Mulugu
-
ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి
ములుగు: జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మే 8న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే మెగా జాబ్మేళా పోస్టర్ను ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఈఈట్, టాస్క్, ఉపాధి కల్పన కార్యాలయాల సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్మేళా సమాచారం ప్రతి ఒక్కరికీ చేరేలా వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసేవారికి సమాచారం చేరేలా చూడాలన్నారు. టాస్క్లో నమోదు చేసుకున్న యువతకు కూడా సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల శాఖ అధికారి బి.రామ్మోహన్, ఉపాధి కార్యాలయ అధికారి కొమురయ్య, పౌర సంబంధాల అధికారి ఎండి.రఫీక్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
గిరిజన దర్బార్లో వచ్చిన కొన్ని వినతులు..
వెంకటాపురం(కె) మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు సాగు భూమికి సర్వే నంబర్లు ఉన్నాయని, పట్టాపాస్ పుస్తకాలు లేవని తెలిపారు. ఇప్పించాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం లంబాడీతండాకు చెందిన ఓ వ్యక్తి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం పంబాపురంకు చెందిన ఓ మహిళ తన భర్త పేరుపై ఉన్న పోడు పట్టా భూమిని తన పేరుపైకి మార్చాలని కోరారు. ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన గిరిజనుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పాస్పుస్తకం పోయిందని కొత్త బుక్ ఇప్పించాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ఏజెన్సీ ప్రాంతంలో 1/70 షెడ్యూల్ పరిధిలోని సర్వే నంబర్ 222లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండల పరిధిలోని ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల్లో సేల్స్మెన్లను నియమించాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు నీలాద్రి కోరారు. వాజేడు మండలం చెరుకురు గ్రామంలో పంచాయతీ కార్యాలయం పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కాంట్రాక్టర్ మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్ బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్రావు, జియాలజిస్ట్ కిశోర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం
ఎద్దు ముక్కు ఆంజనేయస్వామికి స్నపనంకొలనులో ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం పూజలు నిర్వహిస్తున్న యాగ్నికులుమంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం) మహానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకి(సేవ)పై మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలో దోపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, అనిపెద్ది రాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీ కృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
వినతుల వెల్లువ
ప్రజావాణిలో 55, గిరిజన దర్బార్లో 15 అర్జీల రాకప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు భూ సమస్యలు 23పింఛన్లు 10ఇందిరమ్మ ఇళ్లు 12ఇతర సమస్యలు 10● స్వీకరించిన అదనపు కలెక్టర్ మహేందర్జీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట ● దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు వితంతు పింఛన్ అందించాలిఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. రెండేళ్ల క్రితం నా భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్ రావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ అందేలా చూడాలి. – కొలిపాక రమ, దేవగిరిపట్నం ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు వెల్లువలా వచ్చాయి. భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు తదితర సమస్యలు పరిష్కరించాలని బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో 55 అర్జీలు రాగా అదనపు కలెక్టర్ మహేందర్జీ ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి స్వీకరించారు. అదే విధంగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 15 అర్జీలు రాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట స్వీకరించారు. అధికారులు బాధితులు అందించిన వినతులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇంటిని రెన్యూవల్ చేయాలిమొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. కుమారుడికి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రుల చుట్టూ తిరిగి వైద్యం చేయించాం. దీంతో ఇంటి నిర్మాణం చేయలేకపోయాను. అధికారులు ఇందిరమ్మ ఇళ్లు రద్దు అయిందని అంటున్నారు. ఇందిరమ్మ ఇంటిని రెన్యూవల్ చేస్తే ఇంటి నిర్మాణం చేసుకుంటాను. – బొల్లం రమేశ్, బండారుపల్లి ● -
నానో ఎరువుల వాడకంపై అవగాహన
ములుగు రూరల్: మండల పరిధిలోని ఇంచర్ల రైతువేదికలో సోమవారం అత్మ ఆధ్వర్యంలో ఎరువుల యాజమాన్య పద్ధతులు, నానో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త విశ్వతేజ మాట్లాడుతూ అధిక ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యం దెబ్బతిని చీడపీడలు ఆశిస్తాయని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ సురేశ్కుమార్, మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ పద్మావతి, సర్పంచ్ కుమార్గౌడ్, ఆత్మ చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన సదస్సు వెంకటాపురం(ఎం): రైతు వారోత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా నాణ్యమైన విత్తన ఎంపిక, సేంద్రీయ వ్యవసాయం, యాంత్రీకరణ, మట్టి పరీక్ష, సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించినట్లు వ్యవసాయ అధికారిణి శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నవీన్, రైతులు జనార్దన్, శెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ములుగు రూరల్: ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ హరిసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో కళాశాలల్లో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీతో పాటు ఓకేషనల్ ఫిజియోథెరఫీ, ఏటి అండ్ ఐఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో టీజీటిడబ్ల్యూర్జేసీ(బాలుర) ఏటూరునాగారం కళాశాలలో ఎంపీసీలో 40, బీపీసీలో 40, హెచ్ఈసీ 40, ఏటీ 20, ఏటూరునాగారం బాలికల కళాశాలలో ఎంపీసీ–40, బీపీసీ–40, సీఈసీ–40, ఏటి–20, ఐఎం 20, వాజేడులోని టీజీటీడబ్ల్యూఆర్జేసీలో 40, బీపీసీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2026లో పదో తరగతి ఉత్తర్ణీత సాధించారని వెల్లడించారు. కాళేశ్వరాలయంలో టీపీసీసీ అధ్యక్షుడి పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్ గౌడ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ముందుగా త్రివేణి సంగమం వద్ద సైకత లింగార్చన, షోడస సోమవార వ్రత ఉద్యాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అద్యక్షుడు బట్టు కర్ణాకర్, ఈఓ మహేష్, ఽసర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, ధర్మకర్తలు ఉన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. రేగొండ: రేగొండ మండలంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహేష్కుమార్గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
కాళేశ్వరం: ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం పాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. అంత్య పుష్కరాల నిర్వహణ కోసం పలు తీర్మానాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 12 రోజుల పాటు తాగునీరు, మౌలిక వసతులు ఏర్నాటు చేస్తామన్నారు. స్థానిక భక్తులకు ఉదయం నుంచి 10గంటలకు వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు. ఈఓ మాట్లాడుతూ..ఆలయంలో భక్తులకు సరిపడా లడ్డు ప్రసాదం తయారు చేస్తామన్నారు. ప్రతీ రోజు భక్తులకు అన్నదానం ఏర్పాటుచేస్తామని తెలిపారు. 12 రోజుల పాటు వీవీఐపీలు, పీఠాధిపతులు రానున్నారని తెలిపారు. హారతి కార్యక్రమానికి కాశీపండితులు వస్తున్నారని పేర్కొన్నారు. వారి వెంట ధర్మకర్తలు సీతారాం, సీతయ్య, సత్యనారాయణ, సత్తయ్య, పద్మ, నర్సయ్య, అశోక్, దుర్గయ్య, శ్రీధర్రావు, శ్యామ్దేవుడా పాల్గొన్నారు. -
‘మోదీ సభను జయప్రదం చేయాలి’
ములుగు రూరల్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ బలరాం, సీతరాం నాయక్, నరేశ్, కృష్ణవేణి, జవహర్ లాల్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
ములుగు: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం నిర్వహించిన వీసీలో మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు అదనపు కలెక్టర్ మహేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పీపీసీ కేంద్రాలకు మొత్తం 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం చేరగా ఇప్పటి వరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, హమాలీ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను నిరంతరం అందించాలని అధికారులకు సూచించారు. ఈదురుగాలులు, ఆకాల వర్షాలతో విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్జీ మాట్లాడుతూ ఎఫ్ఏక్యూ వరిధాన్యాన్ని తక్షణమే లిఫ్టింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హమాలీల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ట్రక్ షీట్లు సమయానికి జెనరేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్లో సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్, డీఆర్డీఓ చంద్రశేఖర్, డీఎం కృష్ణవేణి, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీసీలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే
కాళేశ్వరం: సరస్వతీనది ఆది పుష్కరాల్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. అంత్య పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు వన్వే రూట్ ప్లానింగ్ చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాలపై అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్తో కలిసి కాళేశ్వరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వీఐపీఘాటు, సాధారణ ఘాటు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, 250కి పైగా సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామన్నారు. పోలీసుస్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించనున్నామని తెలిపారు. 12 రోజుల పాటు 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పలు షిప్టుల్లో ఉంటారన్నారు. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షం కురిస్తే వాహనాలు దిగబడకుండా ఎరుపు నేలలను కూడా గుర్తించినట్లు తెలిపారు. గంగారం ఎక్స్రోడ్డు నుంచి కాళేశ్వరం మంథని గుండా కాళేశ్వరం వచ్చే వాహనాలు గంగారం ఎక్స్రోడ్డు మీదుగా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి మీదుగా కాళేశ్వరం వస్తాయి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా కొయ్యూర్, గంగారం ఎక్స్రోడ్డు నుంచి దామెరకుంట, అన్నారం మీదుగా కాళేశ్వరం వస్తాయి. తిరిగి వెళ్లేటప్పుడు కాళేశ్వరం మీదుగా యధావిధిగా కాటారం గుండా వరంగల్, కరీంనగర్ వైపునకు వెళ్తాయి. ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలకు వన్వే లేదు. ఎప్పటిలాగే వచ్చి వెళ్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల గుండా వచ్చే వాహనాలు వంతెన వద్ద పార్కింగ్ స్థలాలకు చేరుకుంటాయి. అక్కడే పార్కింగ్ చేసిన తరువాత ఆటోలు, షెటిల్ బస్సులలో వెళ్లి స్నానాలు చేసి దర్శనం చేస్తారని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగొద్దు వన్వే ద్వారా భక్తులకు సులభంగా రాకపోకలు జరిగేలా రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన చేపడుతున్నామని, వారి భద్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. అంత్య పుష్కరాలకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
వెంకటాపురం(కె): గ్రామల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మరికాల గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి అవసరాల కోసం తప్పనిసరిగా నాణ్యమైన విద్యుత్ వైర్లను వాడాలన్నారు. పంట పొలాల వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, తెగిపోయిన వైర్లు కనిపిస్తే తక్షణమే విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే సిబ్బంది వాటిని తొలగిస్తారని వివరించారు. అనంతరం మరికాల గ్రామంలోని విద్యుత్ సమస్యలను సర్పంచ్ కన్నయ్య, ఉప సర్పంచ్ రాములు ఏడీఈల కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ హనుమాన్ దాస్, సిబ్బంది పాషా, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.ఏడీఈ ఉమారావు -
సేంద్రియ వ్యవసాయ సాగుకు మొగ్గుచూపాలి
మల్హర్(కాటారం): రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని సేంద్రియ వ్యవసాయం సాగులో ముందుకెళ్లాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి నివేదిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కాటారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో తిరుమల మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులంతా అధునాతన సాగు మెలకువలు పాటిస్తూ పెట్టుబడి తగ్గించుకొని అధిక లాభాలు పొందేలా వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెప్పారు. అనంతరం మండలంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న రైతులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పూర్ణిమ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్నాయక్, కాటారం సర్పంచ్ సడవలి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి అథ్లెటిక్ పోటీలు
భూపాలపల్లి రూరల్: ఈనెల 6వతేది బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనేవారు బుధవారం ఉదయం ఆరు గంటలకు జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. సబ్ జూనియర్, జూనియర్స్, సీ్త్రలు, పురుషుల విభాగాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 10వ తేదీన హనుమకొండలో జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. -
గాలివాన బీభత్సం.. నేలవాలిన వరిపంట
మంగపేట : మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల చిరు జల్లులు పడగా కొత్తూరుమొట్లగూడెంలో గాలిదుమారం భారీగా వచ్చింది. దీంతో పలుచోట్ల కోత దశకు వచ్చిన వరిపైరు నేలవాలింది. మేల్ఫిమేల్ వరిపైరు సైతం నేలవాలడంతో వడ్లు రాలిపోగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గాలివాన దాటికి గుడిసెల పైకప్పులు ఎగిరిపోవడంతో ఇళ్లలోని బట్టలు, గృహోపకర వస్తువులు తడిసిపోయాయి. ఉన్నతాధికారులు స్పందించి పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
పల్లెల్లో సౌర వెలుగులు
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ గ్రామాలను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు భరించి పైలెట్గా ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యవసాయ పంప్సెట్ను సౌర విద్యుద్ధీకరిస్తున్నారు. అయితే వీటిని మరింతంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలను రూ.1,380 కోట్ల వ్యయంతో పూర్తిగా సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి అదనంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్ కో) గ్రామాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో 12 గ్రామాలు సంపూర్ణ సోలార్ గ్రామాలుగా మారనున్నాయి. కొనసాగుతున్న పనులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేపనులు కొనసాగుతున్నాయి. సోలార్ పలకల బిగింపు పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపిక చేయనున్న ఒక్క గ్రామంలో ఒక్కో ఇంటిపై 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఇంటికి రూ.1.36 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ప్రతీ ఇంటికి నెట్ మీటర్ బిగిస్తారు. ఈ మీటర్ ఇంటికి వినియోగిస్తున్న విద్యుత్, మిగిలిన విద్యుత్ గ్రిడ్కు ఎంత సరఫరా జరిగిందో యూనిట్ల వారీగా రికార్డు చేస్తుంది. ప్రతీ ఇంటిపై ఏర్పాటు చేసిన 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాంట్ ద్వారా నెలకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గృహ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి జరిగి గ్రిడ్కు సరఫరా చేసిన ప్రతి యూనిట్కు రూ.4.99 చొప్పున చెల్లిస్తుంది. అయితే ఇంటికి వినియోగించుకోగా మిగిలిన విద్యుత్కు మాత్రమే చెల్లింపులు చేస్తారు. గృహ విద్యుత్ వినియోగదారులు తాము వాడుకున్న విద్యుత్కు బిల్లులు చెల్లించాల్సిన అవసరముండదు. దీంతో పరోక్షంగా ఆర్థికంగా లబ్ధిపొందుతారు. గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది... ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల ఎంపిక పూర్తి కాగానే.. సోలార్ ఫలకల బిగింపు పనులు మొదలవుతాయి. ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ప్రజలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించేందుకు, ప్రోత్సహించేందుకు మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేసి పూర్తి సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. – మహేందర్ రెడ్డి, రెడ్కో మేనేజర్, హనుమకొండగ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా పర్యావరణహిత సౌర విద్యుత్ అందరూ వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈక్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకంలో ప్రభుత్వమే ఖర్చు భరిస్తుండడంతో వినియోగదారులపై ఏ మాత్రం ఆర్థిక భారం పడట్లేదు. దీంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సౌర విద్యుత్ మారనుంది. ఉత్తత్తి అయిన సౌర విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా విద్యుత్ వినియోగదారుడికి ఆర్థిక లబ్ధి చేకూరనుంది.నియోజకవర్గానికో గ్రామం ఎంపిక ప్రభుత్వ ఖర్చుతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఎంపికపై దృష్టి సారించిన రెడ్ కో -
మూతపడిన పరిశ్రమలు
ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, సబ్జెక్టు నిపుణుల కొరత అడవి బిడ్డలకు అన్యాయం చేస్తున్నాయి. ప్రాజెక్టు మానిటరింగ్ రీసోర్స్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూమర్షిప్ పథకం, ఎంఎస్ఎంఈ, పీఎంఈజీపీ పథకం వంటివి అమలుకు నోచుకోవడం లేదు. ఎంఎస్ఎంఈ పథకం కింద ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమలు మూణ్నాళ్లకే మూతపడి మూలుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమకు మిషనరీలు ఇచ్చినా వాటిని ఇప్పటి వరకు అమర్చకుండా వారి ఇళ్ల ఎదుట ఎండలో పెట్టుకోవడం గమనార్హం. అలాగే గిరివికాసం పథకం కింద పోడు భూముల్లో బోర్లు వేశారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.ఐటీడీఏ కార్యాలయం -
ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయాలి
ఎస్ఎస్ తాడ్వాయి: విభిన్న కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు కలిగిన ఆదిమ తెగల ప్రజలకు ప్రస్తుతం చేపట్టిన జనగణన సర్వేలో ప్రత్యేకమైన రిలీజియన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర డిమాండ్ చేశారు. జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతీ పరిరక్షణకు ఈ నెల 13న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో మేధావులతో ఏర్పాటు చేయనున్న సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివా రం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంస్కృతితో ఆదిమ తెగలకు సంబంధం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఆదిమ తెగలకు సంబంధించిన ప్రజలు సుమారుగా 12లక్షల మంది ఉన్నారని తెలిపారు. వారికి ఇప్పటి వరకు ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన జనగణనలో ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ పొడుగు శ్రీనాథ్, రాష్ట్ర కన్వీనర్ పాయం సత్యనారాయణ, మడవి నర్సింగారావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పొదెం కృష్ణప్రసాద్, డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర -
15 వరకు ఉపాధి హామీ పనుల జాతర
ములుగు రూరల్: ఈ నెల 15వ తేదీ వరకు ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఓ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల జాతరలో రైతులకు వ్యక్తిగత లబ్ధి చేకూరేలా పశువులు, మేకలు, కోళ్లషెడ్లు, పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు ఏప్రిల్ 15వ తేదీ వరకు పనిచేసిన వేతనాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. అలాగే సిబ్బంది పెండింగ్ వేతనాలు సైతం చెల్లించినట్లు వెల్లడించారు. అన్ని గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత మట్టిని రైతులు పొలాల్లో పోసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించినట్లు వెల్లడించారు. నేడు సమావేశం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గం(ట్రస్టుబోర్డు) నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సోమవారం(నేడు) ఉదయం 10 గంటలకు చైర్మన్ అవధాని మోహన్శర్మ అద్యక్షత మొదటి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల్లో చేయాల్సిన పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించుటపై చర్చించనున్నారు. పలు తీర్మానాలు చేయనున్నారని తెలిసింది. భద్రత ఏర్పాట్లపై.. కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసులతో సోమవారం(నేడు) సమావేశం నిర్వహించున్నారు. గతంలో ఇక్కడ పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిసింది. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చిట్యాల: మండలంలోని వెంచరామి గ్రామ శివారు కుర్మపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కమిటీ అధ్యక్షుడు మోరే ధర్మరాజు, సర్పంచ్ కాసు రమకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఆలయ నిర్మాణం మూలంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో అతి తొందరలోనే ఆలయాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు అందుగుల కుమార్, సట్ల స్వామి, కార్యదర్శి గుర్రం నరేందర్, కోశాధికారి జక్కే వెంకటేశం పాల్గొన్నారు. సంఘాల వైఫల్యంతోనే కష్టాలు భూపాలపల్లి అర్బన్: ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి కష్టాలు మొదలైనట్లు సింగరేణి కోల్మైన్ కార్మిక సంఘ్(బీఎంఎస్) కార్యదర్శి మాధవనాయక్ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వాల విధానాలు, గుర్తింపు సంఘాల వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సంస్థలు చెల్లించాల్సిన సుమారు రూ.50వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రెండేళ్లుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మిక సమస్యల పరిష్కారంలో, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మండా రమాకాంత్, అప్పాని శ్రీనివాస్, వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, శ్రీరాములు, ఓ లక్ష్మణ్, భాస్కర్, పని రమేష్, కటకం శ్రీనివాస్, మల్లేష్, రాజునాయక్, దేవర సమ్మయ్య, పునీత్ రావు, ప్రవీణ్, అడప రాజు, తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
వెంకటాపురం(కె): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మండల పరిధిలోని పాత్రాపురంలో ఆదివారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు -
అస్తవ్యస్తం
ఐటీడీఏలో పాలన.. ఏటూరునాగారం: ఐటీడీఏ పాలన గాడితప్పింది. అధికారులు ధీర్ఘకాలికంగా డిప్యుటేషన్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. అన్ని ఐటీడీఏల్లో పరిస్థితి ఒకలా ఉంటే ఏటూరునాగారం ఐటీడీఏ మరోలా ఉంది. ఇక్కడి అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు, ఉన్నతాధికారుల నుంచి వచ్చే సర్క్యూలర్ల అమలు సైతం బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పీఎంఆర్సీ, పీఈటీసీల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న ఉపాధ్యాయులు తిరిగి వారి వారి పోస్టుల్లోకి వెళ్లాల్సిందిగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి గత నెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏల్లో వెంటనే అమలు చేస్తే ఏటూరునాగారంలో మాత్రం పట్టించుకోవడం లేదు. పీఎంఆర్సీ, పీఈటీసీల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారు పనిచేసే పాఠశాలలకు వచ్చి విధుల్లో చేరకుండా డిప్యుటేషన్ విధుల్లోనే కొనసాగుతున్నారు. ఇదేకాకుండా ఉట్నూరు ఐటీడీఏకు చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఏటూరునాగారం కార్యాలయానికి డిప్యుటేషన్ వేయించుకొని ఆయన మాత్రం వరంగల్లోని స్టడీ సర్కిల్లో పనిచేస్తున్నారు. వేతనం మాత్రం ఐటీడీఏ నుంచి ఇస్తుండగా పనిచేసేది మాత్రం స్టడీ సర్కిల్లోనే. అయితే నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి బదిలీలు, డిప్యుటేషన్లు ఉండవు. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం గమనార్హం. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఐటీడీఏ ఏర్పడినప్పుడే ఏటూరునాగారం పంచాయతీ పరిధిలోని ఎక్కెల గ్రామ శివారులో 24.20 ఎకరాలు స్థలం కేటాయించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో 4.20 ఎకరాల్లో ఉద్యాన నర్సరీ శిక్షణ కేంద్రాలు(హెచ్టీసీలు) ఏర్పాటు చేశారు. వీటిలో మామిడి సపోటా, నిమ్మ, జామ తదితర పండ్ల మొక్కలు, గులాబీ, మందార వంటి పూల మొక్కలు తెచ్చి అంటుకట్టి కొత్తరకం మొక్కలు ఉత్పత్తి చేసేవారు. పండ్లు, పూల తోటల పెంపకం కోసం గిరిజనులకు ఉచితంగా అందించేవారు. వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన గిరిజన నిరుద్యోగ యువతకు అంటు కట్టడం , సంకరణ మొక్కలను ఉత్పత్తి చేయడంలో శిక్షణ ఇచ్చేవారు. దీంతో గిరిజన యువతకు స్వయం ఉపాధిగా ఉండేది. ప్రస్తుతం ఆ శిక్షణ కేంద్రం స్వరూపమే మారిపోయింది. హెచ్టీసీ కేటాయించిన భూమి ఆక్రమణలకు గురవుతోందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా హయాంలో ఆ స్థలంలో పండ్లు, పూల మొక్కల పెంపకాన్ని అధికారులు చేపట్టారు. ఏటూరునాగారంలోని 4.20 ఎకరాల స్థలంలో సపోటా, నిమ్మ, మల్లెపూల మొక్కలు పెంచారు. ఎక్కెల శివారులోని 24.20 ఎకరాల స్థలాన్ని నాలుగు బ్లాకులుగా విభజించి ఒ క బ్లాకులో నర్సరీ, మిగతా బ్లాకుల్లో మోడల్ తోట లను పెంచేందుకు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు మంజూరు రాలేదు. కొత్తగా వచ్చిన పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఉన్నతాధికారులతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఆరేళ్లుగా పాలకమండలి సమావేశం నిర్వహించడం లేదు. 2019 తర్వాత ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించే పాలకమండలి సమావేశం ఆరేళ్లయినా నిర్వహణకు నోచుకోవడం లేదు. ఐటీడీఏ గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఇంజనీరింగ్ విభాగాలు ఎక్కువగా ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. గిరిజన సంక్షేమం విద్యా విభాగంలో నాణ్యమైన విద్య కలగానే మారింది. దీర్ఘకాలికంగా డిప్యుటేషన్లపైనే ఉద్యోగులు గిరివికాస పథకంలో బోర్లు వేసినా విద్యుత్ సదుపాయం నిల్ -
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండెం రవీందర్రెడ్డి, కిసాన్ సెల్ అధక్షులు గోల్లపలి రాజేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్న యాగ్నికులుదేవతామూర్తుల వేదాశీర్వచనం తీసుకుంటున్న బ్రహ్మోత్సవాల యాగ్నికులు మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి సదస్యం(వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని యాగ్నికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) కార్యక్రమాల్లో భాగంగా ఏడోరోజు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం ఉదయం ఆలయంలో స్వయంభు స్వామివారి నిత్యారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన, ఆలయ ప్రాంగణంలోని వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం), మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు హయగ్రీవ స్తోత్ర పారాయణం, హవనం, చతుస్థానార్చన, బలిహరణ, స్వామివారి కల్యాణ మండపంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, అమ్మవార్లకు సదస్యం (వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, ఏడునూతుల ఈశ్వర్చంద్, అనిపెద్ది రాజీవ్శర్మ, యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరద్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహా చార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ న్యాతని సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఏడోరోజు హేమాచలక్షేత్రంలో సదస్యం వనదేవత (దైత)అమ్మవారికి స్నపనం -
తూకంలో పారదర్శకత పాటించాలి
టేకుమట్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకంలో పారదర్శకత పాటించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని రాఘవారెడ్డి, వెల్లంపల్లి, టేకుమట్ల గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలలోనే లభిస్తుందన్నారు. తూకంలో లోపాలు జరగకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పలు పనులకు శంకుస్థాపన బోర్నపల్లి గ్రామంలో గుట్టు మల్లన్న దేవాలయ నిర్మాణ పనులు, రామకృష్ణాపూర్ (వి)లో బీటీ రోడ్డు పనులు, వెలిశాల (కిష్టయ్యపల్లి) నుంచి రామకృష్టాపూర్(వి) వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెలిశాల నుంచి రాఘవాపూర్ గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులు, పెద్దంపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి
● ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ గోవిందరావుపేట: ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పస్రా గ్రామంలో ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ ఆధ్వర్యంలో కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తుందన్నారు. ఈ మేరకు ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజాన్ని అర్ధం చేసుకుని సమకాలిన సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ శిక్షణ తరగతుల్లో చరిత్ర, రాజకీయం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ వంటి విభిన్న అంశాలపై నిపుణులు బోధిస్తారని వివరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 12 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు తరలివచ్చి శిక్షణ తరగతుల్లో పాల్గొనాలని కోరారు. -
ఎల్ఆర్ఎస్..ఎప్పటికి!
