Mulugu
-
హేమాచలక్షేత్రంలో జాతర వేలం పాటలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 6వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా కల్యాణ మండపంలో ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో జాతర వేలం పాటలను సోమవారం నిర్వహించారు. హన్మకొండ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో నెల రోజుల పాటు వివిధ రకాల షాపుల ఏర్పాటు, విక్రయాలకు అనుమతులు పొందేందుకు షీల్డ్, బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి విక్రయాలు జరిపేందుకు హుజురాబాద్కు చెందిన ఎక్కెటి రాము రూ.2,86,666 లక్షలకు దక్కించుకున్నారు. కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు నల్లగొండ జిల్లా దామరచెర్లకు చెందిన నన్నెబోయిన మల్లయ్య రూ.1,08,000 లకు దక్కించుకున్నారు. స్వామి వారికి భక్తులు సమర్పించే తలనీలాలు, పుట్టు వెంట్రుకలు పోగు చేసుకునేందుకు వరంగల్కు చెందిన సత్యనారాయణ రూ 2,25,000లు, ఫొటోలు తీసుకునేందుకు మల్లూరుకు చెందిన ముత్తయ్య రూ 5,500, చెప్పుల స్టాండ్ నర్సింహారావు రూ.6వేలకు పాడుకున్నారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల వేలం వాయిదా వేసినట్లు తెలిపారు. 2025 జాతర వేలం పాటల ఆదాయం కంటే రూ.85,166 అదనపు ఆదాయం వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, ఆలయ సిబ్బంది శేషు, అజయ్ పాల్గొన్నారు. -
సాదాబైనామా చిక్కులకు చెక్!
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఉమ్మడి వరంల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా ఫైళ్లకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్కు సిద్ధమవుతూ, జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. దీనివల్ల వేలాది మంది రైతులు, పేదలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీఓ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు ఆ జీఓపై వచ్చిన అభ్యంతరాలు, సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చినా.. భూక్రయ, విక్రయదారులు ఇద్దరి అఫిడవిట్లు, తదితర నిబంధనల కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా అఫిడవిట్ల నిబంధనలను సడలించడంతోపాటు దరఖాస్తుల పరిశీలించే పరిష్కరించే అధికారాలు పూర్తిగా ఆర్డీఓలకు ఇవ్వడంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఐదున్నరేళ్లుగా పెండింగ్లో.. సాదాబైనాల క్రమబద్ధీకరణ కోసం జీఓలు ఎన్ని తెచ్చినా దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. 2016లో జీఓనం.153, 2020లో జీఓ 112లను తీసుకువచ్చారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామాలు కలిగిన భూములను క్రమబద్ధీకరించడం.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే ఉద్దేశంతో రెండు పర్యాయాలు, ఈ రెండు జీఓలు తెచ్చారు. జీఓ నం.112పై‘పిల్’దాఖలు కావడంతో దానిని అమలు కాకుండా నిలిపివేశారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిష్కారం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, అంతకు ముందున్న మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,89,739లకు చేరింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, క్షేత్రస్థాయి పరిశీలన పేరిట తాత్సారం జరుగుతూ వచ్చింది. నిబంధనల సడలింపు, ఆర్ర్డీఓల క్షేత్రస్థాయి పరిశీలన ఉత్తర్వుల నేపథ్యంలో రైతుల దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన వాటిని పరిష్కరించనున్నారు. ‘అఫిడవిట్’ నిబంధనలు సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలు ఫాస్ట్ట్రాక్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం ఉమ్మడి వరంగల్లో 1.90 లక్షల దరఖాస్తులు 2020 నుంచి వెయిటింగ్.. ఆర్డీఓలకు కీలక అధికారాలు త్వరలోనే సాదాబైనామాలకు పరిష్కారం.. జిల్లా పెండింగ్ హనుమకొండ 27,057 వరంగల్ 26,630 ములుగు 20,150 జేఎస్ భూపాలపల్లి 51,347 జనగామ 33,305 మహబూబాబాద్ 31,250 మొత్తం 1,89,739 -
జనగణనలో రిలీజియన్ కాలం ఇవ్వాలి
● తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ ఏటూరునాగారం: జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక రిలీజియన్ కాలం ఏర్పాటు చేయాలని, కోయ భాషను 8వ షెడ్యూల్లోకి చేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏను ముట్టడించి తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని ఆదివాసీలు యాప్ ద్వారా యూరియా బస్తాలు తెచ్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏజెన్సీలో యాప్ ద్వారా కాకుండా, సాధారణ పద్ధతిలో యూరియా బస్తాలు ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పోడు భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీలో సాదాబైనామా జీవో నంబర్ 76తో ఏజెన్సీ ప్రాంత చట్టాలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. పీహెచ్సీల్లో వైద్యాధికారులను నియమించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఏపీఓ వసంతరావుకు ఆదివాసీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింత కృష్ణ, వట్టం జనార్దన్, కొమరం లక్ష్మీకాంత, చర్ప లలిత, చందా మహేశ్, కాపుల సమ్మయ్య, వట్టం సురేశ్, పొడెం నరసింహరావు, తొర్రెం సంతోశ్, లక్ష్మణ్, ఆలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు పరిష్కరించండి..
ములుగు రూరల్: ప్రజావాణి, గిరివాణి(గిరిజన దర్బార్)లో స్వీకరించిన అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి, గిరివాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు 72 అర్జీలను కలెక్టర్ టీఎస్. దివాకరకు అందజేశారు. ఈ వినతులను అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా అధికారులు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి, గిరివాణిలో 72 వినతుల రాక పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు -
పోడు రైతులపై దాడులు ఆపాలి
ఏటూరునాగారం: పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సీపీఎం మండల విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. దావూద్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారం రోజులుగా ఫారెస్ట్ అధికారులు వలస ఆదివాసీ గూడేలపై పడి దౌర్జన్యంగా సాగు భూముల్లో కందకాలు తీస్తున్నారని తెలిపారు. ఇదేమిటని నిలదీస్తే గుడిసెలు జేసీబీలతో కూలగొట్టి ఆ భూముల్ని సైతం ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు పోడు భూములపై ఉన్న శ్రద్ధ తునికాకు మోడు నరికించడంపై లేదని విమర్శించారు. 2020 నుంచి రావాల్సిన తునికాకు బోనస్ను సీపీఎం నాయకులు పోరాడి వచ్చేలా చేస్తే కూలీలకు పంచకుండా అధికారులే దండుకున్నారని మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, చిట్టిబాబు, రవి, యాకూబ్ పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య -
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహారం అందించిన 10 నెలల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం పథకాన్ని అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనం పెంచడంతో పాటు గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ పథకం పేరుతో స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు సామ ల రమ, ఆయా మండలాల మండల అధ్యక్షులు పద్మ, కమలక్క, శోభ, సరోజన, భవాని, భారతి, అమృత, రాజ్యలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ -
ముగిసిన ‘పది’ పరీక్షలు
ములుగు: జిల్లాలో నెల రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిసాయని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. రేపు(బుధవారం) ఒకేషనల్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 పరీక్ష కేంద్రాలలో 3,291 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 3,287 మంది పరీక్షలకు హాజరు కాగా నలుగురు గైర్హాజర్ అయినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేడు, రేపు ప్రజాదర్బార్ ములుగు: జిల్లాలోని ములుగు మండలం పరిధిలో నేడు రాయినిగూడెం, సర్వాపురం గ్రామాల్లో, బుధవారం మంగపేట మండలం రాజుపేట, మల్లూరు గ్రామాల్లో బుధవారం ప్రజాదర్బార్ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాయినిగూడెం గ్రామపంచాయతీలో మధ్యాహ్నం 3 గంటలకు, సర్వాపురం ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం 6 గంటలకు ప్రజాదర్భార్ ఉంటుందని వివరించారు. బుధవారం మంగపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్నం 3 గంటలకు, మల్లూరు జీపీలో సాయంత్రం 6 గంటలకు ప్రజాదర్భార్ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఇళ్లగణన పకడ్బందీగా చేపట్టాలి ములుగు: జనగణనలో భాగంగా చేపట్టనున్న ఇళ్లగణనను పకడ్బందీగా చేపట్టాలని జనగణన రాష్ట్ర సంచాలకులు భారతి హోలికేరీ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇళ్ల గణన ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. ప్రక్రియ నిర్వహణలో భాగంగా ఇళ్ల జాబితా బ్లాక్లను రూపొందించాలని తదితర సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జనగణనలో చేపట్టనున్న ఇళ్లగణన కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని తెలిపారు. రామప్పలో టీజీఎఫ్డీసీ జీఎం వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) జనరల్ మేనేజర్ జి. స్కైలాబ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వారికి వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ములుగు జిల్లా డివిజనల్ మేనేజర్ శైలజ, భూపాలపల్లి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ బి.కరుణాకర్ రావు ఉన్నారు. కొలువుదీరిన పాలకవర్గంకాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం దేవాదాయశాఖ సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈఓ శనిగెల మహేష్ ఆధ్వర్యంలో 11 మంది ధర్మకర్తలు, ఒక ఎక్స్అఫీషియో (అర్చక)తో ఆలయ చైర్మన్గా అవధాని మోహన్శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈఓ చైర్మన్తో పాటు ధర్మకర్తలను ప్రమాణస్వీకారం చేయించారు. ధర్మకర్తలుగా దొడ్ల అశోక్, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్ రావు, మంచినీళ్ల దుర్గయ్య, గందెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, జలవంచ సీతారాం, కాటం సత్తయ్య, శ్యాంసుందర్ దేవుడా, ఎక్స్ అఫీషియో మెంబర్గా దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ 12మంది సభ్యులు రెండేళ్ల కాల పరిమితితో కొలువుదీరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమ హాయంలో బృహత్తర ప్రణాళికతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సహకారంతో దేవస్థానం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతామన్నారు. -
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
ములుగు: రహదారిపై నియమనిబంధనలు పాటించి వాహనాలు నడిపితేనే సురక్షిత ప్రయాణం సాధ్యమని, రహదారి భద్రతపై వాహనదారులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్. దివాకర తెలిపారు. అరైవ్ అలైవ్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2026 పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రక్షణ – సాంకేతికతతో మార్పు అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘బీ ఏ రోడ్ సేఫ్టీ ఛాంపియన్’ అంటూ పిలుపునిస్తూ వాహనదారులందరూ రహదారి నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం అందరిని ఆందోళనకు గురి చేస్తున్న అంశమని వివరించారు. గతేడాది గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4.80 లక్షల ప్రమాదాలు జరుగగా, అందులో దాదాపు 1.70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా నేడు నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. అంబేడ్కర్ ఉత్సవ కమిటీ సభ్యులతో తన ఛాంబర్లో కలెక్టర్ మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించాలన్నారు. అక్కడి నుండి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మీదుగా కలెక్టరేట్కు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో 11:30 గంటలకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జియో కోఆర్డినేషన్లో జాగ్రత్త వహించాలి ములుగు రూరల్: రాంచంద్రాపూర్ భూముల సర్వేలో జియో కోఆర్డినేషన్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండల పరిధిలోని రాంచంద్రాపూర్ శివారు రాజేశ్వర్రావుపల్లిలో చేపడుతున్న భూ సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. సర్వే తీరు, డేటా ఎంట్రీ, జియో కోఆర్డినేషన్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
విద్యార్థుల రాస్తారోకో
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోధాపురం పాఠశాల విద్యార్థులు ఆర్అండ్బీ రోడ్డుపై సోమవారం సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బోధాపురం పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడి పడుతున్నాయని తెలిపారు. దీంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. పాఠశాలకు ఐదు తరగతులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నాడని మిగిలిన ఉపాధ్యాయులను నియమించాలిని ఆందోళన చేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణం చేపట్టడంతో పాటు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. -
గిరిజన దర్బార్లో వచ్చిన వినతుల వివరాలు
ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్తో పాటు మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం గిరివాణి(గిరిజన దర్బార్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు పాల్గొని బాధితుల నుంచి 10 వినతులు స్వీకరించారు. బాధితులు అందజేసిన వినతులు ఇలా..జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కండెల గంగయ్య, కండెల సమ్మక్క పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఏపీఓను కోరారు. మంగపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలని తొలెం నర్సింగరావు విన్నవించారు. అదే మండలానికి చెందిన సున్నం శ్రీకన్య టైలర్షాపు రుణం కావాలని విన్నవించారు. అలాగే సున్నం రాఘవరావు, శ్రీకన్యలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం క్రాస్రోడ్డు వద్ద ప్రమాదకరంగా ఉన్న కల్వర్టును తొలగించాలని కందిర్సింగ్ విన్నవించారు. మంగపేటకు చెందిన బంగారు నర్సయ్య తన కుమార్తెకు పసుపు కుంకుమల కింద భూమి ఇస్తున్నానని దానిని పట్టా చేయాలని వేడుకున్నారు. కన్నాయిగూడెం మండలానికి చెందిన ఆర్కె నాగలక్ష్మి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు. గోవిందరావుపేట మండలం సర్వాపూర్ కు చెందిన మోట్లపల్లి పూజ పట్టాదార్ పాసుపుస్తకంలో పేర్లు తప్పుగా నమోదు అయ్యాయని వాటిని సరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీడీఓ దబ్బగట్ల జనార్ధన్, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, జేడీఎం కొండల్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఫెన్సింగ్తో ఉజ్వల భవిష్యత్
ఫెన్సింగ్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. తల్లిదండ్రులు రొటీన్ క్రీడల్లో కాకుండా అత్యంత అరుదైన ఫెన్సింగ్లో శిక్షణ అందించేందుకు చొరవ చూపాలి. అంతంత మాత్రంగానే ఉన్న ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. నేటి యువతలో ఫెన్సింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, సదుపాయాలు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. – దుబ్బ రాము, కార్యదర్శి, జిల్లా ఫెన్సింగ్ సంఘం గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు చర్యలు ఆదరణ కోల్పోతున్న ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ యువతను ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం. అందుకు వేసవి సెలవుల్లో మండల కేంద్రాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – తాళ్లపెల్లి ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు, జిల్లా ఫెన్సింగ్ సంఘం -
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ధి చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ వేదికపై ప్రతిభ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది. పదేళ్లలో పది పోటీల్లో ప్రతిభ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తున్న ఓరుగల్లు యువతులు జాతీయ స్థాయిలో పతకాలు ప్రోత్సహిస్తే ఒలింపిక్స్లో రాణించే అవకాశం -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
ఔషధాలను మోతాదుకు మించి వాడొద్దు
ములుగు రూరల్: ఔషధాలను మోతాదుకు మించి వాడొద్దని, వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్రెడ్డి సూచించారు. ఈ మేరకు శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఔషధ నియంత్రణ– బలోపేతం, యాంటి నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యుల సూచనల మేరకు యాంటి బయాటిక్స్ వాడాలన్నారు. నకిలీ మందులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మందుల నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్యాకింగ్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని వివరించారు. ఫిర్యాదు చేసేందుకు నంబర్ 18005996969కు కాల్ చేయాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్పప్రభావాలను వివరించారు. నిషేధిత వస్తువుల అమ్మకాలపై టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో మత్తుకు బానిసైన వారి చికిత్స నిమిత్తం 10 బెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, డీసీహెచ్ఎస్ జగదీశ్వర్, మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మెడికల్ షాపుల యజమానులు, పార్మసిస్టులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ‘ఉపాధి పనులకు కూలీలు వచ్చేలా చూడాలి’ ఏటూరునాగారం: మండల పరిధిలోని సర్పంచ్లు వారి గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలు ఎక్కువ రోజులు పనికి వచ్చేలా చూడాలని ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈజీఎస్ పనులు గ్రామాల్లో చేసినప్పుడు కూలీలకు పనులు కల్పించడం వల్ల మెటీరియల్ నిధులు వస్తాయని వెల్లడించారు. గ్రామాల్లో చెక్డ్యామ్లు, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, వీఓ భవనాలు, స్కూల్ బాత్రూమ్లు, పాఠశాల పహరీలు, ఇంకుడు గుంతలు, కంపోస్టు యూనిట్లు, మేకల షెడ్డు, గొడ్ల, బర్లపాకలు, కోళ్ల పెంపకంతో పాటు షెడ్ల వంటి పనులు చేయించుకునే అవకాశాలున్నాయని వివరించారు. ఈజీఎస్ పనులకు కూలీలు రాకపోతే మెటీరియల్ నిధులు రాకుండా పోతాయని పేర్కొన్నారు. పనికి హాజరు కాని వారి జాబ్ కార్డులను తొలగిస్తారని తెలిపారు. అదే విధంగా గ్రామాల్లో కూలీలతో పనులు చేయించేందుకు మేట్లు కావాలని వెల్లడించారు. రాయడం, చదవడం వచ్చిన వారికి మేట్గా అవకాశం కల్పిస్తామని, ఆసక్తిగల వారు వారి వారి జీపీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి వాజేడు: బీజేపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, భద్రాచలం నియోజక వర్గ ఇన్చార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని పూసూరు వద్ద రిసార్ట్లో వాజేడు, వెంకటాపురం(కె), చర్ల మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ పని స్థాయిని బట్టి దేశం నుంచి మండల స్థాయి వరకు నిర్ణీత బృందాల సమావేశంలో పార్టీ అభ్యున్నతికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కందుల రాంకిశోర్, మండల అధ్యక్షుడు పెద్ది జగపతి బాబు, చర్ల, వెంకటాపురం(కె) మండలాల అధ్యక్షులు రాజశేఖర్, రమేశ్ నాయకులు అట్టం మమత, సీతారామరాజు, బలరాం, సుబ్బయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యం
● రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు: అమ్మ మాట – అంగన్వాడీ బాటతోనే ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించడం సాధ్యమని, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐ లవ్ ములుగు థీమ్ వద్ద పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలు చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఐసీడీఎస్ విభాగం ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తినే ఆహారంలో పోషక విలువలు తగ్గడం, కల్తీ ఆహారం, జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయస్సులోనే పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. అందుకోసమే బయట దొరికే జంక్ ఫుడ్ పిల్లలకు విషంతో సమానమని, తల్లులు తమ చేతులతో వండిన నాణ్యమైన ఆహారాన్నే పిల్లలకు అందించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు రోడ్ల మీద దొరికే ఆహారం తీసుకోవద్దన్నారు. కల్తీ లేని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. అమ్మ మాట – అంగన్వాడీ బాట అనే నినాదంతో ప్రతీ అంగన్వాడీ సెంటర్ ద్వారా నాణ్యమైన ఆహారం అందించడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్, పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను సీతక్క ప్రారంభించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డిడబ్ల్యూఓ ప్రేమలత పాల్గొన్నారు. -
అభివృద్ధి నిల్!
ఆదాయం ఫుల్..మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో అభివృద్ధి పనులు కానరావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నా అభివృద్ధి పనులు హామీలకే పరిమితం అవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 6వ తేదీ వరకు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) నిర్వహించనున్నారు. మే 1న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంతో పాటు 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్టాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయానికి ప్రతీ శని, ఆది వారాల్లో వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. 35 ఏళ్లుగా దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతున్నా ఆలయ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. బ్రహ్మోత్సవాలకు మరో 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలయానికి పాలకమండలి లేకపోవడంతో పాటు రెగ్యులర్ ఈఓను ఉన్నతాధికారులు నియమించలేదు. గడిచిన 8 నెలల కాలంలో ఇద్దరు ఈఓలను మార్చడంతో పాటు ఈఓ స్థానికంగా ఉండకపోవడంతో ఆలయ అభివృద్ధికి అడ్డుగా మారిందని భక్తులు చర్చించుకుంటున్నారు. అలాగే ఆలయంలో గత కొంతకాలంగా అర్చకుల మధ్య బేదాభిప్రాయాల విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఆలయ అభివృద్ధికి ప్రధాన ఆటకంగా తయారైందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోతకు గురైన రోడ్లు ప్రధానంగా గుట్టపైకి వెళ్లే ప్రధాన ఆర్చీ వద్ద ఇరుకుగా ఉన్న రోడ్డు వర్షాకాలంలో గుట్టపై నుంచి వచ్చే వరదల వల్ల కోతకు గురై అత్యంత ప్రమాదకరంగా మారింది. అదేవిధంగా శిఖాంజనేయ స్వామి ఆలయానికి కాలిబాటన వెళ్లే రోడ్డు వద్ద నుంచి ఆర్చీ వరకు సీసీ రోడ్డు వెంట సుమారు 50 మీటర్లకు పైగా 3 మీటర్ల వెడల్పుతో రోడ్డు కోతకు గురై అత్యంత ప్రమాదకరంగా మారింది. గతేడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు అసంపూర్తిగా చేపట్టి వదిలేయడంతో కాలిబాట వద్ద నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు అత్యంత ప్రమాదకరంగా తయారైంది. జాతర ప్రారంభం నాటికి సంవత్సరకాలంగా నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయడంతో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తారా లేదా అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల హామీలపైనే ఆశలు గత నెల 1వ తేదీన మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, పలువురు ఎమ్మెల్యేలు స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. 2027లో వచ్చే పుష్కరాల వరకు హేమాచలక్షేత్రాన్ని ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు. మంత్రుల ఆదేశాల మేరకు ప్రధాన ఆర్చీ నిర్మాణం, రోడ్డు విస్తరణ, ఆలయ ముఖ మండపం, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పార్కింగ్ స్థలాలతో పాటు తదితర అభివృద్ధి పనుల నివేదిక రూపొందించేందుకు కలెక్టర్, దేవాదాయశాఖ డీఈ రమేష్బాబు హైదరాబాద్కు చెందిన ఆర్కిటిక్ బృందం, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. అదే విధంగా బ్రహ్మోత్సవాల వరకు భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు అనుమతులు రాలేదుఈ నెల 27 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవాదాయశాఖ, ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తాం. – వీరస్వామి, ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారిహేమాచలక్షేత్రంలో కానరాని పనులు నాయకుల మాటలు హామీలకే పరిమితం ఈ నెల 27 నుంచి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రమాదకరంగా మారిన రోడ్లుహామీలకే పరిమితమైన ప్రత్యేక నిధులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి పనులు నాయకుల మాటలకే పరిమితం అవుతున్నాయని అటు భక్తులు, ఇటు స్థానికులు ఆరోపిస్తున్నారు. 2017లో అప్పటి గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మద్రాస్కు చెందిన స్థపతి వల్లినాయర్ బృందం ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ చేసిన ప్రత్యేక మాస్టర్ ప్లాన్గా ఆలయాన్ని ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించి దేవాదాయశాఖకు నివేదిస్తామని తెలిపారు. అదేవిధంగా ట్రైబల్ టూరిజం నుంచి ప్రత్యేక నిధులను కేటాయించే విధంగా కృషి చేస్తానని ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. -
ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి ఎన్నిక
ఏటూరునాగారం: భారతరాజ్యాంగ ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితిని శనివారం ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శనివారం భారత రాజ్యాంగ ఆదివాసీ హక్కుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో అన్ని ఆదివాసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చందా లింగయ్య దొర హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన సమితిని ఎన్నుకున్నట్లు వివరించారు. జిల్లా కన్వీనర్గా ఈసం యాదయ్య, కో కన్వీనర్లుగా చందా మహేశ్, కాపుల సమ్మయ్య, ఈసం రాజు, తోలం సుధాకర్, గలి సమ్మయ్య, ఇండ్ల సమ్మయ్య, నల్లబోయిన లక్ష్మణరావు తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, పోడెం బాబు, శ్రీనాధ్, పాయం సత్యనారాయణ, శ్రావణ్, రవి, వీరయ్య, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పూడికతీత.. సాగదీత!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది గడిచినా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. చెరువు సుందరీకరణ, లోతు, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం లక్ష్యంగా చేపట్టిన ఈ పనులు ఎంతకు పూర్తవకపోవడం నగరవాసులను అసహనానికి గురి చేస్తున్నాయి. తాజాగా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ ఏడాది మే వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తరచూ పరిశీలించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ధరలు తగ్గించి పనులు.. నత్తనడకన పూడికతీత.. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ సుమారు 50 ఏళ్ల తర్వాత 2025, జనవరిలో భద్రకాళి చెరువు పూడికతీతపై దృష్టి సారించింది. దీంతో చెరువులో పూడికతీత కోసం నీరంతా ఖాళీ చేశారు. అంతకుముందే పూడికతీత పనుల కోసం పంపించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం రూ.13,00,09,046లతో రెండు పనులకు నీటిపారుదలశాఖ 2025, జనవరి 5, 10 తేదీల్లో టెండర్లు పిలిచింది. ఇందులో ఒక పని చెరువులో పూడిక తవ్వడం, లోడింగ్ కోసం క్యూబిక్ మీటర్కు రూ.53 చొప్పున రూ.3,49,11,446 కేటాయించారు. అదే విధంగా క్యూబిక్ మీటరుకు రూ.162.56 చొప్పున 5.85 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తరలించేందుకు రూ.9,50,97,600లు చెల్లించేలా మరో పనికి టెండర్ పిలిచారు. మట్టి తవ్వకం, లోడింగ్ ప ని కంటే... పూడిక మట్టి తరలించే పనికి సంబంధించి గతేడాది జనవరి 17, 27 రెండు తేదీల్లో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో క్యూబిక్ మీటర్ రూ.16 2.56ల నుంచి రూ.71.83లకు తగ్గించి పనులు అప్పగించారు. అయినప్పటికీ 7.70 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసి తరలించాల్సి ఉండగా.. ఇప్పటికీ సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్లే తీశారు. ఆలస్యానికి అనేక కారణాలు.. భద్రకాళి చెరువు పూడికతీత పనులు ఏడాదిలో పూర్తి కావాల్సి ఉండగా.. నిధుల విడుదలో ఆలస్యం, యంత్రాల కొరత, సాంకేతిక సమస్యలను అధికారులు కారణాలుగా చూపుతున్నారు. భద్రకాళి చుట్టూ కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అడ్డంకులు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాది గడిచినా ఇప్పటికి 30 శాతం పనులే కాగా.. అధికారులు చెబుతున్నట్లు మే–జూన్ మాసాల నాటికి పూర్తి అనుమానమే అంటున్నారు. పూర్తిస్థాయి డీప్ డీసిల్ట్రింగ్, బండలు, చెత్త తొలగింపు, చెరువు పరిసరాల అభివృద్ధి (ఫుట్పాత్లు, గ్రీనరీ) తదితర పనులు ఎప్పటికీ పూర్తవుతాయన్న అనుమానాలు కూ డా వ్యక్తమవుతున్నాయి. గతేడాదే పూడికతీత పేరుతో చెరువును ఖాళీ చేయడం వల్ల గ్రేటర్ వరంగల్ నగరంపై తాగునీటి ప్రభావం పడింది. ఈసారి కూ డా ఆ ప్రభావం మరింతగా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘పనులు త్వరగా పూర్తి చేసి చెరువును పరిరక్షించాలి. గతేడాదిలా ఈసారి ఆ పరిస్థితి రావద్దు’ అని నగరవాసులు కోరుతున్నారు. ఏడాది గడిచినా పూర్తికాని భద్రకాళి చెరువు పూడికతీత.. మట్టి తరలింపు 14 మాసాల్లో 7.70 లక్షల క్యూబిక్ మీటర్లకు తీసింది 2 లక్షల క్యూబిక్ మీటర్లే మే నాటికి పూర్తికాకపోతే తాగునీటికి సమస్య -
నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షుడి రాక
ములుగు: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ నేడు(శనివారం) జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారని తెలిపారు. గట్టమ్మ నుంచి లీలా గార్డెన్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం లీలా గార్డెన్లో జరిగే కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతారని అశోక్ వెల్లడించారు. రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పూలే ఉత్సవాల కమిటీ కన్వీనర్గా మల్లేశ్వర్కేయూ క్యాంపస్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్గా కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్ నియమితులయ్యారు. కమిటీలో 15మంది కన్వీనర్లు ఉండగా అందులో కేయూ నుంచి మల్లేశ్వర్ ఒకరు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మల్లేశ్వర్ పూలే ఆశయ సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వాదంతో ముందుకెళ్తున్నారు. నేడు స్వామి వారి కల్యాణం రేగొండ: మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం నేడు (శనివారం) నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. కల్యాణం అనంతరం మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య అవగాహన సదస్సు భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి డిపోలో శుక్రవారం ఆర్టీసీ సిబ్బందికి ఆరో గ్య అవగాహన సదస్సు నిర్వహించారు. డిపో మేనేజర్ ఇందు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తార్నాక ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సుజిత్ ఆర్టీసీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై విలు వైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా సిబ్బందిలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 80 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు అమృత, వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ యాదగిరి, హెల్త్ వాలంటీర్ చక్రవర్తి, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాజం పాల్గొన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా హన్మకొండ: వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. వరంగల్ ములుగు రోడ్డులోని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి ఆయన డీఈలు, ఏఈలు, అకౌంట్స్ అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరా, బ్రేక్డౌన్స్, ట్రిప్పింగ్స్, బిల్లుల వసూలు, బకాయిలు ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు మూడు నెలల ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు. రెవెన్యూ వసూళ్లు వంద శాతం సాధించాలని, బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతంరెడ్డి, డీఈలు రాంబాబు, ఎస్.మల్లికార్జున్, బక్క దానయ్య, ఏఈలు అకౌంట్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
నేడు, రేపు జేఎన్ఎస్లో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నేడు, రేపు(11,12 తేదీల్లో) 11వ తెలంగాణ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 552 మంది క్రీడాకారులు, 28 మంది టెక్నికల్ అఫిషియల్స్, 20 మంది వలంటీర్లు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరగనున్న ఫెడరేషన్ కప్ జూనియర్, సీనియర్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అంతర్జిల్లాల ఓపెన్ టు ఆల్ టెన్నీస్ పోటీలు వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్ వేదికగా శని, ఆదివారాల్లో తెలంగాణ అంతర్ జిల్లాల స్థాయి ఓపెన్ టు ఆల్ టెన్నిస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయసింహరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణ హాజరై ప్రారంభిస్తారని పేర్కొన్నారు. -
అయ్యో పాపం..!
