార్జీలు సుమారు రూ.11 వేల నుంచి రూ.12 వేలు పడే అవకాశం ఉంది. జిల్లాలో 25 వైన్స్ షాపులు ఉండగా ప్రతిరోజూ సుమారుగా 10 లక్షల వ్యాపారం సాగుతోంది. 19 పెట్రోల్ బంకుల ద్వారా రూ.3.80 లక్షలు, 18 మెడికల్ షాపులు ద్వారా రూ.2 లక్షలు, 15 ఐరన్, ఎలక్ట్రానిక్స్ షాపుల ద్వారా రూ.7.50 లక్షలు వ్యాపారం సాగుతోంది. అదే విధంగా చికెన్, మటన్ దుకాణాల ద్వారా రూ. 1.50 లక్షలు, 340 కిరాణ షాపుల ఉండగా రూ. 3.40 లక్షలు, 42 ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల ద్వారా రూ.4 లక్షలు, బట్టల దుకాణాల ద్వారా రూ.3 లక్షలు, హోటల్స్ ద్వారా రూ.2లక్షల వ్యాపారం ఆన్లైన్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. అయోమయంలో ప్రజలు, వ్యాపారులు వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలు జిల్లాలో రోజు వారీగా రూ.37.20 లక్షల యూపీఐ లావాదేవీలు -
ఆకస్మిక తనిఖీలు
వెంకటాపురం (ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట, జవహర్నగర్, పెద్దాపూర్ ఉపకేంద్రాలను జిల్లా మాతా సంరక్షణ ప్రోగ్రామ్ అధికారి చీర్ల శ్రీకాంత్, జిల్లా ఏసీడీ ప్రోగ్రామ్ అధికారి రంజిత్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పెద్దాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి 9, 10వ తరగతి బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. బాలికల తల్లిదండ్రులకు కూడా వ్యాక్సిన్పై సరైన అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ అసంక్రమిత వ్యాధుల (ఏసీడీ) స్క్రీనింగ్ను పూర్తి చేయాలని ఆరోగ్య, ఆశ కార్యకర్తలను ఆదేశించారు. ఏసీడీ కార్యక్రమంలో 100 శాతం స్క్రీనింగ్ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం(ఎం) పీహెచ్సీ సామాజిక ఆరోగ్య అధికారి మాడిశెట్టి శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు నిరోష, వజ్రమ్మ, స్వర్ణలత, ఎంఎల్హెచ్పీ నవీన్, వైద్యాధికారి సంఘమిత్ర, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఒకే ఇంట్లో ఇద్దరికి ఎంబీబీఎస్ సీట్లు
ఏటూరునాగారం: మండల కేంద్రానికి చెందిన వావిలాల సంధ్యారాణి చిన్న ఎల్లయ్య దంపతులకు చెందిన కుమార్తె, కుమారుడు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఈ మేరకు వావిలాల సుశీల్ చంద్ర 9111 ర్యాంక్ రాగా అతడికి హైదరాబాద్లోని టీఆర్ఆర్ఎం పటాన్ చెరువులోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. అలాగే వావిలాల శైలూచంద్రికకు 6513 ర్యాంకు రావడంతో నల్గొండలోని నార్కట్పల్లి కామినేని మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లు తండ్రి ఎల్లయ్య వెల్లడించారు. పేద వర్గాలకు సేవ చేయడానికే తన ఇద్దరు పిల్లలను డాక్టర్లను చదివిస్తున్నట్లు ఎల్లయ్య తెలిపారు. దీంతో వారిని పలువురు అభినందించారు. ‘చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి’ ములుగు: చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు జంక్ఫుడ్కు దూరంగా ఉంచాలని జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెళ్లి ప్రేమలత, సీడీపీఓ శిరీష అన్నారు. ఈ మేరకు వారు మండల పరిధిలోని శ్రీరాములపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎస్.సరస్వతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు సురేందర్, రామయ్య, వీఓఏ అధ్యక్షురాలు కె.అనిత, ఐసీపీఎస్ సంధ్య, అంగన్ వాడీ టీచర్లు భాగ్య, ఎస్. రమ, రెహనా సుల్తానా, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు పాల్గొన్నారు. ఉన్నత విద్యతోనే బంగారు భవిష్యత్ వాజేడు: ఉన్నత విద్యను అభ్యసిస్తేనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి నాయిని వీరేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అడ్మిషన్లు, ఉపన్యాసకుల బోధన తీరును ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం ద్వారా జూనియర్ కళాశాల విద్యార్ధులకు వచ్చిన బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ పట్టుదలతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్కుమార్, ఉపన్యాసకులు డాక్టర్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
మాజీ మావోయిస్టుల పునరావాసానికి చర్యలు
ములుగు: లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పునరావాస ప్రయోజనాలు కల్పించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థికసాయం, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలు తదితర పునరావాస ప్రయోజనాలు కల్పించే అంశాలపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న అంశాలను పరిశీలించి, అవసరమైన తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులకు పునరావాస ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఎస్పీ రవీందర్, జిల్లా అధికారులు రామ్మోహన్, రవీందర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ములుగు: జ్వరంతో బాధపడుతున్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ అయితే పూర్తిస్థాయి చికిత్స అందించాలని కీటక జనిత వ్యాధుల నియంత్రణ రాష్ట్ర అదనపు సంచాలకురాలు డాక్టర్ పద్మజ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గొత్తికోయగూడేల్లో రక్తహీనత కేసులను గుర్తించి న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదు అవుతున్న మలేరియా, డెంగీ కేసుల వివరాలను జిల్లా కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జ్వరపీడితులకు ఆర్డీటీ పరీక్షలతో పాటు రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కోపిక్ పరీక్షలు నిర్వహించాలన్నారు. డెంగీ నిర్ధారణ అయితే ఎలీషా పరీక్ష కోసం ములుగు టీ–హబ్కు నమూనాలు పంపాలని తెలిపారు. కేసులు గుర్తించిన గ్రామాల్లో జిల్లా ర్యాపిడ్ యాక్షన్ టీమ్లతో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు, డిప్యూటీ డైరెక్టర్ విజయ్కుమార్, జోనల్ మలేరియా అధికారి విశ్వశాంతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్, జిల్లా ప్రోగ్రాం అధికారులు రవితేజ, దుర్గారావు, హెచ్ఈఓ సతీష్, సబ్ యూనిట్ అధికారులు వెంకట్రెడ్డి, భూపాల్రెడ్డి, సాంబయ్య, సూపరింటెండెంట్ విజయబాబు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ రాష్ట్ర అదనపు సంచాలకురాలు పద్మజ -
ముస్తాబైన కలెక్టరేట్
ములుగు: జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ నేడు(గురువారం) నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. వేడుకల కోసం స్టేజీ ఏర్పాటుతో పాటు వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు మంత్రి సీతక్క వేడుకలకు హాజరై జాతీయజెండాను ఆవిష్కరించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొనున్నారు. -
కంటి పరీక్షలు తప్పనిసరి
● డీఎంహెచ్ఓ గోపాల్రావుగోవిందరావుపేట: పిల్లల్లో కంటి సమస్యలు తొలిదశలోనే గుర్తించి తగిన వైద్యం అందించేందుకు తప్పనిసరిగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు తెలిపారు. కమిషనర్ ఆఫ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాన్ని మంగళవారం మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని, కంటి ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలోని 29,512 మంది బాలబాలికలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో 14,604 మంది బాలురు, 14,908 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని ఆరు ఆర్బీఎస్కే బృందాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. పిల్లలకు విటమిన్–ఏ సమృద్ధిగా లభించే క్యారెట్, గుడ్లు, పాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో 250 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కార్యక్రమ అధికారి డాక్టర్ నాగఅన్వేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి సంపత్, ఆర్బీఎస్కే వైద్యులు శ్రీనివాస్, డాక్టర్ జయప్రద, నేత్ర పరీక్షాధికారి తిరుపతి, మోడల్ స్కూల్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాంచందర్, ఆర్బీఎస్కే బృందం సభ్యులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
శిక్షల శాతాలు ఇలా.. ఎస్ఎస్ తాడ్వాయి: సీజనల్ వ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టొప్పో వైద్య సిబ్బందిని ఆదేశించారు. తాడ్వాయి, గోవిందరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. తాడ్వాయి వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, గోవిందరావుపేట వైద్యాధికారి అనూషతో ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మందుల నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రామాల్లో మలేరియా నివారణకు దోమల మందు పిచికారీ చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో -
మున్సిపాలిటీకి నిధులు కేటాయించాలని వినతి
ములుగు: నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతనిప్పుల భిక్షపతి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు రియాజ్ మీర్జా మంగళవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీ పరిధిలో మినీ ట్యాంక్బండ్, చిల్డ్రన్స్ పార్క్, నూతన మున్సిపాలిటీ భవనం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్, ఆధునిక వాహనాలు, మోడ్రన్ గ్రేవ్యార్డ్ తదితర మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూపొందించిన ఎస్టిమేషన్ కాపీని మంత్రికి అందజేశారు. ఆయా పనులకు సుమారు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని త్వరలో సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.బురదలో చిక్కుకున్న 102 వాహనం గోవిందరావుపేట: ఇటీవల రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో మండల పరిధిలోని పలు రోడ్లు బురదమయంగా మారాయి. ఈ మేరకు మండల కేంద్రంలోని 4వ వార్డు గ్రంథాలయం బజారులో రహదారి పూర్తిగా బురదమయంగా మారింది. కనీసం కాలినడకన వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సోమవారం 102 అంబులెన్స్ వాహనం వచ్చి బురదలో కూరుకుపోయింది. చివరకు స్థానికులు ట్రాక్టర్ సాయంతో అంబులెన్స్ను బయటకు లాగాల్సి వచ్చింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ‘తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే’ ములుగు: రాష్ట్రంలో తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10శాతం వరకు బీఆర్ఎస్ ప్రభత్వమే పెంచిందని తెలిపారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకుని నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్నందున గిరిజనుల తరఫున కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రేపు(17న) జిల్లా వ్యాప్తంగా తండాలు, గూడేల్లో కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు గోవింద్నాయక్, కాక లింగయ్య, రేగ నర్సయ్య, తాటి కృష్ణ, జంపన్న తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమం గోవిందరావుపేట: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్ఫూర్తితో రైతాంగ, ప్రజా సమస్యలపై మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పస్రాలో గల సీపీఎం కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నాగరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు నివాళులర్పించి మాట్లాడారు. భూమి, భుక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందన్నారు. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, నల్ల నర్సింహులు, ఠానునాయక్, షేక్ బందగి వంటి ఎందరో వీరులు అమరులయ్యారని గుర్తు చేశారు. పోరాట ఫలితంగా సుమారు పది లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని తదితర విషయాలను కృష్ణారెడ్డి వివరించారు. -
మిగిలింది ఒక్కరోజే..
చేయూత పింఛన్ల దరఖాస్తులకు నేడే చివరి రోజుములుగు: జిల్లాలో చేయూత పింఛన్ దరఖాస్తుదారులు ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పాలన నేపథ్యంలో చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రామ పంచాయతీల వారీగా చేయూత పింఛన్ల దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పింఛన్ దరఖాస్తులను తీసుకుంటున్నారు. మంగళవారం నాటికి 4,095 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నేడు(బుధవారం) దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు అవకాశం ఉండడంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. వయోవృద్ధులకు మొండిచేయి.. ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించిన చేయూత పింఛన్ల మంజూరులో వయోవృద్ధులకు మొండిచేయి చూపించింది. గత ప్రభుత్వం 57 ఏళ్ల నుంచి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరికి మాత్రమే వయోవృద్ధుల పింఛన్లు మంజూరు చేసి మిగిలిన జాబితాను పెండింగ్లో పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్లు మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పింఛన్లు మంజూరు అవుతాయని వయోవృద్ధులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నామని చెబుతూ గతంలో దరఖాస్తులు చేసుకున్న వారిని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆగష్టు 31 వరకు తుది గడువు విధించినప్పటికీ ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పింఛన్ల దరఖాస్తుల గడువును పెంచింది. వరుస సెలవుల నేపథ్యంలో ఒకరోజు గడువు పెంచి 16వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కాగా ప్రభుత్వం అందించే చేయూత పింఛన్ల విషయంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, డయాలసిస్, పైలేరియా రోగులకు మాత్రమే చేయూత పింఛన్లు ఇస్తామని వెల్లడిస్తూ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించడంతో వయోవృద్ధులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వయోవృద్ధులకు సైతం చేయూత పింఛన్లు మంజూరు చేయాలని వృద్ధులు కోరుతున్నారు. జిల్లాలో 37,127 మందికి పింఛన్లు జిల్లాలో ఇప్పటి వరకు 37,127 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఈ మేరకు 14,918 మంది వృద్ధులతో పాటుగా 16,363 మంది వితంతువులు, 3,819 మంది వికలాంగులు పింఛన్లు అందుకుంటున్నారు. అలాగే 203 మంది కల్లుగీత కార్మికులు, 217 మంది చేనేత కార్మికులు, 90 మంది బీడీ కార్మికులు, 1,517 మంది ఒంటరి మహిళలతో కలిపి మొత్తంగా 37,127 మందికి ప్రతినెలా రూ.9.01 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది.జిల్లా వ్యాప్తంగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు (15వ తేదీ వరకు) ఇప్పటికే 4,095 దరఖాస్తుల రాక వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో గడువు పెంచిన ప్రభుత్వంఒక్కరోజు గడువు పెంపు..జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 171 గ్రామపంచాయతీలతో పాటు ములుగు మున్సిపాలిటీ పరిధిలో అధికారులు దరఖాస్తులను స్వీకరించగా మంగళవారం నాటికి 4,095 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు తుది గడువు అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మూడు రోజులు వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు ఒకరోజు గడువు పెంచి నేటి వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వితంతువులు 2,634ఒంటరి మహిళలు 468దివ్యాంగులు 844 గీత కార్మికులు 104చేనేత కార్మికులు 45 -
7కిలో మీటర్లు కాలినడకన వెళ్లి వైద్యం
గోవిందరావుపేట: అడవిలో 7 కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్లి ఆదివాసీలకు వైద్యసేవలు అందించినట్లు సబ్ యూనిట్ అధికారి భూపాల్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కర్లపల్లి గుండ్లవాగు ప్రాజెక్ట్ సమీపంలోని బూడిదగడ్డగూడెంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు, పెద్దలకు వైద్యపరీక్షలు నిర్వహించి 20 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా మలేరియా లక్షణాలు కనిపించలేదని తెలిపారు. మొత్తం 50 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు వివరించారు. ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు పింగిళి నాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తగ్గడంతో ఆరా తీయగా గూడెం వాసులు జ్వరాల బారిన పడిన విషయం తెలిసిందన్నారు. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ గోపాల్రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి గోపాల్రెడ్డి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
కొలువుదీరిన గణేశుడు..
విఘ్నాలు తొలగించే మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో గణనాథుల విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా గణనాథుడి నామస్మరణతో పండుగ వాతావరణం నెలకొంది. – ములుగుములుగులో విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తున్న భక్తులుఏటూరునాగారంలో బొడ్రాయి వద్ద వినాయకుడికి పూజలు -
వరంగల్ కమిషనరేట్ ముందంజ
దర్యాప్తు వేగం, ట్రాఫిక్ అమలులో..సాక్షి, వరంగల్ : నేరం చేసిన వ్యక్తిలో భయం కలగాలంటే కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు. నిందితుడిని గుర్తించి పట్టుకోవడం, దర్యాప్తును వేగంగా పూర్తి చేయడం, పక్కా ఆధారాలతో చార్జ్షీట్ దాఖలు చేయడం...ఆపై కోర్టులో నేరం రుజువై శిక్ష పడేలా చేయడమే అసలైన పోలీసింగ్కు గీటురాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏ ఒక్క దశలో లోపం ఏర్పడినా నేరస్తుల్లో భయం తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్శాఖ గత ఆరు నెలల పనితీరుతో రూపొందించిన ‘క్లస్టర్ వైజ్ యూనిట్స్ పెర్ఫార్మెన్స్ స్కోర్కార్డు’ ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని నాలుగు పోలీస్ యూనిట్ల పనితీరులో ఉన్న తేడాలను స్పష్టం చేస్తోంది. దర్యాప్తు వేగం, ట్రాఫిక్ అమలులో వరంగల్ పోలీసు కమిషనరేట్ ముందంజలో ఉండగా, భూపాలపల్లి, ములుగు శిక్షల శాతంలో మంచి ఫలితాలు సాధించాయి. చార్జిషీట్ల నమోదులో మహబూబాబాద్ ముందుంది. ఇలా అన్ని యూనిట్లు అన్నింట్లోనూ మెరుగైతే ఉమ్మడి వరంగల్లో నేరాల నియంత్రణ సులభమై నేరగాళ్లలో వణుకు పుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ర్యాంకులిలా..● క్లస్టర్–1లో ఐదు పోలీస్ కమిషనరేట్లు ఉంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉంటే, వరంగల్ కమిషనరేట్ రెండో స్థానంలో నిలిచింది. ● క్లస్టర్–3లో 11 పోలీసు యూనిట్లుండగా మహబూబాబాద్ అఖరి స్థానంలో నిలిచింది. ● క్లస్టర్–4లో 10 పోలీసు యూనిట్లుండగా జయశంకర్ భూపాలపల్లి 9వ, ములుగు 10వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఒకే ప్రాంతానికి చెందిన పోలీస్ యూనిట్ల మధ్య పనితీరు సూచీల్లో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరముంది.ట్రాఫిక్ నిబంధనల అమలు, ఈ–చలాన్లు ఇలా..ఆరు నెలల పనితీరుపై రాష్ట్ర పోలీస్శాఖ స్కోర్కార్డుకేసు నమోదైన తర్వాత దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియలో అత్యంత కీలక దశ. ఈ విషయంలో మహబూబాబాద్ నాలుగు యూనిట్లలో ముందుంది. ముఖ్యంగా ములుగులో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్ దాఖలు చేసే రేటు మిగిలిన యూనిట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం కాస్త ఆందోళన కలిగించే అంశమని పోలీస్ వర్గాలు అంటున్నాయి. శిక్షల శాతంలో భూపాలపల్లి, ములుగు, చార్జిషీట్లో మహబూబాబాద్ నేరాల నియంత్రణలో మనోళ్ల పెర్ఫార్మెన్స్ వెల్లడి ఎఫ్ఐఆర్నుంచి శిక్షల వరకు పనితీరుతో మార్కుల శాతం అన్ని విభాగాల్లో మెరుగైతేనే ఉమ్మడి వరంగల్లో నేరగాళ్లకు చెక్ -
రెడ్క్రాస్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుములుగు: భారత రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. రాష్ట్ర రెడ్క్రాస్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను అక్టోబర్ 4న నిర్వహించేందుకు కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఎన్నికల అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ధర్మనాయక్ను, ఎన్నికల పరిశీలకుడిగా అదనపు కలెక్టర్ సంపత్రావును నియమించినట్లు తెలిపారు. ఈ నెల 19న తుది ఓటర్ల జాబితాతో పాటు ఎన్నికల ప్రకటన విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, ఒక్కో నామినేషన్కు తిరిగి చెల్లించని డిపాజిట్గా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారని వెల్లడించారు. అవసరమైతే అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా శాఖ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడి ఎన్నికను అదేరోజు నిర్వహిస్తారని కలెక్టర్ వివరించారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాభై ఏళ్లకు పైగా గణనాథుడి ఉత్సవాలు
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు దశాబ్దాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం కొనసాగుతోంది. సుమారు 50 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఎడ్లబండిపై గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లి రేగడి మట్టిని తీసుకొచ్చి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ప్రతీ ఏడాది ఏటా మట్టితో తయారు చేసిన విగ్రహాలను నిర్వహిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా శిథిలావస్థకు చేరుకోగా.. 2007లో ఆలయాన్ని నూతనంగా పునర్నిర్మించారు. కాలం మారుతున్నా.. ఆలయ రూపురేఖలు మారుతున్నా.. గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయాన్ని మాత్రం ఇప్పటికీ అంతే భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ వస్తున్నామని గ్రామానికి చెందిన వీరమాచినేని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ● అంబరాన్నంటేలా వేడుకలు ● సాంస్కృతిక కార్యక్రమాలు● సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఉత్సవ కమిటీలు, భక్తులు● అప్పుడు సాదాసీదాగా ఇప్పుడు ఆధునిక హంగులతో..సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్లోని అంబేడ్కర్ నగర్లో 1968 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేడ్కర్నగర్కు చెందిన పెయింటర్ దుప్పటి నాగేందర్ చెరువు మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేయగా, స్థానికులతో పాటు రైల్వే కాలనీకి చెందిన ఉద్యోగస్తుల కుటుంబాలతో కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు ఘనంగా నిర్వహించేవారు. తొమ్మిది రోజులు పూజలతోపాటు కోలాటాలు నాటికల ప్రదర్శనలతో కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించేవారు. నిమజ్జనానికి రైల్వే బాక్సులు మోసుకెళ్లే తోపుడు బండిని వినియోగించి బండిపై విగ్రహాన్ని ఊరేగించి సమీపంలోని రైల్వే బావిలో నిమజ్జనం చేసేవారు. మొదట మట్టి విగ్రహం నిమజ్జనం సమయంలో తోపుడు బండి, డప్పుచప్పుళ్లు ఉండగా తర్వాత ఎడ్ల బండి, బ్యాండ్ మేళం వినియోగించారు. 58 ఏళ్లుగా క్రమం తప్పకుండా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ వేడుకల కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరూవాడా ఆధ్యాత్మిక సందడి -
రాజీమార్గమే రాజమార్గం
ములుగు: రాజీమార్గమే రాజమార్గం అని, కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చండీశ్వరీ దేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలత్లో కుదిరిన రాజీకి అప్పీల్ ఉండదని, ఇదే అంతిమ తీర్పుగా ఉంటుందని వెల్లడించారు. నాలుగు బెంచీల ద్వారా మొత్తం 2,881 కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఇందులో పెండింగ్లో ఉన్న 691 వివిధ కేసులు, 2,183 ట్రాఫిక్ చలానన్ కేసులు, 7 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి.కన్నయ్యలాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.జోత్స్న, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శంకర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.చంద్రయ్య, జనరల్ సెక్రటరీ కొండి రవీందర్, డీఎస్పీ రవీందర్, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చండీశ్వరీదేవి -
ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
ఏటూరునాగారం: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా 2వ మహాసభలు శనివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలోని యువతకు ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం హామీనిచ్చి మరిచిందన్నారు. 12 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ మరో వైపు నీట్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా ప్రశ్నపత్రాల లీకులకు పాల్పడుతూ యువత భవిష్యత్ను నాశనం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారని హామీనిచ్చారని వివరించారు. కాని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవీందర్, అరుణ్, లాజర్, కృష్ణబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్, జిల్లా నాయకులు మమత, శ్యామ్, రమేశ్, రాఘవేంద్ర, సంతోష్, శివ, ప్రవీణ్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ -
కొండా దంపతుల ఢిల్లీ బాట!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలక బాధ్యత అప్పగిస్తారా? సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పర్యటన వెనుక మతలబు ఏంటో.. కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా చర్చ రాంనగర్లో నేడు కార్యకర్తలతో కీలక భేటీ.. తర్వాత హస్తినకు పయనం శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్న ‘కొండా’ దంపతులు కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? -
67 ఏళ్లుగా వేయిస్తంభాల ఆలయంలో..