వేల దరఖాస్తులు ఎల్–1లోనే.. స్పాట్ వెరిఫికేషనే సమస్య●మొత్తం దరఖాస్తులు (2020): 1,58,265ఫీజు చెల్లించినవి: 1,43,121జీడబ్ల్యూఎంసీ పరిధిలో: 96,000మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 40 శాతం పైగా క్లియరెన్స్ దశలు: ఎల్–1, ఎల్–2, ఎల్–3 పెండింగ్ స్టేజ్: ప్రధానంగా ఎల్–1 కీలక సమస్య: స్పాట్ వెరిఫికేషన్ ఆలస్యం సాక్షి ప్రతినిధి, వరంగల్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లో గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి జిల్లాలో తీవ్ర జాప్యం నెలకొంది. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించారు. 2026 మార్చి నాటికి కూడా పూర్తిస్థాయి క్లియరెన్స్ లేకపోవడం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇస్తూ జూలై 31వరకు గడువు ఇచ్చింది. ఈసారైన ఆశించిన స్థాయిలో ముందుకు వస్తారా? ఆ మేరకు ఫైళ్లు క్లియరెన్స్కు నోచుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది. స్పాట్ వెరిఫికేషన్ లేక ‘బ్లాక్’... ఐదేళ్లుగా అపరిష్కృతం... ఫీల్డ్ స్థాయిలో స్పాట్ వెరిఫికేషన్ జరగకపోవడంతో వేలాది ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అధికారులు రేపు, మాపు అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లయినా పూర్తిస్థాయిలో ఫైళ్లు పరిష్కారానికి నోచుకోలేదన్న ఫిర్యాదులున్నాయి. ‘గ్రేటర్‘ మున్సి పల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 1.43 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇప్పటికీ కూడా 40శాతం ఫైళ్లు పెండింగ్లోనే ఉండగా.. రాయితీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం 25శాతం రాయి తీ ప్రకటించి ప్రజలను ప్రోత్సహించినా, క్లియరెన్స్ లేకపోవడంతో ఆ ప్రయోజనం వృథా అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–1లోనే ఎల్ఆర్ఎస్ లాక్... 2026లో మళ్లీ రాయితీ ప్రకటించినప్పటికీ, పాత దరఖాస్తులు క్లియర్ కాకపోవడం వల్ల కొత్త ప్రకటనపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో భారీగా రుసుములు వసూలు చేసినప్పటికీ, వాటిలో సుమారు 40 శాతం దరఖాస్తులు ఇప్పటికీ ఎల్–1 దశలోనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్–1 నుంచి ఎల్–2, ఎల్–3 దశలకు ఫైళ్లు వెళ్లడంలో ఆలస్యం ప్రధాన సమస్యగా మారిందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా మూడు శాఖల మధ్య కుదరని సమన్వయం కూడా దరఖాస్తుదారులకు శాపంగా మారుతుందంటున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం దశల వారీగా క్లియరెన్స్ జరుగుతోందని, త్వరలో పరిష్కరిస్తామని చెబుతున్నారు.మరోసారి రాయితీ.. 25% రిబేట్ ఇస్తూ ఉత్తర్వులు జూలై 31 వరకు గడువు... పాత దరఖాస్తుదారులకే చాన్స్ ఫైళ్ల పరిష్కారంపైనే అనుమానాలు.. గతంలో ఫీజు చెల్లించినవే అపరిష్కృతం ఇప్పటికీ పెండింగ్లో 40శాతం దరఖాస్తులు మళ్లీ 25 శాతం రాయితీ.. ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయి క్లియరెన్స్ జరగనప్పటికీ తాజాగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై 25శాతం రాయితీ మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాయితీ జూలై 31 వరకు ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వారికి ఈ రాయితీ వర్తించదు. పాత దరఖాస్తుదారులకు మాత్రమే ప్రయోజనం. ఇదిలా ఉండగా గతంలో ఫీజు చెల్లించిన దరఖాస్తులే ఇంకా అపరిష్కృతంగా ఉండగా.. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం, ఎఫ్టీఎల్(చెరువుల పరిధి), నిషేధిత భూముల వివాదాలు, పేర్లు, సర్వే నంబర్లలో పొరపాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యం తదితర కారణాలు చెబుతున్నారు. రాయితీ ఇవ్వడం కాదు.. స్పాట్ వెరిఫికేషన్కు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్లైన్ సమస్యలు పరిష్కరించి , పారదర్శకత పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. -
వైద్యశాలల ఆకస్మిక తనిఖీ
వాజేడు: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో శనివారం వాజేడు, పేరూరు వైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలకు వచ్చిన ఆయన ముందుగా హాజరు పట్టికలను పరిశీలించారు. విధులకు రాని సిబ్బందిపై ఆరా తీశారు. మందుల గదులు, రోగుల బెడ్లు, ఆస్పత్రుల్లోని అన్ని గదులను నిశితంగా పరిశీలించారు. మందులు అందుబాటులో ఉన్నది లేనిది సిబ్బందిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఇన్, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను పరిశీలించారు. పేరూరు వైద్యశాలలో అందుబాటులో లేని సిబ్బందిపై ఆరా తీశారు. డీఎంహెచ్ఓతో మాట్లాడుతానని తెలిపారు. వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దు మల్హర్: ఽరైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటారం మండలంలోని కాటారం, కొత్తపల్లి శంకరంపల్లి, ధన్వాడ సెంటర్లను కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, సర్పంచ్లతో కలిసి వాల్యనాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సెంటర్ల వద్ద మౌలిక వసతుల కల్పనతో పాటు నగదు జమ అయ్యేవరకు సంబంధిత వ్యవసాయ అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, సీఈఓ ఎడ్ల సతీష్ సర్పంచ్లు పంతకాని సడవలి, సర్పంచ్ అజ్మీర కిషన్నాయక్, మహేష్కుమార్, అరుణస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఘన సన్మానం భూపాలపల్లి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి చరణ్ 540, ఎండీ హఫీజ్ 534, ఎస్.హర్షవర్ధన్ 529, సాయి వరుణ్ 508, టి.అభిలాష్ 508, నవాజుద్దీన్ 502 ఉత్తమ ఫలితాలు సాధించగా కోఆర్డినేటర్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను శాలువాలు, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. 12న తెలంగాణ జనసమితి ప్లీనరీ భూపాలపల్లి రూరల్: ఈనెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్లో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రత్నం కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు తెలంగాణ జన సమితి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, పార్టీ నాయకులు దాసరి జనార్దన్, రాళ్లపల్లి బాపు పాల్గొన్నారు. గుడుంబా పట్టివేత రేగొండ: గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నపూర్కు చెందిన పల్లెబోయిన శంకర్ గుడుంబా విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు దాడి చేసి 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి’
ఏటూరునాగారం: బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలని జిల్లా భరోసా కేంద్రం ఇన్చార్జ్, కో ఆర్టినేటర్ అనూష అన్నారు. మండల పరిధిలోని బోరునర్సాపురం, ఏటూరునాగారం, కొండపర్తి గొత్తికోయగుంపు ప్రజలకు మహిళలపై హింసను నిరోధించడం, బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, లింగ సమానత్వం, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలను శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని వివరించారు. సమాజంపై అవగాహన లేకపోవడంతో కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు అవగాహన కల్పిస్తామన్నారు. -
వైభవంగా హేమాచలుడి రథోత్సవం
● కనువిందు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనమంగపేట: మండల పరిధిలోని మల్లూరులో శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల రథోత్సవాన్ని ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మల్లూరుగుట్టపై కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గ్రామానికి తీసుకొచ్చి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక రథంపై రాత్రి 9 గంటల నుంచి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన 16 మంది కళాకారులు వివిధ రూపాల వేషధారణతో చేసిన నృత్య ప్రదర్శనలు రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ సురేష్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజాపాలనలో ప్రజలకు మెరుగైన సేవలు
● అదనపు కలెక్టర్ మహేందర్ జీ ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్ రావుతో కలిసి హాజరయ్యారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి వివరాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మహేందర్జీ మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనగణనలో భాగంగా ప్రతిఒక్కరూ మే 10వ తేదీ వరకు సాగుతున్న సెల్ఫ్ ఎమ్యునరేషన్లో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు మాట్లాడుతూ, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, డీఎస్పీ రవీందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ విద్యుత్ ప్రమాదాలు నివారణకు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ తెలిపారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) సంపత్ రావు, టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ భిక్షపతితో కలిసి సేఫ్టీ వాల్పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం పంపుసెట్లను, విద్యుత్ మోటర్లను, ఇనుప పైపులను, ఫుట్వాల్లను ఏమరపాటుగా తాకకూడదని తెలిపారు. వాటిల్లో విద్యుత్ సరఫరా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలను, తెగిపడిన తీగలను, స్టార్టర్ డబ్బాలను ముట్టుకోకూడదని వివరించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్, డీఈపీ నాగేశ్వరరావు, మున్సిపాలిటీ చైర్పర్సన్ చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షహీన్, డీపీఆర్వో రఫిక్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లు నిల్
మక్కలు ఫుల్..ములుగు: జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 19,051 పైగా ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఈ మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 4 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా మక్కల కొనుగోళ్లు నామమాత్రంగా ఉండడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన మక్కలను విక్రయించేందుకు ఇప్పటి వరకు గన్నీ బ్యాగులు కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన మొక్కజొన్న రాశులు పెద్దమొత్తంలో పేరుకుపోతున్నా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తూ తమ పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలవరపెడుతున్న మబ్బులు జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆధ్వాన్నంగా మారింది. ఒకవైపు ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులు, మరోవైపు పంటను అమ్ముకోవాలన్న తపనతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే పండించిన పంటను నిల్వ చేయడానికి సరైన సౌకర్యాలు లేవు. సాయంత్రం వేళ వచ్చే మబ్బులకు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వర్షాల వల్ల ధాన్యం తడిస్తే నాణ్యత కోల్పోయి గిట్టుబాటు ధర వస్తుందో రాదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన కొనుగోళ్లు.. జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మక్కలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు 20 రోజుల క్రితం తీసుకొచ్చిన మక్కలకు ఇప్పటివరకు గన్నీ బ్యాగులు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. దీంతో దళారులు మక్కల కొనుగోళ్లపై దృష్టిసారించారు. రైతుల పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని తక్కువ ధరకు మక్కలను కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మక్కలకు ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ఇస్తుండగా దళారులు రూ.1,800 నుంచి రూ.1,900లు ఇస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. రైతులు పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో దళారులు గ్రామాల్లో తిష్టవేసి మక్కల కొనుగోళ్లను వేగవంతం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మక్కల కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రాశులు తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్న రైతులుమండలం ఎకరాలు ములుగు 3,361.14 మల్లంపల్లి 6,312.33 ఎస్ఎస్తాడ్వాయి 2,972.22 వెంకటాపురం(కె) 2,578.32 వెంకటాపురం(ఎం) 1,528.31 వాజేడు 742.36 మంగపేట 541.07 ఏటూరునాగారం 449.03 కన్నాయిగూడెం 395.29 గోవిందరావుపేట 171.21మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం తగదుములుగు రూరల్: మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోరిక గోవింద్నాయక్ అన్నారు. ఈ మేరకు మల్లంపల్లిలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న పంట కోతకోసి 20 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై ఉపేందర్రావు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అదనపు కలెక్టర్ సంపత్రావు సంఘటనా స్థలానికి చేరుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన చంద్రయ్య, మాచర్ల ప్రభాకర్, మొర్రి రాజుయాదవ్, సురేశ్, చీదర్ల సంతోష్, రైతులు పాల్గొన్నారు. కొనుగోళ్లు చేపట్టాలి.. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పంట పండించాను. పంటలను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవైపు వర్షాల భయం, మరో వైపు పంటను నిల్వ చేసుకునేందుకు సౌకర్యాల లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి మక్కలు కొనుగోలు చేయాలి. – మొర్రి రాజు యాదవ్, మల్లంపల్లి -
5న హనుమాన్ నగర సంకీర్తన
ములుగు రూరల్: ఈ నెల 5న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అంజన్న స్వామి నగర సంకీర్తనకు హాజరు కావాలని కోరుతూ శనివారం హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు హనుమాన్ నగర సంకీర్తన కరపత్రాన్ని అందజేశారు. భక్తిభావంతో సంకీర్తన ఘనంగా నిర్వహంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. హనుమాన్ భక్తిబృందం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. రామాలయం దేవస్థానం నుంచి ములుగు పట్టణం మెయిన్ రోడ్ మీదుగా పురవీధుల గుండా శ్రీ ఆంజనేయ స్వామి శోభాయాత్ర నిర్వహించబడుతుందని తెలిపారు. ఆనంతరం రామాలయ ప్రాంగణంలో 12.30 గుంటలకు హనుమాన్ స్వాములకు, భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తమండలి సభ్యులు ఆవుల ప్రశాంత్ రెడ్డి, బాణాల రాజ్కుమార్, ఒజ్జల కుమారస్వామి, బైకాని నటరాజ్ పాల్గొన్నారు. -
గ్రాడ్యుయేషన్.. కొత్త భవిష్యత్కు నాంది
కాశిబుగ్గ: గ్రాడ్యుయేషన్ అనేది విద్యార్థుల ప్రయాణానికి ముగింపు కాదని, నూతన భవిష్యత్కు ఆరంభమని కాళోజీ యూనివర్సిటీ వైఎస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హనుమకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో 2020 బ్యాచ్కు చెందిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా కేఎంసీ మైదానంలో 62వ గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహిహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, వచ్చే ఐదేళ్లలో వ్యాధుల నిర్వహణ పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు నైతిక విలువలు. శాసీ్త్రయ ఆధారాలతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. కేఎంసీ పూర్వ విద్యార్థిగా తాను ఎంతగానో గర్వపడుతున్నానని అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకరనేని సంధ్య మాట్లాడుతూ కేఎంసీ వంటి పేరొందిన కళాశాల నుంచి తాను కూడా గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ రాంకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భావోద్వేగానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా 250 మంది వైద్య విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తెల్లకోటు ధరించి వేదికపై పట్టాలు అందుకుంటున్న తమ పిల్లలను చూసి చప్పట్లు, కేరింతలతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. తమ పిల్లలు వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంతోషపడ్డారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్రెడ్డి కేఎంసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు పట్టాలు అందుకున్న 2020 బ్యాచ్ వైద్య విద్యార్థులు -
మాలధారుల పాదయాత్ర
ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని మల్లూరు గుట్టకు 40 మంది హనుమాన్ మాలధారులు గురువారం సాయంత్రం పాదయాత్రగా బయలుదేరారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి హనుమాన్ కుటీర స్వాములు 40 మంది పాదయాత్రలో జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ పాదయాత్ర చేసుకుంటూ గుట్టకు చేరుకున్నారు. హనుమాన్ జెండాలను చేతబూని స్వామివారి చెంతకు చేరుకున్నారు. మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి తిరుకల్యాణాన్ని తిలకించి మొక్కులు సమర్పించి తిరుగు ప్రయాణంచేయనున్నట్లు గురుస్వామి గాడిచర్ల సాంబయ్య, గీకురు అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్సవడ్ల సంతోష్, మండల నాగరాజు, పోగు రమేశ్, శ్రీధర్, రమేష్, లక్క రమేష్, సిద్దు, గంపల శివకుమార్, ఉదయ్, భిక్షపతి పాల్గొన్నారు. -
కనులపండువగా ఎదుర్కోలు మహోత్సవం
మంగపేట : మండల పరిధిలోని శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం గురువారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. ఆలయంలో కొనసాగున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం నిత్య ఆరాధన, చతుస్థానార్చన, యాగశాలలో నిత్య హోమాలు, సుదర్శన హోమం, రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నపనం(అభిషేకం) కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం బలిహరణ కార్యక్రమం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం జరుగనున్న స్వామివారి తిరుకల్యాణం సందర్భంగా రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని స్వామివారి కల్యాణ మండపంలో స్వామివారు, ప్రత్యేక పల్లకిలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భక్తజనుల మధ్య ఉత్సవ మూర్తులకు వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోకంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవ కార్యక్రమం ఇతివృత్తాన్ని వివరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకి(సేవ)పై మల్లూరు గ్రామంలో భక్తులను దర్శించుకునేందుకు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ సురేశ్, శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పుల్లయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా సుదర్శన హోమం హేమాచలక్షేత్రంలో కొనసాగుతున్న జాతర -
కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్పీ
ములుగు రూరల్: జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బోర్ఖడే హేమంత్ సహదేవరావును గురువారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టే కార్యక్రమాలతో పాటు పలు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేశ్, ఎస్సై శంకర్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ములుగు రూరల్: జిల్లాలోని రూరల్, ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో చేరేందుకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త హరిసింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జాకారంలో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 10, మూడులో 10, ఐదులో 10 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఎస్ఎస్ తాడ్వాయిలోని పోచాపూర్లో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 13, మూడు, నాలుగో తరగతిలో 5, ఐదో తరగతిలో 7 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే వాజేడులో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 9, మూడో తరగతిలో 3, నాల్గో తరగతిలో ఒకటి, ఐదో తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు 5వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. ఇద్దరికి జైలుశిక్ష ములుగు రూరల్: జిల్లాలో గంజాయి, పొక్సో కేసులో ఇరువురికి జైలుశిక్ష ఖరారు అయినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పస్రా పోలీస్ స్టేషన్లో మంగపేట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సూర్యప్రకాశ్పై గంజాయి కేసు నమోదు కాగా పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా కోర్టు విధించినట్లు తెలిపారు. అదే విధంగా వెంకటాపురం(ఎం) మండలం కొండాపూర్కు చెందిన రజినీకాంత్కు పొక్సో కేసులో రెండేళ్ల జైలుతో పాటు రూ.4,200 జరిమానాను కోర్టు విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితులకు శిక్షపడే విధంగా కృషి చేసిన దర్యాప్తు అధికారులు శంకర్, తాజుద్దీన్లను ఆయన అభినందించారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఏటూరునాగారం: విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఐటీడీఏ ద్వారా అవకాశాలను కల్పిస్తున్నట్లు పీఓ లెనిన్ వత్సల్ టొప్పో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ద్వారా ఆస్ట్రేలియా, జర్మనీ, ఓమన్ వంటి విదేశాల్లో ఉద్యోగాలు చేసే గిరిజన నిరుద్యోగ యువతీయువకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సపర్రయ్ ప్రింటర్, పానేల్ బెటర్, ఆటోమెటిక్ మెషిన్ కార్స్, వెల్డర్ కంపెనీలలో ఆస్ట్రేలియాలో పనిచేసేందుకు సుమారు 500ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జర్మనీలోని ట్రాన్స్మిషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, నుర్సెన్ కంపెనీలలో సుమారు 230 వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
కరకట్ట పటిష్టం
ఏటూరునాగారం: గోదావరి వరదకు కరకట్ట మట్టి ఒర్లిపోతుంది. పలుమార్లు దానికి రివిట్మెంట్, మట్టితో కోతలను నింపారు. కాని ప్రతీ వర్షాకాలంలో వరద తాకిడికి మట్టి తీవ్రంగా నీటి ప్రవాహంలో కలిసిపోతుంది. దానివల్ల కరకట్ట ఎప్పుడు తెగిపోతుందోనని గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి వరదల నుంచి కరకట్ట రక్షణకు చేపట్టిన జియోట్యూబ్ ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో రూ. 70 లక్షల బడ్జెట్ వ్యయంతో పనులు చేపట్టారు. ప్రస్తుతం 8 జియోట్యూబ్లలో ఇసుక నింపే పనులు చేస్తూ మట్టి ఒర్లిపోకుండా అడ్డుకట్టగా పెట్టారు. మొత్తం 50 వరకు ట్యూబ్లను 250 మీటర్ల మేర అమర్చనున్నారు. ఏటా వరదల సమయంలో గోదావరి ఒడ్డు కోతకు గురవుతుండడంతో కరకట్ట పటిష్టతకు చర్యలు చేపడుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో అమర్చారు. ప్రస్తుతం అదే పద్ధతిని ఇక్కడ అవలంభిస్తున్నారు. ఏటూరునాగారం, మంగపేట, మండలాల్లో సుమా రు రూ.137 కోట్ల కరకట్ట, కాంక్రీట్ వాల్స్, గోదావరిలో నీటి కట్టలను నిర్మించడానికి 2022–23లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిధుల కేటాయింపు మరుగున పడింది. కరకట్ట ఎక్కడ బలహీనంగా ఉంది.. ఎక్కడ కాంక్రీట్ వాల్ అవసరం, ఎక్కడ నీటిలో అడ్డుకట్టలు వేయాలనేది నేషనల్ అథారిటీ ఇరిగేషన్ వారు డిటేల్డ్ ప్రాజెక్డు రిపోర్టును ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు డీపీఆర్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. కరకట్టకు ఉన్న గేట్లను సైతం పూర్తి స్థాయిలో మార్చి వేయాల్సి ఉంది. గతేడాదిలో ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. మంగపేట మండలం పరిధిలోని గంపోనిగూడెం, కమలాపురం, ఏటూరునాగారం మండల కేంద్రంతో పాటు రామన్నగూడెం, రాంనగర్ గ్రామాలకు గోదావరి వరదతో ముంపు వాటిల్లింది. కానీ కరకట్టలు ఉండడం వల్ల గ్రామాలకు పెద్ద నష్టం జరగలేదు. మట్టి కట్టల కోతల వల్ల స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులు నాలుగేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ముంపు నివారణ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రూ. 70 లక్షల నిధుల కేటాయింపు ముమ్మరంగా సాగుతున్న పనులు గోదావరి వరద ముంప్పు నివారణకు నిర్మించిన కరకట్ట కోతలకు గురికాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చూపాలి. కరకట్ట కోతకు గురై రివిట్మెంట్ కూలిపోవడం, ఒర్లిపోవడంతో కరకట్ట తెగే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. – దొడ్డ కృష్ణ, రామన్నగూడెం -
డిజిటల్ జనగణనకు సిద్ధం
ములుగు: జిల్లాలో జనగణనను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. కలెక్టరెట్లో జనగణనపై కలెక్టర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జనగణన ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా స్వీయ నమోదు ద్వారా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని ప్రజలను కోరారు. జనగణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ స్వీయ గణన 26వ తేదీ నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 807 హౌస్ లిస్టింగ్ బ్లాకులు గుర్తించామని, ప్రతీ బ్లాక్లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియకు 545 మంది ఎన్యుమరేటర్లు, 97 మంది సూపర్వైజర్లను (రిజర్వ్తో సహా) నియమించినట్లు తెలిపారు. స్వీయ నమోదుకు ఎస్ఈ.సీఈఎన్ఎస్యుఎస్.జీఓవీ.ఐఎన్ పోర్టల్లో కుటుంబంలోని ఒక సభ్యుడు లాగిన్ అయి వివరాలు నమోదు చేయవచ్చని తెలిపారు. నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని, ఒకసారి నమోదు చేసిన తర్వాత సవరణకు అవకాశం ఉండదని సూచించారు. నమోదు చేసిన మొబైల్ నంబర్కు 11 అంకెల సంఖ్య వస్తుందని, ఆ సంఖ్యను ఎన్యుమరేటర్కు అందజేయాలని తెలిపారు. ఏమైనా తప్పులు ఉంటే ఎన్యుమరేటర్ ద్వారా మాత్రమే సవరించుకోవచ్చని స్పష్టం చేశారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ జనగణనలో డేటా గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. స్వీయ నమోదు ద్వారా వేగవంతంగా, ఖచ్చితమైన డేటా సేకరణ సాధ్యమవుతుందని వెల్లడించారు. స్వీయ నమోదుకు చివరి తేదీ మే 10 అని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్ జీ, డీపీఆర్వో రఫిక్, కలెక్టరేట్ అధికారి మంజుల, జనగణన పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హేమంత్ సహదేవరావు -
మళ్లీ పుష్కర శోభ