సింగరేణి సెక్యూరిటీ గార్డు నియామకాల్లో అన్యాయంప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు పరీక్షలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ అధికారులు (ఫైల్) భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం ప్రవేశపెడుతున్న నూతన టెండర్ విధానం సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్హుల ఉపాధిని దెబ్బతీసేలా ఉంది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో దాదాపు 20 ఏళ్లుగా సుమారు 1,200 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ గార్డులు పనిచేస్తూ సంస్థ ఆస్తుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యాజమాన్యం వీరి ఉపాధిని దెబ్బతీసేలా నూతన టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టెండర్ విధానాన్ని రద్దుచేయాలని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కోరుతున్నారు. సింగరేణిలో అవుట్ సోర్సింగ్ ప్రారంభమైన తొలిరోజుల్లో 2001 నుంచి నేటివరకు సింగరేణి వ్యాప్తంగా సుమారు 1,220 మంది కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులను కంపెనీ నియమించింది. వీరిలో ఆ ప్రాంతంలో ఉన్న భూ నిర్వాసితులు, వివిధ గ్రామాల ఓసీ ప్రభావిత ప్రాంతాల గ్రామాల నిరుద్యోగ యువకులు, సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ కార్మికుల వారసులు ఉన్నారు. వీరంతా సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాలలో చాలీచాలని జీతాలతో, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అందనప్పటికీ సంస్థ అభివృద్ధి కోసం విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఉన్న భూములను కంపెనీకి ఇచ్చి, కట్టుకున్న ఇళ్లు కోల్పోయి పూర్తి నిర్వాసితులుగా మారారు. వీరు సింగరేణి ఇచ్చిన ప్రైవేట్ ఉద్యోగంతో తమ బతుకు బండిని నడుపుతున్న క్రమంలో కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల స్థానంలో కొత్తగా పలు నిబంధనలు తెచ్చింది. భూనిర్వాసితులుగా సింగరేణి చే గుర్తించబడిన వారికి ఈ నూతన విధానం వలన ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే విధంగా టెండర్ విధానాన్ని యాజమాన్యం తెచ్చిందని తక్షణమే ఈ నూతన టెండర్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్నే కొనసాగించే విధంగా సవరణ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. పర్మనెంట్, కీ పోస్టుల్లో సైతం విధులు.. సింగరేణి సంస్థలో గతంలో రిటైర్డ్ ఆర్మీ అభ్యర్థులను సెక్యూరిటీ గార్డులుగా యాజమాన్యం నియామకాలు చేపట్టేది. ఆ పక్రియను నిలిపివేస్తూ అండర్ గ్రౌండ్లలో పనిచేసిన ఉద్యోగులతో సెక్యూరిటీ గార్డుల నియామకాలు చేపట్టింది. ఆ తర్వాత దానిని కొనసాగించకుండా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డుల కంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సంఖ్య గణనీయమంగా పెరిగింది. గతంలో పర్మనెంట్ కార్మికులు చేసిన పోస్టుల్లో ప్రైవేట్ వారు విధులు నిర్వహిస్తూ కంపెనీ ఆస్తులను కాపాడుతున్నారు. ఈ నియామకాల్లో ప్రభావిత ప్రాంతాల వాసులు, ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి కల్పించిన అవకాశాన్ని రద్దుచేసి, వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా యాజమాన్యం తెచ్చిన నూతన విధానాన్ని రద్దు చేయాలని వేడుకుంటున్నారు. యాజమాన్యం ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి ని తొలగించే ప్రక్రియలో భాగంగా తీసుకొచ్చి న కొత్త సర్క్యులరు వెంటనే రద్దుచేసి పాత వారికి చట్టబద్ధత హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించాలి. లేదంటే ఆందోళన చేపడతాం. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పంటపొలాలు, ఇళ్లను ధారాదత్తం చేసిన భూనిర్వాసితులకు యాజమాన్యం తెచ్చిన నూతన విధానంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. – కంపేటి రాజయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపాధిని దెబ్బతీసేలా నూతన టెండర్ విధానం నిబంధనలు మార్చాలని డిమాండ్ -
అటునుంచి అటే..!
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యంములుగు: నిరుపేదలకు సన్నబియ్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. దొడ్డుబియ్యంపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదనే కారణంతో ఏడాది క్రితం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. మొదటి మూడు, నాలుగు నెలల పాటు సన్నబియ్యంపై ఆసక్తి చూపిన లబ్ధిదారులు ప్రస్తుతం అంతగా పట్టించుకోవడంలేదని తెలుస్తుంది. దీంతో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యత లోపంతో ఉంటున్నాయని, అన్నం వండితే మెత్తగా అవ్వడమే కాకుండా బియ్యానికి తొందరగా పురుగులు పడుతున్నాయని లబ్ధిదారుల అభిప్రాయం. సన్నబియ్యంపై ఆసక్తి చూపని లబ్ధిదారులు రేషన్ షాపుల్లో వేలిముద్రలు వేస్తే డీలర్లు కిలోకు రూ.12 చొప్పున చెల్లిస్తుండడంతో నగదును తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఒకరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో నలుగురు ఉంటే 24 కిలోల బియ్యాన్ని రూ.288 చొప్పున డీలర్లకే విక్రయిస్తున్నారు. క్వింటా రూ.2800 జిల్లాలోని 10 మండలాల పరిధిలో 222 రేషన్ షాపులు ఉండగా 1.02 లక్షల కార్డుదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో 5,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏప్రిల్ నెలలో లబ్ధిదారులకు అందించనున్నారు. గత 10 రోజులుగా రేషన్ షాపుల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండగా మెజార్టీ రేషన్ షాపుల్లో బియ్యం దందా కొనసాగుతుంది. లబ్ధిదారులతో మూడుసార్లు వేలిముద్ర వేసుకొని కిలోకు రూ.12 చొప్పున చెల్లిస్తూ బియ్యాన్ని డీలర్లు తమ వద్దనే నిల్వ చేసుకుంటున్నారు. సన్నబియ్యం మార్కెట్లో రూ.5 వేల నుంచి రూ.6 వేల ధర ఉండగా రేషన్ షాపుల్లో క్వింటాకు రూ.2,800 చొప్పున బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క బస్తా 50 కిలోలు ఉండగా బస్తాకు రూ.2,400 చొప్పున విక్రయిస్తూ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదా రులకు రూ.12 చొప్పున చెల్లించి అదే బియ్యాన్ని రూ.28 కు విక్రయిస్తుండడం గమనార్హం. జిల్లాలోని రేషన్ షాపులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. మూడు నెలల కోటా ఒకేసారి ఇస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లా పౌర సరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ ఏడాదిలో రేషన్ షాపులపై పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఒక్కొక్క రేషన్ షాపు నుంచి ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేసి అధికారులకు ముడుపులు అప్పజెప్పుతున్నట్లు డీలర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకొని బ్లాక్ మార్కెట్లో సన్నబియ్యాన్ని విక్రయిస్తున్న డీలర్లపై కఠన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సన్న బియ్యం అమ్ముకుంటున్న రేషన్ డీలర్లు క్వింటా రూ.2,800 చొప్పున విక్రయం మెజార్టీ రేషన్ షాపుల్లో కొనసాగుతున్న అక్రమ దందా రేషన్ షాపులపై కరువైన అధికారుల పర్యవేక్షణ -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
మంగపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల పంటకు మద్ధతు ధర లభిస్తుందని రాష్ట్ర ఉపాధిహామీ మండలి (టీఎస్ఈజీసీ) సభ్యుడు గుమ్మడి సోమయ్య అన్నారు. మండల కేంద్రంలోని గంపోనిగూడెం మార్కెట్ యార్డు వద్ద జ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో సెర్ఫ్ ద్వారా గణనాయక గ్రామైఖ్య సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమయ్య శుక్రవారం ప్రారంభించారు. అకినేపల్లి మల్లారంలో వివేకా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ కృష్ణవేణి, డిప్యూ టీ తహసీల్దార్ విజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, కామన్ గ్రేడ్ క్వింటాకు రూ.2,369 ప్రభుత్వం మద్దతు ధర, సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రునాయక్, డీసీ ఎస్ఓ ఫజల్ హైమద్ షైనీ, డీఆర్డీఓ ఏపీడీ గొట్టె శ్రీనివాస్, డీపీఎం హెచ్ఆర్ కోటేశ్వర్రావు, డీపీఎం దేవానంద్, సీ్త్రనిధి ఆర్ఎం అశోక్, ఏపీఎం సత్యనారాయణరెడ్డి, మిర్చీ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యు డు నాసిరెడ్డి సాంబశివరెడ్డి సీసీలు, వీఓ లీడర్లు, మహిళా పొదుపు సంఘాల లీడర్లు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క ప్రజా దర్బార్లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఎస్ఎస్తాడ్వాయి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి సొంతిల్లు కట్టించి అంకంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అంకంపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంతోపాటు ఆర్అండ్బీ రోడ్డు నుంచి అంకంపల్లి వరకు రూ.83 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ పేద కుటుంబానికి సొంతల్లు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఆ కల సాకారమవుతుందన్నారు. గ్రామీణ జీవనోపాధికి బొంగు చికెన్, ఇప్ప పువ్వు వంటి స్థానిక వనరులను ఆదాయ మార్గాలుగా మలుచుకోవాలన్నారు. అర్హులైన ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అదే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సీతక్క.. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, మౌలిక సదుపాయాలపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు. గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, సర్పంచులు బడే రజిత, వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర మాజీ చైర్మన్ లచ్చుపటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి సునీల్, మండల ఉపాధ్యక్షుడు నాగేశ్వర్రావు, నార్లాపూర్ సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ భాస్కర్రెడ్డి ఉన్నారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ములుగు: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, రోజువారీ జీవనశైలిలో యోగా ను ఒక భాగంగా అలవర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రపంచ హోమియోపతి (ఆయుష్ డే) దినోత్సవానికి సీతక్క హాజరయ్యారు. కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతీ రోజు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు యోగా చేయడం ద్వారా శరీరం, మెదడు చురుకుగా పనిచేస్తాయని తెలిపారు. పురా తన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా మా త్రమే మనిషి తన ఆశలను, ఆశయాలను, ఉన్నత లక్ష్యాలను చేరుకుంటాడని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులు, ఆయుష్ సి బ్బంది, క్రీడాకారులు, క్రీడాభిమానులతో కలిసి యోగాసనాలు వేసి అందరిని ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, కౌన్సి లర్లు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాంవెంకటాపురం(కె): అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కంకలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు, పాలెం, చొక్కాల, వెంకటాపురం మండలకేంద్రంలో సీసీ రోడ్లు, రాచపల్లి పంచాయతీ మొట్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర, తహసీల్దార్ వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంకంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం -
యువ విలాపం!
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారుల్లో నిరాశములుగు రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కానీ అమలు చేయడంలో మాత్రం జాప్యం చేస్తోంది. జూన్ 2న పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో హడావిడిగా నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్ౖ లె న్లో స్వీకరించారు. నేటికి పది నెలలు గడిచినా పథకం అమలు తీరుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ చెందుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు యువకులు దరఖాస్తులు అందించారు. జిల్లా స్థాయిలో ఎంపీడీఓలు లబ్ధిదారులకు బ్యాంకుల ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూలు నిర్వహించారు. మంజూరు పత్రాలు ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం తాత్కలికంగా వాయిదా వేయడంతో స్వయం ఉపాధి ఊసేలేకుండాపోయింది. జిల్లాలో 3,005 మంది దరఖాస్తులు ములుగు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 3,005 మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ 608 మంది, ఎస్టీ కార్పొరేషన్ 1,200, మైనార్టీ కార్పొరేషన్ 96, క్రిస్టియన్ మైనార్టీ–1, బీసీ కార్పొరేషన్ 817, ఈబీసీ వెల్ఫేర్ 67, వాషర్మ్యాన్ కార్పొరేషన్ సొసైటీ –11, నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ సొసైటీ–3, వడ్డెర కో–ఆపరేటివ్ సొసైటీ–1, సగార కో–ఆపరేటివ్ సొసైటీ–1, కృష్ణ బాలాజీ కో– ఆపరేటివ్ సొసైటీ–02, కమ్మరి శాలివాహన కో–ఆపరేటివ్ సొసైటీ–07, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ సొసైటీ–24, మేదర కో–ఆపరేటివ్ సొసైటీ–02, టాడీ సొసైటీ–15, గంగపుత్ర కో–ఆపరేటివ్ సొసైటి–40, పెరిక సొసైటీ–32, ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ –21, మున్నురుకాపు కో–ఆపరేటివ్ సొసైటీ–28, గొల్ల కురుమ కో–ఆపరేటివ్ సొసైటీ–29 ద్వారా దరఖాస్తులు అందించారు. ఊసు లేని స్వయం ఉపాధి జిల్లాలో 3,005 దరఖాస్తులు బ్యాంకుల ఎంపిక, ఇంటర్వ్యూలు పూర్తి పది నెలలు గడిచినా అమలు కాని పథకంరాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని కేటగిరీల వారీగా విభజించి విడతల వారీగా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేటగిరి–1లో 50 వేలు, కేటగిరి–2లో 1 లక్ష వరకు ఉన్న యూనిట్లను ఎంపిక చేసి మొదటి విడతలో అందించాలి. కేటగిరి–3 లో రెండు లక్షలు, కేటగిరి–4లో 4 లక్షలు, కేటగిరి–5 5లక్షలకంటే పైబడిన యూనిట్లను పరిగణిస్తున్నారు. -
నేడు ప్రజాదర్బార్
వెంకటాపురం(కె): వెంకటాపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతారన్నారు. వెంకటాపురం, వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాలకు చెందిన ఫిర్యాదుదారులు తమ స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల సంబంధించిన విన్నపాలు అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాదర్బార్కు వచ్చే అర్జీదారులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారును ఆదేశించారు. ఎస్పీ, డీఎఫ్ఓ, ఆర్డీఓ, అన్ని శాఖల జిల్లా అధికారులు ఐటీడీఏ ఏటూరునాగారం కార్యాలయ అధికారులు సంబంధిత తాహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. తైబజార్ వేలం ఆదాయం రూ.10.85 లక్షలు ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధి తైబజార్ బహిరంగ వేలంలో రూ.10.85 లక్షల ఆదాయం సమకూరినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో ముగ్గురు పాల్గొనగా.. సాజిద్ తైబజార్ను దక్కించుకున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఈ వేలం వర్తిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహీన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సెక్షన్ క్లర్క్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు టీఎన్జీఓ నాయకుల శుభాకాంక్షలు ములుగు రూరల్: ములుగు కలెక్టర్ టీఎస్ దివాకరకు టీఎన్జీఓ సంఘం నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు గురువారం సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు పోలు రాజు ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించి శాలువాతో కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేడిపల్లి చైతన్య, ఉదయ్కుమార్, కుమారస్వామి, ప్రదీప్, పిట్టల రవి, రాంగోపాల్, మహేందర్, శ్రీవాణి, తేజస్విని, సరంసింగ్, రమాదేవి, సుప్రియ, స్నేహ, అనూష, స్రవంతి, రవీందర్, వీరస్వామి, యశ్వంత్, నాగార్జున, రాజేశ్ నరేశ్, తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలిటీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజునాయక్ వెంకటాపురం(ఎం): ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర రాజునాయక్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండలంలోని బుర్గుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజన విరామం సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ వంటి కీలక అంశాలు సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు రమేశ్బాబు, సురేఖ, శరత్ బాబు, దయాకర్, జవహర్ లాల్, జాను, రాజు తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనలో వీసీపీసీలు కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో వీలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (వీసీపీసీల) పాత్ర కీలకమని జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన బాలల పరిరక్షణ, బాల వివాహాల నిర్మూలనపై చెల్పాక, చిన్నబోయినపల్లి సెక్టార్లలోని అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు డీడబ్ల్యూఓ హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణలో వీసీపీసీ(వీలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) పాత్ర కీలకమని, ప్రతీ నెలా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు పుష్పావతి, వసంత, పోషణ్ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ ఇమ్మాన్యూఝెల్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమ అధికారి ఈపీ.ప్రేమలత -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
వెంకటాపురం(ఎం): ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎంఎస్పీ ములుగు జిల్లా కార్యదర్శి కాడపాక శ్యాం ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని ఈజీఎస్ నర్సరీ వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా శ్యాం మాట్లాడుతూ.. మూడు నెలలుగా పని చేస్తున్నా.. కూలి డబ్బులివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, వెంటనే కూలీల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూకంటి పుష్ప, పోలోజు శ్రీవాణి, ల్యాగల సమ్మక్క, గుర్రం రాణి, వనం మమత, పల్లెబోయిన ప్రమీల, గండి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె నోటీసు అందజేత
భూపాలపల్లి అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఈ నెల 12నుంచి సమ్మె చేయనున్నట్లు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (ఎన్సీకేయూస్) ఆధ్వర్యంలో కార్మికులు సింగరేణి అధికారులకు గురువారం సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ ప్రాథమిక సదుపాయాలు అందించడం లేదని ఆరోపించారు. పలుమార్లు సమస్యలు విన్నవించినా పరిష్కారం లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి నోటీసు ప్రకారం సమ్మె ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య, నాయకులు, కార్మికులు స్వామి, సుధాకర్, సంపత్, మల్లయ్య, సదానందం, మధునయ్య, లక్ష్మి, రవి, రఘుపతి, రవి పాల్గొన్నారు. -
13 నుంచి ‘అరైవ్–అలైవ్’
ములుగు: ఈనెల 13వ తేదీ నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పిలుపునిచ్చారు. గురువారం డీజీపీ శివధర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం) క్రిస్టినా చోంగ్తూ, సెక్రటరీ (ప్లానింగ్) గౌరవ్ ఉప్పల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఐపీఆర్ ప్రియాంకతో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు నుంచి కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్జీ పాల్గొన్నారు. వీసీలో సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తరచూ నిర్వహిస్తూ ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. జిల్లాలో వారం రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు -
కందకాలు తవ్వడం ఆపేయాలి
ఏటూరునాగారం: గొత్తికోయ గూడేల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్లు తీయడం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.దావూద్ హెచ్చరించారు. గురువారం మండలంలోని గొత్తికోయ గుడేలకు చెందిన గొత్తికోయలు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఐటీడీఏలోని ఎస్డీసీ గంట ప్రతాప్, డీడీ దబ్బకట్ల జనార్దన్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఐటీడీఏ నుంచి సబ్ డీఎఫ్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడ కూడా ధర్నా నిర్వహించి ఫారెస్ట్ రేంజర్ ట్రైనింగ్ ఐఎఫ్ఎస్ ప్రతిమిష్ కేశవ, డీఆర్ఓ అప్సరున్నిసా బేగంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్, డీఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి ధర్నా విరమించారు. కార్యక్రమంలో టీఎల్ రవి, మండల కమిటీ సభ్యుడు తోలెం కృష్ణయ్య, మండల నాయకులు సమ్మయ్య సురేశ్, దేవయ్య, జోగయ్యతో పాటు 60 మంది పాల్గొన్నారు. -
ఇసుక పంపిణీలో పారదర్శకత
ములుగు: జిల్లాలోని 10 మండలాల్లో గురువారం నుంచి ‘మన ఇసుక వాహనం‘ అమలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వం ఇసుకను పారదర్శకంగా తక్కువ ధరకే అందిస్తోందని తెలిపారు. ఇసుక కావాల్సిన వారు టీఎస్ఎంఐవీ.సీజీజీ.జీఓవి.ఐఎన్ వెబ్సైట్ నుంచి వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభం యాసంగి (రబీ) 2025–26 సీజన్ కోసం కలెక్టరేట్లోని సివిల్ సప్లై కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ను గురువారం కలెక్టర్ దివాకర టీఎస్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం, రవాణా, మద్దతు ధర ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు రైతులకు కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుందని, ఫిర్యాదుల కోసం 93474 16178 నంబర్ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఆర్డీఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏడీ మైన్స్ జయరాజు, పీడీ హౌసింగ్ సూర్యనారాయణ, సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, టెలికాం సంస్థల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల కోసం జరిగే తవ్వకాల్లో భాగంగా టెలికాం, టీ ఫైబర్ కేబుల్స్ రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఐటీఎస్ డిప్యూటీ డైరెక్టర్ భాస్కరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా టెలికాం కమిటీ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ‘మన ఇసుక వాహనం‘ అమలు కలెక్టర్ దివాకర టీఎస్ -
20 నుంచి ‘టాస్’ పరీక్షలు
ములుగు: ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టాస్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ములుగులో 4 పరీక్ష కేంద్రాలు, ఏటూరునాగారంలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు సమయానికి పూర్తిచేయాలని సూచించారు. ఆర్డీఓ వెంకటేశ్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, డీఎస్పీ కిశోర్, డీపీఓ వెంకయ్య, డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ ఆనందం, ఆర్టీఓ శ్రీనివాస్, ఏసీజీఈ వినోద్కుమార్ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
ట్రెంచ్లో పడి ఆవు మృతి
ఏటూరునాగారం: మండలంలోని గంటలకుంట అటవీ సమీపంలోని గొత్తికోయగూడేల్లో అటవీశాఖ అధికారులు తీసిన ట్రెంచ్లో పడి గురువారం ఒక ఆవు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు గోతులు తీయడంతోనే ఆవు మృతి చెందిందని గొత్తికోయ గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఏటూరునాగారం: గ్రామంలోని ప్రజలు విద్యుత్ను వృథా చేయకుండా ఆదా చేయాలని ఏటూరునాగారం విద్యుత్శాఖ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి పురుషోత్తం అన్నారు. గురువారం మండల పరిధి 12వ వార్డులో ప్రజల సమస్యపై విద్యుత్ ప్రజా బాట కార్యక్రమాన్ని వార్డు సభ్యురాలు కొయిల కృష్ణవేణి ఆధ్వర్యంలో చేపట్టారు. అనంతరం డీఈ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు వార్డు పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఈ స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ కొండా సమ్మయ్య, బీఆర్ఎస్ నాయకుడు కాళ్ల రామకృష్ణ, సిబ్బంది అమర్, సతీశ్, పాల్గొన్నారు. -
గోవులు తరలిస్తున్న వాహనాల పట్టివేత
వాజేడు: మండలంలోని మండపాక వద్ద 163వ నంబర్ జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న నాలుగు బొలేరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల సతీశ్ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల సంతలో గోవులను కొని నాలుగు బొలేరో వాహనాల్లో వరంగల్ మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మండపాక వద్ద జాతీయ రహదారిపై కాపు కాశారు. అటుగా వచ్చిన బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేశారు వాటిలో 32 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పశువులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు భూపాలపల్లి జిల్లాలోని రాంపూర్ గోశాలకు గోవులను తరలించారు. పశువులను అక్రమంగా తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని ఎస్సై సతీశ్ హెచ్చరించారు.32 ఆవులు గోశాలకు తరలింపు -
