Mulugu
-
మేడారంలో మంద కృష్ణ పూజలు
ఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సోమవారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతి గొప్పగా ఆదివాసీ జాతరగా ఉండటం అభినందనీయమన్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దగ్గరికి వచ్చి దర్శించుకోవడం గొప్ప తరుణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద కుమార్, పుట్ట రవి, గుగిళ్ల పీరయ్య, వేల్పుల సూరన్న, జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు, జిల్లా అధికారి ప్రతినిధి గజ్జల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు కరుణాకర్, చంద్రమౌళి, స్వామి, ప్రశాంత్, రవీందర్, శ్యామ్, మల్లేష్, తిరుపతి, రాంబాబు, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక ఆర్థిక సర్వే ప్రారంభం
ఏటూరునాగారం: మండలంలోని శంకరాజుపల్లిలో సోషియో, ఎకనామిక్ సర్వే నిర్వహించినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం శంకరాజుపల్లిలో సర్వేను చేపట్టారు. ఆదాయం, విద్య, వృత్తి, నివాస స్థితి, జీవన పరిస్థితులపై సమాచారం సేకరించడానికి సర్వే చేపట్టామన్నారు. ఇది ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలు, విధానాలను రూపొందించడానికి సహాయ పడుతుందన్నారు. పర్యవేక్షణ చేసి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారులు భూక్య లాల్నాయక్, రమేష్ బాబు, లక్ష్మీనారాయణ, ఎంపీఎస్ఓలు వంశీ, నాగరాజు, తిరుపతి, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నిండుకుండలా ‘సమ్మక్కసాగర్’
కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలోని గోదావరిపై నిర్మించిన సమ్మక్క సా గర్ బ్యారేజీ నీటి నిల్వ తో నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 5,500 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో బ్యారేజీ ప్రాంతం నీటితో జలకళను తలపిస్తుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 83 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుంది. కాగా గుట్టలగంగారంలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద నీటి పంపింగ్ గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతుంది. వేసవి కాలం కావడంతో దిగువన తాగు నీటి వినియోగం పెరగడంతో పాటు యాసంగి పంటల సాగుకు నీటి వినియోగం పెరిగింది. దీంతో పంపింగ్ వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉండగా ఫేజ్ టులో ఉన్న రెండు మోటార్లలో ఒక మోటారును, ఫేజ్ త్రీలో ఆరు మోటార్లు ఉండగా ఐదు మోటార్లతో అధికారులు నీటిని దిగువకు జిల్లా పరిధిలోని గొల్లబుద్దారం రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. మొత్తం ఆరు మోటార్లతో 1,706 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. నీటి వినియోగం పెరిగితే మిగతా మోటార్లను ఆన్ చేసి పంపింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. వెంకటాపురం (ఎం): తెలంగాణ పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో యూకేకు చెందిన అంతర్జాతీయ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ సోమవారం జిల్లాలోని ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ పర్యటన సందర్భంగా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ కాకతీయుల కళా సంపద, రామప్ప శిల్పకళా వైభవం, ప్రపంచ వారసత్వ గుర్తింపు రామప్ప దేవాలయానికి ఏ విధంగా వచ్చింది, దేవాలయ ప్రాముఖ్యత, ప్లోటింగ్ బ్రిక్స్, సౌండ్ బాక్స్ టెక్నాలజీ, పేరిణి శివతాండవం, పర్యాటక ప్రాముఖ్యతపై రాబర్ట్ పార్కర్కు వివరించారు. తెలంగాణను ఎందుకు సందర్శించాలనే అంశంపై పర్యాటక అవకాశాలు, సాంస్కృతిక సంపద, వివిధ రకాల స్థానిక వంటకాల ప్రత్యేకతలపై ఆయనకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధి కల్యాణ్, టూరిజం గైడ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. లక్నవరంలో.. గోవిందరావుపేట: లక్నవరం ప్రకృతి సోయగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అంతర్జాతీయ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ అన్నారు. సోమవారం మండలపరిధిలోని లక్నవరం సరస్సును లక్నవరం టూరిజం మేనేజర్ సండ్రపా టి శివశంకర్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఆయన వెంట అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, తదితరులు ఉన్నారు. -
పరిష్కరిస్తాం
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బదిలీ కావడంతో ఐటీడీఏ పీఓగా కలెక్టర్కు బాధ్యతలను అప్పగించడంతో సోమవారం ఐటీడీఏలో గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్జిదారులు ఐటీడీఏకు భారీగా తరలివచ్చారు. గిరిజన దర్బార్లో 130, ప్రజావాణిలో 52 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి ఎస్డీసీ కోర్టు నిర్వహణ చేపట్టడం జరుగుతుందన్నారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనులు ప్రధానంగా తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, కొత్త బోర్వెల్ల ఏర్పాటు, వ్యవసాయ భూముల్లో బోర్ వెల్స్ ఏర్పాటు వంటి అంశాలపై అర్జీలను సమర్పించారు. భూ వివాదాల పరిష్కారానికి ఎస్డీసీ కోర్టును వారానికి నాలుగు రోజులు మంగళ, బుధ, గురు, శుక్రవారాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుతుందన్నారు. ప్రజలు కోరిన మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధి హామీ పథకం నిధులు, ఇతర నిధులను ఉపయోగిస్తూ ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, ఐటీడీఏ ఏఓ రాజ్కుమార్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. సర్వే చేసి అర్హులుగా ప్రకటించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఇల్లు రాకుండా పోయింది. ఇల్లు వచ్చేలా చూడాలి. అద్దె ఇంటిలో ఉంటున్నాం. అధికారులు స్పందించి ఆదుకోవాలి. – పున్నం రుక్మిణిదేవి, సూరవీడు, వెంకటాపురం(కె)ఏటూరునాగారం మండలం శివాపురంలోని సబ్బుల పరిశ్రమలో తయారైన బట్టల సబ్బులను జీసీసీ ద్వారా 2025 నుంచి 2026 ఫిబ్రవరి సరఫరా చేసిన బకాయిలు రూ.31.55 లక్షల బిల్లులు పరిశ్రమకు రావాల్సి ఉంది. పెండింగ్ బిల్లులతో పరిశ్రమకు తీసుకురావాల్సిన ముడి సరుకును తీసుకురాలేకపోతున్నాం. బిల్లులు ఇవ్వాలని జీసీసీ అధికారులను అడిగితే కాస్మోటిక్స్ బిల్లులు రావడం లేదని, దీంతో బిల్లులు ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – సౌజన్య, లక్ష్మీ, పరిశ్రమ గ్రూపు అధ్యక్షురాలు, కార్యదర్శి, శివాపురం● గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్కి విద్యుత్ లైన్ ఇప్పించాలని గ్రామస్తులు కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో కల్టివేషన్ ఉండగా ఫారెస్టు అధికారులు వాహనాలు తీసుకెళ్లారని బాధితులు విన్నవించారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన గిరిజనులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన గిరిజనులకు గిరి వికాస పథకం కింద బోరు మంజూరు చేయాలని కోరారు. ఐలాపురం గ్రామం నుంచి పంట పొలాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరారు. కలెక్టర్ దివాకర టీఎస్ ఐటీడీఏ గిరిజనదర్బార్లో 130 దరఖాస్తులు -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
గోవిందరావుపేట: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని, స్వచ్ఛమైన ప్రాణవాయువుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా అటవీశాఖ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అడవుల సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా ములుగు ప్రథమ స్థానంలో ఉందన్నారు. పంటలు సమృద్ధిగా పండాలన్నా, సరిపడా వర్షపాతం నమోదు కావాలన్నా అడవులే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అడవిని సంరక్షంచడంలో అటవీ శాఖ అధికారులతో పాటు స్థానికులు సహాయ సహకారాలు అందించినప్పుడు అడవుల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రకృతి రమణీయతకు జిల్లా నిలయంగా మారిందన్నారు. అనంతరం డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ మాట్లాడుతూ అడవుల సంరక్షణే ధ్యేయంగా అటవీశాఖ సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. వైల్డ్లైఫ్ అభయారణ్యంలో బ్లాక్బెర్రీ, ఐలాండ్, ఎస్ఎస్ తాడ్వాయి హట్స్, జంగిల్ సఫారీ, బందాల వ్యూ పాయింట్ వంటి పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క పస్రాలో రూ.35లక్షల నిధులతో రాజీవ్ కాలనీకి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కలెక్టర్, డీఎఫ్ఓతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్కార్డులు మంజూరు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రేగ కల్యాణి, కేశవ్, వజ్రారెడ్డి, రమేష్, భూక్య సుమలత, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
నిధులు నిల్
మూడేళ్లకు పైగా రైతు వేదికల నిర్వహణకు అందని డబ్బులుగోవిందరావుపేట: అన్నదాతలకు పంటల సాగులో సలహాలు, సూచనలు చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలను నిర్మించింది. జిల్లాలోని 10 మండలాల్లో మొత్తం 31 రైతు వేదికలు ఉండగా మూడేళ్లకు పైగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధి కారులు ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన మెయింటెనెన్స్ నిధులు రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసే మెయింటెనెన్స్ నిధులు 2022 ఆగస్టు నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు మూడేళ్లకు పైగా ఒక్క రూపాయి కూడా బిల్లులు రాకపోవడంతో నిర్వహణలో అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నెలవారీగా పత్రీ నెలా సమారుగా రూ. 8వేల వరకు ఖర్చు వస్తుందని చెబుతున్నారు. అలాగే విద్యుత్ బిల్లులు, శుభ్రత, చిన్నపాటి మరమ్మతులకు సంబంధించిన ఖర్చులు సైతం భరించాల్సి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు. నెలకు రూ.8వేల నుంచి 9వేల వరకు.. ప్రారంభంలో ప్రతీ రైతు వేదిక నిర్వహణకు నెలకు రూ.3వేల చొప్పున నిధులు కేటాయించారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు విన్నపం మేరకు ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.8 వేలు, మరికొన్ని చోట్ల రూ.9 వేలకు పెంచింది. అయితే 2022 ఆగస్టు నుంచి నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేశారు. ఫలితంగా వేదికల్లో నిర్వహించే శిక్షణ, సమావేశాలు తగ్గిపోయాయి. ఇతర కనీస అవసరాల కోసం సొంత డబ్బులు చెల్లించలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాదికారులు స్పందించి, పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసి రైతు వేదికలను పూర్వ వైభవానికి తీసుకురావాలని కోరుతున్నారు. రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. విద్యుత్, తాగునీటి బిల్లులు, స్వీపర్ ఖర్చులకు సొంతంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నిధులు రాక పోవడంతో రైతు వేదికల్లో జరిగే కార్యక్రమాల నిర్వహణకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించాము. – వి.సురేశ్కుమార్, డీఏఓ ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ అధికారులు రైతులకు అందని సేవలు -
ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ ఏటూరునాగారంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి – గిరివాణి(గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రేపు(సోమవారం) ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అర్జీలను సమర్పించాలని కోరారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. రామప్ప, హేమాచలక్షేత్రంలో జడ్జి ప్రత్యేక పూజలు వెంకటాపురం(ఎం)/ మంగపేట: జిల్లాలోని రామప్ప, హేమాచలక్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన కుటుంబ సభ్యులతో శనివారం సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో రామప్ప ఈఓ ఇమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సత్కరించి స్వామివారి శేష వస్త్రాలను బహుకరించారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంటాల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. అనంతరం మంగపేట మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని జడ్జి సూర్యచంద్రకళ తన బంధువులతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో ఆలయానికి ఆహ్వానించి ఆమె పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ ఈఓ మహేశ్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. -
రైతుభరోసా
86,736 మందికి..● నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం ● రెండు విడతల్లో రూ.104.38 కోట్లు జమ28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ఈనెల 22 నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమచేయనుంది. జిల్లా వ్యాప్తంగా నూతనంగా పట్టాదారుపాస్బుక్లు పొందిన రైతులతో కలిపి సుమారుగా రూ.111 కోట్ల వరకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రెండు విడతల్లో అందించనుంది. కొత్తగా పట్టాదారు పాస్బుక్కులు పొందిన రైతులు ఈ నెల 28లోగా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. – సురేశ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ములుగు: రైతాంగానికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రబీ సీజన్ ప్రారంభమైనా పెట్టుబడి సాయం అందక నిరాశలో ఉన్న అన్నదాతలకు నేటి (ఆదివారం) నుంచి రైతు భరోసా డబ్బులను ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రైతాంగానికి పెట్టుబడి సాయం అందించడంతో కొంత జాప్యం జరిగింది. దీంతో పెట్టుబడి సాయంపై ఏర్పడిన అనిశ్చితికి తెరదించుతూ ఈ నెల 22 నుంచి రైతు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ.104.38 కోట్లు జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 86,736 మంది రైతులు రబీ సీజన్లో 1,73,970 ఎకరాలు సాగు చేస్తుండగా, ఎకరానికి ఆరు వేల చొప్పున రూ.104.38 కోట్ల పెట్టుబడి సాయం రైతు ఖాతాల్లో ప్రభుత్వం రెండు విడతల్లో జమచేయనుంది. గత యాసంగిలో పెట్టుబడి సాయం రాకపోవడంతో ఈసారి కూడా ప్రభుత్వం మొండిచేయి చూపుతుందని భావించినప్పటికీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగానే రైతులకు భరోసా డబ్బులు అందించడంలో జాప్యం జరిగిందని అధికార యంత్రాంగం పేర్కొంటుంది. రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని అందించనుంది. మొదటి విడతగా ఈ నెల 22 నుంచి పెట్టుబడి సాయాన్ని అందించనుండగా, ఏప్రిల్ రెండో వారంలో రెండో విడత డబ్బులను జమచేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొత్తవారికి అవకాశం 2025–26 సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించి కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. కొత్తగా 1,400 మంది రైతులు పట్టాదారు పాస్బుక్లు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో సుమారు 11 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా వేయగా, వారికి పెట్టుబడి సాయం కింద రూ.6.60 కోట్లను ప్రభుత్వం రెండో విడతలో జమచేయనుంది. -
‘బీసీహెచ్సీ’ని సందర్శించిన ట్రెయినీ డీఎస్పీలు
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని నార్లాపూర్ సమీపంలో గల తక్కళ్లగూడెంలోని ఆదివాసీ పిల్లల విద్యాభివృద్ధికి స్థాపించిన భీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ (బీసీహెచ్సీ)ను ట్రెయినీ డీఎస్పీలు గుడెల్లి సృజన, దైనంపల్లి ప్రవీణ్కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్లో చదువుతున్న చిన్నారులతో పాటు గ్రామస్తులతో వారు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు ఏజెన్సీలోని సాధ్యమయ్యే సామాజిక మార్పులను వివరించారు. భీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ చేస్తున్న సేవలను అభినందించారు. ముఖ్యంగా డ్రాయింగ్లో చూపుతున్న ప్రతిభను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ సభ్యులు సంతోష్, దైనంపల్లి ప్రకాశ్, శ్రీలత, కల్పన, రక్షిత, సాయికుమార్, లావణ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని సబ్స్టేషన్ పరిధిలో గల వివిధ గ్రామాలకు నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ స్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కన్నాయిగూడెం సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా 8.30 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్సరఫరాను నిలిపివేయనున్నట్లు వివరించారు. -
బస్టాండ్ పనులు పూర్తిచేయాలి
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కములుగు: జిల్లా కేంద్రంలో రూ.4.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు మంత్రి శనివారం బస్టాండ్ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఆధునిక సదుపాయాలతో కూడిన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. నూతన బస్టాండ్లో ప్రయాణికుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. జిల్లా అభివృద్ధిలో బస్టాండ్ కీలక పాత్ర పోషిస్తుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించినందుకు గాను మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డును శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఏప్రిల్ 24న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అవార్డుకు సంబంధించిన వాల్పోస్టర్ను మంత్రి సీతక్కతో కలిసి ఫౌండేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు గాను సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. -
పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా గందరగోళం పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీల ఖరారు ఉమ్మడి వరంగల్లో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
భక్తిశ్రద్ధలతో రంజాన్
ములుగు: జిల్లా వ్యాప్తంగా రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) వేడుకలను శనివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఈద్గా, మసీదులకు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని జామా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనలు చేసి పితృదేవతలను స్మరించుకున్నారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాయ్ బలాయ్ తీసుకున్నారు. రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ ఇంట్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు షాక్!
రాష్ట్ర బడ్జెట్2026–2027బడ్జెట్లో అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం ఓరుగల్లుకు కీలకంగా 10 ప్రాజెక్టులు... జరగని ప్రత్యేక కేటాయింపులు.. కొత్తగా ప్రాజెక్టులను ప్రకటించలేదు. అయితే బడ్జెట్ (ప్రగతి పద్దు)లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, విద్యాసంస్థలకు నిధులు కేటాయించారు. ప్రధానంగా వరంగల్ నగరాభివృద్ధి, ఉన్నతవిద్య, పర్యాటక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపించింది. అయితే, కీలకమైన 10 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించినా.. ప్రత్యేకంగా కేటాయించే నిధులను ప్రస్తావించలేదు. రైల్వే కోచ్ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్కు, మామునూరు ఎయిర్పోర్ట్, ఐటీ టవర్, రింగ్రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాతీయస్థాయి యూనివర్సిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, టూరిజం సర్క్యూట్కు ప్రత్యేక కేటాయింపులు లేకన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా వరంగల్ స్మార్ట్సిటీకి గత బడ్జెట్లో రూ.156.52 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సహాయం కోసం రూ.40 కోట్లు కేటాయించింది. పథకం కింద వరంగల్ స్మార్ట్సిటీ అభివృద్ధి పనుల కోసం రూ.44,137.02 లక్షలు కేటాయించారు.● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● కేటాయింపుల్లో ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీటసాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. శాసనసభలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రగతిపద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ వరంగల్ పేరుతో ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన ఈ బడ్జెట్పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం చేసిన టెక్స్టైల్ పార్కు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు కేవలం కొనసాగింపు నిధులే కేటాయించగా.. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు పూర్తిగా కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్లో కొత్తగా మెగా ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించకపోవడం.. ప్రత్యక్ష కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం యూనిట్గా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, రైతు, కార్మికవర్గాలకు ప్రయోజనం కలగనుంది. కాగా, ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల ద్వారా ఉమ్మడి వరంగల్కు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పరోక్షంగా లాభం చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
● వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ● ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ● ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. ● గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు రూ. 30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు -
గ్యాస్ కొరత లేదు
ఏటూరునాగారం: జిల్లాలో గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘గుదిబండ’ కథనానికి జిల్లా యంత్రాంగం కదిలింది. ఈ మేరకు కలెక్టర్ దివాకర టీఎస్ మండల కేంద్రంలోని జీసీసీ గ్యాస్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సివిల్ సప్లయీస్ అధికారిణి కృష్ణవేణి, జీసీసీ డీఎం వాణి, డీటీ విజయ్కుమార్, సర్పంచ్ కాకులమర్రి శ్రీలతో క లిసి గ్యాస్ సరఫరా కేంద్రం పరిస్థితిని పరిశీలించారు. సిలిండర్లు ఎందుకు కొరత వచ్చిందని, ఎప్ప టి నుంచి ఈ సమస్య ఉంటుందని జీసీసీ డీఎం వాణిని ప్రశ్నించారు. ఈనెల 7వ తేదీ నుంచి పెండింగ్లో ఉన్నాయని, సరఫరా ఆలస్యం అయిందని చెప్పడంతో అధికారిణిపై మండిపడ్డారు. గ్యాస్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ముందుగానే హెచ్చరించామని, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్ సరఫరాలో ప్రజలు ఒకరకమైన అనుమానాలు పెట్టుకున్నారని, దానిని నివృత్తి చేయడానికి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేపట్టిందని, దానిని మైక్ల ద్వారా ప్రజలకు ఎందుకు ప్రచారం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. సిలిండర్ బుకింగ్కు 45 రోజుల సమయం.. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, సరఫరా ప్రక్రియలో ప్రజలు అవగాహనతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. గ్యాస్ బుకింగ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం ప్రతీ సిలిండర్ బుకింగ్కు మధ్య 45 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ గడువు పూర్తికాకముందు మళ్లీ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఓటీపీ నంబర్ రాదన్నారు. ప్రజలు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్దకు రావొద్దని సూచించారు. జిల్లాలో 86,896 కనెక్షన్లు జిల్లాలో 8 ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాలకు సంబంధించినవి 86,896, వాణిజ్య అవసరాలకు సంబంధించినవి 254 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు సుమారు 943 గృహ అవసరాల గ్యాస్ బుకింగ్లు జరుగుతున్నట్లు చెప్పారు. గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు భవిష్యత్లో గ్యాస్ కొరత రావొచ్చనే అనుమానాలతో ముందుగానే బుక్ చేసుకోవడంతో ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద విని యోగదారులు సిలిండర్ల కోసం బారులు తీరాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, ఉపసర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు చిన్ని, కిరణ్, రా మకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, లక్ష్మీనా రాయణ, సుధాకర్, జీసీసీ సిబ్బంది సాంబారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోదాం వద్దకు వినియోగదారులు వెళ్లొద్దు మీ ఇంటికే పంపిస్తాం బుక్ చేసుకొని ఉంటే చాలు.. ఓటీపీలు గ్యాస్ వచ్చినప్పుడే చెప్పాలి కలెక్టర్ దివాకర టీఎస్ -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ దివాకర టీఎస్ ఏటూరునాగారం: సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కొరకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ దివాకర టీఎస్ వైద్యులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ ఏటూరునాగారంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని గదులను, వార్డులను, రిజిస్టర్, ల్యాబ్, మెడికల్ స్టోర్ గది, లేబర్ రూమ్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వైద్యులు నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాలన్నారు. అనంతరం మండలకేంద్రంలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ ఫర్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ జగదీశ్వర్, సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్, సర్పంచ్ శ్రీలత, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) పండుగ సందర్భంగా కలెక్టర్ దివాకర శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల (జకాత్) ద్వారా ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. మత సామరస్యంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. -
పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు
● లక్నవరం హరిత టూరిజం మేనేజర్ శివశంకర్ గోవిందరావుపేట: లక్నవరం హరిత రిసార్ట్స్లో పరిసరాలను శుభ్రపరిచి, పర్యాటకులకు మెరుగైన వసతి సదుపాయాలను కల్పిస్తున్నామని టూరిజం మేనేజర్ సండ్రపాటి శివశంకర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల స్వచ్ఛత డ్రైవ్లో భాగంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు లక్నవరం హరిత రిసార్ట్స్లో సండ్రపాటి శివశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకునేలా రిసార్ట్స్ పరిసరాలను పూర్తిగా శుభ్రపరచామన్నారు. స్వచ్ఛమైన వాతావరణం పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. రామప్పలో.. వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట పరిధిలోగల రామప్ప హరిత హోటల్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని టూరిజం శాఖ అధికారులు నిర్వహించారు. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రంతో పాటు చెత్తచెదారాన్ని తొలగించినట్లు హరిత హోటల్ మేనేజర్ రంజిత్కుమార్ తెలిపారు. అదేవిధంగా ములుగు గట్టమ్మ హారితహోటల్ వద్ద కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హరితహోటల్ సూపర్వైజర్ రాకేష్, సిబ్బంది నర్సయ్య, రవి, సంతోష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: ఆశకార్యకర్తలకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్డ్ వేతనాలు రూ.18 వేలు అందించాలని ఆశవర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. బండారుపల్లి రోడ్డు నుంచి వెళ్తున్న ఆశలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆశలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశకార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట రెండు రోజులుగా ధర్నా చేపట్టినా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సర్వేలు నిర్వహిస్తూ అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. పెండింగ్ సర్వే బిల్లు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన రవిగౌడ్, ప్రభావతి, శోభ, చంద్రవాని, దేవి, సంధ్య, స్వరూప, మాదవి, అనిత, నాగమణి, రాజ్యలక్ష్మీ, సత్యవతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది పురస్కారానికి సమ్మక్క పూజారి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య ఉగాది పురస్కారానికి ఎంపియ్యారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలో చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణే రూపంలో అమ్మవారిని గద్దైపెకి సమ్మక్క పూజారులతో కలిసి కొక్కెర కృష్ణయ్య తీసుకొస్తారు. ఈ క్రమంలో క్రిష్ణయ్యను ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం ఆయన హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా పురస్కారం అందుకోవాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆయన హైదరాబాద్ వెళ్లలేకపోయారు. ఉగాది పురస్కారానికి ఎంపికై న కృష్ణయ్యను సమ్మక్క– సారలమ్మ పూజారులతో పాటు మేడారం గిరిజన అభ్యుదయ సంఘం యువకులు, స్థానిక ఆదివాసీలు, భక్తులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఉదయ భాస్కర్కు అర్చక రత్న అవార్డు గోవిందరావుపేట: బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ దక్షిణ భారత కాన్ఫరెన్స్లో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ అర్చకుడు తిరుక్కోవల్లూరు ఉదయ భాస్కర్కు అర్చక రత్న అవార్డు ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పండితులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని, అర్చక వృత్తి పరిరక్షణలో ఉదయ్ భాస్కర్ చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ అర్చక రత్న అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్చకుల స్థాయి పెంపు, వారికి అవసరమైన శిక్షణ, మద్దతు అందించాల్సి ఉందని వివరించారు. రేపు ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణాకాలనీ సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాధ మహర్షి హాజరుకానున్నట్లు తెలిపారు. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండెదడ, బీపీ, ఘగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, ఆస్తమా, సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుందని తెలిపారు. మల్హర్/మల్హర్(కాటారం): మండలంలోని కాటారం గ్రామానికి చెందిన విద్యారంగం, సామాజిక సేవలో నాలుగు దశాబ్దాలుగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ విద్యావేత్త జనగామ కరుణాకర్రావుకు రాష్ట్రస్థాయి ఉగాది ఉత్తమ సేవారత్న పురస్కారం లభించింది. గురువారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో కరుణాకర్రావు రాష్ట్ర స్థాయి సేవారత్న పురష్కరాన్ని అందుకున్నారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన సాయివాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ వీరమేని సంపత్రావుకు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార అవార్డు అందుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు కరుణాకర్రావు, సంపత్రావులను అభినందించి, సత్కరించారు. -
రామప్పలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్ బాద్షా, తరుణ్గుప్తా, ఇవాన్ అలెగ్జాండర్, అంజన వశిష్టలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని వారు కొనియాడారు. వారి వెంట కోఆర్డినేటర్ సందీప్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్సై సాంబారావు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం.. ఉద్యమం
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ నియామకాలపై రైల్వే జేఏసీ చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటోంది.హెచ్పీ 64,000భారత్ 7,000ఇండెన్ 15,000మొత్తం86,000మాది ఇండియన్ గ్యాస్. గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. అడిగితే రేపుమాపు అంటున్నారు. గ్యాస్ హెల్ప్లైన్ నంబర్లు సరిగా పనిచేయడం లేదు. గ్యాస్ను వెంటనే సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. గ్యాస్ లభించకపోవడంతో బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. – కొండాయి ప్రశాంత్, ఏటూరునాగారం గతంలో మాదిరిగానే ఇంటింటికీ గ్యాస్ను తక్షణమే సరఫరా చేయాలి. గ్యాస్ దొరకడం లేదని కావాలని ఏజెన్సీ, గ్యాస్ సరఫరా చేసే వాహనదారులు బ్లాక్ చేసి మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజలకు గ్యాస్ అందని ద్రాక్షలా మారింది. వెంటనే గ్యాస్ను సరఫరా చేయాలి. – గడ్డం లింగమ్మ, ఏటూరునాగారం -
ప్రత్యేక పూజలు.. పంచాంగ పఠనం