హన్మకొండ కల్చరల్: ఒకప్పుడు పబ్లిక్గార్డెన్ వద్ద నిర్వహించిన గణేశ్ ఉత్సవాన్ని 1933లో హనుమకొండలోని రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయంలోకి మార్చారు. 67 సంవత్సరాల క్రితం వేయిస్తంభాల దేవాలయానికి మార్చగా.. అప్పటి నుంచి నూతన గజానన మండలి అధ్వర్యంలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయకులను ప్రతిష్ఠించాలని పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు 15 ఏళ్లుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేయిస్తంభాల ఆలయంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలిరావడం ఇక్కడి ప్రత్యేకత. అదేవిధంగా నిమజ్జనం రోజున కూడా వేయిస్తంభాల దేవాలయం వినాయక నిమజ్జనోత్సవ రథాన్ని దర్శించుకోవడానికి ప్రజలు మంగళ హారతులతో ఎదురుచూస్తారు. -
అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
ములుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి సూచించారు. ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ శనివారం తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్స్థాయి అధికారుల అందుబాటు, ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులు, క్లెయిమ్స్, అభ్యంతరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా బూత్ స్థాయి అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కొత్తగా ఓటరు నమోదుకు ఫారం–6, పేర్ల తొలగింపునకు ఫారం–7, వివరాల సవరణకు ఫారం–8 దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. ప్రత్యేక ప్రచార దినాల్లో బూత్ స్థాయి అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ ఎన్. విజయభాస్కర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నగేశ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ సాత్విక్, బూత్ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీఓ కృష్ణవేణి -
‘ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలి’
వెంకటాపురం(కె): నాయీబ్రాహ్మణులు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జంపాల రవీందర్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం కొయ్యల వెంకటేశ్వర్లు అధ్యక్షతన మండల మహాసభను నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనమంతా ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన జిల్లా మహాసభకు నాయీబ్రాహ్మణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహాసభ ఆహ్వాన పత్రాలను నాయీ బ్రాహ్మణులకు అందజేశారు. ఈ మహాసభలో సత్యనారాయణ, కుమార్, వెంకటేశ్, మల్లిఖార్జున్, రాజశేఖర్, సత్యనారాయణ, శివ పాల్గొన్నారు. -
తోపుడు బండి.. ఆయిల్ డబ్బాల శబ్దాలు
నర్సంపేట: నర్సంపేటలోని హైస్కూల్ సమీపంలో 20 మంది యువకుల కమిటీతో ఏర్పడ్డ ప్రగతి నగర్ గణేశ్ ఉత్సవ కమిటీ 50 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. 1977లో ఏర్పడినప్పటి నుంచి కాలనీలోని సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొదట్లో తోపుడు బండిలో వినాయకుడిని ఏర్పాటు చేసుకోగా, ఆ తర్వాత ఎడ్లబండిపై నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం హైస్కూల్ సమీపంలో మండపాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. 50 ఏళ్లక్రితం గణేశ్ ఉత్సవాలు ప్రారంభించాం. మొదట్లో నిమజ్జనం చేసేందుకు తోపుడు బండి పై వినాయకుడిని తీసుకెళ్లేవాళ్లం. నిమజ్జన శోభాయాత్రలో ఆయిల్ డబ్బాను కొట్టుకుంటూ శబ్దాలు చేస్తూ వెళ్లేవాళ్లం. అప్పటి ఆనందమే వేరు. ప్రస్తుతం డీజే పెట్టాల్సి వస్తోంది. – గీత గోవిందం సురేశ్, ఉత్సవ కమిటీ బాధ్యుడు -
హేమాచలుడికి పూజలు
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వందలాది మంది భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నా రు. పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉన్న స్వయంభు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. రామప్ప దేవాలయంలో అధికారులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న గ్రూప్ 2 అధికారులు భారత్ దర్శన్లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్లు ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అలాగే ఆర్కాలాజికల్ కన్సర్వేషన్ డైరెక్టర్ శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు అభిషేక పూజలు నిర్వహించగా అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈఓ ఇమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు ఇటీవల పునరుద్ధరణ చేసిన సోమసూత్రం, ఆలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. గురుకుల కళాశాల నుంచి ఇద్దరు బదిలీ ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఆరోపణలను ఎదుర్కొంటున్న వార్డెన్ కిరణ్మయి, గణితం ఉపాధ్యాయురాలు తిరుపతమ్మను బదిలీ చేసినట్లు ఇన్చార్జ్ ఆర్సీఓ రాజునాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన కళాశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిందని, నీటి సమస్యలను పట్టించుకోలేదని వచ్చిన ఆరోపణలపై గురుకులాల కార్యదర్శి సీతా లక్ష్మీ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలో భాగంగా వారి ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఏటూరునాగారం గిరిజన బాలికల గురుకుల కళాశాలలో వార్డెన్గా పనిచేస్తున్న కిరణ్మయిని మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలకు బదిలీ చేయగా, గణితం ఉపాధ్యాయురాలు తిరుపతమ్మను కొమురం భీం జిల్లా జైనూర్కు బదిలీ చేసినట్లు వివరించారు. వరుణుడి జోరు.. సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపాడు. శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం నివేదిక ప్రకారం శనివారం రాత్రి 9 గంటల వరకు వరంగల్ జిల్లా రాయపర్తిలో అత్యధికంగా 95.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ధన్నపేటలో 82 మిల్లీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 78.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడలో 73.8, నెక్కొండ మండలం రెడ్లవాడలో 73.5, చెన్నారావుపేటలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవపూర్లో 53.3, ములుగు జిల్లా మంగపేటలో 52.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జనగామ జిల్లా కొడకండ్లలో 51.8, దేవరుప్పులలో 49, వరంగల్ జిల్లా నెక్కొండలో 47.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ములుగులో 27.4 మిల్లీమీటర్లు.. జిల్లాల సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. వరంగల్లో 33.3 మిల్లీమీటర్లతో అత్యధికంగా నమోదైంది. ములుగు 27.4, మహబూబాబాద్ 24.8, జయశంకర్ భూపాలపల్లి 16.7, జనగామ 12.8, హనుమకొండ 8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిన్నటితో పోలిస్తే వరంగల్, ములుగు, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో వర్షపాతం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం నిన్నటి 18.2 మిల్లీమీటర్లతో పోలిస్తే శనివారం సగటు వర్షపాతం 16.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. -
పేరూరులో విషాదం
వాజేడు: మండలంలోని పేరూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం కూలి పనులకు వెళ్లిన చోట విద్యుత్షాక్ గురై పంది సమ్మయ్య, తుమ్మ అభిషేక్ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పేరూరు గ్రామానికి చెందిన తాటి శంకరయ్య అనే రైతు సాగు చేస్తున్న ఏడు ఎకరాల మిర్చి చేనులో మల్చింగ్ షీట్ వేయడానికి వెళ్లిన సమయంలో విశ్రాంతి కోసం కంచె వద్దకు వచ్చిన కూలీలు అక్కడ కూర్చున్నారు. అదే సమయంలో విద్యుత్ వైరు తెగి కంచెకు ఆనుకుని ఉండటంతో దానికి కూడా విద్యుత్ ప్రసారం అవుతోంది. అది తెలియక సమ్మయ్య కంచెను పట్టుకోవడంతో విద్యుత్ఘాతానికి గురయ్యాడు. అతడిని రక్షించేందుకు అభిషేక్, పోశెట్టి నరేష్ ఒకరినొకరు పట్టుకున్నారు. ఈ క్రమంలో సమ్మయ్య, అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందగా నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి. అభిషేక్ భార్య బాలింత.. కూలి పనులకు వెళ్తేనే పొట్ట గడిచే కుటుంబం కావడంతో అభిషేక్ ప్రతీ రోజు కూలికి వెళతాడు. సంవత్సరం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. భార్య పూజ బాలింత కాగా మూడు నెలల బిడ్డను ఇంటి వద్ద ఉంచి రోజు లాగానే శుక్రవారం కూలి పనులకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ ప్రమాదంలో అభిషేక్ ప్రాణాలను కోల్పోయాడు. కూలి పనులు ముగియ గానే భర్త ఇంటికి వస్తాడని ఎదురుచూసిన భార్యకు భర్త మృతి వార్త తీరని వేదనను మిగిల్చింది. కాగా సమ్మయ్యకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉండగా ఇద్దరు కుమారులకు, కుమార్తెకు పెళ్లి కాగా మరో కుమారుడికి పెళ్లి కావాల్సి ఉంది. సమ్మయ్య భార్య గతంలోనే మృతి చెందింది. సమ్మయ్య, అభిషేక్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇద్దరి మృతితో విలపిస్తున్న కుటుంబ సభ్యులు -
కేటీపీపీ సీఈ కార్యాలయం ముట్టడి
గణపురం: యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని కేటీపీపీ జేఏసీ నాయకులు శుక్రవారం కేటీపీపీ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. టీజీపీఈ జేఏసీ పిలుపు మేరకు జేఏసీ నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర విద్యుత్ రంగ భద్రత, ఉద్యోగుల హక్కులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
● సమ్మె ప్రభావంతో జనం అవస్థలు హన్మకొండ అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్ పిలుపు మేరకు శుక్రవారం గ్రేటర్ నగరంలో బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున సమ్మె చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలో పాల్గొన్నారు. వరంగల్ ఎస్బీఐ ప్రధాన శాఖ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొని తమ ఐక్యతను, పోరాట స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో ఎస్బీఐ అధికారుల సంఘం డీజీఎస్ వై.ప్రవీణ్కుమార్, అవార్డు స్టాఫ్ డీజీఎస్ సీహెచ్.సంతోశ్కుమార్, ఓబీసీ డీజీఎస్ రజనీకాంత్, సేవా డీజీఎస్ రమణతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. సమ్మె ఎఫెక్ట్ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. బ్యాంకు శాఖల్లో నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, ఇతర లావాదేవీల కోసం వచ్చిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఏటీఎంలు కూడా అందుబాటులో లేకపోవడంతో అ త్యవసర నగదు అవసరాలకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికితోడు శని, ఆది, సోమవారం వరుసగా సెలవులు రావడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నగదు లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ అవసరాల కోసం ప్రజలు మరికొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. -
పెండింగ్ కేసుల్లో జాప్యం చేస్తే చర్యలు
ములుగు: కేసులను పెండింగ్ పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో ఆగస్టు మాసం క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశం ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, డీఎస్పీ నలువాల రవీందర్ ఆధ్వర్యంలో క్రైమ్ సమావేశం జరిగింది. వినాయకుడి ఉత్సవాల సూచనలతో కూడిన వాల్పోస్టర్ను అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించి, కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి, అక్కడ తక్షణమే ఎఫ్ఐఆర్ రీ రిజిస్ట్రేషన్ చేసి తదుపరి దర్యాప్తును చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల పురోగతిని సమీక్షిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. ఉత్సవాలకు సమన్వయంతో పనిచేయాలి రానున్న గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. స్థానిక ప్రజలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. నిబద్ధతతో పనిచేసిన అధికారులకు ప్రశంసపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐలు దారం సురేష్, దయాకర్, సూర్యప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఆర్ఐ అడ్మిన్ రాధారత్ స్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్ తిరుపతి, ఆర్ఐ ఎంటీఓ వెంకటనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ను తక్షణమే నమోదు చేయాలి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
నోటీసులు వచ్చినా.. ఆధారాలు సమర్పించని ఓటర్లు
జిల్లాలో 41,900 అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లుఓటర్ల వివరాలుములుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలనలో భా గంగా జిల్లాలో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగి రీలో గుర్తించిన ఓటర్లకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) నోటీసులు జారీ చేస్తున్నా.. చాలామంది ఓటర్లు స్పందించకపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఓటరు జాబితాలో పేర్లు, ఇంటి వివరాలు, ఇతర నమోదిత సమాచారంలో తేడాలు లేదా మ్యాపింగ్ సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఆధారాలు సమర్పించాలని ఆగస్టు 25వ తేదీ నుంచి నోటీసులు ఇస్తున్నారు. అయితే నోటీసులు అందుకున్న తర్వాత కూడా ఓటర్లు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 41,900 మంది అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 308 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,09,128 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడించారు. ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా ఇంకా జిల్లాలో 41,900 మంది ఓటర్లను అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరికి బీఎల్ఓలు నోటీసులు జారీ చేసి తగిన ఆధారాలు సమర్పిస్తే ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు 12 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని బీఎల్ఓలకు అందించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. 28,265 మందికి నోటీసులు.. జిల్లాలో 41,900 మంది అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 28,265 మందికి బీఎల్ఓలు నోటీసులు జారీ చేశారు. మరో 13,635 మందికి నోటీసులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో 9,686 మంది మాత్రమే నోటీసులకు స్పందించి ఆధారాలు సమర్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 10,976 మంది ఓటర్లు నోటీసులు అందుకున్నప్పటికీ వారికి ఇచ్చిన గడువు దాటినప్పటికీ స్పందించలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో సంబంధిత ఓటర్ల విషయంలో తదుపరి ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. చిన్నపాటి తప్పిదాలకు నోటీసులేనా..! ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్, మ్యాపింగ్ ప్రక్రియలో చోటుచేసుకున్న తేడాల కారణంగా అనామలీస్ కేటగిరీలో కొందరి పేర్లు నమోదు అయ్యాయి. అంతేకాకుండా పేర్లలో చిన్నపాటి అక్షర దోషాలు, వివరాల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు కూడా నోటీసులు జారీ చేయడంతో ఓటర్లు ఆధారాలు సమర్పించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నా.. ఓటర్లు స్పందించకపోవడం అధికారులను అయోమయానికి గురిచేస్తుంది.గడువు పెంపుఅనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు సంబంధించిన క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించేందుకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 16 వరకు గడువు నిర్ణయించింది. అయితే ఓటర్లకు మరింత అవకాశం కల్పించేందుకు ఎన్నికల సంఘం ఈ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. గడువు పెంచినా..నోటీసులు అందుకున్న ఓటర్లు స్పందించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. చిన్న చిన్న తప్పిదాలకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఓటు కోల్పోతే కొత్తగా ఫారం–6 ద్వారా మళ్లీ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకుంటామని నోటీసులు అందుకున్న కొంతమంది బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. -
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఎస్ఎస్తాడ్వాయి: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ మండలస్థాయి క్రీడా పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకూడదని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. విద్య, క్రీడలు రెండూ విద్యార్థుల భవిష్యత్కు ఎంతో కీలకమన్నారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అండర్–14, 16 విభాగాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈక్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు బహమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రేవతి, మండల క్రీడా కన్వీనర్, ఎంఈఓ శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఆదినారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంక రాంచందర్, ఫిజికల్ డైరెక్టర్ గడ్డం లక్ష్మీనారాయణ, పీఈటీలు విజయ, సతీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి -
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఏటూరునాగారం: అమరుల త్యాగాలను విధి నిర్వహణలోని ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకోవాలని అటవీశాఖ ఎఫ్డీఓ రమేష్, ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని నాలుగు రేంజ్ అధికారులు, సిబ్బంది కలిసి ఫారెస్ట్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన వారి త్యాగాలను వృథా కానివ్వమన్నారు. అటవీ సంపదను కాపాడడంలో అసువులు బాసిన ఉద్యోగులకు నివాళులర్పించారు. ప్రతి ఒక్క ఉద్యోగి అటవీ సంపదను కాపాడాలన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో తాడ్వాయి ఎఫ్ఆర్ఓ రమేష్, ఏటూరునాగారం ఉత్తరం ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ అశోక్, పస్రా వైల్డ్ లైఫ్ ఇన్చార్జ్ రమేష్, నాలుగు రేంజ్ల అటవీశాఖ అధికారులు, సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇంటింటా పోషణ సంబురాలు
గోవిందరావుపేట: పోషకాహార ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో శుక్రవారం పోషణ మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ మోక్ష రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీసీ రజియాబేగం హాజరై మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, మహిళలతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషణపై అవగాహనను అంగన్వాడీ కేంద్రాలకే పరిమితం చేయకుండా ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంటింటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు గణపురం: శ్రావణ మాసం చివరి రోజు శ్రావణ శుక్రవారం కావడంతో గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. వేగంగా స్పందించాలి టేకుమట్ల: అత్యవసర సమయంలో బాధితులు 108కి కాల్ చేస్తే అంబులెన్స్ పైలట్, ఈఎంటీ వేగంగా స్పందించాలని 108 జిల్లా మేనేజర్ రాజునాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని 108 వాహనాన్ని తనిఖీ చేశారు. అంబులెన్స్లోని వైద్య పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ అత్యవసర సమయంలో కీలకంగా వ్యవహరించి కాల్చేసిన వారికి 108 లో సకాలంలో ప్రాథమిక చికిత్స అందిస్తూ స మీప ఆస్పత్రులకు చేర్చాలన్నారు. నిత్యం మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పైలట్ సత్యం, ఈ ఎంటీ బొమ్మ హరిప్రసాద్లకు సూచించారు. హాకీ పోటీల్లో రాణించాలి భూపాలపల్లి అర్బన్: క్రీడలు మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్ వర్క్ను పెంపొందిస్తాయని ఏరియా సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణకాలనీలోని అంబేడ్కర్ స్టేడియంలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో భూపాలపల్లి, రామగుండం–3 ఏరియాల హాకీ రీజినల్ పోటీలకు జీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆధునిక జీవన విధానంలో వర్క్–లైఫ్ బ్యాలెన్స్కు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా అధికారులు నియమితులయ్యారని తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్నారని, మహిళా రెస్క్యూ టీమ్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. సింగరేణిలో అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ మహిళా ఉద్యోగులు స్ఫూర్తిగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. త్వరలో జరిగే కోల్ ఇండియా క్రీడా పోటీల్లో సింగరేణిని అగ్రస్థానంలో నిలిపేందుకు క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో పతకాలు సాధించాలని కోరారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను, పోటీల్లో పాల్గొంటున్న ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్సుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ప్రాతినిథ్య సంఘం ఉపాధ్యక్షుడు బి.మధుకర్రెడ్డి, సీఎంఓఐ అధ్యక్షుడు నజీర్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జి.నాగేశ్వర్రావు, ఆర్జీ–3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ బి.సదానందంతో పాటు క్రీడాకారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ములుగు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, మట్టి వినాయకల తయారీలో సృజనాత్మకతను వెలికితీయవచ్చని ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్– 2 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం పర్యావరణహిత వినాయక చవితి వేడుకలపై అవగాహన, మట్టి వినాయక విగ్రహ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 80 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ విగ్రహాలను తయారు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని, ముఖ్యంగా నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ (పీఓపీ) విగ్రహాలు, రసాయనిక రంగులతో నీటి వనరులకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ పర్యావరణహిత మట్టి వినాయకులను ప్రోత్సహించాలన్నారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.బా లయ్య మాట్లాడుతూ పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డా క్టర్ సరిత, బి.శిరీష, డి.రాధికా, పి.విజేత, ఆర్. తే జోలత, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో మట్టి వినాయక విగ్రహాల తయారీ -
తీరనున్న కష్టాలు!