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
మంగపేట: మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. వేసవిలో భూగర్భ జలాలు పడిపోవడంతో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఎంపీడీఓ భద్రునాయక్తో కలిసి బుధవారం డీపీఓ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో తాగునీటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమస్య ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతీ గ్రామంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా ఉపాధిహామీ పనులు చేసే ప్రదేశాల్లో కూలీలకు షెడ్నెట్స్ ఏర్పాటు చేసి నీడ, తాగునీటి వసతి కల్పించాలన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మినరల్ వాటర్ ప్లాంట్ల ట్రేడ్ లైసెన్స్లు పరిశీలించాలన్నారు, నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో లాడ్జీలు, దాబాలు, ఇతర వ్యాపారాలు నిర్వహించే ప్రతీ షాపునకు నిబంధనల ప్రకారం లైసెన్సు జారీ చేసి 100 శాతం పన్ను వసూలు చేయాలన్నారు. పలు జీపీలకు పంచాయతీల పరిపాలనపై అవగాహన లేని వారిని ప్రత్యేక అధికారులుగా నియమించగా నిర్వహణను వారు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి స్థానంలో మండల స్థాయి, గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించాలని కార్యదర్శులు డీపీఓను కోరారు. అనంతరం డీపీఓ ఎంపీడీఓ భద్రునాయక్తో కలిసి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. పరీక్షలు ఎలా రాశారని అడిగి తెలుసుకున్నారు. అలాగే మెనూపై ఆరా తీసి స్పెషలాఫీసర్ భాగ్యలక్ష్మికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కిశోర్, కేజీబీవీ ఉపాధ్యాయులు ఉన్నారు.జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య -
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి విజయన్కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని మతిభ్రమించి మాట్లాడటం సరికాదన్నారు. కేరళ రాష్ట్రంలో విద్యారంగానికి 24 శాతం బడ్జెట్ కేటాయిస్తుందని తెలిపారు. అదే మన రాష్ట్రంలో 8శాతం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రూ.2500, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, కొర్ర రాజు, ప్రవీణ్, సద్దాం హుస్సేన్, రవీందర్, చంటి, రూప్సింగ్, పాణి, భరత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాంబశివ -
ఆదివాసీ గూడేలపై దాడులు ఆపాలి
ఏటూరునాగారం: ఛత్తీస్గఢ్ నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి అడవిలో జీవిస్తున్న వలస ఆదివాసీలపై అటవీశాఖ చేస్తున్న దాడులను వెంటనే నిలిపేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి.దావూద్ అన్నారు. మండలంలోని గంటల గుంటలో గొత్తికోయలు, ఆదివాసీలతో బుధవారం నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా అడవిలో జీవిస్తున్న గొత్తికోయలపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దాడులు అనేకంగా ఉన్నాయని తెలిపారు. అటవీశాఖ అధికారులు భూముల చుట్టూ, భూముల్లో కందకాలు తీయడంతో మూగజీవాలు అందులో పడి మృతి చెందుతున్నాయని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీతక్క ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి పోడు వ్యవసాయదారులకు కొత్తది నరకేది లేదు.. పాతది వదిలిపెట్టేది లేదని చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో మంత్రిగా ఉండి ఫారెస్టు అధికారులు ట్రెంచ్లు కొడుతుంటే చూస్తుండడం సరికాదన్నారు. గూడెంను సీపీఎం నాయకులు సందర్శించినప్పుడు ఓ ఆవు కందకంలో కాళ్లు పైకి తల కిందకు పడి కొట్టుమిట్టాడుతుందని తెలిపారు. ఆ సమయంలో ఆవుని ఆ గూడెం ప్రజలు కాపాడారన్నారు. ట్రెంచ్లు ఆపకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో రవి, సమ్మయ్య, జోగయ్య, సురేశ్, నగేశ్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దావూద్ -
లబ్ధిదారులకు భరోసా
గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బ్యాంక్ రుణాలు● 4,310 మందికి అందించేందుకు కార్యాచరణ ● 2,189 మందికి అందజేతఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు గ్రామీణాభివృద్ధి(సెర్ప్) సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇళ్లులేని పేద కుటుంబాలకు చెందిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా పెట్టుబడికి బ్యాంకు రుణాన్ని సెర్ప్ ద్వారా ఇచ్చేలా పథకాన్ని రూపకల్పన చేశారు. పేద ప్రజలు ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని ముందుగా డబ్బు పెట్టి కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మహిళా సంఘాల్లో సభ్యులై ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మహిళా సంఘాల్లో సభ్యులై ఉండి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను 4,310 మందిని అధికారులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు 2,189 మందికి రూ.22.87 కోట్ల నగదును బ్యాంకు ద్వారా అందజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చొరవతో ప్రత్యేకంగా లబ్ధిదారులకు రుణాలను అందించడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణాన్ని కిస్తీల వారీగా నెలనెలా బ్యాంక్లో చెల్లించాలి. ముందుగా లబ్ధిదారుల నుంచి వడ్డీ, అసలు కలిపి కిస్తీ చెల్లించగా మళ్లీ లబ్ధిదారులకు వడ్డీ సెర్ప్ నుంచి తిరిగి వారి ఖాతాల్లోనే జమ కానుంది. అందువల్లనే దీనిని వడ్డీలేని రుణంగా భావించాలని అధికారులు చెబుతున్నారు. నూతన నిబంధనలు ఇలా.. ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తుంది. ఇది బాగానే ఉంది. కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరులుగా అధికారులు విభజించారు. ప్రస్తుతం ఎల్–1 కేటగిరిలో ఉన్న వారి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొదటి, రెండు, నాలుగు విడతలు మినహా మిగిలిన మూడో విడత బిల్లు చెల్లింపులో ఈ మార్పులు చేసింది. ఈ విడతలో బిల్లులను వీబీ జీరామ్జీ పథకానికి అనుసంధానం చేశారు. జాబ్కార్డు కలిగి ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించి ఆ వేతనం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పునాది పూర్తి చేస్తే రూ.1 లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మరో రూ.1 లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.1.40 లక్షలు ఇవ్వగా పనిపూర్తి అయిన తర్వాత రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4.40 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే మూడో దశలో స్లాబ్ వేసిన తర్వాత ఉపాధి హామీ కింద రోజుకు రూ. 307ల చొప్పున 90 రోజులకు రూ. 27,630లు చెల్లించనున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద బాత్రూమ్ నిర్మించుకుంటే రూ.12వేలు, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ కింద మరో రూ. 21 వేల చొప్పున మొత్తం రూ. 60 వేలను లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లలో జమ చేసేలా ఈ పథకంలో మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లులేని అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయంగా అందిస్తోంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తుంది. పునాది, గోడలు, స్లాబ్, పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. పునాది దశలో రూ. 1 లక్ష, గోడల నిర్మాణం పూర్తి అయిన తర్వాత రూ. 1 లక్ష, స్లాబ్ దశలో రూ.1.40 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తం ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత చెల్లిస్తుంది. ఇదిలా ఉంటే స్థలం లేని వారికి రూ.5 లక్షల సాయంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించడంతో నిరుపేదల సొంతింటి కళ సాకారం అవుతుందని పేద ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన విద్యాబోధన
● జిల్లా సంక్షేమశాఖ అధికారి ప్రేమలత ఎస్ఎస్తాడ్వాయి: అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి ప్రేమలత తెలిపారు. పీఅండ్జీ ప్రథమ్ ఆధ్వర్యంలో పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమాన్ని మండల పరిధిలోని పంబాపూర్ సెక్టార్ పరిధిలో గల దామెరవాయి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. అంగన్వాడీ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పని చేస్తున్నాయన్నారు. పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల పిల్లల వరకు ఉండే వెయ్యి రోజుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ప్రథమ్ మాస్టర్ బండారి అనిల్ పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించారు. 65 మంది పిల్లలు ఆటలు, పాటలు, కథలు, సంభాషణ, పూర్వ గణిత భావనలు, ఫ్రీ స్కూల్ వస్తువుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు డీడబ్ల్యూఓ ప్రేమలత, సర్పంచ్ వట్టం తిరుపతి చేతుల మీదుగా ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నితీష్, రాజేందర్, ఉప సర్పంచ్ నగేశ్, టీచర్లు సావిత్రి, అమృత, నిర్మల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఛత్తీస్గఢ్ ధాన్యం రాకుండా చర్యలు
వాజేడు: ఛత్తీస్గఢ్ నుంచి ధాన్యం తెలంగాణకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు గ్రామం వద్ద 163వ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని బుధవారం ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్జీ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుంచి మన రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా అధికారులు నిరంతరం విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై పక్కాగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కృష్ణవేణి, సివిల్ సప్లయీస్ అధికారి సయ్యద్ షా ఫైజల్ హుస్సేన్, తహసీల్దార్ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీటీ విజయ్ కుమార్, వాజేడు డీటీ రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
లబ్ధిదారులకు చేయూత
జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 2,189 మంది లబ్ధిదారులకు రూ. 22.87 కోట్ల రుణం అందజేశాం. ఇంకా అందజేయాల్సి ఉంది. బ్యాంకు అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు కావాల్సిన రుణం ఇప్పించడంలో సెర్ప్ సిబ్బంది ప్రత్యేక భూమిక పోషిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా గ్రూపు సభ్యుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి వారికి వెన్నుదన్నుగా ఉంటాం. ఈ ప్రక్రియ నిరంతరమైంది. లబ్ధిదారులు ఎవరైనా రుణం కావాలంటే మండల సమాఖ్య కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించాలి. – శ్రీనివాస్, డీఆర్డీఓ పీడీ -
పెండింగ్ మెస్ బిల్లులు విడుదల చేయాలి
● ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ ములుగు రూరల్: పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు హస్టళ్లలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి కాస్మోటిక్ బిల్లులు చెల్లికపోవడం బాధాకరమని తెలిపారు. మెస్ బిల్లుల పెండింగ్ కారణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ మెస్, కాస్మోటిక్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోకిల బాలు, రాకేష్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అంకితభావంతో పనిచేయాలి’
వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, వైద్యాధికారులు విధుల్లో అంకిత భావంతో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా సూపరింటెండెంట్ కాలకుర్తి జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గర్భనిరోధక చట్టం, తల్లి, శిశు సంరక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలన్నారు. డెలివరీలకు ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లో లింగ నిర్ధరణ పరీక్షలు చేయరాదని హెచ్చరించారు. అనంతరం వైద్యశాలలోని వైద్యులు, సిబ్బందితో కలిపి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ సురేశ్కుమార్, వైద్యాధికారులు ప్రవిద్, ప్రదీప్, శివాజీ, సిబ్బంది శాంతకుమారి, ఉషా, వరలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
ములుగు: ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యమని, శాస్త్ర విజ్ఞానంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఆరోగ్య అవగాహన ర్యాలీని కలెక్టర్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆరోగ్యం కోసం కలిసి, శాస్త్రానికి మద్దతుగా నిలబడండి (టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్) అనే థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, పోషకాహారము మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. దుర అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటు ఆరోగ్య సూత్రాలను పాటించాలని ప్రజలకు సూచించారు. అపోహలు, మూఢ నమ్మకాలకు నమ్మవద్దని వెల్లడించారు. శాస్త్రపరమైన అవగాహనతో ముందుకు సాగితేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వెల్లడించారు. అనంతరం డీఎంహెచ్ఓ గోపాల్ రావు మాట్లాడుతూ ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా సాంస్కృతిక కళాజాతా బృందం ఆరోగ్య సూత్రాల మీద పాటలు పాడుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ జగదీశ్వర్, ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, నాగఅన్వేష్, మున్సిపాలిటీ కమిషనర్ రమేశ్, మాస్ మీడియా అధికారి సంపత్, ప్రోగ్రాం మానిటరింగ్ సూపర్వైజర్లు వెంకట్ రెడ్డి, సురేశ్బాబు, ఫార్మసీ జిల్లా స్టోర్ ఇన్చార్జ్ వినోదర్, హెచ్ఇ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ దివాకర తనిఖీ చేశారు. గోదాంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరును, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగిషర్ను, ఇతర అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తగిన సూచనలు అందజేశారు. గోదాం వద్ద ఉన్న పోలీస్ బందోబస్తును, రిజిస్టర్లను పరిశీలించారు. భద్రత విషయంలో అలసత్వం వహించకూడదని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఈవీఎంల భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సలీం, డిటీ నితీష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, నాయకులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ములుగు
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ7● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
‘రామప్ప చరిత్ర గొప్పది’
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయం చరిత్ర ఎంతో గొప్పదని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ.నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య, తహసీల్దార్ గిరి బాబు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీస్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూ నే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీమ్తో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్ లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఎల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగత’ంపై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
ములుగు: యువత పొగాకు, గుట్కాలు, సిగరెట్లు, మద్యం తదితర మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రతిరోజూ గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. అలాగే ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, సివిల్ సర్జన్ నరేశ్, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
ఐక్య పోరాటం ఉధృతం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లు భారీ సంఖ్యలో తరలిరావడంతో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం హోరెత్తింది. ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టిజన్లుగా కన్వర్షన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. – హన్మకొండ -
రేషన్ దందా
ములుగు: బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత సన్న బియ్యం నగదు దందా జిల్లాలో బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చకపోవడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారి బియ్యం కోటాను డీలర్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలోకు రూ.12 చొప్పున లెక్కకట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. జిల్లాలో 222 రేషన్ షాపులు ఉండగా మెజార్టీ రేషన్ దుకాణాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా.. పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లి, దోశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబ్ధిదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 10 మండలాలు.. 222 దుకాణాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 222 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వేసవి కాలం దృష్ట్యా లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలలకు చెందిన బియ్యాన్ని అందిస్తున్నారు. జిల్లాలో సుమారు 1.02 లక్షల కార్డుదారులు ఉండగా 5,490 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. మూడు నెలల బియ్యానికి సంబంధించిన పంపిణీ ప్రారంభమైనప్పటికి లబ్ధిదారులు మూడు సార్లు వేలిముద్రలు వేసి రేషన్ డీలర్లకే కిలోకి రూ.12ల చొప్పున సన్నబియ్యాన్ని విక్రయిస్తున్నారు. రేషన్ షాపుల్లోనే సదరు డీలర్లు నగదును లబ్ధిదారులకు పంపిణీ చేసి సన్నబియ్యాన్ని తమ దగ్గరనే నిల్వ చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో 222 రేషన్ షాపులు ఉండగా దాదాపు 100 షాపులకు పైగా రేషన్ షాపుల్లో ఇదే దందా కొనసాగుతున్నట్లు సమాచారం. కిలో సన్నబియ్యం రూ.12కు కొనుగోలు చేస్తున్న డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని నగదు చెల్లింపు డీలర్లకు కలిసొచ్చిన మూడు నెలల కోటనిరుపేద లబ్ధిదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. రేషన్ షాపులపై నిఘా లేకపోవడం, డీలర్లు ఇచ్చే మామూళ్లకు అధికారులు అలవాటు పడడంతో రేషన్ దుకాణాల వైపు కన్నెత్తి చూసే వారే కరవయ్యారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సన్నబియ్యాన్ని నల్ల బజారుకు తరలించే రేషన్ దుకాణాలపై దాడులు నిర్వహించి డీలర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
నర్సరీ ప్రారంభం
వాజేడు: మండల పరిధిలోని మొరుమూరు గ్రామంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ సువర్ణ, డీజీపీ శివధర్రెడ్డితో కలిసి కలిసి నర్సరీని ప్రారంభించారు. కర్రెగుట్టలకు వారు వచ్చే దారిలో మంగళవారం ఆగి కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభించి పరిశీలించారు. మొక్కలను సక్రమంగా పెంచాలని సూచించారు. అనంతరం కన్జర్వేటర్ సువర్ణ ప్రగళ్లపల్లి గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన బీట్ ఆఫీసర్ భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వెంకటాపురం(కె): పేదల పక్షాన పోరాడేది సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. సమసమాజ స్థాపనకు నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. అనంతరం వ్యాపారుల వద్ద విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎస్ తాడ్వాయి : ఏజెన్సీలోని వడ్డీ వ్యాపారులు అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ గిరిజనులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని, వారి ఆగడాలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్కుమార్, జాతీయ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని లింగాలలో తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం మంగళవారం స్థానిక ఆదివాసీ రైతులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. పంట రుణాల పేరిట ఒక్కొక్క కుటుంబానికి రూ. 30 లక్షలు అప్పుగా చూపిస్తూ పలువురి నుంచి భూములను ఆక్రమించుకోవడంతో పాటు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. 1960 వ్యాపారాల చట్టం ప్రకారం ఇది రాజ్యాంగం విరుద్దమని పేర్కొన్నారు. ఇలా అక్రమ వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామంలో సైతం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు, స్థానిక ఆదివాసీ రైతులు పాల్గొన్నారు. కాళేశ్వరం: సైబర్ నేరాలపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన గ్రామస్తుల కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రాంలో భాగంగా 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. యువత బండి నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ తప్పక ధరించాలని చెప్పారు. అతివేగం ప్రమాదకరమన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంగిస్తే భారీ జరిమానాలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీర్ల చంద్రశేఖర్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పవన్కుమార్, సాయిశశాంక్ పాల్గొన్నారు. -
విద్యార్థినులు ప్రణాళికతో చదవాలి
ఏటూరునాగారం: కేజీబీవీలో చదువుకుంటున్న విద్యార్థినులు పరీక్షలకు ప్రణాళికతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని డీఈఓ ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు శ్రద్ధతో చదివి పరీక్షల్లో వందశాతం మార్కులు సాధించాలన్నారు. అనంతరం మీసేవ కేంద్రాన్ని సందర్శించి ఐటీ, ఐటీఈఎస్ వృత్తి విద్యలో భాగంగా ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఇంటర్న్షిప్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, భవిష్యత్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అనంతరం పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ శ్యామ్సుందర్రెడ్డి, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శాంపిల్ సర్వే సర్టిఫికెట్ల అందజేత మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎఫ్ఎల్ఎన్ శాంపిల్ సర్వే సర్టిఫికెట్లను డీఈఓ సిద్ధార్థరెడ్డి అందజేశారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రేణుక మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఈ సర్వేను ఎంచుకోవడం హర్షించదగిన విషయం అన్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు 53 మంది డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా వెళ్లిన విద్యార్థులను అభినందించారు. అలాగే సర్వేను అనుసరించి విద్యార్థుల్లో ఆంగ్లభాష ఉచ్చరణ, రాత నైపుణ్యాలను పరిశీలించి రిపోర్టు విద్యాశాఖకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటయ్య, అధ్యాపకులు నవీన్, జ్యోతి, ఫాతిమా, రమేశ్, భాస్కర్, సంపత్, రాజశేఖర్, జీవవేణి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.డీఈఓ సిద్ధార్థరెడ్డి -
అర్జీలు@ 92
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరివాణి(గిరిజన దర్బార్)లో పలు సమస్యలపై ప్రజలు 92 దరఖాస్తులను అందజేశారు. ఇందులో ప్రజావాణిలో 32, గిరివాణిలో 60 అర్జీలను బాధితులు కలెక్టర్కు అందజేశారు. ఈ వినతులను స్వీకరించిన కలెక్టర్ దివాకర వాటిని పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్జీ, సంపత్రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్, డీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. స్వీకరించిన కలెక్టర్ టీఎస్.దివాకర పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు -
ములుగు
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267ములుగు: ఆస్తిపన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమే్శ్ తెలిపారు. పట్టణంలో సిబ్బందితో కలిసి ఆస్తి పన్నులను ఆయన సోమవారం వసూలు చేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ గత నెల 31లోపు ఇంటి పన్ను పూర్తిగా చెల్లించిన వారికి ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వర్తిస్తుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను చెల్లించనివారు బకాయిలను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటి పన్ను పూర్తిగా చెల్లిస్తేనే రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ములుగు పట్టణ ప్రజలు 5 శాతం తగ్గింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆస్తి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. -
పింఛన్ ఇప్పించండి..