ములుగు:/ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలను గురువారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పరాభవ నామసంవత్సరాదికి స్వాగతం పలుకుతూ భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఆరగించారు. సమీప ఆలయాల్లోకి కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు నిర్వహించారు. రైతన్నలు పశువులను కడిగి కొత్తసాలుకు శ్రీకారం చుట్టారు. గోమాతలకు పూజలు నిర్వహించి సల్లంగా చూడాలని వేడుకున్నారు. పోలీస్స్టేషన్లలో, ఆలయాల్లో ఉగాది పచ్చడిని తయారు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని రామాలయంలో కవి సమ్మేళనాన్ని రామప్ప సాహితి సమితి, జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు వారి కవితలను వినిపించారు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామప్ప సాహితి సమితి అధ్యక్షుడు శ్రీనివాసచారి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్, కవులు రాజుయాదవ్, పోషన్న, రమేష్, లెనిన్, రాజశేఖర్, కుమారస్వామి, దుర్గం సూరయ్య, తుమ్మ పిచ్చిరెడ్డి, రేలా విజయ్, అనిల్, రామాలయ కమిటీ అధ్యక్షుడు దొంతిరెడ్డి రాకేశ్రెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు పరాభవ సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజలు -
చిరుజల్లులు.. మిర్చి రైతుల్లో ఆందోళన
వెంకటాపురం(కె): మిర్చి పంటపై పరదాలు కప్పుతున్న రైతులువెంకటాపురం(కె)/వాజేడు: ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గురువారం వెంకటాపురం(ఎం), వాజేడు మండలాల్లో పలుచోట్ల చిరుజల్లులు పడడంతో మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారు. రెండేళ్లుగా మిర్చి రైతులకు దిగుబడి రాకపోవడంతో పాటు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. ఈ ఏడాది మిర్చి పంటకు మంచిధర ఉంది. ఈ క్రమంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో దిగులు చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మిర్చిపంట తడవకుండా ఉండేందుకు పరదాలు కప్పుతున్నారు. -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్తు ,పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడి కక్కడ సిమెంటు ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినటం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేం చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు ,రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, చీమ చింత, మల్బరీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటుచేసి అక్కడక్కడ డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
రీ సర్వేకు రైతులు సహకరించాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు రూరల్: భూముల రీ సర్వేకు రాంచంద్రాపూర్ రైతులు సహకరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండల పరిధిలోని రాంచంద్రాపూర్లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంచంద్రాపూర్ శివారులో భూ వివాదాల కారణంగా రైతులకు పట్టాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకు శాశ్వత పరిష్కారంగా భూముల సర్వే చేపడుతున్నట్లు వివరించారు. శివారులో 10,500 ఎకరాల వ్యవసాయ భూమికి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. 9 బ్లాక్లుగా ఏర్పాటు చేసి సర్వే చేపట్టి రోజుకు 50 నుంచి 75 మంది పట్టాదారుల భూములను సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డి, రాంచంద్రాపూర్, దేవనగర్, భూపాల్నగర్, గుర్తూర్తండా సర్పంచ్లు దొంతి స్వరూప, సంతోష్, రమణారెడ్డి, రాజునాయక్, భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం, ఏటూరునాగారం మండలం రొయ్యూర్కు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల విద్యార్థులు పది మంది గుమికూడి దాడి చేసుకున్నారు. ఈ విషయం విద్యార్థులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల నిరంతర పెట్రోలింగ్ లేకపోవడంతోనే ఆకతాయిల చేష్టలు మితిమీరిపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు
ములుగు రూరల్: మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై చైర్పర్సన్ చంద్రకళ, కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం జాతీయ రహదారిపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా చెత్త సేకరణకు 10 ఆటోలు, డోజర్ వాహనం కొనుగోలుకు ప్రభుత్వం రూ.1.25 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. దీంతో పాటు మరో రూ. 30 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీకి నిధుల మంజూరుకు సహకరించిన మంత్రి సీతక్క, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీఎం, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం -
ఆర్టీసీ పండుగ దోపిడీ
ఏటూరునాగారం: ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు బెంబేలుఎత్తుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఆర్టీసీ పండుగ దోపిడీకి తెరలేపింది. ఉగాది పండుగకు ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తారని ముందే గ్రహించిన ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల జేబులుకు చిల్లులు పెడుతున్నారు. హనుమకొండ నుంచి ఎలక్ట్రికల్ బస్సులో ఏటూరునాగారానికి గతంలో ఒక ప్రయాణికుడికి ఫుల్ టికెట్ రూ. 190లు వసూలు చేశారు. కానీ ఉగాది పండుగ ఆఫర్ అంటు దోపిడీకి రూపకల్పన చేశారు. ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 270 లు వసూలు చేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన జేపాల్ తన కుటుంబంతో కలిసి వస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ప్రయాణించగా రూ.810లు చెల్లించి బస్సులో ప్రయాణించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బస్సులోని కండక్టర్ను ప్రయాణికులు ప్రశ్నించగా పండుగ సందర్భంగా కంట్రోలర్ తమకు రూ. 270లు తీసుకోవాలని ఆదేశించారని వెల్లడించారు. హనుమకొండ నుంచి ములుగు రూ. 120, హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి రూ.270 తీసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సు హనుమకొండ టు ఏటూరునాగారం రూ.190 ఉగాది పండుగ పేరుతో రూ. 270 చార్జ్ వసూలు లబోదిబోమంటున్న ప్రయాణికులు -
ఉగాది భవిష్యత్కు పునాది
వేప పూత పులకరింతలు, మామిడి పిందెల పలకరింతలు, మోదుగచెట్ల మధురిమలు. తీరొక్క పూల పరిమళాలు.. నూతనత్వానికి ఆనవాళ్లు.. నూతన సంవత్సరాది వేడుకలు. – హన్మకొండ కల్చరల్తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. సౌభాగ్యానికి , ప్రేమ, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెల్లోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. తెలుగు వారి నూతన సంవత్సం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడుతారు. పంచాంగం విని భవిష్యత్కు పునాది వేసుకుంటారు. కొత్త మజిలీలను వెతుక్కుంటారు. ‘శ్రీపరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేడు (గురువారం) ఉగాది పర్వదినం జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పచ్చడి ప్రత్యేకత.. కాలాన్ని బట్టి వచ్చే పండుగల్లో ఆయా కాలాల్లో పండించిన వాటిని దేవుడికి నివేదించడం ప్రకృతిపై ప్రేమతో మనిషి ఏర్పర్చుకున్న నియమావళి. అదేవిధంగా చైత్రమాసం నాటికి ప్రజలు తాము కొత్తగా పొందే చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేప పూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్ నివేదనలుగా సమర్పిస్తారు. తెలంగాణలో ఉగాది పచ్చడిని పానీయంలా చేయడం సంప్రదాయం. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. కానీ నీళ్లలో కలిపి పానీయంగా తాగితే ఎండాకాలంలో మండుటెండల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళస్నానం.. కొత్త సంవత్సరంలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ శరీరంలోని పాత మురికిని తొలగించుకోవడం కోసం పండుగనాడు విధిగా నువ్వుల నూనెతో శరీరమంతా రుద్దుకొని ఒకగంట ఆగిన తరువాత తలస్నానం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. పండుగనాడు నువ్వుల నూనెతో చేసే స్నానాన్ని మంగళస్నానంగా పిలుస్తుంటారు. మంగళస్నానం ఆచరిస్తే శరీర, మనసులోని మలినం పోతుందని హిందువులు నమ్ముతుంటారు. వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకం.. చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి ఆలయంలో 48 ఏళ్లుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి మహాన్యాసకపూర్వక పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, కాళికాపూజ, శ్రీసీతారాముల విగ్రహప్రతిష్ఠాపన పూజలు, భక్తులకు ఆరోగ్య ఐశ్వర్య విద్యశాంతి ఒనగూరాలని సంకల్పిస్తూ సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్లు.. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెబుతున్నారు. సాయంత్రం సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులుచే పంచాంగశ్రవణం, కూచిపూడి నృత్యాలు, కవి సమ్మేళనం జరుగుతాయని వేయిస్తంభాల దేవాలయం ఈఓ అనిల్కుమార్ తెలిపారు. రోడ్ల రద్దీ.. ఉగాది పండుగను పురస్కరించుకుని పండుగకు కావాల్సిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, నోము దండలు, జంద్యాలు, కొత్త కుండలు, దీపాంతలు, వివిధ రకాల పూలు, మోదుగపూలు, మోదుగాకులు, ఇసుక, మర్రి ఊడలు, పసుపు కుంకుమ గంధం, మామిడాకులు తదితర వస్తు సామగ్రి కొనుగోలు చేయడానికి అమ్మడానికి వచ్చిన వారితో నగరంలోని పలు కూడళ్లలో రద్దీ ఏర్పడింది. పరాభవ సంవత్సరంలో రాజు ‘గురువు’ శ్రీపరాభవ నామ సంవత్సరంలో గురువు రాజుగా, మంత్రిగా కుజగ్రహాలు ఉన్నాయి. ఫలితంగా గురువు రాజైతే పాలకులు కర్మాయుక్తులు, ధర్మయుక్తులు అవుతారు, ప్రభువులు సన్మార్గులు, నీతివేత్తలుగా జీవిస్తారు. ప్రజలు సుభిక్షం, ఆరోగ్యం, సుఖం కలుగుతాయి. మంత్రి కుజుడు కావున అగ్నిచేత దహనాలు, యుద్ధాలు తప్పవు. ఈ సంవత్సరం పాడి అభివృద్ధి, సుగంధ ద్రవాలు, బంగారం, ముత్యాలు, వస్తువుల ధరలు పెరుగుతాయి, రస జాతి వస్తువుల ధరలు తగ్గుతాయి. – గంగు ఉపేంద్రశర్మ రుషులు అందించిన అద్భుత విజ్ఞానమే పంచాంగం.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు కలది పంచాంగం. దీన్ని మహా విష్ణుస్వరూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. నేటి ఆధునిక కాలపు నవీన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో భారతీయులు పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకునేవారు. ఎక్కడో ఉన్న గ్రహాలను వాటి దూరాలను ఎలాంటి టెలిస్కోప్ లాంటి ఖగోళ విజ్ఞాన శోధన పరికరాలు లేకుండా భారతీయ మేధావులు సృష్టించిన ఒకానొక అద్భుతమే పంచాంగం. – డాక్టర్ శ్రీఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, ఆస్ట్రాలజర్పంచాంగ శ్రవణానికి ముస్తాబైన ఆలయాలు జిల్లాలో పండుగ వాతావరణం నేడు వేయిస్తంభాల ఆలయంలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం బంచ్కు రూ.50 పలుకుతున్న ధర సాక్షి, వరంగల్: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వుకు ఈసారి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడడంతో కొమ్మలు మోడువారిపోయాయి. ప్రస్తుతం వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. కానీ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేసుకునే వేప పువ్వుకు ఈసారి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ వరంగల్లో బుధవారం రూ.20 నుంచి రూ.50 వరకు (చిన్న కట్ట, ఆకులతో కూడుకున్నది) వేప పువ్వును వ్యాపారులు విక్రయించారు. -
బాలల రక్షణపై అవగాహన కల్పించాలి
ములుగు: బాలల రక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంపత్రావు పేర్కొన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్రావు హాజరై మాట్లాడారు. జిల్లాలో నూతనంగా బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, 14 మంది జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. జిల్లాలో ఉన్న మండల, గ్రామ, వార్డులలో ఉన్న బాలల పరిరక్షణ కమిటీలను సమన్వయం పరుస్తూ, బాలలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తుందని వెల్లడించారు. జిల్లాలోని బాలల రక్షణపై అవగాహన కల్పించడం, ఆరేళ్లకు పైబడిన బాలలందరూ బడికి వెళ్లేలా చూడడం, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించడం, బాలల హక్కులకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తదితర విషయాలపై అవగాహన కార్యక్రమాలను కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి అదనపు కలెక్టర్ బాలల సంరక్షణ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ సంపత్రావు -
పథకాల అమలుకు జనగణన కీలకం
ములుగు: దేశాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుకు జనాభా గణన–2027 కీలకమని జిల్లా జనాభా లెక్కల అధికారి, సీపీఓ ప్రకాశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ సమావేశ మందిరంలో సోమవారం జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్స్ ఆపరేషన్న్ కార్యాలయానికి చెందిన గణాంక అధికారులు హోబాలాల్, సరళ సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో జనాభా గణన–2027 నిర్వహణకు సంబంధించి జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు గణన ప్రక్రియపై పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు. ఈ సారి దేశంలో తొలిసారిగా జనాభా గణనను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ ద్వారా గణన ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. అదేవిధంగా ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా విభజించే విధానం, గణన నిర్వహణకు సంబంధించిన విధానాలపై అధికారులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో గణాంక అధికారి లాల్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. జిల్లా జనాభా లెక్కల అధికారి ప్రకాశ్ -
పరిష్కరించండి..
వినతులుగిరిజన దర్బార్లో ఇలా.. ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో బాధితుల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంపత్రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో 46 వినతులు రాగా అదనపు కలెక్టర్ సంపత్రావు స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 11 వినతులు రాగా డీడీ జనార్దన్, ఏవో రాజ్కుమార్లు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని అధికారులకు సూచించారు.ఎస్ఎస్తాడ్వాయి మండల పరిధిలోని భూపతిపురానికి చెందిన రైతు, వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన మరో రైతు ఇందిర సౌర జలగిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాపురంలో కంటేజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఉద్యోగి 28 నెలలుగా వేతనం రావడం లేదని ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన రైతు రైతుబంధు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ప్రజలు పెసా గ్రామసభ నిర్వహించాలని కోరారు. మిగిలిన వారు ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్(ఎస్డీసీ)అనిల్, మేనేజర్ శ్రీనివాస్, ఎం.కొండల్రావు, కొమురం ప్రభాకర్, వై.కిశోర్, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ సంపత్రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ ప్రజావాణిలో 46, గిరిజన దర్బార్లో 11 వినతులు స్వీకరణ -
టీకా స్పెషల్ డ్రైవ్
వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించాలి. నోరు, పెదాల, నాలుక, కాళ్ల గిట్టలను పొటాషియం పర్మాంగనేట్ లేదా సైలెన్ వాటర్తో శుభ్రం చేయాలి. రెండోసారి వ్యాధి సోకకుండా యాంటిబయాటిక్ మందులను, పశువుల్లో వ్యాధి నిరోదక శక్తి పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులను వాడాలి. గాలికుంటు వ్యాధిపై రైతులు నిర్లక్ష్యం వహించకూడదు. వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండు సార్లు టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి ప్రాణాంతకం కావడంతో అలసత్వం వహిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ములుగు రూరల్: గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత టీకాలను పంపిణీ చేస్తున్నాయి. పశువుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందిస్తుంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు గాలికుంటు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ రంగాలలో గాలికుంటు వ్యాధితో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో ఏప్రిల్ 9వ తేదీ వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలోని పది మండలాల్లో ఉచిత టీకా స్పెషల్ డ్రైవ్లో భాగంగా 34 బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,8 లక్షల పశువులకు ఉచిత టీకాలు అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 38,880 పశువులకు టీకాలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. వ్యాధి లక్షణాలు గాలికుంటు వ్యాధి సూక్ష్మ క్రిములతో వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన గేదెలు, ఆవులు ఆహారం సరిగా తీసుకోకపోవడంతో బక్కచిక్కి పోతాయి. పశువులు రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం భారిన పడి నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే వ్యాధి ముదిరి పోతుంది. దీంతో పశువులు మేత, నీరు తీసుకోకపోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన పశువులను.. గాలికుంటు వ్యాధి సోకిన శువులను ఇతర పశువులతో కాకుండా వేరు చేయాలి. ఎప్పటికప్పుడు పశువుల పాకను శుభ్రం చేయాలి. వారానికి ఒక సారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికీటకాల నివారణకు చర్యలు పాటించాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాత వినియోగించాలి. వ్యాధిసోకిన పశువులు మృతి చెందితే గోతిలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలి. పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేయించుకోవడంతో పశుసంరక్షణ బాగుంటుంది. వ్యాధి బారిన పడిన పశువులను గుర్తించి ఆస్పత్రిలో చికిత్స అందించాలి. గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ చేపడుతున్నాం. ముందుగా రైతులకు సమాచారం అందిస్తున్నాం. – కొమురయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మూగజీవాలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు జిల్లాలో 34 బృందాలు, 1.08 లక్షల జీవాలు -
‘ఉద్యోగ భద్రత కల్పించాలి’
ములుగు రూరల్: సమగ్ర శిక్షణ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోడెం సమ్మయ్య అన్నారు. సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ సంపత్రావుకు వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ 15 ఏళ్లుగా చాలిచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. కేజీబీవీలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది స్పెషల్ అధికారులు, విద్యావనరుల కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్లు సీఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, స్వరూప, కరుణాకర్, కుమార్, ప్రవీణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
రూ. 20.72 కోట్లతో అభివృద్ధి పనులు
ములుగు: మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ది పనులు చేపట్టేందుకు 2026–27 సంవత్సరానికి గాను రూ.20.72 కోట్లతో వార్షిక బడ్జెట్ను రూపొందించినట్లు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళభిక్షపతి తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్లు, సంబంధిత అధికారులతో సోమవారం బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయ, వ్యయాల అంచనాలను పరిశీలించి బడ్జెట్ను రూపొందించి ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి పన్నుల ద్వారా రూ.3.52 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా రూ.17.20 కోట్లు అందనున్నట్లు అంచనా వేసి మొత్తం రూ.20.72 కోట్లతో బడ్జెట్ను రూపొందించి ఆమోదించినట్లు వివరించారు. ఈ బడ్జెట్ ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపర్చడానికి ఉపయోగించనున్నట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహీన్ రియాజ్మీర్జా, కౌన్సిలర్లు నల్లెల్ల స్వాతి, గుంటోజు పావని, గండ్రకోట వాణి, ఓంప్రకాశ్, పోరిక రాజు, యాసం వసంత, గుగ్గిల్ల దివ్య, బైకాని సునిత, నవీన్, సాంబయ్య, భరత్, కుత్బుద్దీన్, పద్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్కు ప్రణాళిక మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ -
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని జర్మనీ దేశస్తులు మిచెల్, లుడ్విగ్లు కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని వారు సోమవారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోట్ షికారు చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. వ్యర్థాలు తిని వంద గొర్రెలు మృత్యువాత ఎస్ఎస్ తాడ్వాయి : మేడారంలో భక్తులు పడేసిన వ్యర్థాలు (ఎండి పోయిన అన్నం) తిని సుమారు వంద గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా మరికెల మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు కొద్ది రోజుల క్రితం తనకున్న 200 గొర్రెలను తీసుకుని మేత నిమిత్తం తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతానికి వచ్చాడు. ఊరట్టం పంచాయతీ పరిధిలోని పెట్రోల్ బంక్ సమీపంలో గొర్రెల మంద పెట్టుకుని సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా గొర్రెలు అస్వస్థకు గురై సుమారు వంద మృత్యువాత పడ్డాయి. మేడారం వనదేవలతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పడేసిన వ్యర్థాలు తినడంతో గొర్రెలు అస్వస్థకు గురై మృత్యువాత పడినట్లు బాధిత గొర్రెల యజమాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల పైగా నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యాడు. మిగతా గొర్రెలు కూడా అనారోగ్యంగానే కనిపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించాలని వేడుకున్నాడు. బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా రాకేశ్యాదవ్ ములుగు రూరల్: బీజేపీ ములుగు పట్టణ అధ్యక్షుడిగా ఇమ్మడి రాకేశ్యాదవ్ను నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయంలో రాకేష్కు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, బీజేపీలో కట్టుబడి పనిచేశారని తెలిపారు. అనంతరం రాకేష్యాదవ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బలరాం, రవీంద్రాచారి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆశవర్కర్ల సమస్యలు పరిష్కరించాలిములుగురూరల్: అశ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రూ.18వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఆశ వర్కర్లు 20ఏళ్లుగా పేద ప్రజలకు అనేక సేవలందిస్తున్నారని తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లో అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, రవి, నీలాదేవి, శ్రావ్య, రమాదేవి, రజిత, కవిత, చంద్రవాణి పాల్గొన్నారు. -
గర్భిణులకు పౌష్టికాహారం అవసరం
ములుగు రూరల్: గర్భిణులకు పౌష్టికాహారం అవసరమని, ఆరోగ్య కార్యకర్తలు పౌష్టికాహార ప్రాముఖ్యతను వారికి వివరించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు సూచించారు. ఈ మేరకు సోమవారం కుటుంబ సంక్షేమం, ప్రజా ఆరోగ్య కమిషనర్ ఆదేశాల మేరకు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ప్రమాద గర్భదారణ మహిళలను గుర్తించాలన్నారు. వారికి ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఏఎన్సీ క్లినికల్, విలేజ్ న్యూట్రిషన్ డేలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శరీర శ్రమతో పాటు వైద్యుల సలహాలతో మందులు తీసుకోవాలన్నారు. నార్మల్ డెలివరీతో కలిగే లాభాలు, ఆపరేషన్లతో ఉండే నష్టాలను వివరించాలన్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మాతృ, శిశు మరణాలను తగ్గించడంపై సూచనలు చేశారు. గర్భాధారణ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్కు 14ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంతోషి, విద్యాసాగర్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, నాగఅన్వేష్, మాస్ మీడియా అధికారి సంపత్, తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
ములుగు: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లిం మత పెద్దలతో, సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి మత సామరస్యానికి, లౌకిక వాదానికి కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తిని కాపాడుతుందని వెల్లడించారు. పాలకులు ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలే తప్పా విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం మత పెద్దలకు, మైనార్టీ సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలను మంత్రి సీతక్క తెలియజేశారు. అనంతరం కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి మైనారిటీ సోదరులందరికీ ఈద్ కా తోఫా కానుకలను అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, నాయకులు భగవాన్రెడ్డి, వంగ రవియాదవ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు: 2027 జనాభా లెక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జనాభా లెక్కలలో భాగంగా మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు జరిగే పేజ్ 1 హౌస్ లిస్టింగ్ – హౌసింగ్ సెన్సెస్ నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. దేశాభివృద్ధిలో జనాభా లెక్కలు ఎంతో కీలకమైనవని తెలిపారు. జనాభా గణన ప్రాథమిక అవసరమని, హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియలో ఇంటి నిర్మాణం, నివాస పరిస్థితులు, కుటుంబ వివరాలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, ఇంటి నిర్మాణ వివరాలతో పాటు తదితర 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలను, నగరంలోని వార్డులను గణన బ్లాకులుగా విభజించాల్సిన తీరు, గణన ప్రక్రియ నిర్వహించే అంశాలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ డిజిటల్ పద్ధతిలో సాగే అవకాశం ఉందని తెలిపారు. మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని సమాచార సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనాభా లెక్కల సేకరణలో ఎటువంటి తప్పులకు తావివ్వకూడదని, ఇళ్ల లెక్కింపు మ్యాపింగ్ చేస్తూ ప్రతీ ఇంటికి నంబర్ కేటాయించాలన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి సరైన సమాచారం నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన గణాంకాలు అందుతాయని వివరించారు. సమాచార సేకరణలో భాగంగా హెచ్ఎల్వో మొబైల్ అప్లికేషన్పై అధికారులకు, సూపర్వైజర్లకు, ఎన్యుమరేటర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ప్రత్యేక టెక్నికల్ బృందాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల అధికారుల బాధ్యతలను వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ వెంకటేశ్, హైదరాబాద్ జనగణన శాఖ అధికారులు హోబాలాల్, సరళ, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీపీఓ వెంకయ్య, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
‘మేడిగడ్డ’ వినాశనానికి బాధ్యత వహించాలి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వినాశనానికి అప్పటి కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ప్రతినిధుల బృందం సభ్యులు పి.సుదర్శన్, బి.వెంకట్, సాయిబాబు, నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి), పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో పార్వతి (సుందిళ్ల) బ్యారేజీలతో, పంపుహౌస్ను వారు ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. అక్కడ కుంగిపోయిన పియర్లు, దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు రూ.90 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ప్రజాధనాన్ని వెచ్చించిన ఈ ప్రాజెక్టులో జరిగిన నష్టం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ భారీ వైఫల్యానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వమే ప్రాథమిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కేవలం కమీషన్లు, ప్రచారం కోసం శాసీ్త్రయత లేకుండా పనులు చేయించడంతో మేడిగడ్డ బ్యారేజీలో 19 నుంచి 22 వరకు ఉన్న గేట్ల ప్రాంతం కుంగిపోయిందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన వారి ఆస్తులను జప్తు చేసి, ఆ నిధులతోనే జరిగిన నష్టాన్ని పూడ్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను కేవలం గత ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసేందుకే పరిమితం చేయకూడదని సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, నిపుణుల కమిటీ సూచనల మేరకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంటలకు సకాలంలో నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టు కేవలం ప్రచారానికే పరిమితమైందా అని నాయకులు ప్రశ్నించారు. సీఎం రేవంత్ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరమ్మతు చేయాలి అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి రైతు, కూలీ, కార్మిక సంఘాల డిమాండ్ -
పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం
ములుగు రూరల్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులతో పాటు కలెక్టర్ను అధికారులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడేందుకు కష్టపడుతున్న నిజమైన సేవకులు పంచాయతీ కార్మికులని కొనియాడారు. మండల పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హనుమంతరావు, సీడీపీఓ శిరీష, సర్పంచ్ శ్యాంరావు, కార్యదర్శి పోలురాజు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. -
‘జైన గుడిని పరిరక్షించాలి’
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప ఆలయ పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య కోరారు. ఆదివారం వారు రామప్ప పరిసరాల్లోని కాకతీయ కట్టడాల ఆనవాళ్లను పరిశీలించిన అనంతరం జైన ఆలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గర్భాలయం, అర్ధమండపం, రెండింటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణకలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన శిఖరం, దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్ధం పడుతున్నాయని వివరించారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం, శిల్పం, చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి లాంఛనమని తెలిపారు. అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరుడికి అంకితం చేశారన్నారు. వాస్తు నైపుణ్యం ఉన్న ఈ ఆలయాన్ని సైతం పదిలపరిస్తే సందర్శకులకు ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనుగుడిని కూడా ఆ జాబితాలో చేర్చాలని వారు కోరారు. -
పలుగుల రోడ్డుకు మోక్షం
మల్లన్న బోనాలుమల్లన్న పట్నాలు వేస్తున్న భక్తులు మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలోని గోదావరి ఒడ్డున వెలిసిన మల్లన్న దేవుడి ఆలయంలో ఆదివారం మల్లన్న పట్నాలు, బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులతో పట్నాలు నిర్వహించి మల్లన్న దేవుడికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తులు డప్పుచప్పుళ్ల మధ్య శివశక్తుల పూనకాలతో భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. – కాళేశ్వరంకాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామానికి వెళ్లే ఆరు కిలోమీటర్ల ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. దశాబ్దకాలంగా ఇసుల రీచుల గుండా తరలివచ్చిన లారీలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రహదారిని పునర్నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రూ.22 కోట్లతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధి పనులకు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. కొన్నేళ్లుగా వర్షాకాలంలో రాత్రి ఆపదొస్తే కనీసం 108 అంబులెన్స్ వెళ్లలేని దుస్థితిలో ఈ రహదారి ఉంది. కీలక రవాణా మార్గం.. పలుగుల రహదారి పలుగుల టు కుంట్లం గ్రామాల ప్రజలకు కీలక రవాణా మార్గంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకయాతనగా మారింది. ముఖ్యంగా ఇసుక రీచ్ల నుంచి వచ్చే భారీ లారీల రాకపోకలతో రహదారి ఆనవాళ్లు కోల్పోయి పూర్తిగా చెడిపోయింది. మోకాలు లోతు గుంతలు, దుమ్ము కారణంగా వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణం. రహదారి నిర్మాణం పూర్తయితే పలుగుల, పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించుకునే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు రవాణా మెరుగుపడి కాళేశ్వరం పాఠశాలకు రానున్నారు. కొత్త రహదారి నిర్మాణంతో ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.22 కోట్లతో మంత్రి శంకుస్థాపన పదేళ్ల నరకయాతనకు చెక్ ఇసుక రీచుల లారీలతో ఆనవాళ్లు కోల్పోయిన రహదారి -
పిలవకున్నా వస్తే..