ఏటూరునాగారం: ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాల కళ సాకారం కాబోతుంది. ఎన్నో కష్టాలు, ప్రమాదాలను ఎదుర్కొని జీవిస్తున్న కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం గ్రామస్తుల కళ సాకారమయ్యే రోజులు సమీపంలో ఉన్నాయి. మంత్రి సీతక్క చొరవతో ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.16.50 కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఏటూరునాగారం మండలంలోని మల్యాల, దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగు కొండాయి బ్రిడ్జి పూర్తికాబోతుంది. 7 పిల్లర్లు, రెండు అంబాడ్స్మెట్లతో నిర్మాణం పనులు చేపట్టిన ఆర్అండ్బీశాఖ అధికారులు పనులను వేగంగా జరిగేందుకు కావాల్సి న ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పిల్లర్లు, గడ్డర్స్, అబాడ్స్మెట్లు పూర్తి కాగా ప్రస్తుతం బ్రిడ్జిపై ఐదు స్లాబ్లను పూర్తి చేశారు. మరో మూడు స్లాబ్లు దసరా నాటికి పూర్తికానున్నాయి. వచ్చే నెల దసరాకు కొండాయి బ్రిడ్జి ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 30 సంవత్సరాల నుంచి.. 30 సంవత్సరాల నుంచి అనేక కష్టాలను ఒర్చుకుంటున్న ప్రయాణిస్తున్న వాగవతలి గ్రామాల కష్టాలు ఈ బ్రిడ్జితో తీరనున్నాయి. బ్రిడ్జి నుంచి కొండాయి గ్రామానికి కూడా శాశ్వత రోడ్డు నిర్మాణం చేపడితే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. పనులు శరవేగంగా జరుగుతుండడంతో లోతట్టు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు రుణపడి ఉంటామని ప్రజలు వాపోతున్నారు. జంపన్నవాగు ప్రవహిస్తున్నప్పటికీ పనులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు చేపట్టినట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. త్వరలో అందుబాటులోకి కొండాయి బ్రిడ్జి రూ.16.50కోట్లతో నిర్మాణ పనులు -
హక్కుల సాధనకు ఉద్యమించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు కామ్రేడ్ కొమురయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అధ్యక్షతన కొమురయ్య వర్ధంతిని ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా రాజ్కుమార్ తదితరులు.. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లోనూ కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన కోసం కొమురయ్య తన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. నేడు కార్మికులు పొందుతున్న పెన్షన్ సాధనలో కొమురయ్య పోరాటం కీలకమైందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గురుజేపల్లి సుధాకర్రెడ్డి, నూకల చంద్రమౌళి, శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, పోశం, రామచందర్, కరీముల్లా, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆదివారం ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివా రం సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ఆటోలు, తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రాజశేఖర్శర్మ, పవన్కుమార్, ఈశ్వర్చంద్శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
● కాటారం డీఎస్పీ సూర్యనారాయణకాళేశ్వరం(కాటారం): యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మండలకేంద్రంలోని ఆదర్శ హైస్కూల్లో జిల్లా యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనగామ కరుణాకర్ రావు, జిల్లా అథ్లెటిక్స్ చైర్మన్ పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి డీఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వివిధ వయస్సు కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. చిన్న వయస్సు నుంచే పిల్లలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడే సాధనమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, యోగాపై కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా స్థాయి యోగాసన పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి సర్పంచ్ పంతకాని సడవలి, ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమలసమ్మయ్య, సీడీపీఓ రాధిక, ఎస్సై శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ సెక్రెటరీ ఆత్మకూరి కుమార్యాదవ్, జనరల్ సెక్రెటరీ బుడిమే కుమార్, యోగా గురూజీలు వావిళ్ల కిష్టయ్య, వావిళ్ల మహేందర్, ఎడ్ల మధు, ఎడ్ల రాము, గౌరోజు సదానందం, కుమార్ యాదవ్, శ్రీనివాస్, వనిత, గోపాల్, మీనా, శ్రీలత రెడ్డి, డాక్టర్ రఫీ, రాజబాపు, నాగరాజు పాల్గొన్నారు. -
‘యాదవులు ఐక్యంగా ఉద్యమించాలి’
ములుగు: ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం సాధించేందుకు యాదవులు ఐక్యంగా ఉద్యమించాలని జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు వంగ రవియాదవ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సమ్మక్క–సారలమ్మ ఆశీర్వాదంతో పోరాటాల గడ్డ అయిన జిల్లా నుంచి ప్రారంభమైన యాదవ సంఘం ఉద్యమాన్ని యాదవులంతా ఐక్యతతో ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో యాదవులంతా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం యాదవ సంఘం జిల్లా అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా వంగ రవియాదవ్, గౌరవ సభ్యులుగా పిండి రవి, వసంత శ్రీనివాస్, జక్కుల రేవంత్, ఇమ్మడి రాకేశ్, మొగిలి, శ్యామ్, వెంకన్న కుమారస్వామి, అనిల్ ఎన్నికయ్యారు. -
రామప్పలో అమెరికా దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన జాన్ చెర్మక్ ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకోగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించారు. మౌలిక వసతులు కల్పించాలి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని బూర్గుపేట ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అన్నారు. బూర్గుపేట హాస్టల్ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పాఠశాలలో సురక్షిత తాగునీరు, ఫ్యాన్లు, కిటికీలు పూర్తిస్థాయిలో లేవని తెలిపారు. వర్షపు నీరు గదుల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు టీఎల్.రవి, అరవింద్, నరహరి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. చంద్రశేఖర్ ఆజాద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. రిటైర్డ్ ఈఓలు జ్ఞాన్దేవ్రెడ్డి, రాజేంద్రం, మేడారం ఈఓ వీరస్వామి, రత్నాకర్శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ భూపాలపల్లి అర్బన్: పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆది వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 350 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం సింగరేణి హైస్కూల్లో రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి, అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. శారీరక, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 70 రోజులపాటు ఉచితంగా క్లాసులతోపాటు గ్రౌండ్ కోచింగ్ అందిస్తామని అదనపు ఎస్పీ నరేష్కుమార్ తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు కష్టపడి చదవడంతోపాటు శారీరకంగా సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు రత్నం, సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక!
30 ఏళ్లుగా పదోన్నతులు కరువు..ఉద్యాన శాఖలో పనిచేస్తున్న హెచ్ఓలకు 30 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో చాలా మంది పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని పలువురు హెచ్ఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లో రెగ్యులర్గా పదోన్నతి కల్పిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హత కలిగిన హెచ్ఓలకు పదోన్నతి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యాన అధికారులు, రైతులు కోరుతున్నారు. హన్మకొండ: ఉద్యానశాఖను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా హనుమకొండ, ములుగు జిల్లాలకు జిల్లా ఉద్యాన అధికారి పోస్టులు మంజూరు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాలకు కేవలం 17 మంది ఉద్యాన అధికారులు (హెచ్ఓలు) మాత్రమే ఉన్నారు. దీంతో రైతులకు సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యాన శాఖ, సూక్ష్మ సేద్యపు ప్రాజెక్టులు వేర్వేరుగా కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండింటినీ ఉద్యాన శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ మినహా కొత్తగా నియామకాలు లేవు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వరికి ప్రత్యమ్నాయంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఉన్న ఉద్యాన అధికారులపై మరింత పనిభారం పెరుగుతోంది. ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పంటలకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీ పొందడానికి ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయికి వెళ్లి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. జిల్లా ఉద్యాన అధికారుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. రాష్ట్రంలో ములుగు, హనుమకొండ, నారాయణపేట జిల్లాకు జిల్లా ఉద్యానశాఖాధికారి పోస్టు మంజూరు కాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన హార్టికల్చర్ ఏడీ ములుగు జిల్లా అధికారిగా, వరంగల్ జిల్లా సూక్ష్మసేద్య ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ హనుమకొండ జిల్లా ఉద్యాన అధికారిగా కొనసాగుతున్నారు. ఉద్యాన పంటల సాగు విస్తరిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమించడం లేదు. దీంతో ఉన్న వారి పైనే అదనపు భారం పడుతోంది. ఒక్కో ఉద్యాన అధికారికి 3 నుంచి 6 మండలాల బాధ్యతలు అప్పగించారు. వీరు విధులతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ములుగు జిల్లాలో 10 మండలాలుండగా డిప్యుటేషన్పై ఇద్దరు మాత్రమే ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇక్కడ రెగ్యులర్ హెచ్ఓలు లేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలకు ఇద్దరు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక్క ఉద్యాన అధికారి.. జిల్లా ఉద్యాన అధికారిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలోని రైతులకు సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలకు ముగ్గురు ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇందులో ఒక్కరు డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలకు ఇద్దరు, వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఐదుగురు ఉద్యాన శాఖ అధికారులున్నారు. సిబ్బంది కొరతతో రైతులకు సలహాలిచ్చేవారు కరువు హనుమకొండ, ములుగుకు మంజూరుకాని జిల్లా అధికారి పోస్టు 3 నుంచి 6 మండలాలకు ఒక్కరికే అదనపు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 78 మండలాలకు 17 మంది హెచ్ఓలు మాత్రమే -
పర్యవేక్షణ అంతంతే!
ఏటూరునాగారం/మంగపేట/ఎస్ఎస్ తాడ్వాయి / వాజేడు : జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. పలు సెంటర్లలో విద్యార్థులు ప్రతిరోజూ అంగన్ వాడీ కేంద్రాలకు కొంతమంది మాత్రమే హాజరవుతున్న పరిస్థితి ఉంది. అలాగే గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన గుడ్లు, బియ్యం, పాల ప్యాకెట్లు నెలకు సరిపడా ఇంటికే పంపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సిన ఫ్రీ స్కూళ్లు పలుచోట్ల మధ్యాహ్నం తర్వాత మూసి ఉంటున్నాయి. ఈ మేరకు పోషణ్ అభియాన్ మాసోత్సవాల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను సాక్షి విజిట్ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పౌష్టికాహారం ఇలా.. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఉదయం 10 గంటల వరకు ఉడికించిన కొడిగుడ్లు ఇవ్వాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు పప్పు, కూరగాయలతో కూడిన భోజనం వడ్డించాలి. సాయంత్రం 3గంటలకు స్నాక్స్, 3.30 గంటలకు 100 ఎంఎల్ పాలు అందించాలి. అదే విధంగా గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్నం గుడ్డుతో భోజనం, 200 ఎంఎల్ పాలు, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు నెలకు 16 గుడ్లు, బాలమృతం ప్యాకెట్ అందించాల్సి ఉంది. చిన్నసైజ్ కోడిగుడ్లు.. ఏటూరునాగారం మండల కేంద్రంలోని కోడిగుడ్లు చిన్న సైజ్లో వస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. నేతాజీ నగర్ సెంటర్లో ఒక గర్భిణి, బాలింతలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాగే క్రాస్రోడ్డు సెంటర్లో ఇద్దరు గర్భిణులు, ఇద్దరు బాలింతలు ఉండగా ఫ్రీ స్కూల్ పిల్లలు ఐదుగురు మాత్రమే ఉన్నారు. గ్యాస్ బిల్లులు మూడు నెలల నుంచి పడడం లేదని టీచర్లు తెలిపారు. 14 మందికి.. 11 మంది హాజరు ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్ అంగన్వాడీ కేంద్రంలో 14 మంది పిల్లలకు గాను 11 మంది మాత్రమే హాజరయ్యారు. పిల్లలకు ఉదయం కోడిగుడ్డు, పాలు అందించగా మధ్యాహ్నం సోరకాయ పప్పు కూరతో భోజనం వడ్డించారు. 12 గంటలకు తాడ్వాయిలోని 1వ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించగా ఆరుగురు పిల్లలకు నలుగురు పిల్లలు హాజరయ్యారు. పిల్లలతో పాటు నలుగురు గర్భిణులకు మెనూ ప్రకారం సోయకాయ పప్పు భోజనం వడ్డించారు. అలాగే నిబంధనల మేరకు పిల్లలకు 100 ఎంఎల్, తల్లులకు 200 ఎంఎల్ పాలతో పాటు భోజనాన్ని అందజేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలపై కొరవడిన ఉన్నతాధికారుల నిఘా పలు కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ఇంటికే ఇచ్చి పంపిస్తున్న సరుకులు పూర్తిస్థాయిలో కనిపించని విద్యార్థుల సంఖ్య -
మోదీ సేవను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ములుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ సమావేశానికి సీతారాంనాయక్ హాజరై మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రజాసేవ, జీవితం, అంకితభావాన్ని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో బీజేపీ దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తోందన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు జిల్లాలోని ప్రతి బూత్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్ లాల్, నాయకులు బలరాం, నగరపు రమేశ్, అల్లె శోభన్, కొర్ర సుమలత, జినుకల కృష్ణాకర్ రావు, ఏనుగు రవీందర్రెడ్డి మద్దినేని తేజరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యల నివారణపై మౌనం వీడాలి
ములుగు: ఆత్మహత్యల నివారణపై మౌనం వీడి మానసిక, ఆరోగ్య సమస్యలపై బహిరంగంగా చర్చించాలని, సంక్షోభంలో ఉన్న వారికి ధైర్యం, ఓదార్పు చెప్పి సకాలంలో సహాయం అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ములుగులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ గోపాల్రావు మాట్లాడుతూ తీవ్ర ఒత్తిడి, నిరాశతో బాధపడుతున్న వారిని కుటుంబ సభ్యులు, స్నేహితులు గుర్తించి మానసికంగా అండగా నిలవాలని సూచించారు. అవసరమైతే నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మానసిక ఆరోగ్య సమస్యలపై సలహాలు, సూచనలకు టోల్ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. అనంతరం సిబ్బందితో ఆత్మహత్యల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ భిక్షపతిరావు, ఏసీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి రంజిత్, సైకియాట్రిస్ట్ గౌతమ్, డాక్టర్ శ్రీకాంత్, మాస్ మీడియా అధికారి సంపత్, వెంకట్రెడ్డి, ఆర్బీఎస్కే వైద్యులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
రామప్పలో ‘పినాక’ సన్నివేశాల చిత్రీకరణ
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయంలో గురువారం కన్నడ డబ్బింగ్ చిత్రం పినాక సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. మూడు రోజుల పాటు రామప్పలో సినిమా చిత్రీకరణ జరగనుంది. తొలిరోజు హీరో గణేశ్పై పురావస్తుశాఖకు చెందిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. సినిమా డైరెక్టర్ ధనుంజయ్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ మేనేజర్ శ్రీకాంత్, నరేశ్తో పాటు కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ ధనుంజయ్, హీరో గణేశ్ రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించారు. కార్యక్రమంలో ఈఓ ఇమ్మడి భాస్కర్, టూరిస్టు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మట్టి విగ్రహాలనే పూజించాలి ములుగు: పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆదానీ అంబుజా సిమెంట్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని రెడ్క్రాస్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, కంపెనీ ప్రతినిధులు అనుదీప్రెడ్డి, బండారి కృష్ణ ఎస్పీకి అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను అందజేస్తున్న కంపెనీ ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. ఆధునిక విధానాలపై ఆసక్తి పెంచుకోవాలి చిట్యాల: రైతులు ఆధునిక, లాభాదాయకమైన వ్వవసాయ విధానాలను అవలంభించుకోవాలని జిల్లా ఆదనపు కలెక్టర్ ఎల్ విజయలక్ష్మి అన్నారు. ఈసందర్బంగా గురువారం మండలంలోని కొడవటంచ గ్రామంలో సమీకృత ఫామ్ ఫండ్ ద్వారా కలిగే ప్రయోజనాలు, ఆధునిక వ్వవసాయ పద్దతులు, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే పశువుల, పెంపకం, భూగర్భ జలాల పెంపు, హార్టికల్చర్ సాగు, డ్రాగన్స్ ప్రూట్ సాగు వంటి కార్యక్రమాల ద్వారా రైతులు ఆదనపు ఆదాయాన్ని పోందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రంగాపూర్ టు సింగపూర్ భూపాలపల్లి అర్బన్: మారుమూల గ్రామం నుంచి ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న తౌటం స్వామికి అంతర్జాతీయ విద్యా వేదికపై అధ్యయనం చేసే అవకాశం లభించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీచర్స్ ఎక్స్పోసర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం టు సింగపూర్కు జిల్లా నుంచి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 12నుంచి 19వరకు జరిగే పర్యటనలో సింగపూర్ విద్యావిధానం, బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. రంగాపూర్ నుంచి ప్రస్థానం మొగుళ్లపల్లి మండలం రంగాపూర్కు చెందిన స్వామి డీఎస్సీ 2006 ద్వారా ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. చింతలపల్లి, అంకుషాపూర్, పరకాల మండలం నాగారం పాఠశాలల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎంపీపీఎస్ జంగేడులో ఎస్జీటీగా సేవలందిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే శిక్షకుడిగా, రిసోర్స్ పర్సన్గా, కంటెంట్ డెవలపర్గా విద్యాశాఖ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ప్రాథమిక విద్యలో అభ్యసన ప్రమాణాలను పెంపొందించే ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో ఎస్ఆర్పీ, డీఆర్పీగా పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీచర్స్ హాండ్ బుక్స్(మాథ్యమెటిక్స్) రూపకల్పనలో కంటెంట్ డెవలపర్గా సేవలందించారు. విద్యారంగంలో ఆయన సేవలకు పలు గుర్తింపులు లభించాయి. 2023లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ రిసోర్స్ పర్సన్ అవార్డు, 2024లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. -
రైస్మిల్లర్లను వేధింపులకు గురిచేయొద్దు
ములుగు: రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో దాడులు చేస్తూ రైస్ మిల్లుల యజమానులను ప్రభుత్వం వేధింపులకు గురిచేయొద్దని రైస్మిల్లర్స్ ఆసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయ శివారులో మహాధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడారు. యాసంగి, వానాకాలం సీజన్లో లక్షల క్వింటాళ్ల వడ్లను కస్టమ్ మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అందించామని తెలిపారు. అయితే ఆ బియ్యానికి సంబంధించిన సీఎంఆర్ బకాయిలు, కస్టమ్ మిల్లింగ్ చార్జీలు ఇప్పటి వరకు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల మిల్లర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని, మిల్లులు సైతం నడపలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సహోధర్ రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెల్లి హరినాథ్, గౌరవ అధ్యక్షుడు పల్లెపాటి సమ్మిరెడ్డి, మిల్లర్లు పాల్గొన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ -
యూత్ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జ్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ (టీపీవైసీ)లో సంస్థాగత మార్పులు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు కొత్త ఇన్చార్జ్లను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ జిల్లాకు ముచల సాయి మనోజ్కుమార్ యాదవ్ను సెక్రటరీ ఇన్చార్జ్గా, హనుమకొండ జిల్లాకు పాడాల రాహుల్ను జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ గా నియమించారు. ఈ రెండు జిల్లాల వ్యవహారాలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ రూపవత్ పర్యవేక్షించనున్నారు. జనగామ జిల్లాకు జనరల్ సెక్రటరీగా చంద్రిక దుబ్బక, మహబూబాబాద్ జిల్లాకు జనరల్ సెక్రటరీగా అలువాల కార్తీక్, సెక్రటరీగా అశ్విన్ ఏకేలను నియమించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిపాల్ ఒరుగంటి, ములుగు జిల్లాకు బండిగ రాకేష్కు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సమన్వయం.. కొత్తగా నియమితులైన ఇన్చార్జులు తమ పరిధిలోని జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయి కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షుడు నియామక ఉత్తర్వులో సూచించారు. నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. యువతను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో యూత్ కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కొత్త బాధ్యులు దృష్టి సారించనున్నారు. ఉమ్మడి వరంగల్లో ఏడుగురు రాష్ట్ర నేతలకు బాధ్యతలు వరంగల్, హనుమకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి -
పారదర్శకంగా లక్కీ డ్రా
ములుగు: కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించి పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని జవహర్నగర్ ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు గురువారం కలెక్టరేట్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ ప్రవేశాల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పైరవీలకు తావులేకుండా లక్కీ డ్రా ప్రక్రియ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణతో పాటు అందుబాటులో ఉన్న సీట్లను లక్కీ డ్రా ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, కేంద్రీయ విద్యాలయ ప్రధానాచార్యులు సీతారాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.● అదనపు కలెక్టర్ మహేందర్జీ -
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
ములుగు: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని బండారుపల్లి గల తెలంగాణ గురుకుల పాఠశాల(బాలుర), జూనియర్ కళాశాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, భోజనశాల, వసతిగృహం పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, బోధన, భోజన పట్టిక, సరుకుల నిల్వలకు సంబంధించిన నమోదులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వంటశాల, భోజనశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాల బోధన, భోజనం, వసతిగృహ సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర వివరాలపై ఆరా తీశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం: విద్యార్థుల సమస్యల ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు, భోజనం అందించాల్సిన అధికారులు, ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్చార్జీలను ప్రభుత్వం పెంచాలన్నారు. అలాగే సకాలంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఏపీఓ దామోదరస్వామి, డీడీ జనార్దన్కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, నాయకులు మధు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ -
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్
ములుగు: బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగ జరుపుకుంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని జీవంతరావుపల్లిలో గురువారం నిర్వహించిన బంజారా తీజ్ పండుగ వేడుకలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో రవిచందర్ హాజరై మాట్లాడారు. యువతులు, మహిళలు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. తీజ్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, బంజారా సోదరసోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క తరఫున యువతులకు రూ.10 వేల నగదును రవిచందర్ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ దేవ్సింగ్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ రేవంత్ యాదవ్ పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్ -
గణేశ్ మండపాలకు అనుమతి తప్పనిసరి
ములుగు: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గతేడాది గణేశ్ మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులతో గురువారం ఆయన మాట్లాడారు. గణేశ్ మండపాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేయవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. అనుమతి పొందిన మండపాల వివరాలను పోలీసులు నమోదు చేసుకుని, ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత అత్యుత్సాహానికి పోకుండా సంయమనంతో, బాధ్యతగా వ్యవహరించాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు సీఐ దారం సురేశ్, ఎస్సై వెంకటేశ్ పాల్గొన్నారు. ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ -
ఎన్హెచ్పై ప్రమాదాలు జరగకుండా చర్యలు
● బ్లాక్స్పాట్లను పరిశీలించిన అధికారులు భూపాలపల్లి: జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఇచ్చిన సూచనల మేరకు జిల్లాలోని రేగొండ నుంచి మహదేవపూర్ వరకు గుర్తించిన బ్లాక్స్పాట్స్(ప్రమాదకర ప్రాంతాలు)ను నేషనల్ హైవే, రవాణా, పోలీసుశాఖ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా బ్లాక్స్పాట్లలో ప్రమాదాలకు గల ప్రధాన కారణాలు, రహదారి పరిస్థితులు, మలుపులు, వాహనాల వేగం తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, రేడియంట్ సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు మలుపుల విస్తరణ, ఇతర ఇంజినీరింగ్ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బ్లాక్ స్పాట్స్ వద్ద అవసరమైన తక్షణ, శాశ్వత నివారణ చర్యలను సమన్వయంతో చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో నేషనల్ హైవే డీఈ సింధూర, సీఐ చెన్నూరి శ్రీనివాస్, డీటీఓ శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా తాజా వివరాలు వెల్లడించాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ సహదేవరావు ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026కు సంబంధించిన తాజా వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు వెల్లడించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఎన్నికల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో చేపడుతున్న ప్రతీ అంశాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ను ఈ నెల 19 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో సవరించిన షెడ్యూల్ ప్రతులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు అందిన దావాలు, అభ్యంతరాలకు సంబంధించిన ఫారాలు 9, 10, 11 జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా అందిన దావాలు, అభ్యంతరాలు, ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, వాటి ప్రస్తుత స్థితికి సంబంధించిన వివరాలను సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలోని 308 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలి
ములుగు: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న జిల్లాలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించి, వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో పర్యాటక ప్రదేశాల ప్రచారం, అభివృద్ధికి ఆసక్తి కలిగిన యువతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 142 పర్యాటక ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో సందర్శకులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటక ప్రాంతాలను ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ సంపత్రావు, టూరిజం నోడల్ ఆఫీసర్ ధర్మనాయక్, డీఈఓ సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. వీసీలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ -
పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి
ములుగు: అంగన్న్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెల్లి ప్రేమలత తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సీడీపీఓలు, సూపర్వైజర్లకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల వయస్సు, అభ్యాస స్థాయికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించడం, అంగన్వాడీల నిర్వహణ, పర్యవేక్షణ, అభ్యాస స్థాయి మూల్యాంకనంపై శిక్షణ ఇచ్చారు. 9వ రాష్ట్రీయ పోషణ మాసం–2026లో భాగంగా మన అంగనన్వాడీ–మన బాధ్యత కార్యక్రమం నిర్వహించి, పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. జంక్ఫుడ్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని ప్రేమలత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ప్రథమ్ ప్రతినిధులు, సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత -
అనుమతులపై అనుమానాలెన్నో..