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక కాంతులతో మళ్లీ వెలుగులు విరజిమ్మనున్నాయి. సరస్వతీనది అంత్యపుష్కరాలు ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సుమారుగా 30లక్షల మంది భక్తులు వస్తారని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కంచి పీఠాధిపతి, గవర్నర్ ప్రతాప్శుక్లా, సీఎం రేవంత్రెడ్డి ప్రారంభపూజల్లో పాల్గొననున్నారని సమాచారం. దీంతో 12 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ నెలకొననుంది. సమన్వయంతో పనిచేస్తున్న శాఖలు రాష్ట్ర ప్రభుత్వం రూ.21.38 కోట్ల విడుదల చేయగా.. అధికార యంత్రాంగం తాత్కాలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో బిజీగా ఉంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులకు తాగునీరు, వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం, వీఐపీఘాటు వద్ద ప్లాట్ఫామ్ పనులు, రూ.2కోట్ల వ్యయంతో నల్లగొండ పోచమ్మ గుడి నుంచి వీఐపీఘాటు వరకు రోడ్డు పనులు, ఆదిముక్తీశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు, వీఐపీ ఘాటు నుంచి మెయిన్ ఘాటు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. 12 రోజులు హారతి కార్యక్రమాలు.. గతేడాది జరిగిన సరస్వతి ఆదిపుష్కరాల్లో నిర్వహించిన కాశీపండితులతో మళ్లీ అంత్య పుష్కరాలకు గోదావరివద్ద హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు ఎనిమిది మంది బృందంతో హారతి శోభతో వెలిగిపోనుంది. వారి రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు ఆలయంలో హోమాలు ప్రత్యేకంగా చేపడుతున్నారు. 12 రోజుల పాటు రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పీఠాధిపతులు.. ఆది పుష్కరాల మాదిరిగానే అంత్యపుష్కరాలకు పలువురు పీఠాధిపతులు రానున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనదిలో పుణ్యస్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. వారి రాకకోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేపట్టింది. 12 రోజుల పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పుణ్యస్నానాలు చేయనున్నారు. ఆలయంలో దర్శనాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు.. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నదికి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరం గొప్పగా నిర్వహించడానికి ఇప్పటికే రూ.198 కోట్ల వ్యయంతో రాతి కట్టడాలు నిర్మాణం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా పుష్కరాలకు మరిన్ని నిధులు రానున్నాయి. దీంతో మరోమారు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వేదిక కానుంది.రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులతో పాటు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అంత్యపుష్కరాల వాల్పోస్టర్, టీజర్ వీడియోను ఆవిష్కరించారు. దీంతో విస్తృతంగా పబ్లిసిటీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. 100 ఎకరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అంతర్రాష్ట్ర వంతెన, వీఐపీ ఘాటు సమీపం, ఎస్సీకాలనీ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీమాత విగ్రహం వద్ద డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టనున్నారు. -
బాల్యవివాహాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో మహిళా గ్రూపు సభ్యుల పాత్ర కీలకమని ఐకేపీ ఏపీఎం శ్రీధర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని చైతన్య మండల సమాఖ్య కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత, సంరక్షణ–డ్రగ్స్ నిర్మూలన, సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సీసీలకు, వీఓఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల్లో ప్రతీ ఇంటిలో ఒక గ్రూపు సభ్యురాలు ఉంటుందని, బాల్యవివాహాలతో జరిగే నష్టాలు, అనార్థాలను వివరించి అటువైపు వారి దృష్టి వెళ్లకుండా చేయాలన్నారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి, బాలల పరిరక్షణ ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ కిశోర బాలికల సమాచారం, స్నేహ క్లబ్ల ఏర్పాటులో అంగన్వాడీ టీచర్ల సహకారం గూర్చి వివరించారు. కిశోర బాలికలు వయస్సు పరంగా వచ్చే ఆకర్షణలతో అమాయకత్వంతో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. బాలికలు ఏమైన ఇబ్బందులు ఉంటే 1098 టోల్ ఫ్రీనంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి ఏటూరునాగారం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలకేంద్రంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పుడు టీపీఎస్ కూడా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం వలన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు నష్టపోతారన్నారు. ఇది భవిష్యత్లో విద్యాపరంగా ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఏటూరునాగారం మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆట స్థలం, తరగతులు ఉన్నాయన్నారు. దీనిపై విద్యార్థి సంఘాలను కలుపుకొని జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు. కల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సన్మానం భూపాలపల్లి అర్బన్: 23 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్బాబు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా భూపాలపల్లి బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు న్యాయమూర్తులు హాజరై రమేష్బాబు సేవలను, వారి ఆదర్శప్రాయ జీవితాన్ని కొనియాడారు. విశ్రాంత జీవితంలో కూడా సమాజ సేవ కొనసాగించాలని ఆకాంక్ష వ్యక్తంచేశారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సతీమణి అనంతలక్ష్మి, ములుగు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్ర, వరంగల్ ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబ, వరంగల్ మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రే యి, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జి టి.కన్హయ్యలాల్, ప్రిన్సిపల్ జూని యర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్నా యక్, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ఆకుల రాములు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాల సందడి
ములుగు రూరల్: పల్లెల్లో వేసవి శిబిరాల సందడి నెలకొంది. ఈ ఎండాకాలం సెలవుల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. గ్రామ స్థాయిలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహణ ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం పెరగడంతో పాటు స్నేహభావం పెంపొందుతుంది. ప్రభుత్వం యువజన సర్వీస్ల క్రీడల శాఖ ఆధ్వర్యంలో శిబిరాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వేసవి సె లవుల్లో క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకొని ఆసక్తి కలిగిన క్రీడాల్లో రాణించే విధంగా కోచ్లను కూడా ఏర్పాటు చేసి శిబిరాలను నిర్వహిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో.. జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 10 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. శిబిరాల్లో 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగి బాలబాలికలు అర్హులు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. ఏఏ క్రీడాంశాలల్లో శిక్షణ ఇస్తారంటే.. సైక్లింగ్, ప్లోర్బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో, తైక్వాండో, వాలీబాల్, కరాటే, రెజ్లింగ్ ఎక్కడెక్కడంటే.. ములుగులో క్రికెట్, కబడ్డ్డీ, ఏటూరునాగారం కబడ్డ్డీ, మదనపల్లిలో సైక్లింగ్, జగ్గన్నపేటలో రెజ్లింగ్, యోగా, వాజేడులో వాలీబాల్, ఏటూరునాగారం హ్యాండ్బాల్, ఆకులవారి ఘణపూర్లో అథ్లెటిక్స్ శిబిరాలను కొనసాగిస్తారు. కోచ్ల ఎంపిక పూర్తి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహనకు కలెక్టర్ ఆదేశాల మేరకు కోచ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. వేసవి క్రీడా శిబిరాల నిర్వాహనకు యువజన సర్వీస్లు క్రీడల శాఖకు రూ.1.05 లక్షలను కేటాయించింది. ఇందులో కోచ్లకు రూ. 40 వేలు, క్రీడ సామగ్రి కొనుగోలుకు రూ.50 వేలు, మైదానం అభివృద్ధి, శిక్షణ శిబిరం నిర్వాహనకు 10 వేలు, క్రీడల సమయంలో ప్రమాదం జరగడం, చిన్న చిన్న గాయాలైన వెంటనే చికిత్స అందించేందుకు రూ.5 వేలను కేటాయించింది. శిబిరాల్లో కోచింగ్ ఇచ్చే వారికి నెలకు రూ.4 వేల గౌరవ వేతనం అందించనున్నారు. శిబిరం నిర్వాహనకు రూ.వెయ్యి చెల్లిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో వివిధ క్రీడలకు సంబంధించిన 10 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. శిక్షణ ఇచ్చేందుకు కోచ్ల ఎంపిక పూర్తి చేశాం. మే 1 నుంచి 31వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలు అర్హులు. జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – రామ్మోహన్, జిల్లా యువజన క్రీడల అధికారి మే 31వ తేదీ వరకు కొనసాగింపు జిల్లాలో 10 శిబిరాల ఏర్పాటు ఒక్కో శిబిరంలో 20 నుంచి 25 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా యువజన క్రీడల అధికారి రామ్మోహన్ -
కార్మికుల శ్రమతోనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం
● మంత్రి సీతక్క ● ఘనంగా మేడే వేడుకలు ములుగు: కార్మికుల శ్రమతోనే ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లాలో మేడే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలకు మంత్రి ధనసరి సీతక్క హాజరై కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. సమాజ అభివృద్ధికి కార్మికుల కృషి పునాది వంటిదని, వారి శ్రమతోనే ఆర్థిక వ్యవస్థ బలపడుతోందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కౌన్సిలర్లు, హమాలీ సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: రైతులకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మార్క్ఫెడ్, మార్కెటింగ్, రవాణా, సహకార, పౌర సరఫరాలు, సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 49,175 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరగగా.. ఇప్పటివరకు 3,274 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు కొనుగోలు కేంద్రాల్లో గోదాం, హమాలీ, రవాణా సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. స్వీయ జనగణనలో పాల్గొనాలి.. స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జరుగనున్న స్వీయ జనగణన కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. -
హక్కులను హరిస్తే గుణపాఠం తప్పదు
● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డిగోవిందరావుపేట: కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తే ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి హెచ్చరించారు. సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాలు, గ్రామ పంచాయతీ, ఆశ, అంగన్వాడీ, భవన నిర్మాణం, ఆటో, హమాలీ సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పస్రా నుంచి చల్వాయి వరకు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చల్వాయి గ్రామంలో నిర్వహించిన సభలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకుచ్చి 129 కార్మిక చట్టాలను సవరించి కార్మికుల హక్కులను హరించిందన్నారు. కనీస వేతనం అమలుకాకుండా పెట్టుబడీ దారి వర్గానికి దోపిడీ సంస్థగా బీజేపీ మారిందన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని శ్రామిక వర్గం రాజ్యం ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సోమ మల్లారెడ్డి, పొదిళ్ల చిట్బిబాబు, దుస్స సతీష్, ఐలయ్య, జిట్టబోయిన రమేష్, అంబాల మురళి, కోటే కృష్ణారావు, గుండు రామస్వామి, కన్నోజు సదానందం, చలసాని వెంకటేశ్వరరావు, తీగల ఆగిరెడ్డి, గొంది రాజేష్, కడారి నాగరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా హేమాచలుడి తిరుకల్యాణం
● భారీగా తరలివచ్చిన భక్తులు ● పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్చార్జ్ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ పెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాదన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో జిలకరబెల్లం, మాంగళ సూత్రదారణ, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. హేమాచలుడికి పట్టువస్త్రాలు అందించిన మంత్రి సీతక్క హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి మంత్రి ధనసరి సీతక్క, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్తో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ ఈఓ వీరస్వామి, ఉత్సవకమిటీ చైర్మన్ యరంగారి సురేష్, పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ దంపతులు, జిల్లా గ్రథాలయ చైర్మన్ భానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్, రేగ కల్యాణి, ములుగు ఆర్డీ వెంకటేష్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్బట్, టీఎస్ ఈజీసీ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, బ్రహ్మోత్సవాల యాగ్నికులు అనిపెదిద రాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం, సీతారాములు, గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తాం.. 2027లో జరిగే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం నాటికి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. 2027లో జాతరతో పాటు, గోదావరి పుష్కరాల నిర్వాహణ ఉండటంతో పెద్ద ఎత్తున నిధులు కెటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, ఆయా నిధులతో రోడ్లు, పుష్కరఘాట్ల అభివృద్ధితో పాటు నూతనంగా గ్రానైట్తో శాశ్వత నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కాగా జాతరకు ఆర్టీసీ బస్సులు అవసరమైన మేరకు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎర్రటి ఎండలో పార్కింగ్ స్థలాల నుంచి గుట్టపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ ఎస్సై టీవీఆర్ సూరీ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెల్లడంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హేమాచల క్షేత్రంలో శ్రీచక్రానికి అవమానం హేమాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల సాక్షిగా హిందూ తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన శ్రీ చక్రం యంత్ర శిలకు అవమానం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తీసుకువచ్చిన చక్రాన్ని ఆలయ అధికారులు ప్రాంగణంలోని ఆర్చీ పక్కన పడేశారు. దాని పవిత్రతను తెలియని కొందరు అక్కడే పాదరక్షలు వదిలారు. ఇది చూసిన ఆంజనేయస్వామి భక్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తక్షణమే స్పందించి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కేయూ క్యాంపస్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30గంటలకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చేవారికి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్ నోడల్ ఆఫీసర్ భిక్షపతి తెలిపారు. నిబంధనలు కఠినం.. ● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకునిరావాలి. ● పెన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. ● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ● ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు తీసుకురావొద్దు, ● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. ● కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్లాంటివి గాకుండా ఇతర సాధారణ దుస్తులు ధరించి రావాలి. ● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ను తీసుకురావచ్చు. ● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ● ప్రతి గదిలో, మెయిన్ గేట్వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో పరీక్షకేంద్రాలు ఇలా.. ● వరంగల్ నిట్లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రియ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల. ● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల. ● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం. ● మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. ● మహబూబాబాద్లో నీట్ నోడల్ ఆఫీసర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్కుమార్ వ్యవహరించనున్నారు. రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30గంటల తర్వాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016 మంది అభ్యర్థులుజిల్లా సెంటర్లు అభ్యర్థులుహనుమకొండ, వరంగల్ 09 4,600 జయశంకర్ భూపాలపల్లి 02 374 జనగామ 02 566 మహబూబాబాద్ 01 476 -
పకడ్బందీ ఏర్పాట్లు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నీట్ నిర్వహణ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన(రేపు) జరుగనున్న నీట్ సందర్భంగా 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలవడం నిషేధమని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. మైకులు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని ఎస్పీ సంకీర్త్ అన్నారు. -
బుద్ధుడి బోధనలు ఆదర్శం
మల్హర్(కాటారం): బుద్ధుడి బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శమని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని కాటారం గారేపల్లిలోని జై భీమ్ అంబేడ్కర్ కార్యాలయంలో బుద్ధుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పి ంచారు ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని ప్రేమను అందించి ఆచరించి ప్రపంచ మానవాళికి ఆదర్శనీయులయ్యారని చెప్పారు. ప్రతి ఒక్కరూ బుద్ధుడి బోధనల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు సంపత్ మహారాజు, యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్, కొండన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి
ఏటూరునాగారం: బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బుధవారం బాలల భద్రత, సంరక్షణ, డ్రగ్స్ నిర్మూలన వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పౌరులందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంటా మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనేక చోట్ల డబ్బులు పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న విషయాలు చూస్తున్నామన్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. బాలికలు చిన్న చిన్న విషయాలకు ఆకర్షణకు గురవుతుంటారని వివరించారు. తల్లిదండ్రులు వారిపట్ల బాధ్యతగా ప్రేమతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ -
అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి
కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయఽశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం హైదరాబాద్లో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ రాహుల్ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీ ధర్బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్ పోస్టర్, పుష్కరాల టీజర్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, గోవిందహరి, కృష్ణవేణి, రామకృష్ణారావు, ఈఓ మహేష్, దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, అర్చకులు పణీంద్రశర్మ, శరత్చంద్ర, ధర్మకర్తలు శ్యామ్, పద్మ, అశోక్, సత్త య్య, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు పుష్కరాల వాల్పోస్టర్ ఆవిష్కరణ -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ..
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హరిణి 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్. తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
‘లా’ ఫలితాలు వెల్లడి..
సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్లాగ్స్ లేని మూడేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమిస్టర్ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్.ఆర్గ్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ దరఖాస్తుకు సుగమం నేటితో అఖరు కావడంతో అప్లయ్ చేసుకునేందుకు ఛాన్స్ ‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు -
గొత్తికోయల సమస్యలు పరిష్కరిస్తాం
గోవిందరావుపేట : గొత్తికోయ గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పస్రా ఎస్సై తాజుద్దీన్ అన్నారు. మండలంలోని కన్నయ్య గొత్తికోయల నివాస ప్రాంతాన్ని బుధవారం టీజీఎస్పీ బలగాలు, పోలీస్ సిబ్బందితో కలిసి పస్రా ఎస్సై తాజుద్దీన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరిజనులు తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి సమస్యలను విన్న ఎస్సై తాజుద్దీన్ వెంటనే స్పందిస్తూ, ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని, గిరిజనులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. -
సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు
● శాస్త్రవేత్త మధు వెంకటాపురం(కె): పంటల మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకం తో భూసారం పెరుగుతుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ శాస్త్రవేత్త మధు అన్నారు. మండల పరిధిలోని పాత్రాపురం రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వాడకం ప్రకృతి వ్యవసాయం, పంటల మార్పిడితో నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని తెలిపారు. పంటల మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకంతో భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూములు సారవంతంగా మారుతాయని తెలిపారు. రైతులు సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా, నానో డీఏపీ వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ, ఆత్మ డైరెక్టర్లు మన్నెం సునీల్ బాబు, పల్నాటి నాగేశ్వనావు, కొండపర్తి సీతాదేవి, మండల వ్యవసాయ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాలయేసు’ విజయదుందుభి..
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
పదిలో నంబర్ వన్
ములుగు/ములుగు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా సత్తా చాటింది. జిల్లాకు చెందిన విద్యార్థులు గతంకంటే అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈ ఏడాది రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచారు. జిల్లాలో మొత్తం 3,287 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3,264 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 99.30 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,697 మంది బాలురకు 1,681 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,590 మంది బాలికలకు 1,583 మంది ఉత్తీర్ణత సాధించారు. మంత్రి సీతక్క హర్షం టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారికి మార్గనిర్ధేశం చేసిన ఉపాధ్యాయులకు, జిల్లా యంత్రాంగానికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. 99.30 శాతం ఉత్తీర్ణత సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,731 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థుల ప్రభంజనం ములుగు మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాల, ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాల దేవగిరిపట్నం, పిఎం శ్రీ మోడల్ పాఠశాల బండారుపల్లి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థి జె.మనోహర్ 571 మార్కులు సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన హనీశ్రీ 565 మార్కులు సాధించారు. అలాగే దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎం.సాత్విక 567 మార్కులు సాధించారు. బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన కె.సిరి చందన 563 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని కస్తూ ర్బా గాంధీ బాలికల పాఠశాలలో రేగుల సింధుప్రియ 544 మార్కులు సాధించారు. జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పవన్ కల్యాణ్ 549, మైనార్టీ గురుకుల పాఠశాలలో 54 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 37 మంది విద్యార్థినులు 500పైగా మార్కులు సాధించారు. బండారుపల్లి మోడల్ పాఠశాలలో 95 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 94 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 17 మంది 500 పైగా మార్కులు సాధించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 33 మంది పరీక్షలకు హాజరు కాగా 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరుగురు విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థిని కోరంకున్నత్ కృష్ణ 589 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. అలాగే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదల విజయానికి దోహదపడ్డాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే పలు మండలాల్లో టాపర్లుగా నిలవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా టాపర్గా నిలిచిన కృష్ణను పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు డీఈఓ సిద్ధార్థరెడ్డి, విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని పాల్సబ్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు పద్మదేవ్సింగ్, నల్లెల స్వాతి, భరత్ కుమార్, తిరుపతి రెడ్డి, తదితరలు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా విద్యావతి
వెంకటాపురం(ఎం): బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా మండల పరిధిలోని నర్సాపూర్కు చెందిన పెరుమాండ్ల విద్యావతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రామప్పలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భాస్కర్ వారిని శాలు వాతో సత్కరించారు. టూరిజం గైడ్ విజయ్కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. భూపాలపల్లి అర్బన్: మేడే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు మరింత బలపడాలన్నారు. ఉద్యోగ భద్రతకు కార్మిక వర్గం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై లేబర్ కోడ్లు అమలు చేసి పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, కిరణ్, ప్రసాద్ పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ఏటూరునాగారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని ఆత్మ చైర్పర్సన్ కర్ల అరుణ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, పప్కాపురం, రొయ్యూరు, శివాపూర్, శంకరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరుణ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతుల కష్టానికి తగిన మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, చిటమట రఘు, వసంత శ్రీనివాస్, కొండగొర్ల పోశయ్య, సర్పంచ్ విజయ్కుమార్ పాల్గొన్నారు.ఆత్మ చైర్పర్సన్ కర్ల అరుణ -
పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి
ములుగు: ములుగు పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి అన్నారు. ములుగు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి కమిషనర్ అధ్యక్షత వహించగా ఆమె హాజరై మాట్లాడారు. మున్సిపల్ నిధుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలు, పారిశుద్ధ్య వాహనాల మరమ్మతు, పారిశుద్ధ్య సమస్యలు, ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లై, చేతిపంపుల రిపేర్లు, వీధి దీపాల సమస్యలపై కౌన్సిలర్లతో చర్చించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పునకు సంబంధించిన సర్వే, రెవెన్యూ విభాగానికి సంబంధించి ములుగు పట్టణంలోని గృహ వాణిజ్య, వ్యాపార బిల్డింగ్లను కొలతలతో సీజీజీ పోర్టల్లో గ్రామ పంచాయతీ రేటుతోనే ఆధునీకరించడంపై చర్చించి సభ్యులు ఏకగ్రీవ తీర్మాణం చేశారు. కోఆప్షన్ సభ్యుల ఎంపిక ములుగు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించినట్లు కమిషనర్ రమేశ్ తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీస్ కో ఆప్షన్ మెంబర్ రూల్స్ 2020కి అనుగుణంగా పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగి ఉన్న ఇద్దరు సభ్యులు ఓడ సుజాత, కుక్కల నాగరాజును, అల్పా సంఖ్యాక వర్గం నుంచి సయ్యద్ ఆసియా, ఎండి.షర్పోద్ధీన్లను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు.మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ -
డీజిల్ దొరకలేదు..
మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం చుట్టూ పక్కల ఉన్న అన్ని బంకులు తిరిగినా చుక్క డీజిల్ దొరకలేదు. దుక్కులు దున్నే సమయంలో ట్రాక్టర్లో ఇంధనం లేక ఇంటి దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్ లేక టూవీలర్ మీద తిరిగే పరిస్థితి లేదు. పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – నల్లెబోయిన సమ్మయ్య, పూసూరు, వాజేడు మండలం ముప్పనపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో ఎప్పుడు స్టాక్ లేదనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. వారంలో మూడు రో జులు నోస్టాక్ బోర్డులే పెడుతున్న పరిస్థితి నెలకొంది. స్టాక్ ఉండే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. – దుర్గం రాజు కుమార్, కన్నాయిగూడెం -
పలుచోట్ల బ్లాక్లో అమ్మకాలు
జిల్లాలోని ప్రతీ బంకులో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు బ్లాక్లో పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేస్తున్నారు. బంక్లలో లీటర్ పెట్రోల్ రూ.107, డీజిల్ రూ. 95లు ఉండగా సుమారు రూ.130ల నుంచి రూ.150లకు బయట విక్రయిస్తున్నారు. బంక్లకు పెట్రోల్ రాగానే బ్లాక్లో పెట్రోల్, డీజిల్ అమ్మే వ్యాపారులు బంక్ యజమానులతో కుమ్మకై ్క వాహనదారులకు పోయకుండా వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రబీ సీజన్ సందర్భంగా డీజిల్ లేక వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు ముందుకు కదలడం లేదు. దీంతో వర్షాలు కురిస్తే తమ పంటల పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో రైతాంగానికి ఇంధన కొరతతో ఇక్కట్లకు గురవుతున్నారు. -
ఇంధన ఇక్కట్లు
జిల్లాలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ములుగు: పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంధనం వస్తుందని తెలియగానే బంకుల వద్దకు రాత్రి, పగలు తేడా లేకుండా వెళ్లి క్యూలు కడుతున్నారు. జిల్లాలో మంగళవారం 5 పెట్రోల్ బంక్లకు ఇంధనం రాగా గంటల వ్యవధిలోనే అమ్మకాలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కొనసాగాయి. దొరకదనే ప్రచారంతో ఆందోళన ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదనే ప్రచారంతోనే వాహనదారులు ఆందోళనకు గురవుతుండడంతో ఇంధనం కొరత మరింత తీవ్రమైంది. ఇంధనం దొరకదనే నెపంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ నింపుకోవడమే కాకుండా క్యాన్లలో ఇంధనాన్ని తీసుకొని వెళ్తూ స్టాక్ చేసుకుంటున్నారు. దీంతో వాహనాలు నడిపి జీవించే ఆటోవాలాలు, జీపు యజమానులు, అద్దెకార్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలోని 10 మండలాల పరిధిలో 39 పెట్రోల్ బంక్లు ఉండగా పలు బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం కొరత లేదని ఒకవైపు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇంధనాన్ని ప్రతిరోజూ సరఫరా చేసే చమురు కంపెనీలు వారం నుంచి రెండు వారాల సమయం తీసుకొని ట్యాంకర్లను పంపిస్తుండడంతో సమస్య తలెత్తుతుందని బంకుల యజమానులు పేర్కొంటున్నారు. వాహనదారులకు తప్పని కష్టాలు రాత్రి, పగలు తేడా లేకుండా క్యూలు కొరత లేదంటున్న అధికారులు -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లలో పలువురు రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తాలు పేరుతో కటింగ్ చేస్తున్నారని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో 163 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడారు. మిల్లర్ల కటింగ్లతో ఒక్కో లారీకి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలకు మించి కటింగ్ చేయడం అన్యాయమన్నారు. కటింగ్లను వెంటనే నిలిపివేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబు, రామస్వామి, నరసింహ నాయక్, సాంబశివుడు, సుధాకర్ రెడ్డి, చందూలాల్, సదానందం, సాంబయ్య, సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. తాలు పేరుతో కటింగ్లకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లు నిరసిస్తూ ఎన్హెచ్పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో -
బాలల పరిరక్షణపై అవగాహన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం బాల్య వివాహాలు, బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో ముత్తమ్మ మాట్లాడారు. బాలికలు తప్పకుండా విద్యను అభ్యసించాలన్నారు. సామాజిక మాద్యమాలకు ఆకర్షితులు కావద్దని సూచించారు. బాల్య వివాహాలు, బాలల పరిరక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ కమ్ ప్రొహిబిషన్ అధికారి సుజాత, తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ సందర్శన ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సమ్మక్క,–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మంగళవారం హైదరాబాద్ ఎయిమ్స్ సీనియర్ వైద్యులు రాహుల్ నారన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాల వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్య సేవలు మెరుగుపడేందుకు యూనివర్సిటీని నోడల్ కేంద్రంగా చేసుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించాలని ఎయిమ్స్ ప్రతిపాధించిందని వెల్లడించారు. ఎయిమ్స్ హైదరాబాద్, సమ్మక్క,–సారక్క యూనివర్సిటీల మధ్య పరస్పర సహకారానికి అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వివరించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం ములుగు రూరల్: కార్మికుల హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ మండల కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ పేరుతో కార్మికులను అగాధంలోకి నెట్టివేస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పని విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి గపూర్ పాషా, రత్నం ప్రవీణ్, రాజు, రవీందర్, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల క్షేత్రంలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం గరుడాదివాసం కార్యక్రమాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రెండోరోజూ కార్యక్రమంలో భాగంగా ఆల య ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలోని పంచముఖాంజనేయ స్వామి వారి కి స్నపనం (అభిషేకం) పూజలు నిర్వహించారు. యాగశాలలో పూజలు యాగశాలలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవ మూర్తులకు సేవాకాలం, బాలబోగం నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా వైనతేయ లేఖనం(గరుడ) గరుడ చిత్రపటం వేసి ఆవాహనం పూజలు నిర్వహించారు. నేత్రోన్మీలన, గరుడాదివాసం, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభు స్వామివారికి వేదమంత్రోశ్చరణతో ప్రత్యేక అర్చనలు జరిపించి వెండి కవచం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్ శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పుల్కలయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు. జాతరకు పటిష్ట బందోబస్తు వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయమైన సంఘటనలు తలెత్తకుండా నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 100 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం వచ్చిన ఆయన ఎస్సై సూరి, ప్రొహిబిషన్ ఎస్సై శ్రీకాంత్తో కలిసి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. మే 1న జరుగనున్న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్య తల్తెకుండా ఉండేందుకు మల్లూరు, గుట్టమార్గం మధ్యలో రెండు ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి భక్తులను ఆటోలు, ప్రైవేట్ బస్సులలో ఉచితంగా గుట్టపైకి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అభయాంజనేయ స్వామికి స్నపనం స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి ఆభరణాల అలంకరణ -
– సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి తనూ అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు. కిన్నెర గుంశావలి (ఫైల్)బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలను ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్ల లను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. కాగా, కాంతకు సొంత ఇల్లు, జాగ లేదు. బంధువులింటి సమీపంలో ఓ టెంట్ వేసుకుని భర్త, పిల్లల మృతదేహాల కోసం ఎదురుచూడడం గమనార్హం. విలాస్ (ఫైల్)వికేష్ (ఫైల్)పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మెడకు తాళ్లు బిగించావు.. ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా ఉంది.. తాడు విప్పి దించు నాన్నా.. అయినా నీ మనస్సు కరగలేదా..తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి కుటుంబ కలహాలకు పిల్లలు బలి గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు -
నానో యూరియాపై అవగాహన ఉండాలి
ఏటూరునాగారం: నానో యూరియాపై రైతులు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సైంటిస్ట్ మధు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఒక రోజు శిక్షణలో భాగంగా సమగ్ర ఎరువుల యజమాన్య పద్ధతిపై అవగాహన పెంచుకోవాలన్నారు. సాయిల్ హెల్త్ కార్డులు పొందాలని సూచనలు చేశారు. రైతులు కేవలం రసాయన ఎరువులే కాకుండా పశువుల పెంట, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు, పీఎస్బీ(భాస్వరాన్ని కరిగించు భ్యాక్టిరియా), రైజోబియం వంటి జీవన ఎరువులు వాడి మంచి దిగుబడులూ సాధిస్తూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ అరుణ, ఏడీఏ అవినాష్వర్మ, ఏఓ వేణుగోపాల్, ఏఈఓలు రవికుమార్, రాజు, ఉద్యాన అధికారి లావణ్య పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించాలి కన్నాయిగూడెం: మండల రైతులు రసాయణ ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువులతో సేంద్రియ వ్యవపాయంపై దృష్టిసారించాలని వ్యవసాయ శాస్త్ర వేత్త మధు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి ముంజ మహేశ్ ఆధ్వర్యంలో పంటల సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రానున్న వర్షాకాలంలో ఎలాంటి పంటలు సాగు చేయాలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వాడాల్సిన ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్త మధు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా మధు మాట్లాడుతూ రాబోయే వర్షకాలంలో సన్నరకం వడ్లల్లోని మంచి రకాలను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి రమేశ్ మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుచేయడం వల్ల అనేక లాభాలు వస్తాయని తెలిపారు. సైంటిస్ట్ మధు -
గిరిజన దర్బార్లో వినతులు ఇలా..
ములుగు మండలం పొట్లాపురంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అక్కడి గిరిజనులు విన్నవించారు. కన్నాయిగూడెం మండలం పడిగాపురం గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో బోరు, మోటారు నిర్మించుకునేందుకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం నుంచి శంకరాజుపల్లికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. ములుగు మండలం పొట్లాపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగా పనిచేయకపోవడంతో 50 మంది ఆదివాసీ రైతులు సాగునీరు లేక భూములు పడావుపడి ఉంటున్నాయని, ఇరిగేషన్ వల్ల నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. ఏటూరునాగారం మండలం ముళ్లకట్టలో హక్కు పత్రాలు ఉన్నప్పటికీ సాగు ఫారెస్టు అధికారులు సాగు చేయనీయడం లేదని విన్నవించారు. తదితర అంశాలను ఏపీఓ పరిశీలించి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేలా చూస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్దన్, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, మేనేజర్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ రెహమాన్, జెడీఎం కొండల్రావు, ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్, జియాలజిస్ట్ కిశోర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దళారులకు ధాన్యం విక్రయించొద్దు
ములుగు రూరల్: రైతులు దళారులను నమ్మి ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల పరిధిలోని సర్వాపూర్, పంచోత్కుల పల్లి, అంకన్నగూడెం, కొత్తూరు, ప్రగళ్లపల్లి, కాసిందేవి పేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పల్లె జయపాల్ రెడ్డి, దేవ్సింగ్, తదితరులు పాల్గొన్నారు. రైతులకు కూరగాయల విత్తనాలు ఏటూరునాగారం: కన్నాయిగూడెం మండలంలోని రైతులకు బీటీటీ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందజేసి సబ్సిడీపై కూరగాయల విత్తనాలను అందజేసినట్లు ఆత్మ చైర్మన్ కర్ల అరుణ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన జీవన ఎరువు, జీనన పురుగు మందుల తయారీ, వివిధ పంటల వాడకంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చిన కూరగాయల విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ములుగు: జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మస్రగాని వినయ్కుమార్, వేములపల్లి భిక్షపతి, పో రిక సోమానాయక్, గొర్రె సమ్మయ్య, సురేష్, ముంజాల భిక్షపతి పాల్గొన్నారు. కాళేశ్వరాలయంలో భక్తులు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి కావడంతో ఉదయం 11గంటల లోపు భక్తులు అభిషేక పూజలు, అర్చనలు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనాలతో పాటు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అ మ్మవారిని దర్శించుకున్నారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి కనిపించింది. డీజిల్ కోసం క్యూ మంగపేట: వమండల పరిధిలోని కమలాపురం గాయత్రి పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం క్యూ కట్టారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో డీజిల్ వాహనం రావడంతో వినియోగదారులు భారీగా తరలివచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మంగపేట, రాజుపేటలోని 5 పెట్రోల్ బంకుల్లో ఆదివారం డీజిల్ అయిపోయింది. దీంతో కమలాపురంలోని గాయత్రి పెట్రోల్ బంకులో మాత్రమే డీజిల్ ఉండటంతో డీజిల్ కోసం రైతులు, వరికోత మిషన్ల యజమానులు క్యాన్లతో వచ్చి క్యూకట్టారు. ఆదివారం రాత్రి వరకు అక్కడ కూడా అయిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం సాయంత్రం కమలాపురం గాయత్రి పెట్రోల్ బంక్కు డీజిల్ ట్యాంకర్ వచ్చిందనే సమాచారం తెలియడంతో వివిధ గ్రామాల నుంచి మంది క్యాన్లతో బంకు వద్దకు తరలివచ్చి క్యూ కట్టారు. కొంతమంది పోటీపడడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సర్ధిచెప్పి క్యూలో ఉంచి వెళ్లిపోయారు. -
డ్రగ్స్ రహిత తెలంగాణకు పాటుపడాలి
● అదనపు కలెక్టర్ మహేందర్ జీ ములుగు: డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ(రెవెన్యూ) పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల కార్యక్రమాన్ని సోమవారం ఆదనపు కలెక్టర్ హాజరై ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలను జరిపించినా, బాలల హక్కుల పరిరక్షణలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి సురక్షిత బాల్యమే – రేపటి సురక్షిత తెలంగాణ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్ రావు మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ అనేవి చిన్నారుల ఉన్నతిని నిరోధిస్తాయన్నారు. ఈ సందర్భంగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు బాలల భద్రత– డ్రగ్స్ రహిత తెలంగాణ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట మానవహారంగా ఏర్పడి బాలలు, మహిళల హక్కులను కాపాడుతామన్నారు. డ్రగ్స్ రహితంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దుతామని, సమాజంలోని మూఢ ఆచారాలు, బానిస వ్యవస్థలను రూపుమాపేలా పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, డీసీపీఓ ఓంకార్, డీఎంసీ రమాదేవి, సీఏ లావణ్య, నరేశ్, కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను పరిష్కరించండి
ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణి, గిరిజన దర్బార్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని బాధితులు అధికారులను వేడుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీలను అదనపు కలెక్టర్ మహేందర్జీ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంపత్రావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా పరిష్కరిస్తూ ఫిర్యాదుదారులకు జవాబుదారిగా ఉండాలన్నారు. ఈ మేరకు ప్రజావాణిలో మొత్తంగా 59 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఐటీడీఏ ఏపీఓ (జనరల్) నాగోరావు అన్నారు. వివిధ సమస్యలపై గిరిజన దర్బార్లో ఏపీఓ గిరిజనుల నుంచి 36 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన వినతుల వివరాలు గ్రీవెన్స్, గిరిజన దర్బార్లో అధికారులకు బాధితుల వేడుకోలు వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏపీఓ నాగోరావు ప్రజావాణిలో 59, గిరిజన దర్బార్లో 36 వినతుల రాక వినతులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలుఇందిరమ్మ ఇళ్లు 10పింఛన్లు మంజూరు 27భూ సమస్యలు 9ఇతర శాఖలకు 11ఉపాధి కల్పన 2 -
బ్రహ్మోత్సవాల శోభ
● హేమాచలక్షేత్రంలోని యాగశాలలోఅంకురార్పణ ● ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగ స్నపనంమంగపేట : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రానికి బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళి కృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకులు పెరంబదూర్ మధన మోహనాచార్యుల బృందం ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి పర్యవేక్షణలో యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి విశ్వక్షేనపూజా, భగవత్పుణ్యాహవచన, పరిషత్ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధన, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగ స్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిషేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాగ్నికులు కృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లపై పరిశీలన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల ఏర్పాట్లు చేసినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం నుంచి దైత అమ్మవారి ప్రాంగణం వరకు ప్రధాన దారిలో తడుకలతో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను ఆయన పరిశీలించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వ్యాపారాలు జరుపుకోవాలని ప్రధాన దారికి ఇరువైపులా వెలిసిన స్వీట్షాపులు, బొమ్మలు, తదితర వ్యాపారులకు సూచించారు. జాతర ప్రారంభం కావడంతో నూతనంగా ఆలయ సమీపంలో వెలి సిన వివిధ రకాల దుకాణాలు, వచ్చి పోయే భక్తులతో గుట్టపై బ్రహ్మోత్సవాల సందడి నెలకొంది. హేమాచల క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం హేమాచల క్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా టీఎస్ఆర్టీసీ గుట్టపైకి బస్ సర్వీస్ను సోమవారం ప్రారంభించింది. పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో గుట్టపైకి వచ్చి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. ఏటూరునాగారం కంట్రోలర్ శ్రీనివాస్, శంకర్ స్థానిక ఎస్సై సూరితో కలిసి బస్ సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హన్మకొండ నుంచి హేమాచలక్షేత్రానికి వచ్చే భక్తులు నేరుగా మల్లూరుకు చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం 10 బస్సులను ఏటూరునాగారం నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు మల్లూరుగుట్టపైకి షటిల్ సర్వీస్లు నడుపనున్నామన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. ఏటూరునాగారం నుంచి గుట్టపైకి ఫుల్ టికెట్ రూ.50, ఆఫ్ టికెట్ రూ.30, మంగపేట, మల్లూరు నుంచి రూ.30 చార్జీ ఉంటుందని వివరించారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల ప్రొటోకాల్ అధికారులు జీపీఓ కుందమళ్ల సురేశ్, గంపల నర్సయ్య, జబ్బ నగేశ్, ఆలయ మాజీ చైర్మన్ పూజారి సురేశ్, యర్రంగారి సమ్మయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అవినీతికి.. డాక్యుమెంట్ రైటర్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ప్రతీపనికో రేటును ఫిక్స్ చేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని వసూలు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచ్చల విడిగా వసూళ్లపర్వం సాగుతుండగా.. తాజాగా సోమవారం జనగామ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఏడాదిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వసూళ్ల తతంగం ఇలా... ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ప్రతీ రిజిస్ట్రేషన్కు లొసుగులును ఆసరా చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 80 నుంచి 98 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇక్కడ ప్రతీ దస్తావేజుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు ఆఫీస్ ఖర్చుల పేరిట.. నాలా, జీపీ ఇళ్లు, అపార్ట్మెంట్లకు రూ.5వేలనుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. 126 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ కార్యాలయం పరిధిలో ఉండగా, ఇద్దరు నుంచిముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు 25 మంది డాక్యుమెంట్ రైటర్లు కేవలం డబ్బులు వసూళ్లకే పెట్టుకున్నట్లు ఏసీబీ గుట్టు విప్పింది. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 40–50 రిజిస్ట్రేషన్లు అవుతుండగా, లేఅవుట్ లేని ప్లాట్లు గజం రూ.200ల నుంచి రూ.400ల వరకు తీసుకున్నట్లు అక్కడ జరిగిన ఏసీబీ దాడుల అనంతరం వెల్లడైంది. ఇలా వరంగల్, జనగామ, స్టేషన్ఘన్పూర్, ములుగు, భూపాలపల్లి, భీమదేవరపల్లి తదితర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కథ’నడిపించేది వీరే.. అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్లో ఏసీబీ వరుస దాడులు.. సస్పెన్షన్ వేటు పడిన మారని తీరు విజిలెన్స్ తనిఖీలకూ వెరవని అధికారులు.. తాజాగా సోమవారం జనగామలో తనిఖీలు -
కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి
ములుగు రూరల్: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆదిలాబాద్ ఎంపీ గేడం నగేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలు మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి సంబురాలు జరుపుకోవడం దారుణమన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా డిలీమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించి బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరిగేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, సుమలత, జాడి వెంకట్, నరేశ్, కృష్ణాకర్, శ్రీనివాస్, విశ్వనాథ్, రవీందర్, నాగరాజు, ఇమ్మడి రాకేష్యాదవ్, లక్ష్మణ్, హరీశ్, మమన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ -
మక్కల కొనుగోళ్లలో అలసత్వం సరికాదు
ములుగు రూరల్: మక్కల కొనుగోళ్లలో అధికారులు, నిర్వాహకుల అలసత్వం సరికాదని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్(ఏఐకేఎఫ్) రాష్ట్ర కోశాధికారి గుండబోయిన చంద్రయ్య అన్నారు. ఈ మేరకు మల్లంపల్లి మండలకేంద్రంలో ప్రభుత్వ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించి మాట్లాడారు. మల్లంపల్లి మండలకేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 8వ తేదీన ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు కొనుగోళ్లు చేయకపోవడం దారుణమన్నారు. రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400కు పంట అమ్ముకోవాల్సిన రైతులు దళారులకు రూ.1800లకు అమ్ముకుంటూ మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లంపల్లి మండల పరిధిలో సుమారు 1100 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని అందుకు అనుగుణంగా 80 వేల గన్ని సంచులు అవసరమని తెలిపారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, ప్రవీణ్, పోశాలు, నాగేశ్వర్రావు, ఐలయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఐకేఎఫ్ రాష్ట్ర కోశాధికారి చంద్రయ్య -
హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. అంకురార్పణతో జాతర ప్రారంభం హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచన, పసరిషత్ ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధనం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవ, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. మే 1న స్వామివారి తిరుకల్యాణం హేమాచల క్షేత్రంలో 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1న లక్ష్మీనర్సింహస్వామికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుల అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలిసి భక్తులకు కోరిన వరాలిచ్చే లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తులకు గర్భాలయంలో ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాల యాగ్నికులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించనున్నారు. అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చింతామణి జలపాతం.. నాభిచందన ప్రసాదం ఆలయ సమీపంలో సహజసిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం ఆలయానికి వచ్చే భక్తులు ఔషధ గుణాల ప్రసాదంగా బావిస్తుంటారు. హేమాచల కొండపై నుంచి ఏడాది పొడవునా అన్ని కాలాల్లో ఒకే విధంగా చింతామణి జలపాతం భూమి లోపలి నుంచి పారుతూ ఉండటం విశేషం. ఆలయానికి వచ్చే భక్తులు చింతామణి జలపాతం వద్ధ స్నానమాచరిస్తారు. జలపాతం నుంచి వచ్చే నీరు అతి శీతలంగా ఔషధ గుణాలు కలిగి మినరల్ వాటర్ను తలపించే విధంగా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎన్నిరోజులు నిల్వ ఉంచినా పాడై పోకుండా ఉండటంతో నీటిని రోజు సేవిస్తే బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు ధరిచేరవు. అలాగే ఆలయంలో ప్రతీ శని, ఆదివారం స్వామివారి నాభి నుంచి స్రవించే ద్రవాన్ని మంచి గందంతో కలిపి(నాభి చందనం) సంతానం లేని వారు సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు ముస్తాబైన ఆలయం.. తరలిరానున్న భక్తజనం -
డీజిల్ కోసం వాహనదారుల క్యూ
మంగపేట: మండలంలోని వాహనదారులు కమలాపురంలోని గాయత్రి పెట్రోల్ బంక్లో డీజిల్ కోసం ఆదివారం క్యూ కట్టారు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంతో పాటు రాజుపేట, కమలాపురంలో మొత్తం ఏడు పెట్రోల్ బంక్లు ఉన్నాయి. అందులో ఒకటి, రెండు పెట్రోల్ బంక్లలో పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. డీజిల్ లేదు. కమలాపురంలోని గాయత్రి పెట్రోల్ బంక్లో మాత్రమే డీజిల్ ఉంది. ఈ క్రమంలో మండలంలో ఎక్కడా డీజిల్ లేదని ప్రచారం జరగడంతో పలు గ్రామాల నుంచి రైతులు, హార్వెస్టర్ల యజమానులు, లారీలు, కార్ల యజమానులు డీజిల్ కోసం వాహనాలతో తరలివచ్చారు. అలాగే పలువురు క్యాన్లతో తరలివచ్చి గాయత్రి బంక్ ఎదుట బారులుదీరారు. -
సమస్యల స్వాగతం
ఐటీడీఏ పీఓకు.. మూసివేసిన కుట్టు శిక్షణ కేంద్రం● ఈఎస్ఎస్లో గ్రౌండింగ్ అంతంతే.. ● ముందుకు సాగని రైతు భరోసా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సరళీకృతం ● పరిష్కారానికి నోచుకోని గిరివాణి వినతులు ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా లెనిన్ వత్సల్ టొ ప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంత రం పలు విభాగాల్లో తనిఖీ నిర్వహించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నూతనంగా బా ధ్యతల చేపట్టిన పీఓకు మాత్రం ఐటీడీఏలో నెలకొ న్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2020–21 నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్) పథకంలో గ్రౌండింగ్ చేయడం లేదు. 631 మందిని పథకం కింద ఎంపిక చేసి 274 మందికి గ్రౌండింగ్ చేశారు. మిగతావి పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఆర్థిక శాఖ నుంచి ట్రైకార్, ట్రైబల్ వెల్ఫేర్కు నిధులు వస్తేగానీ బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతలోనే రాజీవ్ యువ కిరణాలను తెరపైకి తేవడంతో ఈఎస్ఎస్ మరుగున పడింది. అలాగే గిరివికాసం కింద రైతులకు బోరు, మోటారు, విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వాలని వచ్చిన 431 దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఇటీవల పీఎం కుసమ్ యోజన పథకం కింద గిరిజనులకు సోలార్ పంపు సెట్లు, మోటార్లను అందించేందుకు సర్వేలు చేపట్టి వాటిని కేవలం కాగితాలకు పరిమితం చేశారు. అలాగే సోలార్ ప్లాంట్స్ ఏర్పా టు చేసేందుకు ఐటీడీఏ మహిళలకు అవగాహన కల్పించి పేర్లను నమోదు చేశారు. కానీ సంఘాల పేర్ల మీద భూములు మాత్రం కేటాయించలేదు. శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు జీసీసీ ద్వారా రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పించాలని అనేకమార్లు గిరివాణిలో వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోవడంతో మూసివేశారు. వెంకటాపురం(కె) మండలం ముత్తారం గ్రామంలో నడుపుతున్న సొసైటీ క్వారీ మూడేళ్ల నుంచి గ్రామంలోని సభ్యులకు కమీషన్లు ఇవ్వడం లేదు. దీంతో గిరివాణిలో ఫిర్యాదు చేయగా ఇంత వరకు పట్టించుకోలేదు. సొసైటీ, క్వారీ వివరాలు సైతం గోప్యంగా ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. హార్టికల్చర్ నర్సరీలో గతంలో రూ.23 లక్షలు వెచ్చించి పామాయిల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయగా ఒక్క మొక్క కూడా బతకలేదు. దీంతో రూ. 23 లక్షల నిధులు బురదలో పోసినట్లు అయ్యింది. మళ్లీ ఆ భూమిలో పండ్ల తోటల కోసం ప్లాన్ చేశారు కాని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇలా అనేక సమస్యలతో ఐటీడీఏ కొట్టుమిట్టాడుతోంది. ఇవేకాకుండా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గిరివాణిలో అనేక మంది గిరిజనులు వినతులు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన టొప్పో తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.గిరిజన మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లను అందజేసి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి వారికి ఇచ్చేలా అప్పటి పీఓ చిత్రామిశ్రా ప్లాన్ చేశారు. కాని ఆమె బదిలీ కావడంతో ఆ పనులు మూలకుపడ్డాయి. దీంతో స్టోర్ బోసిపోయి కనిపిస్తోంది. అంతేకాకుండా కొంత మందికి ఇటుకల తయారీకి మిషనరీలు ఇవ్వగా వాటిని కేవలం ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొని ఎలాంటి పరిశ్రమలను నడపడం లేదు. దీంతో లక్షలాది రూపాయల సామగ్రి తుప్పుపట్టిపోతుంది. ఇదేకాకుండా న్యూట్రిబాస్కట్ పరిశ్రమను సైతం నడిపించలేక మహిళా గ్రూపు సభ్యులు దానిని మూసివేశారు. సరైన ఆదాయం, ఉత్పత్తి లేదని చేతులు ఎత్తేశారు. -
ఎవరి వాటా వారికి రావాల్సిందే..
