breaking news
Mulugu
-
మీ సేవ.. మరింత చేరువ..
వెంకటాపురం(ఎం): కాగిత రహిత పాలనకు సేవలందిస్తున్న మీసేవ మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మీసేవ ద్వారా ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలు అందుతుండగా మరో 9 రకాల సేవలను మీసేవలో పొందుపరిచారు. ప్రస్తుతం మీసేవ కేంద్రాలు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయితీరాజ్ శాఖల సేవలందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుంది. ఇటీవల రెవెన్యూశాఖ నుంచి ఆరు రకాల సర్వీసులు, అటవీశాఖ నుంచి రెండు సర్వీసులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్పేర్, సీనియర్ సిటిజన్ నుంచి ఒక సర్వీసును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ శాఖ నుంచి స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, నేమ్ చేంజ్ ఆఫ్ సిటిజన్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్, మైనారిటీ ధ్రువీకరణ, సర్టిఫికెట్ పునజారీ(కులం, ఆదాయం), క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, అటవీశాఖ నుంచి వన్యప్రాణులతో చంపబడిన మానవ/పశువులకు పరిహారం దరఖాస్తులు, సమ్మిల్/టింబర్ డిపో ఫ్రెష్, రెన్యువల్కు సంబంధించిన దరఖాస్తులు, డబ్లుసీడీ, సీఎస్ నుంచి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ మానిటరింగ్ సిస్టం దరఖాస్తులు మీసేవలోకి నూతనంగా అందుబాటులోకి వచ్చాయి. అప్లికేషన్ కాగితాలతో ఇకపై కార్యాలయాలకు వెళ్లకుండా మీసేవలోనే దరఖాస్తు చేసి మీసేవ ద్వారానే నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో మరిన్సి కొత్త సర్వీస్లు.. కులం అనేది ఎప్పటికీ మారదు కాబట్టి ఒకసారి తహసీల్దార్ కులం నిర్ధారణ సర్టిఫికెట్ మంజూరుచేస్తే దాని ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నిసార్లు అయిన దరఖాస్తుదారుడు కుల ధృవీకరణ పత్రాన్ని రెండు నిమిషాలలో పొందే అవకాశాన్ని మీసేవలో నూతనంగా కల్పించనున్నారు. హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్, నాన్ అగ్రికల్చర్ మార్కెట్ వాల్యు సర్టిఫికెట్, పాన్ కార్డ్లో చేర్పులు మార్పులు, ఇసుక బుకింగ్ సేవలు మీసేవలో అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా మరో 9 రకాల సేవలు కాగిత రహిత పాలనకు ప్రభుత్వం కృషిప్రజలకు మెరుగైన సేవలు.. జిల్లాలోని 54 మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. 2011లో 10 రకాల సేవలతో ప్రారంభమైన ఈ కేంద్రాలు ప్రస్తుతం 350 రకాల సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో 9 రకాల సేవలు అందుబాటులోకి రాగా మరో ఐదు రకాల సేవలను మీసేవలో పొందుపరిచారు. మీ సేవ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – దేవేందర్, ఈ–డిస్ట్రిక్ మేనేజర్, ములుగు -
వడ్డీ బకాయిల విడుదల
గీసుకొండ: బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకున్న సెర్ప్ పొదుపు సంఘాల మహిళలకు రెండు నెలల వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళల అభ్యున్నతికి పలు కార్యక్రమాలను చేపడుతుండగా తాజాగా వడ్డీ బకాయిల చెల్లింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు వడ్డీ బకాయిలను ప్రభుత్వం ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సకాలంలో వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందులు పడ్డారు. 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల వడ్డీ నిధులు మంజూరు చేయలేదు. విడుతల వారీగా చెల్లింపులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2023–24 సంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల బకాయిలను కొన్ని నెలల క్రితం విడుదల చేసింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు పది నెలల వడ్డీ బకాయిలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 48,717 సంఘాలకు రూ.92.74 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అలాగే, ఇటీవల ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు సంబంధించి ఎస్హెచ్జీలు 50,372 ఉండగా వారికి వడ్డీ కింద రూ.20.27 కోట్లను మంజూరు చేయడంతో పొదుపు సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికి ఊతం.. మహిళా సంఘాల్లోని సభ్యులు బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న వడ్డీ లేని రుణాల(వీఎల్ఆర్)తో ఆర్థికంగా ఎదగటంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పలువురు చిన్న తరహా పరిశ్రమలు, యూనిట్లను నెలకొల్పుతున్నారు. క్యాంటీన్ల ఏర్పాటు, పెరటికోళ్ల పెంపకం, గేదెల పోషణ, కిరాణం, క్లాత్స్టోర్లు, టైలరింగ్, సానిటరీ న్యాప్కిన్ల తయారీ తదితరాలను ఎంచుకుని ఆదాయం పొందుతూ చిన్నపాటి పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. అలాటి వారికి వడ్డీ బకాయిలను సకాలంలో అందిస్తే మరింత ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం గీసుకొండ ప్రగతి మండల సమాఖ్య వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రత్యేక మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సంఘాల వారు ఆర్టిఫీషియల్ జ్యూయలరీ, పౌల్ట్రీ, డైరీ తదితర రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పాత బకాయిల చెల్లింపు ఊసేలేదు.. ఇది ఇలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు అలాగే పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాం నుంచి వడ్డీ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తూ వస్తోంది. అయితే గత బీఆర్ఎస్ సర్కారు కాలంలో పేరుకుపోయిన భారీ మొత్తంలోని బకాయిల గురించి ఎవరూ ఊసెత్తడం లేదు. అటు అధికారులు, ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో అయోమయం నెలకొంది.ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు విడుదలైన వడ్డీ బకాయిలు ఎస్హెచ్జీలకు రెండు నెలల వడ్డీని మంజూరు చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 50,372 సంఘాలు రూ.20.27 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమజిల్లా పేరు లబ్ధిపొందిన వచ్చిన మొత్తం సంఘాలు (రూ.కోట్లలో) వరంగల్ 9,669 4.32 హనుమకొండ 8,600 3.86 జనగామ 9,216 3.41 మహబూబాబాద్ 11,552 4.51 ములుగు 5,308 1.92 జయశంకర్ భూపాలపల్లి 6,027 2.25 -
చెస్తో మేధస్సు పెంపొందుతుంది
భూపాలపల్లి అర్బన్: చెస్ ఆడటం వలన మేధస్సు పెంపొంది సహనం, ఓర్పు వస్తుందని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెస్ పోటీలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి ప్రకాశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడారు. చెస్ క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పంతకాని సమ్మయ్య, రవిపటేల్, మహేష్, ఆసిఫ్, మురళి, ప్రకాశ్, శ్రీరాములు, రామనారాయణ పాల్గొన్నారు. -
పులకించిన హేమాచల క్షేత్రం
మంగపేట : మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రం ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సుదూర ప్రాంతాల నుంచి స్వయంభూ లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో హేమాచలక్షేత్రం పులకించింది. ఆది, సోమవారాలు రెండు రోజులు సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఏజెన్సీలోని లక్నవరం, బొగత తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రామప్ప, మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు వాహనాల్లో భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో సహజ సిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిల తైలాభిషేకం పూజలు జరిపించి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి కై ంకర్యాదులు నిర్వహించారు. మూడు గంటల పాటు వేచి ఉండి మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభూ స్వామవారి అభిషేక పూజలో పాల్గొని ఆలయ చరిత్ర, స్వామివారి ప్రత్యేకతను తెలుసుకుని పులకించారు. అనంతరం సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చిన దంపతులతో పాటు స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు. భక్తుల గోత్రనామాలతో పూజారులు ప్రత్యేక అర్చనలు జరిపించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వాచ్టవర్ పైనుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోని కనుచూపు మేర కనిపించే అందమైన ప్రకృతి అందాలను వీక్షించి సెల్ఫీలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు -
భద్రకాళికి ఆలయంలో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, కన్స్ట్రక్షన్ రైల్వే సేఫ్టీ ప్రాజెక్ట్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏకే సిన్హా దంపతులు, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ డి.సుబ్రమణియన్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈఓ శేషుభారతి వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాలయ ప్రాంగణంలో ఈఓ శేషుభారతి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ధర్మకర్తలు నార్ల సుగుణ, జారతి వెంకటేశ్వర్లు, తొగరు క్రాంతి, దేవాలయ సిబ్బంది హరినాఽథ్, కృష్ణ, నవీన్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదిలోపే బదిలీలు!
కాజీపేట అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల తర్వాత బదిలీ అవుతారు. కానీ, ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని అధికారులను ఏడాదిలోపే బదిలీలు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్లాట్ బుకింగ్, పారదర్శక సేవలకు ఈ–సైన్తో రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై పర్యవేక్షణ కొనసాగించే జిల్లా రిజిస్ట్రార్లకు ఏడాదిలోపే స్థానచలనం కల్పించింది. పదోన్నతులకు బ్రేక్.. జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతులు కల్పించడంలో జాప్యం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా జిల్లా రిజిస్ట్రార్ స్థానంలో అధికారులు లేకపోవడంతో ఇన్చార్జ్లతోనే పాలన కొనసాగుతోంది. కాగా, ఒక్కో జిల్లా రిజిస్ట్రార్ రెండు మూడు కార్యాలయాలకు పనిచేయాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో బదిలీ అయిన ఫణీందర్ హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్గా ఆఫీస్ డ్యూటీలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా, కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. సీనియార్టీ ప్రకారం తమకు పదోన్నతి కల్పించాలని గతంలో విధులు నిర్వర్తించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు, వివిధ జిల్లాలకు చెందిన గ్రూప్–1 అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పదోన్నతులకు బ్రేక్ పడింది. త్వరలో సబ్ రిజిస్ట్రార్ల బదిలీ! ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతేడాది ఆగస్టులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అటెండర్ స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీలు అయ్యారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాధ్యతలను స్వీకరించి లాంగ్ లీవ్లోకి వెళ్లిపోయిన సబ్ రిజిస్ట్రార్లు, సహాయ రిజిస్ట్రార్ చిట్స్లు అనగా స్టేషన్ఘన్పూర్, వరంగల్ ఆర్వో చిట్స్ కార్యాలయంలోని అధికారులతోపాటు వరంగల్ ఆర్వోకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు సైతం స్థానచలనంలో భాగంగా నేడో రేపో బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, మేరా నంబర్ ఆయేగా అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చర్చించుకోవడం గమనార్హం. డేంజర్ జోన్లకు వెళ్లేందుకు జంకుతున్న సబ్ రిజిస్ట్రార్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్తోపాటు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు డేంజర్ జోన్లుగా మారిపోయాయి. ట్రాన్స్ఫర్ ఓకే కాని డేంజర్ జోన్లకు వద్దు అంటూ తలలు పట్టుకుంటున్నారు సబ్ రిజిస్ట్రార్లు. పదోన్నతులు లేక ఇన్చార్జ్లతోనే పాలన నేడో రేపో సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం -
మొన్న జలకళ.. నేడు వెలవెల
వాజేడు మండలంలో మొన్న జలకళను సతరించుకున్న గోదావరి ఆదివారం వెలవెలబోయింది. జూలై 10నుంచి 12వరకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో కళకళలాడింది. పలుచోట్ల రహదారులను వదర ముంచెత్తింది. ప్రస్తుతం ఎగువన వర్షాలు లేకపోవడంతో ఆదివారం గోదావరి చిన్న కాలువలా ప్రవహించింది. – వాజేడుమండల పరిధిలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రభుత్వ సెలవు కావడంతో పర్యాటకులు భారీసంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలు చూసి ఫిదా అయ్యారు. – వాజేడుపర్యాటకుల సందడి -
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్–01, భౌతికశాస్త్రం–01 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని సూచించారు. పీహెచ్డీ, నెట్, సెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం కలిగి ఉండాలని అన్నారు. ఈ నెల 23న కళాశాలలో బయోడేటా సమర్పించి డెమో, ఇంటర్వ్యూ, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయండి మలుగు రూరల్ : ఈ నెల 23న విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యాసంస్థల బంద్ను చేపట్టినట్లు తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు భరత్, సాయి పాల్గొన్నారు. వాహనాల తనిఖీ వెంకటాపురం(కె) : మండల పరిధిలోని బోదాపురం గ్రామశివారులో ఆదివారం ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. మండల కేంద్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వచ్చి వెళ్లే వాహనాలు, వాజేడు మండలం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా తారస పడితే వారి నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నారు. తనిఖీల్లో పీఎస్సై సాయికృష్ణ, సీఆర్పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు పాల్గొన్నారు. సూరవీడులో బోనాల వేడుకలు .. వెంకటాపురం(కె) : మండల పరిధిలోని సూరవీడు గ్రామంలో ఆషాఢమాసంలో భాగంగా ఆదివారం బోనాల వేడుకలు గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ఉదయం నుంచే ఉపావాసం ఉండి గ్రామదేవతలకు బోనాలు వండుకొని మేళతాళాలు, డప్పువాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ముత్యాలమ్మ తల్లికి బోనాలను సమర్పించి తమ మొక్కులను సమర్పించుకున్నారు. గ్రామంలో పాడి పంటలు బాగుండాలని గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పిల్లల జయసింహా, పిల్లల లీలారాణి, కిరణ్, ఈశ్వర్ తదితరులు ఉన్నారు. 23 నుంచి కేయూ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసింఇక్బాల్ తెలిపారు. ఈనెల 23, 25, 28, 30, ఆగస్టు ఒకటి, నాలుగో తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 25న మంద కృష్ణమాదిగ రాక చిట్యాల: దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈనెల 25న జిల్లాకేంద్రంలో జరిగే సమావేశానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ రానున్నట్లు ఎమ్మార్పీస్ జిల్లా ఇన్చార్జ్ రుద్రారం రామచంద్ర మాదిగ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పరిశీలన.. పర్యవేక్షణ
వినతుల వెల్లువకాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో కేంద్రమంత్రులు ● పలు విభాగాలను తిరుగుతూ పనుల పురోగతిపై ఆరా ● పనులు సంతృప్తికరమన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ● 40 ఏళ్ల కల నెరవేరుతోందన్న మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ● కాజీపేటలో మంత్రులకు ఘనస్వాగతం.. కిక్కిరిసిన జంక్షన్ కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిలు శనివారం పరిశీలించారు. యూనిట్లోని పలు విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ వారి పర్యటన సాగింది. పలు విభాగా ల్లో పనుల పురోగతిపై కేంద్రమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదినాటికి యూనిట్ నుంచి మా న్యుఫ్యాక్చరింగ్ ప్రారంభమవుతుందని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వరంగల్ జిల్లావాసుల 40 ఏళ్ల సాకారమవుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ముందుగా ప్రత్యేక రైలులో కాజీపేట జంక్షన్కు చేరుకున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, రైల్వేస్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.సంతోష్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎంపీ సీతా రాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మారావు, అరూరి రమేశ్ ఘనస్వాగతం పలికారు. రోడ్డుమార్గంలో అయోధ్యపురం యూనిట్కు.. కాజీపేట జంక్షన్ నుంచి కేంద్రమంత్రులు నేరుగా రోడ్డుమార్గంలో అయోధ్యపురంలోని యూనిట్కు చేరుకున్నారు. మొదట మంత్రులు రైల్వే యూనిట్ లే అవుట్ రూంకు వెళ్లి లే అవుట్ను పరిశీలించారు. అనంతరం కాన్ఫరెన్స్హాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైల్వే యూనిట్ పనుల పురోగతి, కెపాసిటీని స్థానిక రైల్వే అధికారులు వివరించారు. తర్వాత వాహనాలపై రైల్వే యూనిట్ నిర్మాణ షాపులు, ట్రాక్లను తనిఖీ చేసుకుంటూ మెయిన్ షాప్ సమీపానికి చేరుకున్నారు. అక్కడినుంచి షెడ్లను తనిఖీ చేశారు. కార్మికులతో మాటామంతి.. యూనిట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి మాట్లాడారు. పనులు ఎలా సాగుతున్నాయని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఓ కార్మికుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం గుండా రైల్వే యూనిట్ సమీపంలో గల అయోధ్యపురం రైల్వే గేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక రైలులో మంత్రులు హైదరాబాద్కు తరలివెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్రావు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, చాడా శ్రీనివాస్రెడ్డి, రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ, డీఆర్ఎం భర్షీష్కుమార్ జైన్, సీఎంపీఈసీ మధుసూదన్రావు, సీని యర్ డీఎస్టీఈ ప్రియా అగర్వాల్, సీసీఓఎం పద్మజ, సీనియర్ డీసీఎం షిఫాలి, ఆర్వీఎన్ఎల్ ఎలక్ట్రికల్ జీఎం ఆనంద్ చెక్కిల, ఈఎం మెకానికల్ వంశీ, సీపీఎం సాయిప్రసాద్, పీఈడీ మెకానికల్ మనీష్అగర్వాల్, సీపీఆర్వో ఎ.శ్రీధర్ పాల్గొన్నారు. గంట ఆలస్యంగా పర్యటన.. కేంద్ర మంత్రులు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు రావాల్సి ఉంది. కానీ, గంట ఆలస్యంగా 2:40 గంటలకు కాజీపేటకు చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. మంత్రులు రాగానే వారిని కలిసేందుకు పోటీపడగా స్వల్ప తోపులాట జరిగింది. పుష్పగుచ్ఛాలు కిందపడ్డాయి. తాము మంత్రులను కలవలేకపోయామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే యూనిట్లో పనులను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, చిత్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, నాయకులు ధర్మారావు, ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ తదితరులు– 8లోu -
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
సాధారణంగా పుట్టిన రోజు వేడుకలు ఏడాదికోసారి జరుపుకుంటుంటాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలు పుట్టిన మరుసటి నెల నుంచే పుట్టిన రోజున సంబురాలు మొదలు పెడుతున్నారు. తొలిఏడాదిలో నెలకో థీమ్తో పిల్లలను వినూత్నంగా అలంకరిస్తున్నారు. కొత్త బట్టలు వేసి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. కేక్ కట్ చేస్తున్నారు. వాటన్నింటినీ 12 నెలలయ్యాక ఒక చోట చేర్చి ఫొటోఫ్రేమ్లు కట్టిస్తున్నారు. వీడియోలు మిక్సింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బర్త్ డే వేడుకల వేళ వాటన్నింటినీ బంధువుల ఎదుట ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వచ్చిన లైకులు, కామెంట్లకు తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఈనేపథ్యంలో నయా బర్త్డే సెలబ్రేషన్స్పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – 8లోuభూపాలపల్లి అర్బన్: పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. మా బాబు పుట్టి శనివారంతో నెల రోజులు. అప్పటికప్పుడు ద్రాక్ష పళ్లతో అలంకరించి వేడుకలు జరుపుకున్నాం. ప్రతీ నెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, సరుకులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు దింపుకునేలా ప్లాన్ చేసుకున్నాం. బాబు పెద్దయ్యాక ఈ ఫొటోలు చూసి మురిసిపోతాడు. – తోనగర్ శిరీష, చెల్పూరు, గణపురంకాజీపేట: బర్త్ డే జరుపుకోవడానికి వన్ ఇయర్ వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెల నెలా ఒక్కో థీమ్తో మా బాబును రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే బాబు కూడా సంబురపడతాడు. ఒకప్పుడంటే కెమెరామెన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి సోషల్ మీడియాలో పెడితే చాలా లైక్లు, కామెంట్లు వస్తున్నాయి. ఆనందంగా ఉంది. – నిత్యశ్రీ, కాజీపేట నర్సంపేట: కన్నబిడ్డ ఎదుగుదలను ఫొటోల్లో బంధించడం ఓ మధురానుభూతి. ప్రతి నెల బాబు పుట్టిన రోజును ఓ వేడుకలా నిర్వహించుకుంటున్నాం. ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్ధం జరిగిన రోజే మా బాబు కాసర్ల విహాన్ రామానుజన్రెడ్డి ఆరో నెల బర్త్డే జరిగింది. దీనికి గుర్తుగా ఇండియా ఫ్లాగ్, గన్ చూపుతూ చేసిన వేడుక మర్చిపోలేం. – కాసర్ల కావ్య, నర్సంపేట జనగామ: ఏడాదికి ఒక్కసారి బర్త్ డే నుంచి.. నెలనెలా వేడుకలు జరుపుకునే ట్రెండ్ కొనసాగుతోంది. మాకు ఒక కూతురు. 3 నెలల బాబు ఆదినందన్ ఉన్నారు. పుట్టగానే 21వ రోజు.. 50.. 100వ రోజుతో పాటు నెలనెలా కొత్త బట్టలతో అలంకరించి కేక్ కట్ చేస్తున్నాం. బిడ్డ జీవితంలో ఈ ఘట్టం మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రతీ నెల ఫొటోలను భద్రంగా ఉంచుతూ.. ఏడాది జన్మదిన వేడుకల్లో వీటిని ప్రదర్శిస్తాం. సాక్షి, మహబూబాబాద్: మా గారాల పట్టి మోజేస్ పాల్ (జాక్) ఈ ఏడాది ఫిబ్రవరి 28న పుట్టారు. ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రతీనెల 28వ తేదీ వచ్చిందంటే సాయంత్రం అంతా సందడే.. పిల్లలు, పెద్దలతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ నెల పిల్ల వాడు పెరిగిన తీరును చూసుకుంటూ.. సంతోష పడతాం.. ఇలా ఇప్పటి వరకు నాలుగు నెలలు గడిచాయి.. ప్రతీ నెల ఫొటోలు తీసి జాగ్రత్తగా ఉంచుతున్నాం. మొదటి పుట్టిన రోజు సమయంలో ప్రతీ నెల తీసిన ఫొటోలు వరుస క్రమంలో పెట్టి ఫ్లెక్సీ తయారు చేస్తాం.. – దామెర స్వరూప్, ప్రీతి, మహబూబాబాద్ పెద్దయ్యాక చూసి మురిసిపోతారు..న్యూస్రీల్కలకాలం గుర్తుండాలని..ప్రతిక్షణం ఓ తీపి గుర్తే..ప్రతీ నెల పండుగే..– ఉప్పల వీరవెంకట్, పద్మ, జనగామ -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ నాగఫణిశర్మ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారికి వేద మంత్రోచ్ఛారణతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. కార్లు, ఆటోలు, డీసీఎంలలో కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో నిత్యం కొనసాగే ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. పలువురు చెట్లకింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనం చేసి తిరుగు ప్రయానమయ్యారు. భక్తులకు ఆశీర్వచనం ఇస్తున్న పూజారి -
పేదలందరికీ రేషన్ కార్డులు
వాజేడు/వెంకటాపురం(కె): అర్హత కలిగిన ప్రతీ పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. వాజేడు, వెంకటాపురం(కె) మండల కేంద్రాల్లో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్జీతో కలిసి నూతన రేషన్కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కరేషన్ కార్డును ఇవ్వలేదని విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా అటవీ శాఖ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ అధికారి సయ్యద్ షపుద్దీన్ హుస్సేన్, డీఎం రాంపతి, సొసైటీ అధ్యక్షుడు అంజయ్య, తహసీల్దార్లు శ్రీనివాస్, వేణుగోపాల్, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ నాయుడు, నాయకులు విక్రాంత్, ఆదినారాయణ, మన్నెం సునీల్, చిడెం శివ, సయ్యద్ హుస్సెన్, చిట్టెం సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు -
రశీదు తీసుకోవాలి
ములుగు రూరల్ : విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసిన రైతులు తప్పని సరిగా రశీదు తీసుకోవాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ సూచించారు. శనివారం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాల బారిన పడినప్పుడు రైతులకు ఉచిత న్యాయం పొందే విధానాన్ని వివరించారు. రైతులు పురుగు మందులు కొనుగోలు విషయంలో గడువు తేదీలను పరిశీలించి కొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్, మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, శ్రీధర్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ములుగు రూరల్ : ములుగు మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీకి అర్హత ఉన్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ శాఖ అధికారి సర్దార్సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో (5), 6వ తరగతిలో (3), 7వ తరగతిలో(3), 9వ తరగతిలో (3) ఖాళీ సీట్లకు ఓసీ, బీసీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 25వతేదీలోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 79950 57915 నంబర్లో సంప్రదించాలన్నారు.లీగల్ కౌన్సిలర్ పోస్టుకు.. ములుగు రూరల్ : లీగల్ కౌన్సిలర్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సఖి కేంద్రం సీఈఓ సాల్మన్రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఇన్ లా, లీగల్ ట్రెయినింగ్ లా చేసిన మహిళ, పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. మహిళల సమస్యలపై ప్రభుత్వ, ప్రభుత్వేతర ప్రాజెక్టుల్లో మూడేళ్ల అనుభవం, పారా లీగల్ ట్రెయినింగ్ చట్టాలపై రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రేపటినుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని సఖి కార్యాలయంలో అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు 88862 67008, 70137 45008, 08715–295181 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ‘స్థానికం’లో సత్తా చాటాలి ములుగు రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియామకం కన్నాయిగూడెం : జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కన్నాయిగూడెం మండల కేంద్రానికి చెందిన తాడూరి శ్రీధర్ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బద్దిపడగల శ్రీనివాస్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ..తన ఎన్నికకు సహకరించిన జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘తాత్కాలిక నోటిఫికేషన్పై పునరాలోచించాలి’ ములుగు రూరల్: డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వం విడుదల చేసిన తాత్కాలిక నోటిఫికేషన్పై పునరాలోచించాలని అతిథి అధ్యాపక సంఘం జిల్లా నాయకుడు తేజావత్ శ్రీను కోరారు. పాత పద్ధతిలో పనిచేస్తున్న 1,940 మంది డిగ్రీ అధ్యాపకులను కొనసాగించకుండా తాత్కాలిక నోటిఫికేషన్ విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అతిథి అధ్యాపకులకు గౌరవ వేతనం రూ.50వేలు ఇస్తామని చెప్పి పాత వేతనాన్నే ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం తాత్కాలిక నోటిఫికేషన్ పై పునరాలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మౌలనా, రమేష్, మున్ని తదితరులు ఉన్నారు. -
కేంద్రమంత్రుల షెడ్యూల్..
● శంకర్పల్లి రైల్వే స్టేషన్నుంచి ఎంఆర్ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయలుదేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. ● 01:30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి 01:45 గంటలకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు చేరుకుంటారు. ● 02:45 గంటల వరకు యూనిట్ను విజిట్ చేస్తారు. ● అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి కాజీపేట రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. ● 05:30 గంటలకు ఎంఆర్ ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. -
నిరుపయోగంగా బ్యాటరీ వెహికిల్స్
వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ప్రతిరోజు పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా దివ్యాంగులు, వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు. శని, ఆదివారం భక్తులు, విద్యార్థులు, పర్యాటకులు వేలాది సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. రామప్ప ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్లు లేకపోవడంతో ఆలయ ప్రధాన గేటునుంచి రామప్ప ఆలయం వద్దకు నడిచి వెళ్లడానికి, ఆలయ మెట్టు ఎక్కే సమయంలో నానా తంటాలు పడుతున్నారు. రామప్పలో బ్యాటరీ వెహికిల్స్ రెండు ఉన్నప్పటికీ వాటిని వీఐపీలు వచ్చినపుడే వినియోగిస్తూ తర్వాత మూలన పడేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్కు చెందిన గోలి సావిత్రి అనే దివ్యాంగురాలు రామప్ప సందర్శనకు వచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురైంది. దివ్యాంగులు, వృద్ధులకు వీల్చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్న విలేకరులకు తమ గోడును వెల్లబోసుకుంది. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వీఐపీలు వచ్చినప్పుడే కాకుండా వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించి, వారికి ప్రత్యేక దర్శనం కల్పించాలని సావిత్రితోపాటు పలువురు పర్యాటకులు కోరుతున్నారు. రామప్పకు వీఐపీలు వచ్చినప్పుడే వినియోగం దివ్యాంగులు, వృద్ధులకు తప్పని తిప్పలు -
విద్యార్థుల భవిష్యత్కు పునాదులు వేయాలి
ములుగు రూరల్: గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్కు ఉపాధ్యాయులు పునాదులు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు, సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆమె మాట్లాడారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు, విద్య, నాణ్యమైన భోజనం అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై ఆర్బీఎస్కే బృందాలు సందర్శించి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరిశుభ్రత పాటించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిందండ్రులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటా.. వెంకటాపురం(ఎం): ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని జవహర్నగర్, లక్ష్మీదేవిపేట, అడవిరంగాపూర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. జవహర్నగర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.కోటి 25లక్షలతో ఏర్పాటు చేసిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలను ప్రారంభించారు. లక్ష్మీదేవిపేటలో రేషన్కార్డులు పంపిణీ, పాఠశాలలో రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బుర్గుపేట పరిధిలోని మారెడుగొండ చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. అడవిరంగాపూర్ గ్రామంలో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న 33/11 విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం.. గోవిందరావుపేట: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంట ఆయిల్ పామ్ అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని చల్వాయిలో ఆయిల్పామ్ పంట సాగు చేస్తున్న రైతులకు చెక్కులు పంపిణీ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. జంగాలపల్లి సమీపంలో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో 70 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు హర్షించదగ్గ విషయమని, ఐదు ఎకరాల్లో సాగు చేసిన రైతు బండమీది కుమారస్వామిని అభినందించారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కొత్తగా 246 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్తో కలిసి మంత్రి సీత క్క మొక్కలు నాటారు. లబ్ధిదారులకు రేషన్ కార్డు మంజూరు పత్రాలను సీతక్క అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ మహేందర్జీ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీసీఎస్ఓ షాఫైజల్ హుస్సేన్, డీఎం రాంపతి, ఎస్ఈ మన్సూర్ నాయక్, డీఈ నాగేశ్వర్రావు, ఇరిగేషన్ ఈఈ జగదీశ్వర్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, నాయకులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క -
కొత్త కార్డులొచ్చాయ్..
వెంకటాపురం(ఎం): ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేద ప్రజలకు ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాలు ఉండగా 222 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వం నూతన రేషన్కార్డుల కోసం దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది అప్లికేషన్ చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 6,207 రేషన్ కార్డులను నూతనంగా మంజూరు చేశారు. ఈనెల 14న సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నూతన కార్డులను లబ్ధిదారులకు అందించగా, శుక్రవారం వెంకటాపురం(ఎం) మండలంలోని లక్ష్మీదేవిపేట, గోవిందరావుపేట మండలంలో రాష్ట్రపంచాయితీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క లబ్ధిదారులకు కొత్తకార్డులను అందజేశారు. పేదలకు అందనున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకోవడం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు రేషన్కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు అనేకమంది దూరమయ్యారు. ఈక్రమంలో ప్రస్తుతం నూతన కార్డుల జారీతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 97,634 రేషన్కార్డులు ఉండగా.. వాటిలో 20,609 మందిని కుటుంబసభ్యులను నూతనంగా చేర్చారు. దీంతోపాటు 6,207 కొత్తకార్డులు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతోపాటు మహాలక్ష్మి పథకంలో రూ.500 కే అందించే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను పొందనున్నారు. నిరీక్షణకు తెర.. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోయినట్లు ప్రజలు పేర్కొంటున్నారు. కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వాలు అందించే పథకాలన్నింటికీ రేషన్కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో వేలాదిమంది కార్డులు లేక పథకాలకు దూరమయ్యారు. రేషన్ బియ్యంతోపాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా అందుకోలేకపోయారు. పలుమార్లు మీసేవలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కార్డు మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025 జనవరి 26న ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని పైలెట్గా ఎంపిక చేసి అర్హులైన పేదలకు రేషన్ కార్డులను మంజూరు చేసింది. తాజాగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి విచారణ చేపట్టి అర్హులైన వారందరికీ కార్డులు అందజేస్తున్నారు. అయితే మూడు నెలల రేషన్ కోటా ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో కొత్తవారికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం అందే అవకాశం ఉంది.జిల్లాలో 6,207 రేషన్కార్డులు మంజూరు సెప్టెంబర్ నుంచి బియ్యం సరఫరా పేదలకు అందనున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులుఅర్హులందరికీ కార్డులు అందిస్తాం జిల్లాలో అర్హులైన ప్రతికుటుంబానికి రేషన్ కార్డు అందిస్తాం. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ. జిల్లాలో 6,207 రేషన్కార్డులు కొత్తగా మంజూరయ్యాయి. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం. – దివాకర టీఎస్, కలెక్టర్ రేషన్కార్డు పేదల హక్కు రేషన్కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందించి వారి కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పేద కుటుంబానికి రేషన్కార్డు అందిస్తాం. రేషన్ కార్డు పొందడం పేదల హక్కు. జిల్లాలో 222 రేషన్ షాపుల ద్వారా పేదలకు మూడునెలల సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి అందించింది. సన్నబియ్యం పంపిణీతో పేదలు సంతోషంగా ఉన్నారు. – సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
వెంకటాపురం(కె): అడవులను సంరక్షించడం అందరి బాధ్యత అని సీసీఎఫ్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలో ని తిప్పాపురం, ఆలుబాక అటవీ భూములను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో వెంకటాపురం, వాజేడు మండలాల అటవీశాఖ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. వన మహోత్సవంలో భాగంగా కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీఓ ద్వాలియా, సెక్షన్ అఫీసర్ దేవయ్య, అటవీ సిబ్బంది తదితరులు ఉన్నారు. గోదాం తనిఖీ వెంకటాపురం(కె): మండ కేంద్రంలోని జీసీసీ గోదాంను శుక్రవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఇటీవల జీసీసీ గోదాంలో 243 క్వింటాల బియ్యం మాయంపై ములుగు సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేసి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గోదాంలో నిల్వ ఉన్న స్టాక్ను పరిశీలించి ఎన్ని క్వింటాల బియ్యం మాయమయ్యాయి.. ఎలా జరిగిందనే అంశాలపై విచారణ చేశారు. ఇదిలా ఉండగా.. వివరాలు వెల్లడించేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిరాకరించడం గమనార్హం. 28న అరుణాచలం బస్సు సర్వీస్ ప్రారంభం భూపాలపల్లి అర్బన్: ఈ నెల 28న అరుణాచలం, ఇతర తీర్థయాత్రల ఆర్టీసీ బస్సు సర్వీస్ భూపాలపల్లి డిపో నుంచి బయలుదేరి వెళ్లనున్నట్లు ఆర్టీసీ డీఎం ఇందు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కాంచీపురం, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రత్యేక బస్సు నడిపించనున్నట్లు తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధర ఒక్కరికి రూ.5,300 ఉంటుందని తెలిపారు. సీటు బుకింగ్ కోసం 97019 67519, 88017 78959 నంబర్లకు ఫోన్చేయాలని సూచించారు. ఆగస్టు నెలలో వారానికి ఒకటి చొప్పున టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా విజయవాడ, అన్నవరం, భద్రాచలం, పంచారామాలు, షిరిడీ వంటి ప్రముఖ యాత్ర స్థలాలు ఉంటాయన్నారు. 30మంది ప్రయాణికులు ఉన్నట్లయితే వారికోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుంచి తపాలా సేవలు బంద్ ఖిలా వరంగల్: ఈనెల 22 నుంచి తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా నూతన సాఫ్ట్వేర్ అమలు చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ సేవలు నిలిపివేయనున్నట్లు వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరవుతారని, సేవలు మాత్రం కొనసాగవని చెప్పారు. వినియోగదారులు, ఖాతాదారులు ఈవిషయం గమనించి సహకరించాలని ఆయన కోరారు. ప్రీ పీహెచ్డీ పరీక్ష ఫీజు చెల్లించాలికేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యూకేషన్, లా, ఫార్మాస్యూటికల్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగాల పరిశోధకులు ప్రీ పీహెచ్డీ పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ను శుక్రవారం పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సౌజన్య జారీ చేశారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 30వ తేదీ వరకు, రూ.250 అపరాధ రుసుంతో ఆగస్టు 7వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఫీజు రూ.930 చెల్లించాల్సింటుందని తెలిపారు. -
ప్రభుత్వాలు జీఓ 49 రద్దు చేయాలి
కన్నాయిగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీఓ 49 రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధికార ప్రతినిధి పొడెం బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గుండ్ల పాపారావు అధ్యక్షతన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆదివాసీల అత్యవసర సమావేశంలో పొడెం బాబు మాట్లాడారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న జీఓ నంబర్ 49 రద్దు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తూ అటవీ సంపదను దోచుకుపోవడానికి చూస్తున్నాయని ఆరోపించారు. ఈ జీఓతో ఆది వాసీలకు అన్యాయం జరుగుతుందని, ఆదిలాబాద్ , జగిత్యాల, పెద్దపల్లి, అసీఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెంతోపాటు మరో కొన్ని ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించొద్దంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి నిలిపివేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మురళి, ఆలం రాంబాబు, సంపత్, పొడెం శోభన్, ఆలం కుమార్, బొగ్గం బాబు పాల్గొన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధికారప్రతినిధి బాబు -
ఉపాధి అవకాశాలపై ఆశలు
కాజీపేట రూరల్: రైల్వే కోచ్ఫ్యాక్టరీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కార్యరూపం దాల్చిన కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం 80శాతం పూర్తికావొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో స్థానిక యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోపాటు మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. శనివారం రైల్వే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను సందర్శించనున్నారు. వ్యాగన్షెడ్ టు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్.. కాజీపేట మండలం అయోధ్యపురంలో 160 ఎకరా ల్లో సుమారు రూ.786 కోట్లతో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేపట్టారు. 2023 జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో నుంచి కాజీపేట వ్యాగన్షెడ్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాజీపేట రైల్వే మల్టీపుల్ యూనిట్గా ప్రకటన చేసి మంజూరు చేశారు. రీ డిజైనింగ్ చేసి జపాన్ టెక్నాలజీతో మల్టీపుల్ యూనిట్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో వ్యాగన్, కోచ్, వందేభారత్, ఎల్హెచ్బీ, మెము కోచ్లు తయారు చేస్తారు. 80శాతం పూర్తయిన విభాగాలు.. యూనిట్లోని మెయిన్షాప్, పెయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్టు, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్/పంప్హౌస్, టాయిలెట్ బ్లాక్స్, ప్యాకేజీ సబ్స్టేషన్, షవర్ టెస్ట్, రోడ్వే బ్రిడ్జి, పంప్హౌస్/జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్ట్/ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, పాండ్, (2000 కేఎల్ కెపాసి టీ), స్క్రాప్ బిన్స్ పనులు 80శాతం పూర్తయ్యాయి. పెండింగ్ పనులు.. రైల్వే కార్మికుల కోసం క్వార్టర్స్ నిర్మాణం, కోచ్ల తయారీకి షెడ్లలో మిషనరీ ఫిట్టింగ్, కనెక్టివిటీ రోడ్లు, ఎంట్రెన్స్ వద్ద రైల్వే వంతెన నిర్మాణం, ఇతరత్ర సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ జరగాల్సి ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చిలో యూనిట్ను ప్రారంభిస్తామని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. వీటిపై దృష్టిపెట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పంజాబ్ మాదిరి ఉద్యోగ అవకాశాలు కాజీపేటలోని కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించనుంది. అయితే ఈ ఉద్యోగాలు ఉమ్మడి జిల్లావాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యేక జీఓ తీసి అక్కడి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అదేమాదిరిగా ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దీనిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అయోధ్యపురంలో రైల్వే యూనిట్కు 112మంది 160 ఎకరాల భూమి ఇచ్చారు. ఇద్దరు ఇళ్లు కోల్పోయారు. మొత్తం 114మంది నిర్వాసితులు ఉండగా ప్రభుత్వం ఎకరాకు రూ.8లక్షలు చెల్లించింది. ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రూ.33 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ.8 లక్షలు రైతుకు ఇచ్చి, రూ.25లక్షలు దేవాదాయశాఖ (ఈ భూమి దేవాదాయశాఖకు సంబంధించింది)కు ఇచ్చారు. 8మంది రైతుల భూమి సీలింగ్ ల్యాండ్ అని నష్టపరిహారం నిలిపివేశారు. ఇప్పటివరకు వారికి రాలేదు. కోట్ల రూపాయల విలువైన భూమి కోల్పోయామని, రైల్వే యూనిట్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చి రైల్వేశాఖ ఆదుకోవాలని రైతులు కేంద్రమంత్రులను కోరుతున్నారు. రైల్వే మంత్రి దృష్టికి కాజీపేట డివిజన్ ప్రస్తావన.. రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ దృష్టికి ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్తామని స్థానిక రైల్వే నాయకులు తెలిపారు. అదేవిధంగా టౌన్ స్టేషన్ అభివృద్ధి, ఫాతిమానగర్లో ట్రైయాంగిల్ స్టేషన్ నిర్మాణం, కాజీపేట రైల్వే ఆస్పత్రి సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్గ్రేడ్, కాజీపేట రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ఫాంల నిర్మాణం, అన్ని హంగులతో కూడిన రైల్వే క్లబ్ (ఇన్స్టిట్యూట్) భవనం, బెజవాడ తరహాలో రైల్వే ఎలక్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.చివరి దశకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు నెరవేరుతున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నేడు యూనిట్ను విజిట్ చేయనున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొందరు రైతులకు అందని భూ పరిహారం.. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేనా..? వీటిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ కాజీపేట డివిజన్ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని రైల్వే నాయకుల నిర్ణయం -
పారిశుద్ధ్య పనులు బాధ్యతగా చేపట్టాలి
ములుగు రూరల్: మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులను బాధ్యతగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ప్రేమ్నగర్లో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రై డే ప్రై డే కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలతోపాటు చుట్టు పక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. డ్రెయినేజీల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
బాసర ట్రిపుల్ ఐటీకి ముగ్గురి ఎంపికఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకంటే దీటైన ఫలితాలు సాధిస్తూ అబ్బుర పరుస్తున్నారు. ఉచిత నిర్బంధ విద్యతో పాటు అర్హులైన అనుభవం ఉన్న ఉపాధ్యాయులు చేసే బోధన పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తిచేసిన ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు.డీసీఎం డ్రైవర్ కుమార్తె.. మండల కేంద్రానికి చెందిన ఎండీ జాస్మిన్ పదోతరగతి పరీక్షల్లో 544 మార్కులు సాధించింది. తాజాగా విడుదలైన ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో సీటు సాధించింది. విద్యార్థిని తండ్రి ఎండీ మొహిన్ డీసీఎం డ్రైవర్ కాగా తల్లి పర్విన్న్ గృహిణి. పట్టుదలతో చదవడంతో జాస్మిన్ ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది.హ్యాండ్బాల్ క్రీడాకారిణి మండల కేంద్రంలోని 5వ వార్డులో నివాసం ఉంటున్న జాడి రాధిక టెన్త్లో 557 మార్కులు సాధించింది. ఇటీవల మంత్రి సీతక్క నుంచి అవార్డు తీసుకుంది. రాధిక తండ్రి రాజు ఆటో డ్రైవర్ కాగా, తల్లి కూలీ పనులకు వెళ్తుంది. అంతేకాకుండా రాధిక హ్యాండ్బాల్ క్రీడాకారిణి.. పట్టుదలతో చదివి టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని రాజు తెలిపారు. చాయ్వాలా కొడుకు.. మండల కేంద్రంలోని క్రాస్రోడ్డులో టీ స్టాల్ నడుపుతున్న రామరాజేందర్–అరుణల కుమారుడు రామ హర్షిత్ టెన్త్లో 559 మార్కులు సాధించాడు. హర్షిత్ తండ్రి టీ కొట్టు నడుపుకుంటూ పిల్లలను చదివిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని తగ్గట్టుగా కొడుకు టెన్త్లో కష్టపడి మంచిమార్కులు సాధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు రావడంతో వారికి కొండంత అండ దొరికినట్లు అయ్యిందని, తన కుమారుడు ఉన్నత స్థాయికి చేరుతాడని రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖ వరంగల్, ములుగు సర్కిళ్ల పరిధిలో వానాకాలం సాగునీటి విడుదల యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, వర్షం, వరదలను అంచనా వేసి ఉమ్మడి వరంగల్లో ఖరీఫ్ పంటలకు నీరిందించే విధంగా ప్రణాళికను ప్రకటించింది. 2,52,623 ఎకరాల తరి, 3,94,041 ఎకరాల ఆరుతడి కలిపి మొత్తం 6,46,664 ఎకరాలకు 14.06 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయనున్నట్లు యాక్షన్ ప్లాన్లో పేర్కొంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐడబ్ల్యూఏడబ్ల్యూ (స్కివం) సమావేశం అనంతరం సాగునీటి వివరాలను ప్రకటించారు. నీటి విడుదల తేదీ త్వరలో ప్రకటన.. ఉమ్మడి వరంగల్లో వాస్తవంగా ఎస్సారెస్పీ, దేవాదుల, సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు 9,43,530 ఎకరాలు కాగా.. ప్రస్తుత పరిస్థితులు, నీటిలభ్యతను బట్టి 6,46,664 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్ వరంగల్ సర్కిల్ పరిధిలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్ని నింపి 2,03,641 ఎకరాలకు 11.48 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. సరిపడా వరదలు వచ్చిన తర్వాత సమీక్షించి ఎల్ఎండీ దిగువన కాకతీయ కాల్వ, ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా మరో 2,91,936 ఎకరాలకు నీటి సరఫరా చేస్తారు. ములుగు సర్కిల్ పరిధిలో 10.05 టీఎంసీలకు 2.419 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల ద్వారా 34,618 ఎకరాల తరి, 1,16,469 ఎకరాల ఆరుతడి కలిపి 1,52,087 ఎకరాలకు సుమారు 2.58 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని అధికారులను ‘స్కివం’ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు 15 రోజులకోసారి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన వానాకాలం పంటలకు నీరందించేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. నీటిని విడుదల చేసే తేదీలను త్వరలోనే అధికారులు ప్రకటించ నున్నారు. చీఫ్ ఇంజనీర్ల ప్రతిపాదనలు.. ‘స్కివం’ కమిటీ సూచనలు.. ములుగు సర్కిల్ పరిధిలోని 1,03,883 ఎకరాల ఆయకట్టుకు అధికారులు 93,750 ఎకరాలు ప్రకటించగా.. వరద ఇన్ఫ్లోను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేవాదుల ద్వారా 4,170 ఎకరాలకు 3,570 ఎకరాలకు 0.35 టీఎంసీలు, పాకాల కింద 23,193 ఎకరాలకు 1.43 టీఎంసీలు, రామప్ప ద్వారా 6,780కు 0.80 టీఎంసీల నీటిని ప్రతిపాదించారు. లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగు ద్వారా 23,794 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. ఎస్సారెస్పీలో నీటి కొరత కారణంగా ఎల్ఎండీ, ఎస్సారెస్పీ కింద ప్రతిపాదించిన ఈ ఆయకట్టు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు తగినంత ఇన్ఫ్లో వచ్చిన తర్వాత సమీక్షించనున్నట్లు ‘స్కివం’ సూచించింది. గోదావరి నదిలో తగినంత నీరు అందుబాటులో ఉన్నందున దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపాలని కూడా కమిటీ ఆదేశించింది. ఇంకా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు పంపింగ్ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాజెక్టుల కోసం ములుగులోని సీఈ ప్రతిపాదించిన కార్యాచరణను కమిటీ అంగీకరించి అమలు చేయాలని సిఫార్సు చేసింది. వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక ఇది ‘స్కివం’ కమిటీ సమావేశంలో యాక్షన్ ప్లాన్ ఖరారు వరంగల్, ములుగు సీఈల ప్రతిపాదనలకు ఆమోదం ప్రస్తుత నీటి లభ్యతను బట్టి నిర్ణయం.. వరదలొచ్చే వరకు ఆన్ అండ్ ఆఫ్.. 15 రోజులకోసారి వారబందీ పద్ధతిన విడుదల -
సేంద్రియం వైపు అడుగులు..