● బొగ్గు తవ్వకాలతో కనుమరుగుకానున్న పచ్చని పంట పొలాలు ● రామప్ప ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదం ● ప్రపంచ వారసత్వ సంపదపై ఆందోళనములుగు: ఒకవైపు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన రామప్ప ఆలయ వారసత్వ సంపద.. మరోవైపు దట్టమైన అడవులు, పచ్చని చెట్లతో ఎతైన కొండలు, రైతులకు సిరులు కురిపించే వ్యవసాయ భూములు, జల వనరులు.. వీటన్నింటి మధ్యలోకి ఇప్పుడు ఓపెనన్కాస్ట్ గని పేరుతో బొగ్గు తవ్వకాల ప్రతిపాదన రావడం జిల్లాలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన పీవీఎన్ఆర్ గనితో ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ప్రజల జీవనాధారం, చారిత్రక వారసత్వ సంపదకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భౌగోళిక స్వరూపంలో మార్పు భూమిని వందల అడుగుల లోతు వరకు తవ్వి బొగ్గును వెలికితీసే ఓపెన్న్కాస్ట్ విధానం అమలైతే ఈ ప్రాంత భౌగోళిక స్వరూపమే మారిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ యంత్రాలు, పేలుళ్లు, రవాణా వాహనాలతో దుమ్ము, శబ్ద కాలుష్యం పెరగడం.. భూగర్భ జలాలపై ప్రభావం పడటం.. పంట పొలాలు, అడవులు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చారిత్రక కట్టడమైన రామప్ప ఆలయం ఉన్న ప్రాంతంలో భారీ స్థాయి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున బ్లాస్టింగ్లు చేపట్టడం వల్ల కలిగే పర్యావరణ, భౌగోళిక ప్రభావాలపై సమగ్ర అధ్యయనం అవసరమన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓపెన్కాస్ట్కు సంబంధించిన ప్రతీ అంశాన్ని బహిరంగంగా వెల్లడించి, ప్రజాభిప్రాయాన్ని తీసుకుని పర్యావరణం–రామప్ప వారసత్వంపై నిపుణులతో సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి అడుగు వేయాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు. 2,648 ఎకరాలుభూమి అవసరం ఓపెన్కాస్ట్ గని కోసం సుమారు 2,648 ఎకరాల భూమి అవసరం ఉందని తెలుస్తోంది. ఇందులో 1,164 ఎకరాల అటవీ భూమి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారీగా మట్టిని తొలగించడం, చెట్ల నరికివేత, గనుల వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తవ్వకాల్లో వందల మీటర్ల లోతు వరకు మట్టి, రాళ్లను తొలగించాల్సి ఉంటుంది. దీంతో భూగర్భ జలాల సహజ ప్రవాహంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వ్యవసాయం కోసం బోర్లపై ఆధారపడే రైతులు, గ్రామాల తాగునీటి వనరులపై దీని ప్రభావం ఎంత ఉంటుందన్నది ముందుగానే అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గని పరిధిలోకి వచ్చే పట్టా, అసైన్డ్ భూములతో పాటు పరిసర వ్యవసాయ భూములపై కూడా గనుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. బ్లాస్టింగ్ వల్ల వచ్చే ప్రకంపనలు, శబ్దం పరిసర గ్రామాల ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా రామప్ప ఆలయంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. 20 ఏళ్లలో.. 40 మిలియన్ టన్నుల బొగ్గు గని ప్రారంభమైతే సుమారు 20 ఏళ్లలో 40 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రెండు దశాబ్దాల పాటు భారీస్థాయిలో తవ్వకాలు, బొగ్గు రవాణా, యంత్రాల వినియోగం కొనసాగనున్నాయి. ఇంత సుదీర్ఘ కాలంలో పర్యావరణంపై పడే సమగ్ర ప్రభావాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు పొందిన ఏకై క కట్టడం రామప్ప దేవాలయం. ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేవలం ఇసుకనే పునాదిగా చేసి నిర్మించారు. రామప్ప ఆలయానికి 5.8 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న పీవీఎన్ఆర్ గనికి మైనింగ్, పర్యావరణం, ఫారెస్ట్ క్లియరెన్స్, పురావస్తుశాఖ అనుమతులు పొందినట్లు ప్రచారం ఉంది. కేవలం పాలంపేట డెవలప్మెంట్ కమిటీ ఇచ్చే ఎన్ఓసీ కోసం సింగరేణి సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటవీ సంపదతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి దగ్గరలో ఉన్న ఓపెన్కాస్ట్ గనిని ప్రారంభించేందుకు వివిధ శాఖల నుంచి అనుమతులు ఏ విధంగా మంజూరవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అనుమతుల మంజూరుపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.ఓపెన్కాస్ట్ గనిని వ్యతిరేకిస్తున్నాం..రామప్ప ఆలయానికి 5.8 కిలో మీటర్ల దూరంలో సింగరేణి సంస్థ చేపట్టే ఓపెన్కాస్ట్ గనిని కాకతీయ ట్రస్టు తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఓపెన్కాస్ట్ను నిలిపివేసి ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప ఆలయాన్ని కాపాడాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి విన్నవించాం. భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదను అందించే రామప్ప ఆలయం, రామప్ప సరస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. – ప్రొఫెసర్ పాండురంగారావు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు -
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ములుగు: ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో మొదటిసారిగా నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేదిక, ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బందితో కలిసి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
జంపన్నవాగులో ఇసుక తవ్వకాలు
ఎస్ఎస్తాడ్వాయి: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పలువురు వ్యాపారులు మండల పరిధిలోని జంపన్నవాగు నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరతో విడదీయరాని అనుబంధం ఉన్న జంపన్నవాగును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. వాగు నీటిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్మకం. అలాంటి వాగులో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పలువురు వ్యాపారులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి. జేసీబీలతో ఇసుక తీస్తూ.. జంపన్నవాగులో జేసీబీలతో పలువురు వ్యాపారులు ఇసుకను తీస్తూ ట్రాక్టర్లు, లారీల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకను తరలిస్తున్నారు. ఇలా వివిధ గ్రామాలకు తరలిస్తూ జోరుగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ 20 ట్రిప్పుల మేర ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ట్రాక్టర్ లోడ్ ఇసుకకు దాదాపుగా రూ.3 వేలు, లారీ ఇసుకను రూ.5 వేలకు అమ్ముతూ వేలల్లో సంపాధిస్తున్నారు. ఇసుక తవ్వకాలతో ముప్పు వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల వాగు సహజ స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. భారీగా ఇసుకను తొలగిస్తే వాగు లోతు పెరగడంతో పాటు నీటి సహజ ప్రవాహానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న స్నానఘట్టాలు దెబ్బతినే అవకాశం సైతం ఉందని చెబుతున్నారు. వాగులోని ఇసుక వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటిది ఇసుకను తరలిస్తే భూగర్భ జలాల పెంపుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాగు పరిసర ప్రాంతాల్లోని బావులు, బోర్లలో సైతం నీటిమట్టాలు తగ్గే ప్రమాదం ఉంది. మహాజాతర సమయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సైతం భారీ మొత్తంలో జంపన్నవాగులోని ఇసుకను వినియోగించారు. దీంతో వాగులో ఇసుక క్రమక్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తరలింపు పుణ్యస్నానాలు ఆచరించే వాగులో తవ్వకాలపై భక్తుల అసహనం వాగు పవిత్రత, సహజ స్వరూపాన్ని కాపాడాలని డిమాండ్ -
ఎన్ఎస్యూఐ ఆరు జిల్లాల అధ్యక్షుల నియామకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ బలోపేతంపై అధి ష్టానం దృషిపెట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి బుధవారం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండకు వేణుచారి, వరంగల్–బొల్లం నితిన్కుమార్, జనగామ–దేశగాని హరగోపాల్గౌడ్, జయశంకర్ భూపాలపల్లి–పురుషోత్తం అనూప్, మహబూబా బాద్ – బి.చంటి, ములుగు–ఎం.నవనీత్ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో విద్యార్థి సమస్యలను గుర్తించి పోరాటాలు చేపట్టడంతోపాటు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్ఎస్యూఐ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది. రామప్పలో జర్మనీ దేశస్తురాలు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని జర్మనీ దేశస్తురాలు మోనికా బుధవారం సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని ఆమె దర్శించుకోగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవాన్ని టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ ఆమెకి వివరించారు. వనదేవతలను దర్శించుకున్న అన్వేష్రెడ్డి ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం వనదేవతలను టీపీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, సీడ్ కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ అన్వేష్రెడ్డి బుధవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు సమ్మక్క పూజారి సిద్ధబోయిన రాణారమేశ్ ఆయనకు కండువా కప్పి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చెర్ప రవీందర్, తదితరులు ఉన్నారు. హక్కుల కోసం పోరాటం చిట్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని మోడల్ స్కూల్లో మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అధ్యక్షతన మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాకర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా 23 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంఈఓ కోడెపాక రఘుపతి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఝాన్సీరాణి, వాసంతి, పీడీ సూదం సాంబమూర్తి, రమేశ్ పాల్గొన్నారు. దుకాణాలు తొలగించాలి భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి వెంట ఫుట్పాత్లపై ఏర్పాటుచేసిన దుకాణాలను తొలగించాలని రోడ్ సేఫ్టీ టాస్క్పోర్స్ టీం అధికారులు యాజమానులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి గణేష్చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను బుధవారం పరిశీలించారు. దుకాణాల ఎదుట ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన వస్తువులు, తోపుడు బండ్లు, ఇతర వ్యాపారాలను తొలగించాలని యజమానులను ఆదేశించారు. రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేయడం, వస్తువులు, బోర్డులు ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎన్హెచ్ డీఈ సింధూర, ఎస్సై శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. -
ఆశ వర్కర్ల అరెస్టులు సరికాదు
ములుగు: న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టి ఆందోళనకు బుధవారం వెళ్తున్న ఆశ వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేసి, నిర్బంధించడం సరికాదని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నం నీలాదేవి ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఆశ వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాన్ని అణచలేరని, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
వైభవంగా మహా లింగార్చన
కాళేశ్వరం : మాసశివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి బాలాలయంలో మహాలింగార్చన కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ, అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సత్యనారాయణ, శ్రీధర్రావు, నర్సయ్య, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కాళోజీ ఆశయాలు ప్రజాసేవకు మార్గదర్శకం భూపాలపల్లి: తెలంగాణ ప్రజాకవి, ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు ఆశయాలు ప్రజాసేవకు మార్గదర్శకమని అదనపు ఎస్పీ నరేష్కుమార్ అన్నారు. బుధవారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలను సమాజానికి ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని ఎస్పీ కొనియాడారు. -
అరాచక పాలన చేస్తున్న కాంగ్రెస్
ములుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు అన్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతితో కలిసి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహారావు మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. నల్ల దుస్తులు ధరించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, గిరిజనులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల నిరసనలను అడ్డుకుంటూ అధికార పార్టీ కార్యక్రమాలకు పోలీసులు బందోబస్తు కల్పించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. నిరసన కార్యక్రమంలో కౌన్సిలర్లు బైకాని సునిత, లక్ష్మి, సర్పంచ్ శ్రీలత, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహారావు -
ధిక్కార స్వరం ‘కాళోజీ’
7రామప్ప దేవాలయ పరిరక్షణకు ప్రాధాన్యం● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుములుగు: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాపురం(ఎం) మండల కేంద్ర పరిధిలో చేపడుతున్న ఓపెన్ కాస్ట్ మైనింగ్ పనుల వల్ల రామప్ప దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఏర్పాటుకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం మంజూరు అంశాలపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. రామప్ప దేవాలయ పరిరక్షణ, పర్యావరణం, శాసీ్త్రయ అధ్యయనాలు, నిరంతర పర్యవేక్షణతోపాటు సంబంధిత నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా చర్చించారు. సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను నమోదు చేశామని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, సింగరేణి భూపాలపల్లి జీఎం రాజేశ్వర్రెడ్డి, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జీఎం దేవేందర్, పర్యావరణ విభాగం జీఎం సైదులు, ఎక్స్ప్లోరేషన్ జీఎం పంకజ్ కులశ్రేష్ఠ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత, పురావస్తు శాఖ సహాయ సంచాలకురాలు గంగాదేవి, భారత పురావస్తు సర్వేక్షణ శాఖ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్లు అజిత్, వంశీకృష్ణ, జ్యోతి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు శ్రీధర్రావు, ప్రొఫెసర్ పాండురంగారావు, పాలంపేట సర్పంచ్ రాజు, డీపీఓ వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఇరిగేషన్ ఈఈ నారాయణ, వెంకటాపూర్ తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.తన భావాలకే కాదు శరీరానికీ మరణం లేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. నిజాం పాలన వ్యతిరేక ఉద్యమం, తదనంతరం తొలి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన అక్షర యోధుడు. ప్రజల భాషలో ఉండే ఆయన కవితలు.. పూర్తిగా తెలంగాణ మాండలికంతో సాగే రచనలు జనాల గుండెలను అలల తాకేవి. నేడు ఆయన జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం కూడా. ఉద్యమాలతో ముడిపడిన జీవితం నిరంతరం పోరాటాల బాటే.. నేడు ప్రజాకవి జయంతి -
అంతర్జాతీయ సదస్సుకు లక్ష్మణ్ నాయక్
గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో అడ్వాన్సింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండస్ట్రీయల్ అప్లికేషన్ ప్రధాన అంశంగా సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు మలేషియాలో జరిగే 9వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ టెక్నోప్రెన్యూర్షిప్–ఐసీఐటీ– 2026 సదస్సులో లక్ష్మణ్ నాయక్ పాల్గొననున్నారు. ఈసందర్భంగా గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు సాధించాలి
● డీఈఓ సిద్దార్థరెడ్డిములుగు: దివ్యాంగ విద్యార్థులు సంకల్పంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. ములుగు భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తూ, చిన్న వయసులోనే వైకల్యాన్ని గుర్తించి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. శిబిరానికి 90 మంది విద్యార్థులు హాజరు కాగా, 64 మందిని ఉచిత ఉపకరణాల కోసం ఎంపిక చేసినట్లు సమగ్ర శిక్ష ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గుళ్లపెల్లి సాంబయ్య తెలిపారు. త్వరలో వారికి ఉపకరణాలు పంపిణీ చేస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు మండల కేంద్రాల్లోని ఐఈఆర్పీలు, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ సైకం శ్రీనివాసరెడ్డి, అలింకో డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. -
హైస్కూల్ విద్యార్థులకు ఉ‘ప్రయోగం’!
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, పలు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన 26 ఉన్నత పాఠశాలల(కేజీబీవీలతో కలిపి)కు రూ.6.76 కోట్లు సమగ్రశిక్ష నుంచి మంజూరు లభించింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (సమగ్ర శ్రిక్ష) నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.26లక్షలు ఒక్కో పాఠశాలకు రూ.26లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబొరేటరీ గదుల నిర్మాణం, పరికరాల సేకరణ, సరఫరా, ఇన్స్టాలేషన్ టెస్టింగ్ కమిషనింగ్కు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25లక్షలు, పరికరాలకు రూ.లక్ష కేటాయించారు. పనులను రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్లూ ఐడీసీ – హైదరాబాద్)కి అప్పగించారు. ఇ–ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. జిల్లాల వారీగా పాఠశాలలు, నిధుల వివరాలు.. హనుమకొండ జిల్లాలో హైస్కూళ్లు, కేజీబీవీలు కలిపి తొమ్మిదింటికి రూ.2.34 కోట్లు మంజూరయ్యాయి. హసన్పర్తి, ధర్మసాగర్, ఆత్మకూరు, ఎల్కతుర్తి కేజీబీవీలు, తరాలపల్లి, కడిపికొండ, వంగపహాడ్ జెడ్పీహెచ్ఎస్లు, శాయంపేట జాగీర్, వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో సైన్స్ ప్రయోగశాలలు ఐదు జిల్లాల్లో 26 ఉన్నత పాఠశాలలకు రూ.6.76 కోట్లు మంజూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించని నిధులుఈ నిబంధనలు పాటించాల్సిందే..సైన్స్ లేబొరేటరీలు నిర్మాణం పూర్తయ్యాక వర్క్స్టేషన్లు, పరికరాలు టీజీఈడబ్లూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ఆ తరువాత వాటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించాల్సి ఉంటుంది. -
మిల్లర్లపై అణచివేత ధోరణి సరికాదు
ములుగు: రైస్ మిల్లు యజమానులపై పాలకుల ధోరణికి నిరసనగా మంగళవారం నుంచి జిల్లాలో మిల్లింగ్ నిలిపివేసి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్లు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వకుండా తప్పులు చేసిన రైస్ మిల్లర్ల యజమానులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో కొత్త నిబంధనలను పెడుతూ మిల్లర్లపై కక్షపూరిత ధోరణి అవలంభిస్తుందన్నారు. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు బలవంతంగా 9 నెలల క్రితం రైస్ మిల్లులకు దిగుమతి చేసి, ఇప్పటివరకు బియ్యాన్ని తీసుకోలేదని దీంతో ధాన్యం బస్తాల్లో తరుగు ఏర్పడి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్పొరేట్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పలుసార్లు మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందన లేదన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించి మంగళవారం నుంచి సమ్మె చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజాల సహోదర్రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, సభ్యులు పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ -
గడువులోగా ఆధారాలు సమర్పించాలి
ములుగు: ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం సర్ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించిందని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నోటీసులు అందుకున్న అనామలిస్, నో మ్యాపింగ్ ఓటర్లు తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా ఆధారాలు సమర్పించాలని సూచించారు. అర్హులందరూ జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, సవరణలు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు. ఆక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, నవంబర్ 5 వరకు నోటీసులపై విచారణ, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం, నవంబర్ 9న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో సవరించిన షెడ్యూల్పై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ఐఆర్–2026 కార్యక్రమ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
అధిక రుసుం వసూలు చేస్తే చర్యలు
ములుగు: జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుములకంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ హెచ్చరించారు. మీసేవ నిర్వహకులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మీసేవ నిర్వాహకులు అధిక రుసుం తీసుకున్నట్లు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే మీసేవ కేంద్రాల అనుమతులు రద్దు చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మీసేవ కేంద్రాల్లో సిటిజన్ చార్టర్, రేట్ చార్ట్, భూభారతి ఫ్లెక్సీలు, నేమ్ బోర్డు, తాగునీరు, పవర్ బ్యాకప్ తదితర సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, అనుకోకుండా కేంద్రాలను మూసివేయాల్సి వస్తే ముందస్తుగా జిల్లా పరిపాలనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని ఆధార్ కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లోనే నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ శివకుమార్, ఈ–డిస్ట్రిక్ మేనేజర్ దేవేందర్, మీసేవ జిల్లా మేనేజర్ విజయ్ పాల్గొన్నారు. అక్షరజ్ఞానంతోనే సమాజంలో గుర్తింపు ములుగు: మహిళలు అక్షరజ్ఞానం కలిగి ఉంటేనే కుటుంబంతోపాటు సమాజంలో గుర్తింపు వస్తుందని మెప్మా పీడీ రవీందర్ అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు చదవడం, రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. అక్షరాస్యతతోనే మహిళా సాధికా రత సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, మహిళ సమాఖ్యల ప్రతినిధులు మాధవి, రమణి, సునీత, సౌజన్య, లక్ష్మి, స్వరూప, సరిత, అనూష, శ్వేతా, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ‘రామప్ప’ను సందర్శించిన ఎండోమెంట్ ఏసీ సునిత వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునిత మంగళవారం సందర్శించా రు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్.. ఏసీ సునితను శాలువా తో సత్కరించారు. అనంతరం ఇటీవల పునరుద్దరించిన సోమసూత్రాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. రామప్ప దేవాలయాన్ని మంగళవారం దక్షిణ కొరియా దేశానికి చెందిన జోంగ్ సీ పార్క్ సందర్శించారు. ఆలయ విశిష్ట త గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని కొని యాడారు. వందల సంవత్సరాల క్రితమే రాతితో ఇంతటి గొప్ప నిర్మాణం చేపట్టడం నాటి పాలకులు వారి కళాపోషణకు నిదర్శనమని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్, ఆలయ పూజారులు హరీష్ శర్మ, ఉమాశంకర్, గైడ్ వెంకటేష్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆలయాల పునాది పనులు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. మంగళవారం శ్రీసుబ్రహ్మస్వామి ఆలయం నిర్మాణం కోసం 12 ఫీట్ల లోతున కాంక్రీటు నిర్మాణం చేశారు. శ్రీశుభానందదేవి(పార్వతి) అమ్మవారి ఆలయం స్టోన్తో పునా ది పనులు జరుగుతున్నాయి. ఉత్తరం వైపున ప్రహరీ పెంచేందుకు ప్రస్తుతమున్న శివకల్యాణ మండపం సగం వరకు తొలగిస్తున్నారు. -
వీఆర్ విద్యార్థికి కాళోజీ పురస్కారం