శుభకార్యాలకు పిలవకున్నా వెళ్లి భోజనం చేసేవారికి ఆదివారం భూపాలపల్లి పట్టణం సుభాష్కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ ఎదుట హెచ్చరిక బోర్డు పెట్టారు. సింగరేణి ఫంక్షన్ హాల్లో ఆదివారం వివాహం జరిగింది. ఫంక్షన్ హాల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఫంక్షన్కు సంబంధం లేనివారు వందలాది మంది వచ్చి భోజనాలు చేస్తున్నారని నిర్వాహకులు గుర్తించారు. దీంతో ఇతరులెవరూ రాకుండా ఫంక్షన్ హాల్ ఎదుట ‘వివాహానికి సంబంధం లేనివారు వస్తే రూ.5వేల జరిమానా, 3నెలల జైలు’ అని ఫ్లెక్సీ పెట్టారు. భోజన ప్రియులు బోర్డును చూసి వెనుదిరిగి వెళ్లారు. గతంలో శుభకార్యాలు చేసినప్పుడు భోజనాలు సరిపోక ఇబ్బందులు అయ్యేవని.. ఫ్లెక్సీ ఏర్పాటుతో అందరికీ భోజనాలు సరిపోయాయని నిర్వాహకులు అన్నారు. – భూపాలపల్లి రూరల్ -
నో ఎడిట్ ఆప్షన్
21 వేల మందికి రాని గృహజ్యోతి జీరో బిల్లు ● రెండేళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న పేదలు ● 99ప్రజాపాలన సమావేశాల్లో ఊసెత్తని అధికారులు ఏటూరునాగారం 4వ వార్డులో సుమారు 56 మంది గృహజ్యోతి పథకం పొందని లబ్ధిదారులు ఉన్నారు. అందరూ నిరుపేదలే. ప్రజాపాలనలో గతంలో పెట్టుకున్న విద్యుత్ మీటర్లకు జీరో బిల్ రావడం లేదు. దీంతో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను మండల పరిషత్ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సేకరించడం లేదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. – దేపాక ఎల్లమ్మ, 4వ వార్డు, ఏటూరునాగారం ఏటూరునాగారం: పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకానికి ఎడిట్ ఆప్షన్ లేదు. దీంతో విద్యుత్ బకాయిలు చెల్లించలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. 2 జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లేకుండా పోయింది. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను ఇచ్చినప్పటికీ ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది డాటా ఎంట్రీ సక్రమంగా చేయకపోవడంతో అర్హులకు పథకం అందకుండా పోయింది. విద్యుత్శాఖ, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో లబ్ధిదారుల సమస్యలు గాలికివదిలేసినట్లు కనిపిస్తోంది. 99 ప్రజాపాలన పేరుతో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్పా ప్రజలకు అందని పథకాలు, పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రేషన్కార్డు, మహిళా, ఇంటి యజమాని పేరుపై సొంత ఇల్లు ఉండి విద్యుత్ మీటర్ ఉన్న లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం కింద 200ల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే జీరో బిల్ను విద్యుత్శాఖ వారు అందజేస్తున్నారు. కానీ అర్హులైన లబ్ధిదారులకు 198 యూనిట్లు నమోదు అయినప్పటికీ ప్రజాపాలనలో నో డాక్యుమెట్స్ అప్లయిడ్ అంటూ వెబ్సైట్ పోర్టల్లో రావడంతో లబ్ధిదారులు విద్యుత్శాఖ, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కావాల్సిన పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేసినప్పటికీ ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో లబ్ధిదారులను వెనక్కి పంపుతున్నారు. గృహజ్యోతి పథకానికి ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తుల్లో విద్యుత్ సర్వీస్కు సంబంధించిన సరైన ఆధారాలు ఇవ్వలేదు. దీంతో ఆ సర్వీసులకు జీరో బిల్లు ఇవ్వడం లేదని.. ఇప్పుడు దానికి చేసేదేమీ లేదని విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతికి చెంది గృహజ్యోతికి అర్హత ఉన్న ప్రజలు పథకం వర్తించకపోవడంతో మీటర్ రీడింగ్ ప్రకారం డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం పెట్టిన పథకం కళ్లముందు కదిలాడుతున్నా దానికి ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో లబ్ధిదారులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులకు పథకం వర్తింపజేయాలని ప్రజలు కోరుతున్నారు. మండలాలు మొత్తం లబ్ధిదారులు పెండింగ్ సర్వీసులు ములుగు 10,841 5,526 5,315 మల్లంపల్లి 4,062 3,085 977 వెంకటాపురం(ఎం) 6,373 4,925 1,444 గోవిందరావుపేట 6,888 4,670 2,218 ఎస్ఎస్తాడ్వాయి 3,988 3,016 972 ఏటూరునాగారం 6,431 3,453 2,978 మంగపేట 9,558 6,608 2,950 కన్నాయిగూడెం 1,875 1,727 148 వెంకటాపురం(కె) 8,737 5,838 2,899 వాజేడు 6,668 5,187 1,485 -
‘పది’ పరీక్షలు షురూ..
● తొలిరోజు నలుగురు గైర్హాజరు ములుగు: పదోతరగతి పరీక్షలు తొలిరోజు షురూ అయ్యాయి. ఈ మేరకు తొలిరోజు శనివారం తెలుగు పేపర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,290 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా నలుగురు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. జిల్లాలోని 15 పరీక్ష కేంద్రాలను శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించాయని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలుగు పరీక్ష ప్రశాంతంగా సాగిందని వివరించారు. పరీక్షకు పరీక్షకు మధ్య ఉన్న వ్యవధిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తదుపరి పరీక్షకు సిద్ధం అయ్యేందుకు సంబంధిత సబ్జెక్టు టీచర్ పర్యవేక్షణలో సలహాలు తీసుకోవాలని డీఈఓ సూచించారు. -
గ్యాస్ సిలిండర్ల కొరత లేదు
● ప్రజలు ఆందోళన చెందొద్దు ● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలో గ్యాస్ సరఫరా, పోలీస్, సివిల్ సప్లయీస్, రవాణా, వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులను అడిగితెలుసుకుని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి జిల్లాలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల్లో గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ హాస్టల్, పాఠశాల, గురుకులాలను సందర్శించి పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో అవసరమయ్యే గ్యాస్కు సంబంధించి వైద్యాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ఆస్పత్రుల్లో గ్యాస్ సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైనా గ్యాస్ సిలిండర్లకు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తే సహించేదిలేదన్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బ్లాక్లో విక్రయించకుండా పోలీస్ అధికారులు నిరంతరం నిఘా పెట్టాలన్నారు. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు.. రాష్ట్ర పౌరసరఫరాలు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గ్యాస్ సరఫరా సిలిండర్ల సరఫరాను పర్యవేక్షించేందుకు కలెక్టర్ చైర్మన్గా, జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్ కన్వీనర్గా 12 మంది అధికారులతో కలిసి జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ గ్యాస్ సరఫరా ఇబ్బందులపై పర్యవేక్షణ జరుపుతుందని వెల్లడించారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్గా వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పౌరసరఫరాల అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 18004257109 లో సంప్రదించవచ్చని కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్ ఫైజల్ హుస్సేని, డీఎంహెచ్ఓ గోపాల్రావు, డీఏఓ సురేశ్కుమార్, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. -
యాప్ కష్టాలు
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026గోవిందరావుపేట: జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె) వంటి మండలాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఆయా మండలాల్లో 1/70చట్టం అమలులో ఉండడంతో చాలా మంది రైతులకు పట్టాలు లేవు. ఇటీవల ప్రభుత్వం యూరియా పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు, బుకింగ్ చేసుకునేందుకు యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూరియా బుకింగ్కు నిరక్షరాస్యులు, కౌలు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. 1.25లక్షల ఎకరాల్లో పంటలు సాగు జిల్లాలోని పది మండలాల్లో సుమారుగా 98 వేల మంది రైతులు ఉన్నారు. వీరు 1.25లక్షల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈ మేరకు యాసంగికి గాను 17వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. అలాగే సుమారుగా 25 వేల నుంచి 30వేల వరకు కౌలుదారులు వ్యవసాయం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే నిరక్షరాస్యులు, భూమి పట్టాలు లేని రైతులు 30వేల మంది వరకు ఉన్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేయడం చాలా మంది రైతులకు కష్టంగా మారింది. పట్టా లేని రైతులు, కౌలు రైతులకు.. ఏజెన్సీలో అనేక ఏళ్లుగా భూములు సాగుకుంటున్నా పట్టాలు రాలేదు. యూరియా కావాల్సిన రైతులు స్మార్ట్ ఫోన్లో ప్రభుత్వం సూచించిన యాప్ను డౌన్లోడ్ చేసుకుని భూమి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భూమి పట్టా లేని రైతులతో పాటు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం యాప్లో యూరియాను బుకింగ్ చేసుకోవడం ద్వారా ఎక్కడ ఎరువులు ఎంత అవసరమో ముందుగానే స్పష్టమైన సమాచారం ఉంటుందని చెబుతున్నారు. ఆ వివరాల మేరకు ఎరువుల సరఫరా సులభమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల రైతుల పరిస్థితిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని, గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సహాయం చేయాలని కోరుతున్నారు. యూరియా బుకింగ్కు ఇబ్బందులు పడుతున్న రైతులు ఏజెన్సీలో చాలా భూములకు పట్టాలు లేని పరిస్థితి నిరక్షరాస్యులు, కౌలు రైతులకు తప్పనితిప్పలుఎన్డీఎస్ ఆప్షన్తో బుక్ చేసుకోవచ్చుఅగ్రికల్చర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మొబైల్ నంబర్ నమోదు చేస్తే రైతుకు సంబంధించిన పట్టా పాస్ బుక్, భూమి వివరాలు ఆటోమెటిక్గా కనిపిస్తాయి. రైతు ఏ పంట వేశాడో ఎంపిక చేసుకుంటే దానికి అనుగుణంగా ఎకరాలు, యూరియా అవసరం చూపిస్తుంది. కౌలు దారులు అయితే అసలు పట్టాదారి మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ నంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే యూరియా బుకింగ్ అవుతుంది. పట్టా లేని రైతుల కోసం ఎన్డీఎస్(నాన్ డిజిటల్ సైన్డ్ ) అనే ఆప్షన్ ఉంది. వీరు ఏఈఓను సంప్రదిస్తే మొబైల్ నంబర్ ఆధారంగా లాగిన్ చేసి సుమారు 15 నిమిషాల్లో బుకింగ్ పూర్తి చేస్తారు. – వి. సురేశ్, డీఏఓబుకింగ్ చేయడం కష్టంగా ఉందియాసంగిలో రెండు ఎకరాల్లో వరి వేశాను. నేను చిన్న ఫోన్ వాడుతాను. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని చెప్పుతోంది. కానీ నా లాంటి రైతులకు అది చాలా కష్టంగా మారింది. స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియదు. నాలాంటి చిన్న రైతులకు గ్రామంలోనే ఎరువులు సులభంగా దొరికేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. – గోపగాని ఐలయ్య, కౌలు రైతు, చల్వాయి -
ఎవరికీ పట్టని ‘సీఎంఆర్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్ రికవరీ కాలేదు. హసన్పర్తి మండలంలోని ఓ రైస్మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. .. ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద నిబద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్కు చెల్లించాల్సింది మరో సీజన్కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్’ వ్యాపారం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధాన్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. స్కాం ఇలా వెలుగులోకి.. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్ సప్లయీస్/మార్కెటింగ్ శాఖ ద్వారా రైస్ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్సీఐ/సివిల్ సప్లయీస్ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్ మిల్లింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి. 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం 2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్కు కొందరు రైస్మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయిలపై కమిషనర్ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది. డిఫాల్టర్ రైస్మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టమ్ మిల్లింగ్ రైస్ నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం అధికారుల ఉదాసీనతపై కమిషనర్ సీరియస్.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ఏటూరునాగారం: సర్పంచ్లు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రేమలత హాజరై మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, సేవల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్లైన్–1098, జిల్లా హబ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వంటి విభాగాల ద్వారా మహిళలు, బాలికలు, పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు. మహిళలు ఎదుర్కొనే గృహహింస, వేధింపులు, అత్యాచారం వంటి సమస్యలపై సఖి కేంద్రం ద్వారా అందించే వైద్యం, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను సర్పంచ్లు గుర్తుంచుకొని కావాల్సిన వారికి సాయం చేయాలన్నారు. అలాగే ప్రమాదంలో ఉన్న లేదా సహాయం అవసరమైన పిల్లల కోసం చైల్డ్ హెల్ప్లైన్ 1098 ద్వారా 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా డీహెచ్ఈడబ్ల్యూ ద్వారా మహిళల సాధికారత, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తదితర అంశాలపై సర్పంచ్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ, ఏఓ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఈ పురుషోత్తం, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీవిద్య, వసంత, బాలల పరిరక్షణ విభాగం అధికారి రాజు, సఖి కౌన్సిలర్ కల్పన, చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ విక్రమ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
‘నిర్భయ నిధి’కి జిల్లా ఎంపిక
● కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్కములుగు: కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధి పథకం కింద ములుగు జిల్లాను ఎంపిక చేసింది. ఈ పథకంలో భాగంగా మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు (ఇంక్లూసివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్) కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాను ఈ పథకానికి ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని శనివారం ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పథకం లక్ష్యం ఈ పథకం ద్వారా జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు జెండర్–రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీకి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రికి వివరించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను సీతక్క అభినందించారు. తెలంగాణలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తున్నందుకు తమ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపినట్లు వివరించారు. క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పాలనా’ ( మిషన్ శక్తి) పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ. 5,500, హెల్పర్లకు రూ. 3వేలు గౌరవ వేతనంగా ఇస్తున్నారని.. ఇది వారు చేసే పనికి, బాధ్యతకు ఏమాత్రం సరిపోదని వివరించినట్లు తెలిపారు. ఈ పథకం విజయవంతం కావాలంటే సిబ్బందికి ఇచ్చే వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కోరినట్లు తెలిపారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని మంత్రి సీతక్క కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవిని కోరినట్లు వెల్లడించారు. -
గ్యాస్ సరఫరాపై అపోహలు సరికాదు
ములుగు: గ్యాస్ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిల్వ చేయడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడినందుకు 288 కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలకు అవసరమైన మేరకు స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీసీఎస్ఓ ఫైజల్ హుస్సేన్, ఇరిగేషన్ ఈఈ అప్పలనాయుడు, హార్టికల్చర్ అధికారి సంజీవరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతీ పోలింగ్ స్టేషన్కు బూత్ లెవల్ ఆఫీసర్ను నియమించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ములుగు నుంచి కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఆర్డీఓను ఆదేశించారు. తహసీల్దార్లు మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ములుగు ఆర్డీఓ వెంకటేష్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సలీం పాషా, తహసీల్దార్ విజయభాస్కర్, ఎలక్షన్ డ్యూటీ నితీష్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -
యాప్లో అటెండెన్స్ తప్పనిసరి
వెంకటాపురం(కె): వైద్యశాఖలో విధులు నిర్వహించే ఉద్యోగులు యాప్లో అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని డీసీహెచ్ఎస్ (డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఫర్ హాస్పటల్ సర్వీసెస్) జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని వైద్యశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వైద్యశాలలో పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ల్యాబ్, ఎక్స్ రే విభాగాల్లో యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా.. అని పరిశీలించారు. ఎండలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాతావరణానికి అనుకూలంగా డయోరియా, డీ హైడ్రేషన్, వడదెబ్బ తగిలిన రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని అన్నారు. అవసరమైన వార్డుల్లో ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలను అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం సూపరింటెండెంట్ సురేష్కుమార్, తదితరులు ఉన్నారు. డీసీహెచ్ఎస్ జగదీశ్వర్ -
బస్టాండ్ను అందుబాటులోకి తీసుకురావాలి
మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఏడాది కావస్తున్నా బస్టాండ్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. అసంపూర్తి బస్టాండ్ నిర్మాణంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురువుతున్నారు. బస్టాండ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలి. బస్టాండ్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొత్త సురేందర్, కౌన్సిలర్ తాత్కాలిక బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం అధికారులు కనీస వసతులు కల్పించాలి. ఎండాకాలం కావడంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతీరోజు వందలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారు. దాతలైనా స్పందించి తాత్కాలిక బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. – నూనె శ్రీనివాస్, ప్రయాణికుడు● -
ప్రత్యేక కుర్చీ ‘పంచాయితీ’
● మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ● ఉప సర్పంచ్ వేధింపులే కారణమని ఆరోపణములుగు రూరల్: జీపీ కా ర్యాలయంలో తనకు ప్రత్యే క గది, కుర్చీ ఏర్పాటు చేయించాలని ములుగు మండలం జాకారం ఉప సర్పంచ్ వేధిస్తున్నాడని మహిళా సర్పంచ్ సమత గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు సమతను ములుగు జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈసందర్భంగా సమతతో శుక్రవారం సాక్షి మాట్లాడించగా ఉపసర్పంచ్ తనను ప్రతీ పని కి అడ్డుపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల అనంతరం ప్రమాణస్వీకా ర కార్యక్రమంతోపాటు పారిశుద్ధ్య పనుల నిమిత్తం పనిముట్లు, చెత్త సేకరణ వాహన డీజిల్ ఖర్చులకు రూ.40 వేలు బిల్లు పెట్టడంతో.. నాకు తెలియకుండా ఎలా బిల్లు తయారు చేస్తారని, పంచాయతీలో ఏ పని చేసినా తనకు తెలియకుండా చేయకూడదని దురుసుగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాకు సంబంధం లేదు: ఉపసర్పంచ్ సర్పంచ్ సమత ఆత్మహత్యాయత్నానికి నాకు సంబంధం లేదు. వారి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు యత్నించి నాపై ఆరోపణలు చేస్తున్నారు. గత సోమవారం పంచాయతీ జనరల్ బాడీ సమావేశంలో ఉప సర్పంచ్గా కుర్చీ ఏర్పాటు చేయాలని కోరాను. కానీ, గురువారం ఆత్మహత్యకు యత్నిస్తే నేను కారణమని ప్రచారం చేయడం సరికాదు. -
నేటినుంచి టెన్త్ వార్షిక పరీక్షలు
ములుగు: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి (శనివారం) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 117 పాఠశాలకు చెందిన 3,291 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతీ పరీక్ష కేంద్రానికి సీఎస్ (చీఫ్ సూపరింటెండెంట్), డీఓను(డిపార్ట్మెంటల్ ఆఫీసర్)ను కేటాయించారు. 203 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. జిల్లాలో మూడు సీ–సెంటర్లు ఉండడంతో వాటికి ప్రత్యేకంగా సీ–సెంటర్ కస్టోడియన్లను ఏర్పాటు చేశారు. ఈసారి సెంట్రల్ సిలబస్ తరహాలో విద్యాశాఖ పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతీ పరీక్షకు మూడు నుంచి నాలుగు రోజులపాటు వ్యవధి ఉండడంతో ప్రతి విద్యార్థి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసేవరకు పరీక్ష కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు హాల్టికెట్, పెన్నులు, పరీక్ష ప్యాడ్ తప్ప ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని అధికారులు చెబుతున్నారు. పరీక్ష కేంద్రానికి గంటముందుగానే విద్యార్థులు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద తాగునీరు, వైద్య సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్ తీసుకుని రావాలని, ఒకవేళ హాల్టికెట్ పోయినట్లయితే ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ను అంగీకరిస్తామని పేర్కొన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 3,291 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతి లేదు. ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు క్లాక్ రూమ్ వద్ద తమ సెల్ఫోన్లను డిపాజిట్ చేయాలి. మాస్ కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాం. విధుల్లో పాల్గొనే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలి. – సిద్ధార్థరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ● జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు విధుల్లో 203 మంది ఇన్విజిలేటర్లు పరీక్షలు రాయనున్న 3,291 మంది విద్యార్థులు -
అంతర్జాతీయ అంశాలపై అవగాహన అవసరం
గోవిందరావుపేట: విద్యార్థుల్లో అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు మోడల్ ఐక్యరాజ్యసమితి వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని డీఈఓ సిద్ధార్థరెడ్డి అన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ, జిల్లా సాంఘిక శాస్త్ర ఉ పాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ మోడ ల్ స్కూల్ చల్వాయిలో జిల్లాస్థాయి మోడల్ ఐక్యరాజ్యసమితి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై అవగా హ న కలిగి ఉండాలన్నారు. ఐక్యరాజ్యసమితి విధానా లు, అంతర్జాతీయ సంస్థల పనితీరుపై విద్యార్థుల కు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్లో విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని, ఐ క్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో కూ డా సేవలందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించా రు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులను హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థా యి మోడల్ ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యరాజ్యసమితిలో ఉండే జనరల్ అసెంబ్లీ, యూనిసెఫ్, యునె స్కో వంటి సంస్థల ప్రతినిధులుగా మారి పూర్తిగా ఆంగ్లంలో ప్రసంగించడం విశేషమన్నారు. అనంత రం పలవురు విద్యార్థులు మాట్లాడుతూ.. జిల్లాస్థాయి మోడల్ ఐక్యరాజ్యసమితిలో పాల్గొనడం త మలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. కార్యక్రమంలో శ్యాంసుందర్ రెడ్డి, రామకృష్ణ, ఏడుకొండలు, శ్రీహర్షం రాజు, సాంబయ్య, నాగేశ్వరరావు, కమలాకర్, పాయం వీరనారయణ, గొంది దివాకర్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ సిద్ధార్థరెడ్డి -
పూర్తయ్యేదెన్నడో..?
నత్తనడకన ములుగు బస్టాండ్ నిర్మాణ పనులు ములుగు: నత్తకే నడక నేర్పుతున్నతీరుగా సాగుతున్నాయి.. ములుగు బస్టాండ్ నిర్మాణపనులు. ఆధునిక సౌకర్యాలతో మోడ్రన్ బస్టాండ్ నిర్మించి ఆరునెలల్లోపే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పనులు పూర్తికాలేదు. పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా.. పనుల పురోగతిలో ఎలాంటి మార్పులేదు. జిల్లా కేంద్రంలో మోడ్రన్ బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. దీంతో గతేడాది మే 4న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైటెక్ తరహాలో బస్టాండ్ నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మేడారం జాతర లోపు మోడ్రన్ బస్టాండ్ వినియోగంలోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు స్లాబు నిర్మాణం వరకే జరిగాయి. దీంతో మేడారం జాతరకు వెళ్లే భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్టాండ్ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో స్లాబు వరకు పనులు పూర్తి చేసి సంబంధిత కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో బస్టాండ్ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేనా... అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపడుతుండడంతో ములుగు శివారులోని లక్ష్మీనగర్ వద్ద తాత్కాలిక బస్టాండ్ను అధికారులు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాగా ఏర్పడడంతోపాటు మున్సిపాలిటీగా ఆవిర్భవించడంతో రవాణా వ్యవస్థ పెరిగింది. పర్యాటక ప్రదేశాలు సైతం ములుగు జిల్లాలో అధికంగా ఉండడం, హనుమకొండ, భూపాలపల్లి, నర్సంపేట, ఏటూరునాగారం వెళ్లే ప్రయాణికులకు ములుగు కేరాఫ్గా ఉండడంతో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక బస్టాండ్ వద్ద కనీసం తాగునీటి వసతి కల్పించకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరైన నీడ లేకపోవడం, కూర్చోడానికి సరిపడా సీట్లు లేకపోవడం, మరుగుదొడ్లు కూడా రెండే ఉండడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. నూతనంగా నిర్మిస్తున్న పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీసీ బస్సుల కోసం వేచిచూడకుండా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎండలో ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు కాసే బదులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ గమ్యానికి చేరుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్ బస్టాండ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.కనీస సౌకర్యాలు లేకుండా ఉన్న తాత్కాలిక బస్టాండ్ 10 నెలలు దాటినా పూర్తి కాని వైనం తాత్కాలిక బస్టాండ్లో కనీస వసతులు కరువు రూ.4 కోట్లతో కొనసాగుతున్న మోడ్రన్ బస్టాండ్ నిర్మాణం -
గద్దెలపై చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలపై చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు, 99 రోజుల ప్రజా ప్రణాళిక ప్రగతి పాలనలో భాగంగా శుక్రవారం కలెక్టర్ దివాకర టీఎస్ ఊరట్టం గ్రామపంచాయతీ కొత్తూరు హ్యాబిటేషన్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెలపై చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, గద్దెల ప్రాంగణంలో డ్రెయినేజీ సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ఆలయ రిలేయింగ్ ఫ్లోరింగ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 99 రోజుల ప్రజా ప్రణా ళిక ప్రగతి పాలనలో భాగంగా ఊరట్టం గ్రామపంచాయతీ కొత్తూరు హ్యాబిటేషన్లో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. వివిధ దశల్లో ఇళ్లను త్వరగా పూర్తి చేసుకొని ఉగాది పండగ వరకు గృహ ప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, కేంద్రంలోని చిన్నారులకు యూనిఫారం పంపిణీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీరస్వామి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీధర్, ఆర్అండ్బీ డీఈ, అంగన్వాడీ టీచర్లు రోహిణి, ఊరట్టం సర్పంచ్ కోరం శైలజ, వెంకటేష్ నాగమణి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి గోవిందరావుపేట: ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆయన పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించి, ఆరోగ్య కేంద్రానికి వైద్యులు, సిబ్బంది సమయానికి రావాలని తెలిపారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చిన ప్రజలు వేచి ఉండే పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు వైద్యసేవలు అందించాలని తెలిపారు. గర్భిణులకు పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేలా అవగాహన కల్పించాలని, ఫార్మా స్టాక్ రిజిస్టర్ను ప్రతీరోజు అప్డేట్ చేయాలని ఫార్మసిస్ట్కు సూచించారు. ఆరోగ్య కేంద్రంలో నిరుపయోగ పరికరాలను తొలగించాలని తెలిపారు. ఆస్పత్రి వార్డులు, వాష్ రూమ్లను నిరంతరం శుభ్రం చేయించాలని, వైద్యం కోసం వచ్చే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మధు, ఇతర సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధం చేయాలి కలెక్టర్ దివాకర టీఎస్ -
రామప్పను సందర్శించిన ఇంగ్లండ్ దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్కు చెందిన క్రిష్టోఫర్ శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించగా శిల్పాకళాసంపద బాగుందని కొనియాడారు. గిరిజన విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏపీఓ ఏటూరునాగారం: వాజేడు మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ వసంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో విద్యార్థుల సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందించాని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, మూత్రశాలల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. సౌకర్యాల లేమితో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు యజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించి విద్యావంతులు చేయాలని ఆదేశించారు. తరగతి గదులు, వంటశాల, ఆహార భద్రత గోదాంలు, రికార్డులను పరిశీ లించారు. జేడీఎం కొండల్రావు, ఉన్నారు. అర్చకులపై కులాల ప్రస్తావన తగదు మంగపేట : మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోని బ్రాహ్మణ అర్చకులపై కులాల ప్రస్తావనతో ఫిర్యాదులు చేయడం తగదని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో అర్చకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తణుగుల రత్నాకర్, జిల్లా బ్రాహ్మణ సేవాసమితి నాయకులతో కలిసి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడారు. హేమాచల క్షేత్రం రిటైర్డ్ అర్చకుడు, భద్రాచలం దేవస్థానం అర్చకులు బ్రాహ్మణ వర్గానికి చెందిన అర్చకులపై కులాల ప్రస్తావన తీసుకురావడం, తహసీల్దార్కు ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. బ్రాహ్మణ శ్రీవైష్ణవ ఆరాధ్య మాధ్యనియోగి శాఖలు బ్రాహ్మణ శాఖల కిందకే వస్తాయన్నారు. అర్చకుల మధ్య నెలకొన్న పంచాయితీని వైష్ణవ పాంచరాత్ర ఆగమ పండితుడు చిన్న జీయర్ స్వామి సమక్షంలోనే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్కు వినతి ఇచ్చామని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సేవాసమితి నాయకులు సూర్చనారాయణ శర్మ,నాగేశ్వర్రావు శర్మ, మణికంట శర్మ, వాసుదేవమూర్తి, ఏడునూతుల ఋశ్వర్చంద్, అనిపెద్ది మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ, వెంకటనారాయణశర్మ, తదితరులు పాల్గొన్నారు. అవగాహన సదస్సు భూపాలపల్లి అర్బన్: ఆర్మీ నియామకాలపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించా రు. సికింద్రాబాద్ కేంద్రానికి చెందిన ఆర్మీ అధికారులు జశ్వంత్సింగ్, మనీష్కుమార్ హా జరై అగ్నివీర్ నియామకాలపై వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆర్మీలో చేరడానికి ఉన్న అవకాశాలు, అర్హతలు, ఎంపిక విధా నం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం పై అవగాహన కల్పించారు. -
కేసులను నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
ములుగు రూరల్: పోలీస్ స్టేషన్లలో కేసులను నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి భాదితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ములుగు, ఏటూరునాగారం డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించని నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పరిష్కరించబడని కేసులపై సమగ్ర సమీక్ష చేపట్టారు. నేర తీవ్రత ఎక్కువ కలిగిన కేసులు, ఆస్తి సంబంధిత కేసులను పరిశీలించారు. మహిళలు, ఫోక్సో కేసులపై ప్రత్యేక చొరవ చూపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎన్డీపీఎస్ కేసులు, అక్రమ ఇసుక రవాణ, ఐడీ లిక్కర్, ఐఎంఎఫ్ఎల్ అక్రమాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ జాగ్గరీ, ఎన్ఫోర్స్మెంట్ కేసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నేరనియంత్రణకు ప్రతీ పోలీస్ బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. మళ్లీ నేరసమీక్ష సమావేశం వరకు పురోగతి లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ కిషోర్కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, సీఐలు సురేష్ కుమార్, దయాకర్, ముత్యం సురేష్, ఆయా డివిజన్ల పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
ఈద్ కా తోఫా పంపిణీ
కాళేశ్వరం(మహదేవపూర్): రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఈద్ కా తోఫాను మహదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతీ ఒక్కరు సోదరాభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హసీనాఅక్బర్ఖాన్, మసీదుల సదర్లు తాజోద్దీన్, ముజుఖాన్, మాజీ మసీద్ కమిటీ సదర్ దయాజ్ఖాన్, నాయకులు వామన్రావు, ఉప సర్పంచ్ శ్రీజ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
నిరుపయోగంగా..
ఏటూరునాగారం: జిల్లాలో మొక్కల పెంపకమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను రూ. 20ల వరకు ఖర్చు చేసి ఏర్పాటు చేసింది. అవి ఇప్పుడు పశువులకు కేంద్రాలుగా, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. 2023లో సర్పంచ్ల ఆధీనంలో ఉన్న పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేసేందుకు ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరు చేశారు. దీంతో జిల్లాలోని 9 మండలాల్లో 25 బృహత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీల పరిధిలోని కూలీలతో మొక్కలను నాటించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. వనాల్లో మొక్కల పెంపకం లక్షల రూపాయలు ఖర్చు చేసి బోరు, డ్రిప్, విద్యుత్ మోటారు, పైపులైన్లు ఇలా అనేక రకాల వసతులు కల్పించినట్లు లెక్కలు చూపి డబ్బులు సైతం తీసుకున్నారు. అయినా అవి ఉపయోగంలోకి రాలేదు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాకర్స్, గార్డెనింగ్, మొక్కల పెంపకంతో పాటు ఇతర పండ్ల మొక్కలను నాటించేందుకు అప్పడు ప్రణాళికలను రూపొందించారు. పనులు చేపట్టిన సర్పంచులు మధ్యలోనే వాటిని వదిలేసి నిధులు కాజేశారు. ప్రభుత్వం మారడంతో పాటు సర్పంచ్లు సైతం వేరే వారు రావడంతో వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలి.. బృహత్ పల్లె ప్రకృతి వనాలు అన్ని మండల కేంద్రాల్లో రోల్మోడల్గా ఉండేలా చూడాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వాటి నిర్వహణ గు రించి పట్టించుకోకపోవడంతో అవి మరుగున పడ్డా యి. వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా గార్డెనింగ్, కూర్చునేందుకు బేంచీలు, పండ్ల తోటలు, రక రకాల పూల మొక్కలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పటి సర్పంచ్లు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాటిని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటి నిర్వహణపై దృష్టి సారించలేదు. దీన్నే అదునుగా భావించిన కొ ంతమంది పల్లె ప్రకృతి వనాల భూములు కబ్జాకు పాల్పడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మళ్లీ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలి. కోతులకు ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేయాలి. అడవుల్లో ఎలాంటి పండ్లు లభించకపోవడంతో కోతులు గ్రామాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయి. పండ్ల మొక్కలను పెంచి వాటికి ఆహారం వేయడంతో పాటు మంచి ఆహ్లాదకరమైన గార్డెన్లను తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. – గండెపల్లి నర్సయ్య, సామాజికవేత్త, ఏటూరునాగారం●పలు చోట్ల బృహత్ పల్లెప్రకృతి వనంలోని భవనాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. మద్యం సేవించి ఖాళీ సీసాలు, ఇతర పదార్థాలను అక్కడే పడేస్తున్నారు. పోలీసులు, ఈజీఎస్, గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పోకిరీలు, ఆకతాయిలకు అడ్డాగా మారాయి. అలా గే గంజాయి, కొకెన్ వంటి మత్తు పదార్థాలను కూ డా అక్కడ వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారిస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలకు దొరుకుతుందని ప్రజలు కోరుతున్నారు. కబ్జాలకు గురవుతున్న భూములు మందుబాబులకు అడ్డాగా మారిన వైనం పట్టించుకోని అధికారులు -
రామప్పలో నీతి ఆయోగ్ అధికారి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయాన్ని నీతి ఆయోగ్ గ్రేడ్ వన్ అధికారి కృష్ణన్గోపాల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉమాశంకర్ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ శాలువాతో వారిని సత్కరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట నీతి ఆయోగ్ జిల్లా కోఆర్డినేటర్ రవిష్, దేవాదాయ శాఖ సిబ్బంది అవినాష్, సంతోష్, టూరిస్ట్ పోలీస్ అరుణ్ తదితరులు ఉన్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు. పాఠశాల భవనం మంజూరు చేయాలని వినతి కన్నాయిగూడెం: మండల పరిధిలోని బుట్టా యిగూడెం గ్రామ పంచాయతీ పరిఽధిలోని కొ త్తూరులో గల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ మేరకు గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి సమస్యను పలుమార్లు తీసుకురావడంతో గ్రామ సర్పంచ్ జాడి రాంబాబు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ దివాకరను గురువారం కలిసి భవనం మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణమే నిధులు విడుదల చేసి భవన నిర్మాణం చేపడుతామని తెలిపారని వివరించారు. కండక్టర్తో వాగ్వాదం ● భార్యాభర్తలపై కేసు నమోదు భూపాలపల్లి అర్బన్: డబ్బుల విషయంలో ఆర్టీసీ కండక్టర్తో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాగ్వాదం చేసిన భార్యాభర్తలపై కేసు నమోదైన ఘటన భూపాలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సాంబమూర్తి, కండక్టర్ ఎం.యమున తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి భూపాలపల్లికి వస్తుండగా పరకాలలో సులోచన అనే ప్రయాణికురాలు తన భర్తతో కలిసి బస్సు ఎక్కింది. కండక్టర్కు రూ.100 ఇచ్చి తన భర్తకు భూపాలపల్లి రూ.70 టికెట్ తీసుకోగా.. రూ.30 టికెట్పై కండక్టర్ రాసింది. చెల్పూర్లో బస్సు ఎక్కిన మరో ప్రయాణికుడు రూ.500 ఇచ్చి భూపాలపల్లికి రూ.30 టికెట్ తీసుకోగా.. 470 రూపాయలు టికెట్ వెనుకవైపు కండక్టర్ రాశారు. భూపాలపల్లిలో దిగిన తర్వాత ఇద్దరికి కలిపి రూ.500 కండక్టర్ ఇచ్చింది. దీంతో సులోచన తన రూ.30 తనకే ఇవ్వాలని కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కండక్టర్ బస్స్టేషన్ కంట్రోలర్కు తెలియజేయగా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కండక్టర్, మహిళా ప్రయాణికురాలిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. కండక్టర్ ఫిర్యా దు చేయగా ప్రయాణికురాలు సులోచన, అమె భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ భూపాలపల్లి అర్బన్: కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో నిందితుడు కీర్తి అక్షిత్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసినట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. 2024 సంవత్సరంలో పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన అక్షిత్పై పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన నిందితులు కోర్టు ఇచ్చిన వాయిదా తేదీలకు తప్పనిసరిగా హాజరు కావాలని, లేకపోతే కోర్టు జారీచేసే వారెంట్ల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ములుగురూరల్: గ్రామ పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై జిల్లాలోని సర్పంచ్లు, కౌన్సిలర్లకు కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేయాలన్నారు. గ్రామసభలు నిర్వహించి పంచాయతీ నిధులను ఖర్చు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు రూ. 600కోట్లను మంజూరు చేసిందని మరో రూ.1200 కోట్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పంచాయతీలకు ఒక వెయ్యి 3కోట్ల రూపాయలను కేటాయించిందని వెల్లడించారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రూ.50 కోట్లు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. శిక్షణ తర్వాత సర్పంచ్లు, కౌన్సిలర్లు తూచ తప్పకుండా సూచనలు పాటించాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లది కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 15 మంది ప్రత్యేక వైద్య నిపుణులు వైద్యసేవలు అందిస్తున్నారని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. దివ్యాంగులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ధ్రువీకరణ పత్రం స్థానంలో యూడీఐడీకార్డు ప్రవేశపెట్టిందని వివరించారు. యూడీఐడీకార్డు కోసం మీసేవ కేంద్రాల్లో స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాల య సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, ఆర్డీఓ వెంకటేశ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజన విద్యార్థుల్లో వెలుగులు నింపేందుకు అడవిలో కంటైనర్ స్కూల్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మండల కేంద్రంలోని అల్లంవారిఘణపురం పంచాయతీ పరిధిలోని గుర్రాలబావిలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వారి సహకారంతో ఈ కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్లతో కలిసి మంత్రి గురువారం ప్రారంభించి మాట్లాడారు. అవకాశాలు లేని చోట కొత్త వనరులను సృష్టించడమే లక్ష్యమన్నారు. పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. కంటైనర్ పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, బాత్రూమ్లను కూడా నిర్మించినట్లు వివరించారు. అటవీప్రాంతాల్లో ఉన్న గిరిజనులను విద్యావంతులు చేసేందుకు ఈ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని వెల్లడించారు. అడవిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అటవీశాఖ అనుమతి ఇవ్వనందున ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేసుకొని విద్యను అందించాల్సి వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై గిరిజనులు సీతక్కకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఆత్మ చైర్మన్ కర్ల అరుణ, రొయ్యూర్ సర్పంచ్ కావిరి అర్జున్, అల్లంవారిఘనపురం సర్పంచ్ మహాలక్ష్మీ, రామన్నగూడెం సర్పంచ్ నవీన్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
‘పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి’
వెంకటాపురం(ఎం): పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజి, సీఆర్ఎంవైఆర్కే రాజు అన్నారు. ఈ మేరకు ప్రజాపాలన 99రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప చెరువు బోటింగ్ పాయింట్ వద్ద శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా మార్చాలన్నారు. పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీడీసీ ఏఈ విజయ్ కుమార్, టూరిజం గైడ్స్ గోరంటాల విజయ్ కుమార్, వెంకటేశ్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, దశరథం, బోటింగ్ ఇన్చార్జ్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తరలింపు
ఏటూరునాగారం: మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి నుంచి కొంత మంది రాత్రి సమయంలో ఇసుకను ఎలాంటి అనుమతి లేకుండా లారీల్లో తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుకను ముందుగా ట్రాక్టర్ల ద్వారా లోడ్ చేసుకొని ఒక రహస్య ప్రదేశంలో నిల్వ చేసి రాత్రి సమయాల్లో టిప్పర్లు, లారీల్లో వరంగల్కు తరలిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ సమాచారం రెవెన్యూ, టీఎస్ఎండీసీ అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ముళ్లకట్ట బ్రిడ్జికి సమీపంలో ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపవద్దని గతంలో 163 జాతీయ రహదారి అథారిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తవ్వకాల వల్ల బ్రిడ్జికి ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించారు. కానీ కొంత మంది డబ్బుల లాభాపేక్ష కోసం ఇసుకను తవ్వుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై తహసీల్దార్ జగదీశ్ను వివరణ కోరగా ముళ్లకట్ట వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రాత్రి సమయాల్లో పట్టుకునేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్లు దొరకలేదు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని వివరించారు.అనుమతి లేకుండానే ముళ్లకట్ట బ్రిడ్జి నుంచి రాత్రివేళల్లో రవాణా -
ఎండలోనే.. 108 బైక్లు
ఐటీడీఏ భవనం వెనుక ఎండలో ఉన్న 108 బైక్లు ఏటూరునాగారం: ఆపదలో ఉన్న క్షతగాత్రులను ఆదుకోవాల్సిన వాహనాలు ఎండలో ఎండుతున్నాయి. మహాజాతరలో అత్యవసర సేవల నిమిత్తం తీసుకొచ్చిన 108 బైక్లపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అత్యవసర సేవలను అందించడానికి రాష్ట్రంలోని భద్రాచలం, మన్ననూరు, ఉట్నూరు ఐటీడీఏ పరిధి నుంచి సుమారు 108 ద్విచక్ర వాహనాలు మేడారానికి తీసుకొచ్చారు. జాతర ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు ఆ వాహనాలను పట్టుకెళ్లడం లేదు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం వెనుక 108 బైక్లు ఎండలోనే ఉండడంతో బ్యాటరీలు సైతం పక్కకు తీసి పెట్టారు. క్రమంగా బ్యాటరీల చార్జింగ్ కూడా దిగిపోతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ను వివరణ కోరగా రోడ్డు రవాణా, హెల్త్ అధికారులకు సమాచారం ఇచ్చామని, త్వరలోనే బైక్లను పంపించే ఏర్పాటు చేయిస్తామని వివరించారు. మేడారం మహాజాతరకు తీసుకొచ్చిన ద్విచక్ర వాహనాలు డిచార్జ్ అవుతున్న బ్యాటరీలు పట్టించుకోని అధికారులు -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● జీసీడీఓ రజితవెంకటాపురం(కె)/వాజేడు: పదోతరగతి విద్యార్థినులు వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని జీసీడీఓ రజిత సూచించారు. మండల పరిధిలోని కస్తూర్భాగాంధీ పాఠశాలను ఆమె గురువారం సందర్శించారు. పాఠశాలలోని పరిసరాలను, కిచెన్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీసీడీవో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థినులు పరీక్షల సమయంలో భయాందోళనకు గురికావద్దన్నారు. ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. చదువుల్లో రాణించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. 8వ తరగతిలో ఎన్రోల్మెంట్ పెంచేలా చర్యలు తీసుకోవాలని టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి కేజీబీవీని జీసీడీఓ రజిత సందర్శించారు. కలెక్టర్ దివాకర అందించిన విజయపథ సందేశ పత్రాలను విద్యార్థులకు ఎంఈఓ వెంకటేశ్వరరావుతో కలిసి అందజేశారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని పలు సూచనలు చేశారు. అనంతరం టీచింగ్ స్టాఫ్ యాక్షన్ ఫ్లాన్ ఉపాధ్యాయుల డైరీలతో పాటు స్టోర్రూమ్, కిచెన్గార్డెన్, వాష్రూమ్లను పరిశీలించారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఎస్ఎస్ తాడ్వాయి: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్కుమార్ తెలిపారు. మండల పరిధిలోని మేడారంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా మైపతి అరుణ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితాలో ఉంచడం ద్వారా ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా లంబాడీలను ఎస్టీ జాబితాలోనే కొనసాగించేలా రాజకీయ కుట్రలు చేస్తుందని తెలిపారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ఆదివాసీలు ఐక్యతతో ఉద్యమించాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర కమిటీలను ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఈసం సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా పోడెం బాబు, కల్తీ వీరస్వామి, కార్యదర్శులుగా చంద రఘుపతిరావు, సోయం రాజేందర్, కొడెం వెంకటేశ్వర్లులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మైపతి అరుణ్కుమార్, ప్రధాన కార్యదర్శులుగా గుర్రాల రవీందర్, కుడిమెత తిరుపతి, ఉపాధ్యక్షులుగా పొదెం రామ్మూర్తి, సోయం జంగు, అలెం కోటి, కొడప నగేశ్, ఉయిక సుదర్శన, పడిగ నాగేశ్వర్రావు, కార్యదర్శులుగా దారబోయిన రమేశ్, సోయం విక్రమ్ తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం వారు సమ్మక్క– సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ -
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
కన్నాయిగూడెం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని నీతిఆయోగ్ కన్సల్టెంట్ అధికారి కృష్ణన్గోపాల్ తెలిపారు. మండలంలో నీతిఆయోగ్ సంపూర్ణ అభియాన్ 2.0 ఆస్పీరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రాజన్నపేట, దేవాదుల గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఆస్పీరేషనల్ బ్లాక్లో చేపట్టిన ఆరు ఇండికేటర్లను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిరుపేదల అభ్యున్నతికి అధికారులు అహర్నిశలు పాటుపడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి ఆరేళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా పెరుగుతారని వివరించారు. అనంతరం ముప్పనపల్లిలోని అంగన్వాడీ కేంద్రాలతో పాటు కేజీబీవీలోని మరుగుదొడ్లు, తాగునీరు, విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాలు, వివిధ వసతులను పరిశీలించారు. అలాగే కంటైనర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధతి తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రేమలత, తహసీల్దార్ సర్వర్ పాషా, మండల అభివృద్ధి అధికారి సాజిదా బేగం, ఎంఈఓ సాంబశివరావు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.నీతిఆయోగ్ కన్సల్టెంట్ అధికారి కృష్ణన్గోపాల్ -
మళ్లీ జనగణన
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021లో జనగణన చేపట్టాల్సింది. కరోనాతో అది జరగలేదు. అప్పటి నుంచి 15 ఏళ్లలో జనాభా గణనీయంగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్ను హనుమకొండ, వరంగల్ , జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న ఇది మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణనలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ.. 2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకుకారణమని చెబుతున్నారు. డిజిటల్గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు.. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. 1 మార్చి 1 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్ఓ, ఆర్డీ ఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, ము న్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం పట్టణీకరణతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల -
సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
వాజేడు: మండల పరిధిలోని రాంపురం గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ డీఈ పురుషోత్తం ఆధ్వర్యంలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈ పురుషోత్తం మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా రాంపురం గ్రామానికి 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి దర్తీ అభియాన్ యోజన కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మీటర్లు లేని వారికి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రత్యేక లైన్ వేసి ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఏడీఈ ఉమారావు, ఏఈ హర్షద్ అహ్మద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ ఉపాధ్యాయుడు కృష్ణబాబుకు గౌరవ డాక్టరేట్ వాజేడు: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పీర్ల కృష్ణబాబు గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్ని విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని సాధించారు. విధుల్లో అంకితభావంతో పనిచేస్తూనే పేదలకు సాయం చేయాలనే సంకల్పంతో అమ్మ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో ఎంతోమందికి సాయం అందిస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో సైతం పేదలకు నిత్యావసర సరుకులు అందచేసి శభాష్ అనిపించుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ను బుధవారం ప్రదానం చేసింది. ఈ మేరకు కృష్ణబాబు మంత్రి సీతక్కను కలవగా శాలువా కప్పి సన్మానించారు. కార్మికుల సమస్యలపై ఆరోపణలు సరికాదు భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పసునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాయలంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేని వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొంతకాలంగా కార్మికుల సమస్యలను పరిష్కరించామని, కార్మిక సంక్షేమానికి యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరిపి పలు ప్రయోజనాలను సాధించామని తెలిపారు. కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు చేయకుండా కార్మిక సంక్షేమానికి కలిసి పని చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు మధుకర్రెడ్డి, జోగు బుచ్చయ్య, శశరత్నం, సమ్మిరెడ్డి, అశోక్, హుస్సెన్, శంకర్, రమేష్లు పాల్గోన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
ములుగురూరల్: మున్సిపాలిటీ పరిధి బండారుపల్లిలోని 12, 13 వార్డుల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రెయినేజీలో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. దోమల కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యల భారినపడే ప్రమాదం ఉన్నందున ఫాగింగ్ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు గుంటోజు పావని, పోరిక రాజునాయక్, గుగ్గిళ్ల దివ్య, కేశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ -
పట్టాలు.. పడిగాపులు
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఆర్ఓఎఫ్ఆర్(రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు కలిగిన పలువురు గిరిజన రైతులు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డారు. వారి వారసులకు అటవీహక్కుల పత్రాలు తమపేరుపైకి మార్పు చేయాలని మూడేళ్లుగా పడిగాపులు కాస్తున్నారు. బాధిత కుటుంబీకులు ఐటీడీఏ, ఆయా మండలాల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం డెత్ క్లెయిమ్స్ రిపోర్ట్ను ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్ విభాగానికి అందించడం లేదు. దీంతో పట్టాల మార్పు కోసం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. పెండింగ్లో 412 మంది రైతుల వివరాలు జిల్లాలోని 10 మండలాల్లో 12,434 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్నారు. అందులో ఇప్పటి వరకు మరణించిన వారు 450 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 38 మందికి చెందిన గిరిజన రైతుల వివరాలు మాత్రమే ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్ విభాగానికి రావడంతో ఆయా రైతుల వారసులకు పట్టాలు చేశారు. ఇంకా 412 మంది రైతుల వివరాలు రెవెన్యూ కార్యాలయాల నుంచి ఐటీడీఏకు రావాల్సి ఉంది. ఇవి రాకపోవడంతో బాధిత రైతుల వారసులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా మార్పిడి కాలేని పరిస్థితి నెలకొంది. నష్టపోతున్న రైతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతు బంధు పథకం కింద రూ.10 వేలు రైతుకు పెట్టుబడి సాయం కింద జమ అయ్యేవి. ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద రూ. 12వేలు ఒక ఎకరానికి ఇస్తుంది. పట్టా కలిగిన రైతులు మరణించడంతో ప్రభుత్వం చెల్లిస్తున్న రైతు భరోసా రావడం లేదు. దీనివల్ల బాధిత రైతులు పెట్టుబడి సాయం కోల్పోతున్నారు. ఇదేకాకుండా ఏడాదికి రూ.6వేలు వచ్చే పీఎం కిసాన్ డబ్బులు, రైతుబీమా లాంటి అనేక పథకాలను రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా గిరిజన రైతులు కోల్పోతున్నారు. ఇప్పటికై నా జిల్లాలోని రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి వారి పరిధిలో ఉన్న మరణించిన రైతుల వివరాలను ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్ విభాగానికి అందించాలని బాధితులు వేడుకుంటున్నారు.మండలాలు మరణించిన ఐటీడీఏకు వచ్చిన పెండింగ్ వారి సంఖ్య వివరాలుఏటూరునాగారం 70 13 57 గోవిందరావుపేట 30 17 13 కన్నాయిగూడెం 49 0 49 మంగపేట 135 0 135 ములుగు 21 0 21 ఎస్ఎస్తాడ్వాయి 71 5 66 వెంకటాపురం(ఎం) 18 3 15 వెంకటాపురం(కె) 50 0 50 వాజేడు 6 0 6 రైతుల డెత్క్లెయిమ్స్ ఐటీడీఏకు అందించని రెవెన్యూ అధికారులు కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలుజిల్లాలోని మరణించిన గిరిజన రైతుల వివరాలను ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్ విభాగానికి పంపించాలి. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో గిరిజన రైతులకు అందాల్సిన పథకాలు అందడం లేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ అధికారులు సైతం దృష్టి సారించి రైతుల సమస్యలు పరిష్కరించాలి. – కాపుల సమ్మయ్య, రైతు, ఏటూరునాగారం -
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
ములుగు: వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి సమస్య కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, డీపీఓ వెంకయ్య, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీల పెంపకంపై జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, చేతి పంపులు, పైపులైన్ల మరమ్మతులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికీ అందుతున్నాయా లేదా అనే విషయంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండేలా నర్సరీల్లో మొక్కలను పెంచాలన్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలన్నారు. నర్సరీల్లో గ్రీనరీ పెంపొందించేలా ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అనంతరం బండారుపల్లి గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు వంశీరెడ్డి ఫౌండేషన్ పరీక్షల మెటీరియల్ను అందించగా కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు గురువారం ఇంచర్ల ఎంఆర్ ఫంక్షన్హాల్లో ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
అగ్నిప్రమాదాలపై అప్రమత్తం
ములుగు: వేసవి కాలంలో సంభవించే అగ్ని ప్రమాదాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని లీడింగ్ ఫైర్ ఫైటర్ బి.సుధాకర్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని బిట్స్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో దీపం వెలిగించడం, వంట చేసేటప్పుడు గ్యాస్ వినియోగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నారులు నిప్పు జోలికి వెళ్లొద్దని సూచించారు. వేసవిలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. చల్లని వాతావరణంలోనే నిప్పు వెలిగించాలని, ఎండతీవ్రతను బట్టి పూరిళ్లపై నీళ్లు చల్లుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి.కవిత, టెక్నికల్ ఫైర్ ఫైటర్ ప్రవీణ్, అనిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.లీడింగ్ ఫైర్ ఫైటర్ సుధాకర్ రెడ్డి -
తక్కువ కోడ్ చేస్తేనే కుట్టుమిషన్ల కొనుగోలు
ఏటూరునాగారం: తక్కువ కోడ్ చేసిన వారినుంచే కుట్టు మిషన్లు కొనుగోలు చేస్తామని ఏపీఓ వసంతరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ సమీపంలో ఉన్న గోదాంలో ఉచిత కుట్టు శిక్షణతో పాటు మహిళా గ్రూపుల్లోని గిరిజన మహిళలకు ప్రభుత్వ పాఠశాలల స్కూల్ యూనిఫాంలను కుట్టించడానికి ప్రత్యేకంగా రూపొందించనున్న కుట్టు మిషన్ కేంద్రానికి ఐటీడీఏ అధికారులు గతంలో టెండర్లను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం కార్యాలయంలో ఆన్లైన్లో టెండర్లు వేసిన వ్యాపారుల నుంచి మిషనరీ నమూనాలను సేకరించారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుంచే మిషనరీని కొనుగోలు చేస్తామని తెలిపారు. డ్రెస్ల తయారీకి కటింగ్ టేబుల్, కాజా మిషన్, బటన్ మిషన్, ప్రిటింగ్ మిషన్, డ్రెస్ కటింగ్ మిషన్నరీలను కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. సరైన కంపెనీ యజమానుల వద్ద నాణ్యతతో కూడిన మిషనరీని ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇస్తే వారి నుంచి కొనుగోలు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, డీటీ అనిల్ ఆధ్వర్యంలో టెండర్లను పరిశీలించారు. తక్కువ కోడ్ చేసిన వారి వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు.ఐటీడీఏ ఏపీఓ వసంతరావు -
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
మేడారంలో వ్యాపార కమిటీ ఎన్నిక ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో ఆదివాసీ వ్యాపార కమిటీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యాపార కమిటీ అధ్యక్షురాలిగా బంగారి సులోచన, ఉపాధ్యక్షుడిగా అలం సమ్మారావు, కార్యదర్శిగా చింత సతీష్, సహాయ కార్యదర్శిగా సిద్ధబోయిన సత్యవతి, కోశాధికారిగా తల్లడి గౌరమ్మ, కోశాధికారిగా సిద్ధబోయిన సావిత్రి, సలహాల కమిటీ సభ్యులుగా సిద్ధబోయిన జగ్గారావు, పీరిళ్ల వెంకన్న, చిడం బాబురావు, సిద్ధబోయిన స్వామి, నర్సింగరావు, సిద్ధబోయిన రాణా, రమేశ్, కొక్కెర రమేశ్, సిద్ధబోయిన సురేందర్లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్షురాలు సులోచన మాట్లాడుతూ అమ్మవార్ల గద్దెల పరిసరాల ప్రాంతాలు, రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో ఆదివాసీలు మాత్రమే వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని కమిటీలో తీర్మాణించినట్లు వెల్లడించారు. మేడారంలో ఆదివాసీల వ్యాపారాల అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సర్పంచ్లు ములుగు: ఢిల్లీలో ఈ నెల 13న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట సర్పంచ్ బొమ్మకంటి వంశావతి, ములుగు మండలం రాయినిగూడెంకు చెందిన ఈసం సునీత ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళా సాధికారత సమాన హక్కులపై ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమానికి జిల్లా నుంచి ఇద్దరు సర్పంచ్లు ఎంపికై ఢిల్లీకి తరలివెళ్లారు. అంగన్వాడీకేంద్రం సందర్శన ములుగు: ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మంగళవారం జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీడీపీఓ శిరీష వైద్య కళాశాల విద్యార్థులకు అంగన్వాడీ తరఫున పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందించే ఐదు రకాల సేవల గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి కిశోర బాలికల పిల్లలతో విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ములుగు వైద్య కళాశాల నుంచి డాక్టర్ స్వామి, డాక్టర్ వాణి, ఆరోగ్య విద్యా బోధకులు చిదురాల భాస్కర్, అంగన్వాడీ సూపర్వైజర్లు సరస్వతి, రమాదేవి, కళావతి, ఆనంతలక్ష్మి పాల్గొన్నారు.ములుగు: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నెల 14 నుంచి ఏఫ్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సారి సెంట్రల్ సిలబస్ తరహాలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ పరీక్షకు మధ్య(సబ్జెక్టువారీగా) మూడు నుంచి నాలుగు రోజుల పాటు వెసలుబాటు కల్పించారు. ఈ క్రమంలో పరీక్షల మధ్య ఉన్న వ్యవధిని వినియోగించుకునేలా సబ్జెక్టు టీచర్లు తగిన మెలకువలు నేర్పించి సన్నద్ధం చేయాలని విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసింది. క్లాక్ రూంల ఏర్పాటు జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద క్లాక్ రూం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల మెటీరీయల్ తప్పా ఇతర ఎలాంటి వస్తువులు తీసుకొచ్చినా క్లాక్ రూం వద్ద డిపాజిట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లు, డీఓ, సీఎస్లు సైతం తమ సెల్ఫోన్లను క్లాక్ రూం వద్దనే డిపాజిట్ చేసి విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభ సమయం నుంచి ముగిసేవరకు జిరాక్స్ సెంటర్లను మూసివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు సంబంధిత వెబ్సైట్ నుంచి తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. హాల్టికెట్లు పాఠశాలకు వచ్చినప్పటికీ విద్యార్థులకు పంపిణీ చేయకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇప్పటికే తమ హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు ఫీజుల కోసం హాల్టికెట్లు విద్యార్థులకు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్విజిలేటర్ల కేటాయింపులో పైరవీలు పరీక్షాకేంద్రాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్ల నియామకానికి సంబంధించి ఆయా మండలాల ఎంఈఓల నుంచి అనుమతి తీసుకొని జిల్లా విద్యాశాఖాధికారులు ఇన్విజిలేటర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాని నిబంధనలకు విరుద్ధంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే ఒకరిద్దరూ ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో పాటు తమ పలుకుబడిని ఉపయోగించి ఇన్విజిలేటర్ల నియామకంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఎస్జీటీలను కాకుండా కొంతమంది స్కూల్ ఆసిస్టెంట్లను ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు రంగం సిద్ధం చేసినప్పటికీ ఇన్విజిలేటర్ల జాబితాను అధికారికంగా ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇన్విజిలేటర్ల నియామకాల్లో అక్రమాలు జరగకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్ల జాబితాను నేడు(బుధవారం) వెల్లడిస్తాం. ఇన్విజిలేటర్ల జాబితా సర్ప్రైజ్గా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా పనిచేసే చోట వారి పాఠశాలకు చెందిన పిల్లలు లేకపోతేనే విధులు కేటాయిస్తాం. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – సిద్ధార్థరెడ్డి, డీఈఓ ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా గంట ప్రతాప్ను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఆరేళ్లుగా ఖాళీగా ఉంటుంది. ఎట్టకేలకు ఎస్డీసీ పోస్టును భర్తీ చేయడంతో ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్న ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా పరిధిలోని 10 మండలాల్లో గల 117 పాఠశాలల్లో 3,291 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 14 నుంచి జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 1,697 మంది బాలురు, 1,594 మంది బాలికలు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వారీగా సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల జాబితాను అధికారులు తయారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. మంగపేట మండలంలోని రాజుపేట, మల్లంపల్లి మండలాల్లో పోలీస్ స్టేషన్లు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో సీ సెంటర్లుగా వాటిని గుర్తించి ఆయా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక కస్టోడియమ్లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష సమయానికి కంటే అరగంట ముందు ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి పోలీసుల బందోబస్తు మధ్య సీఎస్, డీఓలు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను పోస్టాఫీస్లో డిపాజిట్ చేయనున్నారు. పీఎం సూర్యఘర్తో ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు వినియోగం ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్కు 9,058 దరఖాస్తులు ఇప్పటి వరకు 2,939 రూఫ్టాప్ ఇన్స్టలేషన్ ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద క్లాక్ రూమ్ ఏర్పాటు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు.. 3,291 మంది విద్యార్థులు -
ఏప్రిల్లో యూజీడీ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి.. సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నాన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు. యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి.. వరంగల్లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లువరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. ఈఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్రోడ్డు, ఔటర్ రింగ్రోడ్డు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చే యాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లపై సౌర వెలుగులు
హన్మకొండ: సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఉచిత విద్యుత్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. దేశంలో ఒక కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.75,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులో సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. సౌర శక్తిని వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడం దీని ఉద్దేశం. ఈపథకం ద్వారా వినియోగదారుడు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడంతోపాటు అదనపు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకునే అవకాశముంది. ఇంటి పైకప్పు సోలార్ ఫలకల ఇన్స్టలేషన్కు అనువుగా ఉండాలి. 20.16 కోట్ల రాయితీని విడుదల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గృహ విద్యుత్ సర్వీస్లు 12,73,350 ఉన్నాయి. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం, సోలార్ ఫలకల బిగింపు కోసం 27.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా 9,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.95 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,939 రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేశారు. ఇందులో 9.42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,595 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్కుగాను రూ.20.16 కోట్ల రాయితీని విడుదల చేశారు. విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు.. సౌరశక్తి ఉత్పత్తి ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంది. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా నెలకు రూ.612 చొప్పున ఏడాదికి రూ.7,344 ఆదా చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ప్లాంట్ ద్వారా నెలకు రూ.1,328 చొప్పున ఏడాదికి రూ.15,938, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా నెలకు రూ.2,252 చొప్పున ఏడాదికి రూ.27,024 ఆదా చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కార్బన్ డయాకై ్సడ్ సమానమైన ఉద్గారాలు తగ్గుతాయి. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.30,000 రాయితీ అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. సోలార్ ప్యానళ్లు 25 ఏళ్ల పాటు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 4 నుంచి 5 సంవత్సరాల్లో పెట్టుబడి పొందవచ్చు. మిగతా 20 ఏళ్లు పూర్తి లాభదాయకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాయితీ వినియోగించుకోవాలి..ప్రభుత్వం రూఫ్టాప్ సోలార్ప్లాంట్ (ఫలకల) ఏర్పాటుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. విద్యుత్ను ఉచితంగా వాడుకోవడమే కాకుండా విక్రయించి సైతం ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. – మహేందర్రెడ్డి, రెడ్కో హనుమకొండ,జనగామ, భూపాలపల్లి జిల్లాల మేనేజర్ఉమ్మడి జిల్లాలో సోలార్ ఫలకల ఏర్పాటు ఇలా.. (కెపాసిటీ మెగావాట్లలో)... దరఖాస్తు ఇలా.. ఆసక్తి కలిగిన వినియోగదారులు పీఎం సూర్యఘర్ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో వెండర్ను ఎంచుకోవాలి. ఎంచుకున్న వెండర్ సంబంధిత వినియోగదారుడిని సంప్రదించి, ఒప్పందం చేసుకుంటాడు. ఆ వెంటనే సోలార్ ఫలకలు బిగిస్తారు. సంబంధిత డిస్కం నెట్మీటరు బిగించి అనుసంధానం చేస్తుంది. తర్వాత సంబందిత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం జమవుతుంది.జిల్లా గృహ విద్యుత్ వచ్చిన కెపాసిటీ ఇన్స్టలేషన్ కెపాసిటీ సర్వీస్లు దరఖాస్తులుభూపాలపల్లి 2,04,722 1,485 4.63 195 0.63 హనుమకొండ 3,67,999 4,762 13.40 1633 5.53 వరంగల్ 3,04,030 1,587 5.12 668 2.33 జనగామ 1,76,061 491 1.50 211 0.67 మహబూబాబాద్ 2,20,538 733 2.42 232 0.79 -
‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ను అమలుచేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ● ఉదయాన్నే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనములుగు/వెంకటాపురం(ఎం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఉదయాన్నే మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేయాలనే ధృడ సంకల్పంతోనే కలెక్టర్ ప్రగతిబాట పట్టి గ్రామాలను సందర్శించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మండల కేంద్రంతో పాటు నల్లగుంట, ఎల్లారెడ్డి పల్లె గ్రామాల్లో పర్యటించారు. పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిదులకు సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టని ఇళ్లను రద్దుచేసే అవకాశం ఉందన్నారు. అనంతరం బీసీ కాలనీ వద్ద నర్సరీని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, వెంకటాపురం(ఎం) గ్రామ సర్పంచ్ మామిడి శెట్టి సుగుణస్వామి, ఎల్లారెడ్డిపల్లె సర్పంచ్ భాషబోయిన పోశాలు, రామప్ప ఆలయ చైర్మన్ మిల్కూరి అయిలయ్య, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 2కే రన్ ప్రారంభం జిల్లా కేంద్రంలో ములుగు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ను కలెక్టర్ దివాకర ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి జంక్షన్ నుంచి చేపట్టిన 2కె రన్ బండారుపల్లి రోడ్డు మీదుగా జీవంతరావుపల్లి క్రాస్ నుంచి తిరిగి అక్కడి వరకే కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి 2కే రన్ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం వెంకటాపురం(ఎం)మండల కేంద్రంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రామప్పలో సింగరేణి బృందం
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి బృందం సందర్శించింది. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో జరుగుతున్న పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ సాయి నిరంజన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాల నుంచి కలిసివచ్చిన పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ సందర్శించారు. అనంతరం వారు రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా టూరిజం గైడ్ విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో స్కౌట్స్ లీడర్స్ శ్రీనివాసరావు, స్వామి, మాస్టర్స్ రమేశ్, కుమార్, భాస్కర్, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా హక్కుల కోసం పోరాడాలి
ఏటూరునాగారం: మహిళా హక్కుల కోసం ప్రతీఒక్కరు పోరాడాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కల్యాణి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యదర్శి చిలుక రాజు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్యామ్సుందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర గొప్పదన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. జీసీడీఓ రజిత, ఎంఈఓ వాసం సాంబశివరావు, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు దిలీప్, జిల్లా అధ్యక్షుడు పాల ఉప్పస్వామి, ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కల్యాణి -
కొండచిలువ కలకలం
గోవిందరావుపేట: మండలంలోని దుంపెల్లిగూడెం గ్రామ సమీపంలో శ్మశానవాటిక పక్కన ఉన్న పొలంలో కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఎర్రబోయిన కుమార్ తన పొలంలో పాము కనిపంచడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అడవి జంతువులు గ్రామాల్లో కనిపించినప్పుడు ప్రజలు భయపడకుండా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
గిరిజన దర్బార్లో వినతుల వెల్లువ
ఏటూరునాగారం: మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఏటీడీఏ ఏపీఓ వసంతరావు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు సెక్టార్ అధికారుల ద్వారా గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మొత్తం 12 వినతులు వచ్చాయి. వెంకటాపురం (ఎం), తాడ్వాయి, వాజేడు, మంగపేట, బయ్యారం, తదితర మండలాలకు చెందిన గిరిజనులు వినతులు అందించారు. ● మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ముందు ఉన్న ఖాళీ స్థలంలో అర్హులైన నాయకపోడు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కాపుల సమ్మయ్య, రాజు, సారయ్య విన్నవించారు. ● వాజేడు మండలం నాగారం గ్రామానికి చెందిన 19 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు గిరి సౌరవికాసం కింద బోర్లు, మోటార్లు ఇవ్వాలని స్థానిక సర్పంచ్ బోదెబోయిన స్వరూప విన్నవించారు. ● ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామంలో 1వ వార్డులో మట్టిరోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, మంగపేట మండలం కమలాపురంలో బోరు నిర్మించుకోవడానికి అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించాలని స్థానికుడు దామోదర్ కోరారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాను ఆన్లైన్లో నమోదు చేయాలి. రైతు భరోసా వస్తుంది. పీఎం కిసాన్ రావడం లేదు. అగ్రికల్చర్, ఐటీడీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. సమస్యను పరిష్కరించి ఆదుకోవాలి. – దబ్బట్ల సుదర్శన్, రైతు, ఏటూరునాగారం -
ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలి
ఏటూరునాగారం: కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొడెం సమ్మయ్య అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కస్తూర్భాగాందీ విద్యాలయం, మండల విద్యావనరుల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ 29 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కేజీబీవీ పాఠశాలలో కేర్ టేకర్స్ను నియమించాలని డిమాండ్ చేశారు. మార్చి 16 తేదీన ములుగు జిల్లా కేంద్రంలో జరిగే ధర్నా, 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పత్రి కిరణ్, కోశాధికారి మండపు సంతోష్, కేజీబీవీ ఉపాధ్యాయులు అరుణ, స్వరూప, హరిత, రమాదేవి, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య -
సమస్యలు తక్షణమే
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026ములుగు రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ దివాకర మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలించి సాధ్యాసాధ్యాలను అర్జిదారులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రీవెన్స్లో స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. మొత్తం 49 దరఖాస్తులు ప్రజావాణిలో మొత్తం 49 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 17, పింఛన్లు 15, ఇందిరమ్మ ఇల్లు 3, ఉద్యోగ కల్పన 2, ఇతర దరఖాస్తులు 12 వచ్చాయి. ప్రజావాణిలో దరఖాస్తును పరిశీలిస్తున్న కలెక్టర్ టీఎస్ దివాకర, పక్కన జిల్లా అధికారులు కలెక్టర్ టీఎస్ దివాకర ప్రజావాణిలో 49 అర్జీలు -
ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇచ్చాం
ఏటూరునాగారం: హనుమకొండలోని పీఈటీసీ సెంటర్లలో 2025 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 141 మంది నిరుద్యోగులకు ఫౌండేషన్ కోర్సులు ఇచ్చామని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘ట్రైనింగ్ నిల్’ అనే కథనానికి ఏపీఓ స్పందించి వివరణతో కూడిన లేఖను అందించారు. ఫౌండేషన్ కోర్సుల కోసం ఏజెన్సీలకు ఇంటర్వ్యూలను నిర్వహించిన తర్వాతనే ‘శ్రీధర్ సీసీఈ’ అనే అకాడమీకి అప్పగించామన్నారు. వైటీసీ కేంద్రాల్లో డీఆర్డీఓ, సెర్ప్, ద్వారా శిక్షణను చేపడుతామన్నారు. ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్, ఫ్యాకల్టీ రెమ్యునరేషన్ ఇతర సౌకర్యాలన్నీ కమిషనర్ హైదరాబాద్చే అప్రూవల్ అయిన తర్వాతనే ఇవ్వడం జరిగిందన్నారు. పీఈటీసీలో మరో బ్యాచ్కు కూడా శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఏపీఓ తెలిపారు. ఈ శిక్షణ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సీ, ఇన్సూరెన్స్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసు కానిస్టేబుల్స్, ఎస్సై, జీపీఓ, గ్రూప్స్ నియామకాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇంటెలిజెన్స్ ఆరా వైటీసీలో ట్రైనింగ్ నిల్, పీఈటీసీలో జరుగుతున్న అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పీఈటీసీలో ఎలాంటి ట్రైనింగ్ జరిగాయి. ఎంత ఖర్చు చేశారని కూపి లాగుతున్నారు. వైటీసీలకు చెందిన నిధుల మళ్లింపు ఎలా జరిగిందని ఐటీడీఏ అధికారుల నుంచి వివరాలను ఇంటెలిజెన్స్ బృందం సేకరిస్తోంది. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. పీఈటీసీతో 141 మందికి లబ్ధి ఐటీడీఏ ఏపీఓ వసంతరావు -
మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు
ములుగు: విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు కావొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీబాలికల ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమంపై ఒకరోజు జిల్లాస్థాయి వర్క్ షాప్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా డీఈఓ సిద్ధార్థ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతీ పాఠశాలలో ప్రహరీ క్లబ్బులు నిర్వహించాలన్నారు. ప్రహారీ క్లబ్ అధ్యక్షుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సభ్యులుగా ఒక సీనియర్ టీచర్, 6 నుంచి 9 తరగతి వరకు ప్రతి తరగతి నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు ఉండి ప్రహరీ క్లబ్బులను పటిష్టంగా నిర్వహించాలన్నారు. అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్స్పెక్టర్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను తెలుసుకొని, ఎవరైనా మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నట్లు గమనిస్తే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యాంసుందర్ రెడ్డి, ఎస్సైలు ఉపేందర్, శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పరీక్షలకు సిద్ధం కండి.. వాజేడు: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితారాణా అన్నారు. సోమవారం డిజిటల్ ప్యానెల్ స్క్రీన్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖాధికారులు అవగాహన కల్పించారు. వాజేడు ఉన్నత పాఠశాలలో విద్యార్ధులతో కలిసి ఎంఈఓ తేజావత్ వెంకటేశ్వరరావు వీక్షించారు. పరీక్షలను ప్రశాంతంగా రాసి ఎక్కువ మార్కులు వచ్చేలా చూసుకోవాలని అవగాహన కల్పించారు. -
రామప్ప ఆలయ ఈఓగా బాధ్యతల స్వీకరణ
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప దేవాలయానికి నూతన ఈఓగా (ఆలయ కార్యనిర్వహణాధికారి) ఇమ్మడి భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ మండలం వేలేరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న భాస్కర్కు రామప్ప ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు కల్పిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న బిల్ల శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మండలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి అదనపు బాధ్యతలు కేటాయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఓ భాస్కర్ రామప్ప రామలింగేశ్వరస్వామికి కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి హరీష్శర్మ ఈఓ దంపతులను శాలువాతో సత్కరించారు. -
వరే.. సరి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగువైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈ సీజన్లో వరిసాగు గతంతో పోలిస్తే కొంత మేర పెరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. సాగునీటి లభ్యత, మార్కెట్ డిమాండ్ కారణంగా రైతులు మళ్లీ వరి వైపు మొగ్గు చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం సుమారు 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు ప్రాథమిక అంచనా. గత యాసంగిలో ఇది 5.98 లక్షల ఎకరాల వరకు మాత్రమే నమోదైంది. దీంతో ఈసారి దాదాపు 37 వేల ఎకరాలకు పైగా పెరుగుదల కనిపించింది. యాసంగి సాగు ఇలా... గతంతో పోలిస్తే ఈ యాసంగిలో వరిసాగు పదిశాతం మేర తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు మొదట అంచనా వేశారు. ఈ మేరకు ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 9,12,880 ఎకరాలని అంచనా వేసిన అధికారులు 5.75 లక్షల ఎకరాల్లో వరి పంటలకు అవకాశం ఉందన్నారు. అందుకు భిన్నంగా మొత్తం పంటలు 9,82,880 ఎకరాల్లో వేయగా, 6,34,579 (64.56 శాతం) ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొక్కజొన్న, ఇతర పంటలన్నీ కలిపితే 35.44 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే 37 వేల పైచిలుకు ఎకరాల్లో ఈసారి వరి సాగుకాగా, ఈసారి కూడా వరిసాగులో ఉమ్మడి వరంగల్ది రికార్డేనని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు. వరి సాగు పెరగడానికి కారణాలు... జిల్లాల వారీగా చూస్తే హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కొంత మేర విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాగునీటి లభ్యత, సాగు సౌకర్యాలు మెరుగుపడటం, ప్రభుత్వం వరి కొనుగోలుపై హామీ ఇవ్వడం, సన్నరకం మీద బోనస్ ఇవ్వడం వంటి కారణాలతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును ఎక్కువగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో నీటి కొరత, వాతావరణ మార్పులు వంటి కారణాలతో వరి సాగు విస్తీర్ణం కొంత తగ్గిన ప్రాంతాలు కూడా ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లా మొత్తం పంటలు వరి వరంగల్ 1,96,722 95,152 హనుమకొండ 1,77,735 1,11,380 జనగామ 2,07,353 1,79,010 మహబూబాబాద్ 2,13,665 1,07,617 జేఎస్ భూపాలపల్లి 1,17,085 89,000 ములుగు 70,320 52,420 మొత్తం 9,82,880 6,34,579 మొత్తం విస్తీర్ణంలో 64.56 శాతం వరి నమోదు గతంతో పోలిస్తే పెరిగిన వైనం.. మిగతా పంటలతో పోలిస్తే మేలంటున్న రైతులు -
మెరుగైన వసతులు కల్పించాలి
ములుగు రూరల్: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ దివాకర అన్నారు. సోమవారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల పరిధిలోని ఇంచర్లలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని గదులు, స్టోర్ రూమ్, కిచెన్ షెడ్, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించా లని అధికారులను ఆదేశించారు. అనంతరం మో డల్ బస్టాండ్ పనులను పరిశీలించారు.కలెక్టర్ దివాకర -
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి
ఏటూరునాగారం: పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏటూరునాగారంలో ర్యాలీ నిర్వహించి వై జంక్షన్లో రాస్తారోకో చేశారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న యుద్ధంతో చమురు నిల్వల కొరత ఉంటుందనే సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వగురువు అని చెప్పుకునే నరేంద్ర మోదీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. అమెరికా చెప్పుచేతల్లో మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్కు పెంచిన రూ.60లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.దావూద్, తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, వాసు, చిట్టిబాబు, రఘుపతి, జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, ప్రవీణ్, తోకల రవి, రమేష్, దేవయ్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవికుమార్ ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన ర్యాలీ -
హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలి
ములుగు: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ను కిశోరబాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 నుంచి 15 ఏళ్ల బాలికలు తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకున్న అనంతరం వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల అనుమతి మేరకే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం లాగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం మండల కేంద్రాలలోని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేస్తారని వివరించారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు కిశోరబాలికల పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ట్రైనింగ్ నిల్
ములుగుసోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026నామమాత్రంగా గిరిజన దర్బార్7ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 5వ వార్డు సభ్యుడు కొండాయి చిన్ని ఆధ్వర్యంలో టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భారత్ విజయం సాధించడంతో యువకులు ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. భారత్ జట్టు 20 ఓవర్లకు 255 పరుగులు చేయగా న్యూజిల్యాండ్ జట్టు 19 ఓవర్లకు 159 పరుగులు చేసి ఓడిపోయింది. భారత్ జట్టు గెలవడంతో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జై భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని ఐదు యూత్ ట్రైనింగ్ సెంటర్ల(వైటీసీ)లో యువతకు గతంలో శిక్షణ ఇచ్చేవారు. అయితే ములుగులో ఉన్న వైటీసీని సెంట్రల్ యూనివర్సిటీకి, మహబూబాబాద్లో ఉన్న వైటీసీ జేఎన్టీయూ యూనివర్సిటీకి కేటాయించారు. ఏటూరునాగారం, కాటారం, హనుమకొండ వైటీసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ వీటిల్లో ప్రస్తుతం ఎలాంటి శిక్షణలు చేపట్టడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్జెక్టు రీయింబర్స్మెంట్ పేరుతో 2022–23లో కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో గిరిజన యువతీయువకులకు హోటల్ మేనేజ్మెంట్, సోలార్, కంప్యూటర్ కోర్సులో మూడు నెలల శిక్షణతో పాటు భోజన వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఆ నిధులను ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్(పీఈటీసీ)కి మళ్లించారు. దీంతో వైటీసీ ట్రైనింగ్ సెంటర్లలో యువతకు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సెంటర్లను సైతం అధికారులు మూసివేశారు. నామమాత్రంగా ఫౌండేషన్ కోర్సు పీఈటీసీలో కొత్తగా ఫౌండేషన్ కోర్సును తెరమీదకు తీసుకొచ్చారు. సివిల్స్, నీట్ వరకు శిక్షణ ఇచ్చేందుకు ఎలాంటి అర్హత లేని అమీర్పేటకు చెందిన ఓ ఏజెన్సీని ఫౌండేషన్ కోర్సుకు ట్రైనర్స్గా కేటాయించారు. గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్కు ఏజెన్సీ ప్రతినిధికి స్నేహం ఉండడంతో ఆ ఏజెన్సీ శిక్షణ బాధ్యతను అప్పగించడంతో పాటు ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ను కూడా తయారు చేయించే అగ్రిమెంట్ కూడా ఇచ్చారు. ఒక్కో బుక్కుకు రూ. 800 చెల్లించి పీఈటీసీ సెంటర్ ప్రిన్సిపాల్ కొనుగోలు చేశారు. అదే మార్కెట్లో రూ. 400 చెల్లిస్తే అన్ని రకాలుగా ఉన్న మెటీరియల్ లభించేది. కానీ ఏజెన్సీ వారు ఇచ్చే కమిషన్లకు ఆశపడి నిర్వహకులు అర్హత లేనివారితో స్టడీ మెటీరియల్, ట్రైనింగ్ ఇప్పించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఫలితాల్లో వెనుకంజ హనుమకొండలోని పీఈటీసీలో ఫలితాలు చూస్తే కేవలం రెండేళ్లలో 30 మందికి కూడా ఉద్యోగాలు వచ్చినట్లు రికార్డులు లేవు. అంతేకాకుండా ఈ పీఈటీసీలో ఏజెన్సీ గిరిజనులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం మైదాన ప్రాంతాల గిరిజనులకే కల్పించి వారికి నచ్చినట్లు రికార్డులు రాసుకొని బిల్లులను డ్రా చేసుకున్నట్లు గిరిజన సంఘాల నాయకుల ఆరోపిస్తున్నారు. అసలు పీఈటీసీకి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఖర్చు చేశారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనే వివరాలను పీఈటీసీ ప్రిన్సిపాల్ విడుదల చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. ఐటీడీఏలోని అకౌంట్స్ అధికారులు సైతం పీఈటీసీకి నిధుల మళ్లింపులో సహకరించి కమీషన్లు తిన్నట్లు సమాచారం ఉందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సమగ్రంగా ఆడిట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని పలు సంఘాల నాయకులు వాపోతున్నారు. మూతపడిన వైటీసీ కేంద్రాలను తెరిపించి నిరుద్యోగ గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి. మూడేళ్ల నుంచి ఎలాంటి శిక్షణ, ఉపాధి లేక గిరిజన యువకులు రోడ్లపై తిరుగుతున్నారు. వారి ప్రవర్తన, అలవాట్లు చెడు మార్గాలకు వైపునకు వెళ్తున్నాయి. ఐటీడీఏకు కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా పక్కదారి పట్టించి అధికారులు వారి స్వార్ధాల కోసం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. నిరుద్యోగులకు వెంటనే ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాలి. పీఈటీసీకి వచ్చిన నిధులు, ఖర్చులపై బహిరంగంగా వివరణ ఇవ్వాలి. – నీలాద్రి, శంకరాజుపల్లి, తుడుందెబ్బ నాయకుడు నిరుద్యోగులకు అందని ఉపాధి రెండు వైటీసీలు యూనివర్సిటీలకు కేటాయింపు నిధుల దారి మళ్లింపు.. పట్టించుకోని అధికారులువైటీసీల్లో యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు 2022–23లో మంజూరైన కోటి రూపాయల నిధులను హనుమకొండలోని ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్(పీఈటీసీ)కి నిధులను బదలాయించారు. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ పీఈటీసీ ప్రిన్సిపాల్ పలుకుబడితో లోపాయికారంగా ఈ నిధులను మళ్లించుకున్నాడు. అదే విధంగా ఎగ్జామ్కు ప్రిపరేషన్ అయిన విద్యార్థులనే తీసుకొచ్చి నామమాత్రంగా శిక్షణ ఇచ్చి నట్లు రికార్డులు సృష్టించారు. ఇష్టానుసారంగా విద్యార్థుల పేర్లను నమోదు చేసుకొని వారికి ఉద్యోగాలు వచ్చినట్లు రికార్డులు నమోదు చేసి ఆ నిధులను నీళ్లలాగ ఖర్చు చేశారు. సమస్యల పరిష్కారం గాలికే... గైర్హాజరవుతున్న అధికారులు -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. అలాగే సినీనటుడు బాబు మోహన్ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయంగా బాబుమోహన్కు పూజారులు అమ్మవార్ల కండువా కప్పి ప్రసాదం అందజేశారు. జంపన్నవాగులో నీరు లేకపోవడంతో పాటు స్నానఘట్టాల వద్ద ఒక షెవర్ కూడా లేకపోవడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు ఆరగించారు.వనదేవతలకు మొక్కులు -
తగ్గనున్న దూరభారం
మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన కిషన్రావుపల్లి రహదారి నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి గతంలో టెండర్ ప్రక్రియ కావడంతో రోడ్డు పనులు నడుస్తుండడంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్ల మండల కేంద్రం నుంచి భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 2017 సంవత్సరంలో అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ భూపాలపల్లి వన్ఇంకై ్లన్ మైన్ ఫారెస్ట్ రోడ్డులో ఫారెస్ట్ అధికారులు నిర్ధారించిన రోడ్డు ప్రదేశంలో మట్టి పనులు చేపడుతున్నారు. మట్టి పనులు పూర్తికాగానే లెవలింగ్ పనులు చేపట్టి అవసరమైన చోట కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. తగ్గనున్న దూరభారం.. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి–తాడిచర్ల మీదుగా కేవలం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూరభారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరింత మెరుగుపడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో తాడిచర్లతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాలు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతాయి. రూ.4.67 కోట్ల చెల్లింపు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డిన అటవీశాఖ ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్ ఇంకై ్లన్ మైన్ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవచ్చని.. కాగా ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సదరు నిధులు చెల్లించింది. కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్ ఇంక్లైన్ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో టెండర్ ప్రకియ పూర్తయింది. కిషన్రావుపల్లి ఫారెస్ట్లో రానున్న ఆరు నెలల కాలంలో రోడ్డు అందుబాటులోకి వస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, మెరుగైన వైద్యానికి అనువుగా ఉంటుంది. ప్రయాణభారం తగ్గుతుంది. జిల్లా కార్యాలయాలకు, ఇతర అవసరాలకు భూపాలపల్లికి వెళ్లడానికి కొయ్యూరు నాగులమ్మ మీదుగా భూపాలపల్లికి పోతున్నాం. ఈ రోడ్డు పూర్తయితే ఉపయోగకరంగా ఉంటుంది. – చింతలపల్లి మల్హల్రావు,మాజీ ఎంపీపీ, మల్హర్ పెరగనున్న రవాణా సౌకర్యం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమత వెంకటాపురం(కె): మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలను నిర్మూలిస్తే మహిళల హక్కులను కాపడినట్లేనని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధిలో కీలక పాత్రపోషించాలని సూచించారు. మహిళల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. అనంతరం వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన మహిళా సర్పంచ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి, కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లూర్ధు రాజు, సీడీపీవో ముత్తమ్మ, సూపర్వైజర్ పుష్పలత, శ్యామల, సుధాకర్. లారెన్స్, గొంది హనుమంతు పాల్గొన్నారు. -
అన్నిరంగాల్లో మహిళల ప్రతిభ
● జడ్జి ఎస్వీపీ.సూర్య చంద్రకళములుగు: అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చూపుతున్నారని, ఎక్కడైతే సీ్త్రలు గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజలందుకుంటారని జిల్లా జడ్జి ఎస్వీపీ సూర్య చంద్రకళ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మహిళ కోర్టు సిబ్బందికి ఆటలు, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి టి.కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.మధులిక, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పెరిగిన ఈవ్టీజింగ్ కేసులు.. ఏటా 3.6 శాతం కేసులు పెరుగుదల రెండు నెలలు..80 వేధింపుల కేసులు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత -
ముగిసిన నాగులమ్మ జాతర
మంగపేట: మండలంలోని లక్ష్మీనర్సాపురం నాగులమ్మ ఆలయంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన నాగులమ్మ ఆదివాసీ గిరిజన జాతర శనివారంతో ముగిసింది. విశేష పూజలు అందుకున్న నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తమైంది. చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని ఆలయ ట్రస్టి, ప్రధాన పూజారి(నాగులమ్మ ఉపాసకుడు) బాడిష రామకృష్ణ స్వామి ఆధ్వర్యంలో పూజారులు, వడ్డెలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు బాగుండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ పూజారులు, వడ్డెలు తల్లులకు పూజలు నిర్వహించి వేడుకున్నారు. అనంతరం పూజారులు ఝెర్రట్టలగుట్టకు సడాలమ్మను, నాగులమ్మను గండొర్రెగుట్టకు డోలు వాయిద్యాల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో వన ప్రవేశానికి సాగనంపారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టి బాడిష రామకృష్ణస్వామి మాట్లాడుతూ నాగులమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని తెలిపారు. మహాజాతర విజయవంతానికి కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాని, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, ముయబోయిన శివ, కుల పెద్ధలు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు రూ.36 వేల కోట్ల రుణాలు
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కములుగు: గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.36వేల కోట్ల రుణాలను అందించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో శనివారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. జిల్లాలోని 585 మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.52.50 కోట్ల రుణాల చెక్కులను అందజేశామని తెలిపారు. రూ.36 వేల కోట్ల రుణాలకు రూ.1,121 కోట్ల వడ్డీని మాఫీ చేసినట్లు వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల వ్యాపారాలను చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. ఒక్కో భవనానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షల నిధులతో నిర్మాణ పనులు మొదలు పెడుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. అనంతరం ములుగు ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్మేళాలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టరేట్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై, గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అలాగే మున్సిపాలిటీలోని 5వ వార్డులో చేపట్టగా మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ములుగు పట్టణాభివృద్ధికి రూ.15 కోట్లతో ఇప్పటికే టెండర్లు జరిగాయని వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం ఇంచర్ల, దేవగిరిపట్నం, కన్నాయిగూడెం గ్రామాల్లో రూ.10 లక్షలతో నిర్మించనున్న ఒక్కొక్క మహిళా సమాఖ్య భవనానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. దేవగిరిపట్నంలో ఇందిరమ్మ పథకం కింద చింతలపూడి వినోద ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా మంత్రి ప్రారంభించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. లక్ష్మీదేవిపేటలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులకు, ఎల్లారెడ్డిపల్లెలో రూ.17.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, జీపీ భవనం పనులను సీతక్క ప్రారంభించారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ములుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనిలెక్టర్ దివాకర అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ 18వ వార్డులో విద్యుత్ లైన్లు, ములుగులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని, మిషన్ భగీరథ, ఇరిగేషన్ కార్యాలయాలను, లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాలను శనివారం పరిశీలించి మాట్లాడారు. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తోపుకుంట వరకు ఉన్న విద్యుత్ లైన్ షిఫ్టింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని పరిశీలించి తాగునీటి శుద్ధి కేంద్రం, వంటగది, స్టోర్ రూమ్, కూరగాయలను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్, మిషన్ భగీరథ కార్యాలయాలను సందర్శించి పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు.● కలెక్టర్ టీఎస్.దివాకర -
పట్టణాభివృద్ధే లక్ష్యం
నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ● కౌన్సిలర్ల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి ● వీఐపీ రిపోర్టర్, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళములుగు: ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్నారు.. తెల్లవారుజాము నుంచి పొద్దుగూకే వరకు పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వీధులు, డ్రెయినేజీలను మున్సిపల్ కార్మికులు శుభ్రపరుస్తున్నారు.. చెత్తాచెదారాన్ని తొలగిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అరకొర వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సరైన రక్షణ పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగు మున్సిపల్ తొలి చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన చింతనిప్పుల చంద్రకళ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చూపేందుకు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్గా మారారు. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 4వ వార్డులో పర్యటించి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చంద్రకళ: ఎలా ఉన్నారు.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? స్వరూప: ప్రభుత్వం అందించే రూ.9,500 వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచి ఆదుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాం. సెలవురోజుల్లో కూడా పనులు చేస్తూ వీధులు శుభ్రపరుస్తున్నాం. చంద్రకళ: సొంత ఇళ్లు అందరికీ ఉన్నాయా? పూలమ్మ: ఇరవై ఏళ్లకు పైగా కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. కిరాయికి ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. కార్మికులందరికీ ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించి ఇస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. చంద్రకళ: ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? విజయ: డ్రెయినేజీలు శుభ్రం చేయడం, చెత్తను తరలించే క్రమంలో దుర్వాసన వస్తుంది. బ్యాక్టీరియా వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కార్మికులకు గ్లౌస్, మాస్క్లు, బూట్లు, భద్రత పరికరాలు పంపిణీ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమాతో పాటు శాశ్వత ఉద్యోగ కల్పనతో పాటు వేతనాలు పెంచాలి. చంద్రకళ: తాగునీటి సరఫరా ఎలా ఉంది? రాజక్క: కాలనీలో చేతిపంపులు పనిచేయడం లేదు. తాగునీటి సమస్య ఉంది. ఎండాకాలం ప్రారంభమైనందున తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. చంద్రకళ:అందరికీ పింఛన్లు వస్తున్నాయా? మల్లిక: కాలనీలో చాలామందికి పింఛన్లు రావడం లేదు. పింఛన్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటివరకు రాలేదు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వృద్ధాప్య, వింతంతువు, వికలాంగులకు పింఛన్లు అందించాలి. చంద్రకళ:కాలనీలో ఇంకా ఏమైనా సమస్యలు నెలకొన్నాయా? రమ: కోతుల బెడద తీవ్రంగా ఉంది. కాలనీల్లో విచ్చలవిడిగా తిరుగుతూ గాయపరుస్తున్నాయి. వాటిని పట్టుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
నేరాల నియంత్రణపై దృష్టి
ములుగు: నేరాల నియంత్రణకు ఉమెన్ హెల్ప్ డెస్క్ల ద్వారా.. ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో బాధితులకు తక్షణ సహాయం అందిస్తున్నాం. మహిళలపై గృహహింస, దాడులు వంటి కేసులపై వేగంగా దర్యాప్తు జరిపి న్యాయస్థానంలో బలమైన సాక్ష్యాలు సమర్పించి కన్వెక్షన్ శాతాన్ని పెంచుతున్నాం..జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 185 కేసులు నమోదు కాగా 15కేసుల్లో ట్రయల్ పూర్తై కన్వెక్షన్ వచ్చిందని జిల్లా షీటీమ్ ఎస్సై మౌనిక వెల్లడించారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షితో ఆమె మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. పాఠశాలలు, పర్యాటక ప్రదేశాల్లో నిఘా మహిళలపై దాడులు జరగకుండా మహిళ పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. యువతులు, మహిళలు, విద్యార్థినులకు ఆకతాయిలు వేధించకుండా చర్యలు చేపడుతున్నాం. పాఠశాలలు, ప ర్యాటక ప్రదేశాల్లో షీటీమ్ బృందాల నిఘా ఉంది. బాధితులు ఫిర్యాదు చేయాలి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పీఎస్లో ఉమెన్ హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. డెస్క్లలో మహిళా పోలీస్లే విధులు నిర్వహిస్తున్నారు. బాధితులు భయపడకుండా వచ్చి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో 100కు లేదా మహిళల హెల్ప్లైన్ 181కు, 8712576528 నంబర్కు కాల్ చేయాలి. అవసరం మేరకు సోషల్ మీడియా వాడాలి సోషల్ మీడియాను అవసరం మేరకే వినియోగించుకోవాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని పర్సనల్ ఫొటోలు పంపవద్దు. చట్టాలపై అవగాహన సదస్సులు మహిళలపై నేరాలు జరిగినపుడు ఎవరికి చెప్పుకోవాలో ఆర్థంకాక ఆందోళన చెందుతున్నారు. చట్టాలపై ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలను చైతన్యవంతులను చేస్తున్నాం. పాఠశాలలు, పర్యాటక ప్రదేశాల్లో మహిళల భద్రతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.● ఉమెన్ హెల్ప్డెస్క్లతో బాధితులకు న్యాయం ● సాక్షితో షీటీమ్ ఎస్సై మౌనిక -
సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం
‘మేం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో సగమే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాం.. ఇటు తల్లిదండ్రుల సూచన, సొంత నిర్ణయంతో ఇప్పుడు చదువుతున్న కోర్సులను ఎంచుకున్నాం. మేం తీసుకునే నిర్ణయాల్లో సగమే మద్దతు వస్తోంది. పూర్తి స్థాయిలో రావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మేం ఉండాలి.’ అని అంటున్నారు విద్యార్థినులు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘మీరెంత ఇండిపెండెంట్’.. అన్న అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినులను ‘సాక్షి’ సర్వే చేసింది. పలు అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. – సాక్షి నెట్వర్క్ ఏ) పూర్తిగా బీ) కొద్దిమేర సీ) లేదు 3. మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది? 2. మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును మీరు కావాలనే ఎంచుకున్నారా?ఏ) నా సొంత నిర్ణయం58ఏ) 50 %44ఏ4. ఒక సీ్త్ర ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరం? 18బీ) 100%బీసీ) సమాజం8సీ) 25%ిసీబీ) స్నేహితులు24ఏ) కుటుంబంబీ) మా తల్లిదండ్రుల నిర్ణయం సీ) స్నేహితుల సూచన88డీ) 0%సర్వే శాంపిల్ : ప్రతీ జిల్లా నుంచి 20 మంది, ఆరు జిల్లాల నుంచి 120 మంది●ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం1. మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
మంత్రి సీతక్క సహకారంతో ములుగు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. ప్రతీ కాలనీని నేరుగా సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాను. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఇంటింటికీ నల్లానీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీకాలనీలో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మారుస్తాం. ప్రధానంగా డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిలర్ల సహకారంతో సంబంధిత అధికారులతో చర్చించి ముందుకెళ్తాం. – చింతనిప్పుల చంద్రకళ, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ -
ఎండైనా.. నింపాల్సిందే
వాజేడు: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటను రైతులు అమ్ముకోవాలంటే బస్తాల్లో నింపాల్సిందే. దీని కోసం కొందరు యువకులు ఒక జట్టుగా ఏర్పడి బస్తాల్లో మిర్చిని నింపుతారు. రైతులు ఒక్కొక్కరికి రూ.500 చెల్లించి బస్తాల్లో కాయలను తొక్కిస్తుంటారు. ఒక్క బస్తాలో 30 కేజీల నుంచి 50 కేజీలు ఉండేలా చూసి తొక్కిస్తారు. వాటిని మార్కెట్లో విక్రయించడానికి అనుకూలంగా ఉండటంతో పాటు ఎండిన మిర్చి పాడు కాకుండా ఉంటుంది. ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి వరకు ఈ పనిని చేస్తుంటారు. ఎంత ఎండ ఉన్నా యువకులు మిర్చి బస్తాల్లో నింపుతారు. -
కార్పొరేట్ తరహాలో
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026ఏటూరునాగారం: కార్పొరేట్ తరహాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలివిడతలో జిల్లాకు ఒకటి చొప్పున నిర్మించనుంది. ఒక్కొక్క దానికి రూ.30 లక్షలు వెచ్చించనుంది. ఈ మేరకు ఇప్పటికే శిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే జిల్లాలోని 564 అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.2లక్షలు ఒక్కో సెంటర్కు ఇవ్వనుంది. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆరోగ్యలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ పోషణ పథం పేరిట చిన్నారులు, బాలికలు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనుంది. రక్తహీనత నివారించేందుకు.. కౌమార బాలికల్లో (14–18 ఏళ్లు) పోషకాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ఏడాదిలో వందరోజుల ప్రణాళిక అమలు చేయనుంది. ప్రత్యేక న్యూట్రీషియన్ ప్యాకేజీ కింద మల్టీమిల్లెట్ చిక్కి, ఇన్స్టంట్ మిక్స్ (ఉప్మా, కిచిడి) అందిస్తారు. బాలామృతం, బాలామృతం ప్లస్, ఫార్ములేషన్లో మరిన్ని మైక్రో న్యూట్రియేంట్లు ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రీ ప్రైమరీ టీచర్లకు ఇంటర్తోపాటు రెండేళ్ల డిప్లొమా అర్హత, ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు నూతన విద్యావిధానం కింద సర్టిఫికేషన్ కోర్సు నిర్వాహణ చేపట్టనుంది. ప్రీస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్ట్, బూట్లు, సాక్సులు అందించాలని, ఏడాదికి 300 రోజులు 100 మిల్లీలీటర్ల పాలు, 25 గ్రాముల అల్పాహారం అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంది. అద్దె భవనాల్లోని అంగన్వాడీలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంది. ఏజెన్సీలో తక్కువ బరువు పిల్లలే ఎక్కువ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే నూతన పథకాలను ఏజెన్సీలో అమలు చేయనుంది. తక్కువ, అతి తక్కువ బరువు ఉన్న పిల్లలకు మంచి పౌష్టికాహారం అందజేసి వారి బరువు, ఎత్తు పెరిగేందుకు ఆరోగ్య లక్ష్మీని మరింత పటిష్టంగా అమలు చేయనున్నారు. జిల్లాలో 30 కొత్త అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు అయ్యాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు రూ.2 లక్షలు కేటాయించగా వాటితో పనులు చేపట్టడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగుపర్చుతాం. – ప్రేమలత, డీడబ్ల్యూఓ, ములుగు ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుకు రూ.2లక్షలు కేటాయింపు జిల్లాలో 664 అంగన్వాడీ కేంద్రాలుజిల్లాలో 664 అంగన్వాడీ కేంద్రాలకు గాను 564 కేంద్రాలకు శాశ్వత భవనాలు ఉండగా 100 కేంద్రాలకు పక్కా భవనాలు లేకుండా ఉన్నాయి. వీటిని పూర్తిస్తాయిలో నిర్మించడానికి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయించే దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో శాశ్వత అంగన్వాడీ కేంద్రాలు నెలకొల్పనున్నారు. -
క్రీడలతో శారీరక దారుఢ్యం
భూపాలపల్లి: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో అంబేడ్కర్ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం, ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అనంతరం ఎస్పీ సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ ఆడారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల యువతతో 13 జట్లను తీసుకొని వారికి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐ డి.నరేష్కుమార్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
‘వేప’కు విపత్తు!
ములుగు: వేయి లాభాల చెట్టు వేపకే విపత్తు సంభవిస్తోంది. వేపచెట్టు నుంచి లభించే ఆకు, బెరడు, కాయలు, పిండి, చెక్క, నూనె తదితర ఉత్పత్తులు సర్వరోగ నివారిణిగా పేరున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో కీటకనాశినిగా, వివిధ రకాల ఔషధాలు, చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో వేపకు అత్యంత ప్రాధాన్యం ఉందని చెబుతారు. ఉగాది పండుగ రోజు వేపపూవు తయారు చేసే పచ్చడిని పవిత్రంగా భావిస్తారు. ఇన్ని సుగుణాలు ఉన్న వేపచెట్టును ఐక్య రాజ్యసమితి 21వ శతాబ్ధపు చెట్టుగా గుర్తించి చరిత్రలో స్థానం కల్పించింది. దీన్ని హెర్బల్ ఇండియన్ డాక్టర్గా పిలుస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన వేపచెట్టుకు ఇప్పుడు విపత్తు రావడం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వందలాది వేపచెట్లు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన విషయం తెలిసిందే. ఫంగస్ కారణమే.. ‘ఫోమాప్సిస్ అజాడిరక్టె’ అనే శిలీంద్రం (ఫంగస్) ఆశించడంతోనే వేప చెట్లు ఎండుతున్నట్లు వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనినే కొమ్మ ఎండు తెగులు అని అంటున్నారు. దీంతో చెట్టు కొమ్మలు పూర్తిగా గోధుమరంగులోకి మారి ఎండిపోయి రాలిపోతాయి. శిలీంద్ర సిద్ద బీజాలు గాలి ద్వారా ఒకచెట్టు నుంచి మరో చెట్టుకు వ్యాప్తి చెంది ఫలితంగా గాలివీచే దిశలో ఉన్న చెట్లు అన్ని వ్యాధిసోకి ఎండిపోతాయి. వేప చెట్లపై ‘ఫోమాప్సిస్ అజాడిరక్టె’ అనే వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదు. వ్యాధి సంక్రమించిన కొమ్మలను కత్తిరించాలి. లేదా కార్బండిజమ్, క్లోరోథలోనిల్, మాంకోజెమ్ వంటి శిలీంధ్రనాశకాలను నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. లేదా వేరు దగ్గర పోయాలి. తెగులు తీవ్రమైతే పూర్తిగా ఎండిపోయి, చెట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సహజంగానే వేప చెట్టుకు వ్యాధిని తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. – సుతారి సతీష్, వృక్ష శాస్త్ర వేత్త, వరంగల్ రసం పీల్చుతున్న ‘డైబ్యాక్ వ్యాధి’ జిల్లాలో వందలాది చెట్లపై ప్రభావం -
వైభవంగా నాగులమ్మ పగిడిద్దరాజు కల్యాణం
మంగపేట: మండలంలోని లక్ష్మినర్సాపురంలో కొలువుదీరిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ, పగిడిద్దరాజు కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ఈనెల 3 నుంచి ప్రారంభమైన జాతర మూడవరోజు కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి నాగులమ్మ, వనదేవతకు ఎదుర్కోలు మహోత్సవం అనంతరం ఆలయ ప్రధాన పూజారి (నాగులమ్మ ఉపాసకుడు) బాడిష రామకృష్ణ స్వామి ఆధ్వర్యంలో రాత్రి ఒంటి గంట నుంచి వేద పండితులు గాదె నరేష్ ఆచార్యులు, మహేష్, రాకేష్ల బృందం నాగులమ్మ అమ్మవారు, పగిడిద్దరాజు కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. నాగులమ్మ ఉపాసకుడు (దేవరబాల) రామకృష్ణ స్వామి లోకకల్యాణం కోసం సుమారు రెండున్నర గంటల పాటు అగ్నిగుండంలో నడిచారు. భక్తులు జై నాగులమ్మ తల్లీ అంటూ భక్తితో చేసిన నినాదాలు జాతర ప్రాంతం మార్మోగింది. అంతకుముందు రామకృష్ణ స్వామి ఆదివాసీ గిరిజన పూజారులు, వడ్డెలతో కలిసి రహస్యపూజలు నిర్వహించి అగ్నిగండాన్ని వెలిగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు నాగులమ్మ, సడాలమ్మ, వనదేవత వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఏటూరునాగారం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, చర్ల, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కన్నాయిగూడెం: మండలంలోని కన్నాయిగూడెం, ఏటూరు సబ్స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుందని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటూరునాగారం నుంచి ఉన్న 33కేవీ లైన్లో తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపుతో పాటు మండల పరిధిలోని విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. పనులు త్వరగా పూర్తి చేయండివాజేడు: జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పుర్తి చేయాలని నేషనల్ హైవే ఈఈ మనోహర్ అన్నారు. వాజేడు మండలంలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు 10 కిలో మీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. శుక్రవారం వాజేడుకు వచ్చిన ఆయన రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగుపై పాత బ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇప్పటికే డైవెర్షన్ రహదారి వేసి బ్రిడ్జి తొలగింపు పనులను చేపట్టారు. ఈ పనులను పరిశీలించిన ఈఈ మనోహర్ వర్షాకాలం రాక ముందే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట నేషనల్ హైవే ఏఈ రామ్ముర్తి తదితరులు ఉన్నారు. ములుగు: ములుగు మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి సీతక్క ప్రత్యేక నిధులు కేటాయించారని, కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు అవగాహన లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు మన్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క సహకారంతో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే రూ.15 కోట్ల పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. అప్పటివరకు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగలేదని, కాబట్టి అప్పటి టెండర్ల ప్రక్రియపై ఇటీవల ఎన్నికై న కౌన్సిలర్లు అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో ప్రారంభమైన టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లు వేయాలని కలెక్టర్ను కోరడం వారి అవివేకాన్ని సూచిస్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పనులకు వచ్చిన నిధులు అదే పరిధిలో వినియోగించబడతాయని, అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
గోల్ సాధించారు..● సివిల్స్ ఫలితాల్లో మెరిసిన జిల్లా అభ్యర్థులు ● ఉత్తమ ర్యాంకులతో కలసాకారం చేసుకున్న యువకులుసమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, చిత్రంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సమావేశానికి హాజరైన కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్బాజ్పాయ్, సందీప్కుమార్ ఝా, దివాకర టీఎస్, అధికారులుసాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నా రు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
యాసంగి పంటలకు దేవాదుల నీరు
ములుగు రూరల్: యాసంగి పంటలకు దేవాదుల నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్కు నీరు చేరుకుంందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తెలిపారు. యాసంగికి నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, మల్లంపల్లి సర్పంచ్ ల్యాదె శ్యాంరావు, రాజు, రాకేష్ పాల్గొన్నారు. గిరిజన కళాశాలలో అధికారుల విచారణఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 10 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు మహబూబాబాద్, ములుగు జిల్లాల గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డిలు గురువారం గురుకుల కళాశాలను సందర్శించి విచారణ చేపట్టారు. కలుషితమైన ఆహారం తినడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారా అన్న కోణంలో ఆరా తీశారు. అదేవిధంగా పరీక్షల సమయం కావడంతో ఒత్తిడికిలోనై ఉంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల ఒత్తిడికి గురయ్యారని, ఎండ తీవ్రతతో అలా జరిగిందని విద్యార్థులు తెలిపినట్లు ఆర్సీఓ వెల్లడించారు. ఆహారంలో ఎలాంటి లోపాలు, కల్తీ జరగలేదన్నారు. ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలివెంకటాపురం(కె): డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్భట్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరీవ్–ఆలీవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో, కారు డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో ఆస్పత్రికి చేర్చడం గోల్డెన్ ఆవర్గా పరిగణిస్తారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గుడ్ సమారిటన్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన వ్యక్తికి రూ.25 వేలు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. అనంతరం విలేకరులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ముత్యం రమేశ్, ఎస్సై తిరుపతిరావు, వాజేడు ఎస్సై సతీశ్, పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సెకండ్ ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో గొంది హనుమంత్ గోల్డ్ మెడల్ సాధించగా ఏఎస్పీ అభినందించారు. సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. -
‘మద్దతు’ ఇవ్వని మార్క్ఫెడ్!
దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులుసాక్షి ప్రతినిధి, వరంగల్: మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్ఫెడ్ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్గా మారిన ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్లో ఎలా గోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూ పెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 2.11 లక్షల ఎకరాల్లో సాగు.. ఎంఎస్పీ బహుజాగు 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొ చ్చని భావించి ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువసగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ తమ పెట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.2025–26లో జిల్లాల వారీగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం.. మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్’.. క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400.. ‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు ఉమ్మడి వరంగల్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు 7.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక అన్నదాతల ఆందోళనజిల్లా సాగు విస్తీర్ణం ( ఎకరాల్లో...)హనుమకొండ 58,000 వరంగల్ 46,000 జనగామ 30,150 మహబూబాబాద్ 40,230 ములుగు 20,125 జేఎస్ భూపాలపల్లి 16,995 మొత్తం 2,11,500ఖర్చు అంశం సుమారు ఖర్చు రూ.లు)భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000 విత్తనాలు (హైబ్రిడ్) 3,000 – 4,000 ఎరువులు 5,000 – 7,000 మందులు (కీటక నివారణ) 3,000 – 5,000 కూలీల ఖర్చు 6,000 – 8,000 నీటి ఖర్చు 3,000 – 5,000 కోత – రవాణా 4,000 – 6,000 మొత్తం ఖర్చు 28,000 – 40,000 -
హెచ్పీవీతో హెల్త్
ములుగు రూరల్: మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కిశోర బాలికల(14–15 ఏళ్లు) ఆరోగ్యమే లక్ష్యంగా క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ(హుమర్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు గాను విద్య, వైద్య ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆద్వర్యంలో వైద్యాధికారులకు, సిబ్బందికి హెచ్పీవీ టీకాపై శిక్షణ ఇచ్చారు. ఇందులో 28 మంది వైద్యాధికారులు, 51 మంది పీహెచ్సీ వైద్యులు, 487 మంది ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాలికలు టీకాలు తీసుకునేందుకు సంసిద్దం చేయాలని సూచించారు. బాలికల వివరాలు నమోదు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకునే బాలికలు తప్పనిసరిగా ఆధార్కార్డు తీసుకు రావాలి. ఆధార్కు లింకు అయిన ఫోన్కు వచ్చే ఓటీపీతో వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత వారికి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ములుగు జిల్లాకేంద్రంలో జనరల్ ఆస్పత్రి, ఏటూరునాగారంలోని సీసీహెచ్సీ, వెంకటాపురం(కె)లోని సీహెచ్సీ సెంటర్లలో వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. 3,127 మందికి టీకాలు జిల్లాలోని పది మండలాల పరిధిలో 3,127 మంది కిశోర బాలికలు ఉన్నట్లు విద్యాశాఖ రికార్డుల్లో నమోదై ఉంది. వైద్యశాఖ అధికారులు అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్ వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బాలికకు సింగిల్ డోస్ మాత్రమే ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్నర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు విధుల్లో ఉంటారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అధికారులు 3,127 మంది.. మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఈ నెల 8 నుంచి ప్రారంభంఆడబిడ్డలకు హెచ్పీవీ టీకా రక్షణ కవచం లాంటిదని కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 8న వ్యాక్సినేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వ్యాక్సినేషన్కు వచ్చే వారు ఐడీ ప్రూఫ్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్, ఆపార్ ఐడీ తీసుకురావాలని సూచించారు. టీకాకు వచ్చే క్రమంలో అల్పాహారం తీసుకొని రావాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేకర్, ఏటూరునాగారం సూపరింటెండెంట్ సురేశ్కుమార్, జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, రాయినిగూడెం మెడికల్ ఆఫీసర్ నాగఅన్వేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 8న హెచ్పీవీ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా బాలికల సంఖ్యను గుర్తించాం. అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ ఇండెంట్ తయారు చేసి నివేధించాం. – గోపాల్రావు, డీఎంహెచ్ఓ -
పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏటూరునాగారం/మంగపేట: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగపేట మండల పరిధిలోని చుంచుపల్లి, పొదుమూరు, ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, ముళ్లకట్ట ప్రాంతాల్లోని పుష్కరఘాట్లను ఏఎస్పీ మనన్భట్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సూరి, మహేశ్లతో కలిసి ట్రాఫిక్ రూట్లు, పార్కింగ్ స్థలాలు, వన్వే ప్రాంతాలను గురువారం పరిశీలించారు. స్నాన ఘట్టాల ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుష్కరఘాట్లకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని పుష్కరాలను విజయవంతం చేస్తామన్నారు. గోదావరిలో వరద నీరు, ఉధృతి, అందులోని గోతులు, ప్రమాద ఘటికలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు, నది వద్ద భద్రతా చర్యలు, భక్తుల రద్దీ నియంత్రణ వంటి అంశాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీ ఘాట్ వద్ద గజ ఈతగాళ్లు, పడవలు, రెస్క్యూ టీం, మర బోట్లు, రబ్బర్ ట్యూబ్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
మున్సిపల్ కమిషనర్పై కౌన్సిలర్ల ఆగ్రహం
ములుగు: ములుగు మున్సిపల్ కమిషనర్ రమేష్పై నూతనంగా ఎన్నికై న సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశాన్ని ఆర్అండ్బీ గెస్ట్హౌజ్లో గురువారం కమిషనర్ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ హాజరయ్యారు. మున్సిపాలిటీ సాధారణ సమావేశంలోని ఎజెండా అంశాలను సమావేశంలో చదివి వినిపించారు. విపక్ష సభ్యుల పట్ల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎజెండా తయారీలోనే తీర్మాణం ఆమోదించినట్లుగా రాశారని సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభ్యులకు ఎజెండాను అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కొన్ని తప్పులు చోటు చేసుకున్న మాటవాస్తవమేనని, ఇక నుంచి మూడు రోజుల ముందుగానే సభ్యులకు సమాచారం ఇస్తామని కమిషనర్ హామీనిచ్చారు. కొత్తగా పన్నులు పెంచవద్దని, రానున్న వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనుల్లో వివక్ష చూపవద్దని కౌన్సిలర్ సురేందర్ విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కలిసి పని చేయాలని నాలుగో వార్డు కౌన్సిలర్ పావని ప్రస్తావించారు. అనంతరం దేవగిరిపట్నం రోడ్డు 60 ఫీట్లకు విస్తరణ, మాస్టర్ ప్లాన్ తయారీ, వీధిలైట్ల కొనుగోలు వంటి ఐదు అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటీ చైర్పర్సన్ ఆసియా షాహీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యుల ఆరోపణ -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ములుగు/ములుగు రూరల్:వైద్యాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్.దివాకర హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర పరీక్ష గది, వృద్ధులు, పెడియాట్రిక్ వార్డులతో పాటు ల్యాబోరేటరీ, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలోని విభాగాలు, వైద్యుల వివరాలపై ఆరా తీశారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ల వివరాలను తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, సదుపాయాలను పరిశీలించారు. పేషెంట్లకు ఇచ్చే మందులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గ ర్భిణులకు వివిధ రకాల టెస్టులను ఆస్పత్రిలోనే చే యాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇంచర్ల శివారు ఎర్రిగట్టమ్మ పరిధిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణంలో ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేపట్టడానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. దీనిలో భాగంగా అన్నిశాఖల అధికారులు శ్రద్ధతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
ఆన్లైన్లోనే పౌరసేవల దరఖాస్తుల విచారణ
ములుగు: రాష్ట్రంలో పౌరసేవలను పారదర్శకంగా వేగంగా అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ తెలిపారు. కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ అఽధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. ఇకపై పౌరసేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ తదితర ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతుందన్నారు. కాగిత రహిత విధానం అమల్లోకి రావడంతో సమయానికి సేవలు అందడం, పారదర్శకత పెరగడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఆదాయ ధ్రువీకరణ పత్రం సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. దశలవారీగా కులం, నివాసం వంటి ఇతర ధ్రువపత్రాలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఆనంతరం ఈ మొబైల్ యాప్ వినియోగంపైన కలెక్టరేట్ కార్యాలయంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ శిక్షణ ఇచ్చారు. మీసేవ ద్వారా అప్లై చేస్తే దరఖాస్తు తొలుత జీపీవో లాగిలోకి వస్తుందన్నారు. అనంతరం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఎంఆర్ఐ)కి, తదనంతరం ఆర్ఐ నుంచి నేరుగా డిప్యూటీ తహసీల్దార్(డీటీ) లాగిన్ కి చేరుతుందని వివరించారు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తుంటారని వివరించారు. ములుగు ఆర్డీఓ వెంకటేశ్ -
దళారులు ఇబ్బంది పెడుతున్నారు..
మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి – రామారపు సాంబయ్య, రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లిరైతులను ఆదుకోవాలి..టీజీ మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి. – టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి -
రేపు మెగా జాబ్మేళా
ములుగు రూరల్: రేపు(శుక్రవారం) జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సంపత్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం డిగ్రీ కళాశాలలో జాబ్మేళా కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు నిర్వహించే జాబ్మేళాకు జిల్లా వాసులే కాకుండా భూపాలపల్లి, నర్సంపేట, పరకాల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వివరించారు. గూగుల్ ఫామ్ ద్వారా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బాలయ్య, కవిత, అనిల్ కుమార్, ఉదయశ్రీ, విజేత, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవకాశంఈ నెల 31 వరకు గడువు.. విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు యువికా–26 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుకుందాం రండి. – మహబూబాబాద్ అర్బన్అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈవిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు 48,941 ఉన్నారు.అన్నీ ఉచితంగానే..ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేయనుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 12 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్త గ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. విద్యార్థులు వినియోగించుకోవాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వి.రాజేశ్వర్. డీఈఓ, మహబూబాబాద్●జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు శాస్త్రవేత్తలతో మాట్లాడే చాన్స్ ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువు ఎంపికైతే ప్రత్యేక శిక్షణ -
పెద్దల సభకు వేం నరేందర్రెడ్డి
సాక్షి, మహబూబాబాద్: రాజ్యసభ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరేందర్రెడ్డి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మనుసింఘ్వీకి మరోమారు అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో వేం నరేందర్రెడ్డికి చాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇరువురు నేడు(గురువారం) అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నాయకుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నేడు నామినేషన్ దాఖలుపేరు: వేం నరేందర్రెడ్డి తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, రత్నమ్మ భార్య: విజయ కుమారులు: కృష్ణభార్గవ్, కృష్ణచైతన్య గ్రామం: అర్పనపల్లి, మండలం కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా రాజకీయ అనుభవం: 2004 – 2009 వరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు -
ప్రగతి ప్రణాళికను అమలు చేయాలి
ఏటూరునాగారం: రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికల కార్యాచరణ అమలుపై బుధవారం రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిదు దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అన్నారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రతా చర్యలు, వివిధ వర్గాల వారి సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లు
మంగపేట: మండల పరిధిలోని లక్ష్మీనర్సాపురంలో గల నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లు గద్దెలపై బుధవారం కొలువుదీరారు. జాతర రెండో రోజు బుధవారం నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిష రామకృష్ణ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం సమీపంలో సడాలమ్మ, నాగులమ్మ అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవాన్ని సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. నాగులమ్మ పూజారి బాడిష నాగరమేశ్, గిరిజన పూజారులు, వడ్డెలు ఆలయ సమీపంలోని గండొర్రెగుట్ట వద్ద నాగులమ్మ, ఝెర్రట్టలగుట్ట వద్ద సడాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి డోలి వాయిద్యాల నడుమ తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు నృత్యాలు చేస్తూ భారీగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పూజారులు, వడ్డెలు అమ్మవార్లను గద్దైపె ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని పెరకలకుంట లక్ష్మీదేవర ఆలయం నుంచి ఆలయానికి వచ్చిన లక్ష్మీదేవరకు ఆలయ పూజారులు, వడ్డెలు కంకణాలు కట్టి స్వాగతం పలికారు. రాత్రి సమయంలో అమ్మవార్లకు రమణక్కపేట సమీపంలోని పవిత్ర గోదావరిలో ఏడు చెలిమల నీటితో పాటు వివిధ దళాలతో పుణ్యస్నానాలు, అభిషేక పూజలు నిర్వహించారు. చుంచుపల్లి నుంచి అమ్మవారికి చెందిన అవిరేణి కుండలను ఆదివాసీ మహిళలు తీసుకొచ్చి ఆలయానికి సమర్పించారు. నేడు గురువారం గద్దెలపై కొలువైన అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇంకా భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ ప్రధాన పూజారి బా డిష రామకృష్ణ, నాగరమేశ్ ఆధ్వర్యంలో ఆలయంలో తగిన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాని, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, శివ, చిన్నాబ్బాయి, కారం రాజేశ్, కుల పెద్ధలు విష్ణుమూర్తి, మడకం రాజేశ్వర్రావు, చౌళం వెంకటేశ్వర్లు, కొమరం మాధవరావు తదితరులు పాల్గొన్నారు. నాగులమ్మ, సడాలమ్మకు పూజలు భారీగా తరలివచ్చిన భక్తజనం -
నీటి వృథాకు చెక్
ఏటూరునాగారం: వర్షాలు, వరదల సమయంలో నీరు వృథాగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిని ఒడిసిపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక్కో గ్రామానికి రెండు చెక్ డ్యామ్లను నిర్మించాలని రూపకల్పన చేశాయి. నీటి సంరక్షణ పథకం కింద ఒక్కో చెక్ డ్యామ్కు రూ.5లక్షల బడ్జెట్ను సైతం అధికారులు కేటాయించారు. జిల్లాలో అత్యధికంగా నీటి వనరులు ఉన్నా విద్యుత్ మోటార్లు, బోర్ల మీద ఆధారపడి రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీలోని చెరువులు, వాగులు, వంకలు, తోగులు ఇలా నీటి సౌకర్యం, సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో చెక్డ్యామ్లు నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్కు అందాయి. ఈ మేరకు కలెక్టర్ దివాకర మండలాల్లోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు గ్రామ పంచాయతీకి రెండు చొప్పున సులభతరమైన, పూర్తి స్థాయిలో ఉపయోగించే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశాలు అందాయి. దీంతో ఈజీఎస్ అధికారులు గ్రామాల్లోని రైతులు, స్థానికులతో చర్చించి వాగులు, వంకలు, తోగులు, చెరువు సమీపంలో నిర్మాణాలకు ప్రణాళికలను సిద్ధం చేశారు. పెరగనున్న భూగర్భ జలాలు నీటిని చెక్డ్యామ్లు నిర్మించి నిల్వచేస్తే భూగర్భజలాలు కూడా అధికంగా పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో మిర్చి, వరి, పత్తి, ఇతర పంటలకు కావాల్సినంత నీటిని ఈ చెక్డ్యామ్ల్లో నిల్వచేసి పంటల అవసరాలకు అనుగుణంగా నీటిని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు వ్యవసాయదారులకు విద్యుత్ ఖర్చులు, మోటార్లు, బోర్లు వేయడం లాంటి ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 348 చెక్డ్యామ్లు జిల్లా వ్యాప్తంగా 348 చెక్డ్యామ్లు నిర్మించే అవకాశాలున్నాయి. వీటికి తోడు ఇంకా రైతులకు అవసరమైన చోట మరిన్ని అదనంగా నిర్మించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలో నీటి సౌకర్యం ఎక్కువగా ఉన్న ఏజెన్సీ మండలాల్లో మరిన్ని అదనంగా చెక్డ్యామ్లు మంజూరయ్యే అవకాశాలు ఉండడంతో రైతులకు మరింత లాభం చేకూరనుంది. నీటి సంరక్షణలో సర్పంచ్ల పాత్ర కీలకంగా మారింది. గ్రామంలోని సర్పంచ్, గ్రామం పేరు, హబిటేషన్, లోకేషన్, సర్వే నంబర్, ప్రభుత్వం, ఫారెస్టు, రెవెన్యూ, ప్రైవేటు అనే వివరాలు అందించాల్సి ఉంది. జీపీకి రెండు చొప్పున తీసుకోవచ్చు. లేదంటే ఎక్కువగా కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. పంచాయతీ కార్యదర్శులు కూడా గ్రామంలో ఎక్కడి చెక్డ్యామ్లు అక్కడే నిర్మించాలని నిర్ణయించి గ్రామ పంచాయతీల తీర్మాణం ఈజీఎస్ అధికారులకు అందించాలి. – చరణ్రాజ్, ఏపీఓ ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఏటూరునాగారం 16 మీటర్ల పొడువుతో ఒక్కో చెక్డ్యామ్ను నిర్మించేందుకు రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో నిబంధనల ప్రకారం నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు అధికంగా ఉన్నప్పటికీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీటిని నిల్వచేసే ప్రాంత్రాలను గుర్తించి చెక్డ్యామ్లు నిర్మిస్తే రైతులకు 365ల రోజుల పాటు రెండు పంటలు సులభంగా పండుతాయి. ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గ్రామానికి రెండు చొప్పున మంజూరు ఒక్కోదానికి రూ.5 లక్షల బడ్జెట్ -
‘పాత భూమినే సాగు చేస్తున్నాం’
ఎస్ఎస్తాడ్వాయి: కొత్తగా పోడుభూమిని సాగుచేయలేదు.. పాత భూములనే సాగు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు కందకాలు తీయడం నిలిపివేయాలని కాల్వపల్లికి చెందిన రైతులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం బాధిత రైతులు విలేకర్లతో మాట్లాడారు. కాల్వపల్లిలో 40 ఆదివాసీ కుటుంబాలకు చెందిన తాము ముప్పై ఏళ్లుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. 2001లో పోడు చేసి 2004 నుంచి సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్లుగా ఎన్నాడూ జేసీబీలతో రాని అధికారులు ఆకస్మాత్తుగా కందకాలు తీయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో మంత్రి సీతక్క కూడా పట్టాలిప్పిస్తామని చెప్పారని, కొత్తగా పోడు చేయొద్దని చెప్పిన మాటను గౌరవించి పోడు చేయలేదని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి తమకు పట్టాలు ఇప్పించాలని వేడుకున్నారు. -
నీటి ఎద్దడి నివారణకు బోరు ఏర్పాటు
ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు రంగారావుపల్లిలో నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించారు. ఈ మేరకు బుధవారం 4వ వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని భూమి పూజ చేసి బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క ఎన్నికల సమయంలో రంగారావుపల్లి ప్రజలకిచ్చిన హామీ నేరవేర్చారని తెలిపారు. అదే విధంగా కాలనీలో నె లకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని పావని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శివ, రవి, రూప్సింగ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: ములుగు ఎస్సైగా ఉపేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. మహిళా ఉద్యోగులు క్రీడా పోటీల్లో పాల్గొనాలి ములుగు రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో మ హిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, కార్యదర్శి మేడిపల్లి చైతన్యలు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. సీ్త్ర–శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో టీజీవో, టీఎస్జీవో సహకారంతో నేడు, రేపు బండారుపల్లి రోడ్డులోని గిరిజన భవన్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘కాల్వపల్లి రైతులపై దాడి జరగలేదు’ ఏటూరునాగారం: కాల్వపల్లికి చెందిన రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయలేదని అటవీశాఖ జిల్లా అధికారి రాహుల్ కిషన్ జాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని ఛానల్స్, పత్రికలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వివరించారు. వార్తలు రాసే విషయంలో సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని రాహుల్ కిషన్ జాదవ్ వెల్లడించారు. -
విద్యుత్ సరఫరాలో లైన్మెన్ల పాత్ర కీలకం
గోవిందరావుపేట: విద్యుత్ సరఫరాలో లైన్మెన్ల పాత్ర కీలకమైందని డీఈ నాగేశ్వరరావు, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ దేవ్సింగ్, సబ్ ఇంజినీర్ అఖిల అన్నారు. పస్రా సెక్షన్లో లైన్మెన్ దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఓ అండ్ ఎం(ఆపరేటర్ అండ్ మెంటెనెన్స్) సిబ్బందిని బుధవారం శాలువాలతో సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు, గాలులు, ప్రమాదకర పరిస్థితులు ఎదురై విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు వాటిని సరిచేసి లైన్మెన్లు నిరంతర విద్యుత్ను అందిస్తున్నారని తెలిపారు. వారి సేవలు అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు రామచంద్రయ్య, సమ్మిరెడ్డి, లైన్మెన్లు తిరుపతి, వేణు, అసిస్టెంట్ లైన్మెన్లు భిక్షపతి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా మండమెలిగె పండుగ
మంగపేట: మండల పరిధిలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురం నాగులమ్మ ఆలయంలో మండమెలిగె పండుగ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతర కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన పూజారి, నాగులమ్మ ఉపాసకుడు (ఆలయ ట్రస్టి) బాడిష రామకృష్ణ స్వామి ఉదయం ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ఎదుట తోరణ స్తంభాలను నిలిపారు. పసుపు, కుంకుమలతో అలంకరించి గడపను ప్రతిష్ఠించారు. మండమెలిగె పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి డోలి వాయిద్యాల నడుమ వడ్డెలు, గిరిజన పూజారులు, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని మామిడి తోరణాలతో అలంకరించారు. అనంతరం గోదావరి నదీ జలాలతో శుద్ధి చేసిన అమ్మవారి ఆభరణాలు, గజ్జెలు, అడారాల(కుండలు)తో అలంకరించి దూపంతో రహస్య పూజలు నిర్వహించారు. అలాగే పూజారులు, వడ్డెలు, కులపెద్దలు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఘడికామరాజు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, ఎర్రమ్మ, పోతురాజు, నాగులమ్మ నాగులమ్మ గద్దెలను పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకించారు. అమ్మవారి ప్రతి రూపాలైన జెండా కర్రలతో డోలి వాయిద్యాలతో భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోని ఆయా గద్ధెలపై ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. గద్దెలపై జెండాలను ప్రతిష్ఠించారు. నేడు మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన పూజారి రామకృష్ణ స్వామి తెలిపారు. నేడు నాగులమ్మ, సడాలమ్మ రాక నేడు గండొర్రెగుట్ట నుంచి నాగులమ్మ, యర్రెట్టలగుట్ట నుంచి వచ్చే సడాలమ్మ అమ్మవార్లు ఆలయంలో కొలువుదీరనున్నారు. అమ్మవార్లకు పవిత్ర గోదావరి జలాలతో పుణ్యస్నానం చేయించిన అనంతరం డోలు వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయానికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నట్లు నాగులమ్మ పూజారి రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులమ్మ పూజారి బాడిష నాగరమేష్, సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాణి, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, శివ, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రారంభమైన నాగులమ్మ జాతర గద్దెలపై జెండా కర్రల ప్రతిష్ఠాపన -
మోడల్ ప్లాంటేషన్
ఏటూరునాగారం: ఏజెన్సీలోని రైతులకు ఆయిల్పామ్ మొక్కల పెంపకం, వచ్చే ఆదాయం, ఉపయోగాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మోడల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఐటీడీఏ హర్టికల్చర్ ద్వారా 3 మే 2023న 9.12 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటేందుకు అప్పటి పీఓ అంకిత్, ఐటీడీఏ ప్రాజెక్టు హర్టికల్చర్ అధికారి రమణ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణకు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.24 లక్షలు మంజూరు చేశారు. మొక్కలు నాటించారు. నీరు పట్టేందుకు సైతం డ్రిప్, మోటార్లను అమర్చారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఆ మొక్కల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆయిల్పామ్ తోట పెంపకం పేరుతో నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేసి రూ.24 లక్షలు డ్రా చేయడం గమనార్హం. మొక్కల పెంపకంపై పర్యవేక్షణ కొరవడడంతో గడ్డి, పిచ్చి మొక్కులు పెరగడంతో పాటు ఆయిల్పామ్ మొక్కలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టు పూర్తైందని అధికారులు, సిబ్బంది కలిసి విందులు కూడా చేసుకోవడం గమనార్హం. ఎండిపోతున్నా పట్టించుకోని అధికారులు రూ.24 లక్షల నిధులు వృథాఐటీడీఏ ప్రాజెక్టు హర్టికల్చర్ అధికారి రమణ మోడల్ ప్లాంటేషన్కు శ్రీకారం చుట్టారు. ఆయన బదిలీ కావడంతో పాటు ఆశాఖకు సంబంధించిన అధికారుల పోస్టులు స్థానికంగా ఖాళీగా ఉండడంతో ప్లాంటేషన్ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఉద్యానశాఖకు సంబంధించిన అధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయిల్పామ్ మొక్కలకు నీటి సౌకర్యం, కంచె సైతం లేకపోవడంతో పశువులు, మేకలు మేస్తుండడంతో ఆయిల్పామ్ మొక్కలు ఎండితున్నాయి. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోడల్ ప్లాంటేషన్ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయస్థాయి పోటీలకు వేణుమాధవరావు
వాజేడు: ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి గిరిజన కళా ఉత్సవానికి తరలివెళ్లారు. మండల పరిధిలోని పేరూరుకు చెందిన తొర్రెం వేణు మాధవరావు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కళా ఉత్సవంలో తన చిత్రకళలతో ఆకట్టుకుని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన గిరిజన కళా ఉత్సవంలో పాల్గొని తన చిత్రకళల గురించి వివరించారు. దీంతో పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా రాములవారి తలంబ్రాలు భూపాలపల్లి అర్బన్: శ్రీ రామనవమి సందర్భంగా ఈనెల 27న భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సంబంధించిన పవిత్ర ‘కల్యాణ తలంబ్రాలు’ పోస్టాఫీస్ ద్వారా భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు సమీప పోస్టాఫీసులో రుసుం చెల్లించి తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చన్నారు. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలు (1 ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు) రూ.450, ముత్యాల తలంబ్రాలు (1 ముత్యం) రూ. 151 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు స్పీడ్ పోస్టు ద్వారా భక్తులకు పంపించనున్నట్లు తెలిపారు. శ్రీ రామనవమి మహోత్సవాలకు హాజరుకాలేని భక్తులకు ఈ సేవ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఎర్రగట్టు వెంకన్న కల్యాణం రద్దు హసన్పర్తి: చంద్రగ్రహణంతో ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని రద్దు చేశారు. జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం హసన్పర్తి–భీమారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత స్వామి వారిని రథంపై ఎర్రగట్టుగుట్టకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటలలోపే స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆతర్వాత ఆయాన్ని ద్వారబంధనం చేశారు. చంద్రగ్రహణంతో ఈసారి స్వామివారి శోభాయాత్ర నిరాడంబరంగా సాగింది. బుధవారం మహా సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. కాక్లియర్ ఇంప్లాంట్తో అంగవైకల్యం దూరం ఎంజీఎం : కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చిన చెవుడు, మూగ అంగవైకల్యాన్ని పూర్తిగా నయం చేయొచ్చని ఎంజీఎం ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ శ్రమలత తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్రావు, ఆడియాలజిస్ట్ డాక్టర్ రతన్సింగ్, డాక్టర్ జెన్నీఫర్, డాక్టర్ ప్రత్యూష, సీనియర్ రెసిడెంట్స్, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. గణపురం హోలీ సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో గణపేశ్వరుడిని మోదుగు పూలతో మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతీ సంవత్సరం హోలీ సందర్భంగా ఆలయ ఆవరణలో పూసే మోదుగు పోలతో స్వామి వారిని అలంకరిస్తామని ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు. -
పోడుభూముల్లో కందకాలు
ఎస్ఎస్తాడ్వాయి: పోడు భూముల్లో కందకాలు తీస్తున్న అటవీశాఖ అధికారులను మంగళవారం కాల్వపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు పోడు రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వపలి రైతులు భూపాలపల్లి జిల్లాలోని దూదేకులపల్లి రేంజ్ పరిధి సంగారం బీట్ పరిధిలో 25 ఏళ్లుగా సుమారుగా 162 ఎకరాల్లో 47 కుటుంబాలు పోడు భూములను సాగుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అటవీశాఖ అధికారులు రైతుల పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు భూముల చుట్టూ జేసీబీతో కందకాలు తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకుని తవ్వకాల పనులను అడ్డుకోవడంతో అటవీశాఖ అధికారులు, రైతులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములే తమకు జీవనాధారమని వాటిని వదిలే ప్రసక్తే లేదని బాధిత రైతులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. రైతుల సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలి. సింగారం బీట్లోని కాల్వపల్లి రైతులు పోడు భూములను సాగు చేస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల జారీకి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అధికారులు దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. – కొప్పుల రవికుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కాల్వపల్లి అటవీశాఖ అధికారులను అడ్డుకున్న రైతులు -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ ఏటూరునాగారం: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం బైక్ ర్యాలీ చేపట్టారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ అడవులను సంరక్షించడంతో పాటు వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. ప్రకృతి ప్రసాధించిన ఔషధ మొక్కలు మానవాళికి అమూల్యమైనవన్నారు. వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల వేట, చెట్ల నరికివేత వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు అటవీశాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్లో వచ్చిన వినతుల వివరాలు..
ఎస్ఎస్తాడ్వాయి మండలం గోనెపల్లికి చెందిన రైతు రైతు భరోసా వచ్చేలా చూడాలని విన్నవించారు. అలాగే కొండపర్తికి చెందిన అభయహస్తం ఫౌండేషన్ ద్వారా ఆదివాసీ గిరిజన పిల్లల కోసం నిర్మించిన లెర్నింగ్ సెంటర్ ప్రారంభించామని, ఐటీడీఏ ద్వారా మరింత సహకారం అందించాలని కోరారు. కాటాపురం సమీపంలోని శ్రీరామ్నగర్లో లెర్నింగ్ సెంటర్ నిర్మాణం, అవసరమైన సామగ్రి అందించాలని కోరారు. సంగెం మండలం పోచమ్మతండాకు చెందిన ఒకే కుటుంబానికి కుమారుడికి ఎంబీబీఎస్, కుమార్తెకు ఐఐటీ సీటు వచ్చిందని, ఆర్థిక సాయం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం లో ఐటీడీఏ గెస్ట్హౌజ్లో కాంటిజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఉద్యోగి రెగ్యులర్ చేయాలని డీడీకి విన్నవించారు. మంగపేట మండలం రమణక్కపేటకు చెందిన ఓ గిరిజన విద్యార్థిని జీఎన్ఎంగా కోర్సు చేసి ఎంజీఎంలో స్టాఫ్నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నానని ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవించారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. వెంకటాపురం(కె) ఆలుబాకకు చెందిన ఓ గిరిజనుడు, వాజేడుకు మండలం పూసూరుకు చెందిన గిరిజనులు ఇందిర సౌర గిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్బాబు, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్రావు, ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రవేశ పరీక్ష గడువు పొడిగింపు
గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గండు కుమార్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్ల డించారు. అర్హులైన విద్యార్థులు గడువు లోపు తమ దరఖాస్తులను సమార్పించాలని కోరారు. వివరాలకు ఫోన్ నంబర్లో 8096350115 సంప్రదించాలని సూచించారు. సీతారాముల తలంబ్రాలు ఊరేగింపు వాజేడు: మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామంలో సీతారాముల తలంబ్రాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. త్వరలో జరుగనున్న సీతారాముల కల్యాణానికి చేతులతో ఒలిచి తలంబ్రాలను సిద్ధం చేశారు. ఆ తలంబ్రాలను సోమవారం ఊరేగించారు. రామప్పలో ఫారెస్ట్ అధికారులు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం అటవీశాఖ ఎంఓఈఎఫ్సీసీ ఐజీఎఫ్ డాక్టర్ త్రినాధ్ కుమార్, సీపీఎఫ్ ప్రభాకర్ సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వారికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించగా రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. వారి వెంట ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, భూపాలపల్లి డీఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఎఫ్డీఓ సత్యయ్య, ఎఫ్బీవో కిషన్ తదితరులు ఉన్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచాలిభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. గడిచిన నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 4.21 లక్షల టన్నులు కాగా, 3.45 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 82 శాతంలో నిలిచినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 12,327 టన్నులు నమోదైందన్నారు. ఓపెన్కాస్టుల్లో మట్టి వెలికితీత పనుల్లో ఓసీ–2లో 13.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 10.14 లక్షల క్యూబిక్ మీటర్లు 75శాతం సాధించగా, ఓసీ–3లో 30.00 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 23.45 లక్షల క్యూబిక్ మీటర్లు 78శాతం సాధించినట్లు తెలిపారు. మొత్తంగా 43.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 33.59 లక్షల క్యూబిక్ మీటర్లు 77శాతం మట్టి వెలికితీత పనులు చేయడం జరిగిందన్నారు. ఈ నెల ఉత్పత్తి లక్ష్యం 4.54 లక్షల టన్నులు చేయాల్సి ఉందన్నారు. ఉత్పత్తి పెంపు కోసం ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని, పనిగంటలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంపునకు అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా వర్కింగ్ పర్మిషన్ తదితర నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి కొనసాగించాలని తెలిపారు. రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తెలిపారు. -
దేవునిగుట్టపై పూర్ణాహుతి
ములుగు రూరల్: కొత్తూరు దేవునిగుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భాగంగా స్వామి కల్యాణ మహోత్సవంలో ఎడ్లబండ్లు తిరుగు కార్యకక్రమం నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
కొడుకు పట్టించుకోవడం లేదు
నాకు ఒక్క కొడుకు. హైదరాబాద్లో ఉంటున్నాడు. బాగోగులు పట్టించుకోవడం లేదు. జీవనం సాగించడం ఇబ్బందిగా ఉంది. ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఉన్న ఎకరం భూమి అమ్ముకుందామనుకుంటే అడ్డు తగులుతున్నాడు. – కొల్లు వెంకట్రెడ్డి, గోవిందరావుపేట ములుగు మున్సిపాలిటీ పరి ధిలోని పాల్సాబ్పల్లికి చెందిన నిరుపేదలకు ఇళ్లు కేటా యించాలి. తన వార్డులో సు మారుగా 25 కుటుంబాలు సొంత ఇళ్లు లేక దుర్భరజీవి తాలు గడుపుతున్నారు. దీంతో పాటు కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను సైతం మెరుగుపర్చాలి. – కొయిల లక్ష్మి, కౌన్సిలర్ రెండో వార్డు, ములుగు వెంకటాపురం(ఎం) శివారులో తనకు వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. దానికి సంబంధించి పట్టా అందించాలి. సర్వే నంబర్ 1710/సి/2 లో 20 గుంటల భూమి మా తాత చింతిరెడ్డి బాల్రెడ్డి పేరున పట్టా ఉంది. నా తండ్రి మరణించాడు. కావున తన పేరున పట్టా అందించాలి. – చింతిరెడ్డి దిలీప్రెడ్డి, వెంకటాపురం(ఎం)● -
సెంట్రల్ డ్రగ్ స్టోర్ రికార్డుల పరిశీలన
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విజిలెన్స్ డ్రగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ స్టోర్, మెడికల్ కళాశాల సెంట్రల్ స్టోర్ను విజిలెన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జన్ను కిరణ్కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన 50 ఇంజక్షన్లు లభ్యం కావడంతో విచారణ చేపట్టారు. ప్రభుత్వం నుంచి పునిస్కా కంపెనీకి చెందిన 0217 బ్యాచ్ నంబర్ కలిగిన 1,700 మెట్రోనైడోజనల్ ఇంజక్షన్లు సెంట్రల్ మెడిసిన్ స్టోర్కు సరఫరా కాగా ములుగు ఆస్పత్రికి 1,286 ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని తెలిపారు. మిగిలిన 414 నిల్వ ఉన్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజ్ చేయాల్సిన మందులను ఇష్టానుసారంగా నిల్వ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
వాజేడు: రక్తదానం ప్రాణదానంతో సమానమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని ప్రగళ్లపల్లిలో సోమవారం చేయూత స్వచ్ఛంద సంస్థ, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్టు, దూలాపురం అటవీ రేంజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడటం అనేది మాటలకు అందనిదని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తాన్ని దానం చేయాలని సూచించారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన 25 యూనిట్ల రక్తాన్ని రెడ్క్రాస్ సొసైటీ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడకం సుభద్ర, మాజీ సర్పంచ్ నరే శ్, దూలాపురం రేంజర్ బాలకృష్ణ, మురళి, లలిత, ఆదిలక్ష్మి, జగదీశ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.జెడ్పీ మాజీ చైర్పర్సన్ నాగజ్యోతి -
విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
ములుగు: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికతో చదవాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనపై విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను విశ్లేషించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి ప్రధాన సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో రోజువారీగా, వారాంత మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షలు అంటే భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా రాసేలా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ధైర్యం నింపాలని సూచించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. టెన్త్ ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు సమష్టిగా పాటుపడాలని సూచించారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పలు సూచనలు చేసి ఆల్ ది బెస్ట్ తెలిపి విజయపథ సందేశ లేఖలను అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి ఈ నెల 14నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ జీ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే అధికారులకు సైతం సెల్ఫోన్ అనుమతి లేదన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రం పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లేటప్పుడు, పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను పోస్టాఫీస్లో డిపాజిట్ చేసే సమయంలో తప్పకుండా పోలీస్ సిబ్బంది సమక్షంలోనే జరగాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. పరీక్ష సమయంలో తహసీల్దార్లు పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తారని డీటీ స్థాయి అధికారులు సిట్టింగ్ స్క్వాడ్గా ఉంటారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంతో పాటుగా మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు విధిగా సమయానుగుణంగా నడపాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీపీఓ వెంకయ్య, వివిధ శాఖల అధికారులతో పాటు ఏసీజీఈ వినోద్ కుమార్, కోఆర్డినేటర్లు రాజు, శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
వేగం కన్నా ప్రాణం మిన్న
ఏటూరునాగారం: వేగం కన్నా ప్రాణం మిన్న అని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్ అన్నారు. మండల కేంద్రంలోని వైజంక్షన్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం అరైవ్ అలైన్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ ధరించి నిబంధనలను పాటించాలని, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం చేయవద్దన్నారు. మీ ప్రాణం మీ కుటుంబానికి అమూల్యమన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. హెల్మెట్ ధరించి నిబంధనలను పాటిస్తున్న వారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.ఏఎస్పీ మనన్ బట్ -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు అధికారులకు అర్జీలను సమర్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 59 వినతులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 10 వినతులు రాగా ఐటీడీఏ డిప్యూటీ డీడీ దబ్బగట్ల జనార్ధన్ స్వీకరించారు. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు 14పింఛన్లు 14ఇందిరమ్మ ఇళ్లు 14ఇతర శాఖలకు సంబంధించి 17 ప్రజావాణిలో 59, గిరిజన దర్బార్లో 10 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ డిప్యూటీ డీడీ జనార్దన్ -
మహిళలు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో రాణించాలి
ములుగు రూరల్: మహిళలు సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో రాణించినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ అకాడమీ అఫ్ సైన్స్ రీజినల్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సోమవారం సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక విజయాలు సాధించామన్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, ఎకో క్లబ్ కన్వీనర్ సరిత, అధ్యక్షులు బాలయ్య, సరిత, అనిల్ కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కరాటేలో విద్యార్థుల ప్రతిభ
గోవిందరావుపేట/వాజేడు: తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నభవన్లో ఆదివారం నిర్వహించిన 8వ స్టేట్ లెవల్ షోటోఖాన్ కరాటే చాంపియన్ షిప్ 2026లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గోవిందరాపేట మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన గొంది విగ్నేందర్ ప్రస్తుతం మండల కేంద్రంలోని మెరిట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ కరాటే పోటీల్లో విగ్నేందర్ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించాడు. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్ రవికిరణ్ విద్యార్థిని సోమవారం అభినందించారు. భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే వాజేడుకు చెందిన పెనుమళ్లు సీతారామ చంద్రారెడ్డి మండల కేంద్రంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కరాటేలోని స్వారింగ పోటీలో ద్వితీయ, కటాలో మూడో స్థానంలో విజయం సాధించగా ప్రశంసపత్రంతో పాటు మెడల్ అందించారు. -
విద్యుత్ వ్యవస్థ రక్షణకు చర్యలు
హన్మకొండ: విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్ సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి సబ్స్టేషన్లో నిర్మాణ సమయంలోనే లైటర్నింగ్ అరెస్టర్లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు రక్షణ ఉంటుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పొడవాటి విద్యుత్ లైన్లలో మొత్తం 2,337 లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్లో 95, వరంగల్ సర్కిల్లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్లో 52, మహబూబాబాద్ సర్కిల్లో 38, ఖమ్మం సర్కిల్లో 248, భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్లో 182, కరీంనగర్ సర్కిల్లో 281, జగిత్యాలలో 161, పెద్దపల్లిలో 211, నిజామాబాద్లో 328, కామారెడ్డిలో 59, అదిలాబాద్లో 89, నిర్మల్లో 84, మంచిర్యాలలో 218, ఆసిఫాబాద్ సర్కిల్లో 159 లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. ఎలా పనిచేస్తుందంటే.. లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, స్విచ్గేర్ పరికరాలు, ఇతర విద్యుత్ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. మెరుపు కారణంగా కలిగే బ్రేక్డౌన్లు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. విద్యుత్ వ్యవస్థ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే సుదూరంగా ఉండే విద్యుత్లైన్లలో లైటర్నింగ్ అరెస్టర్లు చేశాం. విని యోగదారులు కూడా వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలి. మెరు పు సమయంలో అనవసరంగా విద్యుత్ పరికరాల ను తాకకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. –టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఉరుములు, మెరుపులనుంచి రక్షణకు నిరోధకాల బిగింపు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,337 లైటర్నింగ్ అరెస్టర్ల ఏర్పాటు -
జీపీ కార్మికుల వేతనాలు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ వెంకటాపురం(ఎం): గ్రామపంచాయతీ కార్మికుల 6 నెలల పెండింగ్ వేతనాలతో పాటు, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని పాలకుర్తి సురేశ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీపీ కార్మికులకు వ్యతిరేకమైన జీవో నంబర్ 51 సవరించడంతో పాటు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. అనంతరం యూనియన్ మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సురేశ్, ప్రధాన కార్యదర్శిగా ఓదెలు, కోశాధికారిగా స్వామి, ఉపాధ్యక్షుడిగా సాంబయ్య, సత్యపాల్ రెడ్డి, రమేశ్, సహాయ కార్యదర్శులుగా నవాబు, కవిత, రాజయ్య తదితరులను ఎన్నుకున్నారు. -
ముందుచూపేది?
రామన్నగూడెం వద్ద చుక్క నీరు లేకుండా ఉన్న పుష్కరఘాట్ రాంనగర్ వద్ద ఒడ్డుకు దగ్గరలో ఉన్న గోదావరి నీరు ఏటూరునాగారం: వచ్చే ఏడాది జూన్ 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులు పుణ్యస్నానాలు చేసే విధంగా ఘాట్ల నిర్మాణంతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి అవసరం ఉంది. 2015లో చోటుచేసుకున్న తప్పిదాలు పునరావృతం కాకుండా ఇప్పటికై నా ముందుచూపుతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఏజెన్సీలోని వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ప్రవహిస్తోంది. 2027 జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో 2015లో వచ్చిన గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 6 కోట్ల నిధులతో ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట, రామన్నగూడెం వద్ద పుష్కరఘాట్లను ఇరిగేషన్ అధికారులు నిర్మించారు. అలాగే మంగపేట మండల కేంద్రంలో మరో ఘాట్ నిర్మించారు. అధికారులు ఎస్టిమేట్ వేసి నిర్మించిన ఘాట్ల వద్ద గోదావరి ప్రవాహం లేక పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో జల్లుస్నానాలు చేశారు. గోదావరి పుష్కరాలకు పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి జల్లు స్నానాలు చేసిన భక్తులు బీఆర్ఎస్ మంత్రులు, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక రైతులు, వ్యవసాయ దారులు ట్రాక్టర్ల ద్వారా కిలో మీటర్ దూరంలో ప్రవహించే గోదావరికి భక్తులను తరలించి పుణ్యస్నానాలు చేసేలా సహకరించారు. గోదావరి ఒడ్డున ఇన్ఫిల్టర్ బావులు నిర్మించి మోటార్ల ద్వారా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేసినా కొంతమంది ట్రాక్టర్లలో గోదావరికి వెళ్లి స్నానాలు చేశారు. ఈ ప్రాంతాల్లో ఘాట్లు నిర్మిస్తే ఉపయోగం ఇటీవల కలెక్టర్ టీఎస్.దివాకరతో పాటు అధికారులు జిల్లాలోని పుష్కరఘాట్ల నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కానీ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం చేపట్టాలనే ఆలోచన చేయలేదని స్థానికుల ద్వారా తెలుస్తుంది. వాజేడు మండలం పూసూరు రేవు, ఎడ్జర్లపల్లి రేవు వద్ద నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఘాట్లను నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ముళ్లకట్టకు కిలోమీటర్న్నర దూరంలో మరో ఘాట్, రాంనగర్ వద్ద పాత పడవ రేవు వైపునకు నిర్మిస్తే భక్తులకు ఇబ్బంది ఉండదు. మంగపేట వద్ద ఇప్పుడున్న దానికి ఆనుకుని మరో ఘాట్ నిర్మిస్తే భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు సులువుగా ఉంటుంది. 2015 నాటి పాఠాలు నేర్వని అధికారులు నీరులేక జల్లు స్నానాలు చేసిన భక్తులు 2027 పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విన్నపం నీరు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఘాట్లు నిర్మించాలని వేడుకోలు వచ్చే ఏడాదిలో జరగబోయే పుష్కరాలకు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు రూ.4 కోట్లతో 50మీటర్ల పుష్కరఘాట్ కాంక్రీట్తో నిర్మించేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతి పాదనలు సిద్ధం చేసింది. గోదావరి వరద ఘా ట్కు దూరంగా ఉంటే పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమా దం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గోదా వరి ప్రవహించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఘాట్లను నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు అధికారులు, నాయకులను కోరుతున్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేస్తున్న మంత్రి సీతక్క సర్పంచ్ను సన్మానిస్తున్న మంత్రులు సీతక్క, పొంగులేటిఏటూరునాగారం: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ దివాకరతో కలిసి కొండాయి గ్రామానికి చెందిన 90మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటే ఇంటి నిర్మాణానికి తక్షణమే లక్ష రూపాయల రుణం అందుతుందని వివరించారు. అలాగే కొండాయి గ్రామానికి వెళ్లే దారిలోని జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జిని రూ.16 కోట్లతో మంజూరు చేయించి నిర్మాణం పనులు చేపట్టామన్నారు. కొండాయి గ్రామం జంపన్నవాగు పరీవాహక ప్రాంతంలో ఉన్నందున మంజూరైన ఇళ్లను సురక్షిత ప్రాంతంలో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సీతక్క సూచించారు. పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన 38 చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే నూతనంగా ఏర్పడిన ఆత్మకమిటీతో మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) కమిటీ పారదర్శంగా పనిచేయాలని సూచించారు. అనంతరం చైర్మన్, డైరెక్టర్లను మంత్రి సన్మానించారు. అనంతరం ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో సుమారు కోటి రూపాయలతో చేపట్టిన ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశంచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, రవాణా శాఖ స్టేట్ డైరెక్టర్ వసంతశ్రీనివాస్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, వావిలాల ఎల్లయ్య, ఎండీ అప్సర్పాషా, గౌస్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. నూతన సర్పంచ్లకు సన్మానం వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో ఆదివారం నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలెంవాగు ప్రాజెక్టు మంజూరు చేశారని తెలిపారు. ఆ ప్రాజెక్టు అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు కాల్వల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి 15వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేశామని వెల్లడించారు. వాజేడు మండల పరిధిలోని పూసూరు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కొత్తగా ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యె తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీను, నాయకులు చిడెం మోహనరావు, మన్నెం సునీల్ పాల్గొన్నారు. కొండాయి బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క


