Mulugu
-
బాధిత కుటుంబాలకు పరామర్శ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన బాల్య నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15వేలు నగదును అందజేశారు. వార్డు సభ్యుడు కొండాయి చిన్ని, చంద్రబాబు, తాడూరి రఘు, మోహన్, శ్రీను, పృద్విరాజ్, హరిబాబు, శ్రీనివాస్, వెంకటస్వామి, మొగిళి పాల్గొన్నారు. 6వ వార్డులో.. మండలంలోని 6వ వార్డుకు చెందిన మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ మాదరి రామయ్య తల్లి లక్ష్మీ ఇటీవల మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు నాయకులతో కలిసి పరామర్శించారు. -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివా రం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వ యంభు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. హేమాచలక్షేత్రం ఆలయ పరిసరాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో పాటు సహజసిద్ధమైన జలపాతాలు ఉండటంతో మండు వేసవిలో భక్తులకు చల్లని ఆహ్లాదాన్ని పంచుతోంది. వివిధ వాహనాల్లో గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
చేపల విక్రయాలు
మంగపేట: మండలంలోని చెరుపల్లి, బాలన్నగూడెం తదితర గ్రామాల్లో ఆదివాసీ గిరిజన మత్స్య సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని చెరువుల్లో చేపలను పట్టి నాలుగు రోజుల నుంచి చెరువుల వద్దనే కేజి రూ.150కి విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో గోదావరి చేపలు కేజీ రూ.300 వందలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చేపలు రూ.200 వందలకు విక్రయిస్తున్నారు. కాగా, తాజా పట్టిన చేపలను కేజీ రూ.150కి విక్రయిస్తుంటడంతో స్థానిక ప్రజలు చెరువల వద్దకు వెళ్లి ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. మొగుళ్లపలి: రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని అకినపల్లి నుంచి అంతడుపుల గ్రామానికి జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్డు ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. నాయకులు పాల్గొన్నారు. ఎన్నిక మల్హర్(కాటారం): ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా అంకుసాపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కర్కా ఉమశంకర్ ఎన్నికయ్యారు. ఆదివారం కాటారంలో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచులందరూ ఉమశంకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు ఉమశంకర్కు ఎన్నిక నియామక ప్రతాన్ని పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి అందించారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి దుద్దళ్ల శ్రీధర్బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుకు ఉమశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. -
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశాంతం
కేయూ క్యాంపస్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–26 ఆదివారం రెండు సెషన్లలో ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని ట్రైసిటీలో ఏర్పాటు చేసిన పది పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించా రు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళా శాల పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఆరుగురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకు మొత్తం అభ్యర్థులు 4,075 మంది అభ్యర్థులగాను 2,762 మంది (67.78 శాతం) హాజరయ్యారు. 1,313 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధి కారులు తెలిపారు. రెండో సెషన్ను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. రెండో సెషన్లో 2,749 మంది అభ్యర్థులు(67.49 శాతం) హాజరుకాగా 1,326 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల తనిఖీ.. హనుమకొండలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, హ నుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ము లుగు రోడ్డులోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశా ల, ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్ ఎల్బీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. యూపీఎస్సీ సెంట్రల్ ఇన్స్పెక్షన్ అ ధికారి శుభం గౌడ్, రాష్ట్రస్థాయి అబ్జర్వర్ టీజీఎన్పీ డీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, రూట్ అధికారులు, త హసీల్దారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. నిమిషం ఆలస్యంతో పరీక్ష కోల్పోయిన ఆరుగురు మొదటి సెషన్కు 67.78 శాతం.. రెండో సెషన్లో 67.49 శాతం అభ్యర్థులు హాజరు -
న్యాయం చేయాలని ఆందోళన
శాయంపేట : మండలంలోని కొత్తగుట్ట సింగారం గ్రామానికి చెందిన కుక్కల సారయ్య (75) గ్రామ శివారులోని పున్నం మల్లారెడ్డి ఆయిల్పాం తోటలో శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం బాధిత కుటుంబ సభ్యులు, బందువులు గూడెప్పాడ్–పరకాల రహదారిపై ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాహనాలు బారీగా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారుతో మాట్లాడారు. ఫిర్యాదు ఇస్తే బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సీఐ సుధాకర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం పోలీసులు సారయ్య మృతదేహానికి పరకాల సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మృతుడి భార్య కుక్కల మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
టాస్క్తో ఉపాధి
ఏటూరునాగారం: గ్రామీణ నేపథ్యం కలిగిన విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)ను ఏర్పాటు చేసింది. ఇందులో యువతకు, ఇంజనీరింగ్, ఇతర గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక టాస్క్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని గతేడాది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి సీతక్క చొరవతో ఈ శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులకు వారివారి స్థాయిలో శిక్షణను ఇచ్చేందుకు ప్రత్యేక కంప్యూటర్లు, ట్రైనర్స్, ఫ్యాకల్టీని నియమించి రోజు వారీగా శిక్షణ ఇస్తున్నారు. ప్రధాన లక్ష్యం.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం టాస్క్ లక్ష్యం. అలాగే ప్రత్యేక సేవలను సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, టెక్నికల్ అంశాలలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. ఈ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతిఏటా వేలాది మంది యువకులు కార్పొరేట్ సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. టాస్క్ అధికార వెబ్సైట్ ద్వారా ఆసక్తి గల విద్యార్థులు, నిరుద్యోగులు, కళాశాలలు రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రత్యేక జాబ్మేళా డిగ్రీ పూర్తి చేసి ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ పొంది.. సాంకేతిక పరిజ్ఙానం కలిగిన నిరుద్యోగులకు రెండు రోజుల క్రితం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రజాపరిపాలన జాబ్మేళా కార్యక్రమాన్ని చేపట్టి 25 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవశాలను కల్పించారు. ఇందులో భాగంగా ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఉద్యోగ నియామక పత్రాలను యువతకు అందజేశారు. వివిధ ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలకు ఎంపికై న జిల్లా అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను అందజేశారు. కార్పొరేట్ స్థాయి కంపెనీల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబ, ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పర్చేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. కంప్యూటర్ శిక్షణకు హాజరైన నిరుద్యోగులుట్రైనర్ క్లాస్ వింటున్న నిరుద్యోగులుసి, జావ, పైతాన్, ఎస్క్యూఎల్, ఫ్రాంట్ ఎండ్ డెవలప్మెంట్, డాటా సైన్స్, డీబీఎంఎస్ వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. అలాగే ఎస్సై, బ్యాకింగ్, పీసీ, గ్రూప్ 3, ఎస్ఎస్సీ, రైల్వేతో పాటు మరిన్ని పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయడమే టాస్క్ లక్ష్యం. మంత్రి సీతక్క చొరవతో గతేడాది ములుగులో ఏర్పాటు ఇటీవల 25 మందికి ఉద్యోగాలు -
పనులు పూర్తయ్యేదెన్నడో?
చీకుపల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న రహదారి పనులుఅసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీలువాజేడు: హైదరాబాద్, భూపాలపట్నం 163 నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండల పరిధిలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు గ్రామం వరకు ఉన్న 10 కిలో మీటర్ల జాతీయ రహదారి(డబుల్ రోడ్డు)ను ఫోర్వే లైన్గా విస్తరిస్తున్నారు. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట డ్రెయినేజీల నిర్మాణం చేపట్టినప్పటికీ ఎక్కడ పూర్తి కాలేదు. అదే విధంగా సర్వీస్ రోడ్డు పనులు సైతం కొనసాగుతున్నాయే తప్ప పూర్తి కావడం లేదు. రహదారి విస్తరణ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారోనని ప్రజలు వాపోతున్నారు. 10 కిలో మీటర్లు రూ.120 కోట్లు జగన్నాథపురం నుంచి చెరుకూరు గ్రామం వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.120 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో 10 కిలో మీటర్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు జూన్ నెలాకరు లోగా పూర్తి అయ్యేలా కనిపించదం లేదు. రానున్న వర్షాకాలం వాగు అవతలి వైపున ఉన్న గ్రామాలతో పాటు అంతర్రాష్ట్ర రాక పోకలకు అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్ల గూడెం గ్రామాల మధ్యన ఉన్న ఇసుక వాగుపై బ్రిడ్జి నిర్మాణం అనివార్యమైంది. దీంతో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ గతంలో ఉన్న పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు. బ్రిడ్జి సమీపంలో మట్టితో రోడ్డు డైవెర్షన్ రోడ్డును వేసి బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను జూన్లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇసుక వాగు అవతలి వైపున ఉన్న సుమారు 20 గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలతో పాటు వ్యవసాయ సంబంధిత వస్తువులు, ఎరువులు, ని త్యావసర సరుకులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోదావరికి వరద వస్తే ఇసుక వాగు ద్వారా వచ్చిన వరద ఇక్కడ తాత్కాలికంగా ని ర్మిస్తున్న రహదారిని ముంచెత్తే అవకాశం ఉంది. అ దే సమయంలో భారీ వర్షాలు పడితే ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తది. దీంతో తాత్కాలికంగా వేసిన రహదారి కొట్టుకుపొయే అవకాశం ఉంది. బ్రిడ్జి నిర్మాణం వర్షాలు పడక ముందు పూర్తి కాక పోతే రాక పోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మండలంలోని సుమారు 20 గ్రామాలతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన రాక పోకలు నిలిచి పోతాయి. బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. నత్తనడకన జాతీయ రహదారి విస్తరణ పనులు ఇబ్బంది పడుతున్న వాహనదారులు -
న్యాయ కళాశాల సాధనే లక్ష్యం
వాజేడు: న్యాయ కళాశాల సాధనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం జీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన న్యాయ కళాశాల సాధన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ యువత చట్టాలు, జీఓలపై అవగాహన కలిగి ఉండాలంటే న్యాయ కళాశాల ఏర్పాటు అవసరమన్నారు. సొంది వీరయ్య ఆధ్వర్యంలో జీఎస్పీ చేసిన అనేక పోరాటాల ఫలితంగా జీవో నంబర్ 3 వచ్చిందని గుర్తు చేశారు. దీని కారణంగా ఏజెన్సీలో 100శాతం ఉద్యోగాలు ఆది వాసీలకే వచ్చాయన్నారు. నేడు అలాంటి జీవోను గిరిజనేతరుల కుట్రలతో కోల్పోయామని ఆరోపించారు. 1/70 చట్టాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా అమలు చేయకుండా ప్రభుత్వాలు ఆదివాసీలపై దండయాత్ర చేస్తున్నట్లు విమర్శించారు. ఏజెన్సీలో 100 శాతం రిజర్వేషన్లను కోల్పోకుండా కాపాడుకోవాలంటే భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఏజెన్సీ చట్టాలు, జీవోలను పరిరక్షించుకునే అవకాశం ఆదివాసీ యువతకు ఉంటుందన్నారు. అనంతరం పలు సంఘాల నాయకులు న్యాయ కళాశాల ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, చట్టాలు, జీఓలపై మాట్లాడారు. అనంతరం గోండ్వానా సంక్షేమ పరిషత్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సదస్సులో జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెంసాయి, ముర్రం వీరభద్రం, ఏఎన్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు నర్సిమూర్తి, నాగరాజు, పూసూరు సర్పంచ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ -
అల్ట్రా మారథాన్ విజయవంతం
ములుగు రూరల్: జిల్లాలోని యువతలో ఆరోగ్యకర జీవన శైలి, ఫిట్నెస్పై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా 50కిలో మీటర్ల అల్ట్రా మారథాన్ ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. మారఽథాన్ రన్నర్ నిఖికుమార్ తన స్వగ్రామం రాయినిగూడెంలో ఆదివారం తెల్లవారుజామున 2.30గంటలకు పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సునీత గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ రన్ రాయినిగూడెం నుంచి జంగాలపల్లి, వెంకటాపురం(ఎం), రామప్ప, బండారుపల్లి మీదుగా ములుగు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నిఖికుమార్ను సీఐ సురేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతనిప్పుల భిక్షపతి, కౌన్సిలర్ ఓం ప్రకాశ్ తదితరులు శాలువా కప్పి అభినందించారు. 108తో అత్యవసర సేవలు భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా 326మందికి 108 అంబులెన్స్ సేవల ద్వారా తరలించినట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. రోగులకు అంబులెన్స్లోనే ప్రీ–హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తూ సమీప ఆస్పత్రులకు సురక్షితంగా తరలిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వడదెబ్బకు గురవుతున్నారని వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలు, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు తీవ్రమైన ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అరటి తోట దగ్ధం టేకుమట్ల: పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో చెలరేగిన మంటలు అంటుకుని అరటి తోట దగ్ధమైన ఘటన మండలంలోని పంగిడిపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత రైతు పారిపెల్లి మహేందర్ కథనం ప్రకారం.. తనకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిలో అరటితోట సాగు చేశాడు. రెండు రోజుల్లో అరటి గెలలను కోసేందుకు సిద్ధమయ్యాడు. ఈ తరుణంలో పరిసర ప్రాంత రైతులు పంట వ్యర్థాలకు అంటించిన నిప్పుతో మంటలు చెలరేగి అరటి తోట మొత్తం దగ్ధమైంది. అరటి తోటపై పెట్టుకున్న ఆశలు అగ్ని రూపంలో ఆవిరయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా దగ్ధమైందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పామాయిల్ తోట దగ్ధం భూపాలపల్లి రూరల్: అగ్ని ప్రమాదంలో పామాయిల్తోట దగ్ధమైన ఘటన భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గొర్లవీడు గ్రామానికి చెందిన చెలిమెల రాజయ్యకు చెందిన సుమారు రెండెకరాల పామాయిల్, సుబాబు తోట ఆదివారం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో విద్యుత్ మోటర్ వైర్లు, డ్రిప్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రికార్డుల తనిఖీ భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని హనుమాన్ దేవాలయంతో పాటు భూపాలపల్లి మండలంలోని కొంపల్లి, ఫుల్లురామయ్యపల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లోని దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యానికి సంబంధించి సోషల్ ఆడిట్లో భాగంగా దేవాదాయ శాఖ అధికారి వరలక్ష్మి ఆదివారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాల వివరాలు పరిశీలించారు. ఆలయాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు సేకరించారు. పుజారులు ఆలయాల్లోని సమస్యలను అధికారి వరలక్ష్మికి వివరించారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని కాటపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2001–02 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. 25 ఏళ్ల అనంతరం ఒకొరినొక్కరు కలిసి తమ బాల్యాన్ని తలుచుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనంతరం వారికి అక్షరాలు నేర్పిన గురువులను శాలువాతో సన్మానించారు. సర్పంచ్ దిడ్డి మోహన్రావు, ఉపాధ్యాయులు ఉపేందర్, బీడీ నాయక్, రాందాస్, ప్రభాకర్, పూర్వ విద్యార్థులు పులి శ్రీలత, తడక పద్మజ, అలివేలు మంగ, సుజాత, స్వప్న, కృష్ణ, శ్రీను, దుగ్గిరాల విజయభాస్కర్, బందెల తిరుపతి, గంగెల్లి విజయ్, పల్లెర్ల గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. -
పచ్చి రొట్టతో భూసారం పెంపు
మల్హర్: పచ్చి రొట్టతో భూసారం పెరుగుందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయితీపై 50 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు మండలంలోని కొయ్యూరు ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వరి, మిరప పంటలు వేసే రైతులు తప్పనిసరిగా ఈ పచ్చి రోట్ట విత్తనాలు తొలకరిలో దుక్కి దున్ని చల్లుకొని 45 రోజుల తర్వాత పూత దశలో భూమిలో కలియదున్నుకుంటే భూమి సారవంతం కావడమే కాక పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. జీలుగ విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫిలతో మండల వ్యవసాయధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఒక బస్తా (30 కిలోల) జీలుగ విత్తనాలు రూ.2452.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరానికి భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్య శిబిరాలను భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మధుసూదన్, ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గోపాల్ రావు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, అత్యవసర సేవల పరిస్థితిపై వివరాలు సేకరించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది విధుల నిర్వహణను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పుష్కరాల కాలంలో భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.భూపాలపల్లి రూరల్: ప్రతీ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ గద్దెలు నిర్మించాలని ఆ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్ మెడల అభిలాష్ గౌడ్ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోటీఆర్ఎస్ పార్టీ గద్దెలు నిర్మాణం చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు కోరారు. జిల్లా ఇన్చార్జ్ నరేష్ నేత, నియోజకవర్గ అబ్జర్వర్ అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు వినోద్,నాయకులు గోవర్దన్, చుక్క రాజు, విగ్నేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: రాజయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన కంపేటి రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. రాజయ్య జీవితం అసలైన కమ్యూనిస్టు ఉద్యమానికి నిదర్శనమని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాలు తరతరాలకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు. అనంతరం రాజయ్య పేరుతో పర్మినెంట్ కార్మికుల కోసం ఒక కార్యాలయం, కాంట్రాక్ట్ కార్మికుల కోసం మరో కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో రాజయ్య స్మారక స్తూపం, స్మారక భవనం నిర్మాణానికి కృషి చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజయ్య కుటుంబ సభ్యులు లక్ష్మి, నాగరాజు, స్వాతి, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రాజయ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘ధాన్యం తడవకుండా కొనుగోలు చేయాలి’
ములుగు: జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కేంద్రాల వద్ద ఉన్న పంట తడవకుండా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గోదాముల కొరత, లారీలు, హమాలీల సమస్య ఉన్న చోట సమస్యను పరిష్కరించాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులు వేగంగా అందేలా ట్యాబ్ ఎంట్రీల డేటా అప్డేట్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారాల్లో సైతం చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో మోసం చేసే వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణం కలుషితం కావడంతో పాటు నేల సారవంతతను కోల్పోతుందని తెలిపారు. ఈ విషయాలపై కలెక్టర్లు రైతులకు అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీడబ్ల్యూవో ప్రేమలత, సీపీఓ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
వసతుల కల్పన భేష్..
పుష్కరాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులుచిట్యాల(కాశేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కల్పించిన వసతులు సంతృప్తిగా ఉన్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో బస్టాండ్కు చేరుకోగానే బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. సరస్వతీ ఘాట్ ఆరంభం నుండి గోదావరి నీటి ప్రాంతం వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం భక్తులకు ఎండ తీవ్రత కలుగకుండా నీడ కోసం పాండాలు ఏర్పాటు చేయడంతో పాటు, వేడి గాలుల నుండి ఉపశమనం పొందేందుకు స్ప్రీంకర్ల చిరుజల్లులతో చల్లని గాలి వస్తుంది. ప్రత్యేకాకర్షణగా బాహుబలి సెట్టింగ్.. సరస్వతీ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాహుబలి సెట్టింగ్ పుష్కరాలకు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. బాహుబలి సెట్టింగ్కు ముందు భాగంలో డయాస్లో సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అదే డయాస్ నుండి పుష్కర ప్రధాన అర్చకులు గోదావరికి హారతి అందించడం వంటి ఘట్టాలకు భక్తులు పులకరించిపోతున్నారు. పుష్కర స్నానం అనంతరం ఆలయ దర్శనానికి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూలైన్ ఏర్పాటు చేశారు. పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.ఏర్పాట్లు బాగున్నాయి..అంత్య పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం వేసిన టెంట్లు, స్ప్రింకర్లు, అన్నదానం, కూలర్లు, తదితర సదుపాయాలు కల్పించారు. అలాగే బస్టాండ్ నుండి పుష్కర ఘాట్ వరకు బస్సు సౌకర్యం చాలా సౌకర్యంగా ఉంది. ఘాట్కు చేరుకునేందుకు ఎండలో నడవడం తప్పింది. – సత్యనారాయణ, భక్తుడు, చంద్రాపూర్ శివయ్య సేవ కోసం వచ్చాం...దైవ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వెళ్తాం. అందులో భాగంగానే కాళేశ్వరంలో నిర్వహిస్తున్న అంత్య పుష్కరాలకు కొరుట్ల నుంచి 50మంది భక్తులం శివయ్య సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రత్యేకంగా సేవ కోసం వచ్చిన తమకు ఆలయ సిబ్బంది అందించిన సహకారం బాగుంది. – లక్ష్మీ, సేవకురాలు, కోరుట్ల -
భానుడి భగభగలు
వెంకటాపురం(కె): మండలంలో భానుడు భగభగలతో తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆదివారం మండలంలో ఎండలు నిప్పల కొలిమిని తలపించాయి. ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందకు భయందోళనలకు గురవుతున్నారు. ఉదయం 6గంటల నుంచి ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వతనే ప్రజలు బయటకు వస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు చెట్ల కింద సేద తీరుతున్నారు. దీంతో మండల కేంద్రంలో రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారాయి.చెట్ల కింద సేద దీరుతున్న మూగ జీవాలుచున్నీలు కప్పుకొని వెళ్తున్న మహిళలు -
బస్టాండ్లోనే బస్సులు
టేకుమట్ల (కాళేశ్వరం): సరస్వతి అంత్య పుష్కరాలకు వేసవి ఎండ ఎఫెక్ట్ తాకినట్టు కనిపిస్తుంది. 44, 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో అంత్య పుష్కరాలకు వెళ్లేందుకు భక్తులు విముఖత చూపుతున్నారు. అధికారుల అంచనాలకు అనుకూలమైన భక్తులు రాలేకపోతున్నరనడానికి బస్టాండ్లోని పుష్కర ఘాటుకు వెళ్లే బస్సులే నిదర్శనం. వివిధ ప్రాంతాల నుంచి బస్టాండ్కు చేరుకున్న భక్తులను బస్టాండ్ నుంచి ఉత్తర ఘాటు వరకు తీసుకెళ్లెందుకు ఉచిత ప్రైవేట్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడి బస్సులు అక్కడే ఉండడంతో పుష్కరాలకు వచ్చే భక్తుల తాకిడి అంతంత మాత్రమేనని తెలుస్తుంది. -
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
ములుగు రూరల్: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పూర్తిగా తగ్గించాలని సీపీఐ జిల్లా నాయకులు అంజద్ పాషా అన్నారు. సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఆదివారం ట్రాలీ ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5పైన పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను సైతం పెంచడంతో నిత్యావసర ధరలు ఆకాశనంటుతున్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తేకుండా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికై నా పెంచిన ధరలు తగ్గించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, కొమురయ్య, బోడ రమేశ్, శ్రీను, ఓదెలు, మల్లేశ్, రవి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పిట్టల్లా రాలుతున్నారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ దంచికొడుతున్నాయి. భానుడు మండిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబా బాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సగటున 42 నుంచి 45 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. పెరుగుతున్న వడదెబ్బ కేసులు.. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా బుధవారం నలుగురు, గురువారం 9, శుక్రవారం 11 మంది, శని వారం ఒక్క రోజే 22 మంది మృతి చెందారు. మొత్తంగా వారం రోజుల్లో 60 మందికిపైగా చని పోయినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, షుగర్, బీపీ బాధితులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రోడ్లు వెలవెల.. ప్రభుత్వపరంగా ఏర్పాట్లు అంతంతే ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ద్విచక్రవాహనదారులు ముఖానికి గుడ్డలు కట్టుకుని ప్రయాణిస్తుండగా.. చల్లని పానీయాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగకు డిమాండ్ పెరిగింది. కాగా, ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చలివేంద్రాలు, తాగునీటి సౌకర్యం తగిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో నీడ, ఓఆర్ఎస్, తాగునీ లేదని కూలీలు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు.. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నా వేడి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల్లో 60 మందికిపైగా మృత్యువాతభూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి ఆకుదారివాడకు చెందిన దుర్గం సమ్మక్క (50) పశువులకు పచ్చిగడ్డి కోసం శుక్రవారం పొలం వద్దకు వెళ్లింది. పచ్చిగడ్డి ఇంటికి తీసుకొచ్చే సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. పచ్చిగడ్డి మోపు దింపిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది. కాజీపేటకు చెందిన వి.వెంకటేశ్ (26) ఎండదెబ్బకు గురై రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం కుప్పకూలి చనిపోయాడు. కిరాణం నుంచి సామాను తెస్తానని ఇంటి నుంచి బయలుదేరి ఎండవేడికి తట్టుకోలేక మృతిచెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రుని పేటకు చెందిన ఊటుకూరి సోమిరెడ్డి (78) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. పూరేడుపల్లిలోని తన పంట పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. 45 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ఎండలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు రైతులు, కూలీలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉదయం 11 గంటలకే నిర్మానుష్యంగా రహదారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘటనలు -
ఎండు కొబ్బరి చిప్పలతో ఉపాధి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద భక్తులు సమర్పించిన కొబ్బరికాయలను సేకరించి ఎండబెట్టడం ద్వారా పలువురు ఉపాధి పొందుతున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా భారీగా పేరుకుపోయిన కొబ్బరికాయలను స్థానికులు వేరు చేసి, చిప్పలు, కొబ్బరి ముక్కలను ఎండబెట్టి వ్యాపార అవసరాలకు సిద్ధం చేస్తున్నారు. ఎండిన కొబ్బరి ముక్కలను నూనె తయారీ, పశువుల మేత, ఇతర పరిశ్రమలలో వినియోగిస్తుండగా, చిప్పలను ఇంధనం, హస్తకళల తయారీలో ఉపయోగిస్తున్నారు. కొ బ్బరికాయల వ్యర్థాలను వినియోగంలోకి తీ సుకురావడం వల్ల పరిశుభ్రతకు తోడ్పాటు అందడ మే కాకుండా పలువురికి ఆదాయ వనరుగా మా రిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
‘చేయూత’ అందేనా?