హన్మకొండ కల్చరల్ : వరంగల్కు చెందిన ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థికి ప్రజాకవి కాళోజీ–2026 పురస్కారం వరించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు (సెప్టెంబర్ 9) కాళోజీ జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న ఆయన జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల చేతులమీదుగా వీఆర్ విద్యార్థి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విద్యార్థి చిన్నప్పటినుంచి కాళోజీకి వ్యక్తిగతంగా దగ్గరివాడిగా, ఆయన అభిమానిగా, మిత్రమండలి సభ్యునిగా, వరవరరావులాంటి ఉగ్రమూర్తుల మిత్రుడిగా ఉన్నారు. కాళోజీ బడిలోనే కవిత్వం ఓనమాలు దిద్దుకున్నారు. యుద్ధంనుంచి శాంతిప్రవాహంలా సాగిన ఆయన కవితాయాత్రలో అలలు, పలకరింత, ఘర్మసముద్రం, మంచుమైదానం, ఖండాంతర , యుద్ధం, తుపాకీ శాంతి, తదితర కవితా సంకలనాలు వెలువరించారు. విద్యార్థి గురించి.. వీఆర్ విద్యార్థి అసలు పేరు రాములు. పుట్టిన ఊరు వరంగల్లోని గవిచర్ల. భారతవైమానిక దళంలో పనిచేస్తున్న క్రమంలో రెండుసార్లు యుద్ధాల్లో పాల్గొన్నారు. అంతకన్నముందు కవిత్వంతో పెనవేసుకుపోతూ విద్యార్థి కలం పేరుతో తన జీవితాన్ని సాహిత్యంలోకి మలుచుకునే క్రమంలో వీఆర్ విద్యార్థిగా మారారు. ఐదు దశాబ్దాలనుంచి తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. ఆయనకు వచ్చిన అవార్డులు.. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం, వానమామలై వరదాచార్య పురస్కారం, వరంగల్ సాంస్కృతిక మండలి వారిచే తెలుగు భాషా విశిష్ట పురస్కారం, దాశరథి– ద్వానా సాహిత్య పురస్కారం, యునైటెడ్ ఫోరం ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారిచే జాషువా పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్నారు. పలువురి హర్షం.. విద్యార్థికి అవార్డు రావడంపై కేంద్ర సాహిత్య అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, విశ్రాంతా చార్యులు బన్న అయిలయ్య, కవులు పొట్లపల్లి శ్రీనివాసరావు, బిల్ల మహేందర్, వల్లంపట్ల నాగేశ్వరరావు, నెల్లుట్ల రమాదేవి, నిధి, రామా చంద్రమౌళి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు హైదరాబాద్లో ప్రదానం హర్షం వ్యక్తం చేసిన అంపశయ్య నవీన్, కవులుపురస్కారం రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం కాళోజీ పురస్కారం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కాళోజీ ఫౌండేషన్కు వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ప్రజలగురించి ప్రజల భాషలో కవిత్వం రాశారు. నగీషిల కవితలు రాయలేదు. పెద్ద ఉపన్యాసాన్ని సైతం కవిత్వంలా మల్చగలగడం కాళోజీ ప్రత్యేకత. వేమనలా నిజాల్ని కవితలలో పొందుపరిచారు. ఆయన జీవితమే ఉద్యమం. – వీఆర్ విద్యార్థి, కవి -
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు నిధులు
విద్యారణ్యపురి: కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటుచేసి విద్యనందించనుంది. నియోజకవర్గానికి ఒక స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కొంతకాలం క్రితమే అనుమతినిచ్చింది. తొలుతగా కొన్నింటికి పరిపాలనా అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 పబ్లిక్స్కూళ్లు ఏర్పాటుకానున్నాయి. ఈ నిధులతో ఆయా స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయి. ఇవి సెమీరెసిడెన్షియల్ స్కూళ్లుగా కొనసాగనున్నాయి. ఇక్కడ ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందించనున్నారు. జిల్లా వారీగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు పాఠశాల ఎంపిక.. నిధుల కేటాయింపు.. ● హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి జెడ్పీహెచ్ఎస్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ 9.90కోట్లు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి హసన్పర్తిలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్కు రూ 6.80కోట్లు మంజూరు చేశారు. ● వరంగల్ జిల్లాకు సంబంధించి తూర్పు నియోజకవర్గ పరిధి ఖిలా వరంగల్ మండలం శంభునిపేట ప్రభుత్వ హైస్కూల్కు రూ 8.30కోట్లు, నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అండ్ ప్రభుత్వ హైస్కూల్కు రూ.9.99కోట్లు. ● జనగామ జిల్లా నర్మెట మోడల్ స్కూల్కు రూ 10.70కోట్లు. ● మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రభుత్వ హైస్కూల్కు రూ.7.50కోట్లు, డోర్నకల్ నియోజకవర్గంలోని నర్సింహులపేట జెడ్పీహెచ్ఎస్కు రూ 11.20కోట్లు. ● ములుగు జిల్లా బండారుపల్లిలోని టీజీఎంఎస్కు రూ.9.20కోట్లు. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె జెడ్పీహెచ్ఎస్కు రూ.11.50కోట్ల మంజూరు చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలు ఎంపిక ప్రతిపాదిత ప్రభుత్వ, జిల్లాపరిషత్, మోడల్ స్కూళ్లలోనే ఏర్పాటు ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్షియల్గా విద్యతోపాటు క్రీడలు వసతులు, మెరుగైన విద్య రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఒక మోడల్గా నిర్మించారు. సీఎం రేవంత్రెడ్డి ఆ స్కూల్ను ప్రారంభించి ఆయన ఆదేశం మేరకు ఆ తరువాత వివిధ జిల్లాలనుంచి ప్రతిపాదనలు తీసుకుని పరిపాలనపరమైన అనుమతులు, నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న స్కూళ్ల భవనాలు, తరగతి గదులు ఉంచి అదనంగా గదులు సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబ్స్, క్రీడామైదానం, లైబ్రరీ, మోడల్ కిచెన్, డైనింగ్హాల్, డ్యాన్స్ హాల్ నిర్మిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న హైస్కూళ్లనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. -
ఆదివాసీ చట్టాలను అమలుచేయాలి
ఏటూరునాగారం: ఆదివాసీల చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఐటీడీఏ వరకు మార్చ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్కుమార్ మాట్లాడుతూ ఆదివాసీగూడేల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అటవీహక్కుల చట్టాలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐటీడీఏలు ఏర్పాటైన తర్వాత ఒక ప్రత్యేక బైలాను రూపొందించారని తెలిపారు. దాని ప్రకారం ఐటీడీఏలో 29 శాఖల అధికారులు ఐటీడీఏ ఉండాల్సి ఉండగా కేవలం ఐదు, ఆరు శాఖల అధికారులే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మిగతా శాఖలను విలీనం చేయడం బాధాకరమన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు రీసర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. గోదావరి నదిలో ఇసుక తవ్వకాల్లో ప్రభుత్వ అధికారులు చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోకు ఆదివాసీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఏజెన్సీలోని షెడ్యూల్ ట్రైబ్స్కు ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తామని, ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీలో తహసీల్దార్లతో సమీక్షించి ప్రతినెలా పరిష్కారాలను చూపుతామని వివరించారు. బ్యాంకుల ద్వారా గిరిజనులకు రుణాలు ఇప్పించేందుకు తమవంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసీ ప్రజలు, నాయకులు రాస్తారోకోను విరమించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్, జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, జాతీయ అధ్యక్షుడు విజయ్, జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు పులుశ బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడిగ నాగేశ్వర్రావు, రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్రావు, జిల్లా అధ్యక్షుడు నల్లబోయిన లక్ష్మణ్రావు, నాయకులు గణేశ్, సిద్ధబోయిన కార్తీక్, కబ్బాక లక్ష్మణ్, దబ్బగట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్ ఐటీడీఏ ముట్టడికి భారీగా తరలివచ్చిన ఆదివాసీలు -
నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ములుగు: వినాయక చవితి నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆదేశించారు.కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల నిర్వాహకులు పోలీస్శాఖ అనుమతి పొందిన తర్వాతే మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల వద్ద అవాంఛనీయ కార్యకలాపాలకు తావివ్వకూడదన్నారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్యసేవలు, అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం తన ఛాంబర్లో కలెక్టర్ మట్టి గణేశ్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల చెరువులు, జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, టీజీపీసీబీ నోడల్ ఆఫీసర్ అరుణదేవి, డీపీఆర్వో రఫీక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హేమంత్ సహదేవరావు -
విద్యార్థినుల నీటి గోస
ఏటూరునాగారం: ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్న తెలంగాణ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలోని విద్యార్థులు సోమవారం నీటికోసం రోడ్డెక్కారు. మండల కేంద్రంలో వెంకటాపురం(కె), వాజేడుకు చెందిన కళాశాలను నెల రోజుల క్రితం ఏటూరునాగారం ఐటీడీఏ ఎదురుగా ఉన్న పోస్టు మెట్రిక్ హాస్టల్ నూతన భవనంలోకి తరలించారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 250 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటున్నారు. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ భవనానికి సరైన నీటి వసతి లేదు. ఈ విషయాన్ని వార్డెన్ కిర్మయికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు గురిచేస్తోంది. నెల రోజుల నుంచి ఓపిక పట్టిన విద్యార్థినులు సోమవారం బయటకు వచ్చి ఐటీడీఏ ఎదుట ధర్నాకు దిగారు. నెల రోజులుగా నీటితో పాటు పలు సమస్యలపై ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం అసహనం వ్యక్తం చేశారు. మూడు అంతస్తుల మీదకు బకెట్లతో నీటిని పట్టుకొని బాత్రూమ్, స్నానాలకు మోసుకొని పోవాల్సిన దుస్థితి ఉందన్నారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని గగ్గోలు పెట్టారు. గంట తర్వాత అధికారులు స్పందించి వారిని నచ్చజెప్పి హాస్టల్కు తరలించారు. ఈ విషయంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు కళాశాల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఐటీడీఏ ఎదుట ధర్నా చేపట్టిన విద్యార్థినులకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వార్డెన్ను వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అన్నారు. సమస్య పరిష్కరించాలని ఐటీడీఏ ఎదుట ధర్నా -
వైద్య విద్యలో ప్రతిభ
గోవిందరావుపేట: పల్లెటూరి విద్యార్థులు వైద్య విద్యలో సత్తా చాటారు. మండల పరిధిలోని పస్రా గ్రామానికి చెందిన కడారి కార్తీక్, కరిమిళ్ల కాత్యసిరిలు ఎంబీబీఎస్లో సీట్లు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. వీరిద్దరూ పదో తరగతి నుంచే ప్రతిభ కనబరుస్తూ చదువులో ముందంజలో ఉండగా.. తాజాగా వైద్య విద్యలో సీట్లు సాధించారు. క్యాతసిరి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించగా కడారి కార్తీక్ సైతం ఎంబీబీఎస్లో సీటు సాధించడంతో పలువురు పస్రా గ్రామంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ ఏపీఓగా దామోదరస్వామి ఏటూరునాగారం: ఐటీడీఏ ఏపీఓగా తిరునగిరి దామోదరస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన పీఓ లెనిన్ వత్సల్ టొప్పోను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఏటూరునాగారం ఏఓగా పనిచేసిన దామోదరస్వామి ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగోన్నతిపై ఏటూరునాగారం ఏపీఓగా బదిలీ కావడంతో విధుల్లో చేరారు. అయితే ఐటీడీఏలో ఆరు నెలల నుంచి ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో అభివృద్ధి పథకాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఏపీఓగా చేరిన దామోదరస్వామి సమస్యలు పరిష్కరిస్తారని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య ఆస్తులపై భువన్ సర్వే ములుగు: మున్సిపాలిటీ పరిధిలోని వాణిజ్య ఆస్తుల వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు భువన్ సర్వే నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ములుగు పట్టణంలోని వ్యాపార దుకాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాణిజ్య భవనాలు, దుకాణాలు, ఇతర వాణిజ్య ఆస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మున్సిపల్ రికార్డులతో సరిపోల్చుతున్నామని తెలిపారు. దుకాణాల ఆస్తి పన్ను అసెస్మెంట్తో పాటు ట్రేడ్ లైసెనన్స్ ఉందా, దాని చెల్లుబాటు తదితర వివరాలను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం ఆస్తి పన్ను చెల్లించి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాలని వ్యాపారులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారు వెంటనే పొందాలని సూచించారు. భువన్ సర్వే ద్వారా గుర్తించిన వివరాలతో మున్సిపల్ రికార్డులను నవీకరించి, పన్నుల వసూళ్లను మెరుగుపర్చడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి.రాజేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. భద్రతకు అధిక ప్రాధాన్యం భూపాలపల్లి అర్బన్: గనుల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడంతోపాటు ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు సూచించారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో సోమవారం ఆక్యుపేషనల్ కోడ్–2020, ఆక్యుపేషనల్ సేప్టీ హెల్త్, వర్కింగ్ కండిషన్స్ సెంట్రల్ రూల్స్–2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి, కార్మికుడి ప్రాణ భద్రత సంస్థకు అత్యంత ముఖ్యమన్నారు. ప్రతీ పని ప్రారంభానికి ముందే ప్రమాదాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలుచేయాలని, భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ‘సేఫ్టీ ఫస్ట్’ భావనతో ప్రతీ ఒక్కరు విధులు నిర్వహించాలని, భద్రత అనేది కేవలం సేఫ్టీ విభాగానికే కాకుండా ప్రతీ ఒక్కరి సమష్టి బాధ్యత అని స్పష్టంచేశారు. అంతకు ముందు మొదటి షిఫ్ట్లో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి సేఫ్టీ జీఎం సాయిబాబు 6వ భూగర్భ గనిని సందర్శించారు. -
ఓపెన్కాస్టు గని పరిశీలన
వెంకటాపురం(ఎం): మండలకేంద్రం శివారులో ప్రారంభించే ఓపెన్కాస్టు గని ప్రాంతాన్ని సోమవారం ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సింగరేణి సంస్థ భూపాలపల్లి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళీ మోహన్లు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. గని ప్రాంతం ఎంతమేర ఉంది అనే ఆంశాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. ప్రస్తుతం ఆ భూముల్లో సాగవుతున్న పంటలు ఏంటి.. అనే వివరాలను సేకరించినట్లు తెలిసింది. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్ సహదేవరావును సింగరేణి సంస్థ అధికారులు కలిసి మాట్లాడారు. ఓపెన్కాస్టు ప్రాంతంలో నిర్వహించిన శాసీ్త్రయ అధ్యయనాల్లో వెల్లడైన అంశాలు, వాటి ఆధారంగా చేపట్టాల్సిన చర్యలు, పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జీఎం దేవేందర్, ఎన్విరాన్మెంట్ జీఎం సిద్ధులు పాల్గొన్నారు. -
అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు ఇవ్వాలి
● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిములుగు: ఎస్ఐఆర్లో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతీ ఓటరుకు నోటీసులు అందించి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ పురోగతిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో 41,900 నోటీసులు సిద్ధం చేసి ఇప్పటివరకు 24,394 నోటీసులు జారీ చేసి వివరాలను యాప్లో నమోదు చేసినట్లు తెలిపారు. నిర్ణీత గడువులో విచారణ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వీసీలో జిల్లా నుంచి ఆర్డీఓ కృష్ణవేణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఐటీడీఏల ముట్టడిని విజయవంతం చేయాలి
వాజేడు: ఆదివాసీల ఉద్యోగాల కల్ప నకు చేపట్టిన రాష్ట్రంలోని ఐటీడీఏల ముట్టడిని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పలు ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన కొమరంభీమ్ విగ్రహానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పి ంచారు. అనంతరం ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లుగా లంబాడాలు ఆదివాసీల హక్కులను పొందుతున్నారన్నారు. ఉద్యోగాలు, నిధులు నియామకాలలో నిత్యం ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులను కాపాడుకోవడానికి రేపు(సోమవారం) ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా 16న ఊట్నూరు, 21న భద్రాచలం, 28న మన్ననూరు ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి కోటేశ్వర్లు, జానకి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జీఎస్పీ మండల అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఎస్ఎస్తాడ్వాయి/వెంకటాపురం(కె): ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ శనివారం తాడ్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్య, తాడ్వాయి సర్పంచ్ గంట ప్రవళికల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహరదారిపై నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లక్ష్మణ్బాబు, నాగజ్యోతి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు పలు హామీలు ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే వంటావార్పు వంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, జిల్లా నాయకుడు భూక్య జంపన్న, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దిడ్డి మోహన్రావు, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ శైలజ, మేడారం జాతర మాజీ చైర్మన్ రేగ నర్సయ్య, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నాయకుల బైక్ ర్యాలీ అదే విధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్బాబు హాజరై బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులను అనేక హామీలిచ్చి అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడవర్తి నర్సింహామూర్తి, గంపా రాంబాబు, రామకృష్ణ కృష్ణారెడ్డి, ముడుంబా శ్రీనివాస్, కాకులమర్రి ప్రదీప్రావు, సర్పంచ్లు రమ్య, ఆదిలక్ష్మి, మురళి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ నాగజ్యోతి వెయ్యి రోజుల పాలనకు నిరసనగా వంటావార్పు, బైక్ ర్యాలీ -
సాగు పద్ధతులపై రైతులకు అవగాహన
మంగపేట : మండల పరిధిలోని కమలాపురం, బోరునర్సాపురంలో తెలంగాణ రైతు విజ్ఞానకేంద్రం(ఈఆర్వీకే) శాస్త్రవేత్తలు వెంకన్న, విశ్వతేజ ప్రశాంత్ రైతులకు పంటల సాగు పద్ధతులు, డ్రోన్ల వినియోగం, ఎరువుల వాడకంపై శనివారం అవగాహన కల్పించారు. మండల ఇన్చార్జ్ ఏఓ మహేశ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న వరి, ఇతర పంటలను శాస్త్రవేత్తల బృందం ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. వరి, ఇతర ప్రధాన పంటల్లో వచ్చే తెగుళ్లు, పురుగులను గుర్తించారు. తగిన సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎం) ఆధ్వర్యంలో పంటలలో నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల ప్రాముఖ్యతపై ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించారు. వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యతపై డెమో నిర్వహించి అవగాహన కల్పించారు. కమలాపురంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ వరి రకాలను ఉత్పత్తి చేస్తున్న రైతు రాజేశ్వర్రావు ఆర్గానిక్ ఫామ్ను సందర్శించారు. రైతులు రాజేశ్వర్రావును ఆదర్శంగా తీసుకుని పంటలు పండించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అగ్రికల్చర్ ఆర్డబ్ల్యూఈపీ విద్యార్థులు రోషన్, సౌమిత్ సర్కార్, భానుప్రసాద్, గణేశ్, ఏఈఓ మహేశ్, భావన, గాయత్రి, రైతులు నవీన్రెడ్డి, శ్రీనివాస్, రవి, హన్మంతరావు, శ్రీను, యాదగిరి, సమ్మిరెడ్డి, కనకం, సురేశ్ పాల్గొన్నారు. -
జపాన్కు హెడ్మాస్టర్ మల్లయ్య
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాంలో భాగంగా జపాన్ దేశంలో విద్యావ్యవస్థను అధ్యయనం చేయడానికి మండల పరిధిలోని రామన్నగూడెం జెడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ కొయ్యడ మల్లయ్య నేడు జపాన్కు బయలుదేరి వెళ్లనున్నారు. నేటి నుంచి 12వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించి అక్కడ పాఠశాల విద్యా వ్యవస్థను పరిశీలించి, పరిశోధన చేసి రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది సభ్యుల బృందంతో జపాన్ బయలుదేరుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా నుంచి రామన్నగూడెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొయ్యడ మల్లయ్య ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్నికోలస్, అసిస్టెంట్ డైరెక్టర్ లింగయ్య, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్, ఎస్సీఈఆర్టీ హైదరాబాద్లో ఈనెల 2వ తేదీన వీరందరికీ వీసాలు అందజేశారు. ఈ క్రమంలో జపాన్ వెళ్తున్న మల్లయ్యకు డీఈఓ సిద్ధార్థరెడ్డి అభినందనలు తెలిపారు. రామప్పలో జియోలాజికల్ అధికారులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీవీ ముఘల్, డిప్యూటీ డైరెక్టర్ శేషాసాయిలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. వారి వెంట జీఎస్ఐ అధికారులు, సిబ్బంది, ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, శ్రీకాంత్, భద్రు ఉన్నారు. పౌష్టికాహారం అందించాలి గణపురం: గర్భిణులు, బాలింతలకు ప్రతీ రోజు సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి ముధుసూదన్ అన్నారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించిన పౌషకాహార వారోత్సవాల్లో ఆయన పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ గర్భదారణ సమయంలో పౌషకాహారం తీసుకోవడం వలన తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఐటీఐ ప్రవేశాలకు చివరి అవకాశం భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 7వ తేదీతో చివరి గడువు ముగియనున్నట్లు స్థానిక ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జూమ్లానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాక్ ఇన్ అడ్మిషన్ పద్ధతిలో తక్షణ అడ్మిషన్ కల్పిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను మూడో విడత భర్తీచేయనున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని కళాశాలలో అడ్మిషన్కు హాజరుకావాలని సూచించారు. నిర్మాణ పనుల పరిశీలన కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం ఆలయ నిర్మాణ పనులను ఈఓ మహేశ్, క్షేత్ర కన్సల్టెన్సీ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, పాలవవర్గం డైరెక్టర్ మంచినీళ్లు దుర్గయ్య, దొడ్ల అశోక్ శనివారం పరిశీలించారు. -
అరచేతిలో సమగ్ర సమాచారం
జిల్లా జనాభా 2,94,671రెవెన్యూ మండలాలు 10గ్రామ పంచాయతీలు 174మున్సిపాలిటీలు 1ఏటూరునాగారం: చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకోవడంతో పాటు.. ఇతర అంశాలపై సమాచారం కావాలన్నా గ్రామ పంచాయతీ పరిధిలోని వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక క్లిక్తో అరచేతిలో జీపీల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్లోనే అన్నీ.. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు గ్రామ పంచాయతీలకు ఈ ఏడాది నుంచే ఫైండ్ యువర్ జీపీ వెబ్సైట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. రెండు నెలల క్రితం ఈ వెబ్సైట్ను ప్రారంభించి.. గత నెల 21 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్)లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పోర్టల్తో పాటు వెబ్సైట్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా, మండలం, గ్రామం పేరును ఎంచుకొని ఆయా పంచాయతీల వివరాలను చూసే విధంగా తీర్చిదిద్దారు. ఫైండ్ యువర్ జీపీలో వివరాలు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. గ్రామ పంచాయతీకి కేటాయించిన లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ(ఎల్జీడీ) కోడ్ నంబర్ నుంచి పలు అంశాలను పొందవచ్చు. గ్రామ ప్రస్తుత జనాభా, వైశాల్యం, గృహాలు, శివారు గ్రామాలు, వార్డు సంఖ్యను పొందుపర్చారు. గ్రామ ముఖ్య చరిత్రతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను నమోదు చేశారు. ప్రధాన కూడళ్లు, ఎస్హెచ్జీ మహిళా వివరాలు, రేషన్న్ కార్డులు, ఆధార్ కార్డులు, ఆలయాలు అన్ని రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల వారీగా అభివృద్ధి వివరాలు, నిధుల అంచనాను పొందవచ్చు. గ్రామ పంచాయతీ భవనం, గదుల సంఖ్య, రహదారులు, వ్యవసాయ ఆధారిత వనరులు(చెరువులు, కుంటలు), మిషన్ భగీరథ కుళాయిలు, పైపులైన్, పార్కులు, చెత్త సేకరణ వాహనాలు, పాఠశాలల వివరాలను వీక్షించవచ్చు. మీ గ్రామ సమాచారాన్ని వీక్షించాలంటే ఫైండ్ యువర్ గ్రామ పంచాయతీ అంటూ కింద వివరాలను పొందుపర్చారు.జిల్లాలోని జనాభా.. గ్రామాలు అందుబాటులోకి ఫైండ్ యువర్ జీపీ వెబ్సైట్ ఆన్లైన్లో 171 పంచాయతీల వివరాలు విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా పోర్టల్ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రాలుమేడారం – సమ్మక్క–సారలమ్మ రామప్ప – రామలింగేశ్వరస్వామి హేమాచలక్షేత్రం – లక్ష్మీనర్సింహస్వామి లక్నవరం సరస్సు రామప్ప సరస్సు బొగత జలపాతం -