భూపాలపల్లి రూరల్: ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా దక్కాలనే నినాదంతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కులాలను లెక్కపెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. కుల గణన అసలు పరమార్థం.. దేశ సంపదను, భూమిని, రాజ్యాధికారాన్ని ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడమేనని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ గణతంత్ర స్ఫూర్తి అదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద సమ పంపిణీ జరగడం లేదన్నారు. భూమి, రాజ్యం, అధికారాలన్నీ కేవలం ఒక్క సామాజిక వర్గానికే (రెడ్డి కులానికే) అప్పగిస్తున్నారని మండిపడ్డారు. బ్యూరోక్రసీలోనూ, మంత్రి పదవుల్లోనూ అగ్రవర్ణాలకే పట్టం కడుతున్నారని, ఇదే బాటలో గత ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 10 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అధికారాన్ని బహుజనుల పరం చేయడమే జేఏసీ లక్ష్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాదం కుమారస్వామి, బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, వివిధ సంఘాల సనాయకులు అజ్మీర సమ్మయ్య, రాదండి దేవేందర్, దుగ్యాల స్వామి, చంద్రగిరి శంకర్, భీమనాదని సత్యనారాయణ, సాయిబాబా, మేకల సుమన్, కొత్తూరు రవీందర్, చిట్యాల శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. కుల గణన చేస్తే సరిపోదు.. సంపదను పంచాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహరాజ్ -
నిరుపేదల సొంతింటి కల సాకారం
ములుగు/ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో సాకారం చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా కేటాయిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్రెడ్డి, సర్పంచ్ ల్యాద శ్యాంరావు, నాయకులు పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైస్ మి ల్లర్స్ ఆసోసియేషన్ భవనాన్ని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్తో కలిసి మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్, సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన మంత్రి వెంకటాపురం(ఎం): మండలంలోని జవహర్నగర్ సమీపంలో గల కోపెల జనార్దన్ జ్ఞాపకార్ధం అతని కుమారుడు కోపెల కిరణ్ కుమార్ నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ను మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మంత్రి సీతక్క సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ గుంటొజు పావని, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్
ములుగు: జిల్లా కలెక్టర్గా హేమంత్ సహదేవరావు ఆదివారం కలెక్టరేట్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్ పాల్గొన్నారు. రామప్పలో విదేశీయుల సందడి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం కామెరూన్ దేశానికి చెందిన సోనిలీ, ప్రాన్స్ దేశానికి ఇవాన్ వెబర్లు వేర్వేరుగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప ఆలయ చరిత్ర గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. కన్యకాపరమేశ్వరి జయంతి ములుగు: కలెక్టరేట్లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి మాత చిత్రపటానికి జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి, అహింస, ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన వాసవిమాత చరిత్ర, కులమతాలకు అతీతంగా పోరాడిన ఆమె ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. హెచ్చరిక బోర్డుల ఏర్పాటు మల్హర్(కాటారం): రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కాటారం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కమలాపూర్ క్రాస్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు రేగొండ: మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవిందామాంబా సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు నిర్వహించి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇటీవల హామీ ఇచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు శృంగారపు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగారపు భిక్షపతి, విష్ణుమూర్తి, గురుమూర్తి, కాజుబోజు సూర్యప్రకాశ్, వేణు, రమేష్, దేవేందర్, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
రహదారి పనులు త్వరగా పూర్తిచేయాలి
వెంకటాపురం(కె): మండల పరిధిలోని మొరుమూరు నుంచి కర్రె గుట్టల్లోని తడపల వరకు చేపట్టిన రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు ఎస్పీ రహదారి పనులను ఆదివారం పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల వద్ద రాత్రింభవళ్లు బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట ములుగు డీఎస్పీ రవీందర్, ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం(కె) సీఐ రమేశ్, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
గిరిజన చట్టాలపై అవగాహన తప్పనిసరి
ములుగు: అధికారులు గిరిజన చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం అటవీ హక్కులు, పెసా, ఎల్టీఆర్ చట్టాలపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, పోలీస్, అటవీ, రెవెన్యూ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల పరిరక్షణకు రూపొందించిన చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండి అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ ఏపీఓ నాగోరావు, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఫారెస్ట్, పోలీస్ అధికారులు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, విద్యావంతులందరూ జనాభా స్వీయగణనను చేసుకోవాలని కలెక్టర్ దివాకర శనివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. జనగణన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహ లెక్కింపు, గృహ వసతి గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు స్వీయ లెక్కింపు సదుపాయాన్ని వెబ్పోర్టల్లో నేటి నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ గృహ, కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో నిబంధనలు పాటించాలి అక్రిడిటేషన్ కార్డుల జారీలో నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో శనివారం తన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీఆర్ఓ రఫీక్, కమిటీ సభ్యులు షఫీ అహ్మద్, గాదం దేవేందర్, పృధ్వీరాజ్, చుంచు రవి, అబ్దుల్ గఫూర్, రాజేష్, వీరయ్య, అశోక్ పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
జిల్లా కలెక్టర్గా బోర్కడే హేమంత్ సహదేవ్రావు
ములుగు/ఏటూరునాగారం: జిల్లా కలెక్టర్గా 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన జీహెచ్ఎంసీ శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న బోర్కడే హేమంత్ సహదేవ్రావు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ములుగు కలెక్టర్గా పనిచేస్తున్న టీఎస్.దివాకర ఖమ్మం కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు కలెక్టర్గా దివాకర 2024 జూన్ 16న బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లాలో సుమారు 22 నెలల పాటు పనిచేశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర విజయవంతం కావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా ఐటీడీఏ పీఓగా లెనిన్ వత్సల్ టొప్పోను నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా పనిచేసిన చిత్రామిశ్రా రెండు నెలల క్రితం కరీంనగర్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ దివాకరకు ఐటీడీఏ పీఓగా ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఎట్టకేలకు ఐటీడీఏకు మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు)గా పనిచేస్తున్న లెనిన్ వత్సల్ టొప్పోను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా నియమించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోకలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు ఖమ్మం జిల్లాకు బదిలీ అయిన దివాకర ఐటీడీఏ పీఓగా లెనిన్ వత్సల్ టొప్పో -
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ములుగు రూరల్: నేడు(ఆదివారం) జిల్లా కేంద్రంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలిన కోరారు. రామప్పలో దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ (డీడీజీఈ ఢిల్లీ) అభిషేక్ అగర్వాల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట హైదరాబాద్ దూరదర్శన్ డైరెక్టర్ వెంకటరమణ, టూరిజం అధికారులు ఉన్నారు. డీఎన్టీ పాఠశాలకు ప్రత్యేక అనుమతులు ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి డీఎన్టీ పాఠశాలకు ప్రత్యేక అనుమతులు వచ్చినట్లు స్వచ్ఛంద గ్రంథాలయ నిర్వహకుడు దుపాటి సతీశ్ తెలిపారు. చిన్నబోయినపల్లి డీఎన్టీ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ప్రీ–ప్రైమరీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి పాఠశాల పరిస్థితి వివరించగా వారు వెంటనే సానుకూలంగా స్పందించి డీఈఓకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూల్ స్థాయికి డీఎన్టీ పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. గతంలో లాగానే మన చుట్టూ పక్కల గ్రామాలకు వచ్చే ప్రైవేటు బస్సులను రానివ్వకుండా, మన పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి పిల్లలను ఏటూరునాగారం, కమలాపురం లాంటి దూర ప్రాంతాలకు పంపొద్దని వివరించారు. మన ఊరి బడిలోనే ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్య, ప్రభుత్వ సదుపాయాలు ఉచితంగా అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. 30న కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గ సమావేశం కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు(పాలకవర్గం) మొదటి సమావేశాన్ని ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. 28న బహిరంగ వేలం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన మడ్తపల్లి గ్రామంలోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం ఈనెల 28న మంగళవారం నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
‘ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి’
ములుగు రూరల్: వరి ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజాద్పాషా అన్నారు. మండల పరిధిలోని కాసిందేవిపేటలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైతులు ఆరబోసుకుని ఉంటున్నారని తెలిపారు. అయినప్పటికీ నేటి వరకు కొనుగోలు చేయక పోవడం దారుణమన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ రహీంపాషా, లింగస్వామి, అబ్దుల్నాభి, హుస్సేన్, రాజయ్య, రితేష్ పాల్గొన్నారు. -
‘దోస్త్’ అడ్మిషన్లు షురూ..
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ప్రచారాన్ని చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా కళాశాల బృందం విస్తృత ప్రచారం నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులకు దోస్త్ ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు రేణుక తెలిపారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాన కూడళ్లలో గోడ పత్రికలు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్సులు ఇవే.. కళాశాలలో బీఏ (హెచ్ఈపీ, సీఏ), బీఎస్సీ (బీజెడ్సీ, ఎంపీసీ), బీకామ్ (సీఏ, ఏఈడీపీ) వంటి వైవిధ్యమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ వివరించారు. 2007–08 విద్యా సంవత్సరం నుంచి కాకతీయ యూనివర్సిటీ ఫలితాల్లో ఈ కళాశాల గ్రామీణ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తోందని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ ఇక్కడ ప్రైవేట్కు ధీటుగా వసతులు ఉన్నాయని వివరించారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా పీజీ, బీఈడీ, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక్కడ ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నట్లు అధ్యాపకులు జీవవేణి, జ్యోతి, ఫాతిమా తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెల్ ద్వారా ప్లేస్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు సెల్ 8099701289, 9491317887 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
‘ప్యాక్స్’ కిరీటాలు ఎవరికో?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క... ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు... సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ శ్రీమార్కెట్ కమిటీ తరహా నియామకంశ్రీ. త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లాల వారీగా ఇలా.. జిల్లా పీఏసీఎస్లు డైరెక్టర్ సభ్యులు స్థానాలువరంగల్ అర్బన్ 12 156 30,317 (హనుమకొండ) వరంగల్ రూరల్(వరంగల్) 31 402 94,967 జనగామ 14 182 50,862 మహబూబాబాద్ 19 234 69,830 జేఎస్భూపాలపల్లి 10 130 22,773 ములుగు 12 156 27,328 నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు.. మొదలైన ఆశావహుల పైరవీలుమొత్తం సహకార సంఘాలు 98సభ్యులు 2,96,077డైరెక్టర్ స్థానాలు 1,260 -
ఆయుర్వేద వృక్షసంపద కనుమరుగయ్యే ప్రమాదం
ప్రపంచ ప్రాణకోటికి ప్రాణవాయువునిచ్చే సహజ సిద్ధ అడవులు దగ్ధం అవుతున్నాయి. అయినా అటవిశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడడం లేదు. అధికారుల తీరు చూస్తుంటే భవిష్యత్లో అడవులు అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తుందని వనప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లూరుగుట్టపై ఔషధ గుణాలు కలిగిన వేలాది రకాల అరుదైన వృక్షసంపద ఉన్నట్లుగా 15 ఏళ్ల క్రితం అటవిశాఖ గుర్తించింది. దీంతో మెడిసినల్ ప్లాంట్ ఏర్పాటు చేసి నిధులు రాకపోవడంతో వదిలేశారు. అగ్నికీలలతో విలువైన వృక్షజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. -
మలేరియా నియంత్రణకు కృషి
● డీఎంహెచ్ఓ గోపాల్రావుములుగు రూరల్: మలేరియా నియంత్రణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఆరరోగ్య కార్యకర్తలతో ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం మలేరి యా వ్యాధి వ్యాప్తి నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. గామాల్లో ప్రజ లకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, వైద్యాధికారి నాగ గణేశ్, మాస్ మీడియా అధికారి సంపత్ అసిస్టెంట్ మలేరియా అధికారి దుర్గారావు, సురేశ్బాబు, యూనిట్ ఆఫీసర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
మల్లూరుగుట్టపై మంటలు
మంగపేట: శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి కొలువైన మల్లూరుగుట్ట్ట అటవీ ప్రాంతం కాలిపోతోంది. రెండు రోజుల నుంచి గుట్టపై భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో గుట్టకు అతి సమీపంలోని కొత్తమల్లూరు, మల్లూరు గ్రామా ల ప్రజలు మంటల వేడికి గురవుతున్నారు. మ ల్లూరు నుంచి చుంచుపల్లి, రమణక్కపేట, రాజు పేట వరకు 10 కిలోమీటర్ల పొడవున ఉన్న గుట్టల్లో వారం రోజుల నుంచి కార్చిచ్చుతో అడవులు దగ్ధమవుతున్నాయి. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్ర ధాన రోడ్డుకు అతి సమీపంలోని అదే గుట్టకు మరో వైపున గల హేమాచల లక్ష్మీనర్సింస్వామి ఆలయ ప్రాంతం నుంచి శనిగకుంట, పూరేడుపల్లి, వాగొడ్డుగూడెం వరకు గుట్టను మంటలు చుట్టు ముట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధికి మించి ఉన్న గుట్టపై గల లక్షలాది రూపాయల విలువైన సండ్ర, జిట్రేగు, నల్లమద్దితో పాటు తదితర విలువైన అటవి సంపద కాలి బూడిదవుతోంది. హేమాచలక్షేత్రం సమీప అటవీ ప్రాంతంలో చింతా మణి జలపాతం, దేవునికుంట, దబ్బతోగు, చుంచుపల్లి సమీపంలోని మామిడితోగు, రమణక్కపేట, ఎర్రమ్మతోగు తదితర తోగులతో పాటు నీటి ఊటలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా నీటి వసతి ఉండటంతో ఆయా అటవీ ప్రాంతాల్లో సంచరించే అడవి పందులు, కొండ గొర్రెలు, నక్కలు, తదితర జాతుల వన్యప్రాణులు అడవిలోని మంటల్లో చిక్కుకుని ఆహుతవుతున్నాయి. ఈ మంటల వేడికి తాళలేక ప్రాణాలు దక్కించుకునేందుకు అటవి సమీప గ్రామాల్లోకి పలు రకాల జంతువులు వచ్చి వేటగాళ్లకు చిక్కి బలవుతున్నాయి. వేసవికాలంలో అడవులు దగ్ధం కాకుండా ఉండేందుకు ఫైర్లైన్స్, కార్చిచ్చు కారణంగా ఏర్పడే మంటలను ఆర్పేందుకు ఏయిర్ మెషిన్ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు. అలాగే బేస్క్యాంప్ సిబ్బంది ఏర్పాటుతో పాటు అడవుల్లో నివసించే వన్య ప్రాణులను కాపాడేందుకు వివిధ రకాల చర్యల పేరుతో అటవిశాఖ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అడవికి నిప్పు మానవాళికి ముప్పు, అడవులను కాపాడుకుందాం అంటూ ఏజెన్సీలోని అభయారణ్యంలో అటవీశాఖ హోర్డింగులు ఏర్పాటు చేయడం తప్పా ఆచరణ మచ్చుకు కూడా కానరావడం లేదని వనప్రేమికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని జిల్లా సరిహద్దులోగల అటవిశాఖ చెక్పోస్టు నిర్వహణ అధికారులు, సిబ్బందితో పాటు దోమెడ, రాజుపేట, మల్లూరు సెక్షన్ల ఎఫ్ఎస్ఓ, బీట్ అధికారులు నిత్యం మండల కేంద్రంలోని రేంజ్ కార్యాలయానికి విధులపై వచ్చి వెళ్తుంటారు. వీరికి రాజుపేట మొదలుకుని మల్లూరు వరకు రోడ్డును ఆనుకుని ఉన్న గుట్ట అటవిప్రాంతం దగ్ధమవుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పా మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. హేమాచలక్షేత్రంలో రెండు రోజులుగా కార్చిచ్చు కాలిబూడిదవుతున్న అటవీ సంపద అగ్నికి ఆహుతవుతున్న వన్యప్రాణులు -
మంటలు ఆర్పేందుకు చర్యలు చేపడుతున్నాం..
మంటలను ఆర్పేందుకు సంబంధిత బీట్, సెక్షన్ అధికారుల పర్యవేక్షణలో నిత్యం చర్యలు చేపడుతూనే ఉన్నాం. కొత్తమల్లూరు, చుంచుపల్లి గ్రామాల మధ్య అటవి ప్రాంతంలో గ్రామాల్లో సేకరించే చెత్తను తీసుకొచ్చి కాల్చి వేస్తుండటంతో మంటలు అంటుకుంటున్నాయి. పలుమార్లు హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. పలు ప్రాంతాల్లో గుట్టపైన రాత్రి సమయాల్లో మాత్రమే మంటలు కనిపిస్తున్నాయి. వాటిని ఆర్పేందుకు నిత్యం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. – అశోక్, ఇన్చార్జ్ రేంజ్ అధికారి, మంగపేట● -
ఆటపాటలతో చదువు నేర్పడమే లక్ష్యం
కన్నాయిగూడెం: అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఆటపాటలతో చదువు నేర్పడమే లక్ష్యమని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని బుట్టాయిగూడెం, లక్ష్మిపురం, దేవాదుల, గూర్రేవుల, గ్రామాల్లోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్లీ, చైల్డ్, కేర్, ఎడ్యూకేషన్(ఈసీసీఈ) ప్రోగ్రామ్ను శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా 3 నుంచి ఆరేళ్ల పిల్లలకు వివిధ రకాల వస్తువులు, బొమ్మలతో ఆటలు, పాటలతో చదువు నేర్పిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల్లోనే పోషక పదార్థాలు, ఆహారాన్ని స్వీకరించాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాల్లో చదువు నేర్పిస్తున్నట్లు వివరించారు. పిల్లల మేధాశక్తి, సామాజిక అభివృద్ధి, సృజనాత్మకతను పెంపొందించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూర్రేవుల సర్పంచ్ అంబాల సౌజన్య, సెక్టార్ సూపర్ వైజర్ పుష్పవతి, అంగన్వాడీలు రజిత, అనిత, తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికతో చదివితేనే భవిష్యత్ఎస్ఎస్తాడ్వాయి: విద్యార్థులు ప్రణాళికతో చదివితేనే భవిష్యత్ బాగుంటుందని, అంగన్వాడీ కేంద్రంలో చదువుకున్న చిన్నారుల భవిష్యత్ విద్యా ప్రయాణం సాఫీగా సాగాలని జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి అన్నారు. ప్రథమ్ ఎడ్యూకేషన్ సంస్థ ఆధ్వర్యంలో కామారం(పీటీ) గ్రామ పంచాయతీలోని ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించిన గ్రాడ్యూయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని తదుపరి విద్య దశలోకి చిన్నారులు అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే స్నాతకోత్సవమని తెలిపారు. అనంతరం ప్రాథమిక విద్యను విజయవంతంగా పూర్తి చేసి ఐదేళ్లు నిండిన చిన్నారులను ఘనంగా సన్మానించి ప్రశంస ప్రతాలు, బహుమతులను కల్యాణి అందజేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత -
కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట
కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్ భార్య లత, కుమారుడు హేమంత్, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్ సూచించడంతో ఫ్రీజర్లో ఉన్న శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్ బాక్స్పైన గ్లాస్ మూత పగిలిపోయింది. ఫ్రీజర్బాక్స్ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతించని పోలీసులు.. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్ గౌడ్ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ధాన్యం కొనుగోలులో తరుగు తీయొద్దు
● సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాంబశివ ములుగు రూరల్: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీయొద్దని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయన్నారు. వడగళ్ల వానతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా తాలు పేరుతో మూడు కేజీల నుంచి 8 కేజీల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ తక్షణమే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం ప్రవీన్, కోడెపాక చంటి, బాలు, రాజు, చందర్ తదితరులు ఉన్నారు. పోరాటాలకు సిద్ధం కావాలి గోవిందరావుపేట: ప్రజాసమస్యల పరిష్కారానికి కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ అన్నారు. మండలంలోని పస్రా గ్రామంలో శుక్రవారం పాసమావేశం అంబాల మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిరెడ్డి సాంబశివ హాజరై మాట్లాడుతూ అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, పోడు భూముల సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రతీ కార్యకర్త ముందుండి పోరాటాలు నిర్వహించాలని సూచించారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొదిళ్ల చిట్టిబాబు, గుండు రామస్వామి, సూర్యనారయణ, కన్సోజు సదా నందం, సాంబయ్య, కృష్ణారావు, ఐలయ్య, లెనిన్, రాజేశ్వరీ, కవిత తదితరులు పాల్గొన్నారు. -
రాయినిగూడెంలో న్యాయవిజ్ఞాన సదస్సు
ములుగు రూరల్: మండలపరిధిలోని రాయినిగూడెంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రైతు సాగు చట్టాలు, కౌలుదారు చట్టాల గురించి వివరించారు. భూములు కొనేటప్పుడు సదరు భూమిపై ఏమైన కేసులు ఉన్నయా అని జాగ్రత్త చూసుకోవాలన్నారు. ఉచిత న్యాయ సలహా ఎలా పొందాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, పారా లీగల్ వలంటీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలుగోవిందరావుపేట: నైపుణ్యం కలిగిన యువతకు ప్రభుత్వం విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని డీఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా యువతకు నైపుణ్యాభ/వృద్ధి శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా డీఆర్డీఓ హాజరై మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. మునగ పంట, పుట్టగొడుగుల పెంపకం, చేపల పెంపకం వంటి రంగాల్లో ఉన్న లాభాలపై అవగాహన కల్పించారు. యువతకు 21 రకాల నైపుణ్య శిక్షణలు అందిస్తున్నామని, శిక్షణ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం సీతారాం, మహిళా సంఘాల వీఓలు, సీసీలు, సభ్యులు పాల్గొన్నారు. ముమ్మరంగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు మంగపేట: మండలంలోని కమలాపురంలో 133 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఈనెల 22న గాలివానకు ధ్వంసమైన విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు ములుగు డీఈ పులసం నాగేశ్వర్రావు, ఏటూరునాగారం డీఈ పురుశోత్తం పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 22న సాయంత్రం గాలివానకు విద్యుత్ లైన్లు ధ్వంసం కావడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయిన విషయం విధితమే. అదేరోజు అర్ధరాత్రి వరకు గ్రామాలకు కరెంటు సరఫరాను పునరుద్ధరించిన అధికారులు రెండు రోజుల నుంచి పూర్తి స్థాయి మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు. ధ్వంసమైన స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. గాలివాన బీభత్సానికి సుమారు రూ.30 లక్షల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు ఇన్చార్జ్ ఏఈ కృష్ణారావు తెలిపారు. మరో మూడు రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామన్నారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్కు ఏబీవీపీ వినతి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు. -
నిరుపయోగంగా ప్యాడీక్లీనర్లు
వెంకటాపురం(కె):మండలకేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడీక్లీనర్లు నిరుపయోగంగా మారాయి. వివరాలిలా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం వచ్చిన గాలి దుమారానికి విద్యుత్ లైన్లు చుట్టుకుపోయి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తీసుకువచ్చిన ప్యాడీ క్లీనర్లు నిరుపయోగంగా మారాయి. దీంతో రైతులు ప్రైవేట్ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను ఉపయోగించుకుంటున్నారు. ఒక ట్రక్కు ధాన్యం తూర్పార పోసినందుకు సుమారు రూ.650 వరకు చెల్లించాల్సి వస్తుందని, తమపై ఆర్థికభారం పడుతుందని రైతులు వాపోతున్నారు. యార్డులో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి సమయాల్లో పశువులు, దొంగలు వచ్చినా కనబడే పరిస్థితి లేదన్నారు. అలాగే కొనుగోలు కేంద్రంలో ప్లాస్టిక్ డ్రమ్ములో తాగునీరు పట్టడంతో ఎండకు ఎండుతూ తాగేందుకు వీలు లేకుండా పోతుందన్నారు. ఇక మరుగుదొడ్లు అయితే పిచ్చి మొక్కలతో నిండి వాడుకునేందుకు వీలులేకుండా పోయిందన్నారు. మరుగుదొడ్లలో మొలిచిన చెట్లను తొలగించి ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఇబ్బందులు పడుతున్న రైతులు -
లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేశారు
ములుగు: లక్షలు వెచ్చించి నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మండలకేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలు తీర్చేందుకు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేపట్టిన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు జిల్లాలో ఇప్పటి వరకు కొన్నిచోట్ల నిర్మాణం పూర్తి కాలేదు. మొత్తం 19 మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.57 లక్షలు మంజూరు చేయగా 11 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయగా ఇంకా 8 మరుగుదొడ్ల నిర్మాణాలు పురోగతిలోనే ఉన్నాయి. పూర్తయిన మరుగుదొడ్లను కూడా కొన్నిచోట్ల వినియోగంలోకి తేకపోవడంతో అలంకారప్రాయంగా మిగిలాయి ఒక్కో నిర్మాణానికి రూ.3 లక్షలు ప్రతీ మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్డి నిర్మించడానికి ఒక్కో సముదాయానికి రూ.3 లక్షలు కేటాయించారు. గ్రామ పంచాయతీ అధికారులు స్థలం సమకూరిస్తే స్వచ్ఛభారత్ మిషన్ నిధులతో నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలోని పది మండలాల్లో పంచాయతీ అధికారులు కేటాయించిన స్థలాల్లోనే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. రెండేళ్ల క్రితం జిల్లాలోని ములుగుకు 4, మంగపేట 3, వాజేడు 3, వెంకటాపురం(ఎం) మండలానికి 2, వెంకటాపురం(కె) మండలానికి 2, ఏటూరునాగారం, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, మల్లంపల్లి, తాడ్వాయి మండలాలకు ఒక్కొక్కటి చొప్పున 19 నిర్మాణాలకు రూ.57 లక్షలు కేటాయించారు. నీటి వసతి లేక నిరుపయోగం జిల్లాలోని వెంకటాపురం(ఎం), వాజేడు, మంగపేట మండలాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నీటివసతి లేకపోవడంతో మరుగుదొడ్లు వినియోగంలోకి రాక అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నిర్వహణ భారంగా ఉందనె నెపంతో పంచాయతీ అధికారులు సామూహిక మరుగుదొడ్లకు తాళాలు వేశారు. లక్షలు వెచ్చించి నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను వినియోగంలోకి తేవాలని ప్రయాణికులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలి. గ్రామపంచాయతీల్లో, బస్టాండ్ కూడలిలో ప్రయాణికుల, ప్రజల అవసరాలు తీర్చేందుకు నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కొన్నిచోట్ల తాళాలతో దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల నిర్వహణ సరిగా లేక అసంపూర్తిగా మారాయి. అధికారులు తక్షణమే స్పందించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలి. – మంద మహేందర్, వెంకటాపురం(ఎం) ఒక్కో నిర్మాణానికి రూ.3లక్షలు వినియోగంలోకి రాక ప్రయాణికుల ఇబ్బందులు -
నైపుణ్యాభివృద్ధితోనే ఉజ్వల భవిష్యత్
ములుగు: యువత నైపుణ్యంలో అభివృద్ధి సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ దివాకర టీ ఎస్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భా గంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్ సెంటర్, ఐటీడీఏ, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, ఉద్యానవన శా ఖల ద్వారా యువతకు అందుబాటులో ఉన్న శిక్షణ తరగతులు, ఉపాధి అవకాశాలపై సంబంధిత అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలోని యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు టాస్క్ సెంటర్ను ప్రారంభించామని, దీని ద్వారా యువత ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం సాధించేలా ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. టాస్క్ సెంటర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 10 బ్యాచ్లకు శిక్షణ పూర్తి చేశామని, ఇందులో 250 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్ జీ, సంపత్రావు, ఐటీడీఏ ఏపీఓ నాగరావు, డీఆర్డీఓ చంద్రశేఖర్, ట్రైబల్ వెల్ఫే ర్ డీడీ జనార్దన్, ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, ఎస్సీ డెవలప్మెంట్ ఈడీ ధర్మ నాయక్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, అడిషనల్ పీడీ శ్రీనివాసరావు, దేవేందర్ పాల్గొన్నారు. ఎవరి వివరాలు వారే నమోదు చేసుకోవచ్చు జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు జరగనున్న సర్వేలో కుటుంబ సభ్యులు తమ వివరాలను నేరుగా పోర్టల్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్. జీఓవీ. ఐఎన్ వెబ్ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధితోనే..గ్రామాలభివృద్ధితోనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని, దేశాభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, సంపత్ రావు, డీఆర్డీఓ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీఎస్ -
ఆర్టీసీ సమ్మెలో విషాదం
పసుపు ధర ౖపైపెకి.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు పంట ధర రోజురోజుకూ ౖపైపెకి చేరుకుంటోంది. శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నర్సంపేట : నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కోల శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయమే డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు బైఠాయించారు. ఉదయం నుంచి జరిగిన ఆందోళనలో పాల్గొన్న శంకర్గౌడ్ మధ్యాహ్నం 3.45 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్నాడు. తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన కార్మికులు మంటల్లో చిక్కుకున్న శంకర్ను కాపాడేందుకు 30 నిమిషాల పాటు ప్రయత్నించారు. 75 శాతం కాలిన ఆయనను నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమ ధ్యలో చనిపోయాడు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్ద ఆందోళన నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని స్థానిక డిపో మేనేజర్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేయడంతోనే మనస్తాపం చెందిన శంకర్గౌడ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. భారీ బందోబస్తు... నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా డీసీపీ అంకిత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్ ఎదుట, వరంగల్ రోడ్డులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు (శుక్రవారం) చర్చలు జరుపుతామని ప్రకటించిన విషయాన్ని కార్మికులకు పోలీసులు తెలిపి ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు తిరిగి డిపో వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన సీపీ నర్సంపేటలో బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ నిప్పంటించుకున్న స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ .. రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును పోలీస్ కమిషనర్.. స్థానిక పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్ఐ రణధీర్ ఉన్నారు. డిపో ఎదుట ధర్నా, రాస్తారోకో.. డ్రైవర్ శంకర్గౌడ్ ఘటన గురించి తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, బీసీ సంఘం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైఫల్యంతోనే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఉర్దూకు రాష్ట్రంలో రెండో అధికార భాషా హోదా కల్పించినా నిధులు కేటాయించడం లేదు. దీంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలు దీనస్థితికి చేరుకున్నాయి.నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్య కలకలం తీవ్రగాయాలతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి ప్రభుత్వ వైఫల్యంతోనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపణ -
ఈదురుగాలులతో నష్టం
● చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈదురు గాలులు, వర్షాలకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి తీవ్రనష్టం మిగిలిందని చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ అన్నారు. మండలంలోని కమలాపురం, ఏటూరునాగారంలో పొలాల్లో విరిగిపోయిన స్తంభాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపోయి కింద పడ్డాయని తెలిపారు. స్తంభాలు విరిగిపోవడం, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కింద పడిపోయాయని వివరించారు. వందలాది చెట్లు నేలకూలాయని వివరించారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా వానలోనే వద్యుత్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి రాత్రి వరకు విద్యుత్ను పునరుద్ధరించారని డీఈ పురుషోత్తంతో పాటు కింది స్థాయి సిబ్బందిని అభినందించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంకా పలుచోట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజలు విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట ఎస్ఈ భిక్షపతి, డీఈ పురుశోత్తం, డీఈ నాగేశ్వర్రావు, ఏడీఈ ఉమారావు, కృష్ణారావు, ఏఈ స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ కొండా సమ్మయ్య, లైన్మెన్ మధుసూదన చారి, ఏఎల్ఎంలు రాజు, అమర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్లు
● శంకర్గౌడ్ మృతి నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం హన్మకొండ:వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించి మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు. -
ఇళ్లగణనను సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు: జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి విడతలో చేపట్టిన ఇళ్లగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో గురువారం ఇళ్ల గణన శిక్షణ కార్యక్రమాన్ని ఆర్అండ్బీ అతిథి గృహంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అధికారులతో మాట్లాడుతూ జనగణన కార్యక్రమంలో ఇళ్ల గణన ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇళ్ల గణన ప్రక్రియలో 33 ప్రశ్నలతో కూడిన వివరాలు ఉంటాయని తెలిపారు. ప్రజలకు ప్రతీ ప్రశ్నకు తగిన సమాధానం ఇవ్వాలన్నారు. తొలుత మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు సర్వే చేపడతామని, రెండో విడత 2027 ఫిబ్రవరిలో జనగణన సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సాంకేతికత వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిరజ్ఞానాన్ని ఉపయోగించుకొని గణన పూర్తి చేయాలని ఆదేశించారు. దేశంలో తొలిసారిగా జనగణన పూర్తి డిజిటల్ పద్ధతిలో సాగుతుందని వివరించారు. ఈ శిక్షణ తరగతులకు ములుగు మున్సిపాలిటీ కమిషనర్ రమేశ్ ఇన్చార్జ్గా వ్యవహరించారు. మధుసూదన్రెడ్డి, వెంకటేశ్వర్లు పర్యవేక్షకులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూక్యాలాల్, ట్రైనీ మాస్టర్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్ -
వస్తువులపై జాగ్రత్త అవసరం
ములుగు రూరల్: వ్యక్తిగత వస్తువులపై ప్రతిఒక్కరూ జాగ్రత్త అవసరమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి తిరిగి సెల్ఫోన్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ పోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న స్టేషన్ సిబ్బంది వాటిని తిరిగి బాధితులకు అప్పగించేందుకు కృషి చేస్తారని వివరించారు. ఈ మేరకు సెల్ఫోన్లు పోగొట్టుకున్న 25 మంది బాధితులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది మిస్సింగ్ మొబైల్స్ రికవరీలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ఏటూరునాగారం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ ఉద్యమించాలని జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు బాలల పరిరక్షణ విభాగము ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిషేధం, బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రేమలత హాజరై మాట్లాడారు. ములుగును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు మంత్రి సీతక్క సూచనల మేరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వాడకం మంచిది కాదని అవి ప్రాణాంతకమైనవని వివరించారు. మత్తుకు బానిసలుగా మారిన వారు మృగంలా వ్యవహరిస్తారని తెలిపారు. అలాగే టెక్నాలజీని సరైన దిశలో వినియోగించుకుంటే జీవితాలు బాగుంటాయని వివరించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్ఫోన్కు బానిసలుగా మారకుండా కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. వేసవికాలం సెలవుల్లో బయట తిరగవద్దన్నారు. అదేవిధంగా పోషణ్ పక్వాడాలో భాగంగా పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించారు. ఆపదలో ఉన్న వారు చైల్డ్ హెల్ప్లైన్ 1098, 112 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సాయం పొందాలన్నారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడి ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి ప్లకార్డులను ప్రదర్శించిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి హరికృష్ణ, హెడ్మాస్టర్ సాంబశివరావు, బానోతు రాజునాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పావతి, జెండర్ స్పెషలిస్ట్ స్వప్న పాల్గొన్నారు. -
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
● డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ కన్నాయిగూడెం: వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతి కుమార్ సూచించారు. మండలకేంద్రంలోని పీహెచ్సీని ఆయన గురువారం సందర్శించారు. సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నందున రక్షణ చర్యలు పాటించాలన్నారు. వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్మీష, హెల్త్ అసిస్టెంట్లు లక్ష్మణ్, ఓం ప్రకాశ్, స్టాఫ్ నర్సు అజ్మీరా తదితరులు పాల్గొన్నారు. -
గాలివానతో తీవ్రనష్టం
ఏటూరునాగారం: జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. రైతులు, ప్రజలను అతలాకుతలం చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతాల్లో ప్రారంభమైన గాలిదుమారం జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉన్నట్టుండి గాలి దుమారం భారీగా రావడంతో పలు చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు 150 విద్యుత్ స్తంభాలపై పడడంతో తీగలు తెగిపోయాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు మొత్తం విరిగిపోయాయి. రాత్రి 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి 2 గంటలకు విద్యుత్ సరఫరాను మూడు మండలాల్లో పునరుద్ధరించారు. రాత్రి సమయంలో విద్యుత్ శాఖ అధికారులు ఎంతో కృషి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా డిష్ కేబుల్ లైన్లు, నెట్ లైన్లు మొత్తం తెగిపోయి ఇంటర్నెట్ సేవలు, టీవీ ప్రసారాలు ఆగిపోయాయని స్కైవిజన్ మేనేజర్ పూర్ణ తెలిపారు. ఎగిరిపోయిన రేకులు, దెబ్బతిన్న ఇళ్లు ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, రాంనగర్ గ్రామాల్లో ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోయగూడ, ఎల్లాపురం, రాంనగర్ పంచాయతీల్లోని లంబాడితండాకు చెందిన గార లక్ష్మి ఇల్లు రేకులు మొత్తం ఎగిరిపోయాయి. దీంతో రూ. 1.50లక్షల నష్టం వాటిల్లింది. రేకులు షెడ్డు నిర్మించి నెల రోజులు మాత్రమే అవుతుందని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాంనగర్లో 6, లంబాడీతండాలో 18, పప్కాపురంలో 4 ఇళ్లకు చెందిన రేకులు దెబ్బతిని తీవ్రంగా ప్రజలు నష్టపోయారు. దెబ్బతిన్న వరిపైరు ఏటూరునాగారంలోని 6వ వార్డుకు చెందిన జనగాం మహేశ్ వరిపొలం నేలబారింది. గోగుపల్లి, శివాపురం, ఏటూరునాగారంలోని రామన్నగూడెం, రాంనగర్, చిన్నబోయినపల్లి, షాపెల్లితో పాటు పలు ప్రాంతాల్లో 350 ఎకరాల్లో వరి పంట నేలబారింది. పొలాలు నేలబారి వర్షానికి ధాన్యం రాలిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లింది. వరికంకులను పైకి లేపేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వరి కంకుల నుంచి ధాన్యం రాలిపోవడంతో దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు. అలాగే అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వరిధాన్యం చేతికొచ్చేలోపు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో కల్లాలోని మిర్చి తడిసింది. రంగు మారకుండా ఉండేందుకు రైతులు మిర్చిని ఆరబోస్తున్నారు. 150 వరకు విరిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కల్లాల్లో తడిసిన మిర్చి పంట ఆదుకోవాలని రైతుల వేడుకోలు -
మీజిల్స్ రూబెల్లా నిర్మూలనకు కృషి
● డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగురూరల్: మీజిల్స్ రూబెల్లా వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈ మేరకు ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులతో గురువారం హెల్త్ ప్రొవైడర్స్, సూపర్వైజర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వాలన్నారు. మీజిల్స్ రూబెల్లా నిర్మూలనకు క్యాచ్ అప్ ప్రత్యేక కార్యక్రమాలు మూడు దశల్లో ఉంటాయని వివరించారు. అశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల జాబితాను తయారు చేసుకోవాలని సూచించారు. వారిలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోని వారి వివరాల జాబితాను తయారు చేసి పీహెచ్సీల వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ మేరకు ఈ నెల 27 నుంచి మే 4వ తేదీ వరకు మొదటి దశ, జూలై 22 నుంచి 27 వరకు రెండోదశ, అక్టోబర్ 12 నుంచి 19 వరకు మూడు దశల్లో నియంత్రణ టీకాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాతాశిశు సంరక్షణ అధికారి శ్రీకాంత్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ పోగ్రాం అధికారి నాగ అన్వేష్, మీడియా అధికారి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉమ్మడి జిల్లా బంద్
● ఆర్టీసీ జేఏసీ పిలుపు హన్మకొండ: నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకోవడాన్ని నిరసిస్తూ, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ నేడు (శుక్రవారం) ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి హనుమకొండ జిల్లా బస్స్టేషన్లో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ వైఖరి మూలంగానే డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జేఏసీ తెలిపింది. జేఏసీ వరంగల్ రీజియన్ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, అన్ని వర్గాలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహర్షి భగీరథ జయంతి వేడుకలు ములుగు: జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహర్షి భగీరథ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి భగీరథుడి చిత్రపటానికి జిల్లా అధికారి రామ్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రామ్మోహన్ మాట్లాడుతూ అసాధ్యం కాని పనిని సాధ్యం చేిసే ప్రతీ మనిషి భగీరథుడే అన్నారు. మహర్షి భగీరథుడు మానవాళికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షుడు కోడిపాక రవి, జిల్లా కార్యదర్శి కురిమిల్ల మహేందర్, నాయకులు నర్సయ్య, భరత్, పూర్ణ చందర్, అనిశెట్టి రాజ్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నానో ఎరువుల వాడకంపై అవగాహన వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట రైతువేదికలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల యాజమాన్య పద్ధతులు, నానో ఎరువుల వాడకంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, అత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి చేయాలని సూచించారు. శాస్త్రవేత్త మధు మాట్లాడుతూ అధిక ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యం దెబ్బతిని చీడ పీడలు అశిస్తాయని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుగా వాడాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్త వీరన్న మాట్లాడుతూ వివిధ రకాల చీడ పీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శైలజ, టెక్నికల్ ఏఓ హరిదాసు, సర్పంచ్ చల్ల రాజు, ఆత్మ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
బాబోయ్ కుక్కలు
ఏటూరునాగారం: కుక్కలతో జనం బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇళ్లు విడిచి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏ వీధి చూసినా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలను వెంబడించి మరి కరుస్తున్నాయి. మూగ జీవాలను వేటాడి చంపుతూ పీక్కుతింటున్న పరిస్థితి నెలకొంది. ఎండాకాలం కావడంతో ఇరిటేషన్ పెరిగి ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. రోజూ కనీసం పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కుక్కలను చూస్తేనే జనం బాబోయ్ కుక్కలంటూ పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. కుక్కల బెడద నుంచి కాపాడాలని ప్రజలు అధికారులకు విన్నవించినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. కుక్కలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బుధవారం ‘సాక్షి’ చేపట్టిన గ్రౌండ్ రిపోర్టులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 మండలాలు.. 632 కేసులు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 7,306 కుక్కలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన పశుగణనలో అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాదిలో నమోదైన కుక్కకాటు కేసులు 632గా నమోదు అయ్యాయి. అయితే గ్రామాల్లోని కుక్కలకు గ్రామ పంచాయతీ సిబ్బంది పశు ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి వ్యాక్సినేషన్ చేయించాల్సి ఉంది. కానీ జీపీ సిబ్బంది కుక్కలను తీసుకెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సినేషన్ లేకపోవడంతో గజ్జి, జుట్టు ఊడిపోవడంతో పాటు శరీరంపై మచ్చలతో పాటు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నాయి. కుక్కలకు వ్యాక్సిన్లు నిల్ వీధి కుక్కలకు యాంటి రేబీస్ వ్యాక్సిన్లు పశు ఆస్పత్రుల్లో నిల్వ ఉన్నప్పటికీ వీధుల్లో తిరిగే వాటికి వేయడం లేదు. అంతేకాకుండా జిల్లాలో ఎక్కడ కూడా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. నిర్మూలనకు చర్యలు చేపట్టడం లేదు. ములుగు, ఏటూరునాగారం సామాజిక, ఏరియా ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే జీవవ్యర్థాలు, వృథా ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఫంక్షన్ హాల్స్, మటన్, చికెన్ షాపుల వద్ద వ్యర్థాలను తినేందుకు అలవాటు పడి దాడులకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల పాలవుతున్న జనం మూగజీవాలను వేటాడి చంపుతున్న శునకాలు ఏడాదిలో 632 కుక్కకాటు కేసుల నమోదుకొన్ని సంఘటనలు ఇలా.. కన్నాయిగూడెం మండల పరిధిలో బుధవారం పిచ్చికుక్క దాడి ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అందులో ఒకరు కావిరి కృష్ణమూర్తి, అసరెల్లి గగురక్క, మరోకరు ఉన్నారు. అలాగే ఏప్రిల్ నెలలో కన్నాయిగూడెంలో 68 మంది గాయపడగా ఏటూరునాగారంలో 98 కుక్కకాటు కేసులు నమోదు కావడం గమనార్హం. మంగపేట మండల పరిధిలో ఏడాది కాలంలో మంగపేటలో 135, బ్రాహ్మణపల్లిలో 68, చుంచుపల్లిలో 28 కేసులు నమోదు అయ్యాయి. ములుగు మండలంలో జనవరిలో 16, ఫిబ్రవరిలో 16, మార్చిలో 7, ఏప్రిల్లో ఒక కేసు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వాజేడు మండలంలో 174 కుక్కకాటు కేసులు నమోదు కాగా వెంకటాపురం(ఎం)లో ఏప్రిల్ నెలలో 26 కేసులు నమోదు అయ్యాయి. -
డివైడర్ నిర్మాణానికి ప్రతిపాదనలు
ములుగు: జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదుట డివైడర్ నిర్మాణానికి అదనపు కలెక్టర్ మహేందర్జీకి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు ప్రాంతంలో యూటర్న్ డివైడర్ లేకపోవడంతో రాంగ్ రూటులో వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారనే నెపంతో సంఘటన స్థలాన్ని ఆర్అండ్బీ, నేషనల్ హైవే, పోలీస్ శాఖ అధికారులతో బుధవారం సందర్శించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా కోర్టు ఎదుట గల హైవే రోడ్డుకు యూటర్న్ డివైడర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై, సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. రాత్రి ఆలయ అవరణలో పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గాలివాన బీభత్సం
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/మంగపేట/ఎస్ఎస్ తాడ్వాయి: ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం(ఎం), కన్నాయిగూడెం, ఎస్ఎస్తాడ్వాయి మండలాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం ఈదురు గాలులు.. రాళ్ల వానతో పలు ఇళ్లపై రేకులు సైతం ఎగిరిపోయాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని 2వ వార్డులో గుండారపు రాజు ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. కమలాపురం, చిన్నబోయినపల్లి అటవీ ప్రాంతాల్లో విద్యుత్స్తంభాలు నెలకొరిగాయి. చెట్ల కొమ్మలు సైతం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. విద్యుత్శాఖ అధికారులు విద్యుత్ స్తంభాల వద్దకు చేరుకొని మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాళ్ల వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంకటాపురం(ఎం), కన్నాయిగూడెం మండలాల్లో ఆరుగాలం కష్టపడిన పంటను రక్షించుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. కల్లాలోని మిర్చి, వరి పంటను కాపాడుకునేందుకు టార్ఫాలిన్ కవర్లతో పరుగులు తీశారు. వర్షం నీటితో పంట తడవకుండా కాల్వలు తీసి నీటిని బయటకు పంపారు. వర్షం కురిసిన అనంతరం టార్ఫాలిన్లపై నిలిచిన నీటిని తొలగించారు. మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ మంగపేట మండలంలోని కమలాపురం శివారులోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలోని భారీ రావి చెట్టు విరిగి విద్యుత్ లైన్పై పడింది. దీంతో కమలాపురం 133 కేవీ సబ్స్టేషన్ నుంచి కమలాపురం టౌన్, ఏటూరునారం, తాడ్వాయి మండలం కాటాపురానికి విద్యుత్ సరఫరా అయ్యే లైన్పై భారీ వృక్షం పడటంతో రోడ్డు వెంట ఉన్న సుమారు 10 వరకు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక పక్క విద్యుత్ లైన్, మరోపక్క భారీ వృక్షం ఏటూరునాగారం –బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై పడటంతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలిసిన వెంటనే ఎస్సై టీవీఆర్ సూరి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ, విద్యుత్ సిబ్బంది సహకారంతో చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు పంటలను కాపాడుకునేందుకు రైతులకు తప్పని తిప్పలు విరిగి పడిన విద్యుత్ స్తంభాలు -
బస్సులు బంద్.. ప్రయాణికుల ఇక్కట్లు
ఏటూరునాగారం బస్టాండ్లో బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులుఏటూరునాగారం: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బుధవారం తెల్లవారుజాము నుంచే ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు చెబుతున్నారు. బస్సులు బంద్ కావడంతో పలుచోట్ల బస్టాండ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకొని వెళ్లాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటూరునాగారం నుంచి వరంగల్, హనుమకొండకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనదారులు రూ. 250లు వసూలు చేశారు. ప్రయాణికుల అవసరాలను అనుగుణంగా వాహనదారులు చార్జీలు వసూలు చేయడం గమనార్హం.అధిక చార్జీల వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనదారులు -
ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత
ఎస్ఎస్తాడ్వాయి: ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యతని తాడ్వాయి వైల్డ్లైఫ్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేందర్ అన్నారు. వరల్డ్ ఎర్త్ డేను పురస్కరించుకుని వైల్డ్లైఫ్ అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విరివిగా మొక్కలు నాటడం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఉన్న అడవులను సంరక్షించుకోవాలన్నారు. అడవులు సురక్షితంగా ఉంటనే వాతావరణ సమతూల్యత ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ లింగయ్య, బీట్ ఆఫీసర్లు సుభాశ్, బాలకృష్ణ పాల్గొన్నారు.వైల్డ్లైఫ్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేందర్ -
మత్తుపదార్థాలపై అవగాహన కల్పించాలి
ములుగు: మత్తుపదార్థాలతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి శాపంగా మారిన మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యువత, విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా పోలీస్, ఎకై ్సజ్, విద్యాశాఖలు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, గ్రామ, మండల స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ములుగు సామాజిక ఆస్పత్రిలో ప్రత్యేకంగా డి అడిక్షన్ కేంద్రం అందుబాటులో ఉందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రత్యేక వైద్య నిపుణులతో సైకాలజిస్ట్లతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఏఓ సురేశ్కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు మహేశ్బాబు, ఎకై ్సజ్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్ జీ -
రామప్పలో శిక్షణ అధికారులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ ఏఎస్వోలు సందర్శించారు. భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. సైకిల్ ర్యాలీ ములుగు రూరల్: జిలా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎకో క్లబ్, తెంగాణ నేషనల్ గ్రీన్ కారప్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మదర్ ఎర్త్ డేను పురస్కరించుకుని బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడారు. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, భాస్కర్, కవిత, రాధిక, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. వెంకటనారాయణకు ప్రశంసపత్రం ములుగు రూరల్: పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో జిల్లాలో ఎంటీఓగా విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు డీజీపీ శివధర్రెడ్డి చేతుల మీదుగా ఆయన బుధవారం ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా మొదటి స్థానంలో నిలవడంతో ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణను అభినందించారు. వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఈ నెల 21న హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో 2026–30 కాలానికిగాను రాష్ట్ర క్యావర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన డాక్టర్ పింగిళి రమేష్రెడ్డి ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ మూల జితేందర్రెడ్డి జాయింట్ సెక్రటరీగా ఎన్నికై నట్లు వారు తెలిపారు. వాల్పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి అర్బన్: సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న విద్యుత్ సౌద ముట్టడిని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో యూనియన్ నాయకులు వాల్పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు జెన్కో, ట్రాన్స్కో, ఎస్టీపీ ద్వారా సరఫరా అయిన విద్యుత్కు సంబంధించిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51వేల కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌద ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. దరఖాస్తుల ఆహ్వానంభూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు కోచ్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్ రఘు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేసవి శిబిరాలను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో ఏప్రిల్ 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయన్నారు. ఆసక్తి గల కోచ్లు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తులు అందించాలన్నారు. -
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనంఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం ములుగు: జిల్లాలో సోమవారం నుంచి ఓపెన్ టెన్త్(టాస్) పరీక్షలు ప్రారంభమైనట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. తొలిరోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 772 మంది విద్యార్థులకు గాను 633 మంది హాజరయ్యారు. 139 మంది గైర్హాజర్ అయినట్లు వివరించారు. ఇంటర్మీడియట్లో 967 మందికి 817 మంది విద్యార్థులు హాజరు కాగా 150 గైర్హాజర్ అయినట్లు వెల్లడించారు. జిల్లాలోని 10 కేంద్రాలలో టాస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బసవేశ్వరుడి జయంతి వేడుకలు ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కొమురయ్య తెలిపారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సిబ్బంది మొగిలి, సరిత, మానస, రేణుక, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలపై దాడులు ఆపాలని వినతి ములుగు రూరల్: జిల్లాలో ఉన్న వలస ఆదివాసీల గూడేలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు సీపీఎం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గూడేలపై ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తక్షణమే అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలిములుగు రూరల్: వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలను రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు భీరెడ్డి సాంబశివ మాట్లాడారు. గతేడాది వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులకు నష్ట పరిహారం ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, తుమ్మల వెంకటరెడ్డి, గపూర్ పాషా, సాంబశివరావు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. వాహనాలు సీజ్ వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఇప్పగూడెం ఇసుక ర్యాంప్ వద్ద అనుమతులు లేకుండా పనులు నిర్వహిస్తున్న రెండు ఎస్కలేటర్లు, ఒక ట్రాక్టర్ను టీఎండీసీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టీఎండీసీ పీఓ రాజు కథనం ప్రకారం.. ఇప్పగూడెం ఇసుక ర్యాంప్లో అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని గ్రామస్తులు గిరిజన దర్బార్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇసుక ర్యాంప్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని టీఎండీసీ అధికారులను ఆదేశించారని తెలిపారు. దీంతో అధికారులు అక్కడకు చేరుకుని అనుమతులు లేకుండా పనులు చేస్తున్న రెండు ఎస్కలేటర్లు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఆర్వో కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు. సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష.. మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రతిపక్షాలపై నిప్పులు.. అభివృద్ధి, సంక్షేమానికి హామీ.. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్అండ్టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగాకుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నా భర్తకు వేతనం రావడం లేదు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కాంటిజెంట్ వర్కర్గా పనిచేస్తున్న నా భర్త ప్రసాద్కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను విధులకు హాజరవుతున్నాను. 2020 నుంచి వేతనం రావడం లేదు. అధికారులు, పీఓలు మారుతున్నా వేతనం రాక ఇబ్బందులు పడుతున్నాం. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి పెండింగ్ వేతనాలు వచ్చేలా చూడాలి. – ఆలం రామలక్ష్మి, మేడారం, ఎస్ఎస్తాడ్వాయివెంకటాపురం(కె) మండలంలోని అలుబాక పంచాయతీ పరిధి ముత్తారం గ్రామస్తులతో కలిసి ఇసుక క్వారీ సొసైటీని ఏర్పాటు చేశారని కుర్సం ముత్తయ్య, బాడిష కన్నయ్య, మడ సుజాత, బాడిష స్వప్నలు కలెక్టర్కు విన్నవించారు. ముత్తారంలో సొసైటీ ఏర్పాటు చేసి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు జమ ఖర్చు చెప్పడం లేదు. పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ను సొసైటీ విషయం ఏది అడిగిన ఇవ్వడం లేదు. సొసైటీ పేరు కూడా చెప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మూడు మార్లు రూ.4 లక్షల క్యూబిక్మీటర్ల ఇసుక బయటకు రవాణా చేసినప్పటికీ వాటి కమీషన్ తమకు ఇవ్వకుండా అధికారులు, సొసైటీ సభ్యులు మింగి కూర్చుంటున్నారని తెలిపారు. గ్రామంలోని గిరిజన కుటుంబాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా సొసైటీ సభ్యులు సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా పాత సొసైటీని రద్దు చేసి కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని ముత్తారం గ్రామస్తులు కోరారు. ●దరఖాస్తుల ఆహ్వానం ములుగు రూరల్: జాకారం గురుకుల పాఠశాలలో 2026–27లో ప్రవేశానికి అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అనిత అన్నారు. వచ్చే నెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. సీట్ల ఎంపిక లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుందని వివరించారు. ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు ఎన్డీఎస్ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన -
ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి
వెంకటాపురం(ఎం): ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో నిర్మిస్తున్న రామాలయానికి సోమవారం మంత్రి సీతక్క భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా మండల కేంద్రంలో నిర్మించిన పెద్దమ్మగుడిని సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బొమ్మకంటి వంశావతిరమేశ్, మామిడిశెట్టి సుగుణస్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, నాయకులు భగవాన్రెడ్డి, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
వినతులు పరిష్కరించండి
ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలు ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన మాదారపు లక్ష్మి. ఈమె భర్త ఐదేళ్ల క్రితం మరణించాడు. అయితే తన భర్త మీద ఉన్న పింఛన్ తన పేరు మీదకు మార్పించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయం వెళ్లగా ఆమె ఆధార్కార్డు ఆన్లైన్లో నమోదు చేయగా మరణించినట్లు రికార్డులో ఉండడం గమనార్హం. అయితే ఆ కార్యాయంలో పనిచేసే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని పలువురు అధి కారులు చెప్పినప్పటికీ దానిని సరిచేయడం లేదు. దీంతో ఆమె కలెక్టర్కు ప్రజావాణిలో విన తి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకుంటుంది.ఏటూరునాగారం: గిరివాణి, ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ, కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరివాణి, ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అర్జీదారుల సమస్యలు విని వినతులు స్వీకరించారు. ఈ క్రమంలో గిరివాణిలో 96 దరఖాస్తులు రాగా ప్రజావాణిలో 26 దరఖాస్తులను బాధితులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్కు చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంకటాపురం(కె) మండలం ఎదిర గ్రామ సమీపంలోని యాకన్నగూడెంలో ప్రభుత్వం నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసింది కానీ ఎలాంటి భవనం నిర్మించలేదని తక్షణమే నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమ్, క్యాంపస్ పరిసరాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను వెంటనే అందించాలని స్పష్టం చేశారు. వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏపీవో వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్, డీడీ జనార్దన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ దివాకర ఆదేశాలు గిరివాణిలో 96, ప్రజావాణిలో 26 అర్జీల రాక బాధితుల సమస్యలు విని వినతులు స్వీకరించిన కలెక్టర్ -
వయోవృద్ధులకు హెల్త్ క్యాంప్
ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్లో వయోవృద్ధులకు సోమవారం హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత తెలిపారు. రాయినిగూడెం పీహెచ్సీ డాక్టర్ నందకిశోర్, డాక్టర్ దీపిక తమ సిబ్బందితో కలిసి డే కేర్ సెంటర్లోని వయోవృద్ధులకు హెల్త్ చెకప్ నిర్వహించినట్లు వెల్లడించారు. బీపీ, షుగర్ టెస్టులు చేసి థైరాయిడ్తో పాటు అన్ని రకాల టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్ తీసుకున్నట్లు వివరించారు. ఈ క్యాంపులో సుమారు 35 మంది వయోవృద్ధులు హెల్త్ చెకప్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సహాయకులు నాగేంద్ర, ప్రాణమ్ డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ చుంచు రమేశ్, రాయినిగూడెం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
● నేటి నుంచి వరంగల్ రీజియన్ వ్యాప్తంగా నిలిచిపోనున్న బస్సులు ● ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులుహన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి వరంగల్ రీజియన్లోని 8 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 1,036 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 596 సంస్థ బస్సులు, 325 ప్రైవేట్ అద్దె బస్సులు, 115 విద్యుత్ బస్సులు ఉన్నాయి. మొత్తం 986 షెడ్యూల్స్ నడుస్తున్నాయి. రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరిగి 4.16 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తూ రూ.2.06 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. సంస్థకు చెందిన 1,123 మంది డ్రైవర్లు, 1,436 మంది కండక్టర్లు సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 140 మంది డ్రైవర్లు, 286 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా సంస్థ ఉద్యోగులైన 368 మెకానిక్లు, 250 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది 60 మంది, సెక్యూరిటీ సిబ్బంది 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఔట్ సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న 140 మంది డ్రైవర్లు, 286 మంది డ్రైవర్లు మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 104 మంది మెకానిక్లు, కార్యాలయ స్టాఫ్ 38 మంది. సెక్యూరిటీ 36 మంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశలున్నాయి. వీరితో బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో 325 ప్రైవేట్ అద్దె బస్సులున్నాయి. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ అద్దె బస్సులు తిప్పడంతో పాటు, సంస్థ బస్సులను తిప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉన్నంతలో కనీసం ప్రధాన రూట్లలో బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిపో ఆర్టీసీ అద్దె హనుమకొండ 100 52 వరంగల్–1 105 41 వరంగల్–2 115 (ఈవీ) 44 జనగామ 83 39 నర్సంపేట 65 35 మహబూబాబాద్ 57 24 పరకాల 63 23 తొర్రూరు 57 43 భూపాలపల్లి 66 24సంస్థ పరిరక్షణ ముఖ్యం ఆర్టీసీ కార్మికులుగా సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాం. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ కోసమే సమ్మెకు వెళ్తున్నాం. విద్యుత్ బస్సులు తీసుకువచ్చి సంస్థను ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులు ఇవ్వాలి. యాజమాన్యం, ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. యూనియన్ రీజియన్ సెక్రటరీ డిమాండ్లు పరిష్కరించాలి..సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెకు ఒక రోజు ముందు చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. ముందుగా డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలి. ఎరియర్స్ ఇవ్వాలి. పని గంటలు తగ్గించాలి. ఔట్ సోర్సింగ్ విధానం తగ్గించి సంస్థ నియామకాలు చేపట్టాలి. – సీహెచ్.రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
హాష్ ఆయిల్ స్మగ్లింగ్.. నలుగురి అరెస్ట్
వరంగల్ క్రైం: హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ప్రకటించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. నిందితులు ఒడిషా రాష్ట్ర మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను, రేకపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఏపీలోని అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబును అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముంబైకి వెళ్లేందుకు కోణార్క్ రైలు ఎక్కి.. ఈముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్ను సేకరించినట్లు ఆయన తెలిపారు. 20 కిలోల హాష్ ఆయిల్ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోల హాష్ ఆయిల్ను కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు. నిందితులు ఐదు కిలోల చొప్పున హాష్ ఆయిల్ను తీసుకుని ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19న అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఈనెల 20న దిగి 21న ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.2.50 కోట్ల విలువైన 20కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసీపీలు జితేందర్రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ వై.సతీష్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షూకూర్, ఎస్సైలు సందీప్, తేజ ఆర్ఎస్సైలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, క్యాట్పార్టీ లింగారావు, ఏఆర్ఏ ఎస్సైలు సుబ్బిరామి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల రాజు,శ్రీరాములు, ఇంతేజార్గంజ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. రూ.2.50 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
సొంతూరుకు దామోదర్..
ఎస్ఎస్ తాడ్వాయి : కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ 28 ఏళ్ల తర్వాత మంగళవారం తన స్వగ్రామం కాల్వపల్లిలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చిన దామోదర్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు దామోదర్ను కలిసి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. దామోదర్ అజ్ఞాతంలోకి వెళ్లి చాలా ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. 28 ఏళ్ల తర్వాత వచ్చిన దామోదర్ను చూసిన కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. దామోదర్ వస్తున్న విషయాన్ని తెలుసుకొని కాల్వ పల్లి చుట్టూ పక్కల గ్రామాలు నార్లాపూర్, కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, కొత్తూరు, వెంగళాపూర్, పడిగాపూర్ గ్రామస్తులు కాల్వపల్లికి భారీగా తరలొచ్చారు. తనకు తెలిసిన ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు, తన చిన్ననాటి స్నేహితులను, తనతో పాటు చదువుకున్న తోటి విద్యార్థులను దామోదర్ ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా దామోదర్ను కలిసి ముచ్చటించారు. దామోదర్కు ఘనసన్మానం సాయుధ పోరాటం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దామోదర్ను గ్రామస్తులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. 28 ఏళ్ల అడవి బాట వీడి గ్రామస్తులను కలవడం ఆనందంగా ఉందని దామోదర్ పేర్కొన్నారు. తన జీవితాన్ని ప్రజల సేవ కోసం అంకితం చేస్తానని తెలిపారు. చిన్ననాటి మిత్రులతో ముచ్చట్లు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు -
వేదికేది
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మండల సభల నిర్వహణ లేక సర్పంచ్ల ఆవేదనములుగు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు గ్రామ సర్పంచ్లు కృషి చేయాల్సి ఉంటుంది. నాలుగు నెలల క్రితం కొత్తగా ఎన్నికై న సర్పంచులకు గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లడానికి సరైన వేదిక దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో మండల పరిషత్ పాలకవర్గాలకు మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. మండల సభలలో తమ గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు సర్పంచ్లు కృషి చేసేవారు. ఈ సభల నిర్వహణతో అధికారులు, సర్పంచులకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. గత రెండేళ్లుగా ఎంపీటీసీలు లేకపోవడంతో మండల సభలు ముందుకుసాగడం లేదు. గత డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో మంగపేట మండలం మినహా జిల్లాలోని 9 మండలాల పరిధిలో 146 పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు తమ గ్రామ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలో అర్ధంకాక అయోమయానికి గురవుతున్నారు. గతంలో మూడు నెలలకోసారి సభలు మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ఉండి ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్లు హాజరయ్యేవారు. ఎమ్మెల్యే, ఎంపీతో పాటు డివిజన్ స్థాయి అధికారులు సైతం హాజరయ్యేవారు. మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమశాఖ తరఫున చేపడుతున్న అభివృద్ధి పనులు వివరించేందుకు మూడు నెలల ప్రగతి నివేదికతో సమావేశానికి వచ్చేవారు. ఈ సమావేశంలో వ్యవసాయ, విద్య, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్ధక, అటవీశాఖ, రెవెన్యూ శాఖతో పాటు 23 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి ప్రజాప్రతినిధులకు వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారీగా అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రజాప్రతినిదులు లేవనెత్తిన సమస్యలపై అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. దీంతో ప్రజాప్రతినిదులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ మండలాభివృద్దికి తోడ్పాటునందించేవారు. సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియని అయోమయం గతంలో మూడు నెలలకోసారి నిర్వహణ ఎంపీటీసీలు లేకపోవడంతో కొనసాగని సభలు -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మంగపేట: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మల్లూరు జీపీ, మంగపేట పీహెచ్సీ ఆవరణలో మంగళవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలాన్ని 6 జోన్లుగా విభజించి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామని హామీనిచ్చారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలు తెలిపిన సమస్యలను రెండున్నర గంటల పాటు సీతక్క ఓపికగా వింటూ వినతులు స్వీకరించారు. మండల కేంద్రంలో వారాంతపు సంత, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, నూతన బస్టాండ్ ప్రారంభోత్సవంతో పాటు ప్రతీ గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మల్లూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడారు. పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల విడుదల చేసిన టైడ్, అన్టైడ్ నిధులను నిబంధనల ప్రకారం గ్రామసభల ద్వారా ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రజలకు తాగునీరు. వీధిలైట్లు, తాగునీటి లీకేజీ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమానికి ముందుగా మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీ, వివిద శాఖల అధికారులతో కలిసి మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో ఈనెల 27 నుంచి మే 6 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం బోరునర్సాపురంలో రూ.2 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణం పనులకు సీతక్క శంకుస్థాపన చేశారు. అలాగే సండ్రోని ఒర్రె అటవి ప్రాంతంలోని శాంతినగర్ గొత్తికోయగూడెంలోని గిరిజనులతో కలిసి మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి భోజనం చేశారు. గిరిజనులు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా నీటి సంప్ను మంత్రి ప్రారంభించారు. మూడేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం, బాలామృతం, ఫ్రీప్రైమరీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, హేమాచల క్షేత్రం ఈఓ వీరస్వామి, డీసీసీ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు వల్లిపల్లి శివప్రసాద్ గుమ్మడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
వనదేవతలకు ప్రత్యేక పూజలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కుటుంబ సమేతంగా అమ్మవార్లను మంగళవారం దర్శించుకున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద ఎస్పీ మొక్కులు చెల్లించి గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ సంప్రదాయంగా దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజారులు ఎస్పీ దంపతులను అమ్మవారి కండువాతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ మధు, రికార్డు అసిస్టెంట్ వీరన్న, సారలమ్మ పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ పాల్గొన్నారు. -
ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల పరిశీలన
ఏటూరునాగారం: మండల పరిధిలోని అల్లంవారిఘణపురం పరిధిలో గల గుర్రాలబావి అటవీ ప్రాంతం ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములను ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. రెండు వారాల క్రితం గిరిజనదర్బార్లో కలెక్టర్ దివాకరకు అల్లంవారిఘణపురంలోని గుర్రాలబావి దగ్గర ఉన్న రైతులు కాపుల సమ్మయ్య, రెడ్డి శంకరయ్య, ఆర్కె సమ్మయ్యలు మొరపెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ ఎస్డీసీ గ్రామాన్ని, భూములను పరిశీలించారు. పట్టా భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీశారని రైతులు గోడు వెలిబుచ్చారు. భూ రికార్డులు రైతుల వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు రైతులు మాట్లాడుతూ మా భూములు మాకు ఇప్పించాలని వేడుకున్నారు. సాగు చేసుకొని బతికేవాళ్లమని, దీనిలో కందకాలు తీయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు ఉన్న అటవీ హక్కు పత్రాలు(ఆర్ఓఎఫ్ఆర్) , భూములు వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. ఆయన వెంట తహసీల్దార్ జగదీశ్, సిబ్బంది, గిరిజన రైతులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించడం ఎలా..
గ్రామపంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు గత రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. గత డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినప్పటికి ఎంపీటీసీ ఎన్నికలు మే నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ స్పష్టత లేదు. ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తేనే మండలాల్లో మండల సభలు నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. ఎంపీటీసీ సభ్యులు లేకపోతే మండల సభలు నిర్వహించేందుకు వీలు లేదు. దీంతో సర్పంచ్లు గ్రామ పంచాయతీల్లోనే గ్రామసభలు నిర్వహించుకుంటున్నప్పటికీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి సర్పంచ్లకు నెలకొంది. మండల సభకు మాత్రమే అధికారులు హాజరవుతారే తప్ప గ్రామసభలకు అధికారులు హాజరయ్యే పరిస్థితి ఉండదు. మండలస్థాయి అధికారులతో తమ గ్రామ సమస్యలు చెప్పుకునేలా ఉన్నతాధికారులు స్పందించి మండల సభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్లు కోరుతున్నారు. -
నేడు ఐటీడీఏలో గిరివాణి
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నేడు (సోమవారం) గిరివాణి, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ, కలెక్టర్ దివాకర టీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏకు చేరుకొని వారి వినతులు సమర్పించాలని కోరారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలిన్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడుతూ.. సమ్మర్క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధి కారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అద్దె బస్సుల స్కీం కొనసాగించాలిహన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు. హనుమకొండ హంటర్రోడ్డులోని అభిరాం గార్డెన్స్లో ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్మెంట్ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు బాలవర్ధన్రెడ్డి, ఎన్.ప్రసాద్, హబీబ్, జె.వెంకట్రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్, జి.వెంకన్న, కె.భాస్కర్రెడ్డి, కుమార్, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు. నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జేబీఎం ఎలక్ట్రిక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉండి మోడీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసినా పట్టించుకోని పక్షంలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రవాణా కమిషనర్ చర్చలకు పిలిచిన యాజమాన్యం, ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదన్నారు. అధిక పని భారమైనప్పటికీ మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
స్వీయ నియంత్రణ తప్పనిసరి
ములుగు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం మండలపరిధిలోని ఇంచర్ల గ్రామ శివారులోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం చేపట్టిందని అన్నారు. వాహనాలు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా సీట్బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేయటంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణహాని తప్పదని హెచ్చరించారు. పోలీస్ శాఖ వాహన తనిఖీలు చేసేది కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని అన్నారు. ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -
మండే ఎండ.. ఠండా ఠండా!
● జూపార్కులో చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, చలువ పందిళ్ల ఏర్పాటు ● ఉష్ణోగ్రతలు పెరగకుండా అధికారుల ఏర్పాట్లు న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్క్లోజర్లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్
భూపాలపల్లి/కాళేశ్వరం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం హెలిపాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మూడు చోట్ల హెలిపాడ్ల ఏర్పాటు.. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్పల్లిలోని గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు. జనసమీకరణ.. కాటారం సబ్డివిజన్తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్ వరకు ఉన్న ఎన్హెచ్ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్థానిక సీఐ నరేష్శ్మార్ ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్నగర్ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కాటారం మండలం నస్తుర్పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20వ పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు. -
సీఎం సార్.. హామీలు నెరవేర్చరూ..
సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందేదెప్పుడు భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పలు హామీలు అమలుకు నోచుకోలేదు. వీటికి తోడు జిల్లాలో పెండింగ్ సమస్యలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పెండింగ్ సమస్యలు, ఇచ్చిన హామీల అమలుకు నిధుల కేటాయింపుపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ జిల్లా ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు లేకపోవడంతో చిన్నచిన్న రోగాలకు సైతం ఎంజీఎం, వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ● జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మున్సిపాలిటీ దినదినం అభివృద్ధి చెందుతుంది. గత ప్రభు త్వ హయాంలో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. సుమారు లక్షకు పైగా జ నాభా ఉన్న ఈ పట్టణాన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ● గత ప్రభుత్వాలు జిల్లాలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ 1ను ప్రైవేట్ కాంట్రాక్టరుకు అప్పగించగా, ప్రాజెక్ట్ 2ను సింగరేణి సంస్థకే అప్పగించి పనులు చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ● సింగరేణి బొగ్గు, గోదావరి జలాలు, కేటీపీపీ పరిశ్రమ ఉన్న ఈ జిల్లాలో ఇంజనీరింగ్, మైనింగ్ కళాశాల, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వమైన పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.జిల్లా కేంద్రం అనంతరం కాటారం రెవెన్యూ డివిజన్ అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. కాటారం, సమీపంలోని నస్తూర్పల్లి, మద్దులపల్లి, చిదినెపల్లి, పోతులవాయి, ఇబ్రహింపల్లి, బయ్యారం గ్రామాలను కలిపి కాటారాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న గణపురం మండలం చెల్పూరు పరిధిలోని సింగరేణి వేయి క్వార్టర్ల సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరాల జల్లులు కురిపించారు. కొందరు వ్యక్తులు సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోర్డును రద్దు చేసేది లేదని, కారుణ్య నియామకాలను కొనసాగిస్తామని ప్రకటించారు. 217 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా కారుణ్య నియామకాలు అంతంత మాత్రంగానే జరుగుతుండగా, డిస్మిస్డ్ కార్మికుల ఊసే లేదు. భూపాలపల్లి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 500 కోట్లు కేంద్రం కేటాయించిందని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు. ఇప్పటి వరకు కనీసం భూసేకరణ పనులు కూడా ప్రారంభం కాలేదు. సాధారణ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. సింగరేణి సంస్థలో మారు పేర్లను సవరిస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బైపాస్ రోడ్డు పనుల ప్రారంభమెప్పుడో సింగరేణిలో కారుణ్య నియామకాలు కలేనా..? 217 మంది డిస్మిస్డ్ కార్మికుల పరిస్థితేంటి నేడు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ములుగు రూరల్: అర్హులందరికీ ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని రాయనిగూడెం గ్రామ పంచాయతీలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి, తదితర పథకాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
రామప్పలో ఎన్ఎస్జీ అధికారులు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం ఎన్ఎస్జీ, ఆక్టోపస్ అధికారులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. రామప్ప గార్డెన్ ఆవరణలో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కేంద్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయికృష్ణ, సీఏ అజిత్, తహసీల్దార్ గిరిబాబు, ఆర్ఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రామప్పలో ఫొటో ఎగ్జిబిషన్
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామప్ప దేవాలయంలో కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ గిరిబాబు హాజరై ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయి కృష్ణ, సీనియర్ సీఏ అజిత్లు మాట్లాడారు. దేశంలో మూడు వేలకు పైగా కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తున్నామన్నారు. ఇందులో 43 యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాలు, వాటి చరిత్ర తెలిపే విధంగా ఫొటో ఎగ్జిబిషన్ను రామప్పలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కట్టడాలను సంరక్షించడంలో బాధ్య త వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు రమేశ్, సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ రాజు, కేంద్ర పురావస్తు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవా స్ఫూర్తి ప్రశంసనీయమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, టీజీఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనమిచ్చే ప్రతీ రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందన్నారు. రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని తెలిపారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతీ ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్సల్లో ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యసేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావులు సైతం రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ చంద్రశేఖర్, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మే మాసంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి
778సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వేళయ్యింది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శనివారం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలోనే ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారయంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. ‘పరిషత్’ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీలోపే ఓటర్ల జాబితా... 2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీ చేసిన అదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలను రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధ్రువీకరణ అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలున్నట్లు గమనిస్తే, వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23వ లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్లు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. ‘పరిషత్’లో ‘ఆమె’కే ప్రాధాన్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పరుషులు 14,89,606 కాగా, మహిళ ఓటర్లు 15,51,289 మంది ఉన్నారు. ఇతరు(థర్డ్జండర్)లు 504 కాగా, సర్వీసు ఓటర్లు 2141. ఆరు జిల్లా ప్రజా పరిషత్లు ఉండగా ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామలు ఎస్సీ మహిళలకు కేటాయించారు. అదే విధంగా 75 జెడ్పీటీసీలకు గాను 38, 39 ఎంపీపీ స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. అలాగే 778 ఎంపీటీసీ స్థానాల్లో 399 చోట్ల మహిళలకే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో ‘స్థానిక’ వివరాలు ఇలా... జెడ్పీపీపీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం ముసాయిదా జాబితాపై అధికారుల కసరత్తు రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... మహిళలకు భారీగా అవకాశాలు మొత్తం జిల్లాలు 06ప్రయత్నాలు మొదలెట్టిన ఆశావహులు.. 7506ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ‘పరిషత్’ సందడి మొదలైంది. వాస్తవానికి 2025 సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావహులు కొందరు సరిపెట్టుకోగా.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల్లో సందడి మొదలైంది. మే మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసే పనిలో పడ్డారు. -
హేమాచలుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి హరినాధ్ దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో ఆలయ పూజారులు రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్ వారి పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సూర్యచంద్రకళ, అడిషనల్ జడ్జి డి.మధులిక తేజ, ఎస్సై టీవీఆర్ సూరి పాల్గొన్నారు. ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు వెంకటాపురం(కె): మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవి కాలంలో ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మొర్రవానిగూడెంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ పర్శిక శ్రీలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఈ ఉమారావు మాట్లాడుతూ గ్రామాల్లో మీటర్ లేనివారు పీఎం జుగా స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉచిత మీటర్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్దాస్, లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, అసిస్టెంట్ లైన్మెన్ ఫరీద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి క్వాలిటీ కంట్రోల్ విభాగం నూతన కమిటీభూపాలపల్లి అర్బన్: సింగరేణి క్వాలిటీ కంట్రోల్ విభాగం నూతన కమిటీని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఫిట్ సెక్రటరీగా ధారపోషం, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా కార్తీక్తోపాటు షిఫ్ట్ ఇన్చార్జ్లుగా ఇ.శ్రీనివాస్, మధు, జి.శ్రీనివాస్, ఎం.రవికృష్ణ, కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం స్థానిక కొమురయ్య భవన్లో క్వాలిటీ విభాగంలో పనిచేస్తున్న శాంపిల్ మజ్దూర్ కార్మికులను ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, నాయకులు సుధాకర్రెడ్డి, జి. శ్రీనివాస్, ఎండీ ఆసిఫ్ పాషా, రామచందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఇన్చార్జ్ నూకల చంద్రమౌళి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలనమల్హర్(కాటారం): మండలంలోని కాటారం సన్తూర్పల్లిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతాలు, సభావేదికను సమగ్రంగా తనిఖీ చేశారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహనాల నిలుపుదల సౌకర్యాన్ని విస్తరించాలని సూచించారు. హెలిపాడ్ ప్రదేశంలో దుమ్ము ఎగరకుండా నీరు చల్లడంతో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్అండ్బీ ఈఈ రమేష్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి
● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి 26వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులం, విద్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్యా విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. వసతి గృహాలలో మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారం నిర్వహించే సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. శానిటేషన్ సమస్యలను పరిష్కరి స్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 62 శాతం రైతుల రిజిస్ట్రీ పురోగతి సాధించామని, మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేస్తామన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో కార్యక్రమాలు పూర్తి చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భానుడి భగభగ
జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలుచల్వాయి రోడ్డుపై కనిపించని జనం నిర్మానుష్యంగా మారిన 163 జాతీయ రహదారిగోవిందరావుపేట: భానుడు భగభగ మండిపోతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో శనివారం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అయ్యాయి. మంగపేట మండల పరిధిలోని మల్లూరులో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదు కాగా ములుగులో అత్యల్పంగా 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మండలాల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉండటం గమనార్హం. నిర్మానుష్యంగా రహదారులు ఉదయం 9 గంటలకే భానుడు మండిపోతున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయానికి ప్రధాన రహదారులు, మార్కెట్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారు తప్పా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. చిన్నచిన్న వ్యాపార సముదాయాలు, టీ స్టాళ్లు, తినుబండరాల దుకాణాలు, బట్టల షాపులు కష్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. సాయంత్రం 5గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. వడదెబ్బతో ప్రాణాపాయం అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ(హీట్ స్ట్రోక్) బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అధికంగా ఎండ ఉన్న సమయంలో ఎక్కువసేపు బయట తిరగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు ఆకస్మాత్తుగా పెరిగి వడదెబ్బకు గురై ప్రాణాపాయ స్థితి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు., బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తలనొప్పి, వాంతులు, తలతిరగడం, అధిక దాహం, శరీరం బలహీనత వంటి లక్షణాలు కనిసిప్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణ పొందాలంటే మాధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తరచూ నీరు తాగ డం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలి.. తలకు టవల్ లేదా టోపి ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలిజిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగడం ప్రమాదకరం. శరీరంలో నీరు తగ్గిపోకుండా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవాలి, తలకు టవల్ లేదా టోపి ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వేళ్లేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్ను సంప్రదించాలి. – గోపాల్రావు, జిల్లా వైద్యాధికారి మల్లూరులో అత్యధికంగా 43.5డిగ్రీల సెల్సియస్ నమోదు బయటకు రావాలంటేనే జంకుతున్న ప్రజలు నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు రక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు -
20నుంచి ‘ఓపెన్’ టెన్త్, ఇంటర్ పరీక్షలు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5–30గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్లో 3,945మంది విద్యార్థులకునుగాను 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 197మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్లో 7,187మందికిగాను 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 359మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం శుక్రవారం తెలిపారు. హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్(తెలంగాణఓపెన్స్కూల్.ఓఆర్జీ)లో అందుబాటులో ఉంచారని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్లో 3,495 మంది.. ఇంటర్లో 7,187 మంది విద్యార్థులు -
20న ‘రైతు భరోసా’ విడుదల
ఈ నెల 20న నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వచ్చాం. ఆస్పత్రిలో తాగునీరు ఎక్కడ ఉందనే విషయం తెలియదు. దాహం తీర్చుకునేందుకు రూ.20లతో వాటర్ బాటిల్ కొనుగోలు చేశా. వాటర్ ప్లాంట్ ఎక్కడ ఉందనే విషయం తెలిసేవిధంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. – రమ్య, వెంకటాపురం (ఎం)గతంలో ఆస్పత్రిలో ఇన్వార్డు పేషెంట్లకు అందుబాటులో ఆర్ఓ ప్లాంట్ ఉండేది. ఆస్పత్రి అప్గ్రేడ్ అయిన తర్వాత వాటర్ ప్లాంట్ను ఆస్పత్రి ఆవరణలోని జనరిక్ మందులషాపు పక్కన ఏర్పాటు చేశారు. అయితే ఆస్పత్రిలో తాగునీరు ఎక్కడ దొరుకుతుందనే విషయానికి సంబంధించి ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అటెండెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమి లేక రూ.20 పెట్టి వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తాగుతున్నారు. ఆస్పత్రిలో గతంలో వేసిన బోర్ సహాయంతో వాటర్ ప్లాంట్ నిర్వాహన కొనసాగుతుంది. ఇటీవల కాలంలో ఎలాంటి బోర్లు వేయించలేదు. -
డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు పరిశీలన
వాజేడు: కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి జిల్లా వైద్యాధికారి గోపాల రావు వాజేడు, పేరూరు, ఎదిర వైద్యశాలలను శుక్రవారం పరిశీలించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న రోజులు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా అందుబాటులో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడంలో భాగంగా రోగులకు ఏ వైద్యశాల అనుకూలంగా ఉంటుందో అనే కోనంలో వాజేడు, పేరూరు, ఎదిర వైద్యశాలలను పరిశీలించారు. ఆస్పత్రుల్లో అదనపు గదులు, కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేయడానికి వీలుగా ఉంటుందా లేదో చూశారు. త్వరలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త జగదీష్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి
ములుగు: ములుగు మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడినందున వ్యాపారులు (2026–27)కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొంతమంది వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ లేకుండా దుకాణాలు, హోటళ్లు, మెడికల్ షాపులు, వ్యాపార సంస్థలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇప్పటి వరకు లైసెన్స్ లేని వ్యాపారులు కొత్త ట్రేడ్ లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని, లైసెన్స్ ఉన్న వారు పాత లైసెన్స్ను పునరుద్ధరించుకోవాలన్నారు. నిర్ధేశిత గడువులోగా టీఎల్ పొందని వారిపై మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ములుగు పట్టణ వాణిజ్య దారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్కుమార్ అన్నారు. మండలంలోని గంగారం పంచాయతీ పరిధిలోని భూపతిపూర్ సమీపంలో కారుకొండా సడాలమ్మ జాతరను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు కొర్నెబెల్లి గణేష్, చింత రమేష్, కొమరం రవి, సర్వేష్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీల ఇలవేల్పు జాతరల రక్షణకు కృషి చేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మొదటి బహుమతి రూ. 25,016, ద్వితీయ బహుమతి రూ.15,016, తృతీయ బహుమతి రూ.10,016, నాలుగో బహుమతి రూ.5,016, ఐదో బహుమతి రూ.3,016లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడే రజిత రాంబాబు, యువజన సంఘాల అధ్యక్షుడు నవీన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ములుగు: తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ, తహసీల్దార్కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎస్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వాంకుడోతి జ్యోతి, గోనె రవీందర్, సల్లకొండ పద్మాకర్ రెడ్డి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీపీఆర్పై అవగాహన తప్పనిసరి
● డీఎస్పీ కిశోర్కుమార్ ములుగు రూరల్: సీపీఆర్పై ప్రతీఒక్కరికి అవగాహన ఉండాలని డీఎస్పీ కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్లో సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిని వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించడం సామాజిక బాధ్యతన్నారు. క్షతగాత్రులను కాపాడితే రహ్వీర్ పథకం ద్వారా రూ.25వేల పారితోషికం అందిస్తామన్నారు. ప్రమాదాల సమయంలో ఊపిరి అందక ఇబ్బందులు పడే వారికి వెంటనే సీపీఆర్ చేసి కాపాడాలని సూచించారు. ప్రమాదం జరిగిన గంట సమయాన్ని గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఆ సమయంలో చికిత్స అందించినట్లయితే ప్రాణాలు రక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీఐ సురేష్కుమార్, ఎస్సై ఉపేందర్రావు, చంద్రశేకర్, 108 జిల్లా మేనేజర్ రాజ్కుమార్, మెడికల్ ఆఫీసర్ అన్వేష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