2023లో దివ్యాంగుల పింఛన్ మంజూరు కాగా గతేడాది రెన్యూవల్ కోసం సదరం క్యాంపునకు వెళ్లాను. అంగవైకల్య శాతం తక్కువగా ఉందని 25శాతం మాత్రమే ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వగా పింఛన్ తొలగించారు. ఆరు నెలలుగా రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్కు దరఖాస్తు ఇవ్వగా దివ్యాంగులకు కావాల్సిన శాతం కంటే తక్కువగా ఉందని వృద్ధాప్య పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని వివరించినట్లు తెలి పారు. ఉన్నతాధికారులు దయతలచి దివ్యాంగుల పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. – బొర్ర నర్సయ్య, కమలాపురం, మంగపేట● -
నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన జీవనం
ములుగు: నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యమవుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద సోమవారం ‘ఈట్ రైట్ వాక్’ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. తీసుకునే ఆహారం ఆరోగ్యంపై దాదాపు 90 శాతం ప్రభావం చూపుతుందన్నారు. మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని వెల్లడించారు. తినుబండారాలు, భోజనశాలలు, అల్పాహార కేంద్రాల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఎంహెచ్ఓ గోపాల్రావు, డీపీఓ వెంకయ్య, డీసీహెచ్ జగదీశ్వర్ పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
ఆడ్మిషన్లు ప్రారంభం
ఏటూరునాగారంలోని ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో అడ్మిషన్లను ప్రారంభించాం. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వారివారి సర్టిఫికెట్లతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. నూతనంగా ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కలగనుంది. విద్యార్థులకు మరింత అవకాశాన్ని కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రతీ ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. – జగన్మోహన్రెడ్డి, ఐటీఐ, ఏటీసీ ప్రిన్సిపాల్, ఏటూరునాగారం -
పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
బీరమయ్య జాతర.. తరలొచ్చిన భక్తజనం
వాజేడు: మండల పరిధిలోని లొట్టిపిట్ట గండి ప్రాంతం ఆదివారం తెల్లవారు జాము నుంచి బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. మండు టెండలో తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్టగండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో సమీప గోదావరిలో నిష్టతో స్నానాలు ఆచరించి బీరమయ్య, రేఖలమ్మలకు ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం కల్యాణం జరిపించారు. భక్తులు వివిధ వాహనాల్లో భారీగా తరలివచ్చి బీరమయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాత్రి నుంచి జాతర ప్రాంతంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. గుట్టపైన ఉన్న గుడికి చేరే సమయంలో భక్తులకు ఎండ తగలకుండా ఉండేలా నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల దాహం తీర్చడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతిఏటా బీరమయ్య జాతర సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేవారు. కాని రెండేళ్లుగా బస్సులు నడపడం లేదు. దీంతో జాతరకు వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాల్లో జాతరకు రావాల్సిన దుస్థితి నెలకొంది. లొట్టిపిట్ట గండిలో గిరిజనుల కోలాహలం దేవర్ల రాకతో మొదలైన జాతరతంతు -
‘కేన్ మొక్కలను సంరక్షించాలి’
వెంకటాపురం(ఎం): కేన్ మొక్కలను సంరక్షించాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలోని పాలంపేట గ్రామ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్ ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్లడించారు. కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్ కొట్టి చైన్ లింక్ ఫెన్సింగ్ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీష్ కోరారు. -
ఏటీసీలతో ఉపాధి
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీలు) విప్లవాత్మక మార్పులు తేనున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను పారి శ్రామిక వేత్తలు, పారిశ్రామికులుగా తీర్చిదిద్దాలని, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు నూతనంగా జిల్లాలో ఏటూరునాగారం, వాజేడు మండల కేంద్రాల్లో రెండు ఏటీసీలను ఏర్పాటు చేశారు. ఐటీఐ విద్యార్థులతో పాటు ఏటీసీలో చేరే విద్యార్థులకు ప్ర త్యేక శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి పూర్తి అయిన విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏటీసీల ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆదాయం పెరగాలంటే నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతో కీలకం. స్కిల్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. ఐటీఐల్లోని విద్యార్థులకు ఏసీటీల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా టాటా గ్రూప్ వారితో అనుసంధానం అయ్యారు. టాటా కంపెనీ నైపుణ్యం శిక్షణపై ఆసక్తితో ఉన్న విద్యార్థులకు నేర్పించేందుకు ఆరు ట్రేడ్లను ముందుకు తీసుకొచ్చింది. రూ.35 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, సామగ్రిని ఏర్పాటు చేశారు. దీనిలో ఆరు రకాలుగా శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యం కలిగిన ట్రైనర్లను ఇక్కడ నియమించారు. టాటా టెక్నాలజీ సంస్థ ట్రైనింగ్ పూర్తి చేసిన వారిని వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందస్తుగానే అగ్రిమెంట్లు చేయించుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ 38 మంది వరకు ఉద్యోగం పొందారు. విద్యార్థులకు తప్పని తిప్పలు జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్థులు ఏటీసీలో శిక్షణ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ స్థానికంగా వసతి, భోజన సౌకర్యం లేకపోవడంతో ఇక్కడికి వచ్చే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఐటీడీఏ ద్వారా ఇక్కడ మేనేజ్మెంట్ హా స్టల్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇక్కడ ఉంటూ చదువుకునే వారు. ఇప్పుడు అలాంటి అవకా శం లేక అద్దెకు ఉండలేక, భోజన వసతి లేక, తల్లి దండ్రులను వదిలి వచ్చి ఇక్కడ ఉండలేక చదువుకు దూరం అవుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఐటీడీఏ ద్వారా గిరిజన, గిరిజనేతర విద్యార్థిని, విద్యార్థులకు భోజనం, వసతి కల్పించాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు.ఏడాది కోర్సులు ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అడ్వాన్స్డ్ టూల్స్ రెండేళ్ల కోర్సులు అడ్వాన్స్డ్ సీఎన్సీ మెకానిక్ టెక్నీషియన్ బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్ జిల్లాలో రెండు కేంద్రాల ఏర్పాటు వసతి, భోజనం లేక విద్యార్థుల అవస్థలు -
టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి
కాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకవస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్, డాక్టర్ ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, ఆడెపు రవి తదితరులు పాల్గొన్నారు. -
జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
ములుగు: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, మహనీయుల ఆశయాలను పాటించడమే వారికి మనమిచ్చే గౌరవమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలకు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. జగ్జీవన్ రామ్ కార్మిక చట్టాలకు ఆద్యుడని తెలిపారు. ఆయన ప్రస్తానం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ మాట్లాడారు. భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా, అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కొమురయ్య, తహసీల్దార్ విజయ భాస్కర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆదివారం సంబంధిత విభాగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకుని వారం రోజుల పాటు ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేడు ఆహార భద్రతపై దృష్టి పెట్టి కల్తీ ఆహారం వల్ల వచ్చే జబ్బుల గురించి అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ‘ఈట్ రైట్ వాక్’ నిర్వహించాలన్నారు. 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించాలన్నారు. 8న సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. 9న ఎయిడ్స్పై అవేర్నెస్ రెడ్ రన్ వాక్ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టాలన్నారు. 10న యోగా డిమానిస్ట్రేషన్ క్యాంపు నిర్వహించాలని పేర్కొన్నారు. 11న డ్రగ్ నియంత్రణ విభాగం ద్వారా ప్రజలకు మందుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీపీఓ వెంకయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి
మల్హర్(కాటారం): కాటారం డివిజన్ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర నాయకుడు, డీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విద్యా పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం.రఘుశంకర్రెడ్డి కోరారు. మండలంలోని కాటారం స్థానిక ఆదర్శ విద్యాలయంలొ ఆదివారం కరుణాకర్ ఆధ్వర్యంలో కాటారం రెవెన్యూ డివిజన్ స్థాయి పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుశంకర్రెడ్డి మాట్లాడుతూ కాటారం డివిజన్ స్థాయిలో సుమారు 450 మంది పెన్షనర్స్, వేలాదిగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్, డేకేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలం సంఘం ప్రతినిధులు అంకమ్మ అంకన్న, శంకరయ్య, వెంకటి, ఎం.రవి శంకర్రెడ్డి, మధుసూదన్రావు, దామోదర్రెడ్డి, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
కలగానే శివగంగ
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మంగపేట: మండల పరిధిలో జిల్లా సరిహద్దు గ్రామమైన బ్రాహ్మణపల్లి వద్ద నిర్మించిన శివగంగ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయల నిధులు గంగపాలేనా అని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్రాహ్మణపల్లికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని కత్తిగూడెం గ్రామ సమీపంలో గల గోదావరి ఒడ్డున లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో బ్రాహ్మణపల్లి, కత్తిగూడెం రెవెన్యూ పరిధిలోని 1600 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.8.52 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎత్తిపోతల పథకం పనులను అప్పటి భారీనీటి పారుదలశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నవంబర్ 25న ప్రారంభించారు. నాసిరకంగా పనులు ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత ఏపీఎస్ఐడీసీ అధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో టెండర్ ద్వారా పనులు పొందిన గుత్తేదారు నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడంతో 18ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత టీఎస్ఐడీసీ అధికారులు మాత్రం పనులు మొత్తం పూర్తయ్యాయని నీటిని లిఫ్టింగ్ చేసేందుకు గోదావరిలో వరదనీరు ఒడ్డు వెంట కాకుండా మఽ ద్య నుంచి ప్రవహిస్తుండడంతో ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారిందని చెబుతున్నారు. చిరకాల వాంఛ తీరేనా? ఎత్తిపోతల పథకం పూర్తయితే తమ భూములకు రెండు పంటలకు సాగునీరు అందుతుందనుకున్న బ్రాహ్మణపల్లి, కత్తిగూడెం గ్రామాల ఆయకట్టు రైతుల చిరకాల వాంఛ కలగానే మిగిలేనా అనే సందేహం నెలకొంది. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు వినియోగంలోకి రాకపోవడంపై ఆయకట్లు రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తే బ్రాహ్మణపల్లి, పెరకకుంట, కిందిగుంపు, కత్తిగూడెం గ్రామాల రైతులకు సాగుభూములకు అధికారికంగా 1600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. అనాధికారికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన వేలాది ఎకరాల సాగు భూములకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నిరుపయోగంగా మారిన బ్రాహ్మణపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం 18 ఏళ్లు గడుస్తున్నా అందని సాగునీరు అధికారుల పర్యవేక్షణ లోపంతో రైతుల ఇక్కట్లు -
ఇళ్లగణన సమర్థవంతంగా నిర్వహించాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: జనగణన–2027లో భాగంగా మొదటి విడతలో చేపట్టే ఇళ్ల గణన ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మహేందర్జీతో కలిసి తహసీల్దార్లు, డీటీలు, ఎంపీఎస్ఓలు, ఆర్ఐలతో జన గణన, ఇళ్ల గణన ప్రక్రియలు, మ్యాప్ తయారీపై కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జన గణన కార్యక్రమంలో భాగంగా ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గణన చేయాలని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా జన గణనను పూర్తిగా డిజిటల్ పద్ధతి ద్వారా చేపట్టినట్లు తెలిపారు. మే 11వ తేదీ నుంచి జూన్ 9వరకు జన గణనలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఇళ్ల గణనలో కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయబడతాయన్నారు. సన్నాహక పనులు మొదలు పెట్టాలని వివరించారు. యాప్ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలన్నారు. చార్జెస్ (మండలాల) వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం చేపట్టాలన్నారు. 800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్ను నియమించాలని, ఎన్యుమరేటర్ హౌస్ లిస్టింగ్, బ్లాక్ తయారు చేసి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మంజుల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా స్థాయి టెలికం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలందించాలని అధికారులను ఆదేశించారు. టెలికాం టవర్ల ఏర్పాటులో ఎదురవుతున్న అనుమతుల సమస్యలు, టవర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో ఉన్న జాప్యాన్ని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్డీఓ శ్రీనివాస్, టెలికాం కంపెనీల ప్రొవైడర్లు తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఏటూరునాగారం: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని కోచిలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ(స్కిల్ డెవలప్మెంట్)లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే తదుపరి బ్యాచ్ కోసం రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ దివాకర శనివారం తెలిపారు. శిక్షణకు వెళ్లే వారికి ఉచిత వసతి, భోజనం, లెర్నింగ్ మెటీరియల్స్, యూనిఫాం, సేఫ్టీ షూస్, శిక్షణ అనంతరం నేషనల్ కౌన్సెలింగ్ ఫర్ ఒకేషనల్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా సర్టిఫికెట్ ప్రదానం చేసి ఉపాధి కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాలన్ని గిరిజన యువతీయువకులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 10వ తేదీలోపు ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ ఎలక్ట్రిషియన్(ఆయిల్, గ్యాస్), ఇండస్ట్రీయల్ వెల్డర్(ఆయిల్,గ్యాస్), ప్రాసెస్ ఇన్స్ట్రమెంటనేషన్ టెక్నిషియన్, ఫిట్టర్ ప్యాబ్రికేషన్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కోర్సు వ్యవధి ఆరు నెలల పాటు ఉంటుందని వివరించారు. విద్యార్హతలు టెక్నికల్ డిప్లామా, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని కలెక్టర్ వెల్లడించారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
● అదనపు కలెక్టర్ మహేందర్జీములుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్జీ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలన్నారు. తేమ శాతం కొలిచే పరికరాలు, బరువు తూకం యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని ఓపీఎంఎస్ ద్వారా వెంటనే నమోదు చేసి, ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, షెడ్లు, విశ్రాంతి తీసుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని టార్ఫాలిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ కృష్ణవేణి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి పైసల్ హుస్సేని, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ‘విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి’ ములుగు రూరల్: విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బాలయ్య అన్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ఆధ్వర్యంలో జాకారంలోని ప్రభుత్వ పాఠశాలలో శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ దాసరి సమత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు యూనిఫాం లేని సైనికులని తెలిపారు. ఈ శిబిరాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సహనశీలత, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయన్నారు. ఈ శిబిరం నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ –ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం పాటుపడాలని సూచించారు. అనంతరం విద్యార్థులు జాకారం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అనిల్కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ‘క్యాంపు కార్యాలయంపై దాడి సరికాదు’ ఏటూరునాగారం: గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఇంటి పెద్దపై దాడి, ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అన్నారు. అధికారం అండతో అరాచకాలు చేస్తే ప్రజలు క్షమించరని వివరించారు. అభివృద్ధిని చూపించి ప్రజల మనస్సు గెలవాల్సింది పోయి, భౌతిక దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. -
మ్యాపింగ్ ప్రక్రియపై దృష్టి సారించాలి
● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిములుగు: మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, బీఎల్ఓ, బూత్ ఏజెంట్లు తదితర అంశాలపై ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, బూత్స్థాయి ఏజెంట్ల నియామకంపై సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ములుగు రూరల్: రేపు(సోమవారం) జిల్లా స్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బండారుపల్లి గురుకుల పాఠశాలలో సోమవారం 20 ఏళ్లలోపు బాలబాలికలకు, 20 ఏళ్లు పైబడిన పురుషులకు, మహిళలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు గురుకుల పాఠశాల పీఈటీ రాజ్కుమార్కు రిపోర్టు చేయాలని సూచించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 11, 12వ తేదీలలో హనుమకొండ జవహర్లాల్ స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ కప్ పోటీలలో పాల్గొంటారని వివరించారు. రన్ ఫర్ జీసస్ ర్యాలీ ములుగు: జిల్లా కేంద్రంలో శనివారం రన్ ఫర్ జీసస్ ర్యాలీని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ రహదారిపై సాధన స్కూల్ నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్ మీర్జా, 8వ వార్డు కౌన్సిలర్ నల్లెల్ల స్వాతి భరత్ కుమార్లు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏసుప్రభు గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ రోని ఒనెసిమస్, జిల్లా అధ్యక్షుడు రెవ క్రీస్తుదాసు, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ జోనాత్తాన్, బిషప్ సామ్యూల్, పాస్టర్ రమేశ్, సుదర్శన్ రావు, బొచ్చు సమ్మయ్య, కుమార్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువన్కు పరామర్శ ములుగు: మేడారం గద్దెల వద్ద గాయపడిన పూజారి కుమారుడు యువన్ హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ములుగు మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బాలుడికి ప్రమాదం జరిగిందన్నారు. బాలుడికి అయ్యే వైద్యఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎట్టి జగదీశ్, రామసహాయం శ్రీనివాస్రెడ్డి, ఈసం రాంమూర్తి, రామయ్య, ప్రశాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రామప్ప శిల్పకళ బాగుంది వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని పీసీసీఎఫ్– చీఫ్ వైల్డ్లైఫ్ అధికారి వినయ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ శాలువాతో సత్కరించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట కాళేశ్వరం సీపీఎఫ్ ప్రబాకర్, ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీఓ సత్తయ్య, ఎఫ్ఆర్ఓ శంకర్, డీఆర్ఓ మధు బాబు, ఎఫ్బీవో కిషన్ తదితరులు ఉన్నారు. రామప్పలో మఠాధిపతి నాగమహర్షి, కెనడాకు చెందిన హరిదాస్ రామప్ప దేవాలయాన్ని శ్రీ మహాకాళేశ్వర దేవస్థానం నాగమఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ కాలనాగ మహర్షి, కెనడా దేశానికి చెందిన హరిదాస్తో కలిసి శనివారం రామప్పను సందర్శించారు. భూపాలపల్లి జిల్లా నందిగామ మహాకాళేశ్వర దేవస్థానానికి హరిదాస్ రాగా మఠాధిపతి అయిన నాగమహర్షి హరిదాస్ను తీసుకుని రామప్ప ఆలయానికి వచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని వారు కొనియాడారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సందడి నెలకొంది. -
సమ్మక్క పూజారి కుమారుడి కాలు తొలగింపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన రాణా రమేశ్ కుమారుడు ఏడేళ్ల యువిన్ రెండు కాళ్లపై ఇటీవల గద్దెల ప్రాంగణంలో రాతిశిల పడటంతో తీవ్ర గాయాలుకాగా, శుక్రవారం వైద్యులు ఎడమకాలిని తొలగించారు. వారం రోజులక్రితం యువిన్ గద్దెల ప్రాంగణం వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లగా సారలమ్మ గద్దె వద్ద ఓ రాతిశిల బాలుడి కాళ్లపై పడింది. దీంతో రెండు కాళ్లు విరిగిపోగా, వెంటనే కుటుంబ సభ్యులు హనుమకొండలోని గార్డియన్ హాస్పిటల్కి తరలించారు. ఎడమ కాలికి శస్త్రచికిత్స నిర్వహించినప్పటికి బాగుకాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వైద్యులు కాలుని తొలగించారు. కుడి కాలికి సర్జరీ చేసి రాడ్డు వేశారు. ఇటీవల సీతక్క బాలుడిని పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మేడారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బాలుడికి సంబంధించి వైద్య ఖర్చులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
కూరగాయల సాగుకు పెద్దపీట
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ములుగు: ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎప్పుడు లేనివిధంగా వందశాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తుంది. ఒక కిట్లో టమాట, మిర్చి, బెండ, తోటకూర, పాలకూరకు సంబంధించిన విత్తనాలను ఉంటాయి. జిల్లాలో కూరగాయల సాగును పెంపొందించడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలనే నెపంతో వెజిటేబుల్ విత్తనాల కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. 625 ఎకరాల్లో సాగు అయ్యేలా.. జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఏటా 150 ఎకరాల్లో మాత్రమే కూరగాయలను రైతులు పండిస్తున్నారు. ప్రజలకు సరిపడా వెజిటేబుల్ జిల్లాలో సాగు కాకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కూరగాయలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో వ్యాపారులు ఇష్టారీతిగా ధరలను పెంచి అమ్ముతుండడంతో ప్రజల మీద భారం పడుతుంది. అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు దొరకని పరిస్థితి నెలకొంది. కాగా ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో కిట్లను అందజేస్తూ కూరగాయల సాగుకు పెద్దపీట వేస్తోంది. రైతులకు పూర్తి సబ్సిడీతో కూరగాయల విత్తనాలను అందిస్తున్నాం. ఒక కిట్లో ఐదు రకాల విత్తనాలు ఉంటాయి. ఒక ప్యాకెట్లోని విత్తనాలను అర ఎకరం వరకు సాగు చేయవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్తో సమీప ఉద్యాన అధికారిని సంప్రదించి విత్తనాలు ఉచితంగా పొందవచ్చు. – సంజీవరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అందుబాటులో 1,250 కిట్లు జిల్లాలో 625 ఎకరాల్లో కూరగాయల సాగు పెరగనున్న సాగు విస్తీర్ణం -
గద్దెల ప్రాంగణంలో చెత్త తొలగింపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన అండర్ డ్రెయినేజీలోని మురుగునీరు, చెత్త చెదారాన్ని దేవాదాయ శాఖ సిబ్బంది శుక్రవారం తొలగించారు. ఈ నెల 3న గద్దెల పునర్నిర్మాణ పనులు అస్తవ్యస్తం అనే కథనం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ఈఓ వీరస్వామి స్పందించారు. ఈ మేరకు సిబ్బంది డ్రెయినేజీలోని పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగునీరును పూర్తిగా తొలగించారు. గద్దెల ప్రాంగణానికి కూడా పరిశుభ్రత చర్యలు చేపట్టారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీ నది అంత్యపుష్కరాలపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ తెలిపారు. ఉదయం 11.30గంటలకు వివిధ శాఖలతో చేపట్టే అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. వారి వెంట కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్ హాజరు కానున్నారు. -
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం:సీపీఐ
ములుగు రూరల్: ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఇంటింటా సర్వే నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, గుడిసె వాసులకు పట్టాలు, రేషన్కార్డులు, పెన్షన్లు, సాగునీరుపై దృష్టిసారి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట మ ల్లికార్జున్, సహాయ కార్యదర్శి రవిందర్, అమ్జద్పాషా, ఇంజం కొమురయ్య, ముత్యాల రాజు, నర్సయ్య, సారయ్య, సాగర్, రమేష్, నటరాజ్, రాజేందర్, లింగమూర్తి, స్వామి, పరంసింగ్, గోపి, తిరుపతి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి
వెంకటాపురం(కె)/వాజేడు: భద్రాచలం నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. వెంకటాపురం(కె)మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని కమ్యూనిటీ హాల్లో సర్పంచ్ సరస్వతి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. అనంతరం గ్రామసభలో పలు సమస్యలపై ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే వెంకట్రావు హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ లైన్లను ఇప్పటికే వేస్తున్నారని విద్యుత్ సమస్య రాకుండా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నాలుగు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా వాటి గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు -
ఆలయ పునర్నిర్మాణ పనులు అస్తవ్యస్తం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర నాటికి ఆలయ పునర్నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. జాతర సమయం నాటికి కొంత మేరకు పనులు పూర్తి కాకపోవడంతో తాజాగా మళ్లీ పనులను మొదలు పెట్టారు. ప్రహరీ నిర్మాణం, ఆర్చీలపై చెక్కిన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ బొమ్మలు బాగానే ఉన్నా గద్దెల ప్రాంగంణంలో ఫ్లోరింగ్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పగిలిన గ్రానైట్ రాళ్లు జాతర సమయంలో హడావుడిగా గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయడంతో గ్రానైట్ రాళ్ల మధ్య సందులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల గ్రానైట్ రాళ్లు పగిలిపోయాయి. రాళ్లు కుంగిపోయిన విషయాన్ని జాతర సమయంలో గుర్తించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్కలు సరిచేయాలని ఆదేశించడంతో జాతర అనంతరం మళ్లీ పనులను ప్రారంభించారు. గద్దెల ప్రాంగణంలో కుంగిన గ్రానైట్ రాళ్లను తొలగించి సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు భాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం గద్దెలను ప్రతిరోజూ నీటితో కడగడంతో నీళ్లు గ్రానైట్ రాళ్ల మధ్య నిలిచి పోతున్నాయి. అంతేకాకుండా సమ్మక్క గద్దె వద్ద గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసిన మెట్లరాళ్లు కూడా పగిలిపోయాయి. వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ గద్దెకు వెళ్లే మెట్ల వద్ద గ్రానైట్ రాయి పగిలి కుంగిపోయింది. ఇటీవల మేడారం సమ్మక్క పూజారి కుమారుడి కాళ్లపై గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రాయి కాలు మీద పడి గాయపడిన ఘటన కూడా చోటు చేసుకుంది. కంపుకొడుతున్న డ్రెయినేజీ గద్దెల ప్రాంగణాన్ని నీటితో శుద్ధి చేసిన నీళ్లు బయటకు వెళ్లేందుకు అండర్ డ్రెయినేజీ నిర్మాణం చేశారు. జాతర సమయంలో హడావుడిగా డ్రెయినేజీ నిర్మాణం చేయడంతో దీంతో ఆ డ్రెయినేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి గద్దెలను శుద్ధి చేసిన నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వస్తోంది. డ్రెయినేజీ నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయిందని భక్తులు విమర్శిస్తున్నారు. మళ్లీ డ్రెయినేజీని సక్రమంగా చేసేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. మహాజాతరలో మీడియా కవరేజ్ కోసం నిర్మించిన మీడియా పాయింట్ జాతర సమయం వరకు పూర్తి కాలేదు. అయితే మీడియా పాయింట్ కవరేజ్కు అనుకూలంగా లేవనే విషయాన్ని గుర్తించిన మంత్రులు జాతర అనంతరం ఆ పనులను నిలిపివేసినట్లు తెలిసింది. ఆదివాసీ బొమ్మల ఏర్పాటు గద్దెల చుట్టూ నిర్మించిన రాతి ప్రహరీ పైభాగంలో రాతితో చెక్కిన ఆదివాసీ బొమ్మలను అమర్చుతున్నారు. అయితే ఓ రాతి బొమ్మ కొమ్ము విరిగిపోవడంతో దాన్ని గమ్ముతో అతికించి ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. అధికారులు విరిగిన కొమ్ము బొమ్మను పక్కన పెట్టించాలని భక్తులు కోరుతున్నారు. మేడారంలో కొనసాగుతున్న ఆలయ పునరుద్ధరణ పనులు కంపుకొడుతున్న అండర్ డ్రెయినేజీ -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ములుగు/వెంకటాపురం(ఎం)/ గోవిందరావుపేట: గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు మున్సిపాలిటీలోని 6వ వార్డులో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అధ్యక్షతన గురువారం నిర్వహించిన వార్డు సభకు సీతక్క హాజరై మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి రూ.1.25కోట్లతో ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేయడమే కాకుండా రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ.57 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని పీవీ కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక గ్రామసభ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతాయన్నారు.ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ.500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలు లబ్ధిదారులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయిలో గ్రామ సర్పంచ్ మేకల రాధసుదర్శన్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, కలెక్టర్ దివాకరతో కలిసి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం మహిళ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితరామచంద్రన్ మాట్లాడుతూ గ్రామంలో కొత్త రేషన్ కార్డులు అందించామని తెలిపారు. అలాగే 73 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ.10లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. చల్వాయి గ్రామంలోని లక్నవరం క్రాస్ వద్ద ఉన్న కిచెన్ షెడ్లో మంత్రి సీతక్క, అనిత రామచంద్రన్, కలెక్టర్ దివాకరలతో కలిసి అంగన్ వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం నూతన స్మార్ట్ఫోన్లను అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, పంచాయితీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
సమస్యలు పరిష్కరించేదెప్పుడో..