ఢీ అంటే ఢీ
భూపాలపల్లి: జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఒకే చౌరస్తాలో దాదాపుగా ఒకే సమయంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు నినాదాలు చేసుకుంటూ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపడంతో ఇబ్బంది తలెత్తలేదు. కాసేపు హై టెన్షన్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వేయి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్థానిక నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్కు చేరుకున్నాక ఎమ్మెల్యే.. విలేకరులతో మాట్లాడారు. అప్పటికే సినిమా థియేటర్లో వేచి ఉన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అదే సమయంలో సెంటర్కు చేరుకున్నారు. విషయాన్ని గమనించిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను కాసేపు ఆపారు. ఇరుపార్టీల నాయకుల మధ్య అడ్డుగా నిలిచారు. అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నినాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడటం పూర్తయ్యాక వెళ్లిపోయారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించాక అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. శనివారం జిల్లాకేంద్రంలో ఇరు పార్టీల కార్యక్రమాలు ఉండటంతో పోలీసులు ముందే భారీఎత్తున అక్కడకు చేరుకున్నారు. -
భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. పూజారులు పవన్కుమార్, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్ రామనుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ములుగు: సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ ఇటీవల పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి ఉపాధ్యాయుల కృషే కారణమన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందించారు. రానున్న రోజుల్లో విద్యారంగంలో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన ప్రశంసపత్రాలు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
కాళేశ్వరం దేవస్థానం నిర్మాణాల వేగిరం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణలో భాగంగా విజయగణపతి ఆలయం నైరుతి మూలన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.198కోట్లతో ఆలయ నిర్మాణాలు చేపట్టారు. శుక్రవారం స్టోన్తో బేస్మెంట్ 12ఫీట్ల నుంచి నిర్మాణం చేపట్టారు. వెనుకాల ప్రాకారం నిర్మిస్తున్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఘనంగా అభిషేకం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారికి వైభవంగా అభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ప్రతీ శుక్రవారం అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సంపత్రావు, సర్పంచ్ మొగిళి, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
● టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో ప్రదానం ములుగు: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినో త్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(టీఆర్ఎస్ఎంఏ) జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదా నోత్సవం ఇంచర్లలోని బ్రాహ్మణి విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ఎంఏ జిల్లా అధ్యక్షుడు పోశాల వీరమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని 23 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 46 మంది ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ఎంఏ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగరి శ్రీనివాసరావు, ట్రెజరర్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
నడక నేర్పే నాన్న.. నడవడిక నేర్పే చదువు.. పలుకు నేర్పే అమ్మ. పలుకుబడినిచ్చే సమాజం. అజ్ఞానంనుంచి అందరూ కీర్తించేలా మార్చే దిక్సూచి.. నాలుగు గోడల నడుమ భవిష్యత్ను తీర్చిదిద్దే నిర్మాత.. చాక్పీస్ ముక్కలతో తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ.. అన్నీ ఉపాధ్యాయుడే. ఉమ
విద్యార్థులతో ప్రయోగం చేయిస్తున్న ఉపాధ్యాయుడు రామ సంతోశ్ కుమార్ విద్యార్థులు తయారు చేసిన కృత్యాధార చిత్రాలతో ఉపాధ్యాయుడు రవి కృత్యాధార బోధన.. సామర్థ్యాల సాధనమహబూబాబాద్ రూరల్: విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పాఠ్యాంశంలోని విషయాలను అర్థం చేసుకుని సామర్థ్యాలను సాధించేలా విద్యా బోధన చేస్తున్నారు మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవునూరి రవి. 14 ఏళ్లుగా ప్రయోగాత్మక కృత్యాధార బోధన చేస్తున్నారు. కృత్యాధార బోధనతో విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఇష్టం పెంచుతున్నారు. నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం జెడ్పీఎస్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రామ సంతోశ్ కుమార్ బోధనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఆయన నిత్యం ఉదయం 5 గంటలకే జూమ్ తరగతులు నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 50 పాఠ్యంశాల వీడియోలు అప్లోడ్ చేశారు. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్, సైన్స్ఫేర్ గైడ్ టీచర్గా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలతో అతిథి ఉపన్యాసాలు నిర్వహించారు. ఎన్సీఈఆర్టీ నిర్వహించే ఆన్లైన్ పోర్టల్ కోసం ఈ–కంటెంట్ రూపొందించి 40కి పైగా వీడియోలు అందించారు. మన టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాఠ్యాంశాలు బోధించారు.ఏటూరునాగారం: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్కు చెందిన పోతు రాజశేఖర్ ఏటూరునాగారం నార్త్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆ పాఠశాలలో చేరినప్పుడు విద్యార్థుల సంఖ్య 90 మాత్రమే. ప్రస్తుతం 170 మందికి చేరింది. దాతల సహకారంతో పాఠశాలలో నూతనంగా కంప్యూటర్ ల్యాబ్, రేకుల షెడ్డు, ప్రొజెక్టర్, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తక పఠనంపై మక్కువ పెంచుతున్నారు. ఇప్పటికీ ఏ విద్యార్థి బడికి రాకపోయినా ఇంటికి వెళ్లి బండిమీద పాఠశాలకు తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు ఉపాధ్యాయుల అంకితభావం విద్యార్థుల నమోదు పెంపు.. అకుంఠిత దీక్షతో విధులు ఆదర్శంగా నిలుస్తూ బడులను కాపాడుతున్న టీచర్లు నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ఉత్తమ పాఠశాలగా ఎంపిక ఎస్ఎస్తాడ్వాయి: మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ.. ఆటపాటల్లోనూ తమ ప్రతిభను చాటుతున్న ఊరట్టం గిరిజన బాలికల పాఠశాల జిల్లాస్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఉత్తమ పాఠశాలగా ఊరట్టం పాఠశాలకు ఈ గుర్తింపు దక్కింది. గురువారం మంత్రి సీతక్క చేతుల మీదుగా హెచ్ఎం శ్రీనివాస్ అవార్డును స్వీకరించారు. పోడుకొట్టేందుకు ఛత్తీస్గఢ్ గిరిజనుల యత్నం వెంకటాపురం(కె): మండల పరిధిలోని సుడిబాక గ్రామ సమీపంలోని పిట్ట తోగు సమీపంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా గ్రామానికి చెందిన గిరిజనులు శుక్రవారం పోడు కొట్టి గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా గ్రామానికి చెందిన 35 మంది గిరిజనులు పిట్టతోగు సమీపంలో అటవీలో పోడు కొట్టి గుడిసెలు వేసుకునేందుకు యత్నించారని తెలిసి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారరు. గిరిజనులను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పీఎస్లో గిరిజనులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కాగా సుక్మాకు చెందిన గిరిజనులు గతంలో రెండు సార్లు కూడా ఇదే ప్రాంతంలో పోడు కొట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకుని పంపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కృష్ణాలంకరణలో భద్రకాళి అమ్మవారు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్వేత అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారికి కృష్ణాలంకారం జరిపారు. అనంతరం రాత్రి 10గంటల నుం– భక్తులను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజాము వరకు భక్తులు జాగరణ చేశారు. -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
వెంకటాపురం(కె): పంటల సాగు వివరాలు పక్కాగా లెక్కగట్టేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ చివరి వరకు సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది. కాగా జిల్లా పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున జిల్లా వ్యాప్తంగా 269 మందిని నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పంటల వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సెల్ ఫోన్ యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 1.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా.. వలంటీర్లు వివరాల నమోదులో బిజీగా మారారు. 269 మంది వలంటీర్లు జిల్లాలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక్కరు చొప్పున 269 మంది వలంటీర్లను నియమించారు. ములుగు మండలంలో 16 మంది, మల్లంపల్లిలో 2, గోవిందరావు పేటలో 11 మంది, తాడ్వాయిలో 46 మంది, ఏటూరునాగారంలో 26 మంది, మంగపేటలో 22, వెంకటాపురం(ఎం) 9 మంది, కన్నాయిగూడెంలో 23 మంది, వాజేడులో 57 మంది, వెంకటాపురం(కె)లో 57 మంది వలంటీర్లను నియమించారు. కాగా వారు తమకు కేటాయించిన గ్రామాలో గత ఐదు రోజులుగా సర్వే చేస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో శిక్షణ యాప్ వినియోగం, పంటల సాగు నమోదు విషయాలపై వలంటీర్లకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. వలంటీర్లు గ్రామాల్లో సర్వే చేసి ప్రభుత్వం నిర్దేశించిన 45 రోజుల్లో తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ప్రతీరోజు యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 269 మంది వలంటీర్ల నియామకం ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒకరు పంట విస్తీర్ణం నమోదు జిల్లాలో 1.45 లక్షల ఎకరాల సాగు -
‘ఆట’ ఆరంభం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణిలు పట్టు బిగిస్తుండటం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది. కాంగ్రెస్లోనే.. సురేఖ స్పష్టత.. పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? స్థానికంగా తన వర్గాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పెరుగుతున్న వ్యతిరేక స్వరం వరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని బసవరాజు సారయ్య సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కటవుతున్న ‘కొండా’ వ్యతిరేక వర్గీయులు సైలెంట్ మోడ్లో సురేఖ అనుచరవర్గం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోనని స్పష్టత ‘తూర్పు’ రాజకీయాల్లో వేగం పెరిగిన పరిణామాలు కొండా దంపతుల భవిష్యత్ వ్యూహం ఏమిటి?‘కొండా’ అనుచరవర్గంలో మౌనం తాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవిష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలుస్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. దీంతోపాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దష్టికి తీసుకెళ్లడమా? వరంగల్ తూర్పులో తన కేడర్ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది. -
అవినీతికి కేరాఫ్.. కాంగ్రెస్ ప్రభుత్వం
ఏటూరునాగారం: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓడవాడ నుంచి వైజంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వంటావార్పు, మహిళలతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, నాయకులు పోరిక గోవింద్ నాయక్, కృష్ణ, జంపన్న, సునీల్ కుమార్, శ్రీలత, ఖాజా పాషా, సర్దార్ పాషా, ప్రదీప్ రావు, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, విజయ నాగరాజు, పద్మ, స్వరూప, సరితశ్రీనివాస్, రామ్మూర్తి, రామయ్య, రవీందర్, రఘు, చంద్రబాబు పాల్గొన్నారు. ఫ్లెక్సీలను చింపడం సరికాదు వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను పోలీసులు చించివేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఆరోపించారు. శుక్రవారం పోలీసులు, లక్ష్మీనర్సింహరావు మధ్య వాగ్వాదం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు -
ఖమ్మం డిపో బస్సులపై ఆర్ఎం ఆరా
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బ స్టాండ్కు ఖమ్మం రీజియన్ నుంచి వచ్చే ఆర్టీసీ షటిల్ బస్సుల కండక్టర్, డ్రైవర్ల పనితీరును ఖమ్మం ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సరిరామ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగూడెం బస్సు డ్రైవర్, కండక్టర్తో మాట్లాడి ఎస్ఆర్ను పరిశీలించారు. బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారని తెలుసుకున్నారు. టికెట్లు నిబంధనల ప్రకారం అందించాలని, హెచ్చుతగ్గులు లేకుండా సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో ఆపరేషన్ మేనేజర్ మల్లయ్యతో పాటు ఏటూరునాగారం కంట్రోలర్ శంకర్ పాల్గొన్నారు. ‘అంగన్వాడీ పోస్టులన్నీ భర్తీ చేయాలి’ ములుగు: ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం డీడబ్ల్యూఓ ప్రేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, అంగన్వాడీ యూని యన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క మాట్లాడుతూ ఏజెన్సీ పోస్టులు భర్తీ కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త గ్యాస్ కనెక్షన్లతో పాటు వంట పాత్రలు, ఫ్యాన్లు అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న గ్యాస్, ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మరాణి, భాగ్యలక్ష్మి, సరిత, నాగలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ధర్నా ములుగు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం అమానుషమన్నారు. దాడులతో బీజేపీని భయపెట్టలేరని, దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా కృష్ణవేణి నాయక్, భూక్యా జవహర్ లాల్, నాయకులు గుగులోత్ స్వరూప, జినుకల కృష్ణాకర్ రావు, అల్లె శోభన్, నగరపు రమేశ్, కొర్ర సుమలత, జనార్దన్, గాదం కుమార్, ఎల్కతుర్తి శ్రీహరి పాల్గొన్నారు. సమష్టి కృషితో లక్ష్యాన్ని చేరుకోవాలి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నిర్దేశిత లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన ఆయన.. సెప్టెంబర్ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆగస్టులో ఏరియాకు 3.73 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం ఉండగా 1.60 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. లక్ష్యంలో 43 శాతం సాధించి రవాణా చేసినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 5,157 టన్నులుగా నమోదైందన్నారు. సెప్టెంబర్ నెలకు 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉత్పత్తి పెంపునకు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఆదేశించారు. -
ఓరుగల్లులో హీటెక్కిన రాజకీయాలు
సురేఖకు ఢిల్లీ పిలుపు రావడంతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు. సురేఖకు ఏం జరుగుతుంది? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మంత్రి పదవిలో కొనసాగుతారా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. కొండా కుటుంబానికి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధిష్టానం తీసుకునే నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ నుంచి వెలువడే నిర్ణయంతోనే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది. -
అర్హులందరికీ స్మార్ట్ రేషన్కార్డులు
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు: అర్హులైన పేదలందరికీ స్మార్ట్ రేషన్కార్డులు అందుతాయని, వారి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క ములుగు, మల్లంపల్లి మండలాల లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. ములుగు మండలానికి 1,809, మల్లంపల్లి మండలానికి 621 స్మార్ట్ రేషన్కార్డులు మంజూరు కాగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రేషన్ కార్డులు లేని కారణంగా అర్హులైన పేదలు సన్నబియ్యం పథకానికి దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నూతన కార్డులను మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ సంవత్సరంలో 12,802 మందికి నూతన రేషన్ కార్డుల ద్వారా 36,405 మంది కుటుంబ సభ్యులకు సన్నబియ్యం పథకం ప్రయోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్లో సన్నబియ్యం కొనుగోలు చేయడం పేద కుటుంబాలకు భారంగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందించడంతో ఆ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గిందన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పింఛన్ల దరఖాస్తుల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించినట్లు వెల్లడించారు. ములుగు నియోజకవర్గానికి ఇప్పటివరకు 5 వేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు. ఇంకా అనేక పేద కుటుంబాలకు ఇళ్ల అవసరం ఉందని తెలిపారు. సర్వేలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు ములుగులో అధికంగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. రెండో విడతలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, డీసీఎస్ఓ ఫైజల్ హుస్సేని, డీఎం కృష్ణవేణి, తహసీల్దార్లు, ప్రజలు పాల్గొన్నారు. భువన్ సర్వే పరిశీలన ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న భువన్ సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జె.సంపత్ క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. సర్వే సిబ్బందితో మాట్లాడి పట్టణంలోని ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న భవనాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని బిల్ కలెక్టర్లు పరిశీలించాలన్నారు. అనుమతులు లేని నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే పట్టణంలోని వ్యాపార సంస్థలను సందర్శించి ట్రేడ్ లైస్సెన్స్ పరిశీలించారు. ప్రతీ వ్యాపారీకి తప్పనిసరిగా ఉండాలన్నారు. లేదంటే చర్యలు తప్పవన్నారు. -
నల్లబ్యాడ్జీలతో నిరసన
ములుగు: పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా చైర్మన్ పోలురాజు నేతృత్వంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్జీకి వినతిపత్రం అందజేశారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవికాంత్, డిప్యూటీ కన్వీనర్ చైతన్య, డీటీఎఫ్ ఆదిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ సమ్మారావు, ఉదయ్ కుమార్ రెడ్డి, టీఎన్జీవోస్ కోశాధికారి కుమారస్వామి, ఎస్టీయూ నాయకులు మధుసూదన్, అహ్మద్, కో–చైర్మన్ యశ్వంత్, హెచ్డబ్ల్యూఓల అధ్యక్షురాలు సరిత, ఇరిగేషన్ ఫోరం అధ్యక్షుడు ప్రదీప్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల రవి, జిల్లా కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల తిష్ట
ములుగు పట్టణాన్ని పీడిస్తున్న డ్రెయినేజీ సమస్య ● ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు ● ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు● రామప్ప చెరువులో చేరుతున్న మురుగునీరు ● పైపులైన్ లీకేజీలతో తాగునీటి సమస్య డ్రెయినేజీలో నిలిచిన మురుగునీరుఅంతర్గత రహదారులు ఆధ్వానం పట్టణంలో అంతర్గత రహదారులు ఆధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంతలతో దర్శనమిస్తున్నాయి. కల్వర్టులు సైతం ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్న రహదారులు ఇరుకుగా ఉండడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని రహదారులు 15 ఫీట్లు ఉండడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేకపోతుండడంతో వాహనదారుల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంటుంది. విస్తరించేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులు కలిసి మరో 5 ఫీట్లు దారికి ఇవ్వాలని అడిగితే ససేమిరా ఇవ్వమని అంటుండడంతో అంతర్గత రోడ్ల విస్తరణ ఇబ్బందిగా మారింది.మురుగునీరంతా రామప్ప చెరువులోకి.. పట్టణానికి చెందిన మురుగునీరంతా బండారుపల్లి చెరువు ద్వారా రామప్ప సరస్సులోకి వెళ్తోంది. పట్టణంలో డ్రెయినేజీ సిస్టం సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయి. వర్షపునీటితో మురుగునీరంతా రామప్ప చెరువులోకి వెళ్తుండడంతో రామప్ప సరస్సు నీరు కలుషితమవుతుంది. జిల్లాలోని 4 మండలాల పరిధిలో గల 175 శివారు గ్రామాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందిస్తున్న రామప్ప సరస్సులోకి ములుగు పట్టణం మురుగునీరంతా చేరి తాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రామప్ప సరస్సులోకి మురుగునీరు వెళ్లకుండా అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుసుకోవాల్సిన అవసరం ఉంది. 5,540 నల్లా కనెక్షన్లు మున్సిపాలిటీ పరిధిలో చాలా కాలనీల్లో పైపులైన్ లీకేజీల కారణంగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు పట్టణంలో 14 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా 110కిలో మీటర్ల మేర పైపులైన్ విస్తీర్ణం ఉంది. 5,540 నల్లా కనెక్షన్లు ఉండగా నల్లానీరు సరిగా రావడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన పైపులైన్ కావడంతో తరచూ లీకేజీలు అవుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని పలుచోట్ల ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు చెత్తాచెదారం పడేస్తుండడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 20 వార్డుల పరిధిలో 17,580 మంది జనాభా 13,963 మంది ఓటర్లు ఉన్నారు. 1985లో పంచాయతీగా ఆవిర్భవించిన ములుగు 17 ఫిబ్రవరి 2019న జిల్లాగా ఏర్పాటైంది. ములుగు పట్టణాన్ని 5 ఏప్రిల్ 2025న మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గత ఎనిమిది నెలల క్రితం తొలిసారిగా ములుగు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గం ఏర్పాటైనా నిధుల కొరతతో సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
విద్యార్థుల భవిష్యత్కు భరోసా
గోవిందరావుపేట: విద్యార్థుల భవిష్యత్కు విద్యాశాఖ భరోసా కల్పిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సమ్మిళిత విద్యపై ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మండలంలో భవిత కేంద్రాలతో పాటు ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పిల్లల్లోని వైకల్యాలను గుర్తించేందుకు వారి సేవలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సాంబయ్య మాట్లాడారు. ఈ నెల 8న మరోసారి ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు సైకం శ్రీనివాసరెడ్డి, బి.శ్యాంసుందర్రెడ్డి, ఉల్లాస్ కోఆర్డినేటర్ పీర్ల కృష్ణబాబు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి -
బీఆర్ఎస్ పాలనలో మోసపోయిన ప్రజలు
● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ములుగు: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక హామీలిచ్చి అమలు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని, పేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చి అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి, మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల హామీలను సైతం బీఆర్ఎస్ నెరవేర్చలేదని ఆరోపించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అశోక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ చిటమట రఘు, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, రవాణా శాఖ స్టేట్ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
డ్రెయినేజీ నిర్మించి సీసీ రోడ్లు వేయాలి