మంగపేట: రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా జూన్ 02న రాష్ట్రంలోని 02 లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరీ చేయనున్ననుట్లు ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ప్రకటించింది. దీంతో నాలుగేళ్ల నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు కొత్త పించన్ల జాబితాలో మంజూరు కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిరుల దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపించేందుకు కసరత్తు ప్రారంభించారు. 2022లో వృద్ధాప్య పింఛన్ మంజూరుకు 60 సంవత్సరాల వయసును 57కు తగ్గించింది. మీసేవల ద్వారా దరఖాస్తులను స్వీకరించి 57 ఏళ్లు దాటిన వారందరికి వృద్ధాప్యం పించన్లు మంజూరీ చేసింది. 2022 జులై నుంచి ఇప్పటి వరకు కొత్త పించన్ల మంజూరీ నిలిచి పోయింది. 2025 జనవరి నుంచి ఒక కుటుంబంలో వృద్యాప్య పించన్ పొందే భర్త మరణిస్తే భార్యకు, భార్య మరణిస్తే భర్తకు మంజూరీ చేసే విధంగా స్పౌజ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మండంలోని 25 గ్రామ పంచాయతీలలో 2150 మందికి వృద్ధాప్యం, 2576 మందికి వితంతువు, 565 మందికి దివ్యాంగులు, 258 మంది ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఆసరా పింఛన్లు వస్తున్నాయి. నాలుగు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో 02 లక్షల మందికి జూన్లో ఆసర పించన్లు మంజూరీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈసారైనా తమ ఆశ తీరుతుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు నాలుగేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు2022 నుంచి ఇప్పటి వరకు ప్రజాపాలన గ్రామసభలు, ప్రజా ధర్బార్, జిల్లా గ్రీవెన్స్, స్వయంగా లబ్ధిదారుల నుంచి మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో వృద్ధాప్య 89, వితంతు 229, దివ్యాంగులు 15, ఒంటరి మహిళల 08 మొత్తం 341 మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఎవరైనా దరఖాస్తు చేయని అర్హులైన వారు ఉంటే ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలి. – భద్రునాయక్, ఎంపీడీఓ -
భూ సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
● భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేష్కుమార్ ములుగు: భూముల మార్కెట్ విలువ సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేష్కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేష్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ములుగు జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్కుమార్ మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మే 28 నాటికి సవరణ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో భూముల మార్కెట్ విలువ సవరణ ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. వీసీలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాకు చెందిన 25 మంది యువతీయువకులకు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఉద్యోగ నియామక పత్రాలు శనివారం అందించారు. ఈనెల 8న వరంగల్ వేదికగా జరిగిన మెగా జాబ్ మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు తన చాంబర్లో ఆర్డర్ కాపీలను అందజేసి అభినందించారు. త్వరలోనే జిల్లాలో కూడా మెగా జాబ్ మేళాను నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బి.రామ్మోహన్, టాస్క్ మేనేజర్ మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు వాజేడు: జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. వాజేడు మండల పరిధిలోని బొగత జలపాతాన్ని శనివారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటక సీజన్ను దృష్టిలో ఉంచుకొని తాగు నీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, సైన్ బోర్డులతో పాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. -
అడ్మిషన్లు ప్రారంభం
గోవిందరావుపేట: మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ చల్వాయిలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఎంపీడీఓ వరుణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఎంఎస్ చల్వాయిలో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపరాఉ. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈఏపీసెట్, నీట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, హాస్టల్ వసతి సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా పాఠశాలను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని, మరిన్ని వివరాలకు 8096350115 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి ములుగు రూరల్: వడదెబ్బ మృతులకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఎం నాయకులు రవిగౌడ్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోలన్నారు. ఉపాధిహామి కూలీలు కచ్చితంగా నాలుగు గంటలు పని ప్రాంతంలో ఉండాలిన నిబంధన సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు. గుమ్మడిదొడ్డిలో వైద్య శిబిరం వాజేడు: మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో సర్పంచ్ బోదెబోయిన భరత్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వాజేడు వైద్యాధికారి నవీన్ ఆధ్వర్యంలో రోగులను పరీక్షించి మందులను అందజేశారు. హెచ్వీ వెంకట రమణ, ఏఎన్ఎం లలిత కుమారి, ఫార్మాసిస్టు రఘు, ఎల్టీ సూర్య, శివకుమారి, నాగ కుశల, కౌసల్య, కుసుమ,విజయ లక్ష్మి ఉన్నారు. గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని చిన్నబోయినపల్లి గిరిజ ఆశ్రమ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బోదెబోయిన బుచ్చయ్య (59) గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మండల కేంద్రంలోని 11 వార్డులో భార్య, పిల్లలతో ఉంటున్న బుచ్చయ్య ఇంటిలో ఎవరు లేని సమయంలో గుండెనొప్పితోపాటు పిడ్స్ రావడంతో బాత్రూమ్లో పడిపోయాడు. ఇరుగురు పొరుగు వారు చూసి వారి చిన్న కుమారుడు ప్రశాంత్కు సమాచారం ఇవ్వగా వచ్చి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. బుచ్చయ్యకు భార్య సమ్మక్క, కుమారులు మనోజ్, ప్రశాంత్ ఉన్నారు. ఐటీడీఏ ద్వారా దహన సంస్కారాల కింద ఆర్థిక సాయం అందజేశారు. గిరిజన ఉపాధ్యాయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఆయన స్వగ్రామం తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని కన్నెపల్లిలో దహన సంస్కారాలను చేశారు. వెంకటాపురం(ఎం): మండలంలోని నారాయణగిరిపల్లె వద్ద కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొని శనివారం రాత్రి ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెల్తుర్లపల్లి నుంచి బుద్దారం వైపు బైక్పై సలేంద్ర సాయికిరణ్, దీప్తి, లక్ష్మిలు వెళుతుండగా, బుద్దారం నుంచి వెల్తుర్లపల్లి వైపు వస్తున్న కారు నారాయణగిరిపల్లె సమీపంలో రాత్రి 11గంటలకు ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న దీపిక అక్కడికక్కడే మృతిచెందగా లక్ష్మి, సాయికిరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్లో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతిచెందినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని వెంకటాపురం పీఎస్సై సతీశ్ పరిశీలించారు. రేగొండ: ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని కొత్తపల్లిగోరి మండల వ్యవసాయాధికారి సారయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్వింటాలు ధర రూ.16350 కాగా 50 శాతం రా యితీపై రూ.8175 చెల్లించాల్సి ఉంటుందన్నా రు. 30 కిలోల జీలుగ బస్తాకు రూ.2452.50 చెల్లించాలన్నారు. -
పెయింటింగ్స్ అదుర్స్
● పస్రా పోలీస్స్టేషన్ గోడలపై సందేశాత్మక చిత్రాలుగోవిందరావుపేట: పోలీస్స్టేషన్ గోడలపై వేయించి న అందమైన చిత్రాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన, సామాజిక బాధ్యత తదితర అంశాల ను ప్రతిబింబించే చిత్రాలు అక్కడికి వచ్చే ప్రతీఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. పస్రా పోలీస్స్టేషన్ గో డలపై ఇటీవల పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు చట్ట పరిరక్షణే కాకుండా సామాజిక చైతన్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాలను వేయించారు. కళాత్మకంగా రూపొందించిన ఈ చిత్రాలు పోలీస్స్టేషన్కు కొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు ప్రజలకు సానుకూల సందేశాలను చేరవేస్తున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. -
చెరువు మరమ్మతు చేపట్టాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మండల కేంద్రంలోని తాడ్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న కాంబోజు చెరువు మరమ్మతులు వెంటనే చేపట్టాలని గ్రామ రైతులు శనివారం చెరువు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెరువు మరమ్మతులకు నోచుకోక పోవడంతో నీరు వృథాగా వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీరుపైనే ఆధారపడి సాగు చేస్తున్న తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. చెరువులో నీరు నిల్వ లేకపోవడంతో వరి, మిర్చి తదితర పంటలకు సాగునీటి కొరత ఏర్పడుతుందన్నారు. చెరువు మరమ్మతులు చేపడితే వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చెరువు తూము, మత్తడి పూర్తిగా దెబ్బతిని లీకేజీలు ఏర్పడటంతో సాగునీరు నిరంతరం వృథాగా పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే రానున్న వర్షాకాలంలో చెరువులో నీరు నిల్వ ఉండే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రత్యేక నిధులు కేటాయించి తూము, మత్తడి మరమ్మతులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు ఇబ్బందులు
● కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి ములుగు: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు వరిపంట వేసుకోవద్దని తెలిపిందని పేర్కొన్నారు. దొడ్డు రకం పంటలను సాగుచేస్తే ధాన్యాన్ని కొనమని చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాసం రవికుమార్, మామిడిశెట్టి కోటి, నూనెటి శ్యామ్, గుంటోజు శంకరయ్య, నల్లెల్ల భరత్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు ఓం ప్రకాష్, గుంటోజు పావని, కేశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రామప్పలో పర్యాటకుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో పాటు కాళేశ్వరంలో అంత్యపుష్కరాలు కొనసాగుతుండడంతో పర్యాటకులు తిరుగు ప్రయాణంలో రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ పూజారులు హరీషశర్మ, ఉమాశంకర్లు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేస్తుండగా, గైడ్లు విజయ్కుమార్, వెంకటేష్లు ఆలయ చరిత్రను, విశిష్టతను పర్యాటకులకు వివరిస్తున్నారు. రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం ఆలయంలో ఉచిత మినరల్ వాటర్ను అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ తెలిపారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలిఏటూరునాగారం: ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం ఒత్తిడికి గురవుతుంటారని, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఉచితంగా కంటి, ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ వైద్యశిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అంతర్గత సమస్యలు తెలియకపోవచ్చని, ప్రతీ ఉద్యోగి క్రమం తప్పకుండా బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతీఒక్కరికి స్క్రీనింగ్ చేయడంతో ఏమైనా సమస్యలు గుర్తించిన పక్షంలో మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు పంపించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యశిబిరంలో మొత్తం 63 మందికి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ నాగోరావు, డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్, ఏఓ రాజ్కుమార్, మేనేజర్ శ్రీనివాస్, వైద్యులు అరవింద, స్రవంతి, సుధీర్రెడ్డి, ప్రశాంత్, సబ్ యూనిట్ ఆఫీసర్ వాసం నర్సింహరావు, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారి మహేందర్, తదితరులు పాల్గొన్నారు. కోయగూడెం పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ ములుగు రూరల్: మల్లంపల్లి మండలం రామచంద్రాపురం పంచాయతీ కోయగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను శనివారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పరిశీలించారు. జిల్లా పరిషత్ పాఠశాల తరలించే ప్రతిపాదన దృష్ట్యా గురుకుల విద్యార్థులకు హాస్టల్ వసతి, అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక సదపాయాలకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, విద్యాశాఖ అధికారి సిద్దార్ధ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీసీఓ వెంకటేశ్వర్లు, డీఈ రామకృష్ణ తదితరులు ఉన్నారు. ములుగు ఆర్డీఓగా నిర్మలములుగు: ములుగు ఆర్డీఓగా ఎన్.నిర్మలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదారాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న నిర్మలను శుక్రవారం హనుమకొండ ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ శనివారం ములుగు ఆర్డీఓగా నియమిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు ఆర్డీఓగా పనిచేస్తున్న వెంకటేష్ను హనుమకొండ ఆర్డీఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. 27 నుంచి టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్ రామన్నపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 27 నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, టీజీ పాలిసెట్ హెల్ప్లైన్ సెంటర్ క్యాంపు ఆఫీసర్ పి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్తో విద్యార్థులు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, తదితర డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. పాలిసెట్ రాసిన ప్రతీ విద్యార్థి కౌన్సెలింగ్లో పాల్గొని మెరిట్ ఆధారంగా సీట్లు పొందవచ్చన్నారు. వివరాలకు http://tgpolycet.nic.in సందర్శించాలని ప్రిన్సిపాల్ సూచించారు. -
ములుగు
ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 20267● తమ్ముళ్లను పెంచి ప్రయోజకులను చేసిన అన్నలు.. ● అన్నను చదివించిన తమ్ముడు.. ● నేడు జాతీయ బ్రదర్స్ డే అన్నంటే నాన్నంత పెద్దరికం.. తమ్ముడంటే కొడుకంతటి అనురాగం.. బాల్యంలో ఇల్లంతా గోల చేసే అన్నాదమ్ముళ్లు..పెరిగి పెద్దయ్యాక బాధ్యతల భారం తమపై వేసుకుంటారు. తమ్ముళ్లను ప్రయోజకులను చేయాలనే అన్న తపన..అన్న భారం తగ్గించాలనే తమ్ముడి తాపత్రయం..అలాంటి వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో మంది కనిపించారు. నేడు జాతీయ బ్రదర్స్ డే సందర్భంగా అలాంటివారిపై ప్రత్యేక కథనాలు.. -
పరామర్శ
ములుగు: మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు సాంబయ్య ఇటీవల వడదెబ్బతో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి శనివారం పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వడదెబ్బతో మృతిచెందిన సాంబయ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.4లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, రమేష్రెడ్డి, చంద్రమౌళి, వెంకన్న, సాగర్, ఓదేలు, కుమార్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 7వ వార్డులోని రామన్నగూడెం వెళ్లే దారిలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఓ చెట్టుకు నిప్పు అంటుకుంది. వార్డు సభ్యుడు మాదరి మధుకు సమాచారం అందడంతో జీపీ సిబ్బంది, ఫైర్ ఇంజన్ సిబ్బంది, స్థానిక ఎస్సై మహేష్తో కలిసి చెట్టుకు అంటుకున్న నిప్పును చల్లార్చారు. జేసీబీతో చెట్టును కింద పడేశారు. పక్కనే పెట్రోల్బంక్, రహదారి వెంట వాహనా లకు పెను ప్రమాదం తప్పింది. ఉప సర్పంచ్పర్వతాల ఎల్లయ్య, 15వ వార్డు సభ్యుడు నాగవత్ కిరణ్, రామన్నగూడెం సర్పంచ్ నవీన్ పాల్గొన్నారు. మొగుళ్లపల్లి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో వనపర్తి మొండయ్య, కదుర్ల కొమురయ్య, మేకల రాజ్ కుమార్, నైనాకంటి కృష్ణారెడ్డి చెందిన సుమారు 100 క్వింటాళ్ల మొక్కజొన్నలు శనివారం దగ్ధమయ్యాయి. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎల్లారెడ్డిపల్లికి చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట అవశేషాలు, వరి కొయ్యలకు నిర్లక్ష్యంగా నిప్పంటించరాదని సూచించారు. వేసవి కాలంలో చిన్న అజాగ్రత్త కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని, రైతులు అప్రమత్తంగా ఉండి తమ పంటలను కాపాడుకోవాలని తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.మల్హర్(కాటారం): మండలంలోని కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దూర ప్రాంతాలైన వరంగల్ భూపాలపల్లి, కరీంనగర్ వెళ్లకుండా విద్యార్థుల సౌలభ్యం కోసం ఇక్కడే సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సదవకాశం వినియోగించు కోవాలని ప్రిన్సిపాల్ కోరారు. పాలీసెట్ షెడ్యూల్ తొలి విడత కౌన్సిలింగ్లో ధ్రువపత్రాల పరిశీలన ఈనెల29 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. -
కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఎండలు విపరీతంగా కొడుతున్న సందర్భంగా ఉపాధిహామీ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ ముక్తి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పంబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. కూలీలకు మజ్జిగ పాకెట్లు, పెరుగు, అరటిపండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, శీతలపానీయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలు డీహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోలేబోయిన సమ్మక్క, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, మాజీ సర్పంచ్ కల్తీ నారాయణ, నాగేశ్వరావు, వెంకటేష్, రాజేందర్, కృష్ణ, ముక్తి రామారావు, రమేష్ పాల్గొన్నారు. -
దుకాణాల్లో గిరాకీ అంతంతే..
చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరం పుణ్యక్షేత్రం వద్ద నిర్వహిస్తున్న అంత్య పుష్కరాలకు స్వీట్ హౌజ్ దుకాణాలు, హోటల్లు , టెస్కో క్లాత్ స్టాళ్ల యాజమానులు నాలుగు రోజుల క్రితం ముందే చేరుకుని ఏర్పాటు చేసుకున్నారు. పుష్కరాలకు అధికంగా భక్తులు వస్తారని స్వీట్ కొంటారనే ఆశతో స్వీట్ల యాజమానులు రూ.లక్షల పెట్టుబడి పెట్టారు. అలాగే కలెక్టర్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత మూలంగా భక్తులు అంతంత మాత్రమే వస్తున్నారు. పుష్కరాలకు వచ్చిన భక్తులు స్వీట్లు కోనడం లేదు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన హోటల్లలో గిరాకీ లేక యాజమానులు అవస్థలు పడుతున్నారు. అలాగే టేస్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బట్టల దుకాణానికి ఎవరు రావడం లేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఆర్టీసీ బస్సులో బస్టాండ్కు వచ్చి గోదావరికి చేరుకుని అక్కడ పుణ్యస్నానాలు అచరించిన అనంతరం నేరుగా దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. దీంతో వివిధ షాపుల యాజమానులు గిరాకీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరంలో వెలవెలబోతున్న షాపులు ఆందోళనలో వ్యాపారులు -
నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
కేయూ క్యాంపస్: ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష –2026కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సివిల్స్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుందని తెలిపారు. మొదటిసెషన్ ఉదయం 9–30నుంచి 11–30గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 4–30గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తంగా పది సెంటర్లు ఏర్పాటు చేశామని, 4,075మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. నిమిషం నిబంధన.. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సింటుంది. నిర్ధేశించిన సమయానికి అర్ధగంట ముందే కేంద్రాల గేట్ల మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోనికి అనుమతి ఉండబోదని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షకేంద్రాలకు మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. హాల్టికెట్తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటోగుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సింటుంది. కేంద్రాలవద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఆమెవెంట యూపీఎస్సీ కేంద్ర తనిఖీ అధికారి శుభంగాద్, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, రూట్ అధికారి భావ్సింగ్ ఉన్నారు. పరీక్ష కేంద్రాలు ఇవే.. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీలో రెండు సెంటర్లు, ఫాతిమానగర్లోని సేయింట్ గాబ్రియల్ హైస్కూల్, హంటర్రోడ్డులోని న్యూసైన్స్ కళాశాల, అడ్వకేట్స్ కాలనీలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, వడ్డెపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, ములుగు రోడ్డులోని శ్రీగాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్బీ కళాశాల, హనుమకొండ అశోక్ జంక్షన్లోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వ ద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. నేడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పది పరీక్ష కేంద్రాలు.. 4,075 మంది అభ్యర్థులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : సీపీవరంగల్ క్రైం: ఆదివారం నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సెంటర్లనుంచి 500మీటర్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎన్ఎస్ చట్టాన్ని అనుసరించి గుమిగూడడం, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
ఎడ్లబండ్ల ఆకర్షణ..
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్లబండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పుష్కర క్షేత్రానికి చేరుకునేందుకు భక్తులను ఎడ్లబండ్లలో తరలిస్తూ పలువురు రైతులు, బండి యజమానులు ఉపాధి పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తులను ఎడ్లబండ్లలో తీసుకెళ్తూ గ్రామీణ జీవనశైలిని ప్రతిబింభిస్తున్నారు. ఆధునిక వాహనాల మధ్య సంప్రదాయ ఎడ్లబండ్ల ప్రయాణం భక్తులను ఆకట్టుకుంటోంది. ఎడ్లబండ్ల ద్వారా రవాణా సేవలు అందిస్తూ కొంతమంది కుటుంబాలు రోజువారీ ఆదాయం పొందుతున్నాయి. పార్కింగ్ పాయింట్ల నుంచి గోదావరి వరకు ఒక్కరికీ రూ.50 చొప్పున చార్జీలు తీసుకుంటున్నారు. -
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిరసన
వాజేడు: చెరుకూరు నుంచి ధర్మవరం వరకు నిలిచి పోయిన రహదారిని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చెరుకూరు నుంచి ధర్మవరం వరకు ఉన్న రహదారిని శనివారం సీపీఎం నాయకులతో కలిసి ఆయన పరిశీలించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తడమే కాకుండా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రెండు గ్రామాల మధ్య అటవీ శాఖ భూమి ఉందని రహదారి నిర్మాణ సమయంలో ఆ శాఖ అధికారులు అభ్యతరం వ్యక్తం చేయడంతో రహదారి నిర్మాణ పనులు నిలిచి పోయినట్లు తెలిపారు. అధికారులు కల్పించుకొని వెంటనే రహదారి నిర్మాణం జరిగేలా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదాక్రీన్, చంద్రశేఖర్, నరేష్, మహేందర్, సాయిబాబు తదితరులు ఉన్నారు. -
పుష్కరాల్లో పిండ ప్రదానాలు ప్రత్యేకం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కరాల సందర్భంగా అపార భక్తజన సందోహంతో కళకళలాడుతోంది. సరస్వతి పుష్కరాల పుణ్యకాలంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు చేయడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమ ప్రాంతమంతా వేద మంత్రోచ్ఛారణలు, గోవింద నామస్మరణలు, హరినామ సంకీర్తనలతో మారుమోగుతూ భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా మండపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పితృకార్యాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. పుష్కర సమయంలో పిండ ప్రదానాలు చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని, కుటుంబానికి శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పండితులు 500పైగా తరలివచ్చారు. పండితులు పితృకార్యాలు చేయడంతో పాటు పుష్కర స్ధానాలు చేసిన వారికి గోదావరి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో వారికి కొంత మేర ఉపాధి దొరుకుంతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం విసృత ఏర్పాట్లు చేసింది. ఘాట్ల వద్ద తాత్కాలిక షెడ్లు, విశ్రాంతి కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
రోడ్డు ఇలా.. నడిచేది ఎలా?
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని శివాలయం వీధిలో రోడ్డుపై నీరు నిలిచి బురదమయంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. మురగు నిల్వ ఉండడంతో దోమలకు అవాసాలుగా మారి వ్యాధుల బారిన పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నీరు నిలిచి నడిచేందుకు వీలు లేకుండా పోయిందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవటం లేదని తెలుపుతున్నారు. ఇప్పటికై న జిల్లా అధికారులు స్పందించి రోడ్డుపై మురుగు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు
ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతీ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని, జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశాన్ని లీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన నిర్వహించగా సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్పాస్ట్ పథకం అమలు చేయబోతున్నమన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత కల్పిస్తామని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం విస్తరిస్తామని, దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందిస్తామన్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఆలయ అభివృద్ధికి 22 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం చెల్లించామన్నారు. జిల్లాకు అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రంలోనే ములుగు నియోజకవర్గానికి అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని, జిల్లాలో నూతనంగా 38 వేల పైచిలుకు పెన్షన్లను జూన్ 2న అందించనున్నట్లు తెలిపారు. అనంతరం సీ్త్ర నిధి ద్వారా 112 మహిళా సంఘాలకు రూ.2.25 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా 175 మహిళా సంఘాలకు రూ.16.15 కోట్లు, ములుగు మున్సిపాలిటీ మెప్మా ద్వారా 25 సంఘాలకు రూ.2.2 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 140 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, డీఆర్డీఏ, రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీతక్క పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహిన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
తప్పని గ్యాస్ తిప్పలు
ఏటూరునాగారం: జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు ఇంకా తిప్పలు తప్పడం లేదు. గత నెలలో జరిగిన అమెరికా–ఇరాన్ దేశాల మధ్య యుద్ధంతో గ్యాస్ సరఫరా అందని ద్రాక్షలా మారింది. గ్యాస్ వినియోగం పెరగడంతో ఒక్కో వినియోగదారుడికి 45 రోజుల కాల వ్యవధిని ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాస్ తీసుకున్న నాటి నుంచి 45 రోజుల వరకు బుకింగ్ చేసుకోకుండా షరతులు విధించింది. దీంతో చిన్న చిన్న హోటల్ యజమానులు పాత పద్ధతు లను అలవాటు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండ ర్లు, స్టౌవ్లను పక్కకు పడేసి అడవి నుంచి వంట చె ఱుకు (పొయ్యిల కట్టెలు) తెప్పించుకుంటున్నారు. అయితే గతంలో ఎడ్లబండితో కట్టెలను రూ.1,000 లకు వేస్తే ప్రస్తుతం అది రూ.1,500 పెంచారు. చిరు వ్యాపారుల అవస్థలు సకాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అందకపోవడంతో చిన్న చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. మరికొందరు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లను కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ప్రజలకు గ్యాస్ కష్టాలను తొలగించాలని కోరుతున్నారు. కేవైసీ తప్పనిసరి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతీ వినియోగదారుడు వారి వేలిముద్ర, ఐరీస్ను గ్యాస్ ఏజెన్సీకి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ–కేవైసీ చేయని వారికి గ్యాస్బుక్ కావడం లేదు. దీంతో హెచ్పీ ఏజెన్సీ అయిన జీసీసీ, ఇండేన్, భారత్ గ్యాస్ లాంటి కంపెనీలు కేవైసీ తప్పనిసరి చేసింది. అత్యధికంగా హెచ్పీ గ్యాస్ కనెక్షన్లు ఉన్న జీసీసీ ఏజెన్సీ సరఫరాలో జాప్యం, నిర్లక్ష్యం చేస్తుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.అడవి నుంచి కట్టెలను తెస్తున్న వ్యాపారులు 45 రోజులు దాటినా అందని గ్యాస్ సిలిండర్లు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న వినియోగదారులు జిల్లాలో నో కమర్షియల్ గ్యాస్ మూత పడుతున్న చిన్న చిన్న హోటళ్లు కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్న పలువురు వ్యాపారులు -
కాంగ్రెస్ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు..