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య విమర్శించారు. ఈ మేరకు గురువారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మెడికల్ బోర్డు నిర్వహణ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు అయిన అలవెన్సులు, ఆదాయపన్ను మాఫీ, సొంత ఇంటికల, మారుపేర్ల, ఇతర అంశాలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన కార్మికుల ఆశలు నెరవేరలేదన్నారు. వేజ్బోర్డులో చేసుకున్న ఒప్పందాలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదని, గెలిచిన సంఘాలు వాటిని అమలు చేయించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీనివాస్, శ్రీకాంత్, తోట రమేష్, బాబురావు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ములుగు రూరల్: యాసంగి సాగు వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాగు చేసిన వరి విస్తీర్ణానికి అనుకూలంగా దిగుబడి అంచనా వేశారు. ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్ రెండో వారం నుంచి మే నెలాఖరు వరకు ధాన్యం సేకరణకు అవసరమయ్యే యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు. నిబంధనల మేరకు ధాన్యం మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు, వ్యవసాయ అధికారులకు సూచనలు అందించారు. 60 వేల ఎకరాల్లో వరిసాగు జిల్లాలోని పది మండలాల పరిధిలో 60,972 ఎకరాల్లో వరిసాగు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాకు 22 క్వింటాల దిగుబడి అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి దిగుబడి సన్నరకం 68,632 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 65,607 మెట్రిక్టన్నులఽ వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 25 లక్షల గన్ని బ్యాగుల అవసరం జిల్లాలో ధాన్యం సేకరణకు 25 లక్షల గన్ని బ్యాగులు అవసరం ఉన్నాయి. దీంట్లో 12 లక్షల గన్ని బ్యాగుల అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పార పట్టే యంత్రాలు, తేమశాతం నిర్దేశించే పరికరాలు, ఎలక్ట్రానిక్ కాంటాలను, టార్ఫాలిన్లు సిద్ధం చేస్తున్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ చేపడతాం. సేకరణకు సరిపడా గన్ని బ్యాగులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాం. కాంటాలు అయిన వెంటనే జాప్యం లేకుండా ధాన్యం మిల్లులకు తరలిస్తాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలి. దళారులను నమ్మి మోసపోకూడదు. – కృష్ణవేణి, జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ విద్యార్థులకు యూనిఫాం క్లాత్ కోసం టెస్కోకు ఇచ్చిన ఇండెంట్ను ఉపసంహరించుకోవడంతో పవర్లూం, చేనేత సహకార సంఘాలు చతికిలపడనున్నాయి.లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 140 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాధమిక వ్యవసాయ కేంద్రాలు, ఐకేపీ, ఎఫ్పీఓల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఆయా సంఘాలకు కేంద్రాలను కేటాయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 81, ఐకేపీ 52, ఎఫ్పీఓ 7 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 1.08 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం అందుబాటులో 12 లక్షల గన్ని బ్యాగులు -
‘పది’ పరీక్ష కేంద్రం తనిఖీ
వెంకటాపురం(కె): మండల పరిధిలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్ధులకు ఏర్పాటు చేసిన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఉల్లాస్ కో ఆర్డినేటర్ పీర్ల కృష్ణబాబు తదితరులు ఉన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కొమురయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, గౌడ సంఘం నాయకులు పులి నర్సింగం, బుర్ర శ్రీనివాస్, శ్రీకాంత్, సంక్షేమ భవన కార్యాలయ సిబ్బంది సరిత, మానస, రేణుక తదితరులు పాల్గొన్నారు. ‘విస్తారాకులతో ఆరోగ్యానికి మేలు’ ఎస్ఎస్తాడ్వాయి: అడవుల్లో సహజంగా లభించే ఆకులతో తయారు చేసిన విస్తారాకులతో ఆరోగ్యానికి ఎంతో మేలని ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా అధ్యక్షుడు బొల్లు నాగేంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని కామారంలోని సమ్మక్క–సారలమ్మ ఆర్గానిక్ విస్తా రాకుల తయారు సంఘం భవనాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. పాలిథిన్ కవర్లతో ఉన్న పేపర్ ప్లేట్ల వినియోగాన్ని మానుకుని పర్యావరణానికి మేలు చేసే సహజ విస్తారాకులను వినియోగించాలని సూచించారు. విస్తారాకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు కొర్నెబెల్లి కవిత, సభ్యులు రేగ అనూష, కోరం ఇందు, పూర్ణ, సోలం అన్నపూర్ణ, రేగ సరళ, శ్రీదేవి పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ ములుగు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల వాల్పోస్టర్ను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి జిల్లా రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈనెల 14న ఏటూరునాగారంలో నిర్వహించే అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలకు రావాలని ఎస్పీని ఆహ్వానించారు. ఏటూరునాగారంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వా లీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చిలు వేరు అన్నమయ్య, కార్యదర్శి వేంపల్లి శంకర్, కోశాధికారి పరికి వేణుగోపాల్ పాల్గొన్నారు. గోవిందరావుపేట: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడు మురహారి భిక్షపతి అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గురువారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా భిక్షపతి హజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రభుత్వాలు విస్మరించడం సరికాదని అన్నారు. ఉద్యమకారులు హరిప్రసాద్, సంతోష్, ఇరుగు పైడి, బత్తిని వెంకట్, యాస పూలమ్మ, మడిపెల్లి శ్యామ్, బుర్రి సతీష్, యాస కళావతి, సమ్మక్క, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పపువ్వుతో ఆదాయం
గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వ్యాపారులు తమ వద్దకు వచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అడవిలో లభించే ఇప్పపూలకు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. అయినా తాము మార్కెటింగ్కు చేయలేకపోతున్నాం. తక్షణమే ప్రభుత్వం జీసీసీ ద్వారా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటుపడాలి. – బరసి ఉంగయ్య, మామిడిగూడెం, ఏటూరునాగారం ఇప్పపువ్వుతో పౌష్టికాహారం ఇప్పపూలను వండుకొని తింటే పౌష్టికాహారం వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు తింటాం. చుట్టాలు వస్తే అందులో ఎండు చేపలు వేసి వారికి వండిపెడుతాం. అంతేకాకుండా లడ్డూలు, సారా కూడా తయారు చేసి విక్రయిస్తాం. ఇళ్లలో నిల్వ చేసుకునేందుకు డ్రమ్ములు, గుమ్ములను ఉపయోగిస్తాం. – వేకో సోని, గంటలకుంట, ఏటూరునాగారంమామిడిగూడెంలో ఆరబెట్టిన ఇప్పపువ్వు●ఏటూరునాగారం: ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో ఇప్పపువ్వు సేకరణ జాతర నెలకొంది. వేసవిలో విరివిరిగా లభించే పూలను సేకరించే పనుల్లో గిరిజనులు నిమగ్నమయ్యారు. వాటిని సేకరించి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, ఎస్ఎస్ తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని 51 గూడేల్లోని గిరిజనులు అత్యధికంగా ఇప్పపూలు సేకరించి నిల్వ చేస్తున్నారు. ఇలా నిల్వ చేసిన అనంతరం వాటిని లడ్డూలు, సారాయి తయారు చేసి విక్రయిస్తున్నారు. అలాగే సేకరించిన ఇప్పపువ్వును భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలి.. గిరిజన సహకార సంఘం (జీసీసీ) అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. కాని సదరు అధికారులు దృష్టి సారించడం లేదు. గతంలో జీసీసీ అధికారులు గూడేల్లోకి వచ్చి ఇప్పపువ్వు కొనుగోలు చేసి ఆర్థికాభివృద్ధి సాధించేలా తోడ్పాటు అందించేవారు. ఇప్పటికై నా జీసీసీ అధికారులు గొత్తికోయగూడేల్లో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.అడవిలో ఇప్పపువ్వు ఏరుతున్న మహిళ అటవీ ప్రాంతాల్లో విరివిగా ఇప్పపువ్వు లభిస్తుండడంతో గిరిజనులు ఎక్కువగా సేకరణపై దృష్టి పెట్టారు. ఒక్కో కుటుంబం రోజుకు 20 నుంచి 30 కిలోల వరకు సేకరించి ఎండబెడుతున్నారు. అలా 30 రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత డ్రమ్ములు, గుమ్మిల్లో నిల్వ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా బంధువులు వస్తే వారికి వండిపెడుతామని చెబుతున్నారు. ఇదే కాకుండా సారా కూడా తయారు చేసి బయటకు పంపించి లీటర్కు రూ.100ల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అఆగే ఇప్పపువ్వును కిలోకు రూ.10 నుంచి 30 వరకు విక్రయిస్తూ మధ్యంతర ఆదాయం పొందుతున్నారు. అలా వచ్చిన ఆదాయంతో ఇంటికి కావాల్సిన సరుకులు, బట్టలు, ఆహార ధాన్యాలను వంటివి కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి
ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గోవిందారావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల వ్యవసాయశాఖ అధికారులకు, కేంద్రాల ఇన్చార్జ్లకు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రానికి ఆయన హాజరై మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ధాన్యంలో తేమశాతం 17 వచ్చిన తర్వాత మాత్రమే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు. హార్వెస్టర్ యజమానులు ధాన్యం కోత సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. న్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీసీఎస్ఓ ఫైసల్ హుస్సేన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అవినాష్ వర్మ, డీపీఎం శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీటీ విజయ్కుమార్, తహసీల్దార్ సురేష్బాబు, పాల్గొన్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారులతో అదనపు కలెక్టర్ మహేందర్జీ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలు అంశాలపై వివరించారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి
ములుగు/ములుగు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకరతో కలిసి తాగు, సాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. ఏజెన్సీలోని గొత్తికోయ గూడేల్లో చేతి పంపులు, ట్రాక్టర్ ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. ప్రతీ పంచాయతీలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇప్పటి వరకు గ్రౌండింగ్ చేయకపోతే లబ్ధిదారులు మహిళ సంఘంలో ఉంటే వారికి వెంటనే రూ.లక్ష రుణం అందేవిధంగా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.200 కోట్లతో గోదావరి జలాలను జిల్లాకు మళ్లించడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే మల్లంపల్లిని ఆదర్శ పంచాయతీగా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లిలో సీఆర్ఆర్ నిధులు రూ.72.50 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులను, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10లక్షల నిధులతో గ్రామైఖ్య భవన నిర్మాణ పనులను కలెక్టర్ దివాకరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పాదయాత్రలో భాగంగా మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తామని హామీనిచ్చి నేరవేర్చారని తెలిపారు. మల్లంపల్లి మండలంలో పరిపాలన సౌలభ్యం కోసం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
కాంగ్రెస్లో ‘సంస్థాగత’ సందడి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో ‘సంస్థాగత’ సందడి కొనసాగుతోంది. ప్రభుత్వం, ప్రజలకు వారధిగా ఉండేలా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పాత కమిటీలను రదు చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులు.. వార్డు, డివిజన్ కమిటీలనుంచి పూర్తిస్థాయి జిల్లా కమిటీలను వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. హనుమకొండ జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ మాసాంతానికల్లా అన్ని స్థాయిల్లో సంస్థాగత కమిటీలు వేయాలన్న హైకమాండ్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను సంప్రదించి కమిటీలను రూపొందిస్తున్నారు. జిల్లా కమిటీల్లో 31 నుంచి 51 మందికి ప్రాతినిధ్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కమిటీ కార్యవర్గం ఈ నెలాఖరుకు ఖరారు కానుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తవగా... పూర్తిస్థాయి కమిటీలను వేయలేదు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 14 జిల్లాల్లో పూర్తి స్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృత స్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో పెండింగ్లో ఉండగా.. ఇటీవల కసరత్తు మొదలైంది. ఈ క్రమంలోనే వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు మొదలు పూర్తి స్థాయి జిల్లా కమిటీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన జరుగుతోంది. చాల్లా జిల్లాల్లో జిల్లా కమిటీలు జెంబోజెట్లుగా నియామకాలు చేశారన్న ఆరోపణలు ఉండగా.. ఉమ్మడి జి ల్లాలో మాత్రం చిన్న జిల్లాలుంటే 31.. పెద్ద జిల్లాలైతే 51 మందికి మించకుండ ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించా రు. ఇందుకోసం డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లను సంప్రదించి జాబి తాలు రూపొందించే పనిలో ఉండగా.. ఈ నెల 8న కీలక సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేలా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పారదర్శకంగా జరుగుతోంది. అన్ని స్థాయిల కమిటీల్లో సామాజిక ప్రాతినిధ్యం ఉంటుంది. మహిళలకు 30 శాతం అవకాశాలు తప్పనిసరి చేశాం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం మార్గదర్శకాల మేరకు కమిటీలు పని చేస్తాయి. పార్టీ సిద్ధాంతాల పునశ్చరణ, గాంధీజీ ఆశయాల సాధన, క్రమశిక్షణ కలిగిన నాయకత్వ నిర్మాణం కోసం వారం వారం ‘సర్వోదయ చరక అభ్యాస్’ ప్రత్యేక శిక్షణ అన్ని స్థాయిల నాయకులకు ఉంటుంది. – ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, హనుమకొండ జిల్లావార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీల తర్వాత జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలో నియమించనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత దక్కేలా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండేలా, పార్టీ బలోపేతం దృష్ట్యా మండల స్థాయి కార్యవర్గాల్లో 35 సంవత్సరాల పైబడిన వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కనీసం మూడేళ్లపాటు పార్టీకి చురుకై న సేవలు అందించిన వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వనున్నారు. జిల్లా పరిధిలోని రెండేళ్లు పూర్తి చేసుకున్న మండల, మునిసిపల్, కార్పోరేషన్ డివిజన్ అధ్యక్షులను ఈసారి తప్పనిసరిగా మార్చాలని నిబంధన పెట్టుకున్నారు. ఈ మేరకు వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇదివరకున్న కమిటీలను రద్దు చేసిన డీసీసీలు గ్రామస్థాయి నుంచి కమిటీలు.. మండలాల వారీగా పరిశీలకులు జిల్లా కమిటీలో 31 నుంచి 51 మందికి ప్రాతినిధ్యం పల్లెల్లో మొదలైన కాంగ్రెస్ కమిటీల సందడి ఏప్రిల్ మాసాంతానికల్లా పూర్తిస్థాయి కమిటీలు? -
ప్రజాపాలనపై కళాజాతా
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికపై మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో బుధవారం కళాజాతా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలంగాణ సాంస్కృతిక సారథి టీమ్ కోఆర్డినేటర్ రాగుల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, మత్తు పదార్థాల నివారణకు, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెల్లడించారు. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, నేటి నుంచి నిర్వహించబోయే గ్రామ సభల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కళాకారులు వివరించారు. కార్యక్రమంలో కళాకారులు రహీముద్దీన్, విజయ్, కిషన్, భాస్కర్ పాల్గొన్నారు. -
గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: జిల్లాలో నేటి నుంచి నిర్వహించే గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. గ్రామసభలు, మున్సిపల్ వార్డుల్లో సభల నిర్వహణపై బుధవారం మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. గ్రామ సభలు, మున్సిపల్ సభలు పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామ సభల్లో ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో టామ్ టామ్ చేయించాలని సూచించారు. ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని కొత్తగా మరికొన్ని చేపట్టబోతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామసభల సందర్భంగా ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చేవారి దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి అర్జీలు తీసుకోవాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వెంకటాపురం(కె): సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సౌర విద్యుత్ వినియోగంపై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్యఘర్, ముఫ్త్ బిజిలియోజన, కుసుం పథకాలపై వివరించారు. మీటర్లు లేకుండా విద్యుత్ వినియోగించుకుంటున్న వినియోగదారులు పీఎం జుగా స్కీమ్ కింద మీటర్లు పొందవచ్చని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు, భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం సౌర విద్యుత్ వినియోగంపై కరపత్రాలను వినియోగదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వెంకటాపురం(ఎం) మండలం నల్లగుంట గ్రామానికి చెందిన భూక్య జవహర్లాల్ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి పాటుపడినందుకు పదవిని కేటాయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు బలరాం, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి అర్బన్: గత ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాకు 46.54 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 74 శాతం బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి వెల్ల డించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 55 వేల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. ఏరియాకు మొత్తం 46.54 లక్ష టన్నుల లక్ష్యానికి 34.22 లక్ష టన్నులు మాత్రమే సాధించి 74 శాతంలో నిలిచామన్నారు. కేటీకే–1 గని 71 శాతం, కేటీకే–5, కేటీకే–6 గనులు 49 శాతం చొప్పున, కేటీకే–8 గని 44 శాతం సాధించాయి. కేటీకే ఓసీ–2 గని 97 శాతం, ఓసీ–3 గని 69 శాతం సాధించాయన్నారు. గతేడాదిలో ఏరియాకు రూ.703 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన 46 లక్షల టన్నుల లక్ష్యాలను చేరుకోవాలంటే కార్మికులు సమష్టిగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఐఈడీ జ్యోతి పాల్గొన్నారు. -
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ
ములుగు: రేషన్ కార్డు లబ్ధిదారులకు వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా ఫైసల్ హుస్సైని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. జిల్లాలో దాదాపు లక్షా 2 వేలకు పైగా కార్డులు ఉన్నాయని వివరించారు ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. దీనికి తోడు సర్వర్ సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
రూ.90 లక్షల పన్ను వసూలు
ములుగు: మున్సిపాలిటీ ఆస్తిపన్ను 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.90 లక్షల పన్ను వసూలు కాగా 72 శాతంతో 15వ ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించినట్లు ములుగు మున్సిపాలిటీ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు. మంగళవారం మున్సిపాలిటీ సిబ్బంది పన్ను వసూలు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పన్నుల వసూళ్లకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ములుగు మున్సిపాలిటీ ఆస్తి పన్ను మొత్తం రూ.1.27 కోట్లు కాగా మార్చి 31వ తేదీ వరకు రూ.90 లక్షలు వసూలు అయినట్లు తెలిపారు. వచ్ఛే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి పన్నులు చెల్లించే వారికి 5 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ములుగు పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు
● వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ములుగు: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలుపై రేపటి (గురువారం) నుంచి నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రామ సభలలో ప్రజలకు అందించే సమాచారం ఒకే రీతిన ఉండాలన్నారు. గ్రామ సభల నుంచి వార్డు మెంబర్ నుంచి ఎంపీ, మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. గ్రామ సభల్లో సీఎం సందేశం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డు, సన్న బియ్యం సరఫరా, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులతో గ్రామసభలలో మాట్లాడించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలందరికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తెలిసే విధంగా వార్డు సభలు నిర్వహించాలని తదితర అంశాలను వెల్లడించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ములుగు: మహిళలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం – ఉత్సవాలు 2026’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 29 నాటికి రూ.290 కోట్ల ప్రయాణాల ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ చార్జీలు ఆదా అయ్యాయని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రతీ కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ములుగు జిల్లాల్లో ఇప్పటి వరకు 1.90 కోట్ల ప్రయాణాల ద్వారా మహిళలు రూ.133.25 కోట్లు ఆదా చేసుకున్నారని స్పష్టం చేశారు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పథకాలను రూపొందిస్తుందన్నారు. వాటిని అర్హులందరికీ అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వివరించారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తూ త్వరలోనే సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల్లో 18 ఏళ్లు నిండిన వారు సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్డీఓ శ్రీనివాస్, ఆర్టీసీ డీఎం.రవిచందర్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్, తదితరులు, పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
డిజిటల్.. గృహ గణన
ములుగు: జిల్లాలో గృహగణన నమోదు కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. 2011 జనాభా లెక్కల తర్వాత ఇంతవరకు జన గణన జరగలేదు. జన గణన కార్యక్రమంలో భాగంగా తొలి ప్రాధాన్యతలో భాగంగా గృహ గణన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిసారిగా డిజిటల్ విధానంలో గృహ గణనను నిర్వహిస్తుంది. గృహ గణన కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించనున్నారు. గతంలో కాగితాల్లో వివరాలు రాసి నమోదు చేసేవారు. ఈ సారి మాత్రం లోపాలకు తావులేకుండా డిజిటల్ పద్ధతిలో ఆన్లైన్ విధానంలో కార్యక్రమాన్ని నిర్వహించనుండడంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. వచ్చేనెల 11 నుంచి ప్రారంభం జిల్లాలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహ గణన కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 78,635 గృహాలు ఉండగా 3,20,242 జనాభా ఉంది. గృహ గణన అనంతరం జన గణన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు నెల రోజల పాటు గృహ గణన చేసేందుకు అధికారులు జాబితాను రూపొందిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో గృహ గణనకు సంబంధించిన కార్యక్రమంపై దృష్టిపెట్టనున్నారు. గృహ గణన కార్యక్రమంలో 300 గృహాలకు లేదా 700 జనాభాకు ఒక ఎన్యుమరేటర్ను నియమించనున్నారు. జిల్లాలో సుమారు వెయ్యి మంది ఎన్యుమరేటర్లు జన గణనలో పాల్గొనున్నట్లు తెలిసింది. జిల్లా ప్రణాళిక, రెవెన్యూ శాఖల సమన్వయంతో గృహ, జన గణన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.గృహ గణనలో 33 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. ఇంటి నంబర్, ఇంటి నిర్మాణానికి వాడిన మెటీరియల్, కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటి యజమాని వివరాలు, ఇల్లు సొంతమా, అద్దెనా, తాగునీటి సౌకర్యం, డ్రెయినేజీ వ్యవస్థ, మరుగుదొడ్ల వివరాలు, వంట గది సౌకర్యం, రేడియో, టీవీ, కంప్యూటర్, టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్, ద్విచక్ర వాహనాలు, కారు ఉందా అనే అంశాలతో పాటు మొత్తంగా 33 ఆంశాలను ప్రతీ ఇంటికి వెళ్లి గృహ గణనలో భాగంగా వివరాలు నమోదు చేయనున్నారు. ఇలాంటి వివరాలను ఇంటి యజమానే నేరుగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. మే 11 నుంచి ప్రారంభం ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందితో సర్వే2027 జన గణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహ గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చాం. మొదటిసారిగా డిజిటల్ విధానంలో గృహ గణన కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. ప్రతీ ఇంటిని ఎన్యుమరేటర్లు సందర్శించి సరైన సమాచారాన్ని నమోదు చేస్తారు. గృహ, జన గణన ఆధారంగానే అభివృద్ధి పథకాలు రూపొందించబడుతాయి. – టీఎస్.దివాకర, కలెక్టర్ -
వాహనదారులకు కంటిచూపు కీలకం
డీఎస్పీ కిశోర్కుమార్ ములుగు రూరల్: వాహనదారుల ప్రమాదాల నివారణకు కంటిచూపు కీలకపాత్ర పోషిస్తుందని డీఎస్పీ కిశోర్కుమార్ అన్నారు. మండల పరిధిలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ వైద్యశిబిరంలో వైద్యులు వేణుమాదవ్ బృందం 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్లు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీనివాస్, సీఐ సురేష్కుమార్, ములుగు, వెంకటాపురం(ఎం) ఎస్సైలు ఉపేందర్రావు, చల్లా రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం క్షౌ రశాలల విద్యుత్ సబ్సిడీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యుత్శాఖ ఎస్ఈ ఆనందంకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షౌ రశాలల విద్యుత్ బిల్లులు చెల్లించాలని విద్యుత్శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో విద్యుత్ సబ్సిడీని విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో వృత్తిదారులతో కలిసి విద్యుత్శాఖ కార్యాలయాల ముట్టడి చేపడతామన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు శరబందం, రామకృష్ణ, సంపత్, సతీష్ పాల్గొన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి
● డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగు రూరల్: 14 సంవత్సరాలు నిండిన బాలికలు తప్పనిసరిగా హెచ్పీవీ(హ్యుమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్) వేసుకోవాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగ అన్వేష్తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, సూపర్వైజర్లతో మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో బుధవారం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలు 14 ఏళ్లు నిండిన బాలికల జాబితాను తయారు చేసుకుని ప్రణాళికతో బాలికలకు వ్యాక్సినేషన్ చేయించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి సంపత్, డీడీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: అక్రమ అరెస్టులతో ఆదివాసీ ఉద్యమాన్ని ఆపలేరని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్రావు అన్నారు. మండల కేంద్రంలో కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ ప్రజా సంఘాలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లా గూడూరు వైపునకు వెళ్తున్న తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్, దారం రమేశ్, ముక్తి రాజును బయ్యారం పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆదివాసీల హక్కులను అణచివేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్ట్లను వెంటనే రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, నారాయణ, నరేశ్ పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి ప్రేమలత ఏటూరునాగారం/కన్నాయిగూడెం: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి ప్రేమలత అన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల హక్కులను పరిరక్షించేందుకు సంబంధిత చట్టాలపై సోమవారం అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రైతులు, భవన నిర్మాణ కార్మిక యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీయూ), చైల్డ్హెల్ప్లైన్ (సీహెచ్ఎల్), ఉమెన్ హబ్ సంయుక్తంగా ప్రత్యేక బృందాలుగా విడిపోయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. బాలల హక్కుల పరిరక్షణకు కలెక్టర్ దివాకర ఆదేశాల ప్రకారం మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య సిబ్బంది వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. రైతులకు నోటీసులు జారీ చేశారు. 14 నుంచి 18ఏళ్ల బాలలను పనుల్లో పెట్టుకోవద్దని తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా సుమారు వంద మంది రైతులకు నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించినట్లు వివరించారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బాలలు తప్పకుండా విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ అబ్బనబోయిన నరేశ్, సూపర్వైజర్ సుదర్శన్, బాలల పరిరక్షణ విభాగం అధికారులు సంజీవ, జ్యోతి, మహిళా శక్తి సాధికారిత జిల్లా అధికారి రమాదేవి పాల్గొన్నారు. -
ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్వీకెఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్పీఈయూ నాయకులు రావుల రమణారెడ్డి, కడెం మహేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, ట్రాన్స్ కోవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్.రాంబాబు, పూర్ణాచారి, సతీశ్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సృజన, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
జన గణన సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు: జన గణన–2027 మొదటి విడతలో భాగంగా చేపట్టనున్న జన గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్, జనగణన సంచాలకులు భారతి హోళీకేరి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్లో జన గణన, ఇళ్ల గణన, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల గణన ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులందరూ పూర్తి అవగాహనతో పని చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గణన చేపట్టాలని సూచించారు. దేశంలో తొలిసారిగా జన గణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతీ కుటుంబానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. సన్నాహక చర్యలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాప్ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని, గణన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం చేపట్టాలని తదితర అంశాలపై సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో జన గణన–2027 మొదటి విడత ఇళ్ల గణన కార్యక్రమాన్ని సమన్వయంతో సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జీ, సూపరింటెండెంట్ మంజుల, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి -
మక్కల కొనుగోళ్లలో జాప్యం
మహబూబాబాద్ రూరల్ : మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మక్కలను మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకువస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్క్ఫెడ్ అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో మక్కలకు మద్దతు ధర రూ.2,400 అందడంలేదని, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి క్వింటాకు ధర రూ.1,800 చెల్లిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. కాగా, ఆందోళనతో మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్కుమారును నిర్బంధించారు. ఆగ్రహించిన అన్నదాతలు ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ నిర్బంధం -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ములుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ దివాకర తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామసభల నిర్వహణపై అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్రావుతో కలిసి కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, సాయిల్ హెల్త్కార్డు, వ్యవసాయ తదితర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. గ్రామసభల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామసభల నిర్వహణకు ముందస్తుగానే షెడ్యూల్ తయారు చేసి పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామ పంచాయతీలో జరిగే సభకు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఇరిగేషన్, విద్యుత్శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా గ్రామసభలకు హాజరు కావాలని తెలిపారు. గ్రామసభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి కోసం గ్రామభలో ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్వీకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆపోహలు పడవద్దని, జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎల్పీజీ, లక్ష్మీ హెచ్పీ గ్యాస్ గోదాంను సివిల్ సప్లయీస్ అధికారి సయ్యద్ షా ఫైనల్ హుస్సేనీతో కలిసి కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్లను, స్టాక్ నిల్వలు పరిశీలించి ఎప్పటికప్పుడు స్టాక్ నిల్వలు రిజిస్ట్రార్లో నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
తగ్గిన విద్యుత్ అంతరాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజిమెంట్ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల అంతరాయాల లోకేషన్ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్ కండక్టర్తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, వాసుదేవ్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ సంస్థలను తరిమికొడతాం
హన్మకొండ: ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేట్ సంస్థలను పంపించకపోతే తామే తరిమికొడతామని.. ఆ రోజు తప్పక వస్తుందని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండలోని వరంగల్–2 డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ రవాణ సంస్థలుండగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేట్కు అప్పగించడంలో అర్థం లేదన్నారు. ప్రైవేట్ సంస్థలకు రాయితీ లబ్ధిచే కూర్చడానికే ఈ విధానం అవలంబిస్తుందని ఆరోపించారు. కేంద్రం ఇప్పటికై నా తమ విధానాలను మార్చుకోవాలన్నారు. -
70 శాతం పన్ను వసూలు
● ములుగు మున్సిపల్ కమిషనర్ రమేశ్ ములుగు: మున్సిపాలిటీ పరిధిలో 70 శాతం పన్నులు వసూలు అయినట్లు ములుగు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో సిబ్బందితో కలిసి సోమవారం ఇంటి పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి పన్నులు ప్రధాన ఆదాయ వనరు అని, ప్రతీ పౌరుడు తన బాధ్యతగా ఇంటి పన్నుతో పాటు ఇతర పన్నులను సమయానికి చెల్లించాలని సూచించారు. బకాయిలు ఉన్న పన్నులను మంగళవారం లోపు చెల్లించాలని ప్రజలను కోరారు. రేపటి నుంచి చెల్లించే పన్నులపై వడ్డీ ఉంటుందని తెలిపారు. -
వినతులు పరిష్కరించండి..