డ్రెయినేజీలు నిర్మించిన తర్వాత సీసీ రోడ్లు వేయాలి. పట్టణంలో నూతనంగా సీసీ రోడ్లు వేస్తుండడంతో డ్రెయినేజీల్లో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పట్టణంలోని అంతర్గత రహదారులను విస్తరించి సీసీ రోడ్లు నిర్మించాలి. ఇరుకై న రహదారులతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కొరతను నివారించేందుకు అదనంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నూతనంగా నిర్మించాలి. – భూక్య జవహర్లాల్, 20వ వార్డుపట్టణంలో ప్రధానంగా డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పట్టణానికి చెందిన మురుగునీరంతా బండారుపల్లి చెరువులోకి చేరి అక్కడి నుంచి రామప్ప సరస్సులోకి వెళ్తోంది. మురుగునీటిి యంత్రాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తే ఆ నీటిని పొలాలకు తరలించి సాగునీటిగా వాడుకోవచ్చు. మున్సిపాలిటీ పరిధిలో 130 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నప్పటికీ తక్కువ వేతనం కారణంగా సుమారు 80 మంది మాత్రమే విధులకు హాజరవుతుండడంతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్య నెలకొంటుంది. – గండ్రకోట వాణికుమార్, 9వ వార్డు కౌన్సిలర్ -
భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, అధికారులు బాధ్యతాయుతంగా సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో మంగళవారం భూ రీసర్వే, భూభారతి, తదితర రెవెన్యూ అంశాలపై ఐడీఓసీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీసర్వే పనులను ప్రణాళికతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తూ, కొలతలు, భూ వివరాల నమోదులో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రామచంద్రపురం గ్రామంలో రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించేందుకు రూపొందించిన పట్టా పాస్పుస్తకాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సంబంధిత రికార్డులు, రైతుల వివరాలను పరిశీలించి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. భూ భారతి, సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
కాంగ్రెస్ది అసమర్థ పాలన
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావుములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్రావుల పిలుపు మేరకు కాంగ్రెస్ అసమర్థ పాలనను ఎండగడుతూ ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఆడబిడ్డలకు రూ.660 కోట్లు బాకీ ఉన్నారని, మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ములుగులోని 80 వేల మంది మహిళలకు రూ.660 కోట్లు బాకీ పడ్డారని వివరించారు. ఉచిత బస్సు పేరుతో వరంగల్, ములుగు, ఏటూరునాగారం, భద్రాచలం రూట్లలో బస్సులు తగ్గించి చార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. ఏజెన్సీలో పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే వారం రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గోవిందనాయక్, మల్లారెడ్డి, కృష్ణ, జంపన్న, మాజీ ఎంపీపీ వినయ్ కుమార్, మల్కా రమేశ్, తాడూరి రఘు, డయ్య అశోక్, రమేష్ రెడ్డి, రమణారెడ్డి, నరసింహ నాయక్, విజయ్, ఎండి ఖాజా పాషా పాల్గొన్నారు. -
కొండా సురేఖ ఎపిసోడ్కు బర్తరఫ్తో ఎండ్ కార్డు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి పదవినుంచి బర్తరఫ్తో సుమారు 18 రోజుల కొండా సురేఖ ఎపిసోడ్కు గురువారం ఎండ్ కార్డు పడింది. పరకాల వేదికగా మొదలైన రాజకీయ వివాదం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను దాటి ఢిల్లీకి చేరింది. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో జరిగిన చర్చలు.. మంత్రివర్గం నుంచి బయటకు పంపే స్థాయికి చేరాయి. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. ఆ తర్వాత వరుస ఫిర్యాదులు, ఎమ్మెల్యేల నివేదికలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం.. హైకమాండ్ను ఆగ్రహానికి గురి చేశాయి. చివరకు సురేఖను కేబినెట్ నుంచి తప్పించారు. ఆగస్టు 16 తర్వాత మొదలైన పరిణామాలు గురువారం నాటి కొండా సురేఖ బర్తరఫ్ వరకు జరిగిన తంతు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూతురు మాటలనుంచి కేబినెట్ వేటు దాకా.. ఆగస్టు 16న సీఎం రేవంత్రెడ్డి పరకాల పర్యటన తర్వాత చోటుచేసుకున్న పలు ఘటనలు కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపునకు నాంది పలికాయి. సురేఖ జన్మదినం సందర్భంగా ఆగస్టు 19న ఆమె కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అధిష్టానం సీరియస్గా తీసుకుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ వర్గాల్లో మాత్రం సురేఖ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సురేఖపై ఈ ఒక్క అంశమే కాకుండా.. మరికొన్నింటితో కూడిన ఫిర్యాదుల ఫైల్ అధిష్టానం ముందుకు వెళ్లినట్లు ప్రచారం. కూతురు చేసిన వ్యాఖ్యల వివాదంపై రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సైతం సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన కేసు, అందులో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సురేఖ స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితి లేదని భావించి బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇప్పటికై తే ఇంతే.. ఎమ్మెల్యేగా సురేఖ మంత్రి పదవి పోయినా.. సురేఖ రాజకీయ ప్రస్థానం ముగి సినట్లు కాదు. ఇప్పటికే ఈ విషయమై మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తానేమీ తప్పు చేయలేదని, పదవిపోతే బాధ పడాల్సిన అవసరం లేదన్న ఆమె.. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నా రు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినప్పటికీ సోనియా, రాహు ల్, ప్రియాంకా గాంధీలంటే ఇష్టమన్న ఆమె.. ఎమ్మెల్యేగా తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమనడం ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై ఈ పరిణామాలు భవిష్యత్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ‘పరకాల’నుంచి మొదలైన మాటల దాడి.. ఎమ్మెల్యేల నివేదికలతో ముదిరిన పంచాయితీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో కీలక మలుపు ఉత్కంఠ రేపిన ఢిల్లీ మంతనాలు.. చివరకు కేబినెట్నుంచి వేటు 18రోజులపాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు -
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
వుులుగు: విద్యార్థులకు అత్యుత్తమ విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్ అన్నారు. ఐఐటీ–హైదరాబాద్, టీఎస్–హైదరాబాద్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థులకు మెరుగైన విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీలో గురువారం 2026–27 విద్యా సంవత్సర ఇండక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఐటీ–హైదరాబాద్ అధ్యాపకులు బీటెక్ విద్యార్థులకు నేరుగా బోధించనున్నారని, టీఎస్–హైదరాబాద్ నిపుణులు ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సు నిర్వహించనున్నారని తెలిపారు. విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసే నాటికి ఉద్యోగాలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. రానున్న అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఏడాదిలో క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఐఐటీ–హైదరాబాద్ స్టార్టప్, ఇన్నోవేషన్ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుతూ పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ప్రకాశ్, బీఎస్ మూర్తి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్ -
మేయర్ తర్వాత.. ‘కుడా’ చైర్!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పదవులు రావడం.. పోవడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరిని మాత్రం అదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణి పరిస్థితి ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ మేయర్ పదవినుంచి మాజీ అయిన ఆమెకు.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కీలక పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ‘కుడా’ (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఆమెను వరించింది. టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా, బీఆర్ఎస్ హయాంలో మేయర్గా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇప్పుడు ‘కుడా’ చైర్పర్సన్ పదవి వరించింది. కాగా, ప్రస్తుతం ఈ పదవిలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి సుధారాణికి బాధ్యతలు అప్పగించారు. సురేఖ బర్తరఫ్.. సమీకరణాల్లో మార్పు కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గంనుంచి తప్పించడంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న గుండు సుధారాణికి రాజకీయంగా కీలక పదవులు కొత్తేమీ కాదు. గ్రేటర్ వరంగల్ మేయర్గా పనిచేసిన ఆమె.. ఇటీవల మేయర్ పదవీకాలం ముగియడంతో ఆ పదవికి వీడ్కోలు పలికారు. దీంతో ఇక ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ జరుగుతున్న సమయంలోనే మరో కీలక బాధ్యత దక్కడం విశేషం. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణికి ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చిన’ పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆమెకు ‘అదృష్టం మరోసారి వరించింది’ అన్న చర్చ సాగుతోంది. ఇంటివద్ద సంబురాలు వరంగల్ చౌరస్తా : కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం రామన్నపేటలోని సుధారాణి ఇంటి ఎదుట బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. గుండు సుధారాణికి మరో కీలక పదవి.. ‘కుడా’ చైర్పర్సన్గా నియామకం సురేఖ బర్తరఫ్తో మారిన సామాజిక సమీకరణలు పద్మశాలి వర్గానికి మళ్లీ ప్రాధాన్యం.. సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా పదవి ఇచ్చి నాపై సీఎం రేవంత్రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. ఆయనకు కృతజ్ఞతలు. బీసీల అభ్యున్నతి, మహిళా సాధికారతకు కృషి చేస్తా. నా నియామకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఏఐసీసీ, టీపీసీసీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు. – గుండు సుధారాణి -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఏటూరునాగారం: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఽసీతక్క అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుస్తులు, జూట్ బ్యాగుల తయారీ యూనిట్ను గురువారం పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి మంత్రి ప్రారంభించారు. కుట్టుమిషన్ల ద్వారా ఆర్థికంగా ఆదాయం పొందాలన్నారు. రూ.10 లక్షలతో ఆధునిక మిషనరీలతో యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. అనంతరం ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని క్రాస్రోడ్డులో ఐటీడీఏ భవనానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. భవన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఐటీడీఏ సమావేశపు గదిలో మండల పరిధిలో 1,219 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను మంత్రి అందజేశారు. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలో తొలిసారిగా ఎంపిక చేసిన 11 ఉత్తమ పాఠశాలలకు అవార్డులు, పది మందికి ల్యాప్టాప్లు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జనార్దన్, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఎస్డీసీ ప్రతాప్ పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ములుగు: నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాలు సాధించేలా ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందనున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను సీతక్క గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రాథమిక శారీరక కొలతల పరీక్షలకు 300 మంది హాజరు కాగా 250 మంది శిక్షణకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతీజ్ ఉత్సవాల్లో మంత్రి నృత్యం..ములుగు పట్టణంలో బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క స్థానిక మహిళలు, యువతులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ బంజారా ఆలయానికి రూ. 50 లక్షలు కేటా యించినట్లు తెలిపారు. బంజారా సోదర, సోదరీ మణులకు మంత్రి తీజ్ శుభాకాంక్షలు తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల కష్టాలు
గోవిందరావుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కాకులమర్రి లక్ష్మణ్బాబు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఆరోపించారు. రైతు సమస్యలు, సాగునీరు, విద్యుత్, యూరియా కొరత, రైతు బీమా, రుణమాఫీ తదితర అంశాలపై గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుభరోసా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎడ్లబండిపై ప్రారంభమైన ర్యాలీ పీఎస్ఆర్ గార్డెన్ వరకు కొనసాగింది. అనంతరం వారు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మండలంలో లక్నవరం సరస్సు ఉన్నప్పటికీ రైతులు పంటలు సాగు చేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు. 2024లో వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్ట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లు వంటి పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్నాయక్, జంపన్న, వినయ్, పృథ్వీరాజ్, రవీందర్, రఘు, కృష్ణ, ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ బాబు, బడే నాగజ్యోతి -
ఈవీఎంల గోదాం తనిఖీ
ములుగు: జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్ర త, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా రిజిస్టర్లను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ఉండరాదని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎండీ. సలీం, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంటేషన్ పరిశీలించిన సీసీఎఫ్ ప్రభాకర్ వాజేడు : మండల పరిధిలోని పేరూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ను కాళేశ్వరం సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ గురువారం పరిశీలించారు. గ్రామ సమీపంలో 35 హెక్టార్లలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు పెంచుతుండగా మొక్కల ఎదుగుదల, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఎదగడానికి చేపట్టాల్సిన చర్యలతో పాటు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఆయన వెంట ములుగు డీఎఫ్ఓ వికాస్ మీనా, వెంకటాపుర(కె) ఎఫ్డీఓ ద్వాలియా, వాజేడు రేంజర్ నరేందర్, సెక్షన్ ఆఫీసర్ నారాయణ, ఎఫ్బీఓ పద్మ తదితరులు ఉన్నారు. ‘ఆరుతడి పంటలు సాగుచేయాలి’ ములుగు: నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే రైతులు ఆయిల్పామ్, పండ్ల తోటలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆత్మ చైర్మన్ కొండం రవీందర్రెడ్డి సూచించారు. మండల పరిధిలోని భూపాల్నగర్లో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో గురువారం ఆయిల్పామ్ సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుకు అవసరమైన నీటి వసతిపై రైతులు ముందుగానే దృష్టి సారించాలన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టేందుకు రైతులు చిన్న నీటికుంటలను నిర్మించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించుకోవడం ద్వారా పంటలకు అవసరమైన నీటి లభ్యతను పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు, సర్పంచ్ నాగిడి రమణారెడ్డి, మండల వ్యవసాయ అధికారి నల్లెల్ల శ్రీధర్, ఏఈఓ కావ్య, ఆత్మ సభ్యులు, ఆయిల్పామ్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. సాంకేతికతతో పరిశ్రమలకు లాభాలు ములుగు: పరిశ్రమలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టి సౌరవిద్యుత్, ఇతర హరిత సాంకేతికతలను వినియోగించుకుని నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్కుమార్ అన్నారు. రీచ్ ఆధ్వర్యంలో ములుగులో గురువారం నిర్వహించిన ర్యాంప్, గ్రీనింగ్, ఎంఎస్ఎంఈఎస్ అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. రైస్ మిల్లులతో పాటు అన్ని ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే సాంకేతికతలను అవలంభించాలని సూచించారు. సౌర విద్యుత్ వినియోగంతో ఖర్చును తగ్గించుకోవచ్చని, తద్వారా పరిశ్రమల పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి, రీచ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ చరణ్, తదితరులు పాల్గొన్నారు. -
టీకాల వివరాల నమోదు తప్పనిసరి
ములుగు: వ్యాధి నిరోధక టీకాల వివరాలను యు–విన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్య కార్యకర్తలకు యు–విన్ పోర్టల్పై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ గోపాల్రావు హాజరై మాట్లాడారు. టీకాల వివరాలను యు–విన్ యాప్లో నమోదు చేయాలన్నారు. తద్వారా తదుపరి టీకా డ్యూ డేట్, టీకా కేంద్రం బుకింగ్తో పాటు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చని వివరించారు. జాతీయ టీకాల షెడ్యూల్ ప్రకారం పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వరకు పిల్లలకు అన్ని టీకాలు వేయించాలని వెల్లడించారు. దీంతో వ్యాధుల నుంచి పిల్లలు రక్షణ పొందుతారని డీఎంహెచ్ఓ వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఫణీంద్ర, నాగ అన్వేష్, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
పోచమ్మకు బోనాలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలో పోచమ్మతల్లి బోనాల పండుగను ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఇంటి వద్ద నుంచి బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తుల నృత్యాలతో మహిళలు పోచమ్మ తల్లి గుడికి చేరుకుని మొక్కులు సమర్పించారు. ముందుగా బొడ్రాయికి తొలి మొక్కులు చెల్లించి, కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలను సమర్పించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నేడు మంత్రి పర్యటన ఏటూరునాగారం: నేడు(గురువారం) మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు దేవులపల్లి విజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాళేశ్వరం(మల్హర్): మల్హర్ మండలం నాచారం గ్రామపంచాయతీని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్సన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఫాంపాండ్ పనులను సందర్శించి కూలీలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ రజినీకాంత్, ఎంపీఓ మల్లికార్జున్, ఏపీఓ గిరి హరీశ్ పాల్గొన్నారు. మలేషియాలో ఉద్యోగాలకు అవకాశం భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ, తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మలేషియాలో వివిధ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియాలో అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో హౌస్ వర్కర్, పైప్ ఫిట్టర్, స్వీపర్, కుక్, ఎక్స్కవేటర్–బ్యాక్హో ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు అర్హులని అన్నారు. అభ్యర్థుల వయస్సు 20నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు. నైపుణ్యం కలిగిన వారికి నెలకు రూ.40వేల నుంచి రూ.47వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు వసతి, ఇతర సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉంటాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం టీఓఎంసీఓఎం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని లేదా 080 35524946 నంబర్లో వివరాలు తెలుసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు. నిబంధనల మేరకు షాపులు నిర్వహించాలి గణపురం: ప్రభుత్వ నిబంధనల మేరకు మెడికల్ షాపులు నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని ఆదేశించారు. బుధవారం గణపురం మండలకేంద్రంలో పలు మెడికల్ షాపులను ఆమె తనిఖీ చేశారు. షాపులలో మందులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్హత కలిగిన ఫార్మసిస్టులు మెడికల్ దుకాణాలలో ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే మందుల విక్రయాలు చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నారన్నా విషయం తెలుసుకున్న పలువురు మందుల షాపులను మూసివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఓవర్’ లోడ్.. భారీ మూల్యం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇసుక లారీల్లో ఓవర్లోడ్కు ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇసుక రవాణాలో నిర్ణీత సామర్థ్యానికి మించి తరలించే ప్రతీ మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఒకే వాహనం రెండు సార్లకు మించి ఓవర్లోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఆ వాహనాన్ని తదుపరి బుకింగ్లకు బ్లాక్ చేయనున్నారు. మైన్స్ సర్వేలెన్స్ సిస్టం ద్వారా ఓవర్లోడ్ను గుర్తించి జరిమానాను ఆన్లైన్లో వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 28లో స్పష్టం చేసింది.ఈ నిబంధనలతో ఉమ్మడి జిల్లాలోని రీచ్లనుంచి అదనపు ఇసుక తరలించే వందలాది లారీలకు చెక్పడనుంది. కొన్ని రీచ్ల్లో నేరుగా భారీ వాహనాల్లో ఇసుక లోడ్ కాకుండా రీచ్ నుంచి స్టాక్యార్డుకు ట్రాక్టర్లు/చిన్న వాహనాల ద్వారా తరలించి, అక్కడినుంచి లారీల్లోకి రీలోడ్ చేసే విధానం ఉంది. తాడిచెర్ల తాజా టెండర్లలోనూ రీచ్ నుంచి స్టాక్యార్డుకు ఇసుక తరలించి, తిరిగి లారీల్లోకి లోడ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అందువల్ల కొత్త నిబంధన కేవలం లారీ డ్రైవర్పైనే కాకుండా రీచ్–స్టాక్యార్డు–లోడింగ్–రవాణా మొత్తం వ్యవస్థపై జాగ్రత్త పెంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఓవర్లోడ్ పూర్తిగా నియంత్రితమైతే ఒక్క ట్రిప్పులో తరలించే ఇసుక పరిమాణం తగ్గుతుంది. మరోవైపు రోడ్లపై ఒత్తిడి, రోడ్డు నష్టం, ప్రమాదాల ముప్పు తగ్గే అవకాశం ఉంది. కొత్త జీఓతో అసలు సమస్య ఓవర్లోడ్ చేసే లారీలకే. ఒక లారీలో నిర్ణీత పరిమితికి మించి టన్ను ఇసుక ఉంటే రూ.2వేల జరిమానా. 3 టన్నులు అదనంగా ఉంటే రూ.6వేలు, ఐదు టన్నులు అయితే రూ.10వేలు.. అంటే ఒక్క ట్రిప్పులో ఎక్కువ ఇసుక వేసుకుని అదనపు ఆదాయం పొందాలనుకునే ప్రయత్నం జరిమానాతో పోలిస్తే నష్టదాయకంగా మారే అవకాశం ఉంది. జీఓ ప్రకారం జరిమానా అదనంగా తరలించిన ఇసుక పరిమాణంపై విధించనున్నారు. లారీ యజమానులకు ఇది మరింత కీలకమైన నిబంధన. రెండుకంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉల్లంఘనలు గుర్తించిన వాహనాన్ని సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో తదుపరి బుకింగ్ల నుంచి బ్లాక్ చేయనున్నారు. రెండు కంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉల్లంఘనలు నమోదైతే ఆ వాహనంతో టీజీఎండీసీ ఇసుకను బుక్ చేసుకునే అవకాశమే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఉమ్మడి వరంగల్లోని ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు సాగుతున్నాయి. టీజీఎండీసీ వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలో టీజీఎండీసీ రికార్డుల్లో మారికాల, సూరవీడు, ముత్తారం, కొండాపురం, కొరకల్లు వంటి ఇసుక రీచ్ల వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు మారికాల రీచ్కు1,59,680 మెట్రిక్ టన్నులు, కొరకల్లు రీచ్కు 99,948 క్యూబిక్ మీటర్ల పరిమాణం కేటాయించారు. సూరవీడు రీచ్కు 70 వేల క్యూబిక్ మీటర్లు, ముత్తారం రీచ్కు 99,400 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. జేఎస్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఇసుక డీ–సిల్టేషన్ పనులకు టీజీఎండీసీ టెండర్లు పిలిచింది. తాడిచెర్ల–1, తాడిచెర్ల–2 రీచ్లలో సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డీ–సిల్టేషన్కు సంబంధించిన టెండర్ అయ్యింది. ఆయా రీచ్ల నుంచి ఇసుక తరలించే లారీలకు శ్రీఓవర్లోడ్శ్రీ నిబంధన ప్రభావం పడనుంది. దీంతో ఇసుక వ్యాపారుల, లారీ ఓనర్ల లెక్కలు తారుమారు కానున్నాయి. రెండుసార్లు ఓవర్.. మూడోసారికి బుకింగ్ కట్ రీచ్ నుంచి స్టాక్యార్డు.. అక్కడినుంచి లారీ వరకు నిఘా కొత్త నిబంధనలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం తారుమారు కానున్న వ్యాపారుల లెక్కలు -
వైఎస్సార్ సంక్షేమ పథకాలు మరువలేనివి
ములుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో వైఎస్సార్ వర్ధంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంక్షేమ స్వర్ణయుగంగా నిలిచిపోయిందన్నారు. 2004 నుంచి 2009 వరకు ఆయన పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అత్యవసర సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, రూ.2లకే కిలో బియ్యం, వృద్ధాప్య పింఛన్లు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవానన్రెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
పూజా కార్యక్రమాలకు ఇబ్బంది పడుతున్నాం..