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు జిల్లాల చైర్మన్లు వీరే.... కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్గా ఆరూరి సాంబయ్య, వరంగల్ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్, జనగామకు చేపూరి వినోద్, మహబూబాబాద్కు తిప్పర్తి శ్రీధర్, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిలను నియమించారు. జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా కాంగ్రెస్ ఎస్సీ విభాగంలో చేపట్టిన ఈ మార్పులు రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలకు ఎంతవరకు బలం చేకూరుస్తాయో?నన్న చర్చ మొదలైంది. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి ఏటూరునాగారం: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ విద్యారంగ ప్రతిష్ట కోసం ప్రత్యేక పోరాటాలను చేస్తోందన్నారు. చదువుకునే విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ శిక్షణ తరగతులతో ప్రభుత్వాలు విద్యార్థులకు చేస్తున్న నష్టం, మనం ఎలాంటి హక్కులను పొందామనేది తెలుసుకోవచ్చన్నారు. ప్రతీ విద్యార్థి ఈ శిక్షణ తరగతులకు తరలిరావాలని కోరారు. చేపల చెరువుపై హక్కు కల్పించాలి ఏటూరునాగారం: గిరిజనులకు చేపల చెరువులపై హక్కు కల్పించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్రావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ జగదీష్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. మండలంలోని షాపెల్లి పెద్ద చెరువులో పెసా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసిన సభ్యులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ మండలాల అధ్యక్షులు యాలం దేవేందర్, మోకాళ్ళ వెంకటేశ్వర్లు, తుర్స చంటి దొర, గుండ్ల పాపారావు తదితరులు పాల్గొన్నారు. విజయేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు గణపురం: గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని కంచి కామకోటి 70వ పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం సందర్శించారు. కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలను ప్రారంభించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణంలో కేటీపీపీకి వచ్చారు. కేటీపీపీ సీఈ, ఆలయ చైర్మన్ శ్రీ ప్రకాశ్ దంపతుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న జగద్గురులకు సీఈ దంపతులు, ఆలయ అర్చకులు, ప్రాజెక్టు అధికారులు పూర్ణకుంభంతో మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి వారికి కంచి పీఠాధిపతి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దేవతామూర్తులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. జగద్గురు ఆలయానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న ఉద్యోగుల కుటుంబాలు పెద్దఎత్తున స్వామి వారి దర్శనానికి తరలి వచ్చాయి. -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్ఎస్ తాడ్వాయి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ (జనరల్) కొమురం నాగోరావు అన్నారు. పీఎం– జుగా జన్ జాతీయ గరిమా ఉత్కర్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కామారం (పీటీ) గ్రామంలో సర్పంచ్ కొర్నిబెల్లి సావిత్రి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీడీఏ ఏపీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ‘జన్ భాగీదారి అభియాన్’లో భాగంగా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో 196 గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు వినడం, సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొర్నిబెల్లి జగన్నాధరావు, హన్మతయ్య, వైద్య అధికారి ప్రశాంత్, ఏసీఎంఓ వాగ్యానాయక్, జీసీడీఓ పెనక సుగుణ, పీసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి రమేష్, మొబిలైజర్ చర్ప రవి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓ(జీ) కొమురం నాగోరావు -
సుర్రుమంటున్న సూరీడు
ములుగు: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లాలో రో జురోజుకూ రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం జిల్లా రెడ్జోన్ పరిధి లోకి వెళ్లింది. ప్రతీ మండలంలో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా జిల్లాలోని తాడ్వాయి, వెంకటాపురం మండలాల్లో 46.4 డిగ్రీలు, ఏటూరునాగారంలో 46.3 డిగ్రీలు, మల్లంపల్లి, వాజేడు, మంగపేట, వెంకటాపురం(కె) మండలాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిలలాడుతున్నారు. రెండు రోజుల క్రితం 43 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కరోజు తేడాతోనే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు ఎండ తీవ్రతకు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో జనం బయటకు వచ్చేందుకు వెనకడుగు వేశారు. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి పట్టణం, పల్లె అనే తేడా లేకుండా వీధులు, ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైతే తప్ప జనం బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలు యాసంగి పనులు చివరిదశలో ఉన్న తరుణంలో భానుడి ప్రతాపానికి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. వరిపంటను విక్రయించే క్రమంలో లా రీల కొరత కారణంగా ధాన్యాన్ని తరలించే పరిస్థితి లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉపాధి పనులు చేసే కూలీలకు పనిచేసే ప్రదేశంలో సరైన వసతులు లేకపోవడంతో ఉదయం 10 గంటలలోపే పనులను ఉపాధి పనులను ముగించుకుంటున్నారు. రైతులు, కూలీలు, పంచాయతీ కార్మికులు వడదెబ్బకు గురికాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వడగాలులతో అల్లాడుతున్న జనం ఉదయం 11 గంటల నుంచే వీస్తున్న వడగాలులతో జనం అల్లాడుతున్నారు. పగలు వడగాలులు, రాత్రిఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. ఫ్యాన్లు, కూ లర్లు, ఏసీలను వాడుకుంటుండడంతో విద్యుత్ విని యోగం కూడా పెరిగింది. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయట కనిపించడం లేదు. ప్రధాన రహదారులన్నీ వెలవెలబోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలెవరూ 12 నుంచి సాయంత్రం 4 గంటలలోపు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీలు సెల్సియస్లో)ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడుగురి మృతి ‘మీ ప్రాంతంలో తీవ్ర ఎండలు.. వేడి గాలులు వీచే అవకాశం ఉంది. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎవరూ బయటకు వెళ్లొద్దు. నీరు, మజ్జిగ, కొబ్బరినీరు తాగండి.. అస్వస్థత ఉంటే వైద్యసాయం పొందండి’ అంటూ జిల్లాలోని ప్రజల సెల్ఫోన్లకు తెలంగాణ రాష్ట్ర సమగ్ర నియంత్రణ కేంద్రం (టీజీఐసీసీసీ) ద్వారా మేసేజ్లు వస్తున్నాయి. 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు వడగాలులకు అల్లాడుతున్న జనం ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంమండలం ఉష్ణోగ్రత తాడ్వాయి 46.4 వెంకటాపురం 46.4 ఏటూరునాగారం 46.3 మల్లంపల్లి 46.1 వాజేడు 46.1 మంగపేట 46.0 వెంకటాపురం(కె) 46.0 ములుగు 45.9 కన్నాయిగూడెం 45.8 గోవిందరావుపేట 45.4 -
వెంకటాపురంలో చిరుత సంచారం
● ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు వెంకటాపురం(కె): మండల పరిధిలోని యాకన్నగూడెం, ఎదిర గుట్టల సమీపంలో చిరుత పులి సంచరిస్తుంది. చిరుత సంచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎఫ్డీఓ ద్వాలియా ఆధ్వర్యంలో ఎదిర, యాకన్నగూడెం గ్రామ శివారుల్లో చిరుతపులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి ఆనవాళ్లను పరిశీలించారు. చిరుత సంచరిస్తున్నట్లుగా పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా ద్వాలియా మాట్లాడుతూ గ్రామస్తులు అటవీ ప్రాంతానికి సమీపంలో పశువులను గొర్రెలను మేపేందుకు వెళ్లొద్దని సూచించారు. పిల్లలు, మహిళలు సాయంత్రం సమయంలో ఒంటరిగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. చిరుత కనిపిస్తే దానికి హానికలిగించకుండా తక్షణమే అటవీశాఖ సి బ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యన్య ప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘనకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పంటలను అమ్ముకోలేని స్థితిలో రైతాంగం
ములుగు: జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో అన్నదాతలు ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్జీకి రైతుల ఇబ్బందులను తీర్చాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని సరిగా అందించకున్నా.. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాల్సి ఉండగా కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో 10 కిలోల వరకు కటింగ్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కష్టపడి పండించిన పంటలను అమ్ముకోలేక రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూక్య జంపన్న, మల్క రమేష్, సానికొమ్ము రమేష్రెడ్డి, లింగాల రమణారెడ్డి, భిక్షపతి, జగదీష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రెడ్ కో మాజీ చైర్మన్ సతీష్రెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన -
బుచ్చిరెడ్డిపల్లిలో తెగిపడిన 11 కేవీ తీగ
నల్లబెల్లి: మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి శివారులో శుక్రవారం త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి, ములుగు జిల్లా రాంచంద్రపురం గ్రామాల మధ్య 11 కేవీ విద్యుత్ లైన్ ఉంది. విద్యుత్ తీగలు తెగి బీడు భూముల్లో ఉన్న ఐరన్ఓర్ ఖనిజ రాళ్లపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఖనిజ రాళ్లకు రంద్రాలు ఏర్పడ్డాయి. ఈ ఘటనతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు ఎవ్వరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ తీగలను తొలగించి స్థానికుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం లైన్కు అత్యవసర మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మంటలు అంటుకుని ఐరన్ ఓర్ రాళ్లకు రంద్రాలు -
సాగు భారమే!
ములుగు రూరల్: పంటల సాగుకు వినియోగించే ఎరువుల బస్తాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలను ఎక్కువ మొత్తంలో పెంచడంతో రైతన్నలకు సాగు భారంగా మారనుంది. కాంప్లెక్స్ ఎరువులు 20–20–0–13, 28–28 బస్తాలపై ధరలు విపరీతంగా పెంచడంతో కొనుగోలు చేసేందుకు జంకే పరిస్థితి నెలకొంది. పంటల సాగులో తొలి, రెండో దశలో ఎక్కువ శాతం రైతులు కాంప్లెక్ ఎరువుల వినియోగిస్తారు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగుకు ఎక్కువగా వినియోగించే ఎరువులపై ధరలు అధికంగా పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో కూలీల ధరలు, డీజిల్ ధరలు పెరగడం, ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడికి అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో కౌలు రైతులు పంటల సాగుకు ముందుకు రావడానికి భయపడుతున్నారు. పాత స్టాక్ కొనుగోలు ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్లో నిల్వ ఉన్న పాత స్టాక్ను కొనుగోలు చేసేందుకు రైతులు ఆరాటపడుతున్నారు. 20–20–0–13 బస్తాపై సుమారుగా రూ. 300, 28–28–0 పై రూ.550 వరకు పెరిగింది. పంటల సాగు సమయం కంటే ముందుగా కొనుగోలు చేసేందుకు రైతులు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఎరువుల బస్తాలను పెరిగిన ధరలకు అనుగుణంగా అమ్మకాలు చేపట్టనున్నారు. దీంతో రైతులు ముందుగానే ఎరువుల బస్తాలను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. కాంప్లెక్స్ ఎరువు బస్తాపై రూ.300 నుంచి 500 వరకు పెంపు పాత స్టాక్ ముందస్తుగా కొనుగోలు చేస్తున్న రైతులు ఎరువులు పాత ధర కొత్త ధర 20–20–0–13 1,500 1,800 10–26–26 2,025 2,250 12–32–16 2,025 2,250 14–35–14 2,175 2,400 19–19–19 2,075 2,300 28–28–0 1,800 2,350 ఎంఓపీ 1,850 1,975 -
అంత్య పుష్కరాలు ఆరంభం
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కరశోభ వెల్లివిరిసింది. గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సరస్వతినది అంత్యపుష్కరాలు ఆరంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలిపుష్కరస్నానం ఆచరించారు. తొలిరోజు ఎండ తీవ్రతతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. – భూపాలపల్లి/ కాళేశ్వరం తొలి పుష్కరస్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఎండతో తొలిరోజు భక్తుల పుష్కరస్నానాలు అంతంతే.. -
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి
ములుగు: జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘ప్లే పార్టిసిపేట్, స్పోర్ట్స్ డే, ఆడండి – పాల్గొనండి’ అనే థీమ్తో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం 2026 సీఎం కప్ పోటీలలో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులను, విద్యార్థులను కలెక్టర్ అభినందించి ప్రశంస పత్రాలు, పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు జిల్లా యువజన క్రీడల అధికారి బి.రామ్మోహన్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి క్రీడాకారులకు పతకాలు, ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు. అనంతరం కలెక్టర్ నేడు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ ఫంక్షన్హాల్ నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో హలో ఫ్లుయెన్సర్లు రీల్స్ కాంపిటీషన్పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రీల్స్తో జిల్లా పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్గా జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. జిల్లా టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్ ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులతో కలెక్టర్ ముఖాముఖిగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు బ్రాండింగ్ కలిగించేలా కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.పర్యాటక ప్రాంతాలపై 4కె వీడియో క్వాలిటీతో రీల్స్ సమర్పించాలని, ఆసక్తి గలవారు తమ వీడియోలను మే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చని వివరించారు. ఆన్లైన్ విధానంలో డీపీఆర్ఓ రఫీక్ సెల్ 99483 92976, ఏపీఆర్ఓ వేణు 9494970535 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చని పేర్కొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు: జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్ నుంచి జనగణనపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సెన్సస్–2027 ఫేజ్–1 కార్యక్రమాల అమలు, ప్రగతి, ఫీల్డ్ స్థాయిలో చేపడుతున్న చర్యలపై సమావేశంలో అధికారులతో సమీక్షించారు. జనగణన కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఓ ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, జనాభా లెక్కల సూపరింటెండెంట్ మంజుల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏఐ లైఫ్ స్కిల్స్పై ఉచిత శిక్షణమహబూబాబాద్ అర్బన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లైఫ్ స్కిల్స్పై నాలుగు రోజుల పాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు డిగ్రీ ఆపైన చదివిన బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి గురువారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ప్రజలకు అందించడమే లక్ష్యంగా మ్యాజిక్ బస ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ అనుసంధానంతో జూన్ 1నుంచి 4వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులు హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 30వ తేదీ వరకు హాజరై దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 0870– 2571192 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. 15 కిలోమీటర్లు కాలినడకన.. ● గుట్టలపైకి చేరుకుని ఇళ్లగణనవాజేడు: ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల గణన భాగంగా ఎన్యుమరేటర్ రాంబాబు, సూపర్ వైజర్ శ్రీకాంత్ గురువారం 15 కిలో మీటర్లు కాలినడకన.. గుట్టలపైకి చేరుకుని ఇళ్ల గణన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలోని పెనుగోలు గ్రామం గుట్టలపై ఉంది. అక్కడికి కాలినడకన 15కిలో మీటర్లు నడిచివెళ్లారు. అక్కడ ఉన్న ఇళ్ల గణన చేపట్టి శుక్రవారం తిరిగి రానున్నారు. -
ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలి
ఏటూరునాగారం/వాజేడు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను వెంటనే లారీల్లో మిల్లులకు తరలించాలని ఎస్పీ రాంనాథ్ కేకన్ నిర్వహకులకు సూచించారు. మండల కేంద్రంలోని జీసీసీ, తదితర కొనుగోలు కేంద్రాలను ఏఎస్పీ మనన్ భట్తో కలిసి గురువారం పరిశీలించారు. ధాన్యం బస్తాలు ఇప్పటి వరకు ఎన్ని లోడ్లు పంపించారని జీసీసీ పాయింట్ ఇన్చార్జ్ సాంబరావును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 18 లోడ్లు తరలించామని ఇంకా 20 వరకు తరలించాల్సి ఉందని, లారీలు రాకపోవడంతో బస్తాలు వెళ్లడం లేదని వివరించారు. మొక్కజొన్న సరుకును తరలించడానికి వాజేడు వద్ద లారీలు ఎక్కువగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న లారీలను ఇక్కడికి తరలించి ముందుగా వరి ధాన్యం బస్తాలను తరలించాలని స్థానిక సీఐ శ్రీనివాస్ను ఎస్పీ ఆదేశించారు. అనంతరం వాజేడు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగిలో మొక్కజొన్న నిల్వ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. మొక్కజొన్నను వేగంగా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా తరలించాలన్నారు. రవాణాకు లారీల కొరత ఉంటే అధికారుల సహకారం తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు. రహదారి పనుల పరిశీలన వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కొనసాగుతున్న రహదారి పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం పరిశీలించారు. ఈ మేరకు ఆయన మండల పరిధిలోని మురుమూరు నుంచి పామునూరు, జల్ల, డోలి మీదుగా తబపల వరకు కొనసాగుతున్న పనుల వివరాలపై ఆరా తీశారు. రహదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనన్భట్, డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రాంనాథ్ కేకన్ -
అడుగంటుతున్న భూగర్భజలాలు
తలాపునే గోదావరి.. ● జిల్లా ప్రజలకు తప్పని నీటి కష్టాలు ● బ్యారేజీలతో జిల్లాకు ఫలితం శూన్యంఏటూరునాగారం: జిల్లాలో గోదావరి 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అయినా ఎండాకాలం వచ్చిందంటే భూ గర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీంతో ప్రజలు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. తలాపునే గోదావరి ఉన్నా జిల్లా ప్రజలు చుక్కనీరు వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేతి పంపులు వేయించుకుని దాహార్తిని తీర్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాకు గోదావరి జలాలు అందించి సస్యశ్యామలం చేయాల్సిన పాలకులు మిన్నకుండిపోతుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ములుగులో 14.82 మీటర్ల లోతుల్లో.. జిల్లా కేంద్రంలో 14.82 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి. అలాగే వెంకటాపురం(ఎం)లో అత్యధిక పైస్థాయిలోనే నీటి నిల్వలు ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ, భూగర్భజలాల శాఖ అధికారులు గుర్తించారు. సమీప గోదావరిలో సైతం రైతులు నీటి కోసం బోర్లను దింపుకొని అవసరాలను తీర్చుకుంటున్నారు. జిల్లా ప్రజల నీటి సమస్య పరిష్కారం కావాలంటే సమ్మక్క బ్యారేజ్, దేవాదుల ఎత్తిపోతల పథకం కింద జిల్లాలోని చెరువులు, సరస్సులు నీటితో నింపాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో 2016లో అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళి సమ్మక్క బ్యారేజ్కు గ్రావిటి కాల్వలు తవ్వించి రైతులు, ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలని అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ అవి ఆచరణలోకి రాలేదు. ఇతర ప్రాంతాలకు నీటి తరలింపు జిల్లాలోని దేవాదుల, తుపాకులగూడెం బ్యారేజీల పరిధిలోని నీటి లభ్యత అంతా కూడా కరీంనగర్, భూపాలపల్లితో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాకుల గూడెంలో 6 టీఎంసీల నీటి నిల్వలు కేవలం దేవాదుల కోసం కేటాయించి పంపింగ్ చేసి నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా జిల్లా ప్రజల నీటి కష్టాలు కలగానే ఉండిపోతున్నాయి. పాలకులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.ఏటూరునాగారం 8.51 గోవిందరావుపేట 5.47 కన్నాయిగూడెం 9.75 మంగపేట 9.44 ములుగు 14.82 వెంకటాపురం(ఎం) 2.60 వెంకటాపురం(కె) 8.96 వాజేడు 11.74 ఎస్ఎస్తాడ్వాయి 8.93దేవాదుల, తుపాకులగూడెం నీటి నిల్వలను ఉపయోగించుకునే విధంగా అనువైన ప్రదేశాల్లో రిజర్వాయర్లను నిర్మించాలి. నీటిని మళ్లించి సాగు, తాగునీటికి ఉపయోగ పడేలా చూడాలి. రిజర్వాయర్లు లేకపోవడంతోనే ఇక్కడ ఉన్న ప్రజలు సాగు, తాగునీటికి కష్టాలు పడుతున్నారు. – సప్పిడి రాంనర్సయ్య, ఏటూరునాగారంజిల్లాలోని రైతులు, ప్రజలకు దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగు నీటి సౌకర్యం కల్పించాలి. స్థానికంగా ప్రాజెక్టులు ఉన్నా ప్రజలకు గోరంత ఉపయోగపడడం లేదు. దీనిపై ప్రభుత్వాలు, అధికారులు దృష్టి సారించి స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రావిటి కాల్వల నిర్మాణం చేపట్టాలి. – ఈసం రామ్మూర్తి, మాజీ సర్పంచ్, ఏటూరునాగారం -
ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు పట్టణ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో శానిటేషన్ సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణ చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు టాయిలెట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాకు పెద్ద దిక్కయిన ఆస్పత్రిలో ఆదివాసీ గిరిజనులకు సరైన వైద్యం అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం, మంత్రి సీతక్క ఆస్పత్రిని గాలికి వదిలేశారని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మౌలిక వసతులు లేని కారణంగా రోగులను ఎక్కువగా ఎంజీఎంకు తరలిస్తున్నారని తెలిపారు. పలుమార్లు సమస్యల పరిష్కారాలని కోరిన పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న బీజేపీ ఆధ్వర్యంలో 48 గంటల నిరహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యర్యదర్శి నగరపు రమేశ్, రవీంద్రాచారి, సుమలత, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రవిరెడ్డి, హేమాద్రి, ప్రమోద్రెడ్డి, రవి, రాకేశ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
జాబ్ క్యాలెండర్ అమలుచేస్తే మరింత ఆనందం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు పదేళ్ల వయోపరిమితి పెంచడం శుభపరిణామం. జీఓలో ఈ పరిమితి ఒక్క సంవత్సరానికే పరిమితం చేయడం నిరుద్యోగులకు అన్యాయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్నూ జారీ చేయలేదు. మరీ ఒక సంవత్సరంలో ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తారు? ఎలా భర్తీ చేస్తారు. జీఓలో వయోపరిమితి కాలాన్ని మరో ఏడాది పెంచడంతో పాటు జాబ్ క్యాలెండర్ను వెంటనే అమలు చేస్తే మరింత ఆనందం. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. – శ్రీరామోజు సురేందర్, నిరుద్యోగి, మహబూబాబాద్ -
హెరిటేజ్ వాక్
ములుగు రూరల్: 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల్లో భాగంగా బుధవారం హెరిటేజ్ వాక్ను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాక్ మండల పరిధిలోని జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్ నేషనల్ హైవే యూటర్న్ నుంచి జాకారం శివాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, డీపీఓ వెంకయ్య, డీపీఆర్వో రఫిక్, తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీఓ రహీమ్, సర్పంచ్ దాసరి సమత తదితరులు పాల్గొన్నారు. ఎరువుల ధరలను తగ్గించాలని వినతి ములుగు రూరల్: నాణ్యమైన విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు ఎరువుల ధరలు తగ్గించాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేశ్కుమార్కు తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజాద్ పాషా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పూర్తి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి సకాలంలో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ సింగ్, మంజునాయక్, రమేశ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. ‘ఆదివాసీల జోలికొస్తే సహించేది లేదు’ వాజేడు: ఆదివాసీల జోలికి వస్తే సహించేది లేదని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాయం రమణ అన్నారు. మండల పరిధిలోని గుమ్మడిదొడ్డిలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం(కె) మండలంలో ఆదివాసీలపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక ఆదివాసీలపై దాడులు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా జరగని పక్షంలో ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు తొర్రెం సంతోష్, ప్రధాన కార్యదర్శి చాప లక్ష్మణ్, వాసం సంతోష్, సురేశ్, హరికృష్ణ, నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. మేలైన వరి వంగడాలను విత్తుకోవాలి ఏటూరునాగారం: మేలైన వరి వంగడాలను విత్తుకోవాలని వరంగల్ శాస్త్రవేత్తలు శేషు, మధు తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వరిసాగు పద్ధతులపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన మేలైన వరి రకాలైన కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 1508, సాంబమసూరి, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 118 వేసుకోవడం వల్ల పురుగులు, తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయన్నారు. దీని ద్వారా అధిక దిగుబడులు పొందచ్చని తెలిపారు. రైతులు తమ పొలంలో పండించిన రకాలను జాగ్రత్తలు పాటించి విత్తనాలుగా రెండు, మూడు సంవత్సరాల వరకు విత్తనంగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. అలాగే విత్తనాల మీద పెట్టే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. వరిసాగు పద్ధతుల్లో మెలకువలు పాటించాలన్నారు. పంట మార్పిడి, సేంద్రియ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. వరి పంట వేసుకునే ముందు ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట పంటలను వేసుకొని పూత దశలో భూమిలో కలియదున్నాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, ఆత్మ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ యూనివర్సిటీ నుంచి విడుదలైన మేలైన వరి రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ విత్తనాలు 50 శాతం సబ్సిడీ మీద లభిస్తాయని వివరించారు. శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు రవి, రాజు, రైతులు పాల్గొన్నారు. -
మహిళా బిల్లును ఆమోదించాలి
ములుగు రూరల్ : పార్లమెంట్లో మహిళ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని టీపీసీసీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంగోత్ సుగుణ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో మహిళా బిల్లును పార్లమెంట్లో పాస్చేయాలని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాగా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపల్ చైర్మన్ చంద్రకళ, మండల మహిళ అధ్యక్షురాలు గుంటోజు పావనినిరంజన్, మున్సిపల్ కౌన్సిలర్లు నల్లెల స్వాతి, గుగ్గిల్ల దివ్య, గజ్జెల సుస్మిత, కోఆప్షన్ సభ్యులు అసియా, సుజాత, రాధిక, తదితరులు ఉన్నారు. -