ములుగు రూరల్: ప్రజావాణి–గిరివాణి(గిరిజన దర్బార్)లో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి–గిరివాణిలో బాధితుల నుంచి కలెక్టర్ టీఎస్.దివాకర అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించి ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. వినతులను సంబంధిత అధికారులు పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. 96 దరఖాస్తులు స్వీకరణ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి, గిరివాణి కార్యక్రమంలో 96 అర్జీలను బాధితుల నుంచి స్వీకరించారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 32, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి 9వినతులను బాధితులు అందజేశారు. అలాగే పింఛన్లు ఇవ్వాలని కోరుతూ 32మంది బాధితులు వినతులు అందించగా ఉపాధి కల్పించాలని కోరుతూ ఒకరు వినతి అందించారు. అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 22 మంది బాధితులు కలెక్టర్కు వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్లు పాల్గొన్నారు.రెండేళ్ల క్రితం భర్త మరణించాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. పిల్లలను పోషణతో పాటు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ప్రభుత్వం స్పందించి పింఛన్ వచ్చేలా చూడాలి. – గన్నెర్ల శారద, ములుగు మాది నిరుపేద కుటుంబం. ఇందిరమ్మ ఇళ్ల లీస్టులో ఎల్–1 కింద మా పేరు ఉంది. కుటుంబ సభ్యులందరం చిన్న ఇంట్లో నివసించడం ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి ఇల్లు కేటాయించి ఆదుకోవాలి. – లావుడ్య బాలకుమారి, రంగారావుపల్లి, ములుగు -
రూ. 396.69 కోట్లు
కేయూ అంచనా బడ్జెట్కేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13 కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47 కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ను ప్లానింగ్, నాన్ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొ త్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10 లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50 లక్షలు, అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్.. బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభా గాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఒరియెంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ‘ఐ’ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫె ల్లోలుగా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పా టు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిటలీకరణ, క్యాంపస్లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. –కె. ప్రతాప్రెడ్డి, వీసీ అకడమిక్ సెనెట్లో ఆమోదం -
రాములోరి శోభాయాత్ర
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామంలో సీతారాముల చంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. సాయంత్రం ప్రారంభమైన శోభాయాత్ర గ్రామంలోని పురవీధుల్లో రథం వస్తుండగా భక్తులు ఎదురెళ్లి స్వాగతం పలికి నీళ్లు ఆరబోశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కత్తెర శ్రీనివాస్, కోశాధికారి దీనబాంధవస్వామి, ఉపాధ్యక్షుడు చెన్న రాంబాబు, బాల్య ప్రసాద్, పెండ్యాల సంతోష్, బాల్య సతీష్, అనిల్, జగదీశ్, ఆంజనేయస్వామి మాలధారులు పాల్గొన్నారు. -
రామప్పలో ఆస్ట్రియా దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఆస్ట్రియాకు చెందిన హరల్డ్ సీబాచర్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ములుగు: నేడు(సోమవారం) కలెక్టరేట్లో ప్రజావాణి – గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం ఏటూరు నాగారంలోని ఐటీడీఏలో నిర్వహించే గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జీలను సమర్పించాలని వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
ఉల్లాస్ పరీక్షకు 3,924 మంది హాజరు
ములుగు: జిల్లాలోని 10 మండలాల పరిధిలో గల 182 కేంద్రాలలో ఆదివారం ఉల్లాస్ (అమ్మకు అక్షరమాల) పరీక్ష నిర్వహించగా 3,924 మంది హాజరైనట్లు జిల్లా ఉల్లాస్ నోడల్ అధికారి కృష్ణబాబు తెలిపారు. జిల్లాలో 8,150 మంది నిరక్ష్యరాస్యులు పరీక్ష కోసం నమోదు చేసుకోగా 3,924 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఆదనపు కలెక్టర్ సంపత్రావు, డీఆర్డీఓ శ్రీని వాస్రావు, ఆడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ సిద్ధార్థరెడ్డి పర్యవేక్షించారు. ● టీ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేష్బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
వెదురుతో ఆదాయం
ఏటూరునాగారం: వెదురు మొక్కల పెంపకంతో లక్షల రూపాయల ఆదాయం పొందే పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఏడాదికి రూ. ఒక లక్ష నుంచి ఆపై ఆదాయం పొందేలా పథకాన్ని రూపొందించారు. ఆసక్తి గల రైతులకు మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నారు. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి సదరు రైతులు ఆదాయం పొందవచ్చు. ఈ మేరకు ఏజెన్సీ మండలాలైన ఏటూరునాగారం, ఎస్ఎస్తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొదటగా మొక్కలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏటూరునాగారంలోని ఇండస్ట్రీ ఫౌండేషన్ ఎన్జీఓ ద్వారా 5 లక్షల మొక్కలను పెంచి సెర్ప్ ద్వారా రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇండస్ట్రీ ఫౌండేషన్ 2 లక్షల తుల్డా, ల్యాగిస్టాటిస్ అనే వెదురు రకాల మొక్కలను నర్సరీలో పెంచుతోంది. ఇంకా 3 లక్షల మొక్కలను పెంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేసేలా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా.. ప్లాస్టిక్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులను వాడుతూ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అలాంటి ప్లాస్టిక్ మహమ్మారిని తరిమివేయడానికి ప్రత్యామ్నాయంగా వెదురుతో తయారు చేసిన క్లాత్లు, సంచులు, ఫర్నీచర్, బాటిల్స్ తయారు చేయిస్తాం.. అలాగే ఇతర వస్తువులను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికే వెదురు సాగును మరింత విస్తరింపజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వెదురు సాగుతో లాభాలు ఇలా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందడంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం 75 వేల మంది రైతులకు ఉపాధి కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించింది. నాటిన 3–4 సంవత్సరాల నుంచి కాపు మొదలై 50 ఏళ్ల వరకు వస్తుంది. నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు, ఏటవాలు ప్రాంతాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. కాగితం పరిశ్రమ, ఫర్నీచర్, హస్తకళలు, అగర్బత్తీల తయారీకి ఈ కర్రను భారీగా వినియోగిస్తారు. రైతులకు ఉచితంగా మొక్కలను ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా అందిస్తుంది. మొక్క సంరక్షణకు నెలకు రూ.12.53ల చొప్పున 30 నెలల పాటు చెల్లించే అవకాశం ఉంది. పట్టాదార్ పాస్ బుక్, ఆధార్కార్డు, ఉపాధి హామీ జాబ్కార్డుల జిరాక్స్లను మండల ఈజీఎస్ అధికారులకు మొక్కలు కావాల్సిన రైతులు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని ఆరు మండలాల్లోని రైతులకు ఉచితంగా మొక్కలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆధార్కార్డు, పట్టాదారు పాస్పుస్తకం, ఉపాధి హామీ జాబ్కార్డులు ఉన్న ప్రతీ రైతు ఈ వెదురు సాగును చేయవచ్చు. వెదురు మొక్కలను పెంచడం వల్ల అత్యంత ఆదాయంతో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కవ రోజులు దిగుబడి పొందే అవకాశాలున్నాయి. రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకు రావాలి. ఏటూరునాగారంలోనే నర్సరీ ఉండడం వల్ల వెదురు ఎన్ని మొక్కలు అయినా ప్రభుత్వం ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసింది. – చరణ్రాజ్, ఈజీఎస్ ఏపీఓ, ఏటూరునాగారంవెదురు సాగుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులతో పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులు సైతం కొరత ఏర్పడే అవకాశాలు ఉండడంతో వెదురు సాగు మరింత వేగవంతం చేశారు. వెదురు కు మార్కెట్లో అత్యంత డిమాండ్ నెలకొంది. కిలో వెదురును రూ. 10ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. టన్నుకు రూ.10వేలు రైతులకు ధర పలికే అవకాశం ఉంది. ఇలా 50 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తూనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఏజెన్సీ మండలాలు నెలకు ఒక్కో మొక్కకు రూ.12.53 చెల్లించనున్న ప్రభుత్వం నర్సరీలో రెండు లక్షల మొక్కలు -
పక్కాగా పంటల సర్వే
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026● డిజిటల్ విధానంలో నమోదు ● వివరాలు సేకరిస్తున్న వ్యవసాయ అధికారులు ● డీసీఎస్ యాప్లో మొబైల్ ద్వారా వివరాలు ఎంట్రీలక్నవరంలో పర్యాటకుల సందడి గోవిందరావుపేట: మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు పరిసరాల్లో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో లక్నవరం జలాశయం కిటకిటలాడింది. మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో పర్యాటకులు సాయంత్రం వేళలో లక్నవరం చేరుకుని వేలాడే వంతెనలపై నడుస్తూ బోట్లలో షికారు చేశారు. ఈ సందర్భంగా సరస్సు అందాలను తిలకించి సెల్ఫీ, ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు.గోవిందరావుపేట: జిల్లాలో ఇరవై రోజులుగా పంటల నమోదు(డిజిటల్ క్రాప్ సర్వే బుకింగ్) ప్రక్రియ పక్కాగా కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు సాగు చేశారు..దిగుబడిపై అంచనా వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలతో మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆహార ధాన్యాల లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది. 1.70 లక్షల ఎకరాల్లో.. ములుగు జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. నర్సింహాసాగర్, పాలెం వాగు, గుండ్లవాగు, మల్లూరు ప్రాజెక్ట్లతో పాటు రామప్ప, లక్నవరం లాంటి చెరువులు ఉన్నాయి. దీంతో పాటు బోర్లు, బావుల కింద వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. సుమారుగా ఏటా వానాకాలం సీజన్లో 1.70 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 85 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వరి, మిరప, పత్తి వంటి పంటల సాగుతో పాటు వాణిజ్య పంటలపై స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు. 249 వలంటీర్ల నియామకం జిల్లాలో 10 మండలాల పరిధిలో సుమారుగా 2 లక్షల ఎకరాలకు పైగా సర్వే సాగుతోంది. సర్వే చేసేందుకు నిరుద్యోగ యువతను వలంటీర్లుగా తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 249 మంది వలంటీర్లను నియమించగా 20 రోజుల క్రితం నుంచి సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన డీసీఎస్ యాప్లో మొబైల్ ద్వారా వివరాలు పొందుపరుస్తున్నారు. ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే కెడెస్టల్ మ్యాప్ డిస్ప్లే అవుతుంది. ఆ మ్యాప్లో 5 నుంచి 10 మంది రైతుల పేర్లు, వారి భూముల సర్వే నంబర్లు వస్తాయి. అక్షాంశం, రేఖాంశాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వలంటీర్లు ఖచ్చితంగా రైతును సెలెక్ట్ చేసుకుని సర్వే నంబర్ ఉన్న భూమి దగ్గరకు వెళ్తున్నారు. పొలాల దగ్గరకు వెళ్లి రైతు పేరు, ఆధార్ నంబర్తో పాటు ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో నమోదు చేస్తున్నారు. అనంతరం దానిని ఏఈఓలు వెరిఫై చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 56 శాతం మేర సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లా ముందడుగులో ఉంది. రైతులు సహకరించాలి.. జిల్లాలో పంటల సర్వే నమోదు వేగంగా జరుగుతోంది. ఏఈఓల పర్యవేక్షణలో ఈ సర్వేను వలంటీర్లు చేపడుతున్నారు. రైతుల నుంచి పలు వివరాలు సేకరించి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు ఏఈఓలకు, వలంటీర్లకు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి వివరాలు అందించి సహకరించాలి. – వి. సురేశ్కుమార్, డీఏఓ -
రాజీమార్గమే రాజమార్గం
ములుగు: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్వీపీ సూర్య చంద్రకళ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను జడ్జి శనివారం ప్రారంభించి మాట్లాడారు. కక్షి దారులు తమ కేసులను రాజీ కుదుర్చుకుని, ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని సూచించారు. లోక్ అదాలత్లో కేసులను రాజీ చేసుకుంటే అప్పీల్ ఉండదని, అదే అంతిమ తీర్పు అని వెల్లడించారు. లోక్ అదాలత్లో 1,117 పెండింగ్ కేసులు ఉండగా 422 కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఇందులో 18 ఎమ్వీఓపి కేసులు, కాంపిన్సేషన్ రూ.1,15,50,000లు, 128 కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, 7 సైబర్ క్రైమ్ కేసులు, 35 సివిల్ కేసులు, 234 ఎస్టీసీ కేసులను ఉన్నాయని తెలిపారు. కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిల్లను జడ్జిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.కన్నయ్య లాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధులిక, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, జనరల్ సెక్రటరీ కె.రవీందర్, న్యాయవాదులు నర్సిరెడ్డి, రంగోజు భిక్షపతి, వినయ్ కుమార్, మేకల మహేందర్, సునీల్ కుమార్, సుధాకర్, బానోతు స్వామిదాస్, రాజ్కుమార్, రాజేందర్, మేకల అశోక్, మానస, అర్చన, విజయ్ కుమార్, దిలీప్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
‘రైస్మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’
ములుగు: రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవచూపాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ దివాకరను అసోసియేషన్ కమిటీ సభ్యులు కలిసి రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా మిల్లింగ్, ధాన్యం కొనుగోలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకునే విధంగా కృషి చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీ, మిల్లర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలుగు పరాభవ నామసంవత్సర నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని అమెరికాకు చెందిన బ్రూసీ, సెసీ రోడ్రిగ్లు కొనియాడారు. మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని వారు శనివారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వెల్లడించారు. వారి వెంట టూరిజం స్టేట్ గైడ్ సాయినాథ్ ఉన్నారు. అలాగే రష్యా దేశానికి చెందిన ఆసియా, మన దేశానికి చెందిన ఏడ్లూరి నవీన్ దంపతులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా ప్రముఖ కవి శ్రీనివాసచార్య కుటుంబ సమేతంగా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. -
రైతులకు పరిహారం చెల్లించాలి
● రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి గోవిందరావుపేట: గతేడాది ఏప్రిల్ 7న కురిసిన వడగళ్ల వానకు పంటనష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పస్రా గ్రామంలో రైతుసంఘం మండల కమిటీ సమావేశం గుండు రామస్వామి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వడగళ్ల వానలతో మండలంలోని వేలాది ఎకరాల్లో పంటలు 50 నుంచి 80 శాతం వరకు దెబ్బతిన్నాయన్నారు. రైతు సంఘం ఆందోళనలతో అధికారులు సర్వే చేసి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. స్పందించిన ప్రభుత్వం ఎకరాకు రూ.19వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించిందని వెల్లడించారు. ఆ నష్టపరిహారం ఇప్పటి వరకు బాధిత రైతుల అకౌంట్లలో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాకు విడుదల చేసిన రూ.5.72 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు కోటేశ్వరరావు, సూర్యనారాయణ, భిక్షం, లెనిన్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆపద్బాంధవులు
● పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలు ● ఆపదలో ఆదుకుంటున్న 108 సిబ్బంది ● ఏడాదిలో 18,886 కేసులకు స్పందన ● అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యసేవలు ● గిరిజన ప్రాంతంలో ఘనమైన సేవలుములుగు: బండారుపల్లిలో హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ ములుగు: అడవులు, కొండలు, రహదారి సరిగా లేని మారుమూల గ్రామాలు, అడవుల్లో నివాసముంటున్న గొత్తికోయల ఆవాసాలు. దూరప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాలతో కూడిన జిల్లా ములుగు. ఇక్కడ అత్యవసర వైద్యసేవలు అందించడం సవాల్తో కూడిన సహవాసం. వర్షాకాలంలో పొంగి ప్రవహించే వాగులు, వంకలు, గిరిజన గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్ లేక అవస్థలు పడుతున్న ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు. ప్రాంతం ఏదైనా పల్లె ఎక్కడ ఉన్నా.. అత్యవసర సమయాల్లో వచ్చే ప్రతీ కాల్కు స్పందిస్తూ రాత్రింబవళ్లు నిరంతరం సేవలు అందిస్తూ ప్రతీ ప్రాణాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలుగా నిలుస్తున్న 108 సిబ్బందిపై సాక్షి ప్రత్యేక కథనం. 10 మండలాలు..14 అంబులెన్స్లు ములుగు జిల్లా 10 మండలాల పరిధిలోని 171 గ్రామ పంచాయతీలతో పాటు, ములుగు మున్సిపాలిటీ పరిధితో కలిపి 14 అంబులెన్స్ల సిబ్బంది నిరంతరం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. 108 అంబులెన్స్లో పైలట్ (డ్రైవర్)తో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉంటారు. 108కు కాల్ రాగానే సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స చేయడం, రోగిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో అనేక మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. అంబులెన్స్లో ప్రసవాలు అనేకం డెలివరీ కేసులపై 108 సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గర్భిణులు నొప్పులు మొదలు కావడంతో కుటుంబసభ్యులు 108కి కాల్ చేయడం, వెంటనే అక్కడకు చేరుకొని ఆస్పత్రికి తరలించే సమయం లేకపోవడంతో అనేక మంది గర్భిణులకు 108 అంబులెన్స్లోనే సిబ్బంది పురుడు పోసి తల్లి, శిశువు క్షేమంగా ఉండేలా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏడాదిలో సుమారు 60 మందికి పైగా గర్భిణులకు పురుడు పోసి తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా సేవలందించారు. రోడ్డు ప్రమాదం జరిగిన, గుండెపోటు వచ్చిన ఆస్పత్రికి వెళ్లేలోపు గోల్డెన్ ఆవర్లో చికిత్స ఎంతో అవసరం, ఈఎంటీ ప్రాథమిక చికిత్స చేస్తే పైలట్ ట్రాఫిక్ సమస్యను దాటుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కంటికిరెప్పలా కాపాడుతూ సరైన సమయంలో ఆస్పత్రికి చేర్పించి ప్రాణాలు నిలబెడుతూ వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. 18,886 కేసులకు స్పందన ప్రమాదం, ప్రసవవేదన, జ్వరం, పాముకాటు, శ్వాస ఇబ్బంది, గుండెపోటు, జబ్బు ఏదైనా సకాలంలో వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాలిలో కలవక తప్పదు. ఏ అత్యవసర పరిస్థితి అయినా మేమున్నామంటూ.. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు రక్షిస్తూ మెరుగైన సేవలందిస్తున్నారు. జిల్లాలో 2025 మార్చి 31 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు 18,886 కేసులకు స్పందించి వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ సకాలంలో ఆస్పత్రికి చేర్చారు. 1,569 రోడ్డు ప్రమాద కేసులు, 2,461 గర్భిణుల కేసులు, 827 మంది సృహ కోల్పోయిన కేసులు, 2,437 కడుపునొప్పి కేసులు, 1,251 శ్వాసకోస సంబంధిత కేసులు, 953 డొమెస్టిక్ ప్రమాదాలు, 932 గుండెనొప్పి సంబంధిత కేసులు, 863 పాయిజన్ కేసులు, 647 ఫిట్స్ కేసులు, 368 ఆత్మహత్యాయత్నం కేసులు, 271 పెరాలసిస్ కేసులు, 445 జంతు దాడి కేసులు, 46 బర్నింగ్ కేసులు, 5,816 ఇతర సంబంధిత కేసులకు సకాలంలో స్పందించి వైద్యసేవలు అందించారు.ఆపదలో ఆదుకోవడమే మా కర్తవ్యం ఆపద సమయంలో ఆదుకోవడమే మా కర్తవ్యం. బాధితులు ఫోన్ చేసిన వెంటనే సాంకేతికత ద్వారా ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలుసుకొని సంఘటనకు దగ్గరలో ఉన్న 108 సిబ్బందికి సమాచారం అందిస్తాం. వాహనం 30 సెకన్లలోపే బయలు దేరి దూరాన్ని బట్టి సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. –శివకుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నిత్యం అందుబాటులో.. 108 సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 108 ఉచిత సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందిస్తారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేస్తారు. –రాజ్కుమార్, 108 జిల్లా మేనేజర్అంబులెన్స్లో వైద్యం కన్నాయిగూడెం : పొట్టకూటి కోసం పనికి వచ్చి సొమ్మసిల్లి ప్రాణాపాయస్థితికి వెళ్లిన ఓ వ్యక్తికి 108 సిబ్బంది అంబులెన్స్లో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన మండలంలోని ఏటూరులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన ఉప్పుటూరి లక్ష్మయ్య మేసీ్త్ర పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇళ్లు నిర్మించేందుకు మండలంలోని ఏటూరు గ్రామానికి వచ్చాడు. అతడికి షుగర్ లెవల్స్ తగ్గే సమస్య ఉన్నట్లు తెలిసింది. లక్ష్మయ్యకు శుక్రవారం ఒక్కసారిగా షుగర్ లె వల్ పూర్తిగా తగ్గడంతో సొమ్మసిల్లి పడిపోయి ప్రాణపాయ స్థితికి వెళ్లాడు. గమనించిన తోటికూలీలు 108కు సమాచారం అందించారు. మండలంలోని 108 వాహన సిబ్బంది సంఘటన వద్దకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మయ్యను ఈఎంటీ కల్యాణ్ చికిత్స చేసి పైలెట్ సతీష్ సహకారంతో ఏటూరునాగారంలోని సీహెచ్సీకి తరలించారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026సీతారాముల కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రామాలయాలు, ఆలయాలు, మండపాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కల్యాణ తంతు జరిపించారు. జిల్లా కేంద్రంతో పాటు కాశిందేవిపేట, మహ్మద్గౌస్పల్లి, మల్లంపల్లి, ఇంచర్ల, జగ్గన్నపేట, దేవగిరిపట్నంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలతో ఆలయ ప్రాంగణాలు మా ర్మోగాయి. మహ్మద్గౌస్పల్లిలో కులమతాలకు అతీతంగా ముస్లింలు రాములోరి కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. – ములుగు – మరిన్ని ఫొటోలు 9లోu జై శ్రీరాం నినాదాలతో మార్మోగిన ఆలయాలు -
హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమిస్తాం
● రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు రామారావుమంగపేట: ప్రభుత్వం అన్నదాతలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే చేసేవరకు ఉద్యమిస్తామని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో ఆ సంఘ నాయకులతో కలిసి చలో కరీంనగర్ రైతు మహాగర్జన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 28న లక్షమందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరీ సభను విజయవంతం చేయాలన్నారు. హామీలను నెరవేర్చేలా ప్రభుత్వానికి, పాలకులకు మనసు మార్చాలని కోరుకుంటూ లక్ష్మీనర్సింహాస్వామికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సభ డిమాండ్లను అమలు చేయాలని, లేదంటే ప్రజా సంఘాలు, రైతులు, విద్యార్థి సంఘాల మద్దతుతో దశల వారీగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెడ్యాల రాంరెడ్డి, ప్రజా సంఘాల జాతీయ నాయకులు అయిత నాగరాజు, రాజయ్య, అంజయ్య, తదితరులు ఉన్నారు. రూ.200కోట్ల స్కాం ఎలా అవుతుంది? ● మేడారం ట్రస్టు బోర్డ్ చైర్పర్సన్ సుకన్య ఎస్ఎస్తాడ్వాయి: మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు అయితే రూ.200 కోట్ల స్కాం ఎలా అవుతుందని మేడారం ట్రస్టు బోర్డ్ చైర్పర్సన్ ఇర్ప సుకన్యసునీల్ దొర ప్రశ్నించారు. ఆలయ ప్రాంగణ పునర్నిర్మాణం, జాతర ఏర్పాట్లపై రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ గుంటురు సతీష్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం స్పందించారు. మేడారం జాతరకు మీరు చేసిన సేవలేమిటో ముందుగా చెప్పాలని, నాలుగు నెలలకొకసారి వచ్చి ఆరోపణలు చేసి వెళ్లడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. జాతర సమయంలో మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సమయాభావం ఉన్నప్పటికీ ఇతర పనులను ఆపి ప్రాంగణ పనులను పూర్తి చేసిన ఘనత మంత్రి సీతక్కదేనన్నారు. ఆదివాసీ సంప్రదాయం, సమ్మక్క–సారలమ్మ తల్లుల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయడమే మంత్రి సీతక్క లక్ష్యమని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం మానుకుని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. జిల్లా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఇకనైనా సతీష్రెడ్డి వైఖరి మార్చుకోవాలన్నారు. -
గోదావరి పరిరక్షణ యాత్ర
కాళేశ్వరం: గోదావరి పరిరక్షణ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజు శుక్రవారం మహారాష్ట్రలోని పూనాకు చెందిన సద్గురు ఉద్యోగ మహారాజ్ శ్రీ క్షేత్ర ఆలంది ఆధ్వర్యంలో బృందం మహదేవపూర్ మండలం కాళేశ్వరం చేరుకుంది. త్రివేణి సంగమం ఘాటు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. పరిశ్రమలకు ఇంక్యుబేషన్.. నిట్ వరంగల్కాజీపేట అర్బన్: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్లా నిట్ వరంగల్ నిలుస్తుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరి యంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్) రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడుతూ నిట్ వరంగల్ ఇ న్నోవేషన్ సెంటర్ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్, ఇన్నోవేషన్, ఏఐ ఎగ్జిబిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఎల్అండ్టీ అడ్వైజర్ వినాయక్ మరాఠే పాల్గొన్నారు. -
రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు
● జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు ములుగు: జిల్లాలో కూరగాయల సాగును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, రైతులకు అదనపు ఆదాయం కల్పించడానికి కూరగాయల విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో రైతులకు వెజిటబుల్ మిని కిట్లను గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. ఆసక్తి గల రైతులకు రూ. 500 విలువ గల ఐదు రకాల కూరగాయల విత్తనాల కిట్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంలో అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఎక్కువ ధరలకు కూరగాయలు కొనుగోలు చేయకుండా జిల్లాలో 625 ఎకరాల్లో సాగు చేసేందుకు 1250 వెజిటబుల్ కిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కిట్లో టమాట, మిర్చి, బెండ, గోడుచిక్కుడు, పాలకూర విత్తనాలు ఉంటాయని, ఇవి 20 గుంటలకు విత్తనాలు సరిపోతాయని వివరించారు. ఆసక్తి గల రైతులు పటా పాస్బుక్, ఆధార్ కార్డు, ఫొటోతో జిల్లా కార్యాలయంలో అందజేసి కిట్ను పొందాలని సూచించారు.వివరాలకు సెల్ నంబర్ 7702383263లో సంప్రదించాలని వెల్లడించారు. -
బాలికల విద్యకు భరోసా
ములుగుIశుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026ములుగు రూరల్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా విద్యాభోదన అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు కేజీబీవీ పాఠశాలలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్(వైఐఐఓఈ)గా గుర్తించింది. ఎక్సలెన్స్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందేందుకు ఎంట్రెన్స్ నిర్వహించి అర్హత సాధించిన వి ద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు కల్పించనున్నారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంపికై న ఇంటర్మీడియట్ విద్యార్థులకు సాధారణ విద్యాబోధనతో పాటు నీట్, జేఈఈ, క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. వైఐఐఓఈలుగా ఎంపికై న పాఠశాలలు జిల్లాలో 9 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఎక్సలెన్స్ పాఠశాలలుగా వెంకటాపురం(ఎం) కేజీబీవీ పాఠశాలలో బైపీసీ విద్యార్థులకు నీట్ కోచింగ్ ఇవ్వనున్నారు. అలాగే గోవిందరావుపేట మండలం చల్వాయి కేజీబీవీ పాఠశాలలో ఎంపీసీ, ఐఐటీ, జేఈఈ కోచింగ్, ఎస్ఎస్తాడ్వాయి కేజీబీవీ పాఠశాలలో సీఈసీ, క్లాట్ కోచింగ్ ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఎంపికై న కళాశాలల్లో 40 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. ఎంట్రెన్స్తోనే అడ్మిషన్లు వైఐఐఓఈలుగా గుర్తింపు పొందిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో అడ్మిషన్లకు ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 5వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కేజీబీవీ సెక్టోరియల్ అధికారులు సూచిస్తున్నారు. కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూప్లలో 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు శని, ఆదివారాలలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు తరగతులు నిర్వహించనున్నారు. 2026–27 విద్యాసంవత్సరంలో వైఐఐఓఈలుగా ఎంపికై న కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థినులు ప్రవేశ పరీక్షలు రాయాలి. విద్యార్థినులు ఆన్లైన్లో హెచ్టీటీపీ/టీజీఆర్జేసీ.జీఓవీ.ఇన్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. ప్రతిభ ఆధారంగా విద్యార్థినుల ఎంపిక ఉంటుంది. నీట్, జేఈఈ, క్లాట్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేశాం. – రజిత, జిల్లా కేజీబీవీ సెక్టోరియల్ అధికారి ఇంటర్మీడియట్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష తప్పనిసరి నీట్, జేఈఈ, క్లాట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ -
మహిళల భద్రతకు పెద్దపీట
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: నిర్భయ నిధులతో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో ‘ఇన్ క్లూజివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్’ పైలట్ ప్రాజెక్ట్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని తన ఛాంబర్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మహిళల భద్రతకు తీసుకునే చర్యలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. జిల్లాలోని మహిళలు, బాలికలకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతంగా ఉండేలా పింక్ ఆటోస్ వంటి సౌకర్యాలను కల్పించామన్నారు. జన సమూహ కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటు, వివిధ పనులు చేస్తున్న బాలింతలు, వారి శిశువుల భద్రత, పరిరక్షణకు పని ప్రదేశాల్లో ప్రత్యేక క్రెష్ సెంటర్ల ఏర్పాటు, డే కేర్ సెంటర్లను జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలైన మేడారం, లక్నవరం, రామప్ప, బొగత, మల్లూరు, దేవాదుల మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాలతో కూడిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డిడబ్ల్యూఓ ప్రేమలత, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఆర్టీఓ శ్రీనివాస్, డీఎంసీ రమ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలో ప్రజలకు సరిపడా ఇంధన, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హేమాచలక్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ను వెంటనే సిద్ధం చేయాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. హేమాచలక్షేత్రాన్ని కలెక్టర్ దివాకర దేవాదాయ ధర్మాదాయ శాఖ, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు, ఆలయ పూజారులతో కలిసి ఆలయ ప్రాంగణం పరిశీలించారు. ఏప్రిల్ 27నుంచి బ్రహ్మోత్సవాలు, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కల్పించాల్సిన వసతులపై సూచనలు చేశారు. -
రామప్పలో అద్భుతం..