సమ్మక్క గుడి, సారలమ్మ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్నాం. ఆలయాలు చిన్నవిగా ఉండటంతో పూజలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతర సమయంలో భక్తుల రద్దీతో సమస్య మరింత పెరుగుతుంది. నూతన ఆలయాలను త్వరగా నిర్మించి 2028 జాతర నాటికి పూర్తి చేయాలి. మంత్రి సీతక్క చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి. నూతన ఆలయాలు అందుబాటులోకి వస్తే పూజారుల ఇబ్బందులు తొలగడంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. –కొక్కెర కృష్ణయ్య, సమ్మక్క పూజారి● -
2028 జాతర నాటికి పూర్తయ్యేనా?
మేడారం మహాజాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో సమ్మక్క గుడి, సారలమ్మ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో జాతరకు ముందే నూతన ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం కొత్త ఎస్టిమేషన్ రూపొందించి ఆమోదం కోసం పంపిన నేపథ్యంలో ప్రక్రియ పూర్తయి పనులు త్వరగా ప్రారంభిస్తే 2028 మేడారం జాతర నాటికి నిర్మాణాలను పూర్తి చేసే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి(ఫైల్)ఎస్ఎస్తాడ్వాయి: వనదేవతల నూతన ఆలయాల నిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది. మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. కోటి నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్ కోట్ చేసిన రేట్లు, ప్రస్తుత అంచనా వ్యయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో టెండర్ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కొత్త రేట్లతో ఎస్టిమేషన్ రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి సమర్పించినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. సంబంధిత అధికారులు పరిశీలించి ఆమోదించిన అనంతరం సీఎం కార్యాలయం నుంచి ఫైల్ రాగానే మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెబుతున్నారు. వనదేవతలకు నిత్యం పూజలు మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో జాతర సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వనదేవతలకు సంబంధించిన పూజలు, ఇతర ఆచార కార్యక్రమాలు ఇక్కడే కొనసాగుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయాలు చిన్నవిగా ఉండటంతో పూజా కార్యక్రమాల నిర్వహణలో పూజారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. మహాజాతర సమయంలో జాతరకు రెండు వారాల ముందు నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఆలయాల్లో పూజలు నిర్వహించిన తర్వాతనే కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెలకు తీసుకురావడం ఆనవాయితీ. ఇంత ప్రాధాన్యత ఉన్న అమ్మవార్ల ఆలయాల నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యమెందుకని పూజారులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ గుడులకు రూ.కోటి మంజూరు టెండర్ రద్దుతో నిలిచిపోయిన పనులు ఇరుకై న ఆలయాల్లో పూజలు ఇబ్బంది పడుతున్న పూజారులు -
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి
మంగపేట: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి బోధనా విధానాన్ని పరిశీలించారు. పాఠశాలలో అందుతున్న విద్యా సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం, ప్రయోగాత్మక బోధన తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు పాఠశాల యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ ఎంఈఓ పొదెం మేనక, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకటస్వామి, ఉల్లాస్ కోఆర్డినేటర్ కృష్ణబాబు, జీసీడీఓ రజిత పాల్గొన్నారు. 18 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ములుగు: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, బండారుపల్లిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, బాలికల వసతిగృహంలో ఖాళీగా ఉన్న 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు జిల్లా వాసులై ఉండాలని తెలిపారు. ఏఎన్ఎం పోస్టుకు ఇంటర్తో పాటు ఏఎన్ఎం శిక్షణ, ప్రధాన వంటమనిషికి పదో తరగతితో వంట అనుభవం, వాచ్మెన్ పోస్టులకు పదో తరగతి, సహాయ వంటమనిషి, పారిశుద్ధ్య సిబ్బందికి ఏడో తరగతి ఉత్తీర్ణత ఉండాలని వెల్లడించారు. దరఖాస్తులను సంబంధిత ఎంఈఓ కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని వివరించారు. పూర్తి వివరాలకు బాలికల విద్యాభివృద్ధి అధికారి బి. రజితను సెల్ నంబర్ 9666294715లో సంప్రదించాలని డీఈఓ సూచించారు. డీఈఓ సిద్ధార్థరెడ్డి -
పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు
ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2026–2027 సీజన్కు సంబంధించిన పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు జిన్నింగ్ మిల్లుల్లో బేళ్ల కోసం టెండర్లు పిలిచి పూర్తి చేసింది. గతంలోని ధరలతోపాటు ఇతర నిబంధనలతో ఒకే టెండర్ ప్రకటన ఇచ్చే వారు. ఈ సీజనల్లో తొలివిడత ధరల ప్రస్తావన లేకుండా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని టెండర్ ప్రకటన వచ్చింది. మరో రెండు నెలల్లో పత్తి పంట చేతికొచ్చి క్రయవిక్రయాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో వ్యాపారులతోపాటు సీసీఐ పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది 7.24 లక్షల ఎకరాల్లో పత్తిసాగు.. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో పత్తి సాగు సుమారు 7.24 లక్షలకు పైగా ఎకరాలకు చేరుకుంది. 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసే సీసీఐ.. పత్తిలో గింజలు తీసి బేళ్లుగా మార్చి ఎగుమతి చేయడానికి ఏటా టెండర్లు ఆహ్వానిస్తుంది. అదే తరహాలో టెండర్లను పిలిచింది. గత ఏడాది 6.53 లక్షల బేళ్లను సిద్ధం చేసి ఎగుమతి చేసింది. ఈ సీజనల్లో పత్తి క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెండర్లు పూర్తిచేసిన సీసీఐ 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 కేంద్రాలు ఏర్పాటు 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారుల అంచనాఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ములుగు, కేసముద్రం–ఏ, బీ, తొర్రూరు, మహబూబాబాద్, కాటారం, చిట్యాల, భూపాలపల్లి, కొడకండ్ల, నర్సంపేట, జనగామ–ఏ,బీ, ఘన్పూర్, ఆత్మకూరు, రాంపూర్, పరకాల, ఎల్కతుర్తి, వరంగల్–ఏ,బీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఈసారి కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రాల వారీగా కొనుగోలు చేసే పత్తిని బేళ్లుగా మార్చేందుకు ఏటా జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంటున్నారు. జిన్నింగ్ మిల్లులు, గిడ్డంగులు, బేళ్ల రవాణాకు వాహనాలు, తాత్కాలిక ఉద్యోగులు తదితర వాటికి కూడా టెండర్లను ఆహ్వానించినట్లు మార్కెటింగ్ శాఽఖ అధికారులు తెలిపారు. పత్తిని బేళ్లుగా మార్చేందుకు జిన్నింగ్ మిల్లులు అద్దెకు.. -
12న జాతీయ లోక్అదాలత్
ములుగు: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12న శనివారం జిల్లాలోని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.చండీశ్వరి దేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్లో రాజీపడదగిన క్రిమినల్, సివిల్, ప్రీ–లిటిగేషన్ కేసులతో పాటు బ్యాంకు, విద్యుత్, భూ తగాదాలు, వివాహం–కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, చిట్ఫండ్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ నెల 12న లోక్ అదాలత్కు హాజరై తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ జిల్లా కేంద్రంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో కాంగ్రెస్ ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు శివారులోని డీఎల్ఆర్ ఫంక్షన్హాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వరకు కొనసాగింది. అనంతరం ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు ఆరోపించారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి.. 1000 రోజులు దాటినా అమలు చేయలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి, జిల్లా నాయకులు గోవింద్ నాయక్, మల్కా రమేశ్, భూక్య జంపన్న, మహేశ్, విజయ్, మల్లారెడ్డి, వలిబాబా, ఖాజాపాషా, తాడూరి రఘు తదితరులు పాల్గొన్నారు. 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీ -
కర్రెగుట్టల్లో పేలిన ల్యాండ్మైన్.. మావోయిస్టుల పనేనా?
సాక్షి, ములుగు: ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న ల్యాండ్మైన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కర్రెగుట్టల్లో ఇంకా మందుపాతరలు ఉన్నాయా? అనే ఆందోళన నెలకొంది.వివరాల మేరకు.. వెంకటాపురం మండలం నూగురు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం ఆవులు మేపేందుకు కర్రెగుట్ట అడవి ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ అడవిలో అమర్చిన ల్యాండ్మైన్పై అడుగుపెట్టడంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడు ఘటనతో నూగురు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.పేలుడుకు సంబంధించిన సమాచారం అందుకున్న గ్రామస్తులు కాలినడకన అడవిలోకి వెళ్లి నాగేశ్వరరావు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. అయితే, ఆపరేషన్ కగార్కు ముందు కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.ఇదీ చదవండి: బైనాక్యులర్ ఎందుకు ఎత్తుకెళ్లారు? -
‘గొల్లల గుడి’కి అరుదైన గుర్తింపు
సాక్షి, ములుగు జిల్లా: పాలంపేటలోని ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్ఐ) జారీ చేసిన గెజిట్ ఆఫ్ ఇండియా (ప్రత్యేక సంచిక) పార్ట్- IIలోని సెక్షన్ 3 ఉప సెక్షన్ (ii) కింద ప్రచురితమైంది.“ప్రాచీన కట్టడాలు-పురావస్తు ప్రదేశాలు-అవశేషాల చట్టం-1958” (1958నాటి 24వ చట్టం)లోని సెక్షన్ 4, ఉప-సెక్షన్ (3) కింద సంక్రమించిన అధికారాల మేరకు ‘ఏఎస్ఐ’ ఈ ప్రకటన జారీ చేసింది. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా కనిపిస్తుంది. దీని ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది.ఈ ప్రధాన ఆలయానికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది. -
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
హనుమకొండ uవరంగల్ uజనగామ uములుగు uమహబూబాబాద్ uభూపాలపల్లి uఆరు జిల్లాల్లోని పాఠశాలలకు రూ.643.20 లక్షల నిధులు ● జీరో నుంచి 10 మంది విద్యార్థులుంటే కేటాయింపుల్లేవువిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు 2026–27 సంవత్సరానికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు, పీఎంశ్రీ పాఠశాలలకు, జీరో నుంచి 10 మధ్య విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలకు ఈ నిధులు మంజూరు చేయలేదు. పాఠశాలల వారీగా నిధులు ఒకటినుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేల చొప్పున, 31 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది విద్యార్థులుంటే రూ.75 వేలు, 1,000పైన విద్యార్థులుంటే రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు మొత్తం రూ.643.20 లక్షలు గ్రాంటు నిధులు మంజూరు చేశారు. ఈనిధులు వీటికి వినియోగించుకోవాలి.. ● పాఠశాలలకు అవసరమైన స్టేషనరీ చాక్పీస్లు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు తదితరాలు సమకూర్చుకోవడం, పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవడం. ● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల నిర్వహణకు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలలో ఇంటర్నెట్ చార్జీలకు వినియోగించుకోవాలి.. ● కంప్యూటర్లు, ప్రొజెక్టర్ కే–యాన్ టీవీ, తదితర పరికరాల మరమ్మతులకు వినియోగించుకోవాలి. ● తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ వంటి చిన్న చిన్న మరమ్మతులకు వినియోగించుకోవచ్చు. ● తాగునీటి సదుపాయం కల్పించుకునేందుకు కూడా ఈగ్రాంట్లో 10 శాతం మొత్తాన్ని స్వచ్ఛత, యాక్షన్ప్లాన్లో భాగంగా చేతులు కడుక్కునేందుకు లిక్విడ్ సోప్, టాయిలెట్ శుభ్రపర్చే సామగ్రి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ● దివ్యాంగ విద్యార్థులున్న పాఠశాలల్లో, పాఠశాల ఆవరణలో సురక్షితమైన అవరోధాలు లేని ప్రవేశం కోసం రెయిలింగ్ ఇతర చిన్న సదుపాయాల కోసం గ్రాంటు నుంచి నిధులు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలల్లో ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రపర్చాలి. శానిటైజ్ చేయాలి. తగిన వెంటిలేషన్లో డిస్ ఇన్స్పెక్ట్ చేయాలి. ● సబ్బు, హ్యాండ్ శానిటైజర్, క్లోరిన్ సొల్యూషన్ ఇతర శుభ్రపర్చే సామగ్రిని ఎల్లప్పుడూ నిల్వ ఉంచాలి. ● గ్రాంట్ వినియోగానికి సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) తీర్మానం చేసి రికార్డుల్లో పేర్కొనాలి. ● గ్రాంటును మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా వినియోగించే బాధ్యత హెచ్ఎం/ప్రిన్సిపాళ్లదే.. మొత్తం పాఠశాలలుమొత్తం గ్రాంటు (లక్షల్లో) -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ఐటీడీఏలో అర్జీలు స్వీకరిస్తున్న పీఓ ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న డీఆర్ఓ ● డీఆర్ఓ రవికుమార్ ములుగు: ప్రజావాణిలో సమర్పించిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సత్వరం పరిష్కరించాలని డీఆర్ఓ రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తంగా 33 దరఖాస్తులు రాగా వాటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్లు 4, పింఛన్లపై 2, ఇతర శాఖలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్ఓ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గిరిజన దర్బార్లో 8 వినతులు ఏటూరునాగారం: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన 8 వినతులు రాగా పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు. వినతుల్లో ప్రధానంగా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరులో పట్టాలో వారసత్వం మార్పిడి చేయాలని గిరిజనుడు విన్నవించారు. వెంకటాపురం(కె) ముత్తారంలోని గిరిజన పాఠశాలల్లో ఏఎన్ఎంగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఓ గిరిజన మహిళ కోరారు. తాడ్వాయి మండలం బయ్కక్కపేట గ్రామానికి చెందిన ఓ క్రీడాకారుడు పారా నేషనల్ గేమ్స్లో పాల్గొనేందుకు ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. అలాగే వివిధ సమస్యలపై వచ్చిన వినతులు పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు. -
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా చండీశ్వరి దేవి
ములుగు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.చండీశ్వరి దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆమె ములుగు న్యాయ సేవాధికార సంస్థకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. లోక్ అదాలత్లు, న్యాయ అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న వివిధ న్యాయ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు అందేలా అధికారులు, సిబ్బంది, ప్యానెల్ న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మై భారత్ వలంటీర్గా మమన్యాదవ్ములుగు: మండల పరిధిలోని కాసిందేవిపేట గ్రామానికి చెందిన మేడుదుల మమన్యాదవ్ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ యూత్ వలంటీర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మమన్యాదవ్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ, యువత అభ్యున్నతికి పాటు పడుతానని వివరించారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేస్తానని వెల్లడించారు. 36 వాహనాలకు వేలం ములుగు: జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వేర్వేరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 36 వాహనాలకు సోమవారం జిల్లా ప్రొహిబిషన్న్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆవరణలో వేలం నిర్వహించారు. ఇందులో 27 వాహనాలను తుక్కుగా, మరో 9 వాహనాలను రోడ్డు వర్తిగా వేలం నిర్వహించారు. తుక్కు వాహనాల ద్వారా రూ.1.30 లక్షలు, రోడ్ వర్తి వాహనాల ద్వారా రూ.1.98 లక్షలు కలిపి మొత్తం రూ.3.28 లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు ములుగు ఎకై ్సజ్ సీఐ ఎం.సుధీర్ కుమార్ తెలిపారు. అదే విధంగా జీఎస్టీ రూపంలో రూ.59,040 వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు సీఐ వెల్లడించారు. సంచార జాతుల అభ్యున్నతికి కృషిములుగు: సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రామ్మోహన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల విమోచన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతులు, విముక్తి జాతుల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని తెలిపారు. సంచార జాతుల ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా విద్యావంతులను చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ఈ కార్యక్రమంలో సంచార జాతుల జిల్లా అధ్యక్షుడు బాణాల రాజుకుమార్ , పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు ముదురుకోళ్ల సదానందం, వీరభద్రీయ కుల సంఘం ములుగు మండల అధ్యక్షుడు బాణాల శంకర్ పాల్గొన్నారు. -
వడివడిగా భూ సర్వే
సాక్షి, మహబూబాబాద్ : ‘ఏ గ్రామంలో చూసినా భూ సమస్య కనిపిస్తోంది. భూమి ఒకరికి, హక్కు మరొకరికి అన్నట్లు ఉంది. వీటన్నింటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన భూ సర్వేను వడివడిగా చేయాలి. ఈ ప్రక్రియను తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారిపై వేటు తప్పదు’ అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెవెన్యూ, రీ–సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం ఆయన మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. భూ సర్వేలో నిర్లక్ష్యం వద్దు.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను లక్ష్యంగా ఎంపిక చేసి మొదటి విడత భూ సర్వేను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ అంగుళం భూమిని వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ ఆస్తుల వారీగా శాసీ్త్రయంగా సర్వే చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 31 నాన్–కెడస్ట్రల్ గ్రామాలకుగాను 18 గ్రామాల్లో రీ–సర్వే పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 13 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన 13 గ్రామాల్లో, భూపాలపల్లి జిల్లాలో 8, జనగామ జిల్లాలో 5 గ్రామాల్లో సర్వే పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. సర్వే గ్రామాలను తహసీల్దార్లు ప్రతీరోజు, నెలలో ఐదు రోజులు ఆర్డీఓలు, మూడు సార్లు కలెక్టర్లు పరిశీలించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను ఏమాత్రమూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల నిర్మాణాలు పూర్తిచేయాలి జూలై 7న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నర్సంపేట, పరకాల, ములుగు, జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో ఐదు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలు, వరంగల్లో ఒక డీఐజీ కార్యాలయం మంజూరైనట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా పలివేల్పులలో డీఐజీ కార్యాలయం కోసం ఎకరం 20 గుంటల ఎస్సారెస్పీ స్థలాన్ని కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పరకాలలో నూతన భవన నిర్మాణం 7 శాతం పూర్తయిందని తెలిపారు. భీమదేవరపల్లి, పరకాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హౌసింగ్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం వద్దు జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లాలో 4,600 ఇళ్లు మంజూరు కాగా 3,946 ఇళ్లకు ప్రాసెస్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు 854 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ములుగు జిల్లాలో కూడా ఇళ్ల పూర్తిశాతం 50 శాతానికిలోపే ఉందని పేర్కొన్నారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ 15నాటికి గరిష్ట సంఖ్యలో పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్లు శ్రీకాంత్ రెడ్డి, ప్రకాశ్, లాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్గాంధీ హన్మంతు, భూ భారతి డైరెక్టర్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతమ్, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్ బాజ్పాయ్, సందీప్కుమార్ ఝా, భోర్ఖడే హేమంత్ సహదేవరావు, రాహుల్ శర్మ పాల్గొన్నారు. ప్రతీ అంగుళం శాసీ్త్రయంగా ఉండాలి నిర్లక్ష్యం చేసే అధికారులపై వేటు తప్పదు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం ఉమ్మడి జిల్లా సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరైన మంత్రి సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలుతహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలిపట్టా తె చ్చిన సంబురం..22–ఏ భూముల విషయంలో జాగ్రత్త.. ప్రతీ జిల్లాలో 22–ఏ కింద ఉన్న భూములు ఏవీ? వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఎన్ని? ఇతర వివరాలు ఏమిటి అనే అంశాలను నాలుగు కాలమ్స్తో కూడిన సమగ్ర నివేదికగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేనంబర్ల వారీగా పూర్తి వివరాలను రెండు రోజుల్లో అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు. 22–ఏ జాబితాలో పొరపాటున చేరిన రైతుల భూముల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివా దాలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై, శాసీ్త్రయ పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి సరిహద్దులు నిర్ధారించాలని సూచించారు. -
స్మార్ట్గా రేషన్కార్డు
మహిళల పేరిట కార్డుల ముద్రణములుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్లో లబ్ధిదారులందరికీ పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల పలువురికి కొత్త కార్డులు సైతం మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం 222 రేషన్ షాపుల పరిధిలో 1,02,378 రేషన్ కార్డులు ఉండగా వారందరికీ స్మార్టు కార్డులు అందనున్నాయి. పౌర సరఫరాల శాఖ కార్డులను ముద్రించి రెవెన్యూ శాఖకు అందజేసింది. మండలాల వారీగా వేరు చేసి తహసీల్దార్లకు ఇచ్చారు. త్వరలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీలోపు లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపు పదహారేళ్లుగా నిరుపేదలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా నూతన కార్డులు అందలేదు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పేదలందరికి రేషన్కార్డులు అందాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు లబ్ధిదారులను ఎంపిక చేయటం తప్ప పేదలకు కార్డులు పంపిణీ చేయలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక పలు దఫాలుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ కార్డులు మాత్రం ఇవ్వలేదు. 2013లో కూపన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత వాటిని కూడా ఆపేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా తెల్లరేషన్ కార్డును తప్పనిసరి చేసింది. దీంతో కార్డు అవసరమైన ప్రతీసారి లబ్ధిదారులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించింది. సాధారణ కార్డులు కాకుండా స్మార్టు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏటీఎం కార్డు తరహాలో.. ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్గా రేషన్కార్డు ఉంది. కుటుంబ యజమానురాలు ఫొటోను కార్డుపై ముద్రించి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కార్డుపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల పేర్లు వచ్చేలా తయారు చేశారు. ఎంత మంది సభ్యులు ఉన్నారు. ఏయే నెలలో ఎంత రేషన్ తీసుకున్నారు. తదితర వివరాలన్నీ తెలుస్తాయి. భవిష్యత్లో అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డులనే ప్రామాణికం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 10 మండలాలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలో 222 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,02,378 కార్డులు ఉండగా 2,92,180 యూనిట్లు ఉన్నాయి. ప్రతినెలా 5,259 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ క్వింటాల్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా చార్జీలతో కలిపి కిలోకు రూ.57 వరకు ఖర్చు చేస్తోంది. అయితే కేవైసీ పూర్తి చేసిన వారికే మొదటి విడతలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. మిగతా వారికి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాతే ఇచ్చే అవకాశం ఉంది. మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీవారం రోజుల్లోగా మంత్రి సీతక్క చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ చేసేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం. స్మార్ట్ కార్డులు మండలాల వారీగా సంబంధిత అధికారులకు అందించాం. మహిళల పేరుపై వచ్చిన స్మార్ట్కార్డులు లబ్దిదారులందరికి అందజేస్తాం. – సయ్యద్ షా ఫైజల్ హుస్సేనీ, డీసీఎస్ఓ ● జిల్లాకు చేరిక.. పంపిణీకి కసరత్తు మంత్రి సీతక్క చేతుల మీదుగా అందజేసేందుకు ఏర్పాట్లు