నోటిఫికేషన్లు ఆలస్యం చేయొద్దు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల వయోపరిమితి పెంచడం సంతోషమే. అయితే ఒక ఏడాదికే జీఓను పరిమితం చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల అన్నింటిని గుర్తించి అన్ని నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్టభద్రులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి లక్ష్యం నెరవేరాలంటే భారీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతోంది..ఇంకా జాప్యం చేయొద్దు. –మనుబోతుల మల్లయ్య, ఎంఎస్సీ, బీఈడీ, నెక్కొండ -
మెడికల్ షాపుల బంద్ విజయవంతం
ములుగు రూరల్: ఔషధాల అమ్మకాలను ఆన్లైన్లో నిలిపివేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైందని అసోసియేషన్ అధ్యక్షుడు తిప్పని కోటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం అసోసియేషన్ ఆ ధ్వర్యంలో దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్లో భా గంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఓను సవరిస్తూ ఔషధాలను ఆన్లైన్ మార్కెటింగ్కు అనుమతి ఇచ్చిందని తెలిపారు. నేటికీ అదేవిధంగా కొనసాగించడం సరి కాదని తెలిపారు. కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైన్ మెడికల్ షాపుల్లో డిస్కౌంట్ల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి శ్రీధర్రావు, సభ్యులు అనిల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ అధికారుల విచారణ
మహాముత్తారం : మండలంలోని నిమ్మగూడెం, యత్నారం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన జంతువును కాల్చివేశారు. ఈ సంఘటనపై ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ జోగేందర్తోపాటు ఎఫ్డీఓ సందీప్రెడ్డి బుధవారం సంఘటన స్థలానికి చేరుకొని మహాముత్తారం పశు వైద్యాధికారి భరత్తో కలిసి కాల్చివేసిన జంతువు కళేబారం నమూనాను సేకరించి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఈ ఘటన ఆధారంగా యత్నారం గ్రామంలో కొంతమంది అనుమానితులను ప్రశ్నించగా గ్రామానికి చెందిన కోడి మాంతయ్య ఇంట్లో ఉచ్చుకు వినియోగించే విద్యుత్ తీగలు దొరికినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామానికి చెందిన పుల్యాల నగేష్, రాజు, కాసిపేట కృష్టస్వామితో వెళ్లినట్లు మంతయ్య ఇచ్చిన సమాచారం మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎండతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వెంకటాపురం(కె) : మండల పరిధిలోని పాత్రాపురం పంచాయతీ పాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాఽధికారి భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ స్కీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, గర్భిణులకు హిమోగ్లోబిన్ టెస్టులు చేశారు. జ్వరంతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. అనంతరం వైద్యాధికారి భాస్కర్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కవ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే వారు నిమ్మరసం, ఓఆర్ఎస్ ప్యాకెట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్పవతి, ఉప సర్పంచ్ ఇల్లందుల శ్రీను, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, తదితరులు ఉన్నారు. మల్లంపల్లిలో కంటి వైద్యశిబిరం ములుగు రూరల్ : మండల పరిధిలోని మల్లంపల్లి గ్రామంలో ఎన్ఎస్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శంకర కంటి ఆస్పత్రి హైదరాబాద్ వారు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 56 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 26 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ట్రస్టు చైర్మన్ మహేష్ ఉన్నారు. కొండాయిలో.. ఏటూరునాగారం : మండలంలోని కొండాయి గ్రామంలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఐటీడీఏ పీఓ లెనిన్వత్సల్ టొప్పో ఆదేశాల మేరకు జన జాతీయ గరీమ్ ఉత్సవ్లో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి 25 మందికి పరీక్షలు చేసినట్లు కొండాయి పల్లె దవాఖానా వైద్యుడు ప్రణీత్ తెలిపారు. జ్వరంతో ఉన్న వారికి పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు వివరించామన్నారు. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఎక్కువగా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆలం మానస, హెల్త్ అసిస్టెంట్ కె.భాస్కర్ రావు, కార్యదర్శి వేణు, ఏఎన్ఎం సమ్మక్క, పా యం రాకేష్, స్వప్న, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిరుపయోగంగా చలివేంద్రాలు
కన్నాయిగూడెం : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాడానికి జనావాసాలు ఉన్న ప్రధాన రహదారులపై గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు కొన్ని గ్రామ పంచాయతీల్లో నీరులేకుండా అపరిశుభ్రంగా మారాయి. మండుటెండలో పనులకు వెళ్లి వస్తున్న వారి దాహాన్ని తీర్చలానే ఉద్దేశంతో ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో జీపీ కార్యదర్శులు, సర్పంచ్లు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదట బాగానే ఉన్న కొన్ని రోజుల తర్వాత పంచాయతీ అధికారులు నిర్వహణను పూర్తిగా మరిచి పోయారు. కుండల్లో నీరులేకుండా అపరిశుభ్రంగా తయారయ్యాయి. అక్కడా నీరు లేకపోవడంతో దాహం వేసిన ప్రజలు అందుబాటులో ఉన్న షాపుల్లో వాటర్ బాటిల్లు కొనుగోలు చేసి వారి దాహాన్ని తీర్చుకుంటున్నారు. దీంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నిరుపయోగంగా మారడంతో పేరుకు మాత్రమే ఏర్పాటు చేశారా అని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా సర్పంచ్లు చొరవ తీసుకొని చలివేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజలకు తప్పని నీటి తిప్పలు పట్టించుకోని అధికారులు -
మేడారంలో నార్కొటిక్స్ తనిఖీలు
ఎస్ఎస్ తాడ్వాయి : మండలంలోని మేడారంలో బుధవారం నార్లాపూర్ ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు నార్కొటిక్స్ తనిఖీ చేపట్టారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు స్నిఫర్ డాగ్తో విస్తృత తనిఖీ నిర్వహించారు. షాపులు, గోదాముల్లోని ప్రతి మూలన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. అనుమానిత సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు. -
బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
గోవిందరావుపేట : మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన మద్దినేని లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు.. ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు వేల్పుగొండ ప్రకాశ్ ఆధ్వర్యంలో రూ.6 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మేకల రాధాసుదర్శన్, నాయకులు తేళ్ల హరిప్రసాద్, నరేందర్ రెడ్డి, సారయ్య, వెంకటేష్, భిక్షపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వాజేడులో.. వాజేడు : మండల కేంద్రంలోని నాగారం వీధికి చెందిన కుర్సం చందర్ రావు వడదెబ్బతో మృతి చెందాడు. కాగా బాధిత కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ దహన సంస్కారాల నిమిత్తం బుధవారం రూ.5వేల ఆర్థికసాయం అందించారు. వత్సవాయి జగన్నాథరాజు, సీతాలు, కృష్ణ ఉన్నారు. -
చదువుకు పేదరికం అడ్డుకాదు
ఎస్ఎస్తాడ్వాయి : చదువుకు పేదరికం అడ్డుకాదని తాడ్వాయి ఎస్సై కొయ్యడ జగదీశ్ అన్నారు. కల్లు గీతకార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గండు సదయ్య, కార్యదర్శి తిర్రి సంపత్ సమక్షంలో బుధవారం పదో తరగతి, ఇంటర్లో మెరిట్ సాధించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై జగదీశ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవి, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు పులి నర్సయ్య హాజరయ్యారు. కాటాపూర్, నార్లపూర్, వెంగ్లాపూర్, తాడ్వాయి గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులను సన్మానించి మెమోంటోలు అందజేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు ఎస్సై జగదీశ్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగు సత్యనారాయణ, పాలకుర్తి బాబు, నర్సయ్య, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మురుగును తొలగించరూ..!
కన్నాయిగూడెం : మండల కేంద్రంలోని గూర్రేవుల గ్రామ పంచాయతీలో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రధాన రహదారికి సరైనా డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వాడినా మురుగు నీరు రోడ్డు పక్కన నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మురుగును తొలగించాల్సిన పంచాయతీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మురుగును తొలగించాలని పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామంలోని మదనం పోశమ్మ ఆలయం వద్దకు నిత్యం ప్రజలు, భక్తులు మొక్కులు చెల్లించుకోవానికి వస్తుంటారు. గుడి సమీపంలో రోడ్డుపక్కన నెలల తరబడి మురుగు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మురుగును తొలగించాలని కోరుతున్నారు. -
ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలి
వెంకటాపురం(కె) : ఆన్లైన్ విధానంలో మెడికల్ విక్రయాలు నిలిపివేయాలని కెమిస్ట్, డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్ణ చందర్రావు అన్నారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండలంలోని మెడికల్ షాపులను బంద్ చేశారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. నాయకులు మట్ట రామకృష్ణ, రామ్మూర్తి, ముస్తాఫా, రాంబాబు, అంకారావు, శ్రీనివాస్, నరహారి, జయసింహ, కిషోర్, వెంకట్, జోగారావు, బాబురావు తదితరులు ఉన్నారు. మెడికల్ షాపుల బంద్ విజయవంతం వాజేడు : ఆన్లైన్లో మెడికల్ విక్రయాలకు వ్యతిరేకంగా చేపట్టిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. మొగిలి, రత్న శంకర్, నరేందర్, నర్సింహరావు, రాము, హరిబాబు, భాస్కర్, రాజేష్, అబ్ధుల్లా, రాజు తదితరులు ఉన్నారు. మెడికల్ షాపు యజమానుల ర్యాలీ మంగపేట : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన మెడికల్ షాపుల బంద్కు మద్దతుగా మండలంలోని మెడికల్ షాపుల యజమానులు దుకాణాలను మూసివేసి బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కమలాపురం, మంగపేట, మల్లూరు, రాజుపేట తదితర గ్రామాల్లోని మెడికల్ షాపులను మూసేసి ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ సమయంలో మందుల విక్రయాలపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కరివర్ధన్, శ్రీనివాసరెడ్డి, శశిధర్, తదితరులు పాల్గొన్నారు. మెడికల్ షాపుల యజమానులు బంద్ నిరసన ఏటూరునాగారం : మండలంలోని మెడికల్ షాపులు బంద్ చేసి ప్రధాన రోడ్డుపై యజమానులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా గౌరవ సలహాదారుడు అజ్మత్ఖాన్, సయ్యద్ గౌస్పాషా, బొరగాని బాపురావు, లక్ష్మణ్దేవ్, ఉమేష్, శివశంకర్, కిరణ్, ముజీబ్, సతీష్, నాగేశ్వర్రావు, మహేందర్, నాగరాజు, శ్రీనివాస్, ఇమ్రాన్, వాజీత్ పాల్గొన్నారు. -
డ్రెయినేజీల్లో పూడికతీత
గోవిందరావుపేట : మురుగు నీరు నిల్వ ఉండకుండా గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు దుంపెల్లిగూడెం సర్పంచ్ బానోత్ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం గ్రామంలో డ్రెయినేజీలో మట్టి కూరుకుపోవడంతో సీతారాం నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ సిబ్బందితో పూడికతీత పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. వానాకాలంలో దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో స్నేహభావం వాజేడు : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో బుధవారం ఎనిమిది గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ధర్మవరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయగా సర్పంచ్ కాక సుమతి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎస్సై కృష్ణ ప్రసాద్ హాజరై మాట్లాడారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా క్రికెట్ పోటీలను నిర్వహించాలని నిర్వాహుకులకు సూచించారు. పరామర్శ ములుగు రూరల్ : జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రోజు సత్యంచారి బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను నాలుగో వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని నిరంజన్ పరామర్శించారు. అనంతరం సత్యం మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యక్తి ఆత్మహత్య కన్నాయిగూడెం : భార్య చనిపోయిందన్న బెంగతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ సంఘటన కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామ పరిధిలో గల గొత్తికోయగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. గొత్తికోయగూడెనికి చెందిన మడవి జోగయ్య (45), భార్య గతేడాది పురుగుల మందు తాగి చనిపోయింది. అనంతరం భార్య లేదనే ఆలోచనతో కలత చెందిన భర్త జోగయ్య మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగయ్య కొడుకు సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విరమణ తప్పనిసరి భూపాలపల్లి రూరల్ : ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరి అని జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ అన్నారు. జంగేడు పీఏసీఎస్లో స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేసిన ఎం. భిక్షపతి పదవి విరమణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాక్స్ చైర్మన్ మేకల సంపత్, జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భిక్షపతి దంపతులను శాలువాతో సత్కరించారు. -
జన జాతీయ గరిమ్ ఉత్సవ్ ర్యాలీ
వాజేడు: మండల కేంద్రంలో బుధవారం జన జాతీయ గరిమ్ ఉత్సవ్ 2026 ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో గిరిజనుల అభివృద్ధికి చర్యలు, వైద్యసేవలు తదితర పథకాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగారం సర్పంచ్ బోదెబోయిన స్వరూప, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పాలనపై పర్యవేక్షణ కరువు
మంగపేట : మండలంలోని గ్రామ పంచాయతీల పాలనపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. మండలంలో 14 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిలిచి పోయిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని 52 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లో లేకపోవడంతో వారి స్థానంలో వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో పంచాయతీల పాలన కొనసాగుతోంది. దీంతో పాటు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండకుండా అలా వచ్చి ఇలా వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. 25 గ్రామ పంచాయతీల ప్రత్యేకాధికారుల పాత్ర సైతం పేరుకే అన్న చందంగా తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. లక్షల్లో నిధుల దుర్వినియోగం గ్రామ పంచాయతీల పాలన, నిధుల వినియోగంపై సంబంధిత మండల, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా పంచాయతీలకు జనవరి, ఫిబ్రవరిలో జనాభా ప్రతిపాదికన ఒక్కో పంచాయతీకి సుమారు రూ.2లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. మండలంలోని నిమ్మగూడెం పంచాయతీ కార్యదర్శి రూ 7.29 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో ఇటీవల సస్పెండ్ చేశారు. మరికొందరు కార్యదర్శులు ఆయా పంచాయతీల ట్రాక్టర్ల రిపేరు, డీజిల్ కొనుగోలు, పారిశుద్ధ్య నిర్వాహణ ఖర్చు, వీదిలైట్ల ఏర్పాటు, సిబ్బంది దుస్తులు, చెప్పులు తదితర పనుల పేరుతో లక్షల్లో దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. చుట్టపుచూపుగా జీపీ కార్యదర్శులు పేరుకే ప్రత్యేకాధికారులు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై దృష్టి సారించని అధికారులు -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ములుగు: మున్సిపాలిటీ పరిధిలోని 5 ,6వ వార్డులలోని లోఓల్టేజీ సమస్యను స్థానికులు మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కౌన్సిలర్ గుగ్గిల్ల దివ్య దృష్టికి తీసుకవెళ్లారు. వారు స్పందించి ములుగు ట్రాన్స్కో ఎస్ఈ భిక్షపతి దృష్టికి సమస్యను తీసుకవెళ్లగా ఎస్ఈ వెంటనే స్పందించి లోఓల్టేజీ సమస్యను తీర్చేందుకు 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అధికారులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రవి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
పటిష్ట బందోబస్తు
భూపాలపల్లి: మూడు రాష్ట్రాల సరిహద్దులోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ నెల 21నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేశాం. అయితే గతంలో జరిగిన పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వన్ వే ఏర్పాటు చేశాం. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఏఐ డ్రోన్ను సైతం వినియోగించబోతున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి భద్రతే ప్రధాన ధ్యేయంగా పని చేసేందుకు పోలీస్శాఖ సిద్ధంగా ఉందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’కి తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఏఐ డ్రోన్తో 5 కిలోమీటర్లు పర్యవేక్షణ.. పుష్కరాల సందర్భంగా ఈసారి అత్యాధునిక టెక్నాలజీని వాడుతాం. ఏఐ డ్రోన్ను వినియోగించి కాళేశ్వరం పోలీస్స్టేషన్ నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో పర్యవేక్షిస్తాం. వాహనాలు, భక్తుల సంఖ్యను సైతం ఏఐ డ్రోన్ లెక్కిస్తుంది. తద్వారా భక్తుల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యను ముందుగా నే గమనించి పరిష్కరించవచ్చు. ఇప్పటికే కాళేశ్వరంలో ఉన్న సీసీ కెమరాలు కాకుండా మరో 150 కెమెరాలను బిగించాం. కమాండ్ కంట్రోల్ రూంను కాళేశ్వరం ఠాణాలో ఏర్పాటు చేశాం. పుష్కర ఘాట్, దేవాలయ పరిసరాల్లో మరో మూడు డ్రోన్లతో నిత్య పర్యవేక్షణ ఉంటుంది. విధుల్లో సుమారు వేయి మందికి పైగా.. పుష్కరాల సందర్భంగా సుమారు వేయి మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. నాతో పాటు అదనపు ఎస్పీ, 12మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మందికి పైగా ఎస్సైలు, మరో 900 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అంచనాకు మించి భక్తుల సంఖ్య పెరిగితే పోలీసు సిబ్బందిని పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వన్ వే.. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు వన్ వే ఏర్పాటు చేశాం. పెద్దపల్లి జిల్లా మంథని తది తర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గంగారం ఎక్స్రోడ్ నుంచి అన్నారం, మద్దులపల్లి మీదుగా, హనుమకొండ, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాలు కాటారం మండలం బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా గంగారం ఎక్స్రోడ్, అన్నారం మీదుగా కాళేశ్వరా నికి చేరుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి మహదేవపూర్ మీ దుగా కాటారం చేరుకున్నాక హనుమకొండ, కరీంనగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్కు సమస్య తలెత్తకుండా కాళేశ్వరానికి మూడు వైపులా సుమారు 250 ఎకరాల్లో 23 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఏఐ డ్రోన్తో పర్యవేక్షిస్తాం సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేశాం వన్ వేకు వాహనదారులు సహకరించాలి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పోగొట్టుకున్న సెల్ఫోన్ అప్పగింత
రేగొండ: పోగొట్టుకున్న సెల్ఫోన్ను గుర్తించి బాధితుడికి ఎస్సై సుధాకర్ మంగళవారం అందజేశారు. గణపురం మండల కేంద్రానికి చెందిన రాజు పరకాలకు వెళ్తుండగా ఫోన్ ఎక్కడో పడేసుకున్నాడు. ఈమేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివరాలు నమోదు చేసి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ గుర్తించి బాధితుడికి అందించారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని, ఈ పోర్టల్ ద్వారా ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్సై సూచించారు. -
సింగరేణి అభివృద్ధికి సమష్టి కృషి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగుల సమష్టి కృషి అవసరమని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం కేటీకే 5వ గనిలో నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా ఉద్యోగులు కూడా ధైర్యంగా ముందుకు సాగుతూ భూగర్భ గనుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. టెండర్ల ఆహ్వానం మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ది పనుల కోసం అధికారులు టెంబర్లను ఆహ్వానించినట్లు తెలిసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. భూ నిర్వాసితుల నుంచి సేకరించిన రన్వే స్థలానికి పెన్షింగ్, బోర్డులు ఏర్పాటు, ప్రాంగణంలోని ఏపుగా పెరిగిన ముళ్లపొదలు, ఇతర చెట్ల తొలగింపు, విమానాశ్రయంలో భూసార పరీక్షలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. రూ.20 లక్షల కేటాయించగా 180 రోజుల్లో పర్యావరణ అనుమతులు, భూసార పరీక్షలు నిర్వహించేందుకు టెండర్దారులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. -
కూలీలకు హాజరు కష్టాలు
టేకుమట్ల: ప్రభుత్వాలు పల్లెల్లో వలసలను నివారించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. గత సంవత్సరం వరకు ఉపాధి కూలీల హాజరు నమోదును మ్యానువల్గా ఉండగా ఉపాధిలో అవకతవకలు జరుగుతున్నాయనే కారణంతో ప్రభుత్వాలు ఉపాధి పథకాన్ని పూర్తి స్థాయిలో ఆన్లైన్ నమోదు చేశాయి. ఉపాధి కూలీల హాజరు నుంచి చేయాల్సిన పనులు, పని ప్రదేశం, పని దినములు వంటి అంశాలన్ని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. దాంతో ఉపాధి హామీ పథకం మొత్తం ఆన్లైన్లో నిక్షిప్తం అవుతోంది. ఉపాధి కూలీలకు తిప్పలు గతంలో ఉపాధి కూలీలు నేరుగా పని ప్రదేశానికి చేరుకుని పని చేసి తిరిగి ఇంటికి వచ్చే వారు. కూలీలు పని చేస్తున్న సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ హాజరును నమోదు చేసేవారు. కానీ ప్రస్తుతం ఉపాధి కూలీలు పనికి వెళ్లే ముందు ఎన్ఆర్ఈజీఏ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్లో తప్పని సరిగా క్యాప్చర్ మస్టర్ రోల్లో ఉదయం, మధ్యాహ్నం హాజరు నమోదు చేయాలి. హాజరు నమోదు ప్రక్రియలో ఐరిస్ క్యాప్చర్ చేసినప్పుడు చాలా మంది కూలీల కళ్లు నమోదు కాకపోవడంతో వెనుతిరిగి వెళ్తున్నారు. మరికొంత మంది కూలీలకు ఈ కేవైసీ చేయడంతో హాజరు నమోదుకు సమస్య లేకుండా పోతుంది. మరికొంత మంది కూలీలకు ఆధార్ అప్డేట్ చేసినా క్యాప్చర్ మస్టర్ రోల్లో హాజరు అనుమతించకపోవడంతో పని ప్రదేశానికి వచ్చి వెనుతిరిగి వెళ్తున్నారు. ఇప్పటి వరకు మండలంలోని 25 గ్రామాలలో ఐరిష్ సమస్యతో ఎంతో మంది కూలీలు ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఇప్పటికై నా అధికారులు ఐరిష్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని చూపిస్తే మరెంతో మంది ఉపాధి కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని పలువురు కోరుతున్నారు. మస్టర్లో పేరున్నా ఐరిస్ రాని వైనం ఖాళీగా ఉంటున్న ఉపాధిహామీ కూలీలు -
చలివేంద్రం ఏర్పాటు
ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని బంధాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనుల వద్ద సర్పంచ్ మంకిడి శ్రీలత మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కూలీల సమస్యలపై ఇటీవల ‘సాక్షి‘లో ఉపాధి కూలీల సౌకర్యాలపై పట్టింపేది? అనే కథనం ప్రచరితం కావడంతో అధికారులు స్పందించారు. మండుతున్న ఎండల మధ్య పని చేస్తున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీడ కోసం గ్రీన్ మ్యాట్తో పందిరి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చల్లని తాగునీరు అందించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ శ్రీలత తెలిపారు. అనంతరం కూలీలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్లో చేరిక మహాముత్తారం: మండల కేంద్రానికి చెందిన సినియర్ బీఆర్ఎస్ నాయకుడు రామచంద్రం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొంగొర్ల బాపు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి దుద్దిళ్ల శ్రీదర్బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాటి లచ్చయ్యగౌడ్ ఉన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారంలో అనారోగ్య కారణంగా 65 సంవత్సరాల గుర్తు తెలియని యాచకుడు ఈనెల 18న మృతి చెందినట్లు నార్లాపూర్పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం ఫ్రిజర్లో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి బంధువులు, రక్త సంబంఽధీకులుగానీ మేడారంలోని నార్లాపూర్ పోలీస్ స్టేషన్కు రావాలన్నారు. యాచకుడి గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే 87126 30132 నంబర్ను సంప్రదించాలన్నారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య గణపురం: మండలకేంద్రానికి చెందిన జక్కు వినయ్ (25) ఆరోగ్యం సహకరించడం లేదని మనస్తాపానికి గురై పరుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన జక్కున వినయ్ కొంత కాలంగా కిడ్నీల సంబంధిత వ్యాధితో ఎన్ని ఆస్పత్రులకు పోయిన నయం కావడం లేదు. దీంతో మనస్థాపంతో సోమవారం రాత్రి పరుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తండ్రి జక్కు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 11 వార్డులోని నివాసం ఉంటున్న ఆగమ్మ (85) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మ్యూజియం పనుల ఆలస్యంపై కలెక్టర్ ఫైర్
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల పనుల్లో భాగంగా మ్యూజియం నిర్మాణ పనులు పూర్తికాకపోవడంపై కలెక్టర్ రాహుల్శర్మ అధికారులపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన సరస్వతి ఘాట్, గోదావరి నది ఒడ్డు, టెంట్ సిటీ, మ్యూజియం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, మిగిలిన పనులను బుధవారం వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. మ్యూజియం పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమయానికి సిద్ధం చేయాలన్నారు. పరిశుభ్రత, భద్రత, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంత కుమారి, డీఎస్పీ సూర్యనారాయణ, ఆర్డీఓ రవీందర్, దేవస్థానం ఈఓ మహేష్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
మొగుళ్లపల్లి: మండలంలోని ఇస్సిపేట సర్పంచ్ యార ముకుందర్ రెడ్డి, ఉపసర్పంచ్ బత్తిని శ్రీధర్ గౌడ్, లక్కమారి కాపు సంఘం గ్రామ అధ్యక్షుడు పెంతల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. రోజంతా ఎండలో పనిచేయకుండా ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసి సాధారణ జీవనం గడుపుతున్న కూలీలకు ఉపాధిహామీ పథకం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఎండ తీవ్రత బాగా ఉన్నందున కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మాధవి, ఈసీ రాము, టీఏ శ్రావణ్, పంచాయతీ కార్యదర్శి సునీల్, సీనియర్ మేట్ అజయ్ పాల్గొన్నారు.ఎస్ఎస్తాడ్వాయి: మేడారం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు సర్పంచ్ పిరీళ్ల భారతి మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్యం దెబ్బతిన్నకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలు ఉదయమే పనులు పూర్తి చేసుకుని ఉదయం 9గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆలకుంట వనిత, పంచాయతీ కార్యదర్శి శరత్ ఉన్నారు. -
ఫొటో రాక పనికి వెళ్తలేను..
ఉపాధి పనికి వెళ్లేందుకు రోజు కూలీలను ఫొటో తీసేచోటికి వెళ్తున్నా. నా కళ్లు ఫొటో తీసేటప్పుడు రాకపోవడంతో ఇప్పటికి ఐదు రోజుల నుంచి పనికి వెళ్తలేను. ఈ కేవైసీ చేసినా కళ్ల ఫొటో వస్తాలేదు. ఇప్పటికై నా నా ఫోటో వచ్చేలా సార్లు చూడాలి. పనికి వెళ్లాలని ఉన్నా ఫొటో పడకపోవడంతో ఖాళీగా ఉంటున్నా. – వీరమ్మ, ఉపాధి కూలీ టేకుమట ్లసమస్య లేకుండా చూస్తున్నాం..క్యాప్చర్ మస్టర్ రోల్ అటెండెన్స్లో ఐరీష్ను క్యాప్చర్ తీసుకోవడంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఈకేవైసీ చేస్తున్నాం. ఈ కేవైసీ చేసినా ఐరిస్ క్యాప్చర్ కాకుంటే ఆధార్ ఆప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నాం. మస్టర్లో పేరున్న అందరికి ఉపాధి హామీలో పని కల్పించడం కోసం కృషి చేస్తాం. – రమేశ్, ఏపీఓ, టేకుమట్ల -
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు
ములుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు అందేలా చూడాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ అక్రిడిటేషన్ మార్గదర్శకాలు నూతనంగా విడుదల కాగా ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. వాటిలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందే విధంగా చూడాలని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండి.రఫీక్, కమిటీ సభ్యులు ఎండి.షఫీ అహ్మద్, గాదం దేవేందర్, బి. పృధ్వీరాజ్, బండారి లక్ష్మణ్, అబ్దుల్ గఫార్, చుంచు రవి, రాజేష్, వడ్లకొండ వీరయ్య, బి.అశోక్, జూనియర్ అసిస్టెంట్ కొత్తపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ములుగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ హేమంత్ సహదేవరావును ఆయన కలిశారు. జిల్లాలో రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మచైర్మన్ రవీందర్రెడ్డి, జిల్లా నాయకులు ఓరుగంటి అనిల్, మట్టెవాడ తిరుపతి, మాదారపు రాజు పాల్గొన్నారు.తవ్వకాల్లో బయటపడిన రాళ్ల పరిశీలనములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సమ్మక్క–సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం తవ్వకాల్లో బయటపడిన రాళ్లను మంగళవారం పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ ఎస్ఎస్ రంగాచార్యులు, డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆలయానికి సంబంధించిన రాళ్లుగా అనుమానించారు. రాళ్ల కొలతలను తీసుకుని శాసీ్త్రయ పద్ధతిలో ఆధారాలు సేకరించారు. శిల్పం, గుడి ఆనవాళ్లు, గుడి ఆకారం బయటపడలేదని, గుడికి సంబంధించిన ఇటుకలు సైతం కనిపించలేదని తెలిపారు. పూర్తి నివేదికను తయారు చేసి పురావస్తు శాఖకు అందించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంరక్షణే టీబీజీకేఎస్ లక్ష్యంభూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మిక హక్కులను రక్షిస్తూ సంస్థను సంరక్షించడమే తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీబీజీకేఎస్) లక్ష్యమని ఆ సంఘం వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని కాకతీయ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పరిస్థితి దయనీయంగా మారిందని, సంస్థ ప్రైవేటీకరణ అంచున ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, మెడికల్ బోర్డు నిర్వహణలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో సింగరేణి అప్పుల ఊబిలోకి వెళ్లిందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మండ సంపత్, లక్ష్మణ్, రాకేష్ రెడ్డి, అనిల్, సాంబయ్య, కిషన్ పాల్గొన్నారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ షురూ ● అన్ని సబ్జెక్టులు కలిపి 88,512 జవాబుపత్రాలు విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించారు. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు (అధ్యాపకులు) 49 మంది వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాకు హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంగా ఉంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఈ క్యాంపునకు 88,512 జవాబుపత్రాలు కేటాయించారు. మొదటిదశలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబుపత్రాలు అలాగే మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పేపర్ 2 జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు క్యాంప్ ఆఫీసర్, డీఐఈఓ ఎ.గోపాల్, ఏసీఓ జనరల్–1 శ్రీనివాస్రావు తెలిపారు.రెండో దశలో ఫిజిక్స్, ఎకనామిక్స్, బాటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ఈనెల 24 నుంచి నిర్వహించనున్నారు. -
‘దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి’
వెంకటాపురం(కె): ఆదివాసీలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నర్సింహామూర్తి, గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో గిరిజనేతరులను ఏజెన్సీ నుంచి పంపించాలని కోరుతూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఆండ్బీ ప్రధాన రహదారిపై బైటాయించి ఽఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నర్సింహామూర్తి, సాయిలు మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన రాంబాబుపై దాడి చేసిన గిరిజనేతరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాలను ఎంపీడీఓ జుమ్మిలాల్, తహసీల్దార్ వేణుగోపాల్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుంజా మహేష్, పూనెం ప్రతాప్, నాగరాజు, వాసం నారాయణ, బాబు, శివ, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల పరిశీలన
వాజేడు: మండలంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను మంగళవారం ఎంపీడీఓ శ్రీకాంత్నాయుడు పరిశీలించారు. మండల పరిధిలోని ఏడ్జెర్లపల్లి, పూసూరు గ్రామాల్లో కుంటల పూడిక తీత పనులు జరుగుతుండగా పనులను పరిశీలించి కూలీలకు పలు సూచనలను చేశారు. మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పురిటి నొప్పులు పోస్టర్ను తహసీల్దార్ సునీత మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ గేయాన్ని ఆలపించిన అంకుశాపూర్ గ్రామానికి చెందిన జీడి అనితను అభినందిస్తూ సామాజిక చైతన్య గీతాలు ఇంకా ఎన్నో పాడాలని, మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అమ్మ ప్రేమను వెలకట్టలేమనీ, ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేమని, కన్నతల్లి ప్రేమను మరువద్దని, జీవితాంతం అమ్మను కంటి రెప్పల కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు నిమ్మల భద్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంద సాంబయ్య, డీలర్ల జిల్లా కార్యదర్శి గంగాదార్ రాజు, జీడి సంపత్ ,గాయకులు పుల్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలైన సంఘటన మండలంలోని జీడివాగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. మంగపేటకు చెందిన సోడి సమ్మక్క అనే మహిళ శుభకార్యానికి ఏటూరునాగారం వచ్చి మంగపేట వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో టీఎంటీ పర్వతాల రాజ్కుమార్, పైలెట్ భరత్ సహాయంతో బాధితురాలిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుడుంబా పట్టివేత చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన తీగల రమ అక్రమంగా 10లీటర్ల గుడుంబాను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో పోలీసులు ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన తీగల రమ గుడుంబాను పట్టుకుని అమ్ముకునేందుకు వెళ్తుతుండగా పట్టుకున్నారు. గుడుంబాను స్వాధీనం చేసుకుని ఆమైపె కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ఎవరైనా గుడుంబా అమ్మినా, తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్యాబోధనతో పాటు కార్పొరేట్ స్థాయికి దీటుగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రతీ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి తగ్గ అంశాలలో తర్ఫీదు అందిస్తున్నామన్నారు. బాలికల ఆత్మరక్షణకోసం కరాటే శిక్షణ, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పొందేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్ అధికారి సామల రమేష్, బీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్రెడ్డి, సర్పంచ్ చాట్ల విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ -
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఏటూరునాగారం: మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మంగళవారం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఆధ్వర్యంలో జన జాతీయ గరిమ్ ఉత్సవ్ 2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఓ లెనిన్ వత్సల్ టొప్పో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హెల్త్ స్క్రీనింగ్, యాక్టివిటీ క్యాంప్, షీటీమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొక్కలను నాటారు. మొక్కలను ప్రతిఒక్కరూ నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ నాగోరావు, జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ డాక్టర్ జగదీశ్, స్టాటిస్టికల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్కుమార్, సీహెచ్సీ సూపరింటెండెంట్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండలోనే ప్రయాణికులు
కన్నాయిగూడెం: మండలంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. మండలం నుంచి వందల వాహనాలు, వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి పలిమెల, మహదేవపూర్, మహాముత్తారం, కాళేశ్వరం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఏటూరునాగారం, ములుగు, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు రవాణా సాగిస్తుంటారు. కానీ మండలంలో ఇప్పటి వరకూ బస్టాండ్, బస్ సెల్టర్లు లేక ప్రధాన రహదారి వెంట ఉన్న ఎండలో ఉండి బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించాల్సిన పరిస్థితి. అలాగే తాగు నీరు, నీడా లేక ఎండలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బస్ షెల్టర్ లేకపోవడంతో బస్సుల కోసం చూస్తున్న ప్రయాణికులు ఎండకు తట్టుకోలేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై న అధికారులు మండల కేంద్రంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలిన స్థానికులు కోరుతున్నారు. బస్షెల్టర్ లేక అవస్థలు పట్టించుకోని అధికారులు బస్ షెల్టర్ లేక మండలంలోని ప్రయాణికులు గంటల కొద్ది ఎండల్లోనే నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో, లక్ష్మీపురం వద్ద బస్ షెల్టర్లు నిర్మించాలి. అలాగే తాగు నీరు ఇతర సౌకర్యాలు కల్పించాలి. – రాజుకుమార్, యువకుడు, బుట్టాయిగూడెం -
మరింత మద్దతు
వరి క్వింటాకు రూ.72, పత్తికి రూ.557 పెరిగిన ధరములుగు: జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పంటలకు ఇంకాస్త మద్దతు ధర పెరిగింది. ప్రతిఏటా మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. 2026–27 సంవత్సరానికి వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్రం ప్రకటించింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,63,229 ఎకరాల్లో సాగవుతుండగా ఇందులో వరి, పత్తి పంటలు ప్రధానంగా ఉంటాయి. వర్షాలు అనుకూలించి, రాబోయే వానాకాలంలో 1,07,700 ఎకరాల్లో వరిపంట, 28,600 ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 11,329 ఎకరాల్లో, ఇతర పంటలు 15,600 ఎకరాల్లో సాగు కానున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం వరిపంట క్వింటాకు రూ.72లు పెంచింది. గ్రేడ్ –ఏ రకానికి గతేడాది రూ.2,389 ఉంటే ఈ ఏడాది రూ.2,461లకు చేరింది. ఇక సాధారణ రకాలకు గతేడాది రూ.2,369గా ఉన్న ధర రూ.2,441కు పెరుగుతుంది. పత్తి క్వింటాకు రూ.557 పెంచడంతో రూ.8,110 నుంచి రూ.8,667కు చేరుకోనుంది. వరి పంటకు కేవలం రూ.72లు మాత్రమే పెరగడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం క్వింటా వరి పంటకు రూ.500లు పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచగా అందులో అత్యల్పంగా కేవలం మొక్కజొన్న పంటకు రూ.10లను మాత్రమే పెంచి రైతులకు మొండిచేయి చూపింది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో రాబోయే వానాకాలం సీజన్కు 11,329 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు కానుంది. 2024 ఖరీఫ్లో 2,717 ఎకరాలు, 2025 ఖరీఫ్లో 10,029 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ప్రతిఏటా జిల్లాలో మొక్కజొన్న పంట సాగు పెరుగుతుండగా ప్రభుత్వం మద్దతు ధర కేవలం రూ.10లు మాత్రమే పెంచడంతో మొక్కజొన్న పంటల సాగుకు రైతులు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. క్వింటా మొక్కజొన్నకు రూ.2,400లు ఉండగా పెరిగిన ధరతో రూ.2,410 కానుంది. కందులకు రూ.450, మినుమలకు రూ.400, వేరుశనగకు రూ.254, పొద్దు తిరుగుడుకు రూ.622, నువ్వులకు రూ.500 మద్దతు ధరను కేంద్రం పెంచింది. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే రెండు పంటలివే.. మొక్కజొన్నకు కేవలం రూ.10 పెంపు 2026–27 సీజన్ నుంచి పెరిగిన ధరలు వర్తింపుపంట 2024 2025 2026 వరి 95,739 1,06,236 1,07,700 పత్తి 20,740 27,294 28,600 మొక్కజొన్న 2,717 10,029 11,329 ఇతర పంటలు 14,000 14,000 15,600పంటల సాగుకు ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. యంత్రాలు, డీజిల్, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు ౖపైపెకి వెళ్తున్నాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరగడంతో కూలీల ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పెరిగిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పంటల ధరలు నిర్ణయించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి పంటలకు పెట్టుబడులు పెరిగాయని అందుకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగలేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న మద్దతు ధర పరిస్థితి మరింత ఆధ్వాన్నంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు మరికొంత పెంచి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
మల్లూరుగుట్టపై మంటలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై మంటలను నివారించేందుకు సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గుట్టపై తరచుగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో లక్షల రూపాయల విలువైన అటవి సంపద కాలి బూడిదవుతోంది. అడవిలో కార్చిచ్చు సుమారు 30 కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న మల్లూరు గుట్టలపై వందల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. గుట్టచుట్టూ ఉన్న అటవి ప్రాంతంలో మండు వేసవిలో సైతం తోగుల్లో ఊటనీరు, సహజసిద్ధమైన జలదారలు ఉండటంతో వివిధ రకాల అటవి జంతువులు, వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వేసవి కాలంలో కార్చిచ్చు, పోడు నరికే వారు అడవికి వచ్చి నిప్పు పెట్టడంతో అడవి తరచుగా దగ్ధమవుతోంది. దీంతో అడవి తగలబడటంతో పాటు కొన్ని వన్యప్రాణులు సైతం వేడికి తాళలేక సమీప గ్రామాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అటవీశాఖ అధికారులు తమకేమీ సంబంధం లేదనే విధంగా వ్యవహరించడం గమనార్హం. మూడు రోజులుగా.. గత మూడు రోజుల నుంచి మల్లూరులోని హేమాచల క్షేత్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు వెంట ఉన్న అటవి ప్రాంతం దగ్ధం అవుతోంది. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు మంటలను నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. ఇటీవల ఇదే ప్రాంతంలో రిజర్వు పారెస్టు చుట్టూ ఏర్పాటు చేసిన ట్రెంచ్ను పూడ్చి రోడ్డు పనులకు గుట్టను తవ్వి టిప్పర్లతో మొరం తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయా కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు దగ్ధమవుతున్న విలువైన అటవీ సంపద -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రేగొండ: ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం కొడవటంచలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
లారీ ఢీకొని పాడిగేదె మృతి
మంగపేట: మండలంలోని రమణక్కపేటలో రోడ్డు దాటుతున్న పాడి గేదెను ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన సంఘటన వివరాల మేరకు అభయాంజనేయస్వామి ఆలయం వద్ద పాడిగేదె రోడ్డు దాటు తుండగా మణుగూరుౖ వెపు నుంచి ఇసుక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పాడిగేదె మృతి చెందింది. పాడిగేదె విలువ సుమారు రూ.40 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు లారీని నిలిపివేసి నిరుపేద కుటుంబానికి చెందిన పాడిగేదె యజమాని చదలవాడ వెంకటనర్సమ్మ నష్టపరిహారం చెల్లించాలని డ్రైవర్ను డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
చిట్యాల: ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై–3 ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శివాజీ సెంటర్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే డ్రైవింగ్ చేసే వారి వద్ద తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్లతో పాటు తదితర పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది లాల్సింగ్, క్రాంతి, సందీప్తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన విద్యా వారోత్సవాలు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం విద్యా వారోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరంలో కాలేజిలో చేసిన పలు కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఉత్తమ అధ్యాపకులను, ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బాలయ్య, కవిత, భాస్కర్, శిరీష, రాధిక, అనిల్ కుమార్, ఉదయశ్రీ, విజిత, శంకర్, సోమన్న, జగదీశ్తో పాటు , తదితరులు ఉన్నారు. ఏటూరునాగారంలో..ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారం రోజుల పాటు చేపట్టిన విద్యా వారోత్సవాలు ఆదివారంతో ముగిసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కల్చరల్ కమిటీ కన్వీనర్ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా కరాటేలో రాణిస్తున్న సాయిచరణ్ను అధ్యాపకులు సన్మానించారు. వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జ్యోతి, కనీస్ ఫాతిమా, జీవవేణి, రాజశేఖర్, శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు సన్మానం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన మండలంలోని ఐదుగురు టాపర్ విద్యార్థులకు ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సాంబశివరావు మాట్లాడుతూ.. చదువుతోనే విద్యార్థులకు గుర్తింపు వస్తుందన్నారు. చదువు, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించనిది ఏది లేదన్నారు. విద్యార్థులు కోరంకున్నత్ కృష్ణ, బోడ సహస్రలక్ష్మీ, గాడిచర్ల మనిదీపిక, మండెల రక్షమయూరి, బాసాని అమృతలను సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న, బాలాజీ, పద్మశ్రీ, మల్లయ్య, శ్రావణ్, సుమన్, సమ్మయ్య పాల్గొన్నారు. -
ప్రణాళికతో ముందుకు సాగాలి
వాజేడు: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు, ఎంఈఓ తేజావత్ వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్మానించారు. మంద రిషిత్, మొడెం వైష్ణవి, కేశబోయిన అంజలిలు పదవ తరగతి ఫలితాల్లో మండలం నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలవడంతో వారికి ప్రశంస పత్రాలను ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్లు ఎన్నుకునే అవకాశం విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రణాళిక బద్ధంగా వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్వరూప్ సింగ్, శ్రీకాంత్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. -
పశుగ్రాసానికి తప్పని తిప్పలు
వాజేడు: గ్రాసం కోసం మూగ జీవాలు అలమటిస్తున్నాయి. ప్రతీ ఏదాడి యాసంగి పంటలు అయి పోగానే రైతులు మూగ జీవాల కోసం మేతను సేకరించి నిలువ చేస్తారు. ఈ ఏడాది పంటలు అయి పోగానే మేతను సేకరించే పనిలో రైతులు సిద్ధమయ్యారు. కాని వేసవి ఎండలు అధికంగా ఉండటంతో పంటలు పూర్తి కాక ముందే ఎరగళ్లు పడి గడ్డి చాలా వరకు కాలిపోతుంది. దీంతో వరి గడ్డి సేకరణ కష్ట సాధ్యంగా మారింది. కొందరు రైతులు మాత్రమే ముందస్తుగా గడ్డిని సేకరించి భద్రపర్చుకున్నారు. మూగ జీవాలకు మేతను ఏర్పాటు చేయడం కోసం రైతుల తిప్పలు తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు దగ్ధమైన గడ్డి.. వేసవి ఎండలు అధికంగా ఉండడంతో పొలాలు కోసిన వెంటనే ప్రమాదవశాత్తు గడ్డి దగ్ధమవుతుంది. కొందరు రైతులు వారి పొలంలోని గడ్డికి నిప్పు పెడుతున్నారు. ఒక పక్క కొయ్య కాలును తగలబెట్టవద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు రైతుల్లో ఇంకా మార్పు రావడం లేదు. దీంతో మేత లభించే అవకాశాలు లేక పోవడంతో పశువులకు మేతను ఎక్కడి నుంచి తీసుకు రావాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఉదయం లేవగానే మూగ జీవాలను వదిలేస్తున్నారు. వాటికి మేత లభించే అవకాశం లేక పోవడంతో చెట్లు, పుట్టలు, వాగుల వెంట తిరుగుతున్నాయి. పొద్దంతా రోడ్ల వెంట తిరిగి కాలీ కడుపుతో ఇంటికి వస్తున్నాయి. వర్షాలు కురిస్తేనే పశువులకు మేత లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదవశాత్తు దగ్ధమవుతున్న గడ్డి మేత లభించక అలమటిస్తున్న మూగ జీవాలు -
బాధిత కుటుంబాలకు పరామర్శ
ములుగు రూరల్: పరామర్శిస్తున్న మంత్రి సీతక్కవెంకటాపురం(ఎం)లో..ములుగు రూరల్: మల్లంపల్లి మండలంలోని గౌస్పల్లి గ్రామానికి చెందిన తిప్పారపు కిషన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా ఆదివారం పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్క బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వెంకటాపురం(ఎం): మండల కేంద్రానికి చెందిన అన్నబోయిన ఐలక్క ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని ఆదివారం ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల కార్తీక్ పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ఉప సర్పంచ్లు చింతం ప్రకాష్, ఎ.రాజు, బద్రునాయక్, రాజు యాదవ్ ఉన్నారు. గోవిందరావుపేట: మండలంలోని కర్లపల్లి గ్రామానికి చెందిన తండ్రికొడుకులు రసపుత్ రాజు, పవన్ ఇటీవల బావిలో పడి మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాన్ని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ఆదివారం పరామర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ, నాయకులు జంపాల ప్రభాకర్, శ్రీకాంత్, రసపుత్ సీతారాం నాయక్, నాగమణి పాల్గొన్నారు. -
నిరుపేద కార్యకర్తకు జీవనోపాధి
గోవిందరావుపేట: మండల పరిదిలోని చల్వాయి గ్రామానికి చెందిన నిరుపేద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గణపాక సుధాకర్ కుటుంబం జీవనోపాధి కోసం ఫాస్ట్ ఫుడ్ స్టాండ్ను కాంగ్రెస్ నాయకులు ఆదివారం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆర్థిక సాయంతో నాయకుడు పైడాకుల కృష్ణమూర్తి ఈ స్టాండును సుధాకర్కు బహూకరించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. తేళ్ల హరిప్రసాద్, వేల్పుగొండ ప్రకాష్, చాపల నరేందర్ రెడ్డి, మల్లారెడ్డి, పడిదల సాంబయ్య, సామ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళనలో రైతన్నలు
లారీలు లేక కొనుగోలు కేంద్రంలో ఉన్న బస్తాలు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తున్న రైతులుఏటూరునాగారం: వాతావరణంలో తరుచూ మా ర్పులు వస్తుండడంతో రైతుల్లో వణుకు పుడుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంతో గడుపుతున్నారు. ధాన్యం కాంటా అయినప్పటికీ లారీల్లో ఎగుమతి కాకపోవడంతో రైతులు పడిగాపులు పడుతున్నారు. మండలంలో కొనుగోలు కేంద్రాలు 11 ఉన్నప్పటికీ వాటి ద్వారా లారీల్లో మిల్లుకు బస్తాలు ఎగుమతి కావడం లేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు, ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ఎప్పుడు వ చ్చి తమను నష్టపర్చుతుందని ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన నిర్వాహకుల నిర్లక్ష్యం మూ లంగా లారీలు సమయానికి రాక ఎగుమతి కాకపోవడంతో పడిగాపులు పడుతున్నారు. మరికొంత మంది పండించిన ధాన్యం మార్చరైజ్(తేమశాతం) తగినంత లేదని కొనుగోలు కేంద్రాల వద్దనే ఆరబెట్టుకొని కాపాల కాస్తున్నారు. ఇప్పటికై నా మండల, జిల్లా అధికారులు స్పందించి లారీలను వెనువెంటనే తరలించి బ స్తాలను మిల్లులకు పంపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లారీల కొరతతో అవస్థలు కాంటాలు అయినా కదలని బస్తాలు వాతావరణంలో మార్పులుపండించిన ధాన్యంను తరలించడం లేదు. తేమశాతం లేదని కోతలు పెడుతున్నారు. లారీలు రావడం లేదని బస్తాలను ఇక్కడే నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. లారీలు లేక బస్తాలు పోక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వర్షం ఎప్పుడు వస్తుందోనని టార్పాలిన్లు పట్టుకొని ఇక్కడే కూర్చుకుంటున్నాం. – కంకనాల నర్సయ్య, ఏటూరునాగారం -
పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
నల్లబెల్లి : పేదల ఆరోగ్య భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ తెలిపారు. మండలంలోని నారక్కపేటకు చెందిన తిప్పని స్వరూప అనారోగ్య సమస్యలతో అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఈ క్రమంలో స్వరూపకు అశోక్ ఆదివారం చెక్కు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నారక్కపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీపతి సుమన్, నాయకులు పొగుల కుమారస్వామి, కుంచాల రాజు, వడ్లూరి రమేశ్, అస్సన్, కమిలి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆదర్శ’లో ప్రవేశాలు
మొగుళ్లపల్లి: ఇంటర్మీడియేట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఆదర్శ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియేట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో మొగుళ్లపల్లి, చిట్యాల, గణపురం, కాటారం, మల్హార్, మహాముత్తారం మండలాల్లో ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపుల్లో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తారు. ప్రక్రియ ఇలా.. పదవ తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియేట్లో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. బాలికలకు హాస్టల్ సౌకర్యం.. ఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియేట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం ఉంది. హాస్టల్కు కనీసం మూడు కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండే గ్రామాల నుంచి వచ్చే వారు మా త్రమే హాస్టళ్లలో ఉండేందుకు అర్హులు. వీరి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్, నర్సును నియమించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 25వ తేదీ వరకు గడువు -
ఆలయంపై అధికారుల చిన్నచూపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంపై మండల రెవెన్యూ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని తుడుందెబ్బ మేడారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ సునీల్ అన్నారు. ఆదివారం ఆయన మేడారంలో ఆదివాసీ నాయకులతో కలిసి మాట్లాడారు. మండల రెవెన్యూ అధికారులకు సమ్మక్క సారలమ్మ ఆలయంపై, ఆదివాసీ ఆచార వ్యవహారాలపై భక్తి శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. జాతరపై అవగాహన లేని అధికారులను నియమించడం వల్ల జాతర నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతుందన్నారు. మేడారంలో ఆదివాసీలకు సంబంధించిన భూముల విషయంలో తరతరాలకు నివసిస్తున్న వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు జనార్దన్, సిద్దబోయిన రవి, అర్జున్ కోరం ప్రేమ్, యాదగిరి, యాలం రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
● లారీల కోసం రోడ్డెక్కిన రైతులు ● గంటన్నర పాటు నిలిచిపోయిన ట్రాఫిక్మంగపేట : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే మిల్లులుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని కమలాపురంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట గల ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై రైతులు గంటన్నర పాటు బైటాయించి ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పలువురకు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు పెట్టి మిల్లులకు తరలించేందుకు లారీలను రాకపోవడంతో 25 నుంచి 40 రోజులుగా బస్తాల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే పండించిన పంట అకాల వర్షాల పాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు లారీల సమస్య తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో ధర్నాకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ మండు టెండను సైతం లెక్క చేయకుండా గంటన్నర పాటు రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు భారీ స్థాయిలో నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రయాణికులు, వాహనదారులు ధర్నా వద్దకు చేరుకుని మీ సమస్య కోసం తమను ఇబ్బంది పెట్టడం సరికాదని రైతులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విషయాన్ని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. -
వరదలను ఎదుర్కొనేందుకు మాక్ ఎక్సర్సైజ్
ములుగు: వర్షాకాలంలో వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నేడు (సోమవారం) జిల్లాలో మాక్ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం కలెక్టరేట్లో మాక్ ఎక్సర్జైజ్ వివరాలను వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని, మాక్ ఎక్సర్సైజ్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వరదలు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, అధికారుల సన్నద్ధతను పరీక్షించేందుకే నేడు ములుగు పట్టణంలోని వివేకానంద, కృష్ణ, పల్సాబ్పల్లి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎక్సర్సైజ్లో వరద ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఎవాక్యుయేషన్ చర్యలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సమన్వయంతో పనిచేసేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు.నేటి ప్రజావాణి రద్దు ములుగు: ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని తెలియజేప్పే మాక్ ఎక్సర్సైజ్ను జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇళ్ల గణన పరిశీలన వాజేడు: మండల పరిధిలోని మొరుమూరు గ్రామ పంచాయతీలో చేపట్టిన ఇళ్ల గణన కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీకాంత్నాయుడు ఆదివారం పరిశీలించారు. ఇళ్ల గణన జరుగుతున్న తీరును ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకోవదంతో పాటు ఒక్క ఇళ్లు కూడా గణన నుంచి తప్పి పోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలు సూచనలు చేశారు. క్రీడా పాఠశాలకు ఎంపిక కన్నాయిగూడెం: రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు మారుమూల ఆదివాసీ ముద్దుబిడ్డ ఎంపికయ్యింది. హకీమ్పేటలోని క్రీడా పాఠశాలలో అడ్మిషన్ల కోసం ఇటీవల పోటీలు నిర్వహించగా మండల పరిధిలోని రాజన్నపేట పంచాయతీ పరిధిలోని గంగగూడెం గ్రామానికి చెందిన పొడెం నందిత ప్రతిభ చూపి ఓపెన్ కేటగిరిలో ఎంపికయ్యింది. నందిత ఏటూరునాగారం మండల పరిధిలోని ఆకులవారి ఘనపురం ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. పోటీలో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక కావడంతో తల్లి,తండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో ప్రముఖులకు దారి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్లు రానున్నాయి. అక్కడే కంటెయినర్లు ఏర్పాటు చేస్తున్నారు. బయోటయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షమియానాలు, మ్యాట్లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అలాగేసరస్వతీనది అంత్యపుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
● రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్ ● 100 మంది విద్యార్థులకు సైకిళ్లు, 60 మందికి కుట్టుమిషన్ల పంపిణీ ఏటూరునాగారం: మహిళా సాధికారతే లక్ష్యమని రోటరీ క్లబ్ హనుమకొండ గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం 100మంది పేద విద్యార్థులకు సైకిళ్లు, 60 మంది మహిళలకు కుట్టు మిషన్లను స్థానిక సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, క్లబ్ సభ్యులు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, ప్రదీప్రావు, ప్రవీణ్రావులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాంప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు కుట్టు మిషన్లను ఇవ్వడం ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తారని తెలిపారు. ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఈ ప్రాంత అభివృద్ధికి మరింత సహకరించాలని అనిపిస్తుందని తెలిపారు. అందుకోసం జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న విద్యార్థుల కోసం సొంత ఖర్చులతో 25 కంప్యూటర్లను కొనుగోలు చేసి వారంలో అందజేస్తానని తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ సభ్యులు లక్ష్మీనర్సింహరావు మాట్లాడుతూ క్లబ్ సభ్యులతో మాట్లాడి వంద సైకిళ్లను తమవంతు సహకారంగా విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు దూరబారం వల్ల బడికి రావడం మానేశారని విషయం తెలుసుకుని క్లబ్ సభ్యులతో మాట్లాడి సైకిళ్లను విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరో వెయ్యి సైకిళ్లను కూడా అందిస్తామని హామీనిచ్చారు. అనంతరం కంటి వైద్య నిపుణులు శరత్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం లక్ష రూపాయలతో కంప్యూటర్లను అందించడంతో పాటు స్టడీ మెటీరియల్ సైతం అందజేస్తామన్నారు. అంతేకాకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శరత్ కంటి ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు కల్యాణ్, లక్ష్మి, బాలకోటిరెడ్డి, శ్యామ్, ప్రభాకర్, నరేశ్, జ్యోతిరెడ్డి, ప్రముఖులు డాక్టర్ వరప్రసాద్, కృష్ణ, అశోక్, రఘు, బోజారావు, ఉప సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు. -
బదిలీల భయం!
● ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులు ● స్థానచలనం తప్పదా? ● ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బది లీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది. ఇక్కడే తిష్ట.. ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూని యర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దా దాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బది లీలు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రావాలన్నా.. పోవాలన్నా భయమే! ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికా రుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉ ద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్ర స్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్గా పని చే స్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నా రు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్చార్జ్గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన చంద్రశేఖర్, గోపాల్రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సిటీలో కూడా పనిచేశారు. అయి తే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కములుగు/ములుగు రూరల్: సమాజంలో విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, అక్షరజ్ఞానం మనిషిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ హాల్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విద్య విజయోత్సవ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి మించిన మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తుందని తెలిపారు. విద్యారంగంలో జిల్లాకు ప్రత్యేకమైన విశిష్టత లభించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల చూపు జిల్లా వైపే ఉందని వెల్లడించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యా రంగంలో జిల్లా సాధిస్తున్న పురోగతిని మంత్రి కొనియాడారు. ఫలితాల్లో బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉండడం అభినందనీయమన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్ ఫలితాలతో పాటు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు, ప్రశంస పత్రాలు, ఒక్కొక్కరికి రూ.10వేల నగదు అందించారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు లాప్టాప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వీరేందర్, డీసీఇబీ కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు శ్యామ్ సుందర్ రెడ్డి, రజిత, అడల్ట్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్, టాస్ ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ పీర్ల కృష్ణబాబు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజం క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని మంత్రి సీతక్క అన్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో యువతకు నిర్వహించిన వాలీబాల్ క్రీడల ఫైనల్ మ్యాచ్ను మంత్రి సీతక్క ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం త్వరలో విడుదల చేసే నోటిఫికేషన్కు ఉచిత శిక్షణ శిభిరాలను ఏర్పాటు చేసి జిల్లా నుంచి ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తామని వివరించారు. యువకులు వాహనాలు నడిపే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులను అందించారు. మంత్రి సీతక్కను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మమన్ భట్ శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎస్పీలు కిశోర్ కుమార్, రవీందర్, సీఐ సురేశ్కుమార్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
గో బ్యాక్ టు ఛత్తీస్గఢ్?
ఏటూరునాగారం: మావోయిస్టులు, సల్వాజుడుం గొడవలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గొత్తికోయ గిరిజనులు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వదిలి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి 15 ఏళ్ల క్రితం వలసవచ్చారు. ఏటూరునాగారం దట్టమైన అటవీ ప్రాంతంలోని అడవులను శుభ్రం చేసుకుని ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలతో కాలం గడుపుతున్నారు. ఇక్కడే ఆధార్, రేషన్, ఉపాధిహామీ కార్డులను సై తం పొందారు. స్థానికంగా జీవనస్థితి బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ సాగు చేసుకున్న భూములకు ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడం.. కేవలం సాగు ఫలాలు మాత్రమే అనుభవించాలని ఫారెస్టు, రెవె న్యూ అధికారులు గిరిజనులకు చెబుతూ వస్తున్నా రు. ఈ క్రమంలో ఇటీవల అటవీ భూముల్లో సైతం అటవీశాఖ అధికారులు గోతులు తవ్వడం, పోడు భూముల్లో మొక్కలను నాటే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో ఈ భూములను ఎప్పటికై నా ప్రభుత్వం లాక్కుంటుందని గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఛత్తీస్గఢ్లో సైతం మావో యిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో తిరిగివెళ్లాలనే గొత్తికోయలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సల్వాజుడుంతోనే వలసలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు అక్కడి పోలీసులు అప్పటి దివంగత సీఎం మహేంద్రకర్మ గిరిజన యువకులతో సల్వాజుడుంమిలటరీ ప్లాట్స్ను ఏర్పాటు చేయించారు. గిరిజనుల్లో సల్వాజుడుం పోలీసు బెటాలియన్ సభ్యులున్నారని భావించిన మావోయిస్టు పార్టీ యువకులను టార్గెట్ చేసుకొని గిరిజన కుటుంబాలపై దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ పోరాటాలను తట్టుకోలేక 2001 నుంచి 2022 వరకు ఏటూరునాగారం సమీపంలోని గోదావరి దాటి అడవుల్లోకి వలస వచ్చారు. క్రమక్రమంగా వారు మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలకు విస్తరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 మండలాల్లో 51 గూడేల్లో 3,945 జనాభా ఉంది. వీరంతా సమీప అడవిలో పోడు చేసుకొని వారికి తోచిన వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో తగ్గిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2025–26లో వేలాది మంది మావోయిస్టులు అమరులయ్యారు. చాలా మంది కేంద్రం కమిటీ సభ్యులు సైతం లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ పల్లెలు సైతం మావోయిస్టులు లేని పల్లెలుగా మారాయి. దీనికితోడు ఇటీవల కర్రెగుట్టల్లో సైతం సీఆర్పీఎఫ్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు లేని ప్రాంతాలుగా గిరిజన గ్రామాలు మారాయని భావించిన గొత్తికోయలు మళ్లీ అక్కడికి వెళ్లాలని చేస్తున్నట్లు తెలుస్తుంది. వారికి ఛత్తీస్గఢ్లో ఇళ్లు, భూములు కలిగి ఉన్నారు. మావోయిస్టులు కనుమరుగు కావడంతో పాటు పట్టా భూములపై హక్కులు ఉండడంతో మళ్లీ అక్కడకు వెళ్లి వ్యవసాయం చేసుకొని స్వేచ్ఛగా ఉండవచ్చనే భావనతో ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు గొత్తికోయలు సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది. 15 ఏళ్ల క్రితం ఏజెన్సీకి వలసొచ్చిన గొత్తికోయలు మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో పునరాలోచన జిల్లాలో 51 గూడేల్లో.. 3,945 మంది నివాసం -
నాగేందర్కు డాక్టరేట్ ప్రదానం
ములుగు రూరల్: మండల పరిధిలోని పత్తిపల్లి గ్రామానికి చెందిన గద్దల నాగేందర్ వ్యవసాయ శాస్త్రంలోని అగ్రానమీ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఈ మేరకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, గవర్నర్ రమేన్ దేకా, వ్యవసాయశాఖ మంత్రి రామ్ విచార్నేతమ్, ఇందిరా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ గిరిష్చందేల్ సమక్షంలో డాక్టరేట్ను ఆదివారం ప్రదానం చేశారు. గోదుమ పంటలో కలుపు మొక్కల నియంత్రణ పద్ధతులు, పంట వృద్ధి, దిగుబడిపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్ను నాగేందర్ అందుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన గద్దల భిక్షపతి–లక్ష్మీ కుమారుడు నాగేందర్ వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించడంతో గ్రామస్తులతో పాటు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. -
ఓటరు జాబితా సవరణ ప్రారంభం
● వీసీలో సీఈఓ సుదర్శన్ రెడ్డి ములుగు: రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక ముమ్మర ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం బీఆర్కే భవన్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి శంకర్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా నుంచి అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గుర్తింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అభ్యంతరాలు, క్లెయిమ్లకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దాఖలు చేసుకోవచ్చన్నారు. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసులు జారీ, విచారణ, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఆక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఈ ప్రత్యేక సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ విజయ భాస్కర్, ఎలక్షన్ సెల్ తహసీల్దార్ సలీం, డీటీ నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మాక్ ఎక్సర్సైజ్ ఏర్పాట్ల పరిశీలన
ములుగు: రేపు(సోమవారం)జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ ఏర్పాట్లను శనివారం ఆర్డీఓ వెంకటేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వివేకానంద, కృష్ణ, పల్సాబ్పల్లి ప్రాంతాల్లో చేపట్టనున్న వాస్తవిక వరద మాక్డ్రిల్కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను శనివారం ఆయన సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. మాక్డ్రిల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగరాజు, సీపీఓ ప్రకాశ్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అప్పలనాయుడు, డీఎంహెచ్ఓ గోపాల్రావు, మత్స్యశాఖ అధికా రి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో ఐదుగురికి అస్వస్థత వాజేడు: మండల పరిధిలోని పెనుగోలు కాలనీకి చెందిన ఐదుగురు వడదెబ్బతో శనివారం అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వంట చెరుకు కోసం సమీప అడవిలోకి ఉయిక రాంబాయి, ఉయిక శాంతమ్మ, ఉయిక అంజలి, ఉయిక సావిత్రి, సోడి లక్ష్మిలు వెళ్లారు. ఈ క్రమంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా సిబ్బంది వైద్యం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శ్రీకాంత్నాయుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. ఎస్సీ సెల్ కమిటీల ఏర్పాటుకు కసరత్తు ములుగు: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్సీ సెల్ నూతన కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ ఇన్చార్జ్ చిరంజీవి తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా జిల్లాలో ఎస్సీ సెల్ నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిషలు సేవలందిస్తున్న నాయకులు, పదవులు ఆశించే ఆశవహులు ఎవరైనా పదవులకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అదిష్టానం దృష్టికి తీసుకెళ్లి పదవులు ప్రకటిస్తామని వివరించారు. ఈ మేరకు పలువురు దరఖాస్తులు అందజేయగా స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. శని జయంతికి భక్తుల రద్దీ కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరాలయం అనుబంధ దేవాలయం నవగ్రహాల వద్ద శనివారం అమావాస్య సందర్భంగా శని జయంతిని పురష్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అధిక సంఖ్యలో శని పూజలు నిర్వహించారు. నార్కొటిక్ జాగిలాలతో తనిఖీలు భూపాలపల్లి అర్బన్: గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడంపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు శనివారం ఆపరేషన్ ఆర్ఐ కాశీరాం ఆధ్వర్యంలో ఈగల్ టీం సిబ్బంది నార్కొటిక్ డాగ్ సహాయంతో పాన్షాప్లు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలను ఎవరైనా నిల్వ ఉంచినా, విక్రయిస్తున్నట్లు తెలిసినా డయల్ 100 లేదా సమీప పీఎస్కు తెలియజేయాలని కోరారు. -
పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ములుగు రూరల్/గోవిందరావుపేట: పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం మండల పరిధిలోని మల్లంపల్లితో పాటు గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రాలోని సోమలగడ్డ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా నుంచి ఎట్టి పరిస్థితుల్లో పశువుల అక్రమ రవాణా జరగకూడదని, ఎవరైనా నిబంధనలకు ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. పశువులు రవాణా చేసే వ్యక్తుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేదా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీ వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అనంతరం మల్లంపల్లి, పస్రాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం రవాణాకు లారీల కొరత ఉందని రైతులు విన్నవించగా వెంటనే స్పందించిన ఎస్పీ లారీ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి తగినన్ని వాహనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతుల ధాన్యం తరలించే వరకు పోలీసులు అండగా ఉంటారని హామీనిచ్చారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ములుగు, పస్రా సీఐలు సురేశ్, దయాకర్, ములుగు, పస్రా ఎస్హెచ్ఓలు ఉపేందర్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎఫ్బీఎస్తో ఆర్థిక భరోసా..
● ఏజెన్సీలోని పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకంతో ప్రయోజనం ● ఆన్లైన్ దరఖాస్తులతో నేరుగా ఖాతాల్లోకి నగదు జమగోవిందరావుపేట: ఏజెన్సీలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 13ఏప్రిల్ 2017లో ఎన్ఎఫ్బీఎస్(నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్) పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో కుటుంబ పెద్ద ఆకస్మాతుగా మరణిస్తే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కాకుండా ఉండేలా రూ. 20వేలు అందిస్తుంది. ఈ పథకంపై జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), సెర్ప్ అదికారులు, మండల అభివృద్ధి కార్యాలయాలతో పాటు అర్హుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, నూగూరు, వెంకటాపురం(కె) మండలాల్లో గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, గిరిజన తండాల్లో నివసించే కుటుంబాలకు పథకం వివరాలు చేరవేసేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, ఆశ కార్యకర్తల సహకారంతో ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వరకు అర్హులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి.. 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కుటుంబానికి పెద్ద అయిన వ్యక్తి సహజ మరణం పొందితే లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే పథకం వర్తిస్తుంది. మరణించిన వ్యక్తికి భార్య ఉండడంతో పాటు చిన్న పిల్లలు ఉంటే మాత్రమే పథకం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై), జనశ్రీ బీమా యోజన (జేబీవై) పథకాల కింద ఇప్పటికే లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అర్హులు కారని అధికారులు చెబుతున్నారు. ఎంపీడీఓ నుంచి జిల్లాస్థాయి వరకు పరిశీలన మీ సేవ కేంద్రం లేదా ఆన్లైన్ ద్వారా ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు, బిల్ కలెక్టర్ సహకారంతో ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. తర్వాత దరఖాస్తులను సంబంధిత జిల్లా డీఆర్డీఓకు ఫార్వర్డ్ చేస్తారు. కలెక్టర్ ఆమోదం అనంతరం డీఆర్డీఓ ప్రతీ కేసుకు ఫండ్ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ (ఎఫ్టిఆర్) రూపొందించి సెర్ప్ సీఈఓకు ఆన్లైన్ ద్వారా పంపిస్తారు. అనంతరం సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ డైరెక్టర్ ఆమోదంతో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యేలా ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు జారీ చేస్తారు. దరఖాస్తుదారులు ఫొటోతో కూడిన దరఖాస్తు ఫారం, వైట్ రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు, మరణ ధృవీకరణ పత్రం, మరణించిన వ్యక్తి ఆదార్ కార్డ్, పాస్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కాపీ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అర్హులు పథకానికి దూరం కావొద్దు పేదలకు ఎన్ఎఫ్బీఎస్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంది. 13 ఏప్రిల్ 2017 తర్వాత మరణించిన అర్హుల కుటుంబాలు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. గిరిజన, మారుమూల గ్రామాల్లోని బాధితులకు పథకం ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన పత్రాలతో సమీప మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలన అనంతరం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. – చంద్రశేఖర్, డీఆర్డీఓ -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
అంత్య పుష్కరాలకు ఆహ్వానం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాలకు రావాలని హైదరాబాద్లో పలువురు మంత్రులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికను శనివారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్శర్మ అందజేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి వేముల శ్రీనివాస్లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. వారివెంట ఆలయ ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, వేదపారయనదార్, పాండాలు పాల్గొన్నారు. -
తగ్గుతున్న అడ్మిషన్లు
● మూడు గురుకుల కళాశాలల్లో 50 మంది మాత్రమే చేరికఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలోని ఇంచెర్ల, ఏటూరునాగారం, కాటారం బాయ్స్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు కేవలం 50 మంది మాత్రమే ఆడ్మిషన్లు పొందారు. సుమారు మూడు కళాశాలల్లో 300 వరకు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. కానీ కేవలం మూడు కళాశాలల్లో 50 మంది విద్యార్థులు ఆడ్మిషన్లు పొందడం గమనార్హం. గిరిజన గురుకుల కళాశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం, వసతి లేదనే అనుమానాలు గిరిజన విద్యార్థుల్లో నెలకొంది. దీంతో కళాశాలల్లో చేరేందుకు గిరిజన విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా, డివిజన్స్థాయి అధికారుల పర్యవేక్షణ గురుకులాలపై లేకపోవడంతో విద్యాబోధన సరిగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏటూరునాగారం బాలికల గురుకుల కళాశాలలో సైతం ఫుడ్ ఫాయిజన్ అయి కూడా చాలా మంది విద్యార్థినులు ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో విద్యార్థులను గురుకులాల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్సీఓ హరిసింగ్ను ఫోన్లో సంప్రదించగా స్పందన కరువైంది. -
ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు మంగపేట: మండల పరిధిలోని కత్తిగూడెంలో నిరుపయోగంగా మారిన శివగంగ ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కత్తిగూడెం సమీపంలోని గోదావరి ఒడ్డున నిర్మించిన ఇంటెక్వెల్, బ్రాహ్మణపల్లి వద్ద ఎత్తిపోతల పథకం సంప్ను ఆయన పార్టీ నాయకులు, రైతులతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.కోట్లు ఖర్చు పెట్టి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయంపై మంత్రి సీతక్క స్పందించి ఎత్తిపోతల పథకం రైతులకు ఉపయోగపడేలా గోదావరిలో అడ్డుగా ఉన్న ఇసుక మేటలను తొలిగించి 1500 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, ఎడ్లపెల్లి నర్సింహారావు, నాగరమేశ్, వలీబాబా, అశోక్, ప్రదీప్రావు పాల్గొన్నారు. -
విద్యార్థులు కళల్లో రాణించాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి ములుగు: విద్యార్థులు సాంస్కృతిక కళారంగాల్లో రాణించాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆర్ట్ క్రాఫ్ట్, సాంస్కృతిక దినోత్సవ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సాంస్కృతిక కళలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సాంస్కృతిక రంగాల్లో రాణించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలు ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక కళల్లో ఆసక్తి కలిగి ఉంటారో వారిని ఆ దిశగా ప్రోత్సహించి ఆయా రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్ధాలని పిలుపునిచ్చారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన మల్లంపల్లి జెడ్పీహెచ్ఎస్, రాజుపేట పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, మేడారం పీఎంశ్రీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, గైడ్ టీచర్లకు డీఈఓ ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. -
ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్ల లు ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని భవిత కేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల ప్రతిభను గుర్తించి పోత్సహించాలన్నారు. వారికి ఇష్టమున్న రంగాల్లో పోత్సహించినట్లయితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. సమగ్ర శిక్ష, అలింకో సంయుక్తంగా విద్యార్థుల అవసరాలను బ ట్టి ఉపకరణాలను అందించారు. అలింకో సంస్థ జి ల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలు అందించడం అభినందనీయమన్నా రు. తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలు కలిగిన వి ద్యార్థులను సమీప పాఠశాలలకు లేదా భవితకేంద్రాలకు పంపించాలని సూచించారు. వారికి అనుగుణంగా అభ్యసన పరికరాలు ఉన్నాయన్నారు. జి ల్లాలో 46 మంది విద్యార్థులకు 58 ఉపకరణాలు అందించారు. డీసీఈబీ సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ సాంబయ్య, సైకం శ్రీనివాస్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, ఎంఈఓ తిరుపతి, అలింకో ప్రతినిధులు పట్నాయక్, గణేశ్ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్రెడ్డి -
ప్రమాదకరంగా ముళ్లపొదలు
రోడ్డుకు ఇరువైపుల పెరిగిన ముళ్లపొదలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి వాజేడు మండలం పూసూరు వరకు 163 జాతీయ రహదారి వెంట ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోడ్డుపైకి ముళ్లపొదలు, చెట్లకొమ్మలు రావడంతో రోడ్డుపై వచ్చిపోయే వాహనాలు కనిపించే పరిస్థితి లేకుండా పోతుంది. చెట్ల కొమ్మలను తప్పించబోయి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని మృత్యువాత పడుతున్నారు. ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. – ఏటూరునాగారం రోడ్డుపైకి వచ్చిన చెట్ల కొమ్మలు -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
మరో ఐదు రోజులే..
గోదావరిలో మట్టిరోడ్డు పనులు ముద్దులపల్లి అటవీప్రాంతంలో అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణాలు ఆలయంలో క్యూలైన్ పనులు చేస్తున్న కూలీలుశాఖ కేటాయింపు (రూ..) ఇరిగేషన్ 62.20 లక్షలు ఆర్అండ్బీ 51 లక్షలు పంచాయతీరాజ్ 34.8లక్షలు ఈఈ ఎంబీ ఇన్ఫ్రా 15 లక్షలు ఆర్టీసీ 17 లక్షలు డీపీఓ 97.42 లక్షలు ఎండోమెంట్ 67.74 లక్షలు డీఎఫ్ఓ 5.92 లక్షలు సబ్కలెక్టర్ 15 లక్షలు అటవీ 30 లక్షలు ఎస్పీ 1.25 కోట్లు కలెక్టర్ 6 కోట్లు క్షేత్ర కన్సల్టెంట్ 17.70 లక్షలు కాళేశ్వరం: ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రభుత్వం రూ.21.98కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వీఐపీ ఘాటు వద్ద ఈవెంట్ పనులు, పరిసరాల్లో మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు, బీటీ రోడ్డు, ఫార్మేషన్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు హడావిడి చేస్తున్నారు. దీంతో నాణ్యత, నాసిరకం పనులు చేసి కాంట్రాక్టర్లు మమా అనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇంకా ఐదు రోజుల్లో పనులు పూర్తి చేసేలా కనిపించడం లేదని భక్తులు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలేమి కొట్ట చ్చినట్లు కనిపిస్తుందని విమర్శలు ఉన్నాయి. గోదావరి వద్ద డ్రెస్లు మార్చుకునే గదుల నిర్మాణం జరగడం లేదు. ప్రధానఘాటు, సరస్వతీ ఘాటులో జల్లు స్నానాల పంపుల నిర్మాణం జరగడం లేదు. చలువపందిర్ల పనులు ఇంకా మొదలు కాలేదు. రోడ్డు మరమ్మతు పనులు జరగడం లేదు. అక్కడక్కడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఆదిముక్తీశ్వర నుంచి వీఐపీఘాటు వరకు చిప్స్ వేసి ఉంచగా, బీటీ మొదలు కాలేదు. సరస్వతీఘాటు వద్ద కై ర్ మ్యాట్ వర్క్ మొదలు కాలేదు. తాగునీరుకు ట్యాంకులు శుభ్రం చేస్తున్న ఏర్పాట్లు ఏవీ కనిపించడం లేదు. మరుగుదొడ్ల పనులు పూర్తికాలేదు. అసంపూర్తిగా నిర్మాణాలు ఉన్నాయి. రూ.1.20కోట్లతో మ్యూజియం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పక్కనే అటవీశాఖ లాన్ పనులు సాగుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో కుదురుపల్లి– బీరసాగర్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. 260 ఎకరాల్లో పలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు చేపట్టారు. మద్దులపల్లి, సుద్ద వాగుల వద్ద శిథిలావస్థకు చేరిన కల్వర్టులకు రంగులు అద్ది మెరిపిస్తున్నారు. కాళేశ్వర పరిసరాల్లో సీసీ కెమెరాలు పనులు చేపట్టారు. టెంట్సిటి పనులు, డార్మెటరీ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ సంస్థ సరస్వతీఘాటు వద్ద భారీ డెకరేషన్స్ చేపట్టింది. కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్ పనులు జరగుతున్నాయి. శివ కల్యాణ మండపంలో భారీ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయి. అక్కడే హోమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 21నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు రూ.21.98 కోట్లతో పనులు నాణ్యతపై విమర్శలు -
ఇంధన భారం!
ఏటూరునాగారం: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై రూ.3.29, డీజిల్పై రూ.3.14లు పెంచడంతో సామాన్యులపై అదనపు భారం పడింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రావడంతో వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత ప్రభావం చూపనుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, ధాన్యాలు, ఇతర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా రైతులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఈ ధరలు పెంపుతో ఆర్థికంగా నష్టపోతున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో వ్యవసాయ పనుల ఖర్చులు కూడా పెరిగి రైతులపై మరింత భారం పడుతోంది. జిల్లాలో అన్ని రకాల వాహనాలు 53,430 ఉండగా వీటికి వారానికి 30 ట్యాంకర్ల డీజిల్, 20 ట్యాంకర్ల పెట్రోల్ అవసరం అవుతుంది. జిల్లాలో 19 ఐఓసీఎల్, 12 హెచ్పీసీఎల్ కంపెనీల బంక్లు ఉన్నాయి. ఇక పెరిగిన ధరలపై వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశాయి. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇంధన ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంధన ధరల పెంపు ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై పడుతుండగా ప్రభుత్వం తక్షణ ఉపశమ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుడిపై అదనపు భారం నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశంఐఓసీఎల్: 19హెచ్పీసీఎల్ : 12 డీజిల్: 30పెట్రోల్: 20జిల్లాలో అన్ని రకాల వాహనాల సంఖ్య: 53,430 -
గోదావరి నదిలో డిసిల్టేషన్ను రద్దు చేయాలి
వెంకటాపురం(కె): గోదావరి నదిలో డిసిల్టేషన్ను రద్దు చేయాలని అలుబాక, బోదాపురం గిరిజన రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్కు వినతిపత్రం అందించిన అనంతరం వారు మాట్లాడారు. సీతారాం ప్రాజెక్టు బ్యాక్వాటర్ మండలంలోని సగ భూభాగాన్ని ఆక్రమిస్తుందని, ఒకరిద్దరి ప్రయోజనాల కోసం రిపోర్టు తయారు చేసి రైతాంగానికి ఉపాధి లేకుండా చేస్తున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుబ్బంపేట వరకు గోదావరి నదికి కరకట్టకు నిధులు కేటాయించి బ్యాక్ వాటర్ అంచనా వేసిన ఇంజనీరింగ్ అధికారులు ఇసుక మాఫియాకు అమ్ముడుపోయి సంబంధం లేని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. మండలంలో ఇసుక రవాణా కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసమవడంతో పాటు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయన్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం ఏజెన్సీ ప్రాంతాలను నాశనం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహచారి, కృష్ణ, వెంకటేశ్వర్లు, రంగయ్య, నారాయణ, రమేశ్, ముత్తయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన పర్యాటక గైడ్లువెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం గిరిదర్శక్ గైడ్లు సందర్శించారు. జిల్లా కేంద్రంలో శిక్షణ పొందుతున్న గిరి దర్శక్ పర్యాటక గైడ్లు శిక్షణలో భాగంగా రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత, కాకతీయుల చరిత్ర గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించగా రామప్ప శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు. అనంతరం వారు పాలంపేట పరిధిలోని కేన్ మొక్కలను సందర్శించారు. ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జూన్ 1నుంచి 2019 నుంచి మే 1, 2020 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు.. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం పథకం కింది 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం కోసం జూ న్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1వ తరగతికి (41) సీట్లు, 5వ తరగతికి (43) సీట్లు కేటాయించినట్లు తెలిపారు. 31వరకు రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు భూపాలపల్లి అర్బన్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు భూపాలపల్లి రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ కాశిట్టి శ్రీనివాస్ శు క్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ నాయకత్వంలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రా హుల్ శర్మ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. -
హేమాచలుడి హుండీ ఆదాయం రూ.9.22లక్షలు
మంగపేట: మండలంలోని హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా రూ.9,22,224 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికా రి ఎం.వీరస్వామి తెలిపారు. 2026 మార్చి 20న ఏర్పాటు చేసిన 9 హుండీలతో పాటు ఏప్రిల్ 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు జరిగిన స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల (జాతర) సందర్భంగా స్వామివారి ప్రధాన ఆలయం ముందు, వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 6 హుండీల్లో స్వామివా రికి భక్తులు సమర్పించిన కానుకలను స్వామివారి కల్యాణ మండపంలో కురవి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. 15 హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.9,22,224ల ఆదాయం సమకూరిందన్నారు. కొంత బంగారం, వెండి మిశ్రమ వస్తువులు, రెండు అమెరికన్ డాలర్లు రాగా వాటిని ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో భద్రపరిచినట్లు ఈఓ తెలిపారు. కోడెల వేలం ఆదాయం రూ.53,500 బ్రహ్మోత్సవాల్లో పలువురు భక్తులు స్వామివారికి మొక్కుగా చెల్లించిన రెండు కోడెలు, ఆవు దూడలను ఆలయ ఈఓ వీరస్వామి పర్యవేక్షణలో బహిరంగ వేలం పాట నిర్వహించగా మల్లూరు గ్రామానికి చెందిన పలువురు రూ.53,500లకు వేలం ద్వారా కోడెలను దక్కించుకున్నట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్కుమార్, రాజీవ్ నాగఫణిశర్మ ఈశ్వర్చంద్ శర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, రికార్డు అసిస్టెంట్ గోనె లక్ష్మినారాయణ, శేషు, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరుకు చెందిన శ్రీవారి సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. -
మొబైల్ మ్యూజియం ప్రారంభం
ములుగు రూరల్: గిరి దర్శక్ పర్యాటక మొబైల్ మ్యాజియాన్ని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గిరి దర్శక్ పర్యాటక గైడ్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. కర్రిగుట్టల ప్రాంతంలో పర్యాటక కేంద్రాల్లో గైడ్లుగా సేవలందించేందుకు ఎంపికై న యువతకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లాలో రామప్ప, మేడారం, లక్నవరం, మల్లూరు, బొగత జలపాతం, చారిత్రక ప్రదేశాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు ప్రాముఖ్యతను వివరించి పర్యాటక రంగంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. మొబైల్ మ్యూజియంలో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఛాయచిత్రాలను ఏర్పాటు చేశారు. పర్యాటకుల అవసరమయ్యే సమాచారం, బ్రోచర్లు, సమాచార పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మమన్ భట్, డీఎస్పీ రవీందర్, డీటీఓ శివాజీ, గైడ్ విజయ్కుమార్, టూరిస్టు పోలీసులు అరుణ్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలు జీవనోపాధి పెంపొందించుకోవాలి
ములుగు రూరల్: మహిళలు జీవనోపాధి పెంపొందించుకోవాలని సర్పంచ్ తప్పెట్ల రాజేందర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అబ్బాపూర్ గ్రామంలో ఆలీఫా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టత్మకమైన కార్యక్రమం కోటి మంది మహిళలు కోటిశ్వరులు అనే లక్ష్యంగా ఆఫాలీ స్వచ్ఛంద సంస్థ ఉచిత టైలరింగ్, బ్యూటీషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ కో–ఆర్డినేటర్ భరత్ ఉప సర్పంచ్ తిరుపతి, జిల్లా పారిశ్రమిక రంగం ఆఫీసర్ విక్రమ్ ప్రజ్వల్, ఎమ్ఐఎస్ కోఆర్డినేటర్ అక్కల రమేష్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుమత తదితరులు ఉన్నారు. సర్పంచ్ రాజేందర్ -
మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి లేదు
ములుగు రూరల్: మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగరవి యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు అయిన దగ్గర నుంచి కావాలనే కొంత మంది జిల్లా బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి సీతక్కపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. స్థాయిని మించి మాట్లాడుతున్న నాయకులకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె జైపాల్ రెడ్డి, చింతనిప్పుల భిక్షపతి, రీయాజ్ మీర్జా సుమన్ రెడ్డి, నల్లెల భరత్ కుమార్, యాసం రవికుమార్, కుక్కల నాగరాజు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగరవి యాదవ్ -
నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ
ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రంగాలలో ఉచిత శిక్షణ, వసతి, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్స్లో నేషనల్ స్కిల్ సెక్టార్ ట్రైనింగ్ ఏజెన్సీల ద్వారా సుమారు 75 రోజుల నుంచి 178 రోజుల వరకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఏటూరునాగారం కేంద్రంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్, ఎంబ్రాయిడరీ మెషిన్ ఆపరేటర్, బ్యూటీ థెరపిస్ట్, హెయిర్ డ్రెస్సర్, వరంగల్ కేంద్రంలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, వేర్ హౌస్ సూపర్ విజన్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కాటారం కేంద్రంలో ఫుడ్ – బెవరేజ్ సర్వీస్, సోలార్ పంప్ టెక్నీషియన్, టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్, ఫీల్డ్ టెక్నీషియన్ (ఏసీ), డిజిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంశాలలో ఉచిత వసతి, శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ వరకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారాని కి సెల్ నంబర్ల 9490341911, 8008932159, 7981633716లో సంప్రదించాలని తెలిపారు. శిక్షణలో ఏకాగ్రత అవసరం బ్యూటీషన్, టైలరింగ్ శిక్షణలో నిరుద్యోగులకు ఏకాగ్రత అవసరమని పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ అన్నారు. మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని పీఓ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూత్ ట్రైనింగ్ సెంటర్లోని క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, డార్మెంటరీ రూమ్స్ను పరిశీలించారు. అదేవిధంగా ట్రైకార్ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలపై ఆరా తీశారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ -
‘భగీరథ’ సూపర్వైజర్ల ఆత్మహత్యాయత్నం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉత్తమ విద్యార్థినికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐక్యుఏసీ కోఆర్డినేటర్ జ్యోతి తెలిపారు. విద్యావారోత్సవాలలో భాగంగా మూడో రోజు ఉత్తమ విద్యార్థుల సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహమ్మద్ తబస్సంను కళాశాల అధ్యాపకులు సన్మానించారన్నారు. కొత్త సంవత్సరంలో అడ్మిషన్లు కాబోయే విద్యార్థుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఏఈడీపీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ వెంకటయ్య, కనీస్ ఫాతిమా, రాజశేఖర్, శ్రీకాంత్, సిబ్బంది శ్రీనివాస్, సురేష్, లక్ష్మి పాల్గొన్నారు. వాజేడు: మండల కేంద్రంలోని ఐటీఐ, ఏటీసీలో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్స్పాల్ శేఖర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఐటీఐలో 40 సీట్లు, ఏటీసీలో 170 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 14 నుంచి జూన్ 8 వరకు చేసుకోవాలని తెలిపారు. 14 సవత్సరాల వయస్సు నిండి 10వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాల కోసం 82973 38888, 88975 20579 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. వాజేడు: మండలంలో ఇళ్ల గణన ముమ్మరంగా సాగుతుంది. మండల వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు ఇళ్ల గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రు. ఇందులో ఇంటి యజమానితో పాటు ఇళ్లు ఉన్నది లేనిది నమోదు చేస్తున్నారు. బుధవా రం గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీలో ఇళ్ల గ ణనను సర్పంచ్ భరత్ కుమార్ పరిశీలించారు. మహాముత్తారం: మండలంలోని వజినేపల్లి గ్రామానికి చెందిన దుర్గం సమ్మయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్నా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్రెడ్డి, చల్ల నారాయణరెడ్డి బుధవారం వజినేపల్లిలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్, నాయకులు రఫీ, దుర్గం తిరుపతి ఉన్నారు. ఆర్డీఓకు సన్మానం మల్హర్(కాటారం): మండలంలోని కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ను బుధవారం ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీఓను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంతకా ని సమ్మయ్య, కొండగొర్ల రాంనారాయణ, ఆ త్మకూరి కుమార్యాదవ్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం మహాముత్తారం: మండలంలోని బోర్లగూడెం గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోర్లగూడెం సర్పంచ్ అజ్మీరా ధరమ్సింగ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇంచార్జి సీతునాయక్ ,రైతులుపాల్గొన్నారు. వాజేడు: హనుమకొండలో మే 17న నిర్వహించనున్న తుడుందెబ్బ ఐక్యత సభను విజయవంతం చేయాలని కోరుతూ తుడుందెబ్బ మండల అధ్యక్షుడు తొర్రెం సంతోష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని కోయ వీరాపురంలో బుధవారం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ఐక్యత సభలో ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. అనంతరం సభ కరపత్రాలను ఆవిష్కరించారు. తుడుందెబ్బ మండల కార్యదర్శి చేప లక్ష్మణ్, వాసం సంతోష్, తదితరులు ఉన్నారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఏటూరునాగారం పరిధిలో నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఇళ్లు ఉండి ఇంటి నంబర్ లేని యజమానులు నేరుగా గ్రామ పంచాయతీ దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మీనర్సింహరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటి నంబర్లు దరఖాస్తును స్థానిక పంచాయతీ కార్యదర్శికి అందజేసి వారి వివరాలను జతపర్చాలన్నారు. ఎవరికి ఎలాంటి లంచాలు, ప్రలోభాలకు లొంగకుండా నేరుగా వారి ఇంటినంబర్ను ప్రభుత్వ చాలన చెల్లించి పొందే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటి నంబర్ లేక ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని గుర్తించి ఇంటి నంబర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఇంటి యజమానికి పది రోజులలో నంబర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రేగొండ: ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ దేవతల దీవెనలు ప్రజలపైన నిండుగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండేలా చూడాలని మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్, ఉపసర్పంచ్ ఆకుతోట తిరుపతి, నాయకులు పన్నాటి శ్రీనివాస్, రొంటాల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. తునికాకు సేకరణ మహాముత్తారం: మండలంలోని జీలపల్లి, మాదారం, మహాముత్తారం, సింగారం, యామన్పల్లి గ్రామాల్లోని గిరిజనులు, గిరిజనేతరులు నాలుగు రోజులనుండి గ్రామసమీపంలోని అడవుల్లో తునికాకు సేకరణ చేపడుతున్నారు. ఉదయం సేకరించిన ఆకును కట్టలు కట్టి కల్లోకి చేరవేస్తున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే యూనిట్లు టెండరయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో తునికాకు టెండర్లు కాకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోతున్నారు.ఊపందుకున్న ‘ఉపాధి’ పనులు మల్హర్: ప్రజలకు అన్నికాలాల్లో ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మండలంలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నతాధికారులు గ్రామల వారీగా లక్ష్యాన్ని విధించడంతో పని చేసి వారి సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మండలంలో 8,495 జాబ్కార్డులు.. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 22 గ్రామాల్లో 8,495 జాబ్ కార్డులు ఉన్నాయి. వీటీలో కూలీల సంఖ్య 18,873 ఉండగా ఉన్నారు. మూడు రోజులుగా1600 పై చిలుకు కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రతి రోజు ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకే కూలీలు పనులుకు వెళ్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. కొద్దిరోజులగా ఉపాధి హామీ పనులకు కూలీలు సంఖ్య పెంచడానికి ఉపాధిహామీ ఏపీఓ హరీష్, టీఏలు నిత్యం గ్రామాల్లోకి వెళ్లి జాబ్ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పనులకు రావాలని అవగాహన కల్పించారు. దీంతో రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతుంది. వాజేడు: మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గ్రామస్తులు బుధవారం ఊరుకట్టు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయంలో సుమారుగా రెండు గంటల పాటు గ్రామంలోని వారు బయటకు, బయటి గ్రామాల వారు ఊరిలోకి రాకుండా చూశారు. మంగపేట: మండలంలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్వహణలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న తిమ్మంపేటకు చెందిన లొంక రాజు, సాంబయ్య అనే ఇద్దరు వ్యక్తులు మల్లూరు గుట్టపై పురుగల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విషయం తెలిసిన మంగపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పురుగుల మందు తాగిన వారిని 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, తాను తాగలేదని రాజు చెప్పడంతో సాంబయ్యకు ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాంబయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. బాధితుడు రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమను అకారణంగా నెల రోజుల క్రితం విధులకు రానివ్వకుండా వేధిపులకు గురిచేశారని వాపోయాడు. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని మంత్రి సీతక్క వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నామని దీంతో రెండు రోజుల క్రితం తమను విధుల్లోకి రమ్మని చెప్పారన్నారు. కాని తమను విధులకు రావొద్దని మిషన్ భగీరథ కేవీఎన్ఆర్ కంపెని ఎండీ రాజిరెడ్డి మంగళవారం ఫోన్చేసి చెప్పాడన్నారు. దీంతో మనస్థాపం చెంది తాము ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని మల్లూరుగుట్టపై గల మెయిన్ వాటర్ ట్యాక్ వద్దకు చేరి విషయాన్ని మిషన్ భగీరథ కేవీఎన్ఆర్ కంపెని ఎండీకి ఫోన్చేసి చెప్పినట్లు తెలిపాడు. పనికి వెళ్తున్న 1634 మంది కూలీలు అవగాహన కల్పిస్తున్న అధికారులు -
పశువుల అక్రమ రవాణాపై నిఘా
గోవిందరావుపేట: మండలంలో అక్రమ పశువుల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రింబవళ్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండలంలోని ప్రధాన రహదారులు, అడవి మార్గాలు, గ్రామీణ లింక్ రోడ్లపై ప్రత్యేక చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బక్రీద్ నేపథ్యంలో భారీగా పశువుల కొనుగోలు, అమ్మకాలు జరిగే అవకాశముందని ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడవి మార్గాలపై నిఘా.. అక్రమ రవాణాదారులు పోలీసులను తప్పించుకునేందుకు అడవి మార్గాలు, గ్రామీణ రహదారులను వినియోగించే అవకాశముందని భావించిన పోలీసులు అక్కడ కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచి అనుమానాస్పద కదలికలపై కన్ను వేస్తున్నారు. స్థానిక సమాచారం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మీక తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాదారుల కదలికలను అడ్డుకుంటున్నారు. దీంతో మండలంలో ఎక్కడ చూసినా పోలీస్ వాహనాల సైరెన్లు, తనిఖీలు కనిపిస్తుండటంతో అక్రమ దందాదారులు భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కఠిన చర్యలు అక్రమ పశువుల రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకాడటం లేదని సమాచారం. అనుమతి పత్రాలు లేకుండా తరలింపులు చేస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పస్రా పోలీసుల అప్రమత్తతపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సై తాజుద్దీన్ స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు పర్యవేక్షించడం పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతుల ఆస్తులను కాపాడటంతో పాటు అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు చూపుతున్న కట్టుదిట్టమైన వైఖరి ప్రస్తుతం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పశువుల అక్రమ రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా అనుమానాస్పదంగా పశువుల తరలింపు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బక్రీద్ పేరుతో అక్రమ దందాలు చేస్తే సహించేది లేదు. – తాజుద్దీన్, ఎస్సై, పస్రా అడుగడుగునా పోలీసుల తనిఖీలు దళారుల ఎత్తుగడలకు చెక్ -
యువత క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
గోవిందరావుపేట: యువత మద్యం మత్తు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని పస్రా ఎస్సై తాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ క్రీడలు బుధవారం ముగిశాయి. పోటీల్లో రంగాపురం జట్టు ప్రథమ స్థానం సాధించగా, ఇప్పలగడ్డ జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఫ్రూట్ఫాం, గోవిందరావుపేట జట్లు కన్సోలేషన్ బహుమతులు పొందాయి. ఈ సందర్భంగా విజేత జట్లకు ఎస్సై తాజుద్దీన్ బహుమతులు, మెమెంటోలు అందజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదినారయణ, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ మండలస్థాయి క్రీడోత్సవాలు బుధవారం ముగిసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు. క్రీడోత్సవాలలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి 14 జట్లు పాల్గొనగా బుర్గుపేటకు ప్రథమ బహుమతి, వెంకటాపూర్కు ద్వితీయ బహుమతి వచ్చినట్లు తెలిపారు. గెలుపొందిన జట్లకు షీల్డ్లతో పాటు మెమెంటోలు అందించినట్లు ఎస్సై వెల్లడించారు. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రాధాన్యత పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్చార్జ్లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్లో భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవిందర్రావుని ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని మేడ్చల్–మల్కాజిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్ను గద్వాల్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్చార్జ్లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పల్లా రాజేశ్వర్రెడ్డిసత్యవతిరాథోడ్ -
నత్తనడకన..
ఏటూరునాగారం: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెరి గిన ఇంటి సామగ్రి ధరలతో పాటు కార్మికులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పెరగడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు జిల్లాలో 5,051 ఇళ్లు మంజూరు కాగా 966 ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. జిల్లాలోని పది మండలాల పరిధిలో 174 గ్రామ పంచాయతీలున్నాయి. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసినప్పటికీ ఆర్థిక కష్టాలతో ఇళ్లను నిర్మించుకోలేని వారు 174 మంది ఉన్నారు. వీరికి మొదటి దశలో ఇళ్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో రద్దు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. పెరిగిన ధరలు లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఇసుక, సిమెంట్, స్టీల్, సెంట్రింగ్, కంకర, బైండింగ్ వైర్, బోర్ వెల్ లాంటి సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి లబ్ధిదారుల ఎంపిక జరగడంతో ఈ సామగ్రికి డిమాండ్ పెరిగింది. దీంతో లబ్ధిదారులు కష్టాలు పడుతూ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. 2025కు ముందు సిమెంట్ ఒక బస్తాకు రూ. 265లు ఉండగా ప్రస్తుతం రూ. 320కి చేరుకుంది. 2025 డిసెంబర్లో స్టీల్ ధర క్వింటాకు 10 ఎంఎం బార్లు 20కి రూ.2,300లు ఉండగా ప్రస్తుతం రూ.3,800లకు చేరుకుంది. ఇలా అనేక ముడి సరుకు ధరలు పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై మరింత భారం పెరిగింది. భవన నిర్మాణ కార్మికులకు.. ఇటు ఇంటి సామగ్రితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూలీరేట్లు సైతం పెరిగాయి. గతంలో 400 గజాల స్లాబ్ను మేసీ్త్రలు రూ.1.65లక్షలకు నిర్మించి ఇచ్చేవారు. అదే ఏరియాలో ఇప్పుడు రూ. 2.65 లక్షలకు నిర్మించాల్సి వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇలా అనేక సామగ్రితో పాటు కూలీల ధరలకు రెక్కలు వచ్చాయని చెబుతున్నారు. గతంలో మేసీ్త్రకి కూలి రూ.800 ఉంటే ఇప్పుడు రూ.1,000 తీసుకుంటున్నారు. పార కూలీకి రూ. 500లు ఉండగా ఇప్పుడు రూ. 600లు తీసుకోవడం గమనార్హం. 10 వేల ఇటుకల లారీ లోడ్కు గతంలో రూ.71 వేలు ఉండగా ప్రస్తుతం రూ.92వేలకు చేరుకుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఇంటి సామగ్రి ధరలు తగ్గించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మొత్తం మంజూరైన ఇళ్లు 5,051నిర్మాణం పూర్తయినవి 966పనులు ప్రారంభించని ఇళ్లు 174గోడల వరకు 396బేస్మెంట్ లెవల్ 1,136రూఫ్ లెవల్ 901స్లాబ్ లెవల్ 1,478సిమెంట్తో పాటు ఇతర వస్తువుల ధరలు తగ్గించాలి. ధరలు పెరగడం వల్ల ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఇళ్ల ప్రారంభానికి ముహూర్తాలు చేసుకొని ఆర్థిక పరిస్థితి లేక పనులు మొదలు పెట్టడం లేదు. ముడి సరుకులకు ధరలు పెంచడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. – గాడిచర్ల సాంబయ్య, ఏటూరునాగారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో జాప్యం పెరిగిన ఇంటి సామగ్రి ధరలు కార్మికులకు ఫుల్ డిమాండ్ లబ్ధిదారులను వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు 5,051 ఇళ్లు మంజూరు.. పూర్తయినవి 966 -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన జనగామ ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్హిల్స్ ఎంసీహెచ్లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్నంబర్ ఆధారంగా నరేష్కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్ఎన్సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మల్హర్(కాటారం): నీట్–2026 పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్పై దాడి జరిగిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడారు. దేశంలో ఇప్పటికే నిరుద్యోగం, కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కోచింగ్ మాఫియా భారంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై ఇది మరో మోసపూరిత దాడి అని ఆరోపించారు. పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం బయటకు రావడం, అనేక ప్రశ్నలు అసలు పరీక్షతో సరిపోవడం, తదనంతరం పరీక్ష రద్దు వరకు వెళ్లడం దేశ పరీక్షా వ్యవస్థ పూర్తిగా వైఫల్యానికి గురైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు. నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు అయిత బాపు, దాసరి రమేష్, దారకొండ సూర్యశంకర్, వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు. టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ -
న్యాయ కళాశాల సాధనే ధ్యేయం
వాజేడు: భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల సాధన కోసం ఈ నెల 24న మండల కేంద్రంలో మహాగర్జన సదస్సును నిర్వహిస్తున్నట్లు గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెంసాయి తెలిపారు. మండల పరిధిలోని కోయ వీరాపురం గ్రామంలో బుధవారం ఆయన ముఖ్య కార్యకర్తలు, ఆదివాసీ యువతతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మహా గర్జన సభలో ఆదివాసీ యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆదివాసీ అస్తిత్వం, రక్షణ, చట్టాల అమలు కోసం యువతి, యువకులు ఉద్యమ బాట పట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్, సురేష్, సుధాకర్, రాజబాబు, నవీన్, లక్ష్మణ్తో పాటు తదితరులు ఉన్నారు. గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెంసాయి -
పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని, నాణ్యమైన విద్య ప్రమాణాలకు చిరునామగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తున్నాయని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యా కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణమని తెలిపారు. డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాలాభివృద్ధిలో భాగంగా లైబ్రరీల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న పనులపై పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పేర్లు నమోదు చేసుకోవాలి జిల్లా కేంద్రంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాల్లో పాల్గొనేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆసక్తి కలిగిన ప్రజలు, కళాకారులు, విద్యార్థులు, క్రీడాకారులు మే 18 వరకు ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి ధర్మనాయక్ సెల్ 7032153610, డీవైఎస్ఓ రామ్మోహన్ 7207503775 నంబర్లకు వాట్సాప్ ద్వారా వివరాలు పంపించి నమోదు చేసుకోవాలన్నారు. ఆఫ్లైన్లో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం, జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో 18వ తేదీ వరకు పేర్లను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.సత్యవతిరాథోడ్ ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలుపల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలునేడు ప్రజాదర్బార్ ఏటూరునాగారం: నేడు కన్నాయిగూడెం మండల పరిధిలోని లక్ష్మిపురం, ముప్పనపల్లిలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మిపురంలో ఉదయం 8 గంటలకు, ముప్పనపల్లిలో 10 గంటలకు నిర్వహించే ప్రజాదర్బార్కు మంత్రి హాజరై పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు హాజరవుతారని వెల్లడించారు. హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి వెంకటాపురం(ఎం): గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్పీవీ వ్యాక్సిన్ను తప్పనిసరిగా 14ఏళ్లు నిండిన బాలికలకు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగ అన్వేష్ తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. హెచ్పీవీ వ్యాక్సిన్తో దుష్ఫలితాలు ఉండవని, టీకాపై ఉన్న అపోహలను నమ్మొద్దని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 800 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆనంతరం పోషకాహార ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించి గర్భాశయ క్యాన్సర్ నివారణకు ముందడుగు వేయాలని కోరారు. తిమ్మాపూర్, కేశవాపూర్, నల్లగుంట, వెంకటేశ్వర్లపల్లె గ్రామాల నుంచి వచ్చిన 21 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ శ్రీనివాస్, సంపత్, ఫార్మసీ ఆఫీసర్ రాజమణి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. హేమాచల క్షేత్రంలో హనుమాన్ భక్తులు మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. వారితో పాటు ఆంజనేయస్వామి మాలధారణ దీక్ష ముగిసిన అంజన్న భక్తులు భద్రాచలంలో ఇరుముడి అప్పగించి భద్రాది సీతారామచంద్రస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసింది. ఆలయనికి వచ్చిన భక్తులకు అర్చకులు భక్తు ల గోత్రనామాలతో అర్చనలు జరిపించి స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని వివరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాంస్కృతిక ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలనములుగు: సాంస్కృతిక వైభవం ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం అదనపు కలెక్టర్ సంపత్ రావు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే వారికి తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీపీఓ వెంకయ్య, తహసీల్దార్ విజయభాస్కర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ అన్నారు. పీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఓ తొలిసారిగా మంగళవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 2ను తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1లో వాటర్ సమస్య, చిరుతపల్లి 2 పాఠశాలలో రూప్ లీకేజీ సమస్య ఉందని పీఓ దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ -
20 నుంచి సాంస్కృతిక ఉత్సవాలు
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఉత్సవాల షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో, జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలల్లో ఈ నెల 20, 21,22 తేదీలలో మూడు రోజుల పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, గిరిజన నృత్యాలు, కవి సమ్మేళనం అంశాలతో పాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని తాత్కాలిక బస్టాండ్ ఆవరణ పరిసరాలను, ములుగు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాన్ని, చలి వేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారి తనిఖీ నిర్వహించారు. గోదాంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు. నేడు సర్పంచ్లు, కౌన్సిలర్లకు శిక్షణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్య కార్యక్రమాలపై సర్పంచులకు, కౌన్సిలర్లకు నేడు(బుధవారం) ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. -
ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. -
తప్పులు లేకుండా సర్వే పూర్తిచేయాలి
● రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జేడీ సుబ్బరాజు ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపాలిటీలోని సూపర్వైజర్ సర్కిల్లో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ఇంటి నంబర్లను ఎలా కేటాయిస్తున్నారో, పని సక్రమంగా జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ ఇంటి నంబర్ ఎదురుగా శ్రీసీఎన్శ్రీ అని తప్పనిసరిగా రాయాలని సూచించారు. మ్యాపింగ్ ఎలా చేస్తున్నారో కూడా ఆయన ఆరా తీశారు. సర్వేలో వేగం పెంచాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ హెచ్ఎల్బీ పరిధిని స్పష్టంగా తెలియజేసేందుకు మున్సిపాలిటీ నుంచి మూడు రోజుల పాటు సిబ్బందిని వారి వెంట పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు బుధవారం సాయంత్రంలోపు తమకు కేటాయించిన ప్రతీ ఇంటికి ఇంటి నంబర్లు వేయడం పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రోజువారీ పనితీరుపై మానిటరింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సెస్ ఇన్చార్జ్ వినయ్, ములుగు సీపీవో, జిల్లా సెన్సెస్ అధికారి ఎం.ప్రకాశ్, మున్సిపాలిటీ చార్జ్ ఆఫీసర్ కమిషనర్ సంపత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ బి.లాల్నాయక్, ఫీల్డ్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. -
సాగుకు సన్నద్ధం
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు చేసిన అధికారులుములుగు: జిల్లాలో రాబోయే వానాకాలం (ఖరీఫ్ సీజన్)కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర ప్రణాళికను ఖరారు చేశారు. ఈ ఏడాది మొత్తం 1,63,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నట్లు అధికారులు అంచనా వేశారు. జూన్ నెలలో ప్రారంభమయ్యే ఖరీఫ్ సాగును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులు విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలో వివిధ పంటల సాగుకు 29,336 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం 14,159 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉన్నాయి. మిగతా విత్తనాలను త్వరితగతిన విడతల వారీగా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 10 మండలాలు.. 1,63,229 ఎకరాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 1,63,229 ఎకరాల్లో వానకాలం పంటల సాగు కానున్నట్లు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 1,07,700 ఎకరాల్లో వరి, 28,600 ఎకరాల్లో పత్తిపంట, 11,329 ఎకరాల్లో మొక్కజొన్న, 14,500 ఎకరాల్లో జీలుగ, 1,100 ఎకరాల్లో జనుము పండించనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 26,925 క్వింటాళ్ల వరి విత్తనాలు, 906 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు, 1,450 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 55 క్వింటాళ్ల జనుము విత్తనాలు, 54,286 పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమున్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ సెక్టార్లలో 6,350 క్వింటాళ్ల విత్తనాలు, ప్రైవేటు సెక్టార్లలో 7,809 క్వింటాళ్ల విత్తనాలతో పాటు 28,150 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంటల సాగుకు 17,504 మెట్రిక్ టన్నుల యూరియా, 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 8 వేల మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరమున్నట్లు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 1,63,229 ఎకరాల్లో సాగుకానున్న పంటలు 29,336 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా అందుబాటులో 14,159 క్వింటాళ్ల విత్తనాలుభూములు సిద్ధం చేస్తున్న రైతులు వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే భూముల్లోని పత్తి, మిర్చి పొరకలను తొలగిస్తూ సాగుకు రెడీ చేస్తున్నారు. మరో 20 రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విత్తనాలను, ఎరువులను ముందస్తుగా నిల్వ చేసుకునేలా సన్నహాలు చేస్తున్నారు. ప్రతిఏటా పంటలు పండిస్తున్నా అతివృష్టి, అనావృష్టి కారణంగా అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈసారైనా మంచి దిగుబడులు రావాలని రైతులు ఆశిస్తూ ముందుకు సాగుతున్నారు. పంటల దిగుబడి పెరిగేలా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ, సమయానికి విత్తనాలు, ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం..జిల్లాలో వానాకాలం సాగుకు ప్రణాళికలు రూపొందించాం. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్లో 1,63,229 ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదవనున్న గిరిజన విద్యార్థులకు ఈ నెల 16, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి(డీసీఓ) శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం టీజీటీడబ్ల్యూఆర్జేసీ (బాలుర) కళాశాలలో ఈనెల 16న బాలురకు, టీజీటీడబ్ల్యూఆర్జేసీ (బాలికల) కళాశాలలో చేరేందుకు ఈ నెల 18న బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీసీఓ పేర్కొన్నారు. బాల బాలికలు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ పత్రాతలతో హాజరు కావాలని కోరారు. 2025–26 విద్యాసంవత్సరంలో ఎస్ఎస్సీ ఉత్తీర్ణత పొందిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. ‘కేసులు నమోదు చేయాలి’ వెంకటాపురం(కె): ఏజెన్సీలో ఆదివాసీలపై దాడులకు పాల్పడిన గిరిజనేతరులపై కేసులు నమోదు చేయాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాయం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిలు తెలిపారు. మండలకేంద్రంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలపై దాడి చేసిన గిరిజనేతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో లొసుగులు తెలుసుకుని శిక్ష తగ్గించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీలో ఆదివాసీలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇరుప ప్రకాశ్, పూనెం వరప్రసాద్, రవి, అశోక్, బన్ని తదితరులు పాల్గొన్నారు. సింగరేణి క్వార్టర్స్లో చోరీగణపురం: మండలంలోని 1000 క్వార్టర్స్లో ఒకే రాత్రి 8 ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలం 1000 క్వార్టర్స్లో సింగరేణి ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి స్వగ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు పక్కా ప్రణాళికతో శనివారం రాత్రి 8 క్వార్టర్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఆదివారం ఉదయం తోటి ఉద్యోగులు గమనించి బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్టీంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ నంబర్ 34 రూం నంబర్ 128లో నివాసముంటున్న మల్లగాని సరస్వతికి చెందిన 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, గాజుల వెంకటేశ్వర్లు 5 గ్రాముల బంగారు కమ్మలు, 4 గ్రాముల వెండి, రూ.6వేల నగదు, పాతరవేని రాజేష్కు చెందిన 2 గ్రాముల బంగారం, 4 తులాల వెండి, వేములపల్లి బాబురావు క్వార్టర్లో 10 తులాల వెండితో పాటు రూ. 1000 నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. సింగరేణి సెక్యూరిటీ ఉండి, నిత్యం జనాభాతో ఉండే 1000 క్వార్టర్లలో చోరీ జరగడం సంచలనం సృష్టించింది. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలిభూపాలపల్లి అర్బన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీను, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనసుందర్, వెంకీయాదవ్, దేవన్, లక్ష్మి, పరమేశ్వరి, అజ్మీర జంపన్న, రమేష్, హఫీజ్, రాధా, ప్రేమ్కుమార్, నాగరాజు, కిషోర్, భిక్షపతి, పొనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ములుగు: జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న పలు విద్యుత్ అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ములుగులో కొత్తగా నిర్మిస్తున్న డిపార్ట్మెంటల్ ఎస్పీఎం షెడ్ పనులు, ప్రైవేట్ ఎస్పీఎం షెడ్ను సందర్శించారు. ఫెయిల్యూర్ ట్రాన్స్ఫార్మర్ల రికార్డులు, నిర్వహణ విధానం, పనితీరును పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోలింగ్ స్టాక్ పెంచుకోవాలని సూచించారు. 33కేవీ కొత్త లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు 33కేవీ లైన్ సుమారు 27 కిలోమీటర్ల అటవీ ప్రాంతం మీదుగా కర్లపల్లి సబ్ స్టేషన్ నుంచి లింగాల కొత్త సబ్స్టేషన్కు కలుస్తుందని అధికారులు సీఎండీకి వివరించారు. అదేవిధంగా పస్రా సెక్షన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సెక్షన్ ఆఫీస్ పనులను పరిశీలించి, ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. 33/11 కేవీ లింగాల నూతన సబ్స్టేషన్ ఏర్పాటుతో గుండాల, కొడిశెల, లింగాల పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగ్గా అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎండీ వెంట సీఈ రాజుచౌహన్, ఎస్ఈ బేతి భిక్షపతి, ములుగు డీఈ (ఆపరేషన్) నాగేశ్వర్ రావు, డీఈలు పురుషోత్తం, సదానందం, ఈఈ వెంకట్రాం, ఏడీఈలు ప్రణయ్, సందీప్ పాటిల్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఏటూరునాగారం: పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అకాడమిక్ మానిట రింగ్ అధికారి శ్యామ్సుందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం చేపట్టిన రెమిడియల్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ మళ్లీ వారు ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో టెన్త్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయని వివరించారు. ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందకుండా ప్రణాళికతో చదివి ఉత్తీర్ణులు కావాలని సూచించారు. అదే విధంగా జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి వద్ద పిల్లలు టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోవద్దని ప్రభుత్వం సమ్మర్ క్యాంప్లు ఏర్పాటు చేసిందన్నారు. సమ్మర్ క్యాంప్ ఉత్సాహభరితంగా ఉంటుందని, విద్యార్థులు ఈ క్యాంప్ను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సాంబశివరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి
● వీసీలో సీఎం రేవంత్రెడ్డి ములుగు: మొక్కజొన్న,ఽ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతీ ప్రైవేట్ గోదాంను అవసరమైతే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు. అవసరమైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. -
మైనింగ్కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్లు ఉ న్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూ బాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండండంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 40–60 కొత్త లీజులకు అవకాశం? ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ -
మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ములుగు: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రాబోయే 15 రోజుల్లో కనీసం 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్ ఘన్న్పూర్, అశ్వారావుపేట వంటి నియోజకవర్గాలు ఇప్పటికే 80 శాతానికి పైగా మ్యాపింగ్ పూర్తి చేశాయన్నారు. ఒడిశా రాష్ట్రం ఇప్పటికే 90 శాతం, కర్ణాటక 81 శాతం, మహారాష్ట్ర 68 శాతం మ్యాపింగ్ పూర్తి చేశాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు తమ బృందాలను ప్రోత్సహించి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కేవలం ఇళ్ల గుర్తింపు, వ్యక్తుల గుర్తింపుకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఎస్ఐఆర్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను అన్ని వనరుల నుంచి గుర్తించి నియమించుకోవాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ ఫారాల పంపిణీ, సేకరణపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బీఎల్ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఓటరు పేరు సక్రమంగా మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీసీలో ఆర్డీఓ వెంకటేశ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ ఎండి సలీం, డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్ పాల్గొన్నారు. ‘దోస్త్’ పోస్టర్ ఆవిష్కరణ ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దోస్త్ అడ్మిషన్ పోస్టర్ను తన ఛాంబర్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ వరకు ఎడ్యుకేషన్ వీక్ను ఘనంగా నిర్వహించాలని, కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ప్రతీ అధ్యాపకుడు కృషి చేయాలని సూచించారు. వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి -
హేమాచలక్షేత్రంలో ఆంజనేయస్వామి భక్తులు
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆంజనేయస్వామి భక్తులతో సోమవారం కిటకిటలాడింది. నేడు(మంగళవారం) హనుమాన్ జయంతి కావడంతో మండలం, అర్ధ మండలం దీక్ష చేపట్టిన భక్తులు స్వామివారికి ఇరుముడి సమర్పించి దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులు సైతం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల కొద్ది బారులుదీరారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, ఏడనూతుల ఈశ్వర్చంద్ రామా నుజందాస్, భక్తుల గోత్రనామాలతో స్వామి వారికి అర్చనలు జరిపించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
నాపేరు మీదకు ఆస్తి మార్చాలి..
నా పేరు మీద ఉన్న ఆస్తి నాకు తెలియకుండానే నా పెద్ద కోడలు తన పేరు మీదకు మార్చుకుంది. నా పెద్ద కుమారుడు మరణించిన తర్వాత నా కోడలు ఆస్తులను తన పేరు మీదకు మార్చుకుంది. నా బాగోగులు చూసుకునే వారు లేరు. అధికారులు స్పందించి నా పేరు మీదకు ఆస్తిని మార్చాలి. – అట్టం సావిత్రమ్మ, ములుగు మరమ్మతు పనులు చేయించాలి.. కంతనపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలి. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలి. పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ దానిని పట్టించుకోవడం లేదు. వెంటనే ఐటీడీఏ పీఓ స్పందించి పాఠశాలలో మరమ్మతు పనులు చేయించాలి. – చింత చంద్రయ్య, కంతనపల్లి, కన్నాయిగూడెం మండలం -
ఎన్యుమరేటర్లు మార్గదర్శకాలు పాటించాలి
ములుగు: ఎన్యుమరేటర్లు జనగణనలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న జన గణన హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహక సమావేశాన్ని సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. జనగణన కార్యక్రమం ప్రాముఖ్యత, ఇంటింటి వివరాల సేకరణ విధానం, హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, ప్రజలతో సమన్వయం, ఖచ్చితమైన సమాచార సేకరణపై అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతీ కుటుంబం వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ దేశాభివృద్ధి ప్రణాళికలకు ఎంతో కీలకమని, ప్రజలందరూ అధికారులకు సహకరించి సరైన సమాచారం అందించాలని తెలిపారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారు వారి ఐడీని వచ్చిన అధికారులకు చూపించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, మాస్టర్ ట్రైనర్ ఎండి.హమీద్, ఫీల్డ్ ట్రైనర్ మధుసూధన్ పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన రైస్మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు ములుగు: కలెక్టర్ హేమంత్ సహదేవరావును ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్టినట్లు ప్రవీణ్ తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చినట్లు వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సహోదర రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, ఉపాధ్యక్షులు కాసిడి సుదర్శన్ రెడ్డి, సహాయ కార్యదర్శి డేగల భద్రయ్య, గౌరవ సలహాదారుడు రామిని శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మ్యూజియంలోకి పురాతన విగ్రహాలు కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ముందుగానే మ్యూజియం ప్రారంభించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణం పూర్తికాక ముందే హడావుడిగా పురాతన విగ్రహాలను అమర్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం అధికారులు పురాతన విగ్రహాలను మ్యూజియంలో అమర్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు కాకతీయులు, చాళుక్యులనాటి ప్రాంతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకముందే విగ్రహాల ఏర్పాటు చేపట్టడంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది. ఏరియా బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్గా మురళీమోహన్ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా సింగరేణి బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్గా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ సిలివేరి మురళీమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జీఎం కార్యాలయ చాంబర్లో సింగరేణి బీసీ ఓబీసీ జనరల్ సెక్రటరీ నల్లపురి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల లైజనింగ్ ఆఫీసర్లు, నాయకులు పాల్గొని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ లైజనింగ్ ఆఫీసర్గా నియమితులైన మురళీమోహన్ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. -
ములుగు
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 20267ప్రజావాణి, డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 67 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 11 దరఖాస్తులు రాగా పింఛన్లకు సంబంధించి 20, ఉపాధి కల్పనకు సంబంధించి 1, ఇతర సమస్యలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చాయి. అలాగే డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 21, సీనియర్ సిటిజన్కు సంబంధించి 1 దరఖాస్తు అందింది. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఇలా.. -
విద్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దాం
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి విద్యాశాఖ అధికారులకు పిలుపునిచ్చారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పీఎంశ్రీ పాఠశాలలైన బండారుపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, జవహర్నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయం, పస్రా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు ప్రారంభించినట్లు తెలిపారు. రెండో రోజు పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం జిల్లాలోని బండారుపల్లి మోడల్ స్కూల్, ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మూడోరోజు గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు విద్యాశాఖలో నిర్వహించనున్న విద్యా కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. నాల్లో రోజు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఐదో రోజు గ్రంథాలయ దినోత్సవం నిర్వహించాలని, ఆరో రోజు కళలు, సాంస్కృతిక దినోత్సవం, ఏడో రోజు విద్యా దినోత్సవం నిర్వహించి క్షేత్రస్థాయిలో విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. -
ఇళ్లగణన షురూ
ములుగు: డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ నమోదు ప్రక్రియ నిర్వహించారు. సోమవారం నుంచి జనగణనలో భాగంగా హౌజింగ్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ) కార్యక్రమానికి ఎన్యుమరేటర్లు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 807 బ్లాక్లను గుర్తించారు. ప్రతి బ్లాక్లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేసేందుకు జిల్లాలో 545 మంది ఎన్యూమరేటర్లను, 97 మంది సూపర్ వైజర్లను నియమించారు. స్వీయ నమోదులో ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినపుడు సరిచేసుకోవాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. మొదటి మూడు రోజులు మ్యాప్ తయారీ చేసి ఇళ్లకు నంబర్లను కేటాయించనున్నారు. అనంతరం 33 ఆంశాలతో కూడిన వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. వచ్చే 9వ తేదీలోగా హెచ్ఎల్బీ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు ఆదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. జిల్లాలో 807 బ్లాకులు 545 ఎన్యుమరేటర్లతో ఇంటింటి సర్వే -
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
ములుగు రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్ను ఎస్పీ సోమవారం టాస్ వేసి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించాలని సంకల్పించినట్లు తెలిపారు. ములుగు మావోయిస్టు రహిత జిల్లాగా మారిందని వెల్లడించారు. జిల్లాలో మత్తు, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