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయంలో అద్భుతం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 6.30 గంటలకు గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. సహజసిద్ధమైన వెలుతురులోనే కాంతివంతంగా దర్శనమిచ్చే రామలింగేశ్వరస్వామిపై సూర్యకిరణాలు పడటంతో గర్భగుడి మరింత కాంతివంతంగా కళకళలాడింది. శివలింగంపై పడుతున్న సూర్యకిరణాలను చూసి భక్తులు అనుభూతికి లోనయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామప్ప ఆలయ ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీశ్ శర్మ మాట్లాడుతూ.. ఏటా ఏదో ఒక మాసంలో శివలింగంపై సూర్యకిరణాలు రెండు నుంచి మూడు రోజులు పడతాయని వెల్లడించారు. కాకతీయుల కాలంలోనే శివలింగంపై సూర్యకిరణాలు పడేలా రామప్ప ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. -
పండ్ల తోటలకు ప్లాన్
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా రూ.23.12 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో వారం రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించినట్లు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 28 గ్రాములు, మిశ్రమ వెండి 1.3 కిలోలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు అనిల్కుమార్, సర్పంచ్ సావటి మెగిళి, జీపీఓ రవీందర్, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి, కొడవటంచ భజన బృందాలు పాల్గొన్నారు.ములుగు రూరల్: నేటి డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్– 2డిపో మేనేజర్ రవిచందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (గురువారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు జిల్లా ప్రజలు ఆర్టీసీ సమస్యలపై ఫోన్ ద్వారా సంప్రదించి వివరించాలని సూచించారు. ఫోన్ నంబర్ 9959558556కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భద్రకాళి అమ్మవారికి పుష్పార్చనహన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చా మంతి పూలకు సంప్రోక్షణ జరిపి అ మ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రోహిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధ ర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అ లాగే, కాసం పుల్లయ్య వస్త్ర దుకాణం అధినేత కాసం నమశ్శివాయ ఆలయానికి 16 ఎల్ఈడీ లైట్లను అందజేశారు. దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్, వాసవీకబ్ల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు. ప్రమాద బీమా చెక్కు అందజేత భూపాలపల్లి అర్బన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డ్ నేరుపాటి మొగిలి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కును బుధవారం అందజేసినట్లు బ్రాంచీ మేనేజర్ రామస్వామి తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి చేతుల మీదగా బ్యాంక్ ఆవరణలో చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో ఇంకా సుమారు 60 మంది ఉద్యోగులు ఈ సౌకర్యం లేని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారని, వారు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లోని కార్పొరేట్ శాలరీ ఇన్సూరెన్స్ పథకంలోకి మారాలని సూచించారు. గనులు, విభాగాల వారీగా ఖాతాలు మార్చుకోవాల్సిన వారి సంఖ్యను వివరించారు. డిపార్ట్మెంట్లలో 12 మంది, కేటీకే–1లో 12 మంది, కేటీకే–5లో 9 మంది, కేటీకే–6లో 13 మంది, కేటీకే–8లో 8 మంది, కేటీకే ఓసీ–2లో ఆరుగురు ఉన్నట్లు తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో లక్షతులసి అర్చనహన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఏడో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతారాములకు లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు విశ్వక్సేనారాధన, పంచసూక్తములతో చతుర్వేద మూలమంత్రంగా అర్చనలు చేశారు. కమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు చిన్న కోనయ్య–ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తులసి దళాలతో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు లక్ష తులసి అర్చన చేశారు. హెచ్ఎన్టీసీలో మొక్కల పెంపకానికి ఐటీడీఏ అధికారుల కసరత్తుఏటూరునాగారం: పండ్ల తోటల పెంపకానికి ఐటీడీఏ పక్కా ప్లాన్ వేసింది. ఈ మేరకు ఎక్కెల గ్రామంలోని ఐటీడీఏ పరిధిలో గల హర్టికల్చర్ నర్సరీ ట్రైనింగ్ సెంటర్(హెచ్ఎన్టీసీ) స్థలాన్ని అధికారులు బ్లాక్లుగా విభజించారు. 20 ఎకరాల స్థలంలో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇటీవల సాక్షిలో ‘మోడల్’ ప్లాంటేషన్ శీర్షికన కథనం ప్రచురితం కాగా కలెక్టర్ దివాకర స్పందించారు. ఈ విషయంపై ఐటీడీఏ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఆయిల్పామ్ తోటల్లో అంతర్ పంటగా పండ్ల మొక్కలను నాటి పెంచాలని సూచించారు. నీటి వసతికి అధికారుల ప్రయత్నాలు గతంలో ఆయిల్పామ్ మొక్కలను అధికారులు నాటించారు. ఆ మొక్కలకు నీటి వసతికి సంబంధించి బోర్లు వేయించారు. అధికారులు మొక్కలు నాటించి గాలికి వదిలేశారు. దీంతో విద్యుత్ స్టార్టర్ సైతం మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించిన అధికారులు స్టార్టర్ మరమ్మతులతో పాటు పైపులైన్లు, డ్రిప్ సిస్టంను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంజనీర్ల సాయంతో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఒక్కో ఎకరంలో ఒక్కో రకం మొక్కలు హెచ్ఎన్టీసీ స్థలంలో వివిధ రకాల పండ్ల మొక్కలను ఒక్కో ఎకరంలో ఒక్కో రకం మొక్కలు పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారుగా 20 ఎకరాలు ఉన్న స్థలాన్ని బ్లాక్లుగా విభజించారు. ఐటీడీఏ అధికారులు ఎక్కడ ఎలాంటి పండ్ల మొక్కలను పెంచాలనే అంశాలపై ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ను కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ దివాకరకు వివరించి అప్రోల్ తీసుకునే అవకాశాలున్నాయి.ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు సంపూర్ణమైన పౌష్టికాహారం అందుతుందని ములుగు సీడీపీఓ శిరీష అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని ఇంచర్లలో రైతు వేదికలో అంగన్ వాడీ టీచర్లు, ప్రజా ప్రతినిధులతో 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారం మిషన్ 2.0 ప్రాముఖ్యతను వివరించారు. అలాగే అమ్మబాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. కేంద్రాలలో చేపట్టే కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు స్థలం కేటాయించాలన్నారు. జూన్ 12వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలలో రోజువారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ ఓంకార్, ములుగు ప్రాజెక్టు పరిధిలోని సర్పంచ్లు, ములుగు కౌన్సిలర్లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.అట్రాసిటి కేసుల పరిష్కారానికి కృషిములుగు రూరల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నమోదైన అట్రాసిటి కేసులు, పరిష్కారమైన కేసులు, బాధితులకు అందిన పరిహారం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో కేసు పుర్వాపరాలను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ విధివిధానాల మేరకు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. అనంతరం ఏటూరునాగారం ఏఎస్పీ మనన్భట్ మాట్లాడుతూ అట్రాసిటి కేసుల విషయంలో త్వరితగతిన చర్యలు చేపడతామని వివరించారు. ఎఫ్ఐఆర్, చార్జిషీట్, పరిష్కారమైన కేసులు, విచారణలో ఉన్న కేసుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ఎస్సీ వెల్పేర్ ఆఫీసర్ కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ రమేశ్, డీపీఓ వెంకయ్య, డీఎంహెచ్ఓ గోపాల్రావు, మానిటరింగ్ కమిటీ సభ్యులు జన్ను రవి, రాంబాబు, నరేందర్, కృష్ణ, రామునాయక్, తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణకు సహకరించాలి ఓటరు జాబితా సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ 72.47 శాతం పూర్తయిందని తెలిపారు. పారదర్శకంగా, ఖచ్చితంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీల నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. అర్హులందరికీ బ్యాంకు రుణాలు ఏటూరునాగారం: అర్హులందరికీ బ్యాంకు రుణాలను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ దివాకర బ్యాంకర్లను ఆదేశించారు. ఈ మేరకు ఐటీడీఏ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల అధికారులతో బుధవారం కలెక్టర్ వివిధ ప్రభుత్వ పథకాల రుణాల పురోగతిపై సమీక్షించారు. వ్యవసాయం, విద్య, స్వయం ఉపాధి రంగాలకు బ్యాంకర్లు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాప్యం లేకుండా అర్హులకు రుణాలు అందజేయాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిశీలించి గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీఓ వసంతరావు, ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, ఎస్ఓ రాజ్కుమార్, వివిధ బ్యాంక్ అధికారులు, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు పలువురు నష్టపోయారని, వారిని పరిహారం ఇచ్చేందుకు పలు విత్తన కంపెనీలు ముందుకొచ్చినట్లు తుడుందెబ్బ మండల అధ్యక్షుడు నీలాద్రి తెలిపారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అగ్రికల్చర్, విత్తన కంపెనీల యజమానులు వచ్చి బుధవారం పరిశీలించారు. ఈ మేరకు రాశి సీడ్స్ కంపెనీ వారు పరిశీలించి పరిహారం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారని వివరించారు.ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటూరునాగారం ఆర్ఐటీఐ కళాశాలలో ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో ఆడ్మిషన్లను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. నూతనంగా ఆరు రకాల కోర్సులను వినియోగంలోకి తీసుకొచ్చి నట్లు వెల్లడించారు. బ్యారేజీ వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న రివర్ బోర్డు అధికారులు కన్నాయిగూడెం: అడవుల సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని గోదావరి రివర్ బోర్డు చైర్మన్ బీపీ.పాండ్యా అన్నారు. మండల పరిధిలోని తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీని బుధవారం రివర్బోర్డు కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు సందర్శించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా బ్యారేజీ ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. బ్యారేజీ ప్రాంతం పరిసరాలను శుభ్రం చేయించారు. అనంతరం బ్యారేజీ పరిసరాల్లో పాండ్యా కమిటీ మెంబర్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవుల పెంపకంతో స్వచ్ఛమైన గాలితో పాటు సమృద్ధిగా వర్షాలు పడుతాయని వివరించారు. అలాగే జీవకోటి మనుగడకు దోహదపడుతాయని తెలిపారు. అడవులు తరిగిపోతే మానవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో బోర్డు మెంబర్లు సతీష్ కుమార్ కోంబోజ్, ఆర్ఎం రంగరాజన్, ఎస్ఈ రవికుమార్, ఈఈ వేణుగోపాల్, డీఈ ఎండీ.షర్మి ల, ఎస్ఈఈ సతీష్ బాబు పాల్గొన్నారు. 20 ఎకరాల్లో వివిధ రకాల మొక్కలు నాటేందుకు బ్లాక్ల కేటాయింపు ఆయిల్పామ్ తోటల్లో అంతర్పంటగా పండ్ల మొక్కల పెంపకంకలెక్టర్ టీఎస్.దివాకర గోదావరి రివర్ బోర్డు చైర్మన్ బీపీ పాండ్యా -
20శాతం నిధులు కేటాయించాలి
ములుగు రూరల్: ప్రభుత్వం విద్యారంగానికి 20శాతం నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉప్పస్వామి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ టీఎస్.దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 8 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేస్తూ టైమ్ స్కేల్ కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు హట్కర్ సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు, ఏటూరునాగారం జోన్ సెక్రటరీ రాందేవ్, ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గం సభ్యులు దిలీప్, రాజు, సారంగపాణి, శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.40.98 కోట్లు
మొదటి విడత రైతుల ఖాతాల్లో రైతు భరోసాములుగు: వ్యవసాయ భూమి ఉన్న ప్రతీ రైతుకు యాసంగి పంటల సాగు కోసం ఒక ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 86,736 మంది రైతులు 1,73,970 ఎకరాలు సాగు చేస్తుండగా రూ.104.38 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది. ప్రభుత్వం మొదటి విడతగా జిల్లాలోని 79,040 మంది రైతులకు గాను ఒక ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.40,98,59,892 కోట్లు ఖాతాల్లో జమ చేసింది. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రభుత్వం ఈసారి తొలుత ప్రతీ రైతుకు ఒక ఎకరానికి రూ.6 వేల పెట్టుబడి సాయాన్ని అందించింది. అన్నదాతల్లో గందరగోళం రబీ పంటల సాగు ప్రారంభమై రెండు నెలలు దాటినప్పటికీ ప్రభుత్వం ఆలస్యంగా పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వం ఒక ఎకరానికి మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించడంతో అన్నదాతల్లో గందరగోళం నెలకొంది. గతంలో ఒక ఒకరం భూమి ఉన్న రైతులకు మొదటగా, రెండు, మూడు ఎకరాలు ఉన్న రైతులకు తర్వాత, నాలుగు, ఐదు ఎకరాలు ఉన్న రైతులకు క్రమపద్ధతిలో పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసేది. కాని ఈసారి రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఎకరానికి మాత్రమే రైతు భరోసా డబ్బులను ఖాతాల్లో జమచేయడంతో మిగతా భూమికి పెట్టుబడి సాయం వస్తుందో లేదొనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సాయంపై స్పష్టత కరువు ప్రభుత్వం రైతుభరోసా కింద అందిస్తున్న పెట్టుబడి సాయంపై అధికారులకు స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మొదటి విడతగా ఎన్ని ఎకరాలకు, రెండో విడతలో ఎన్ని ఎకరాల వరకు, మూడో విడతలో మొత్తం ఎకరాలకు పెట్టుబడి సాయం వస్తుందా అని రైతులు వ్యవసాయ అధికారులను అడుగుతున్నప్పటికీ తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెబుతుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. రెండో విడత పెట్టుబడి సాయం ఏప్రిల్ 5 నుంచి, మూడో విడత ఏప్రిల్ 25 నుంచి రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం అందుతుందో అధికారులు స్పష్టత ఇవ్వకపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఏప్రిల్ చివరి వరకు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. మొదటి విడతలో ఎకరం వరకు 79,040 మంది రైతులకు రూ.40.98 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి, ఏప్రిల్ 5వ తేదీ నుంచి రెండో విడత డబ్బులు, ఏప్రిల్ 25 నుంచి మూడో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఏఫ్రిల్ 30వ తేదీలోగా పంటలు సాగు చేస్తున్న ప్రతీ రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. – సురేశ్ కుమార్, డీఏఓ రెండు, మూడో విడతలపై కానరాని స్పష్టత ఎకరం భూమికే అందిన పెట్టుబడి సాయం -
మేడారం హుండీ ఆదాయం రూ.88,31,963
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల కానుకల హుండీ ఆదాయం రూ.88,31,963 లక్షలు వచ్చిందని ఈఓ వీరస్వామి తెలిపారు. మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో డార్మెంటరీ భవనంలో సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల సమక్షంలో మంగళవారం హుండీల లెక్కింపు ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ.39,74,504లక్షలు, సారలమ్మ హుండీ ఆదాయం రూ.36,22,256లక్షలు, గోవిందరాజు హుండీ ఆదాయం 2,19,368లక్షలు, పగిడిద్దరాజు హుండీ ఆదాయం 3,44,088లక్షలు, ఈ – హుండీ ఆదాయం 6,71,747లక్షలు కలుపుకుని మొత్తం రూ.88,31,963లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీల లెక్కింపును పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ విజయ్కుమార్, హుండీ ఇన్స్పెక్టర్ అనిల్, పూజారులు, సిబ్బంది పర్యవేక్షించారు. -
నిబంధనలు అతిక్రమించొద్దు
వెంకటాపురం(కె): మెడికల్ షాపుల యజమానులు ఔషధ నియంత్రణ శాఖ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి జిల్లా ఔషధ నియంత్రణ అధికారి పావని అన్నారు. ఈ మేరకు మంగళవారం వెంకటాపురం(కె) మండల కేంద్రంలో మెడికల్ షాపులను తనిఖీ చేశారు. గతంలో తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించిన యజమానులకు సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేసి షాపులను మూసివేయించారు. ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా నోటీసులు జారీ చేసినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడంతో ఐదు రోజుల పాటు లైసెన్స్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. యజమానులు నింబధనలు తప్పని సరిగా పాటించాలని ఆమె సూచించారు. పెట్రోల్ బంక్ల మూసివేత వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని రెండు బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో యజమానులు మంగళవారం మూసివేశారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, కార్లు, అటోలకు పెట్రోల్ దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలువురు బ్లాక్ మార్కెట్లో అధిక ధర చెల్లించి పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. నాయీబ్రాహ్మణులు సంఘటితం కావాలి ములుగు రూరల్: నాయీబ్రాహ్మణులు హక్కుల సాధనకు సంఘటితం కావాలని సంఘం గౌరవ అధ్యక్షుడు జంపాల రవీందర్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. దేవాలయాలు, జాతరలో హక్కుల కోసం పోరాడాలని సూచించారు. వృత్తిదారులపై కార్పొరేట్ శక్తుల దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ములుగు మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శరబందం, ఉపాధ్యక్షుడిగా ముత్యాల రాజు, ప్రధాన కార్యదర్శిగా విష్ణు, కోశాధికారి సాంబయ్య, సహాయ కార్యదర్శిగా నరేందర్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. రోడ్డును నాణ్యతగా నిర్మించాలి ఏటూరునాగారం: మండల కేంద్రంలో కరకట్ట నుంచి ముక్కెరల లాలయ్య ఇంటి వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డును నాణ్యతగా నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డీఈఈ నరేశ్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రలంలోని సీసీ రోడ్డు నిర్మాణం పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఈ నిఖిత్తో కలిసి పరిశీలించారు. మంత్రి సీతక్క చొరవతో రూ. 2.5కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు మంజూరైనట్లు తెలిపారు. సీసీ రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రదాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, అదికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, వల్స తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
క్షయవ్యాధి నిర్మూలనకు పాటుపడాలి
ములుగు/ ములుగు రూరల్: క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడాలని, లక్షణాలను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ములుగులోని ఏరియా ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ –క్షయవ్యాధి దినోత్సవం, ‘క్షయ వ్యాధి –ముక్తుభారత్’ రెండో విడత ప్రారంభం సందర్భంగా మంగళవారం చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో క్షయవ్యాధి నిర్ధారణ, వ్యాధి అరికట్టే చర్యలు, వ్యాధి చికిత్సపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులును ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్ఓ గోపాల్రావు మాట్లాడుతూ టీబీ వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుందన్నారు. టీబీ ముక్తు భారత్ రెండో విడత వందరోజుల కార్యక్రమంలో 14ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా కోఆర్డినేటర్ ఫర్ సర్వీసెస్ జగదీశ్వర్, జిల్లా ప్రోగాం అధికారులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో కొనసాగుతున్న నిర్మాణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే కలెక్టర్ నవజాత శిశువులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించి జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత శాఖలు సమగ్ర నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి గోవిందరావుపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు పూర్తైన ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని నర్సరీని, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఇళ్ల పనులు పూర్తి అయినంత వరకు లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయా అంటూ ఆరా తీశారు. నర్సరీల్లో పెంచే మొక్కలను వర్షాకాలం నాటికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సూర్యనారయణ, ఎంపీఓ మమత, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మండల కేంద్రంలోని పీహెచ్సీలో నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. అలాగే ల్యాబ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విక్రమ్, అనూష, లక్ష్మీ, శ్యామల, జంపయ్య, నీరజ, శివాని, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
మున్సిపాలిటీ అభివృద్ధికి పన్నులు చెల్లించాలి
ములుగు: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నులు విధిగా చెల్లిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు. ములుగు పట్ణణంలో మంగళవారం సిబ్బందితో కలిసి పన్నుల వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి పన్నులు ప్రధాన ఆదాయ వనరులని తెలిపారు. ఇప్పటి వరకు 54 శాతం పన్నులు వసూలు కాగా బకాయి ఉన్న పన్నులను ఈ నెల 31వ తేదీకి ముందు చెల్లించాలని ప్రజలను కోరారు. తర్వాత చెల్లించే పన్నులపై వడ్డీ విధించబడుతుందని, అదనపు భారాన్ని తప్పించుకోవడానికి గడువులోపే పన్నులు చెల్లించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజేందర్, ఆర్ఐ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ రమేశ్, బిల్ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.మున్సిపల్ కమిషనర్ రమేశ్ -
– వివరాలు 8లోu
– సాక్షిప్రతినిధి, వరంగల్ ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు... మానుకోటలో నాలుగు... జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులలో యఽథాతఽథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు... కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజన -
మేడారంలో మంద కృష్ణ పూజలు
ఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సోమవారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతి గొప్పగా ఆదివాసీ జాతరగా ఉండటం అభినందనీయమన్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దగ్గరికి వచ్చి దర్శించుకోవడం గొప్ప తరుణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద కుమార్, పుట్ట రవి, గుగిళ్ల పీరయ్య, వేల్పుల సూరన్న, జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు, జిల్లా అధికారి ప్రతినిధి గజ్జల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు కరుణాకర్, చంద్రమౌళి, స్వామి, ప్రశాంత్, రవీందర్, శ్యామ్, మల్లేష్, తిరుపతి, రాంబాబు, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక ఆర్థిక సర్వే ప్రారంభం
ఏటూరునాగారం: మండలంలోని శంకరాజుపల్లిలో సోషియో, ఎకనామిక్ సర్వే నిర్వహించినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం శంకరాజుపల్లిలో సర్వేను చేపట్టారు. ఆదాయం, విద్య, వృత్తి, నివాస స్థితి, జీవన పరిస్థితులపై సమాచారం సేకరించడానికి సర్వే చేపట్టామన్నారు. ఇది ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలు, విధానాలను రూపొందించడానికి సహాయ పడుతుందన్నారు. పర్యవేక్షణ చేసి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారులు భూక్య లాల్నాయక్, రమేష్ బాబు, లక్ష్మీనారాయణ, ఎంపీఎస్ఓలు వంశీ, నాగరాజు, తిరుపతి, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నిండుకుండలా ‘సమ్మక్కసాగర్’
కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలోని గోదావరిపై నిర్మించిన సమ్మక్క సా గర్ బ్యారేజీ నీటి నిల్వ తో నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 5,500 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో బ్యారేజీ ప్రాంతం నీటితో జలకళను తలపిస్తుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 83 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుంది. కాగా గుట్టలగంగారంలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద నీటి పంపింగ్ గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతుంది. వేసవి కాలం కావడంతో దిగువన తాగు నీటి వినియోగం పెరగడంతో పాటు యాసంగి పంటల సాగుకు నీటి వినియోగం పెరిగింది. దీంతో పంపింగ్ వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉండగా ఫేజ్ టులో ఉన్న రెండు మోటార్లలో ఒక మోటారును, ఫేజ్ త్రీలో ఆరు మోటార్లు ఉండగా ఐదు మోటార్లతో అధికారులు నీటిని దిగువకు జిల్లా పరిధిలోని గొల్లబుద్దారం రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. మొత్తం ఆరు మోటార్లతో 1,706 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. నీటి వినియోగం పెరిగితే మిగతా మోటార్లను ఆన్ చేసి పంపింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. వెంకటాపురం (ఎం): తెలంగాణ పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో యూకేకు చెందిన అంతర్జాతీయ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ సోమవారం జిల్లాలోని ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ పర్యటన సందర్భంగా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ కాకతీయుల కళా సంపద, రామప్ప శిల్పకళా వైభవం, ప్రపంచ వారసత్వ గుర్తింపు రామప్ప దేవాలయానికి ఏ విధంగా వచ్చింది, దేవాలయ ప్రాముఖ్యత, ప్లోటింగ్ బ్రిక్స్, సౌండ్ బాక్స్ టెక్నాలజీ, పేరిణి శివతాండవం, పర్యాటక ప్రాముఖ్యతపై రాబర్ట్ పార్కర్కు వివరించారు. తెలంగాణను ఎందుకు సందర్శించాలనే అంశంపై పర్యాటక అవకాశాలు, సాంస్కృతిక సంపద, వివిధ రకాల స్థానిక వంటకాల ప్రత్యేకతలపై ఆయనకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధి కల్యాణ్, టూరిజం గైడ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. లక్నవరంలో.. గోవిందరావుపేట: లక్నవరం ప్రకృతి సోయగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అంతర్జాతీయ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ అన్నారు. సోమవారం మండలపరిధిలోని లక్నవరం సరస్సును లక్నవరం టూరిజం మేనేజర్ సండ్రపా టి శివశంకర్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఆయన వెంట అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, తదితరులు ఉన్నారు. -
పరిష్కరిస్తాం
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బదిలీ కావడంతో ఐటీడీఏ పీఓగా కలెక్టర్కు బాధ్యతలను అప్పగించడంతో సోమవారం ఐటీడీఏలో గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్జిదారులు ఐటీడీఏకు భారీగా తరలివచ్చారు. గిరిజన దర్బార్లో 130, ప్రజావాణిలో 52 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి ఎస్డీసీ కోర్టు నిర్వహణ చేపట్టడం జరుగుతుందన్నారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనులు ప్రధానంగా తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, కొత్త బోర్వెల్ల ఏర్పాటు, వ్యవసాయ భూముల్లో బోర్ వెల్స్ ఏర్పాటు వంటి అంశాలపై అర్జీలను సమర్పించారు. భూ వివాదాల పరిష్కారానికి ఎస్డీసీ కోర్టును వారానికి నాలుగు రోజులు మంగళ, బుధ, గురు, శుక్రవారాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుతుందన్నారు. ప్రజలు కోరిన మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధి హామీ పథకం నిధులు, ఇతర నిధులను ఉపయోగిస్తూ ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, ఐటీడీఏ ఏఓ రాజ్కుమార్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. సర్వే చేసి అర్హులుగా ప్రకటించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఇల్లు రాకుండా పోయింది. ఇల్లు వచ్చేలా చూడాలి. అద్దె ఇంటిలో ఉంటున్నాం. అధికారులు స్పందించి ఆదుకోవాలి. – పున్నం రుక్మిణిదేవి, సూరవీడు, వెంకటాపురం(కె)ఏటూరునాగారం మండలం శివాపురంలోని సబ్బుల పరిశ్రమలో తయారైన బట్టల సబ్బులను జీసీసీ ద్వారా 2025 నుంచి 2026 ఫిబ్రవరి సరఫరా చేసిన బకాయిలు రూ.31.55 లక్షల బిల్లులు పరిశ్రమకు రావాల్సి ఉంది. పెండింగ్ బిల్లులతో పరిశ్రమకు తీసుకురావాల్సిన ముడి సరుకును తీసుకురాలేకపోతున్నాం. బిల్లులు ఇవ్వాలని జీసీసీ అధికారులను అడిగితే కాస్మోటిక్స్ బిల్లులు రావడం లేదని, దీంతో బిల్లులు ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – సౌజన్య, లక్ష్మీ, పరిశ్రమ గ్రూపు అధ్యక్షురాలు, కార్యదర్శి, శివాపురం● గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్కి విద్యుత్ లైన్ ఇప్పించాలని గ్రామస్తులు కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో కల్టివేషన్ ఉండగా ఫారెస్టు అధికారులు వాహనాలు తీసుకెళ్లారని బాధితులు విన్నవించారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన గిరిజనులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన గిరిజనులకు గిరి వికాస పథకం కింద బోరు మంజూరు చేయాలని కోరారు. ఐలాపురం గ్రామం నుంచి పంట పొలాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరారు. కలెక్టర్ దివాకర టీఎస్ ఐటీడీఏ గిరిజనదర్బార్లో 130 దరఖాస్తులు -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
గోవిందరావుపేట: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని, స్వచ్ఛమైన ప్రాణవాయువుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా అటవీశాఖ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అడవుల సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా ములుగు ప్రథమ స్థానంలో ఉందన్నారు. పంటలు సమృద్ధిగా పండాలన్నా, సరిపడా వర్షపాతం నమోదు కావాలన్నా అడవులే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అడవిని సంరక్షంచడంలో అటవీ శాఖ అధికారులతో పాటు స్థానికులు సహాయ సహకారాలు అందించినప్పుడు అడవుల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రకృతి రమణీయతకు జిల్లా నిలయంగా మారిందన్నారు. అనంతరం డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ మాట్లాడుతూ అడవుల సంరక్షణే ధ్యేయంగా అటవీశాఖ సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. వైల్డ్లైఫ్ అభయారణ్యంలో బ్లాక్బెర్రీ, ఐలాండ్, ఎస్ఎస్ తాడ్వాయి హట్స్, జంగిల్ సఫారీ, బందాల వ్యూ పాయింట్ వంటి పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క పస్రాలో రూ.35లక్షల నిధులతో రాజీవ్ కాలనీకి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కలెక్టర్, డీఎఫ్ఓతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్కార్డులు మంజూరు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రేగ కల్యాణి, కేశవ్, వజ్రారెడ్డి, రమేష్, భూక్య సుమలత, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
నిధులు నిల్
మూడేళ్లకు పైగా రైతు వేదికల నిర్వహణకు అందని డబ్బులుగోవిందరావుపేట: అన్నదాతలకు పంటల సాగులో సలహాలు, సూచనలు చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలను నిర్మించింది. జిల్లాలోని 10 మండలాల్లో మొత్తం 31 రైతు వేదికలు ఉండగా మూడేళ్లకు పైగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధి కారులు ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన మెయింటెనెన్స్ నిధులు రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసే మెయింటెనెన్స్ నిధులు 2022 ఆగస్టు నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు మూడేళ్లకు పైగా ఒక్క రూపాయి కూడా బిల్లులు రాకపోవడంతో నిర్వహణలో అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నెలవారీగా పత్రీ నెలా సమారుగా రూ. 8వేల వరకు ఖర్చు వస్తుందని చెబుతున్నారు. అలాగే విద్యుత్ బిల్లులు, శుభ్రత, చిన్నపాటి మరమ్మతులకు సంబంధించిన ఖర్చులు సైతం భరించాల్సి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు. నెలకు రూ.8వేల నుంచి 9వేల వరకు.. ప్రారంభంలో ప్రతీ రైతు వేదిక నిర్వహణకు నెలకు రూ.3వేల చొప్పున నిధులు కేటాయించారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు విన్నపం మేరకు ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.8 వేలు, మరికొన్ని చోట్ల రూ.9 వేలకు పెంచింది. అయితే 2022 ఆగస్టు నుంచి నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేశారు. ఫలితంగా వేదికల్లో నిర్వహించే శిక్షణ, సమావేశాలు తగ్గిపోయాయి. ఇతర కనీస అవసరాల కోసం సొంత డబ్బులు చెల్లించలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాదికారులు స్పందించి, పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసి రైతు వేదికలను పూర్వ వైభవానికి తీసుకురావాలని కోరుతున్నారు. రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. విద్యుత్, తాగునీటి బిల్లులు, స్వీపర్ ఖర్చులకు సొంతంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నిధులు రాక పోవడంతో రైతు వేదికల్లో జరిగే కార్యక్రమాల నిర్వహణకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించాము. – వి.సురేశ్కుమార్, డీఏఓ ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ అధికారులు రైతులకు అందని సేవలు -
ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ ఏటూరునాగారంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి – గిరివాణి(గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రేపు(సోమవారం) ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అర్జీలను సమర్పించాలని కోరారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. రామప్ప, హేమాచలక్షేత్రంలో జడ్జి ప్రత్యేక పూజలు వెంకటాపురం(ఎం)/ మంగపేట: జిల్లాలోని రామప్ప, హేమాచలక్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన కుటుంబ సభ్యులతో శనివారం సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో రామప్ప ఈఓ ఇమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సత్కరించి స్వామివారి శేష వస్త్రాలను బహుకరించారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంటాల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. అనంతరం మంగపేట మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని జడ్జి సూర్యచంద్రకళ తన బంధువులతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో ఆలయానికి ఆహ్వానించి ఆమె పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ ఈఓ మహేశ్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. -
రైతుభరోసా
86,736 మందికి..● నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం ● రెండు విడతల్లో రూ.104.38 కోట్లు జమ28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ఈనెల 22 నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమచేయనుంది. జిల్లా వ్యాప్తంగా నూతనంగా పట్టాదారుపాస్బుక్లు పొందిన రైతులతో కలిపి సుమారుగా రూ.111 కోట్ల వరకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రెండు విడతల్లో అందించనుంది. కొత్తగా పట్టాదారు పాస్బుక్కులు పొందిన రైతులు ఈ నెల 28లోగా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. – సురేశ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ములుగు: రైతాంగానికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రబీ సీజన్ ప్రారంభమైనా పెట్టుబడి సాయం అందక నిరాశలో ఉన్న అన్నదాతలకు నేటి (ఆదివారం) నుంచి రైతు భరోసా డబ్బులను ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రైతాంగానికి పెట్టుబడి సాయం అందించడంతో కొంత జాప్యం జరిగింది. దీంతో పెట్టుబడి సాయంపై ఏర్పడిన అనిశ్చితికి తెరదించుతూ ఈ నెల 22 నుంచి రైతు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ.104.38 కోట్లు జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 86,736 మంది రైతులు రబీ సీజన్లో 1,73,970 ఎకరాలు సాగు చేస్తుండగా, ఎకరానికి ఆరు వేల చొప్పున రూ.104.38 కోట్ల పెట్టుబడి సాయం రైతు ఖాతాల్లో ప్రభుత్వం రెండు విడతల్లో జమచేయనుంది. గత యాసంగిలో పెట్టుబడి సాయం రాకపోవడంతో ఈసారి కూడా ప్రభుత్వం మొండిచేయి చూపుతుందని భావించినప్పటికీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగానే రైతులకు భరోసా డబ్బులు అందించడంలో జాప్యం జరిగిందని అధికార యంత్రాంగం పేర్కొంటుంది. రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని అందించనుంది. మొదటి విడతగా ఈ నెల 22 నుంచి పెట్టుబడి సాయాన్ని అందించనుండగా, ఏప్రిల్ రెండో వారంలో రెండో విడత డబ్బులను జమచేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొత్తవారికి అవకాశం 2025–26 సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించి కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. కొత్తగా 1,400 మంది రైతులు పట్టాదారు పాస్బుక్లు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో సుమారు 11 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా వేయగా, వారికి పెట్టుబడి సాయం కింద రూ.6.60 కోట్లను ప్రభుత్వం రెండో విడతలో జమచేయనుంది. -
‘బీసీహెచ్సీ’ని సందర్శించిన ట్రెయినీ డీఎస్పీలు
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని నార్లాపూర్ సమీపంలో గల తక్కళ్లగూడెంలోని ఆదివాసీ పిల్లల విద్యాభివృద్ధికి స్థాపించిన భీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ (బీసీహెచ్సీ)ను ట్రెయినీ డీఎస్పీలు గుడెల్లి సృజన, దైనంపల్లి ప్రవీణ్కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్లో చదువుతున్న చిన్నారులతో పాటు గ్రామస్తులతో వారు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు ఏజెన్సీలోని సాధ్యమయ్యే సామాజిక మార్పులను వివరించారు. భీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ చేస్తున్న సేవలను అభినందించారు. ముఖ్యంగా డ్రాయింగ్లో చూపుతున్న ప్రతిభను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ సభ్యులు సంతోష్, దైనంపల్లి ప్రకాశ్, శ్రీలత, కల్పన, రక్షిత, సాయికుమార్, లావణ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని సబ్స్టేషన్ పరిధిలో గల వివిధ గ్రామాలకు నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ స్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కన్నాయిగూడెం సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా 8.30 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్సరఫరాను నిలిపివేయనున్నట్లు వివరించారు. -
బస్టాండ్ పనులు పూర్తిచేయాలి
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కములుగు: జిల్లా కేంద్రంలో రూ.4.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు మంత్రి శనివారం బస్టాండ్ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఆధునిక సదుపాయాలతో కూడిన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. నూతన బస్టాండ్లో ప్రయాణికుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. జిల్లా అభివృద్ధిలో బస్టాండ్ కీలక పాత్ర పోషిస్తుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించినందుకు గాను మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కార్ అవార్డును శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఏప్రిల్ 24న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అవార్డుకు సంబంధించిన వాల్పోస్టర్ను మంత్రి సీతక్కతో కలిసి ఫౌండేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు గాను సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. -
పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా గందరగోళం పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీల ఖరారు ఉమ్మడి వరంగల్లో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
భక్తిశ్రద్ధలతో రంజాన్
ములుగు: జిల్లా వ్యాప్తంగా రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) వేడుకలను శనివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఈద్గా, మసీదులకు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని జామా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనలు చేసి పితృదేవతలను స్మరించుకున్నారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాయ్ బలాయ్ తీసుకున్నారు. రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ ఇంట్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు షాక్!
రాష్ట్ర బడ్జెట్2026–2027బడ్జెట్లో అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం ఓరుగల్లుకు కీలకంగా 10 ప్రాజెక్టులు... జరగని ప్రత్యేక కేటాయింపులు.. కొత్తగా ప్రాజెక్టులను ప్రకటించలేదు. అయితే బడ్జెట్ (ప్రగతి పద్దు)లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, విద్యాసంస్థలకు నిధులు కేటాయించారు. ప్రధానంగా వరంగల్ నగరాభివృద్ధి, ఉన్నతవిద్య, పర్యాటక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపించింది. అయితే, కీలకమైన 10 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించినా.. ప్రత్యేకంగా కేటాయించే నిధులను ప్రస్తావించలేదు. రైల్వే కోచ్ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్కు, మామునూరు ఎయిర్పోర్ట్, ఐటీ టవర్, రింగ్రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాతీయస్థాయి యూనివర్సిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, టూరిజం సర్క్యూట్కు ప్రత్యేక కేటాయింపులు లేకన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా వరంగల్ స్మార్ట్సిటీకి గత బడ్జెట్లో రూ.156.52 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సహాయం కోసం రూ.40 కోట్లు కేటాయించింది. పథకం కింద వరంగల్ స్మార్ట్సిటీ అభివృద్ధి పనుల కోసం రూ.44,137.02 లక్షలు కేటాయించారు.● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● కేటాయింపుల్లో ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీటసాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. శాసనసభలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రగతిపద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ వరంగల్ పేరుతో ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన ఈ బడ్జెట్పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం చేసిన టెక్స్టైల్ పార్కు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు కేవలం కొనసాగింపు నిధులే కేటాయించగా.. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు పూర్తిగా కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్లో కొత్తగా మెగా ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించకపోవడం.. ప్రత్యక్ష కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం యూనిట్గా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, రైతు, కార్మికవర్గాలకు ప్రయోజనం కలగనుంది. కాగా, ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల ద్వారా ఉమ్మడి వరంగల్కు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పరోక్షంగా లాభం చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
● వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ● ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ● ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. ● గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు రూ. 30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు -
గ్యాస్ కొరత లేదు
ఏటూరునాగారం: జిల్లాలో గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘గుదిబండ’ కథనానికి జిల్లా యంత్రాంగం కదిలింది. ఈ మేరకు కలెక్టర్ దివాకర టీఎస్ మండల కేంద్రంలోని జీసీసీ గ్యాస్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సివిల్ సప్లయీస్ అధికారిణి కృష్ణవేణి, జీసీసీ డీఎం వాణి, డీటీ విజయ్కుమార్, సర్పంచ్ కాకులమర్రి శ్రీలతో క లిసి గ్యాస్ సరఫరా కేంద్రం పరిస్థితిని పరిశీలించారు. సిలిండర్లు ఎందుకు కొరత వచ్చిందని, ఎప్ప టి నుంచి ఈ సమస్య ఉంటుందని జీసీసీ డీఎం వాణిని ప్రశ్నించారు. ఈనెల 7వ తేదీ నుంచి పెండింగ్లో ఉన్నాయని, సరఫరా ఆలస్యం అయిందని చెప్పడంతో అధికారిణిపై మండిపడ్డారు. గ్యాస్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ముందుగానే హెచ్చరించామని, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్ సరఫరాలో ప్రజలు ఒకరకమైన అనుమానాలు పెట్టుకున్నారని, దానిని నివృత్తి చేయడానికి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేపట్టిందని, దానిని మైక్ల ద్వారా ప్రజలకు ఎందుకు ప్రచారం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. సిలిండర్ బుకింగ్కు 45 రోజుల సమయం.. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, సరఫరా ప్రక్రియలో ప్రజలు అవగాహనతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. గ్యాస్ బుకింగ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం ప్రతీ సిలిండర్ బుకింగ్కు మధ్య 45 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ గడువు పూర్తికాకముందు మళ్లీ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఓటీపీ నంబర్ రాదన్నారు. ప్రజలు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్దకు రావొద్దని సూచించారు. జిల్లాలో 86,896 కనెక్షన్లు జిల్లాలో 8 ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాలకు సంబంధించినవి 86,896, వాణిజ్య అవసరాలకు సంబంధించినవి 254 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు సుమారు 943 గృహ అవసరాల గ్యాస్ బుకింగ్లు జరుగుతున్నట్లు చెప్పారు. గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు భవిష్యత్లో గ్యాస్ కొరత రావొచ్చనే అనుమానాలతో ముందుగానే బుక్ చేసుకోవడంతో ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద విని యోగదారులు సిలిండర్ల కోసం బారులు తీరాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, ఉపసర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు చిన్ని, కిరణ్, రా మకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, లక్ష్మీనా రాయణ, సుధాకర్, జీసీసీ సిబ్బంది సాంబారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోదాం వద్దకు వినియోగదారులు వెళ్లొద్దు మీ ఇంటికే పంపిస్తాం బుక్ చేసుకొని ఉంటే చాలు.. ఓటీపీలు గ్యాస్ వచ్చినప్పుడే చెప్పాలి కలెక్టర్ దివాకర టీఎస్ -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ దివాకర టీఎస్ ఏటూరునాగారం: సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కొరకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ దివాకర టీఎస్ వైద్యులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ ఏటూరునాగారంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని గదులను, వార్డులను, రిజిస్టర్, ల్యాబ్, మెడికల్ స్టోర్ గది, లేబర్ రూమ్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వైద్యులు నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాలన్నారు. అనంతరం మండలకేంద్రంలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ ఫర్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ జగదీశ్వర్, సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్, సర్పంచ్ శ్రీలత, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) పండుగ సందర్భంగా కలెక్టర్ దివాకర శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల (జకాత్) ద్వారా ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. మత సామరస్యంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. -
పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు
● లక్నవరం హరిత టూరిజం మేనేజర్ శివశంకర్ గోవిందరావుపేట: లక్నవరం హరిత రిసార్ట్స్లో పరిసరాలను శుభ్రపరిచి, పర్యాటకులకు మెరుగైన వసతి సదుపాయాలను కల్పిస్తున్నామని టూరిజం మేనేజర్ సండ్రపాటి శివశంకర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల స్వచ్ఛత డ్రైవ్లో భాగంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు లక్నవరం హరిత రిసార్ట్స్లో సండ్రపాటి శివశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకునేలా రిసార్ట్స్ పరిసరాలను పూర్తిగా శుభ్రపరచామన్నారు. స్వచ్ఛమైన వాతావరణం పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. రామప్పలో.. వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట పరిధిలోగల రామప్ప హరిత హోటల్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని టూరిజం శాఖ అధికారులు నిర్వహించారు. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రంతో పాటు చెత్తచెదారాన్ని తొలగించినట్లు హరిత హోటల్ మేనేజర్ రంజిత్కుమార్ తెలిపారు. అదేవిధంగా ములుగు గట్టమ్మ హారితహోటల్ వద్ద కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హరితహోటల్ సూపర్వైజర్ రాకేష్, సిబ్బంది నర్సయ్య, రవి, సంతోష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: ఆశకార్యకర్తలకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్డ్ వేతనాలు రూ.18 వేలు అందించాలని ఆశవర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. బండారుపల్లి రోడ్డు నుంచి వెళ్తున్న ఆశలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆశలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశకార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట రెండు రోజులుగా ధర్నా చేపట్టినా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సర్వేలు నిర్వహిస్తూ అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. పెండింగ్ సర్వే బిల్లు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన రవిగౌడ్, ప్రభావతి, శోభ, చంద్రవాని, దేవి, సంధ్య, స్వరూప, మాదవి, అనిత, నాగమణి, రాజ్యలక్ష్మీ, సత్యవతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది పురస్కారానికి సమ్మక్క పూజారి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య ఉగాది పురస్కారానికి ఎంపియ్యారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలో చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణే రూపంలో అమ్మవారిని గద్దైపెకి సమ్మక్క పూజారులతో కలిసి కొక్కెర కృష్ణయ్య తీసుకొస్తారు. ఈ క్రమంలో క్రిష్ణయ్యను ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం ఆయన హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా పురస్కారం అందుకోవాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆయన హైదరాబాద్ వెళ్లలేకపోయారు. ఉగాది పురస్కారానికి ఎంపికై న కృష్ణయ్యను సమ్మక్క– సారలమ్మ పూజారులతో పాటు మేడారం గిరిజన అభ్యుదయ సంఘం యువకులు, స్థానిక ఆదివాసీలు, భక్తులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఉదయ భాస్కర్కు అర్చక రత్న అవార్డు గోవిందరావుపేట: బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ దక్షిణ భారత కాన్ఫరెన్స్లో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ అర్చకుడు తిరుక్కోవల్లూరు ఉదయ భాస్కర్కు అర్చక రత్న అవార్డు ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పండితులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని, అర్చక వృత్తి పరిరక్షణలో ఉదయ్ భాస్కర్ చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ అర్చక రత్న అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్చకుల స్థాయి పెంపు, వారికి అవసరమైన శిక్షణ, మద్దతు అందించాల్సి ఉందని వివరించారు. రేపు ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణాకాలనీ సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాధ మహర్షి హాజరుకానున్నట్లు తెలిపారు. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండెదడ, బీపీ, ఘగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, ఆస్తమా, సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుందని తెలిపారు. మల్హర్/మల్హర్(కాటారం): మండలంలోని కాటారం గ్రామానికి చెందిన విద్యారంగం, సామాజిక సేవలో నాలుగు దశాబ్దాలుగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ విద్యావేత్త జనగామ కరుణాకర్రావుకు రాష్ట్రస్థాయి ఉగాది ఉత్తమ సేవారత్న పురస్కారం లభించింది. గురువారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో కరుణాకర్రావు రాష్ట్ర స్థాయి సేవారత్న పురష్కరాన్ని అందుకున్నారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన సాయివాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ వీరమేని సంపత్రావుకు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార అవార్డు అందుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు కరుణాకర్రావు, సంపత్రావులను అభినందించి, సత్కరించారు. -
ఉద్యోగం.. ఉద్యమం
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ నియామకాలపై రైల్వే జేఏసీ చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటోంది.హెచ్పీ 64,000భారత్ 7,000ఇండెన్ 15,000మొత్తం86,000మాది ఇండియన్ గ్యాస్. గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. అడిగితే రేపుమాపు అంటున్నారు. గ్యాస్ హెల్ప్లైన్ నంబర్లు సరిగా పనిచేయడం లేదు. గ్యాస్ను వెంటనే సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. గ్యాస్ లభించకపోవడంతో బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. – కొండాయి ప్రశాంత్, ఏటూరునాగారం గతంలో మాదిరిగానే ఇంటింటికీ గ్యాస్ను తక్షణమే సరఫరా చేయాలి. గ్యాస్ దొరకడం లేదని కావాలని ఏజెన్సీ, గ్యాస్ సరఫరా చేసే వాహనదారులు బ్లాక్ చేసి మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజలకు గ్యాస్ అందని ద్రాక్షలా మారింది. వెంటనే గ్యాస్ను సరఫరా చేయాలి. – గడ్డం లింగమ్మ, ఏటూరునాగారం -
ప్రత్యేక పూజలు.. పంచాంగ పఠనం
ములుగు:/ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలను గురువారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పరాభవ నామసంవత్సరాదికి స్వాగతం పలుకుతూ భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఆరగించారు. సమీప ఆలయాల్లోకి కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు నిర్వహించారు. రైతన్నలు పశువులను కడిగి కొత్తసాలుకు శ్రీకారం చుట్టారు. గోమాతలకు పూజలు నిర్వహించి సల్లంగా చూడాలని వేడుకున్నారు. పోలీస్స్టేషన్లలో, ఆలయాల్లో ఉగాది పచ్చడిని తయారు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని రామాలయంలో కవి సమ్మేళనాన్ని రామప్ప సాహితి సమితి, జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు వారి కవితలను వినిపించారు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామప్ప సాహితి సమితి అధ్యక్షుడు శ్రీనివాసచారి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్, కవులు రాజుయాదవ్, పోషన్న, రమేష్, లెనిన్, రాజశేఖర్, కుమారస్వామి, దుర్గం సూరయ్య, తుమ్మ పిచ్చిరెడ్డి, రేలా విజయ్, అనిల్, రామాలయ కమిటీ అధ్యక్షుడు దొంతిరెడ్డి రాకేశ్రెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు పరాభవ సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజలు