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025రసాయన ఎరువుల నియంత్రణే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంములుగు రూరల్: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎన్ఎఫ్(నేషనల్ బిషన్ అన్ నాచ్యురల్ ఫార్మింగ్) పథకాన్ని అమలు చేస్తోంది. రసాయన ఎరువుల వినియోగంతో పంట పొలాలు నిర్జీవంగా మారుతున్న కారణంగా ప్రకృతి, మానవాళికి కలిగే నష్టాలను వివరిస్తూ రైతులను సేంద్రియ సాగు వైపు దృష్టి మళ్లించేందుకు కేంద్రం నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులు పంటల సాగులో అధికంగా రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం రోజు రోజుకూ దెబ్బతింటోంది. రసాయనాలతో సాగు చేసిన పంటలను తినడం మూలంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జిల్లాలోని మండలాల వారీగా గ్రామాలను ఎంపిక చేసుకొని ఒక్కో రైతు ఎకరం భూమి 125 మంది రైతులు సేంద్రియ సాగుకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 15 క్లస్టర్లు జిల్లాలోని పది మండలాల్లో కలిపి మొత్తం 15 క్లస్టర్లను ఎంపిక చేశారు. ఎంపికై న గ్రామంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుంచి 125 మంది రైతులను ఎంపిక చేసి ఒక్కో రైతుకు సంబంధించిన ఎకరం భూమిలో సేంద్రియ విధానంలో సాగు చేపట్టనున్నారు. ఎంపికై న రైతుల భూములకు భూసార పరీక్షలు నిర్వహించి ఏ రకం పంటలు సాగు చేయాలనే విషయం తెలియజేస్తారు. సాగు చేసిన పంటలకు మొదటి విడతలో పంటకు సరిపడా వేప పిండి, నూనె ఉచితంగా అందిస్తారు. సేంద్రియ విధానంలో పండించిన పంటలకు మార్కెట్లో ఉండే డిమాండ్ను వివరించి రైతులను చైతన్య పరుస్తారు. జిల్లాలో సేంద్రియ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను ప్రోత్సహించేందుకు వెలుగు రేఖ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా సాగు సేంద్రియ సాగు కోసం ఎంపిక చేసిన గ్రామాలలో రైతుల పొలాల నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలను సేకరించారు. దీంతో పాటు సేంద్రియ సాగు పంటలకు ఉన్న డిమాండ్కు అనుగుణంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గత రెండు నెలల క్రితం గ్రామాల ఎంపిక కావడంతో భూసార పరీక్షలకు మట్టి సేకరణ పూర్తి చేసి ల్యాబ్కు పంపించారు. దేశం మొత్తం సేంద్రియ సాగు ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాదని భావించి గ్రామాలలో రైతులను ఎంపిక చేసుకొని సేంద్రియ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. రసాయక ఎరువుల వాడకం, కలుషిత ఆహార నియంత్రణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మట్టి నమూనాలు సేకరిస్తున్న వ్యవసాయ అధికారులున్యూస్రీల్సేంద్రియ సాగుకు ఎంపికై న గ్రామాల వివరాలుమండలం గ్రామాలు ములుగు జగ్గన్నపేట, అంకన్నగూడెం, కన్నాయిగూడెం వెంకటాపురం(ఎం) తిమ్మాపురం, పాలంపేట గోవిందరావుపేట ముత్తాపూర్, రంగాపురం ఎస్ఎస్ తాడ్వాయి పంబాపూర్ ఏటూరునాగారం ఏటూరునాగారం మంగపేట నిమ్మగూడెం, నర్సాయిగూడెం కన్నాయిగూడెం సర్వాయి వెంకటాపురం(కె) రాచపల్లి వాజేడు అరుణాచలపురం జిల్లాలో 15 క్లస్టర్ల ఎంపిక ఒక్కో క్లస్టర్లో 125 ఎకరాలు.. 125 మంది రైతులు భూసార పరీక్షల నమూనా సేకరణ పూర్తిప్రకృతి సాగుకు డిమాండ్ ఎక్కువ రైతులు ప్రకృతి సాగు పద్ధతిలో పండించిన పంటలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. రసాయన ఎరువుల వాడకం నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం ప్రవేశపెట్టింది. ఎంపికై న గ్రామాలలో రైతుల భూముల నుంచి మట్టి నమూనాలను సేకరించాం. భూమి స్వభావాన్ని బట్టి పంటల సాగును చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. సేంద్రియ సాగుతో పండించిన పంటలు ఆరోగ్యవంతగా ఉంటాయి. జిల్లాలో వెలుగు రేఖ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు పథకం అమలు తీరును పరిశీలస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారు. రానున్న రోజుల్లో సేంద్రియ పంటల సాగు పెరిగే అవకాశం ఉంది. – సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
లీకేజీలు లేకుండా చూడాలి
ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాలో లీకేజీలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్నగర్ను ఆయన సందర్శించారు. సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలు, ఖాళీ ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపాలిటీ చెత్త బండిలో వేయాలని తెలిపారు.మున్సిపల్ కమిషనర్ సంపత్ -
నేడు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు రూరల్: జిల్లాలో నేడు(శుక్రవారం) రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్నగర్లో సీసీ రోడ్డు ప్రారంభం, 9 గంటలకు గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఆయిల్ పామ్ మొదటి సారిగా వచ్చిన పంట కటింగ్, 9.30 గంటలకు సోమళ్లగడ్డ క్రాస్ రోడ్డు పీఎస్ఆర్ గార్డెన్ లో రేషన్ కార్డుల పంపిణీ, 10.10 వెంకటాపురం(ఎం) మండలంలోని లక్ష్మీదేవిపేటలో రేషన్కార్డుల పంపిణీ, 10.45 గంటలకు బూర్గుపేట మారేడు చెరువు సందర్శన, 11.10 గంటలకు అడవి రంగాపూర్లో సబ్స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భూపాలపల్లి జిల్లాలో మంత్రి పర్యటన కొనసాగనుంది. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ములుగు రూరల్: నిరుద్యోగ యువతీ, యువకులు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ డైరెక్టర్ లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ (1,2,3,4) ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్యూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులలో 150 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ,టీజీబీసీస్టడీసర్కిల్.సీజీజీ. జీఓవీ.ఇన్ ఆన్లైన్లో ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ మార్కుల ఆధారంగా రిజర్వేషన్ నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి ఆదాయం రూ.లక్ష మించకూడదని వివరించారు. ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున 5 నెలలు స్టైఫండ్ అందుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు 0870–2571192, 040–2407118 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వారాంతపు సమావేశం బహిష్కరణ వాజేడు: మూడు నెలలుగా తమకు వేతనాలను ఇవ్వక పోవడంతో గురువారం నిర్వహించే వారాంతపు సమావేశాన్ని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు బహిష్కరించారు. ఈ మేరకు వాజేడు ఇన్చార్జ్ ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడికి వినతి పత్రాన్ని అందజేశారు. వేతనాలు రాకపోవడంతోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, పిల్లలు చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మానసికంగా కుంగిపోవడం జరుగుతుందని ప్రభుత్వం వెంటనే తమ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో గౌరిబాబు, విజయ, రమాకుమారి, గాంధీ, రాంబాబు, ఆదినారాయణ, రవికుమార్, రాంబాబు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాలకు విద్యార్థుల ఎంపిక కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాలకు ఎంపికయ్యారు. ఈనెల 1నుంచి 8వరకు హైదరాబాద్లోని హకీంపేట్ క్రీడాపాఠశాల ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాళేశ్వరం గ్రామానికి చెందిన కోల శాన్వి, గంట హరిచందన, నాగుల తులసి హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపికయ్యారు. శాన్వి, హరిచందన ప్రభుత్వ పాఠశాలో చదువుతుండగా, తులసి ప్రైవేట్ పాఠశాలలో చదువుతుంది. వీరిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఎస్పీ, డీఎస్పీ, ఎస్సైపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు కాళేశ్వరం: తనకు తప్పుడు ధ్రువీకరణ నివేదిక ఇవ్వడంతో ఒడిశాలోని ఓ కంపెనీలో ఉద్యోగం రాలేదని మహదేవపూర్ మండలం మద్దులపల్లికి చెందిన చకినారపు రవి ఎస్సీ కమిషన్కు ఈనెల 3వ తేదీన ఫిర్యాదు చేశాడు. 15 రోజు ల్లో యాక్షన్ టేకన్ రిపోర్టు (ఏవీఆర్)ను సమర్పించాలని ఎస్సీ కమిషన్ గురువారం ఎస్పీ కిరణ్ఖరే, గతంలో కాటారం డీఎస్పీగా పనిచేసిన గడ్డం రామ్మోహన్రెడ్డి, కాళేశ్వరం ఎస్సై గన్రెడ్డి తమాషారెడ్డిలకు నోటీసులు పంపించింది. ధ్రువీకరణ నివేదిక ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నోటీసులో పేర్కొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ములుగు రూరల్: రాష్ట్రంలోని మహిళలు వ్యాపార రంగాల్లో రాణించడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనితో కలిసి హాజరయ్యారు. తొలుత మహిళలు సీతక్కకు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వడ్డీలేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇందిరమ్మ కళలను నెరవేర్చేందుకు పలు పథకాలను అమలు చేస్తుందన్నారు. మహిళా సంఘాలకు రూ. 26 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేశామన్నారు. మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్లు కేటాయించడంతో పాటు వడ్డీ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 9 మండల సమాఖ్యలు, 330 గ్రామ సమాఖ్యలు, 6,904 స్వయం సహాయక సంఘాలలో మొత్తంగా 69,736 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 618 స్వయం సహాయక సంఘాలకు రూ.54.79 కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడించారు. 5,109 సహాయ సంఘాల సభ్యులకు రూ. 884.54 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంకట్రావ్ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ అన్నారు. గత ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడంలో నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకొచ్చిన పథకాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రామప్ప, ఐటీడీఏ, బొగత, కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా శక్తి క్యాంటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్లో లక్నవరం, బ్లాక్ బెర్రి పర్యాటక ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అదనపు కలెక్టర్ సంపత్రావు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తం
ములుగు రూరల్: అసంక్రమిత వ్యాధులు నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా ఆస్పత్రి కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల్లో పాలేటివ్కేర్, మానసిక ఆరోగ్యం, స్పెషల్ న్యూబార్ కేర్ యూనిట్ బ్లడ్ బ్యాంక్, ఆరోగ్య మహిళ కార్యక్రమాలు, పోషకాహార కార్యక్రమాలపై చర్చించడంతో పాటు రికార్డులను మెరుగు పరుచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఎన్డీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ పవన్కుమార్, ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ గఫర్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
గైర్హాజరు కార్మికులకు కౌన్సెలింగ్
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి విధులకు గైర్హాజరువుతున్న కార్మికులకు గురువారం అఽధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏరియాలోని మైన్స్రెన్స్ స్టేషన్ కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్కు ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. గైర్హాజరుకు గల కారణాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. విధులకు హాజరకాకపోవడం వలన కుటుంబంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, ఇబ్బందులను జీఎం వివరించారు. విధులకు హాజరయ్యేలా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు. విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యే అవకాశం ఉందన్నారు. కార్మికుల అనారోగ్య కారణాలను డాక్టర్ సురేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, అఽధికారులు రవీందర్, జోతి, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి, అన్ని గనుల సంక్షేమ అధికారులు, కార్మికులు, సేవా కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఉచితం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుకను అందిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం పంచాయతీ కార్యదర్శులు ద్వారా ఎంపీడీఓ కార్యాలయంలో బుక్ చేసుకోవాలని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అందించనున్నట్లు వెల్లడించారు. ఇసుక రవాణాకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల ద్వారా లేదా సొంత ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకోవాలని సూచించారు. ఇతరుల ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
డ్రగ్స్కు బానిసలుగా మారొద్దు
ఏటూరునాగారం: విద్యార్థులు డ్రగ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్లో బుధవారం డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్పై డిగ్రీ కళాశాల, గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ యువత చెడుదారుల వైపు వెళ్లకుండా ప్రణాళికతో చదివి లక్ష్యం చేరుకోవాలని సూచించారు. చదువుతో పాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు, ప్రేమ వలలో పడి విలువైన జీవితాలను బలి చేసుకోవద్దన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను కలిసి సమస్యను వివరించి పరిష్కరించుకోవాలన్నారు. ఎవరైనా సైబర్ క్రైమ్స్కు గురైతే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
కరకట్టకు శాశ్వత పరిష్కారం చూపించాలి
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ప్రజలు గోదావరి వరదల వల్ల అభద్రతా భావంతో జీవిస్తున్నారని, గోదావరి కరకట్టకు శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామంలో గతంలో నిర్మించిన కరకట్ట కోతకు గురికావడంతో ఆ ప్రాంతాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి లక్ష్మీనర్సింహారావు బుధవారం పరిశీలించారు. 25 ఏళ్ల కింద నిర్మించిన కరకట్ట గండ్లుపడి కొట్టుకుపోయే దుస్థితికి చేరిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కరకట్టకు రివిట్మెంట్ చేయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్టను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే జియో ట్యూబ్ టెక్నాలజీతో కొంత పనులు చేయిస్తామని చెబుతున్నారని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కోతలకు గురైన కరకట్టను పరిశీలించి వెంటనే మరమ్మతు పనులు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్కుమార్, తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి ప్రదీప్రావు, ఖాజాపాషా, తాడూరి రఘు, ధన్నపునేని కిరణ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు -
రైతులను ప్రోత్సహించాలి
ములుగు రూరల్: ఆయిల్పామ్ సాగుకు రైతులను అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆయిల్పామ్ సాగు లాభసాటిగా ఉంటుందన్నారు. జిల్లాలో 2025–26 సాగు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. పంటల మార్పిడి, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు విరివిగా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు అందిస్తున్న సబ్సిడీలను వివరించాలన్నారు. మండలాల వారీగా ఏఈఓలు 5 ఎకరాలకు పైబడి సాగు చేసే రైతుల వివరాలు, బోరు సౌకర్యం కలిగిన రైతులను గుర్తించి ఆయిల్ పామ్కు ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా టార్గెట్లను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, వ్యవసాయ అధికారి సురేష్కుమార్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు. నానో యూరియాతో సత్ఫలితాలు నానో యూరియా వినియోగంతో రైతులు సత్ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు జేడీ మల్లంపల్లి మండలం రాంచంద్రాపురంలో వ్యవసాయశాఖ, ఇప్కో వారి ఆధ్వర్యంలో రైతులకు డ్రోన్ సహాయంతో ఎరువుల వినియోగం, మందుల పిచికారీపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నానో సాంకేతికత పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సురేష్కుమార్, ఇప్కో డీఎం విశాల్ షిండే, స్నేహ ఎఫ్పీఓసీఈఓ చాంద్పాషా, డైరెక్టర్లు అశోక్, ప్రమేలా, కవిత, ఎంపీడీఓ హనుమంత్రావు, టీజీవీబీ మేనేజర్, మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, నల్లెల్ల శ్రీధర్, ఏఈఓ కావ్య పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
మొక్కలు, చెట్లే ప్రకృతికి అందం
భూపాలపల్లి: మొక్కలు, చెట్లే ప్రకృతికి అందమని, భవిష్యత్ తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవంలో జిల్లా పోలీసులు ముందుండాలని సూచించారు. అన్ని పోలీస్స్టేషన్ల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, వర్టికల్ డీఎస్పీ నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రి జర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు ఇసుక
ఏటూరునాగారం: జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు ఇసుకను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 6 మండలాల్లో 11 ఇసుక రీచ్లను ఏర్పాటు చేస్తూ డీఎల్ఎస్సీ తీర్మాణం చేస్తూ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక వాహనం అనే పేరుతో కొత్తగా యాప్ను రూపొందించి పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇంటి యజమానుల డిమాండ్ మేరకు బుక్ చేయాల్సి ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న ట్రాక్టర్ ఇసుకను నేరుగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి చేరేవిధంగా పథకాన్ని రూపొందించారు. క్యూబిక్ మీటర్కు రూ.100 ఒక క్యూబిక్ మీటర్కు రూ.100లకు ఇసుకను ఇందిరమ్మ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇసుక తోడి డంప్యార్డులో పోసేందుకు రేజింగ్ కాంట్రాక్టర్ కోసం గిరిజన సొసైటీలకు అప్పగించారు. డంపుయార్డు వద్ద నుంచి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న లబ్ధిదారుడికి టీఎస్ఎండీసీ వారు సరఫరా చేస్తారు. ఇందు కోసం ఇటీవల జిల్లాలో పెసా గ్రామ సభలను సైతం ఏర్పాటు చేసి వారికి ప్రజల ఆమోదంతో తీర్మాణం చేయగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఒక్కో క్యూబిక్ మీటర్ చొప్పున ఒక ఇందిరమ్మ ఇంటికి 30 క్యూబిక్ మీటర్లను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంటి నిర్మాణంపై పంచాయతీ కార్యదర్శి ఇచ్చే సర్టిఫైడ్తో మరింత క్వాంటిటీ పెరిగే అవకాశాలున్నాయి. క్యూబిక్ మీటర్కు రూ.100 ఇసుక తరలింపునకు డీఎల్ఎస్సీ అనుమతి 6 మండలాల్లో 11 ఇసుక రీచ్లు -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో మటన్, చికెన్, చేపల విక్రయ ప్రదేశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని సూచించారు. మాంసం, చికెన్, చేపలను పరిశుభ్రమైన వాతావరణంలో అమ్మకాలు చేపట్టాలన్నారు. నిబందనలు పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.మున్సిపల్ కమిషనర్ సంపత్ -
ఆ తర్వాతే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోందా? బుధవారం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించడం వెనుక మతలబు ఇదేనా? స్థానిక సంస్థల నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచిందా?.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. అధికారవర్గాలు కూడా స్థానిక సంస్థల నోటీఫికేషన్ త్వరలోనే రావచ్చని చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాలను ప్రకటించినట్లు భావిస్తున్నారు. ● ‘స్థానిక’ పోరుకు సర్కారు సమాయత్తం ● ఉమ్మడి వరంగల్లో స్థానాల ఖరారు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాల వెల్లడి ● వచ్చే నెల మొదటి, రెండో వారాల్లో నోటిఫికేషన్? ● అధికారులకు ఎన్నికల సంఘం సంకేతాలు.. సిద్ధమవుతున్న పార్టీలు75 జెడ్పీటీసీలు, 778 ఎంపీటీసీలు.. స్థానిక ఎన్నికల కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయడమే తరువాయి రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ముందుగా పేర్కొన్న విధంగానే మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలు, వార్డులకు జరిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లపైన సందిగ్ధత నెలకొంది. ఊపందుకున్న ‘స్థానిక’ సందడి... పోటీకి ఆశావహుల సై.. సెప్టెంబర్ మాసంలోగా స్థానిక సంస్థల ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మళ్లీ సందడి జోరందుకుంది. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, రైతు భరోసా తదితర పథకాల పంపిణీని కాంగ్రెస్ పార్టీ వేడుకలా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ప్రయత్నంలో కేడర్ను అప్రమత్తం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సైతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ ఈసారి బలప్రదర్శనకు దూకుడు పెంచుతోంది. వామపక్ష పార్టీలు సైతం కార్యక్రమాలను ఉధృతం చేశాయి. కాగా, ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహుల సై అంటున్నారు. ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు. దీంతో వారి ఇళ్ల ముందు సందడి పెరిగింది.పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని భావించిన అధికారులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులు ఉన్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఇటీవలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అందించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్లు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లకు వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గవర్నర్కు పంపగా, ఆయన సంతకం కాగానే ఈ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. ఇందుకు మరో వారం, పది రోజులు పట్టినా.. వచ్చే నెల మొదటి, రెండో వారాల్లో నోటిఫికేషన్ రావచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు సంకేతాలు అందినట్లు కూడా చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్లో జెడ్పీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాలు జిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు హనుమకొండ 1 12 12 129 210 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 భూపాలపల్లి 1 12 12 109 248 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 ములుగు 1 10 10 83 171 1,520 జనగామ 1 12 12 134 280 2,534 06 75 75 778 1,708 15,006 -
స్థానిక రిజర్వేషన్లపై ఉత్కంఠ..
మండలం యూనిట్గా రిజర్వేషన్లువెంకటాపురం(ఎం): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఇన్నాళ్లుగా రిజర్వేషన్ల ప్రక్రియ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అది కూడా తొలగిపోనుండడంతో ఎన్నికలు నిర్వహణకు మార్గం సుగుమమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు పెద్దపీట వేస్తుంది. ఈ ఎన్నికల్లోనే. 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. ఈ నెలాఖరు వరకు రిజర్వేషన్లు ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. దీంతో బీసీ వర్గాలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వేషన్ కేటాయింపు ఇలా.. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మండలాన్ని యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాను యూనిట్గా చేసుకుని రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జెడ్పీ చైర్మన్ మాత్రం రా ష్ట్రాన్ని యూనిట్గా చేసుకుని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గత ఎన్నికల్లో పంచాయతీలకు కూడా రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకుని రిజర్వేషన్లు ఖరారు చేశారు. మండలాన్ని యూనిట్గా చేసుకుని సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆయా కులాల జనాభా ఆధారంగా మండల పరిషత్కు, తర్వాత సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. 171 జీపీలు.. 1,520 వార్డు స్థానాలు జిల్లాలో 9 మండలాలు ఉండగా జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చారు. దీంతో జిల్లాలో మరో నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండలాన్ని కలుపుకొని తిరిగి 9 ఎంపీపీ, 9 జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో 83 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 35 స్థానాలు బీసీలకు కేటాయించనున్నారు. 9 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 1,520 వార్డు స్థానాలు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించనున్నారు. పాత రిజర్వేషన్లు రద్దు.. గత ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్లను రద్దు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్న రిజర్వేషన్లన్నీ మారిపోనున్నాయి. ఆయా గ్రామాల్లో గత సంవత్సరం వచ్చిన రిజర్వేషన్లు ఈ సారి వచ్చే అవకాశం ఉండదు. జిల్లాలో బీసీలకు 42 శాతం, ఎస్టీలకు 7శాతం, ఎస్సీలకు 15 శాతంతో పాటు అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, వివిధ పార్టీల నాయకులు రిజర్వేషన్ల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుకు ప్రభుత్వం సన్నాహాలు బీసీలకు 42శాతం కేటాయింపుతో మారనున్న సమీకరణాలు జిల్లాలో 9 ఎంపీపీ, జెడ్పీటీసీ, 83 ఎంపీటీసీ స్థానాలు -
జీసీసీ గోదాం పరిశీలన
వెంకటాపురం(కె): మండల కేంద్రలలోని జీసీసీ గోదామును మంగళవారం జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ రాంపతి, జీసీసీ ఎంఎల్ఎస్ పాయింట్ గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోదాములో ఉన్న స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి సరుకును పరిశీలించారు. గోదాము, స్టాక్ రిజిస్టర్లో ఉన్న స్టాక్కు 250 క్వింటాల బియ్యం తక్కువగా వచ్చినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు అధికారికంగా ప్రకటించడం లేదు. మాయమైన 250క్వింటాళ్ల బియ్యానికి డబ్బులు చెల్లించాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. -
వరంగల్లోనూ ఏసీబీ ఆరా..!
కీలక అధికారుల్లో మొదలైన గుబులు..వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలలోనూ ఆరా తీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్ తదితర పదిచోట్ల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్రావు కుమారుడు అభిషేక్తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్తోపాటు సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలలో కీలక పనుల సబ్ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్ఆర్డర్లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్రోడ్డు) కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. నెక్ట్స్ ఎవరో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్లో కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్ ఫామ్హౌజ్ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్సీ మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులు, బంధువుల్లో సోదాలు చేపట్టడం ఇరిగేషన్ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది. మాజీ ఈఎన్సీ మురళీధర్ అరెస్టు నేపథ్యం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వాహకుడితో సంబంధాలు మురళీధర్ కుమారుడు అభిషేక్ సన్నిహితులపై నిఘా కాళేశ్వరం ఇంజనీర్లలో ఒక్కొక్కరిపై దాడి ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..? -
చట్టానికి లోబడి సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: భూ భారతి చట్టానికి లోబడి సమస్యలు పరిష్కరించాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్కుమార్ సూచించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తుల పరిశీలన మొత్తం ఆన్లైన్ ప్రాసెస్లో మాత్రమే చేపట్టాలన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ విజయ్ భాస్కర్, సంబందిత సిబ్బంది పాల్గొన్నారు. -
బెస్ట్ సొసైటీగా ములుగు పీఏసీఎస్
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బెస్ట్ సొసైటీగా ఎంపికై ంది. సొసైటీ నిర్వహణ, రైతులకు అందించిన రుణాల వంటి సేవలను గుర్తించి నాబార్డు సంస్థ వారు అవార్డును అందించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు నుంచి పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీ ఎస్కు అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. రూ.3.16 లక్షల చెక్కు అందజేత వాజేడు: వాజేడు పీఏసీఎస్కి రూ.3.16 లక్షల చెక్కును టెక్సాబ్ చైర్మన్ రవీందర్రావు అందజేశారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థకు పీఏసీఎస్ ఎంపిక కావడంతో హైదరాబాద్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆఫీస్ ఖర్చులకు చెక్కు తనకు అందజేసినట్లు సొసైటీ అధ్యక్షుడు అంజయ్య తెలిపారు. -
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
● ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు ఏటూరునాగారం: ప్రజలు ఎయిడ్స్ వ్యాధిపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సామాజిక వైద్యశాల ఐసీటీసీ కౌన్సిలర్ గులగట్టు వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని రామన్నగూడెంలో మంగళవారం ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు దిశ వారి సౌజన్యంతో హెల్త్ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, టీబీ, హైపటైటిస్బీ, సిఫిలిస్, హెచ్ఐవీ పరీక్షలు 50 మందికి చేసినట్లు వివరించారు. ఎవరికై నా హెచ్ఐవీపై అనుమానం ఉంటే క్రాస్రోడ్డులోని సామాజిక ఆస్పత్రిలో ఐసీటీసీ సెంటర్లో ఉచితంగా పరీక్షలు చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్సీ మొబైల్ వాహన కౌన్సిలర్ అనూష, ల్యాబ్ టెక్నీషియన్ సాగర్, ఏఎన్ఎం ధనలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ జైలు బాబు, గ్రామ కార్యదర్శి జ్యోతి, ఆశ కార్యకర్తలు కాశింబీ, లావణ్య, ఔట్ రీచ్ వర్కర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
సీతక్క రాజకీయంగా ఎదుర్కోవాలి
ఏటూరునాగారం: మంత్రి సీతక్క ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప తిట్లు, శాపనార్ధాలు పెట్టడం మంత్రి స్థానానికి తగదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఇటీవల మంత్రి సీతక్క కేటీఆర్ను ఎదుర్కోలేక తాను సమ్మక్క తల్లి ఆడబిడ్డను అంటూ ఎదుటి వారిని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు. కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన గొప్పవ్యక్తి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలున్నాయని వాటిపై దృష్టి పెట్టాలన్నారు. గతంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన ఒక్కో రైతుకు రూ.10వేలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వర్షాలు పడుతాయని నార్లు పోసుకున్న రైతులు వర్షాలు లేక, బోరు బావుల నీటిని పారించుకుందామనుకున్నా విద్యుత్ సరఫరా సరిగా ఉండడం లేదన్నారు. ఏజెన్సీలోని రైతులకు దేవాదుల పైపులైన్ ద్వారా లక్నవరం, రామప్ప చెరువులను నింపి సాగునీరు అందించాలన్నారు. బీసీ రిజర్వేషన్ 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయగా అన్ని పార్టీలు మద్దతు తెలిపితే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఆర్దినెన్స్ ద్వారానే రిజర్వేషన్ తెస్తామని బీసీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొండాయి, మల్యాల గ్రామాలకు వెళ్లే దా రిలోని జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణం ఇంకా చేపట్ట లేదన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, కృష్ణ, సు నీల్కుమార్, ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్పై తిట్లు, శాపనార్థాలు తగవు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు -
శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి
● కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ గోవిందరావుపేట: ఈ నెల 22, 23, 24 తేదీలలో సూర్యపేటలో నిర్వహించే రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి అధ్యక్షతన మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమాజంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సామాజిక అంతరాలు, కుల వివక్షత, అంటరానితనం, మూఢనమ్మకాలను నిర్మూలించడం కోసం కేవీపీఎస్ పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సాధించుకున్నామని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనంపై నిరంతరం పోరాడుతూ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు సకాలంలో అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వసతులు మెరుగు పర్చాలని కోరారు. దళిత బహుజనులందరికీ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ భౌగోళిక అంశాలపైన అవగాహన కల్పించేందుకు కేవీపీఎస్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు సూర్యపేట పట్టణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం, దేవేందర్, కోటయ్య, జగదీశ్, నరేష్, యాదగిరి, మహేందర్ పాల్గొన్నారు. -
రుణాలు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు రూరల్: మహిళా సంఘాల నుంచి రుణాలు పొందిన సభ్యులు సక్రమంగా రుణాలు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని కలెక్టర్ టీఎస్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4,409 సంఘాలకు రూ.3.26కోట్ల వడ్డీ రాయితీ పొందారని పేర్కొన్నారు. 2024 నుంచి 2025 వరకు 5,233 సంఘాల సభ్యులు రూ.8.97కోట్ల రాయితీ పొందినట్లు వివరించారు. ఫిబ్రవరి 2025 మార్చి నెలలో 5,308 సంఘాలకు ప్రభుత్వం రూ.1.91 కోట్ల రాయితీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 10.88కోట్ల వడ్డీ రాయితీ వచ్చినట్లు వివరించారు.వైద్యులు ఉత్తమ సేవలు అందించాలి ములుగురూరల్: ములుగు ఏరియా వైద్యశాలలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండి రోగులకు ఉత్తమ వైద్య సేవలను అందించాలని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ చంద్రశేఖర్ను ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ కోరారు. ఈ మేరకు మంగళవారం ములుగు ఏరియా వైద్యశాల బాధ్యతలను నూతనంగా చేపట్టిన చంద్రశేఖర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని ప్రజలకు వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, తిరుపతి, జయకర్, జక్కుల రేవంత్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని తోగుగూడెంలో మావోయిస్టు ఆత్మపరిరక్షణ ప్రజాఫ్రంట్ తెలంగాణ పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం వాల్పోస్టర్లు వెలిశాయి. అడవిని, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రండి.. మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు వెలువడంతో చర్చనీయాంశంగా మారింది. చెల్పాకకు బస్సు సౌకర్యం కల్పించాలి ఏటూరునాగారం: మండల పరిధిలోని చెల్పాక గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) జిల్లా ఉపాధ్యక్షుడు కర్నె లాజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. మండల కేంద్రం నుంచి బస్సు చెల్పాక వరకు రవాణా సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు, రైతులకు ఉపయోగంగా ఉంటుందని కోరారు. కస్తూర్బాగాంధీ పాఠశాల తనిఖీ ములుగు రూరల్: మండల పరిధిలోని మదనపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలను మంగళవారం గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తాచెదారం లేకుండా చూడాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, జయకర్, జక్కుల రేవంత్, రమణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శరత్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఐటీడీఏ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఐటీడీఏ నుంచి వీసీలో పీఓ చిత్రామిశ్రా, డీటీడీఓ పోచంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జంజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జేఏఎన్ఎంఏఎన్), ధర్తీ ఆభా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్(డీఏ జేయూఏ) పథకం ద్వారా 26 రాష్ట్రాల్లోని 5.5 కోట్ల గిరిజన జనాభాకు రూ.80 వేల కోట్లతో అసాధ్యమైన ప్రాంతాల్లో వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో గిరిజనులకు రోడ్లు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, టెలీకమ్యూనికేషన్, విద్యుత్, గృహ నిర్మాణం వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన గ్రామాల్లోని విద్యార్థులు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. రక్తహీనత, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అత్యవసర చికిత్సలు అందించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం, వసతి కల్పించాలన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వీసీలో ట్రైబల్ వెల్ఫేర్ ముఖ్యకార్యదర్శి శరత్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందుండాలి
ములుగు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందుండాలని అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇళ్లు మంజూరై గ్రౌండింగ్ కాని ఇళ్లను వారం రోజుల్లో గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తే త్వరగా బిల్లులు చెల్లిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. మండలాల వారీగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం, లబ్ధిదారులు నిర్ధారణ, మంజూరులు తెలిపి ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకబడిన మండలాలను గుర్తించి లక్ష్యసాధనకు అధికారులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. పంచాయితీ కార్యదర్శులు లబ్ధిదారులను నేరుగా కలిసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఇంటి నిర్మాణాలకు నిధుల సమస్య లేదని తెలిపారు. ఇంటి నిర్మాణ పనులను దశల వారీగా ఫొటోలను వెబ్సైట్లో అందుబాటు ఉంచాలన్నారు. ఇంటి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లాలో ఏర్పాటు చేయనున్న క్రేచ్ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మొబైల్ క్రేచ్ సంస్థ సహకారంతో అంగన్వాడీలకు పాలన స్కీంలో 8 రోజుల పాటు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ క్రేచ్ సంస్థ ట్రైనర్స్ నీలం శ్రీవాత్సవ, విజయలక్ష్మీ మణికప్పలు. 14మంది అంగన్వాడీ టీచర్లకు శిక్షణ అందించగా వారిని అభినందించి ప్రసంసా పత్రాలు అందించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
ములుగు రూరల్: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితం గడపాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. ఈ సందర్భంగా సోమవారం ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ మాట్లాడారు. జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి సంయుక్తంగా పోరుకన్న ఊరు మిన్న.. ఊరికి తిరిగి రండి అంటూ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఇదే క్రమంలో నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలలో పని చేస్తున్న ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 73మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎంఎస్ 3, ఏసీఎంఎస్ 10, పీఎంఎస్ 22, మిలిషియా సభ్యులు 29మంది, ఆర్పీసీ సభ్యులు 1, డీఏకేఎంఎస్ 2, సీఎన్ఎంలు ఆరుగురు లొంగిపోయారని వివరించారు. లొంగిపోయినవారికి పునరావాస పథకానికి అనుగుణంగా సదుపాయాలు కల్పించామన్నారు. ఆదివాసీలు మావోయిస్టులకు సహకరించకపోవడంతో ఆరోగ్యం క్షిణించి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నడవలేని స్థితికి దిగజారిపోయారని వెల్లడించారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కర్రెగుట్టల అటవి ప్రాంతాల్లోని సంపదను స్వేచ్ఛగా అనుభవించేందుకు పోలీస్శాఖ, కేంద్ర బలగాలు క్యాంపులను ఏర్పాటు చేయనున్నాయన్నారు. అనంతరం లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులకు తక్షణ సాయం కింది ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున అందించారు. మిగిలిన మొత్తం బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో సుక్మా జిల్లాకు చెందిన శ్యామల రాజేష్, కడతిల్ దుమ, బీజాపూర్ జిల్లాకు చెందిన ఊకె జోగి, బాడిషె భియా అలియాస్ మహేష్, ముచ్చకి జోగిలు ఉన్నట్లు ఎస్పీ వివరించారు.ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్
హసన్పర్తి: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్స్టా, ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్లోని వైద్యవర్గాల్లో చర్చనీయాంశమైంది. అత్తామామలకు చెప్పినప్పటికీ.. డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. ఆమె వెంటనే ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా.. డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్లో తాను గుండె ఆపరేషన్ లైవ్గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతుంది. సృజన్ కారును కూడా పూర్తిగా యువతి వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండవ కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు తెలిపారు.‘రీల్స్ గర్ల్’ మోజులో గుండైవెద్య నిపుణుడు భార్యకు శారీరక, మానసిక వేధింపులు.. దంత వైద్యురాలి మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు పోలీసుల అదుపులో డాక్టర్.. విచారణ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తీవ్రం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు పరిష్కరించకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్, సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట సోమవారం మహాధర్నా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముందుగా ఏటూరునాగారం ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. మంత్రి సీతక్క ఉన్న ప్రాంతాల్లో కూడా గిరిజనులపై నిర్బంధాలు ఎక్కువ అయ్యాయన్నారు. ఈ ధర్నాకు రాకుండా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకోవడం హేమమైన చర్య అన్నారు. ఆదివాసీ గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీ సాగుదారులపై అటవీశాఖ దాడులు ఆపాలని, అర్హులైన ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాడ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అందజేశారు. ఈ దర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్లు బారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి, దామోదర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రవికుమార్, పుల్లయ్య ఐటీడీఏ ఎదుట మహాధర్నా, పోలీసుల బందోబస్తు -
తాగునీటి కోసం రాస్తారోకో
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోదా పురం పంచాయతీ పరిధిలోని గుట్టబోరు గ్రామస్తులు తాగునీటి కోసం సోమవారం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి పథకం మోటర్ మరమ్మతులకు గురైందని రిపేర్ చేయించాలని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకుకెళ్లగా పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు.ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ప్రజావాణి, గిరిజన దర్బార్లో వినతుల వెల్లువ ● కలెక్టరేట్, గిరిజన దర్బార్లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా ● పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశంములుగు రూరల్/ ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజ లు తమ సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ వినతులు అందజేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్వర్లుతో కలిసి వివిధ సమస్యలపై వచ్చిన 75 దరఖాస్తులను స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా 40 వినతులు స్వీకరించారు. మొ త్తంగా వచ్చిన 115 వినతులు తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని ఆ యా శాఖల అధికారులను వారు ఆదేశించారు. గిరిజన దర్బార్లో వినతులు ఇలా.. వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళా స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ములుగు మండలంలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన నిరుద్యోగురాలు అవుట్ సోర్సింగ్లో అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. గోవిందరావుపేట మండలం మచ్చాపురం గ్రామానికి చెందిన ఓ రైతు తన తండ్రి పేరుపై ఉన్న పట్టాదారు పాసుపుస్తకం తన పేరుపై మార్చాలని పీఓకు విన్నవించారు. మంగపేట మండంలోని అటవీశాఖ ద్వారా ఓ కార్పొరేషన్ సంస్థలో వేసిన జామాయిల్ కటింగ్, కొనుగోళ్లను పెసా గ్రామ సభల ద్వారా తీర్మాణం చేసి ఆదివాసీ రైతులకు జీవనోపాద్ధి కల్పించాలని రైతులు మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగురాలు అంగన్వాడీ టీచర్ పోస్టు ఇప్పించాలని కోరారు. ములుగు మండలంలోని గిరిజన ఆశ్రమ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ ఉద్యోగ అవకాశం కల్పించాలని ఓ గిరిజనుడు కోరారు. ఉమ్మడి జిల్లాలోని సీఆర్టీలను రెన్యువల్ చేయాలని సీఆర్టీలు కోరారు. ఏటూరునాగారం మండలం మల్యాలకు చెందిన ఓ గిరిజనుడు తనకు ఒకేషనల్ ట్రైనింగ్ ఇప్పించాలని కోరారు. గోవిందరావుపేట మండలంలోని 127 మంది గిరిజనులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కావాలని, 36 మంది ఇందిరమ్మ ఇళ్లు కావాలని పీఓకు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి నుంచి 297 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కావాలని దరఖాస్తులు అందజేశారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు పాల్గొన్నారు. -
‘కు.ని’పై అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: యువతకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈమేరకు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా విస్పోటనం వల్ల నిరుద్యోగం, పోషకాహార లోపం, జీవన ప్రమాణాల తగ్గుదల ఏర్పడుతుందన్నారు. జనాభా వృద్ధి వల్ల కలిగే సవాళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం జిల్లాలో మాతా శిశు సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేసి 102 అంబులెన్స్ సేవలు అందిస్తుందన్నారు. ఈసేవలతో తల్లీబిడ్డ క్షేమంగా ఉంటున్నట్లు తెలిపారు. శాశ్వత కుటుంబ నియంత్రణ పాటించే వారి జాబితాను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వారీగా కేంద్ర కార్యాలయానికి పంపి నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, పవన్కుమార్, నాగగణేశ్, సంపత్, సాంబయ్య, స్వరూపరాణి, సూపర్వైజర్లు సురేశ్, దేవేందర్, నిర్మల, దేవమ్మ, వినోద్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. క్షయ వ్యాధిని అంతమొందించాలి జిల్లాలో క్షయ వ్యాదిని అంతమొందించాలని జిల్లా వైధ్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో టీబీ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ పౌరుడు క్షయ నియంత్రణలో భాగస్వామ్యం కావాలన్నారు. క్షయ వ్యాధి గాలిలో తుంపర్ల ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. క్షయ వ్యాది నివారణకు ప్రభుత్వం మందులు పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి గోపాల్రావు -
బీసీలకు రిజర్వేషన్ పెంపుపై హర్షం
ములుగు రూరల్: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వంగ రవియాదవ్ అన్నారు. ఈమేరకు శుక్రవారం జాతీయ రహదారిపై బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల రాజకీయ ఎదుగుదలకు సహకరించి మంత్రి వర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పౌడాల ఓంప్రకాశ్, గొర్రె అంకూష్, ఒజ్జల కుమార్, బొంత వేణు, జయపాల్రెడ్డి, ఒజ్జల లింగన్న, నిరంజన్, ఓడ రాజు కుక్కల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
మందు పాతర ఘటనలో గాయపడిన వ్యక్తి మృతి
వెంకటాపురం(కె): మందు పాతర పేలిన ఘటనలో గాయపడిన సోయం కామయ్య (45) ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల పరిధి ముకునూరు పాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య.. వెదురు తెచ్చుకోవడానికి ఈ నెల 4న కర్రె గుట్టల ప్రాంతంలోని అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు పడడంతో అది పేలింది. దాంతో తీవ్రంగా గాయపడిన సోమయ్యను చికిత్స నిమిత్తం వరంగల్, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో వైద్యం పొందుతూ గురువారం మృతిచెందాడు. -
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ఏటూరునాగారం: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు బి.రాజు ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నాగరాజు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల జీపీఎఫ్, సరెండర్, లీవుల బిల్లులు ఏళ్లు గడిచినా విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విధంగా 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం చెల్లించి వారికీ పేస్కేల్ వర్తింపజేయాలన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూక్యా సారంగపాణి, మండలం నాయకులు కానుగంటి సతీశ్, తాళ్లపల్లి మాధవి, సీహెచ్ పద్మ శ్రీ పాల్గొన్నారు.టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు -
సమాజ బాధ్యతగా తీసుకోవాలి..
మొక్కల సంరక్షణను పౌరులంతా బాధ్యతగా తీసుకోవాలని ములుగు ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ సూచిస్తున్నారు. వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనతో మినీ ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే.. వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖలకు టార్గెట్లు విధించింది. మొక్కల సంరక్షణకు ప్రధానంగా ట్రీగార్డులను వినియోగించాలి. నేలకు అనువైన మొక్కలు నాటడంతో పాటు న్యూట్రీషన్ అందించేలా చూడాలి. మొక్కలకు చెదలు రాకుండా గుళికలను వినియోగించాలి. నీడనిచ్చే చెట్ల ఎదుగుదలలో క్రూనింగ్ చేస్తే ఏపుగా పెరుగుతాయి. దీంతో పాటు మొక్కలకు కాంపోస్ట్ ఎరువుల్ని వినియోగిస్తే ఎదుగుదల బాగుంటుంది. -
కల్తీ కల్లుకు మేం పూర్తిగా వ్యతిరేకం
గోవిందరావుపేట: కల్తీ కల్లుకు మేం పూర్తిగా వ్యతిరేకం అని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండల పరిధి పస్రాలో జక్కు రాజుగౌడ్ అధ్యక్షతన హైదరాబాద్లో కల్తీ కల్లు మరణాల దృష్ట్యా జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ రాజసమ్మయ్య కల్లు శాంపిల్ తీసుకున్నారు. ఈసందర్భంగా బుర్ర శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధ కల్లులో అనేక పోషకాలున్నాయని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. ప్రభుత్వమే ప్రకృతి సిద్ధమైన కల్లు సేవించాలని ప్రచారం చేయాలని, శీతల పానీయాలు తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో పస్రా సొసైటీ కల్లు గీత కార్మికులు జక్కు మొగిళిగౌడ్, మేర్గు సుధాకర్గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, జక్కు భిక్షపతిగౌడ్, దామోదర్ గౌడ్, ఎకై ్సజ్ సిబ్బంది హెడ్ కానిస్టెబుల్ శ్రీకాంత్, సునీల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్గౌడ్ -
గూడేల్లో మెరుగైన విద్యనందిస్తాం
ఏటూరునాగారం: గొత్తికోయ ఆదివాసీ చిన్నారులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధి చింతలమోరి ఆదివాసీ గ్రామాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ సంపత్ రావు సందర్శించారు. రాండ్ స్టాండ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన యూనిఫాంలు, పుస్తకాలు, విద్యా సామగ్రిని మంత్రితో పాటు కలెక్టర్ అదనపు కలెక్టర్లు పంపిణీ చేశారు. రాండ్ స్టాండ్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు తొమ్మిది పాఠశాలల్లోని 150 మంది పిల్లలకు అన్ని వస్తువులను అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం మంత్రి సీతక్క విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణ ప్రాంతాల్లో మంత్రి కలెక్టర్ అధికారులు మొక్కలు నాటారు. కొండాయి గ్రామం వద్ద జరుగుతున్న హైలెవెల్ బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి పరిశీలించారు. వాగు దాటి.. పాఠశాలను ప్రారంభించి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి ట్రాక్టర్పై జంపన్నవాగు దాటి ఎలిశెట్టిపల్లికి వెళ్లారు. ప్రభుత్వ నిధులు రూ.15లక్షలతో నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కాగా.. మండల కేంద్రంలోని ఎండి. వలీబాబా తండ్రి ఇటీవల మరణించడంతో మంత్రి సీతక్క బాదిత కుటుంబాన్ని పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన పెండ్యాల సంతోశ్తోపాటు పలువురు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడారంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవిచందర్తో కలిసి మంత్రి సీతక్క శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్కు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం సీతక్క విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే మహా జాతర కోసం రూ.112 కోట్లతో ప్రాథమిక అంచనాలతో కలెక్టర్.. ట్రైబల్ వెల్పేర్ శాఖకు పంపించారని తెలిపారు. ప్లేట్స్ తయారీ యూనిట్ ప్రారంభం గోవిందరావుపేట: మండలంలోని మోట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో రాండ్స్టాండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ వారి సహకారంతో సమ్మక్క సారలమ్మ అడవి ఆదివాసీ సహకార సమాఖ్య అడ్డాకుల ప్లేట్ తయారీ యూనిట్ను మంత్రి సీతక్క, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రవిచందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్, మేడారం ఆలయ ఈఓ వీరస్వామి, ఇన్చార్జ్ తహసీల్దార్ సురేశ్బాబు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ఎన్జీఓ సంతోశ్, నాయకులు బొల్లు దేవేందర్, ఇర్ప సునీల్, వెంకన్న, రఘు, మనోజ్, రవి, రాము, రాండ్ స్టాండ్ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క ట్రాక్టర్లో వాగుదాటి పాఠశాల భవనం ప్రారంభం -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
ములుగు రూరల్: సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం మున్సిపాలిటీ పరిధి గడిగడ్డ ప్రాంతంలో వైద్యశాఖ, ఆశాలతో కలిసి ఇంటింటి సర్వే చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వల కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడతారన్నారు. నీటి నిల్వలు ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్, యాంటీ లార్వా మందులు పిచికారీ చేయించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల ప్రభుత్వ పాటించాలని సూచించారు. మున్సిపాలిటీ నుంచి నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిసెంట్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి ములుగు రూరల్: దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన పొంది సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉపాధి, పునరావాస పథకం ప్రవేశపెట్టినట్లు జిల్లా సంక్షేమాధికారి తుల రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 శాతం వైకల్యం కలిగి ఉండి 21 సంవత్సరాల నుంచి 55 వయస్సులోపు వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఆదాయ పరిమితి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉండాలని పేర్కొన్నారు. డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.టీఎస్బీఎంఎంఎస్.సీజీజీ.జీఓవీ వెబ్సైట్లో ఈనెల 14 నుంచి 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్గా బాధ్యతల స్వీకరణ ములుగు రూరల్: ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్గా చంద్రశేఖర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు డాక్టర్ మోహన్లాల్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈనెల 7న జనరల్ మెడిసిన్ విభాగంలో ములుగు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా విదులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్కు పదోన్నతి కల్పిస్తూ సూపరింటెండెంట్గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన సూపరిండెంట్ను పలువురు వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు భిక్షపతిరావు, తైలం గౌతమ్ తదితరులు ఉన్నారు. వ్యాస రచన పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలి ములుగు రూరల్: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించే వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని లీడ్ ఇండియా గ్లోబల్ సమన్వయకర్త డాక్టర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ‘నివాస యోగ్యమైన భూగోళ పరిరక్షణ’ అంశంపై వ్యా స రచన పోటీలుంటాయని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి ములుగు రూరల్: విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని ఏటీడీఓ దేశీరాం, జీసీడీఓ సుగణ అన్నారు. ఈమేరకు శుక్రవారం జగ్గన్నపేట ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ఆమె వెంట పాఠశాల హెచ్ం విజయలక్ష్మీ, వార్డెన్ బారోత్ అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒకరిపై కేసు భూపాలపల్లి అర్బన్: డీడబ్ల్యూఓపై అసత్యపు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పట్టణానికి చెందిన మాచర్ల సంతోష్పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేశ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
వనాల జిల్లాకు వన్నె తెచ్చేలా..
ములుగు జిల్లాలోని 171 గ్రామ పంచాయతీ నర్సరీల్లో 11,59,193 మొక్కలు పెంచుతున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నర్సరీలో 6 వేల మొక్కల చొప్పున పెంచారు. దీంతో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు నర్సరీల్లో 2.15 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇందులో 1,00,793 మొక్కలను గతంలో నాటిన వాటి స్థానంలో నాటనున్నారు. నర్సరీల్లో నీడనిచ్చె చెట్లతో పాటు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను పెంచుతున్నారు. నీడనిచ్చే మొక్కలు కానుగ, ఎర్రతొగరు, నారేప, రావి, మర్రి, జువ్వి, ఇప్ప, వెదురు చెట్టు, పండ్ల మొక్కలు జామ, మామిడి, నిమ్మ, పనస, పూల మొక్కలు మందార, మల్లె, గులాబీ మొక్కలను పెంచుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పండ్ల, పూల మొక్కల్ని పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అడవుల ఖిల్లా.. ములుగు జిల్లాకు మరింత వన్నె తెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వన మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 14.16 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు టార్గెట్ విధించారు. ఆయా నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వర్షాలు కురవగానే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – ములుగు రూరల్ విస్తారంగా అడవులున్పటికీ ములుగు జిల్లాలో అదే స్థాయిలో చెట్ల నరికివేత ఉందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న అడవుల్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మరికొద్ది రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు నాటిన మొక్కలు ములుగు జిల్లాలో 2022 నుంచి 2024–25 వరకు మొత్తం 14,39,967 మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఇందులో 14,00,967 మొక్కలు సమృద్ధిగా పెరిగాయని డీఆర్డీఏ అధికారులు తెలిపారు. మొక్కల సంరక్షణకు 10.17 కోట్లు వెచ్చించారు. ఈఏడాది వివిధ శాఖల ద్వారా జిల్లాలో టార్గెట్ 14,00,165 మొక్కలు నాటనున్నారు.జిల్లాలోని మండలాలు 10జనాభా 2,94,671 జిల్లా విస్తీర్ణం 3,881 స్క్వేర్ కిలోమీటర్లు జిల్లాలో అటవీ విస్తీర్ణం 2,00,835 హెక్టార్లు మల్లంపల్లి పరిధి అటవీశాఖ నర్సరీలో మొక్కలు -
పెరుగుతున్న గోదావరి ఉధృతి
వాజేడు మండలం పేరూరు వద్ద బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరువరద నీరు ఉధృతంగా వస్తుండడంతో గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో వాజేడు మండలంలో గోదావరి ఉప్పొంగుతోంది. పలు చోట్ల రహదారులు ముంపునకు గురయ్యాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై పలు చోట్ల వంతెనలు మూసివేశారు. ప్రజలెవ్వరూ నీటిలోకి వెళ్లకుండా రహదారులపై ట్రాక్టర్లను అడ్డుపెట్టారు. – మరిన్ని వార్తలు 8లోu -
సఖి సేవలు వినియోగించుకోవాలి
ములుగు రూరల్: గృహ హింస బాధితులు సఖి సేవలు వినియోగించుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సఖి కేంద్రంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేధింపులకు గురవుతున్న మహిళలు న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు సఖి సిబ్బంది సత్వర సహాకారాలు అందించాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, లీగల్ సర్వీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాదికారి తుల రవి, డీసీపీఓ ఓంకార్, లావణ్య, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జనం.. కుటుంబ బలం!
చిన్న కుటుంబమే మంచిది..ఏటూరునాగారం: 1992లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు నవ్య, సౌమ్యలు జన్మిచండంతో చాలు అనుకున్నాం. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపించాము. పిల్లలు వెళ్లిపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాం. ప్రస్తుత కాలంలో మారిన ఆర్థిక పరిస్థితుల దృష్యా ఇద్దరు పిల్లలే ముద్దు. ముగ్గురు ఉంటే ఖర్చులు భరించడం ఇబ్బందిగా ఉంటుంది. చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. – గడ్డం సదానందం, శారదఒక్కరే చాలు అనుకున్నాం..ఏటూరునాగారం: మండలంలోని 7వ వార్డుకు చెందిన చిటమట గంగాధర వసంతలకు 2005 ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. వీరికి కుమారుడు సాయి నిషాంత్ ఉన్నారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక్కరే మంచిదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం కుమారుడు ఐఏఎస్ కోచింగ్ పొందుతున్నాడు. ఇద్దరం చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. – చిటమట గంగాధర, వసంత ఒకప్పుడు ప్రతీ ఇంట్లో పిల్లల సైన్యం ఉండేది. రేషన్ కార్డులోనైతే వారి పేర్లకు జాగా సరిపోయేది కాదు. అలాంటిది కుటుంబ నియంత్రణ శాఖ అవగాహన. పెరుగుతున్న ఆర్థిక భారం తదితర కారణాలతో ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటూ ‘మేమిద్దరం.. మాకిద్దరు’ అంటూ ఇద్దరితో సరిపెట్టుకున్నారు. ఆధునికతతో పరుగులు పెడుతున్న యువత, , భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతో ప్రస్తుతం ‘ఒక్కరు చాలు’ అంటున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్లో యువజనులు తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువమంది పిల్లల్ని కన్న కుటుంబాలు ఎలా సంతోషంగా ఉండగలిగారు? జీవితాలకు ఉమ్మడి కుటుంబాలు ఎలా మేలు చేస్తాయి? తదితర అంశాలపై జిల్లావాసులేమంటున్నారనేది నేడు(శుక్రవారం) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఎక్కువమంది పిల్లలున్నా ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు ప్రస్తుతం ఒక సంతానానికే ప్రాధాన్యమిస్తున్న యువజంటలు మారుతున్న కాలానికనుగుణంగా ఫ్యామిలీ ప్లానింగ్ పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్లో యువజనాభా తగ్గుతుందంటున్న పరిశీలకులు నేడు ప్రపంచ జనాభా దినోత్సవ -
వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో గురువారం ఉదయం సాయిబాబా, దత్తాత్రేయుడు, వినాయకుడి విగ్రహాలకు పంచామృత అభిషేకాలను, పుష్పార్చనలను అర్చకులు యల్లాప్రగడ భానుప్రకాశ్ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏఎస్పీ శివం ఉపాధ్యాయ దంపతులతో ఆలయానికి చేరుకొని పుష్పార్చనలను చేశారు. అలాగే భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా ఏఎస్పీ దంపతులు స్వయంగా వడ్దించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆయన వెంట స్థానిక ఎస్సై రాజ్కుమార్, ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్తో పాటు జగదీశ్, సతీష్, రమేష్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
సంతోషంతో సమానంగా ఇబ్బందులు..
భూపాలపల్లి: మాకు ముగ్గురు పిల్లలు. పాఠశాలకు పంపేందుకు పిల్లలను తయారు చేయడంతో పాటు ఫీజులు తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయినప్పటికీ కష్టంతో కూడిన సంతోషాన్ని అనుభవిస్తున్నాం. గతంలో మా తల్లితండ్రులతో ఉన్నప్పుడు పిల్లలను చూసుకోవడం పెద్దగా ఇబ్బంది అయ్యేది కాదు. ఉద్యోగ రీత్యా తల్లితండ్రులకు దూరంగా ఉండి పిల్లలను చూసుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయినా కష్టాలను ఓర్చుకుంటూ ఎవరికీ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాం. ఒకరికి మాత్రమే జన్మనిస్తే చిన్నారులు తోడబుట్టిన వారు లేక కుంగిపోయే అవకాశం ఉంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే చిన్నతనంలో కొంత కష్టమైనా పెద్ద పెరిగాక కష్టసుఖాల్లో ఒకరినొకరు పాలుపంచుకుంటారు అనేది మా ఉద్ధేశం. ముగ్గురు పిల్లలు ఉండటం వలన ఒకరినొకరు ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ, బంధాల మధ్య పెరుగుతున్నారు. – పసునూటి శ్రీనివాస్, భూపాలపల్లి -
ఇద్దరితో సంతోషంగా ఉన్నాం..
వెంకటాపురం(ఎం): ప్రస్తుత కాలంలో రోజురోజుకూ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాం. అంతకంటే ఎక్కువ ఉంటే ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇద్దరు పిల్లలను చదివించడానికి చాలా కష్టపడుతున్నాం. పిల్లల చదువుకోసం జిరాక్స్ సెంటర్, కిరాణం షాపు నడుపుతూ పిల్లల్ని చదివిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని ఉంటే ఎంత కష్టపడినా వారిని ఉన్నతంగా చదివించలేము. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – మోడెం శ్రీనివాస్, అనిత దంపతులు -
ప్రభుత్వానికి రూ. 6.89లక్షల ఆదాయం
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఎకై ్సజ్ కార్యాలయం పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను గురువారం ఎకై ్సజ్ సూపరింటెండెండ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు వాహనాల వేలం పాటను స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించినట్లు ఎకై ్సజ్ సీఐ కిశోర్ తెలిపారు. ఈ వేలం పాటకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ లింగాచారి హాజరై నిర్వహించగా 24 వాహనాలకు రూ. 6.89 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి మలుగు రూరల్: ఈ నెల 16న హనుమకొండలో నిర్వహించనున్న బ్యాండ్ వాయిజ్య కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు అంకూస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో వాయిజ్య కళాకారుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ తేదీ ఉదయం హనుమకొండలోని లష్కర్ ఫంక్షన్హాల్లో ఉదయం 11గంటలకు రాష్ట్ర సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సదస్సుకు కళాకారులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రవీందర్, సాంబయ్య, ఐలయ్య పాల్గొన్నారు. -
బీఎల్ఓల పాత్ర కీలకం
వాజేడు: ఓటరు నమోదు, తొలగింపు ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర కీలకమని భద్రాచలం ఆర్డీఓ కె.దామోదర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాల బీఎల్ఓలకు గురువారం మాస్టర్ ట్రైనర్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ దామోదర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి దరఖాస్తులను తీసుకోవడం, ఓటరు లీస్టులోని సవరణలకు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి ప్రక్షాళన చేసే విషయంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. గతంలో నిర్వహించిన ఎన్నికల సమయంలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదని తెలిపారు. ఈ దఫా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. స్థానిక అధికారుల సలహాలు, సూచనలను తీసుకోవాలని తెలిపారు. శిక్షణ తీసుకోవడంతో కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవచ్చని వివరించారు. గత ఐదేళ్లుగా తమకు డబ్బులు చెల్లించడం లేదని బీఎల్ఓలు ఆర్డీఓకు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే పరిశీలన చేశామని త్వరలోనే డబ్బులు అందేలా చూస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఆర్డీఓ దామోదర్ -
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu1. మీరు ఎంత మంది పిల్లలను కనాలనిఅనుకుంటున్నారు?3. పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనే ప్లాన్ ఎలా చేస్తారు? 2. ఉమ్మడి కుటుంబమా.. ఒంటరిగా ఉండడం ఇష్టమా? ఉమ్మడి కుటుంబం భార్యాభర్తలు విడిగా ఉండడంభార్యాభర్తలు జాబ్ చేయడం వల్ల పిల్లలను చూసుకునే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని..4. ఈ తరంలో ఒక్కరు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు ఎందుకు? 401510051624263620‘ఒక్కరు.. లేదా ఇద్దరు పిల్లలు చాలు. అంతకంటే ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవు. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని అంటున్నారు యువజంటలు. దీంతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మారిన జీవన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఈ తరం ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ వచ్చే ఇరవై ఏళ్లలో యువజనుల జనాభా తగ్గి, సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురికి పైగా.. బిడ్డల్ని కనాలన్న సూచనలు వస్తున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనే విషయంలో యువజంటలు ఏమంటున్నాయి.. వీరితో పాటు 25 ఏళ్ల పైబడి వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారి మనోగతంపై ‘సాక్షి’ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అంశాలపై సర్వే నిర్వహించింది. అంతకంటే ఎక్కువ కనలేమంటున్న యువ జంటలుఉమ్మడి కుటుంబంలో ఉంటేనే సంతోషం ● ‘సాక్షి’ సర్వేలో స్పష్టీకరణ – సాక్షి నెట్వర్క్ న్యూస్రీల్ -
పెరుగుతున్న గోదావరి
ఏటూరునాగారం/వాజేడు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది వరద క్రమక్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం నాటికి రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటిమట్టం 13 మీటర్లకు చేరింది. అయితే వరద క్రమంగా పెరుగుతోందని కేంద్ర జలవనరుల అధికారులు తెలిపారు. సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. పేరూరు వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరుకుంది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ కనిపిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13మీటర్లకు చేరిన నీటిమట్టం -
వైభవంగా సీతారాముల కల్యాణం
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం దమ్మక్క ఉత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవ తంతును వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల రామనామస్మరణల నడువ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వరస్వామి కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ అజయ్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలి వెంకటాపురం(కె): మండలంలోని ఇసుక ర్యాంపులకు వచ్చే ఇసుక లారీలకు ఇసుక సొసైటీలు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని యాకన్నగూడెం బ్రిడ్జి వద్ద ఇసుక లారీలతో గురువారం ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్ చేశారని తెలిపారు. ఇసుక క్వారీ నిర్వహకులు, సొసైటీ సభ్యులు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసుకోవాలని, రోడ్ల పై వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 30 లారీలకు జరిమానా వాజేడు: నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై నిలిపిన 30 ఇసుక లారీల యజమానులకు జరిమానా విధించినట్లు పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ధర్మారం నుంచి చెరుకూరు వరకు రహదారిపై రాంగ్ పార్కింగ్లో నిలిపిన లారీలకు జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఇసుక క్వారీ నిర్వహకులు లారీలను నిలపడానికి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 17న గుండె ఆపరేషన్లు ములుగు రూరల్: జిల్లాలోని రాష్ట్రీయ బాలల సస్త్య కార్యక్రమంలో గుర్తించిన పది మంది పిల్లలకు ఈ నెల 17న సిద్ధిపేటలో గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ పది మంది పిల్లలకు సాయి సంజీవని ట్రస్ట్ సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో ఉచిత ఆపరేషన్ తో పాటు ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిసంజీవని ట్రస్టు వాలంటీర్లు దామోదర్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం కోఆర్డినేటర్ నరహరి, శ్రీనివాస్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి వెంకటాపురం(కె): ఏజెన్సీలో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు అధిక ఫీజలు వసూలు చేస్తున్నాయని, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని విద్యా సంస్థల్లో క్రీడా మైదానాలు కూడా లేకపోవడంతో పాటు మౌలిక వసతులు లేవని వివరించారు. -
లేబర్ కోడ్లు రద్దుచేయాలి
మలుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేసి నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్లు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. 8 గంటల పని విధానానికి బదులు 10 గంటల పని విధానాన్ని నిర్ణయించే జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, ఐల్లయ్య, కృష్ణ, నారాయణ సింగ్, రవి, ప్రవీణ్, మహేష్, నీలాదేవి, మంజూల, సరిత, సరోజీని పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా -
‘చేపల వేటకు వెళ్లొద్దు’
ములుగు రూరల్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మాన్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం ఉత్తర్వుల నంబర్ 186, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ 25/11/1995 ప్రకారం జూలై, ఆగస్టు మాసాలలో చేపలు గుడ్లు పెట్టే దశను దృష్టిలో ఉంచుకుని చేపల వేట నిషేధించినట్లు తెలిపారు. వర్షాల సమయంలో మత్స్యకారులు చెరువులు, కుంటలు, జలాశయాలకు చేపల వేటకు, ఈతకు వెళ్లకూడదని వివరించారు. చెరువులు మత్తడి పోసే సమయంలో మత్తడి వద్ద సిమెంట్ దిమ్మెలు, జాలీలను ఏర్పాటు చేయకూడదని సూచించారు. అలా చేస్తే చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం గోవిందరావుపేట: జిల్లా పరిధిలోని వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని జవహర్నగర్ మోడల్ స్కూల్, గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కంప్యూటర్ ల్యాబ్లను అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్జీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీ పాఠశాలకు 10కంప్యూటర్లు, ఒక ప్రింటర్ను దాతలు వరంగల్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంబటి శ్రీజన్, ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీధర్రాజులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఇరు పాఠశాలల ఉపాధ్యాయులు కంప్యూటర్ల దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెండర్ అండ్ ఈక్వీటీ కో ఆర్డినేటర్ గ్యాదరి రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, మోడల్ స్కూల్ జవహర్ నగర్ ప్రిన్సిపాల్ కృష్ణ, చల్వాయి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తుల వివరాల నమోదు పూర్తి ములుగు రూరల్: జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలాన్ని ప్రభుత్వం భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను భూ భారతి పోర్టల్లో నమోదు పూర్తి చేసినట్లు ములుగు ఆర్డీఓ వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటాపురం(ఎం) మండలంలో 9 రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి 4,555 దరఖాస్తులను స్వీకరించగా క్షేత్రస్థాయి రికార్డుల పరిశీలించి 1841 దరఖాస్తులు ఆమోదించినట్లు తెలిపారు. 513 పీఓటీ దరఖాస్తులు, 143 నూతన అసైన్డ్మెంట్ దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆమోదింపబడిన దరఖాస్తుల వివరాలు భూభారతి పోర్టల్లో నమోదు అయ్యాయని దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకునేందుకు ఉదయం 10.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెల్ నంబర్ 9985839187లలో సంప్రదించాలని లేదా వెంకటాపురం(ఎం) తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. అప్రెంటిస్షిప్ మేళా భూపాలపల్లి అర్బన్: ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా(పీఎంఎన్ఏఎం)ను ఈ నెల 14వ తేదీన స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని విని యోగించుకోవాలని కోరారు. ఐటీఐ ఉత్తీర్ణులైనవారు www. apprenticeshipindia. gov. in పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని సూ చించారు. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటిస్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. భూపాలపల్లిలో జరిగే ఈ మేళాకు హైదరాబా ద్కు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. బాలకార్మికుడి గుర్తింపు కాటారం: బాల కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్న వారిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. కాటారం మండలం గంగారం గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న బాలకార్మికుడిని బుధవారం అధికారులు గుర్తించారు. ‘ఆపరేషన్ ముస్కాన్’లో భాగంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద, బాలల సంరక్షణ అధికారులు సాయిరాంగౌడ్, లింగారావు, పోలీసుల బృందం కలిసి గంగారంలో తనిఖీలు చేపట్టారు. -
టెక్స్టైల్ క్లాత్ వేసింది.. వంద మీటర్లే..
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuగోదావరి ఒడ్డుకు వేసిన టైక్స్టైల్ క్లాత్ఏటూరునాగారం: వర్షాకాలం వచ్చిందంటే ఇరిగేషన్ అధికారులు నామమాత్రంగా గోదావరి కరకట్ట, ఒడ్డుకు మరమ్మతులు చేపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో గోదావరి ఉధృతికి విలువైన భూములను రైతులు కోల్పోతున్నారు. మళ్లీ వర్షాకాలం ముగిసే వరకు ఆ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న గోదావరి కరకట్ట నిత్యం కోతకు గురవుతూ వస్తుంది. ఈ ఏడాది కోతకు గురికాకుండా ఉండేందుకు నూతన సాంకేతిక పద్ధతితో టెక్స్టైల్ క్లాత్ను వంద మీటర్ల వరకు అమర్చి కోతకు గురికాకుండా తగు జాగ్రత్తలను చేశారు. కానీ మరోచోటు నుంచి ఒడ్డు కోతకు గురవుతూ వస్తుంది. దీంతో ఏం చేయాలో అర్ధంకాక ఇసుక బస్తాలను ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. గేట్ల మూసివేతలో నిమ్మకు నీరెత్తినట్లుగా.. ఈ ఏడాది వర్షాలు భారీగా లేకపోవడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చడం లేదు. దీంతో మరమ్మతులు చేసుకునే వెసులుబాటును కల్పించినప్పటికీ ఇరిగేషన్శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కరకట్టకు ఉన్న గేట్లను మూసివేడయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జంపన్నవాగు వద్ద మూడో గేటు తెరిచి ఉడడం గమనార్హం. ఇరిగేషన్ శాఖ అధికారులకు వరద అంతా గ్రామంలోకి వచ్చే వరకు పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా గేట్లను మరమ్మతులు చేయించి వెంటనే మూసివేసి నీరు గ్రామంలోకి రాకుండా చేయాలని రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యూస్రీల్కోతకు గురవుతున్న గోదావరి ఒడ్డు అరకొరగా గేట్లు మూసివేత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్శాఖ -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ములుగు రూరల్: విద్యార్థులు లక్ష్యంతో చదవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇన్ఫోసిస్ వారి సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఉంటు ఇదే పాఠశాలలో 4 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించానని తెలిపారు. చదువుపై ఆసక్తితో పీహెచ్డీ పూర్తి చేశానని వెల్లడించారు. లక్ష్యంతో చదివితే చదువుకు పేదరికం అడ్డుకాదని వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నా భోజనం అందించడంతో పాటు పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో రూ. 6లక్షల నిధులతో మూడు టాయిలెట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్కకు పాఠశాల విద్యార్థులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశా ఫౌండేషన్, ఈఎల్ఎఫ్ ఇంగ్లిష్ వారి సహకారంతో జిల్లాలో రెండోదశ లర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని సీతక్క ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్పై పట్టు సాధించాలని సూచించారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో దివ్యాంగులకు మోటర్ వెహికిల్స్ మంత్రి సీతక్క అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు వాహనాలు అందించినట్లు వెల్లడించారు. కొడిశలకుంటకు చెందిన బానోత్ యాకూబ్, నర్సాపూర్ గ్రామానికి చెందిన గుర్రం శ్రీహరిలు వాహనాలు అందుకున్నట్లు తెలిపారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
మేడారం జాతర విశిష్టతను కాపాడుకోవాలి
● సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర విశిష్టతను కాపాడుకోవాలని సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్ అన్నారు. మండల పరిధిలోని ఐటీడీఏ అతిథి గృహంలో వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ సంస్కృతి పరిరక్షణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాటాల్డారు. మేడారం మహాజాతర ప్రకృతితో మమేకమై సాగుతుందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాకొద్ది జాతరను వారికి అనుగుణంగా మార్చుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. గద్దెల విశిష్టత తగ్గకుండా పనులు చేయాలన్నారు. మార్పుల విషయంలో స్థానిక పూజారుల, ఆదివాసీల అభిప్రాయాలు స్వీకరించాలన్నారు. అనంతరం సమ్మక్క జాతర పుస్తక రచయిత సూరయ్య మాట్లాడుతూ మేడారం జాతర ఎంతో పవిత్రమైందన్నారు. జాతర ఆసియా ఖండలోనే అతిపెద్ద గిరిజన జాతర కనుక అంతర్జాతీయ స్థాయిలో గిరిజన సంస్కృతి జాతర ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆంగ్లంలో పుస్తకం తీసుకువచ్చామన్నారు. అనంతరం వనవాసీ సంఘ సభ్యులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఆదివాసీ గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. జాతర పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అనంతరం సమ్మక్క – సారలమ్మ జాతర విశిష్టతపై దుర్గం సూర్య రచించిన పుస్తకాన్ని వారు ఆవిష్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ కుర్సం రవికుమార్, వనవాసీ కల్యాణ పరిషత్ కార్యదర్శి మైపతి సంతోష్కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మ ణ్, నాయకులు హనుమంతరావు పాల్గొన్నారు. -
ముందుకు సాగట్లే..!
ఉమ్మడి వరంగల్లో 2025–2026 వానాకాలం సాగు అంచనా, సాగు లెక్క ఇదీ..సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై రెండు మాసాలు నడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చేరక.. పెరిగిన భూగర్భజలాలు కూడా అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా..ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల ఈసారి ఆశించిన మేరకు సాగు పెరగలేదని, అయితే ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా లోటు వర్షపాతమే... వరి సాగు 6.39 శాతమే.. జనగామ జిల్లాల్లో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షాపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది.మొత్తం సాగు అంచనా 15,82,755 ఎకరాలుఇప్పటి వరకు సాగైన విస్తీర్ణం 5,46,138 ఎకరాలు మొత్తం సాగు శాతం 34.50 శాతంఉమ్మడి వరంగల్ జిల్లాకు కలిసిరాని వానాకాలం గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు లోటు వర్షపాతం ఖాతాలో ఆరు జిల్లాలు కష్టకాలంలో పత్తి సాగువైపే మొగ్గు... వరి సాగుపై వేచి చూసే ధోరణి -
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ములుగు రూరల్: ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ అధికారి కనకశేఖర్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యవర్గ నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ 7 సంవత్సరాలుగా కమిటీ లేకుండా నిర్వాహణ సాగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా, రాష్ట్ర టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మహిళా కోఆపరేటీవ్ కార్పొరేషన్ చైర్మన్ శోభ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, చాంద్పాషా, మాడుగుల రమేష్, చిక్కుల రాములు, దేవ్సింగ్, పాలకుర్తి సమ్మయ్య, రేవంత్యాదవ్ పాల్గొన్నారు. -
కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోం
ములుగు రూరల్: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేశ్ మృతికి మంత్రి సీతక్క కారణమని ఏ–1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని, బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోమని పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కేటాయించారని, సీతక్క చల్వాయి గ్రామానికి ఏం చేసిందని వాట్సప్ గ్రూప్లో ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకుల బెదింపులకు రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. కాంగ్రెస్ నాయకుల అవినీతి, అక్రమాలు నిలదీస్తూ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపితే పోలీస్ యాక్ట్ అమలు చేశారన్నారు. అదే విధంగా చల్వాయిలో నిరసన చేపడుతుంటే కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి సీతక్కకు అబద్ధాలు చెప్పడం, రీల్స్ చేయడం తప్ప పనిచేయడం తెలియదన్నారు. శనిగకుంట, బంధాల గ్రామాల్లో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, కొండాయి ప్రజలకు బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ శివారులో రామారం, బీమారం, ఉనికిచర్ల, దేవన్నపేట ప్రాంతాల్లో భూదందాలు చేపట్టారని ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు.బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి -
వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా స్వర్ణకుమారి
ఆస్పత్రి సూపరింటెండెంట్గా చంద్రశేఖర్ ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా స్వర్ణకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్గా చంద్రశేఖర్లను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట మెడికల్ కళాశాల చర్మవ్యాధి విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ మోహన్లాల్ను డిప్యుటేషన్పై జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా, ఆస్పత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహించారు. వరంగల్ ఎంజీఎంలో చర్మ వ్యాధి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్వర్ణకుమారిని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పదోన్నతి కల్పించి నియమించారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలో ములుగు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్కు పదోన్నతి కల్పించి ఆస్పత్రి సూపరింటెండెంట్గా నియమించారు. వరదల సమయంలో అప్రమత్తంములుగు రూరల్: వరదల సమయంలో ముంపు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. మండల పరిధిలోని రాయినిగూడెం వైద్యశాలలో వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల్లోని గర్భిణులు వర్షాకాలం వరదల సమయంలో ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ యాక్షన్ టీం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చినప్పుడు తక్షణమే గ్రామాలను సందర్శించి దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. నీటి నిల్వలపై దృష్టి సారించి తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు అన్వేష్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ పవన్ కుమార్, శ్రీకాంత్, రణధీర్, సంపత్, సురేష్ పాల్గొన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ములుగు రూరల్: గీత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్రి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా, తాడి కార్పొరేషన్ చెక్కులు తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ సంబంధం లేకుండా గీత కార్మికులకు పింఛన్ ఇవ్వాలని సూచించారు. ఏజెన్సీలో రద్దు చేసిన గీత కార్మిక సొసైటీలను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 14న నిర్వహించనున్న నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఏటూరునాగారం: మహిళలు ఆర్థికంగా ఎదగాలని సెర్ప్ జిల్లా ఏపీడీ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమాన్ని డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సాధికారత సాధించే దిశగా అవగాహన కల్పించామన్నారు. గ్రూపులో లేని సభ్యులను సంఘాలలో చేర్పించాలని సూచించారు. వృద్ధులు, కిశోర బాలికలతో సంఘాలు ఏర్పాటు చేసి గతేడాది, ఈ ఏడాది సాధించిన ఆర్థిక ప్రగతి, లక్ష్యాలపై సభ్యులకు, సిబ్బందికి వివరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఎం సతీష్, మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సీసీలు, వీఏఓలు పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసి తట్టుకోలేక అవాక్కులు
ములుగు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాధితులు మాట్లాడారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లాలో జరుగతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బరదచల్లె ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్కు రెండు గదుల రేకుల షెడ్ ఉందని అందుకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎంపిక కాలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆస్పత్రుల్లో ఫొటోలకు పోజులు బీఆర్ఎస్ నాయకులు రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ తన మిడతల దండుతో నియోజకవర్గంలో డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. 70 ఏళ్ల చరిత్రలో గిరిజన మహిళకు సీఎం రేవంత్రెడ్డి, రాహుల్గాంధీలు మంత్రి వదవి ఇచ్చారని పదవి దక్కితే ఓర్చుకోలేక అస్యతపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో అభివృద్ది పనులు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దందాలు, ఇసుక, ఎర్రమట్టిక్వారీలు, దోపిడీకి పాల్పడుతున్నారని తదితర వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు 60 వేల దరఖాస్తులు వస్తే అరుమలైన 20 వేల మందిని ఎంపిక చేశామని అందులో మొదటి విడతలో 5 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను విడుతల వారిగా కేటాయిస్తామని అన్నారు. అమాయక ప్రజలను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు మంత్రి సీతక్క -
ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలను పూర్తిచేయాలి
ములుగు రూరల్/ఎస్ఎస్తాడ్వాయి: ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అసరమైన డాక్యుమెంట్లు, అననుమతులు, మౌలిక వసతుల కల్పన, కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ హార్టికల్చర్ సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని వివరించారు. పంట మార్పిడి ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే జిల్లా విద్యాశాఖ, దిశా ఫౌండేషన్, ఈఎల్ఎఫ్వారి సౌజన్యంతో జిల్లాలో విద్యార్థులకు ఇంగ్లిష్పై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు, స్టోర్ గదిని పరిశీలన చేశారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్లకు స్థల పరిశీలన ఏటూరునాగారం: ఏజెన్సీలోని ప్రజల అవసరాల నిమిత్తం వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని బూటారం గ్రామంలోని ముంపు బాధితులకు ఇళ్ల స్థలాల కోసం ఎక్కెల సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్జీతో కలిసి మంగళవారం పరిశీలించారు. అలాగే ఏటూరునాగారంలోని అటవీశాఖ నర్సరీ ఉన్న ప్రాంతంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి చిన్నబోయినపల్లిలోని సర్వే నంబర్ 98 అటవీ శాఖలోని భూమి సాగుదారులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం వీలు కాదన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
అభివృద్ధి పథం..
● మానుకోట జిల్లా సోమ్లాతండా, కేసముద్రంలో రూ.400కోట్ల పనులకు శంకుస్థాపనలు ● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబా బాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. రూ.400కోట్ల పనులకు శంకుస్థాపన మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. కార్యకర్తల్లో జోష్.. బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు, ట్రైకార్ చైర్మన్ బెల్ల య్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు ఏమన్నారంటే...– వివరాలు 8లోu -
గొత్తికోయలు గొడవలు పెట్టుకోవద్దు
ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి– పస్రా మార్గ మధ్యలోని తోగు గొత్తికోయగూడెంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని తగాదాలు పెట్టుకోవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలని డీఎస్పీ రవీందర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన గొత్తికోయగూడెంలోని సమస్యల గురించి గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ గొత్తికోయలతో మాట్లాడారు. ఆయన వెంట పస్రా సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డిలు ఉన్నారు, అనంతరం ఎస్సై శ్రీకాంత్రెడ్డి కాటాపూర్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాల పెండింగ్ చలాన్లను కట్టించారు. -
వైఎస్సార్ సేవలు మరువలేనివి
ములుగు రూరల్: జనహృదయ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ 76వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ ఎనలేని సేవలందించిన మహోన్నత వ్యక్తి అన్నారు. సీఎంగా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దిక్చూచిగా మారాయని తెలిపారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత ఆయనదే అన్నారు. 104, 108 అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిర జలప్రభ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని పెంచి దేశ మొత్తం గర్విచదగ్గ నాయకుడిగా మన్ననలు పొందారన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించి పేదల పెన్నిధిగా వైఎస్సార్ నిలిచారని ఆయన సేవలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.మంత్రి ధనసరి సీతక్క -
చేపల వేట నిషేధం
వెంకటాపురం(ఎం): జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటలలో జూలై, ఆగస్టు మాసాల్లో మత్స్య కార్మికులు చేపలు పట్టకుండా మత్స్యశాఖ నిషేధాజ్ఞలు జారీ చేసింది. శాఖ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా చేపలు పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జూలై, ఆగస్టు నెలల్లో చేపల పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని రామప్ప సరస్సు, లక్నవరం జలాశయం, తుపాకులగూడెం ప్రాజెక్టు, నర్సింహసాగర్ ప్రాజెక్టు, పాలెం ప్రాజెక్టు లాంటి జలాశయాలపై పూర్తిస్థాయి మానిటరింగ్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రెండు కిలోల నుంచి.. రూ. రెండు లక్షల పిల్లలు ఒక రెండు కిలోల చేప నుంచి రెండు లక్షల రూపాయలకు పైగా పిల్లలు పునరుత్పత్తి జరుగుతాయని మత్య్సశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందులో 10 శాతం బతికినా 20 వేల చేపలు ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు నెలల్లో ఒక్క చేపను కోల్పోయినా దాని నుంచి వచ్చే లక్షల చేప పిల్లలను కోల్పోయినట్లేనని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు జలాశయాల్లో చేప పిల్లల సంఖ్యను పెంచేందుకు మత్స్యశాఖ స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీస్తే సహించేది లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. 400 టన్నుల చేపల ఉత్పత్తి జిల్లాలో నెలకు సుమారు 400 టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన జలాశయాలతో పాటు 493 చెరువులు, కుంటలు ఉండగా వాటి పరిధిలో 14,204 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి ఉంది. జిల్లాలో 66 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా 4,853 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులు, కుంట ల్లోని చేపలను పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. చెరువుల్లోని చేపలతోనే ఉత్పత్తి గత కొన్నేళ్లుగా జిల్లాలోని ప్రధాన జలాశయాలతో పాటు చెరువుల్లో 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదులుతున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 79.83 లక్షల చేప పిల్లలను సబ్సిడీపై చెరువుల్లో విడుదల చేశారు. చేప పిల్లలను చెరువుల్లో వదిలే సమయం సరిగా లేకపోవడంతో చిన్న చేప పిల్లలను పెద్దవి తినడంతో పాటు వాతావరణం సహకరించక చేపపిల్లలు మృతిచెందుతూ వస్తుండడంతో ఈ పథకంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న చేపలను రెండు నెలల పాటు వేటాడకుండా అలాగే వదిలేస్తే ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలు అవసరం లేకుండా, చెరువుల్లోని చేపలతోనే లక్షలు, కోట్ల చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. రెండు నెలలు నిషేధం జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని జలాశయాల్లో, చెరువులు, కుంటలలో చేపల వేటను నిషేధించడమైంది. ఈ రెండు నెలల్లో ఒక్కచేపను పట్టినా లక్షల చేపలను పుట్టకుండా చేసినట్లే. జూలై, ఆగస్టు నెలల్లోనే చేపలు పునరుత్పత్తి చేస్తుంటాయి. కాబట్టి జలాశయాల్లోని చేపలకు ఇబ్బంది కలగకుండా మత్స్యకారులు సహకరించాలి. ఎవరైనా చేపలు పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి. – సల్మాన్ రాజ్, జిల్లా మత్స్యశాఖాధికారిపునరుత్పత్తి దశ కావడంతో మత్స్యశాఖ నిర్ణయం జూలై, ఆగస్టు మాసంలో చెరువుల్లో చేపలు పడితే చర్యలు ప్రతినెలా 400 టన్నుల చేపల ఉత్పత్తి జిల్లా వ్యాప్తంగా 4,853 మంది మత్య్సకార్మికులకు ఉపాధినిషేధం ఎందుకంటే.. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఈ సమయంలో చేపల్లో పునరుత్పత్తి హార్మోన్ బలంగా అభివృద్ధి చెందుతుంది. జూలై, ఆగస్టులో చేపలు తమ పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. ఆడ చేపలు ఎగ్ రిలీజ్ చేస్తే, మగ చేపలు స్పెర్మ్ను రిలీజ్ చేస్తాయి. దీంతో చేప పిల్లలు బయటకు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జలాశయాల్లోకి కొత్త నీరు వస్తుండటంతో పాటు చెత్తాచెదారం కొట్టుకుని వచ్చి నీళ్లపై తేలుతూ ఉంటుంది. ఈ సమయంలో చెత్తాచెదారం కింది భాగంలో ఆడ చేపలు గుడ్లపై పొదుగుతుంటాయి. వాటిపై సూర్యరశ్మి పడి రెండు మూడు రోజుల్లోనే గుడ్ల నుంచి చేప పిల్లలు బయటకు వస్తాయి. ఈ ప్రక్రియంతా జూలై, ఆగస్టు నెలల్లో 3 నుంచి 5 సార్లు సాగుతుంది. -
కేటీఆర్.. ఎందుకు నీకింత అహంకారం?
సాక్షి, ములుగు: ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని.. అంతేగానీ రోడ్ల మీదకు రావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఉద్దేశించి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. కేటీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలంటే నీకు గిట్టదు. సొంత చెల్లె నీ అహంకారాన్ని చూసి నీపై మట్టి పోస్తోంది. నువ్వు ఓర్తలేవని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇప్పుడు ఆదివాసి మహిళా అని చూడకుండా నన్ను టార్గెట్ చేస్తున్నావ్.. ఎందుకు?. ఇలా చేసి నువ్వు సాధించిందేది ఏమిటి?. కేటీఆర్.. నీకు ఎందుకు ఇంత అహంకారం. నీవు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే చెప్పు.. మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం ఎవరిని జైలుకు పంపించాం.70 ఏళ్ల చరిత్రలో కోయ వర్గానికి మంత్రి పదవి రాలేదు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. నేను తప్పులు చేశానని చెప్పడం కాదు.. అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలి. అంతేగానీ పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి రోడ్లమీద పోర్లాడితే సానుభూతి వస్తుందనుకోవడం నీ మూర్ఖత్వం. .. పదేళ్లు అధికారంలో ఉండి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన మీరు.. ములుగులో సీతక్క రాజ్యం . పోలీస్ రాజ్యం అంటూ ధర్నాలు చేస్తారా?. ములుగు లో నడుస్తుంది ప్రజారాజ్యం .ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన. ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టామో మీ దగ్గర లెక్క ఉంటే తీయండి. నిలదీయండి. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోలు ఏర్పాటు చేసి మాపై రోత వార్తలు రాపియడం ప్రజలు గమనిస్తున్నారు. ఆదివాసీ బిడ్డనైన నన్ను టార్గెట్ చేయడానికి మిడుతాల దండును పంపిస్తున్నావా కేటీఆర్. మేం సమ్మక్క సారక్క వారసులం. మా జోలికి వస్తే నాశనమై పోతావు అని మంత్రి సీతక్క అన్నారు.తాజాగా మంత్రి పొంగులేటితో జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలు కాపాడాలంటూ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల అరెస్టుతో ములుగు కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
కాంగ్రెస్ ఇన్చార్జ్గా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, వరంగల్: సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి పర్యటన తర్వాత ఆ పార్టీ హైకమాండ్ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన అధిష్టానం.. సోమవారం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్కు పార్టీ ఇన్చార్జ్గా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నియమించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్కుమార్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖను కేటాయించారు. నల్లగొండ ఇన్చార్జ్ మంత్రిగా కూడా ఉన్న లక్ష్మణ్కు ఉమ్మడి వరంగల్ పార్టీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్లో నెలకొన్న ఇటీవల నెలకొన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ సోమవారం లక్ష్మణ్కుమార్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలవనుండగా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సంస్థాగత కమిటీలు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించిన అధిష్టానం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేసే బాధ్యతలను అప్పగించినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి వీరి ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు! -
ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం
వాజేడు: ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వమని, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముందుకు సాగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కలు అన్నారు. మండల పరిధిలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, సీతక్కలు ముఖ్య అతిథులుగా హాజరై బాండ్ మొక్కజొన్న సాగు చేసి నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో 1,521 ఎకరాల్లో బాండ్ మొక్కజొన్న సాగు చేసిన 671మందికి రూ,3,80,97,264 నష్ట పరిహారం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు నష్ట పోవడం మంచిది కాదని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. బాండ్ మొక్కజొన్న వల్ల నష్టపోయిన వారి వివరాలు సేకరించి సదరు కంపెనీలనుంచి పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు కలిసి నడిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుంటే ప్రతిపక్షం తట్టుకోలేకపోతుందన్నారు. ఇసుక పాలసీలో మార్పులను తీసుకురావడం మూలంగా దోపిడీ వ్యవస్థలను పూర్తిగా రూపుమాపామని, దానిని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వాజేడులో మంత్రుల పర్యటన ఉండగా, దానికి అంతరాయం కల్పించడం కోసం ములుగులో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని అడ్డు తగిలే ప్రయత్నం చేశారన్నారు. మొక్క జొన్న రైతులకు పరిహారం రావడానికి ఎంతో కృషి చేశారని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ను అభినందించారు. ములుగు, భద్రాచలం, బొగత జలపాతాలను కలుపుతూ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కలెక్టర్ దివాకర, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ ఉన్నారు. వనాలను కాపాడుకోవడం అందరి బాధ్యత ఏటూరునాగారం: వనాలను కాపాడుకోవడం అందరి బాధ్యతని మంత్రి సీతక్క అన్నారు. చిన్నబోయినపల్లిలో ఈజీఎస్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించి మొక్కలను నాటారు. అలాగే చిన్నబోయినపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.55లక్షలు, వెంకటాపురం బీటీ రోడ్డుకు రూ.1.60కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. రమేశ్ కుటుంబానికి మంత్రి పరామర్శ గోవిందరావుపేట: మండల పరిదిలోని చల్వాయికి చెందిన చుక్క రమేష్ ఇటీవల వాట్సప్ గ్రూప్లో ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు ఇస్తున్నారంటూ జరిగిన చర్చల విషయంలో తప్పుడు కేసు నమోదు చేశారనే భయంతో ఇటీవల ఆత్మహత్యకు పాల్ప డిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో రాజ కీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మంత్రి సీతక్క బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు అందించారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్క మొక్కజొన్న బాండ్ నష్ట పరిహారం చెక్కుల పంపిణీ -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి పీఓ 40 వినతి పత్రాలను స్వీకరించారు. ఈ మేరకు ములుగు మండలం పత్తిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి జంగాలపల్లి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 6వ తరగతి ఆడ్మిషన్ కావాలని విన్నవించారు. తాడ్వాయి మండలం గంగారం గ్రామానికి చెందిన 17 మంది రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. మహాముత్తారం మండలం కోనంపేటకు చెందిన గిరిజన మహిళా పీఎంహెచ్ హాస్టల్లో ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అలాగే పంబాపూర్ నుంచి గిరిజనుడు లివర్ సర్జరీ అయినందున ట్రైబల్ రిలీఫ్ ఫండ్ కింద సహాయం చేయాలని పీఓను వేడుకున్నారు. నర్సంపేట మండలం అశోక్నగర్లో ఆర్ఓఎఫ్ఆర్ భూమిపై సోలార్ పవర్ ప్లాంట్ ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం ముళ్లకట్టకు చెందిన ఓ గిరిజనుడు ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. -
అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్బంధ పాలన
ములుగు రూరల్: జిల్లాలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు నిర్బంధాన్ని కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట సోమవారం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ సతీష్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతితో కలిసి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతునొక్కుతుందని విమర్శించారు. ఇటీవల గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ అర్హుడైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బెదిరింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రమేష్ది ప్రభుత్వ హత్యేగా అభివర్ణించారు. రమేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. రమేష్ మరణంపై శాంతియుత నిరసన చేపడతామని పోలీసుల అనుమతి కోరితే అనుమతి నిరాకరించడమే కాక పోలీస్ యాక్ట్ను అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెళ్తున్న నాయకులను హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్తున్న క్రమంలో పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం మంత్రి సీతక్క కాన్వాయ్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరగగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం రెడ్కో చైర్మన్ సతీష్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మంత్రుల పర్యటనకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రి సీతక్క ఎమర్జెన్సీని కొనసాగిస్తుందని ఆరోపించారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అరాచకాలను ప్రశ్నించిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సకినాల భవాని, భూక్య జంపన్న, మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి, చెన్న విజయ్, విజయ్రాంనాయక్, మాషిపెద్ది సత్యనారాయణరావు, మాలోత్ రవీందర్, కోగిల మహేష్, భిక్షపతి, ఆకుతోట చంద్రమౌళి, సమ్మయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి -
మంత్రులకు ఘనస్వాగతం
ములుగు రూరల్: జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్కలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టమ్మ ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. తొలుత మంత్రులు గట్టమ్మ ఆలయం వద్ద సోమవారం పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు చాంద్పాషా, వంగ రవియాదవ్, ఎల్లావుల అశోక్, ఒజ్జల కుమార్, ఓంప్రకాష్, భిక్షపతి, రేవంత్యాదవ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సర్కారు బడులను సద్వినియోగం చేసుకోవాలి ఏటూరునాగారం: సర్కారు బడులను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ దురిశెట్టి చంద్రకళ అన్నారు. మండల పరిధిలోని కొమురం భీమ్ నగర్లో నూతనంగా ప్రభుత్వం పాఠశాల మంజూరు చేయడంతో ఆ పాఠశాలను డీఈఓ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ముందుగా సావిత్రిభాయిపూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాంనగర్ పంచాయతీలోని కొమురం భీమ్నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం వల్ల గిరిజనులకు విద్య చేరువులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నూతన పాఠశాలలను గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వి ద్యార్థులందరినీ ప్రతిరోజూ పాఠశాలకు పంపాలని, విద్య ద్వారా మాత్రమే జీవితాలు మా రుతాయని సూచించారు. మిగతా రెండు పాఠశాలలైన రాయబంధం, గుండెంగవాయి పాఠశాలలను ఎంఈఓ మల్లయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ అర్షం రాజు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వి.సాంబశివరావు, సీఆర్పీలు బి.శ్రీధర్, సత్యారావు, గ్రామ పెద్దలు కృష్ణ, రమేష్, సంధ్య పాల్గొన్నారు. పంటరుణాలు రీషెడ్యూల్ చేయాలని ధర్నా ములుగు రూరల్: పంట రుణాలు రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ సోమవారం మండల పరిధిలోని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజద్ పాషా మాట్లాడారు. బ్యాంక్ అధికారులు రైతుల పంటరుణాలు రీ షెడ్యూల్ చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. -
‘బెస్ట్ అవైలబుల్’ డబ్బులేవి?
ములుగు రూరల్: నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అందిస్తుంది. స్కీంలో ఎంపికై న విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు డే స్కాలర్, 5నుంచి విద్యార్థులకు హాస్టల్ వసతితో కూడిన విద్యను అందిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీంకు చెందిన నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యజమానులు విద్యార్థుల తల్లితండ్రులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఏడాది బెస్ట్ అవైలబుల్ స్కీంకు ప్రైవేట్ యాజమాన్యాలు సుముఖత చూపడం లేదు. మూడేళ్లుగా డబ్బులు పెండింగ్ జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు స్కీం ద్వారా 1వ తరగతి విద్యార్థులకు రూ.28 వేలు, 5వ తరగతి విద్యార్థికి రూ. 42 వేలను చెల్లిస్తుంది. ఇందులో ఎస్సీ విద్యార్థులు ఒకటవ తరగతిలో 74 మంది విద్యార్థులు, 5వ తరగతిలో 102 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎస్టీ విద్యార్థులు 203 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు చెల్లించాల్సి న డబ్బులు గడిచిన మూడు సంవత్సరాలకు గాను రూ. 3కోట్ల 25లక్షల 92వేలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఎస్సీ విద్యార్థులకు రూ.కోటి 90లక్షల 68వేలు చెల్లించాలి. ఎస్టీ విద్యార్థులకు రూ.కోటి 35 లక్షల 24వేలు చెల్లించాలి స్కీంపై అనాసక్తి బెస్ట్ అవైలబుల్ స్కీం పథకం ద్వారా ఎంపికై న ఎస్టీ విద్యార్థులను జిల్లా కేంద్రంలోని సాధన హై స్కూల్, అరవింద హైస్కూల్, బ్రిలియంట్ హై స్కూల్లు కేటాయించారు. ఎస్సీ విద్యార్థులకు మంగపేట మండలం కమలాపూర్ ఆదర్శ పాఠశాల, జిల్లా కేంద్రంలోని అరవింద హై స్కూల్, సాధన హై స్కూల్కు ఎంపిక అయ్యారు. ఒక్కో పాఠశాలకు ఎంపికై న విద్యార్థుల ప్రకారం లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో విద్యాసంస్థలు నడపడం భారంగా మారుతుందని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో రూ.3.92 కోట్లు పెండింగ్ స్కీంపై ప్రైవేట్ పాఠశాలల అనాసక్తి ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లితండ్రులు -
మల్బరీ సాగుతో ఆదాయం
ఏటూరునాగారం: పట్టుపరిశ్రమ శాఖ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందేలా పలు ప్రోత్సాహక పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో మల్బరీ తోటల సాగు, పట్టు పురుగులను పెంచడానికి ముందుకొచ్చే రైతులకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. తోట పెంపకం ప్రారంభ దశ నుంచి విక్రయించే వరకు రైతులకు అధిక లాభాలు చేకూరేలా పథకాన్ని రూపొందించింది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న భూములు మల్బరీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. రెండు ఎకరాల్లో మల్బరీ తోట సాగు చేస్తే సదరు రైతుకు సాగు చేసినందుకు ఏడాదికి రూ.4 నుంచి 6లక్షల వరకు నికర ఆదాయం కల్పించడంతో పాటు ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది. మల్బరీ తోట బహువార్షిక పంట కావడంతో తక్కువ నీటితో పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి మల్బరీ మొక్కలు నాటితే 15 నుంచి 20 ఏళ్ల వరకు ప్రతీ ఏడాది పట్టు పురుగుల మేతకోసం ఆకుల పంట దిగుబడి వస్తుంది. ఈ తోట అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకొని పంట దిగుబడి ఘననీయంగా వస్తుంది. గతంలో ఏటూరునాగారంలోనే పరిశ్రమ గతంలో పట్టుపరుగుల పరిశ్రమ ఏటూరునాగారంలో ఉండేది. 2004లో మావోయిస్టులు పట్టుపరిశ్రమకు చెందిన భవనాలను కూల్చివేశారు. దీంతో అందులోని సామగ్రి దొంగల పాలు కాగా భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో పట్టు పురుగుల పెంపకం పరిశ్రమను మూసివేశారు. ఇప్పుడు మల్బరీ తోటలు వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో ఎక్కువగా సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బీసీ, ఓసీలకు రాయితీ ఇలా.. బీసీ, ఓబీసీలకు మల్బరీ తోటల పెంపకానికి రెండు ఎకరాలకు రూ.60 వేల సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోంది. అదే విధంగా మల్బరీ పట్టు పురుగుల పెంపకం గది నిర్మాణానికి రూ.2.25లక్షలు, స్టాండ్లు, ఇతర పరికరాలకు రూ. 37,500, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారక మందుల కోసం రూ. 2,500లు, నీటి పారుదల కోసం రూ.50వేలు అందజేస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు.. మల్బరీ తోట పెంపకం, నిర్వహణకు రూ.78వేలు సబ్సిడీ ఇస్తోంది. పట్టు పురుగుల పెంపకం గది నిర్మాణానికి రూ.2,92,500, రేరింగు పరికరాలకు రూ.26,610, రేరింగు స్టాండ్స్కు రూ.24,140, రోగ నిరోధక చర్యలకు రూ.3,250, నీటి పారుదలకు రూ.65 వేలను కేంద్ర ప్రభుత్వం రాయితీగా రైతులకు అందజేస్తుంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన రైతులు జిల్లాలోని పట్టు పరిశ్రమ శాఖ అధికారులను సంప్రదించి పథకాన్ని పొందవచ్చు. రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు వేర్వేరుగా పథకాలను అందజేయనున్నారు. రైతులకు సొంతంగా రెండు ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది. వార్షిక ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. అన్ని వర్గాల రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 9441770795, 8977714616 లలో సంప్రదించాలి. – మాచర్ల నరేందర్, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి రైతులకు భారీగా సబ్సిడీ ఇస్తున్న కేంద్రం జిల్లాల వారీగా సాగుకు ప్రత్యేక కార్యాచరణ -
ప్రశ్నించే గొంతుకలను నొక్కడం సరికాదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ములుగు రూరల్: ప్రశ్నించే గొంతుకలను నొక్కడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా జిల్లాలో పోలీస్ యాక్ట్ను అమలు చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హుడైన రమేష్ ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్పై వస్తున్న అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు యాక్ట్ను అమలు చేసినట్లు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, కొత్త సురేందర్, భూక్య జవహర్లాల్, రవీంద్రచారి, కృష్ణాకర్, వాసుదేవరెడ్డి, విశ్వనాథ్, ఇమ్మడి రాకేష్యాదవ్, నాగరాజు, హరీశ్, బాబు, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
షెడ్యూల్ ఇలా... ● గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్కు చేరుకుంటారు. ● ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కాకతీయ యూనివర్సిటీకి ఉదయం 11:25 గంటలకు చేరుకుంటారు. ● ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనెట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనెట్ సభ్యులు గవర్నర్తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది. ● ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం ఉంటుంది. అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది. ● మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుంది.కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387 మంది అభ్యర్థులు పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్లో 10 మంది పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్లో 60, సైన్స్లో 161, ఫార్మసీలో 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 66, సోషల్ సైన్సెస్లో 88, ఎడ్యుకేషన్లో 25, లా 72, ఇంజనీరింగ్లో 44 మందికి గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. కళాశాలలకు గోల్డ్మెడల్స్ అభ్యర్థుల జాబితాలు.. పీహెచ్డీ పట్టాలు పొందే అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్కు కూడా ఎంట్రీపాస్లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా అభ్యర్థులకు అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్మెడల్స్ పొందే అభ్యర్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది. ముందుగానే గోల్డ్మెడల్స్ ప్రదానం.. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు అభ్యర్థులకు గోల్డ్మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. అభ్యర్థులు గోల్డ్మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మంది అభ్యర్థులను 19 బ్యాచ్లుగా చేశారు. అయితే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొందరు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. పేరెంట్స్కు ఆడిటోరియం బయట స్క్రీన్ ఏర్పాటు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందే అభ్యర్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరి కోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవాన్ని వీరు వీక్షించనున్నారు.గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. అలాగే, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందేవారు వైట్ డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. కేటాయించిన సీట్లలో వీరు కూర్చోవాల్సి ఉంటుంది. నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి 387 మందికి పీహెచ్డీ పట్టాలు.. 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్ల పంపిణీ -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: మహిళల ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జనని మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహకారం అందించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదన్నారు. త్వరలో నూతన మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం బాలయ్యపల్లి గ్రామంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఎం వేణుగోపాల్, ఏపీఎం తిరుమల్ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వర్ణలత, కార్యదర్శి సుమలత, కోశాధికారి మమత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్.. కొత్తపల్లిగోరిలో మొహర్రం వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సత్యనారాయణరావును శాయంపేట మండలం కొప్పులకు చెందిన చిన్నారి మామిడి మీనాక్షి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్ అంటూ అడిగింది. చలించిన ఎమ్మెల్యే పేరు నమోదు చేసుకుని మంజూరు పత్రాలను స్వయంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. -
రామప్ప దేవాలయంలో ..
రామప్పలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది. ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు భక్తులకు తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద అద్భుతమని పర్యాటకులు కొనియాడారు. తొలి ఏకాదశి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కుటుంబ సమేతంగా రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామి పూజలు నిర్వహించారు. -
శ్యామాప్రసాద్ ముఖర్జీ సేవలు ఆదర్శం
ఏటూరునాగారం: శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశానికి అందించిన సేవలు ఆదర్శమని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్ తెలిపారు. మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శ్యామాప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలు వీధుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహాయంతో ఆయన 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నె సంపత్, ఈక మహాలక్ష్మీ, గాడిచర్ల రాజశేఖర్, పలక గంగా, పెయ్యల రాకేష్, ఎర్రల్ల ఎల్లయ్య, పడిదల శ్రీను తదితరులు పాల్గొన్నారు. బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు జనార్దన్ -
లారీ డ్రైవర్ల రాస్తారోకో
వాజేడు: మండల పరిధిలోని టేకులగూడెం ఇసుక క్వారీ వద్ద ఆదివారం లారీ డ్రైవర్లు రహదారిపై రాస్తారోకోకు దిగారు. నాలుగు రోజుల క్రితం డీడీలను తీసి ఇసుక తీసుకెళ్లడానికి వస్తే ఇసుకు నింపడం లేదని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పేరూరు పోలీసులు అక్కడికి వెళ్లి లారీ డ్రైవర్ల నుంచి వివరాలను సేకరించారు. నాలుగు రోజుల క్రితం డీడీలను తీశామని ఇసుక తీసుకెళ్లడానికి వస్తే ఇంత వరకు లారీల్లో లోడు చేయడం లేదని తెలిపారు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలని అడగడంతో పోలీసులు టీఎస్ఎండీసీ అధికారులకు విషయాన్ని వివరించారు. స్పందించిన అధికారులు వెంటనే ఆ లారీలను మంగపేట మండలంలోని మల్లూరు క్వారీకి పంపించడంతో రాస్తారోకో విరమించారు. -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
● భారీగా తరలివచ్చిన భక్తులుమంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో స్వయంభు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, భీమవరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూలు పండ్లు, నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల శేఖర్శర్మ, రాజీవ్ నాగఫణిశర్మ, స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదం అందించారు. బంగారు నేత్రాల బహూకరణ ఆలయంలో స్వయంభుగా వెలిసిన స్వామివారిని ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన భక్తుడు కె.లీలాశివనాగ ధనరాజు(నాని) ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి రూ.76,050 విలువైన బంగారు నేత్రాలను బహూకరించారు. -
బీరన్నకు బోనాలు
మంగపేట: మండల పరిధిలోని కమలాపురంలో బీరలిగేశ్వరస్వామి(బీరన్న)కి కురమలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివారం సాయంత్రం బోనాలు సమర్పించారు. ప్రతిఏటా తొలి ఏకాదశి రోజు కమలాపురంలోని బీరన్న ఆలయంలో బోనాలు సమర్పించి యాటపోతులను బలివ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే గ్రామ కురమ పెద్దల ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీరన్నకు బోనం వండి కుటుంబ సభ్యులతో కలిసి మహిళలు బోనాలు ఎత్తుకుని డోలు వాయిద్యాలతో బీరన్న ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు పోతురాజు రమేష్, మల్లిఖార్జున్, యాకన్న, ఇండ్ల లక్ష్మ ణ్, యార సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి
● మున్సిపల్ కమిషనర్ సంపత్ ములుగు రూరల్: నివాస ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ ప రిధిలోని వీవర్స్కాలనీ, సుభాష్నగర్, శ్రీనివాసకా లనీ, ఆజీద్నగర్, తదితర ప్రాంతాలను పర్యవేక్షించారు. ఖాళీ ప్లాట్లలో నీటి నిల్వలు చేరి దోమలు వృద్ధి చెందడంతో మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటి నిల్వలను గుర్తించి త గిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అనంతరం నీటి నిల్వ ప్రాంతాల్లో బ్లీ చింగ్, ఆయిల్ బాల్స్ వేయించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీపీఓ దేవరాజు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
ఏటూరునాగారం: ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటగదులను పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని, సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపాద్యాయులు నాణ్యమైన బోధన చేయాలన్నారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఏ క్షేత్రయ్య, తహసీల్దార్ జగదీష్, ఎంపీడీఓ కుమార్, హెచ్ఎం ఈసం రమేశ్, ఉపాద్యాయులు పాల్గొన్నారు. అనంతరం సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూపరింటెండెంట్ సురేశ్కుమార్కు తెలిపారు. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. ఏటూరునాగారం/మంగపేట:గోదావరి నీటి మట్టం పెరుగుతుందని, ఏజెన్సీలోని కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం మండలంలోని రామన్నగూడెం కరకట్ట, మంగపేట కరకట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వరద మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని, వరద ప్రమాద స్థాయిలో పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంపై ప్రజ లకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్ కా ర్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ జగదీశ్, తహసీల్దార్ జగదీష్, అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి వెంకటాపురం(కె): ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని మలాపురం, రాచపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులను త్వరగా పొందాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు రూమ్ను పరిశీలించి, భూభారతి చట్టంపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ఏజెన్సీ గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ దివాకర టీఎస్పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యములుగు రూరల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో దొడ్డి కొమురయ్య 79వ వర్థంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సర్ధార్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై డీకే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, విముక్తి ఉద్యమ పోరాటంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నరిగె రాజ్కుమార్, సాంబయ్య, మల్లయ్య, సంపత్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంజీవ, ఎస్సీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఉద్యోగులు సరిత, మానస, రేణుక, కుమారస్వామి, ప్రతాప్, గోపాల్చారి తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి సమస్యలు త్వరగా పరిష్కరించాలి
వాజేడు: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ములుగు ఆర్డీఓ వెంకటేష్ అన్నారు. శుక్రవారం వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో చేపట్టిన భూభారతి తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలను చేయడంతోపాటు వారసత్వ, సాదాబైనామా, మిస్సింగ్ సర్వే నంబర్లపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ కుమారస్వామి, డీటీ చంద్ర శేఖర్, సీనియర్ అసిస్టెంట్ నగేష్, సిబ్బంది ఉన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలి ములుగు రూరల్: రోడ్డు భద్రత నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని ఆర్టీఓ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాతీయ రహదారిపై త రచూ రోడ్డు ప్రమాదం జరిగే ప్రాంతాలను ఆ యన పరిశీలించారు. రోడ్డు ప్రమాద చర్యల్లో భాగంగా పోలీస్, ఆర్ అండ్ బీ, ఎన్హెచ్ అధి కారులతో కలిసి గట్టమ్మ, మల్లంపల్లి, ప్రాంతాలను పరిశీలించారు. ప్రమాద నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్రావు, ఆర్అండ్బీ ఏఈ రాకేష్, ఎన్హెచ్ అధికారులు పాల్గొన్నారు. బాస్కెట్బాల్ జిల్లా జట్టు ఎంపికములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సన్రైజర్స్ హైస్కూల్లో శుక్రవారం జిల్లా అండర్ 18 బాస్కెట్ బాల్ జట్టును ఎంపిక చేసినట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకృష్ణ తెలిపారు. జిల్లా జట్టు ఎంపికకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 30 మంది హాజరైయ్యారన్నారు. వారికి పోటీలు నిర్వహించి జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న బాలబాలికలు ఈ నెల 11 నుంచి 13 వరకు ఉత్తనూర్, గద్వాల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ధనసరి సూర్యం, సన్రైసర్స్ హైస్కూల్ కరస్పాండెంట్ వట్టెం రాజు పీఈటీలు శ్రీకాంత్ మహిపాల్, కోచ్ వంశీ తదితరులు ఉన్నారు. కేవీపీహెచ్ జిల్లా కమిటీ.. ములుగు రూరల్: కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి జిల్లా కమిటీని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్నుకున్నారు. కేవీపీహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిలా అధ్యక్షుడిగా అంబాల మురళి, ప్రధాన కార్యదర్శిగా రత్నం ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా దేవ య్య, మాణిఖ్యం, యాసం రమేశ్, సహాయ కా ర్యదర్శులుగా దేవేందర్, నరేష్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలిములుగు రూరల్: విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జోనల్ అధికారి అరుణకుమారి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. జనవరి నెలలో కాళేశ్వరం జోనల్ లెవల్ డ్రాయింగ్ అర్హత పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని, వారందరికీ పతకాలు, సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నర్మదాబాయి, డ్రాయింగ్ ఉపాధ్యాయురాలు స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విద్యుత్శాఖలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భద్రత కరువు
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు 1,388 మందిహన్మకొండ: విద్యుత్శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వీరు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదరణకు నోచుకోవడం లేదు. వీరికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా యాజమాన్యంనుంచి అందే సహాయం కూడా లేదు. వినియోగదారులకు విద్యుత్ సంబంద సమస్యలు తలెత్తితే ముందుగా వీరినే సంప్రదిస్తారు. వీరి సమస్యలు వివరించి బాగు చేయించుకుంటారు. ఇంతటి కీలక భూమిక పోషిస్తున్న వీరికి ఆర్థిక భరోసా అందడం లేదు. ఇటీవల బీమా సౌకర్యం.. తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తుండడంతో చలించిన టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 1,388 మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి గత నెలనుంచి బీమా సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు 1300మందికి బీమా సౌకర్యం కల్పించారు. ఇందులో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెండు విభాగాలుగా విభజించారు. ఐటీఐ అర్హత కలిగిన వారికి నెలకు రూ.20 వేల వేతనం, ఐటీఐ అర్హత లేని వారికి నెలకు రూ.17 వేల వేతనం అందిస్తున్నారు. ఈ మేరకు ఐటీఐ అర్హత కలిగిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల బీమా, ఐటీఐ అర్హత లేని వారికి రూ.17 లక్షల పరిహారం అందేలా బీమా సౌకర్యం కల్పించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా వీరికి బీమా చేయించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో మృతిచెందిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్కు ఈ బీమా వర్తించే అవకాశముందని విద్యుత్ అధికార వర్గాలు తెలిపాయి. దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రామరాజు కొన్నేళ్లుగా విద్యుత్శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో గత మే 9న రైతుల వ్యవసాయ బావుల వద్ద ఓ ట్రాన్స్ఫార్మర్కు ఎగ్జ్ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ తీగ తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ చెయ్యిని పూర్తిగా మరో చేయిని సగం వరకు తీసి వేశారు. రెండు నెలలుగా వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.19 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. గ్రామస్తులు దాదాపు రూ.16 లక్షల వరకు విరాళాలు అందించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు అంటున్నారని బాధితుడి భార్య రజిత తెలిపింది. పెద్ద కుమార్తె అఖిల ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలని మదనపడుతోంది. చిన్న కుమార్తె అక్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాల్సి ఉంది. ఊరు అండగా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రజిత, పిల్లలు కన్నీటిపర్యంతమవుతున్నారు.పోరాడి తనువు చాలించిన రమేశ్ లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన జాగిళ్లపురం రమేశ్ 2020 జూన్లో కొత్తపల్లిలో లైన్మెన్ ఆదేశాలతో ట్రాన్స్ఫార్మర్ తీగలను సరి చేస్తుండగా విద్యుత్ షాక్తో కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. డిపార్ట్మెంట్ నుంచి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రి బిల్లులు చెల్లించారు. రమేశ్ మాత్రం కోలుకోలేదు. మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో తన తండ్రి ఉప్పలయ్య లేదా చెల్లెలు రజితకు ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పోరాడాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయం చేస్తామన్నారే కానీ, ఎవరూ ఏమీ చేయలేదు. చివరికి లోకాయుక్తాలో కేసు వేసి పోరాడి 2024, అక్టోబర్ 3న చనిపోయాడు. కేసు ఇంకా లోకాయుక్త్తాలోనే కొనసాగుతోంది. కన్నకొడుకు చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు ఉప్పలయ్య, ఆండాలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. న్యూస్రీల్చేతులు కోల్పోయి రెండు నెలలుగా ఆస్పత్రిలో.. క్షేత్రస్థాయిలో కీలక విధులు.. తరచూ ప్రమాదాలు ఇంటి పెద్ద చనిపోవడంతో రోడ్డున పడుతున్న కుటుంబం గాయాలపాలై మంచానికే పరిమితమైన మరికొందరు.. మొన్నటిదాకా వినియోగదారులకు ఇస్తున్న ఎక్స్గ్రేషియానే దిక్కు ఇటీవల బీమా సౌకర్యం కల్పించిన టీజీ ఎన్పీడీసీఎల్ ఐటీఐ అర్హత కలిగిన వర్కర్కు రూ.20 లక్షలు ఐటీఐ లేని వారికి రూ.17 లక్షల బీమా ఆర్టిజన్లుగా గుర్తించని టీజీ ఎన్పీడీసీఎల్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 2016లో విద్యుత్ సంస్థల్లోకి ఆర్టిజన్లుగా అబ్జర్వ్ చేసుకున్న క్రమంలో తెలంగాణ సౌథర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న కట్టర్లను (ఇక్కడ అన్మ్యాన్ వర్కర్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను అక్కడ కట్టర్లుగా పిలిచేవారు) ఆర్టిజన్లుగా తీసుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్లో మాత్రం అప్పటి యాజమాన్యం అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించలేదు. దీంతో వీరు ప్రమాదవశాత్తు మృతిచెందితే వినియోగదారులకు ఎక్స్గ్రేషియా చెల్లించినట్లుగానే రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై గాయాలపాలైతే చికిత్స ఖర్చులు మాత్రం యాజమాన్యం భరిస్తుంది. కానీ, ఇది సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రత సాధారణ పరిస్థితి ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.కమ్యూనిజం శక్తుల ఐక్యం అనివార్యం కమ్యూనిజం భావజాల శక్తులు ఐక్యం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.– 8లోuజీవనాధారాన్ని కోల్పోయారు.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ము న్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అన్మ్యాన్ హెల్పర్ గట్ల కరుణాకర్రెడ్డి గత గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి విద్యుత్ మోటా రు స్టార్టర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా సర్వీస్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సుమా రు 25ఏళ్లనుంచి ఆయన ఈదులపూసపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సేవలు అందిస్తున్నారు. కరుణాకర్ రెడ్డికి భార్య ప్రియాంక, కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సుశాంత్ రెడ్డి ఉన్నారు. కుమార్తె హైదరాబాద్లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, కుమారుడు మానుకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పెద్ద కరుణాకర్ రెడ్డి అకాల మరణంతో ఆ బాధ్యతలన్నీ భార్య ప్రియాంక మీదనే పడ్డాయి. ఈ క్రమంలో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారనుందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
అస్తవ్యస్తం!
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని ఎండోమెంట్ ఆవరణలోని మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులకు మెయింటనెన్స్ చర్యలు లేకపోవడంతో అస్తవ్యస్తంగా దర్శన మిస్తున్నాయి. నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరుగుదొడ్ల తలుపు ఊడిపోయాయి. బేసిన్ల లోపల చెత్తాచెదారంతో నిండిపోయాయి. బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శన సమయంలో ఒకటిరెండింటికి ఇబ్బందులు పడుతున్నారు. గద్దెలకు సుమారుగా 20 మీటర్ల దూరంలో మరుగుదొడ్లు ఉన్నా.. భక్తులకు ఫలితం లేదు. అమ్మవార్ల దర్శనం పూర్తయేంత వరకు భక్తులు కడుపు బిగపట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తుంది. దేవాదాయశాఖ అధికారులు ప్రతీ రెండేళ్లకోసారి జాతర సమయంలో మరుగుదొడ్లకు నిధులు కేటాయించి మమ అని మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే తప్ప శాశ్వతంగా భక్తులకు ఉపయోగ పడేలా చర్యలు తీసుకోవడం లేదు. ఈఓలు మారినా మరుగుదొడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదు. మేడారం దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జాతర నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనకు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు వస్తున్న సమయంలో మాత్రమే మేడారానికి వస్తున్నారే తప్ప మిగతా రోజుల్లో దేవాదాయశాఖ తరఫున భక్తుల సౌకర్యాలపై దృష్టిసారించిన వారే లేరని భక్తులు ఆరోపిస్తున్నారు. హనుమకొండలోని ఆఫీసుకే పరిమితమై మేడారానికి చుట్టుపు చూపుగా వచ్చి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని మిగతా పుణ్యక్షేత్రల్లోని మరుగుదొడ్లను చూసిన భక్తులు మేడారంలోని దేవాదాయశాఖ మరుగుదొడ్లను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కాటేజీల పరిస్థితి అంతే.. మేడారంలోని కాటేజీలు కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి. కాటేజీల గదుల్లో ఫ్యాన్లు, తాగునీటి వసతి సౌకర్యాలు కరువయ్యాయి గదులను అద్దెకు తీసుకున్న భక్తులు బయట నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. భక్తులు కాటేజీలను అద్దెకు తీసుకునేందుకు వెనుకడుతున్నారు. ప్రైవేట్ అద్దె గదులను ఆశ్రయిస్తే గదుల కిరాయి ధరలు భక్తుల జేబులను గుల్ల చేస్తున్నాయి. కాటేజీల్లో వసతులు లేవు, ప్రైవేటు అద్దె గదుల కిరాయి ధరలు మండిపోవడంతో ఆర్థిక స్థోమత లేని భక్తులు మేడారం పరిసరాల ప్రాంతంలోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. అమ్మవార్ల హుండీ కానుకల ద్వారా కొట్లాది ఆదాయం వస్తున్న దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. భక్తుల వసతుల కోసం నిధులను ఖర్చు చేయకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపే పనులను చేస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరమ్మతు చేయాలి మేడారం ఎండోమెంటో కార్యాలయం ఆవరణలోని మరుగుదొడ్లకు మరమ్మతు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఎండోమెంట్ కార్యాలయంలోని గదుల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. ఒకటిరెండింటికి ఇ బ్బందులు పడుతున్నది వాస్తమే. దేవాదాయశాఖ అధికారులు చొరవ తీసుకుని మరుగుదొడ్లను విని యోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి. – ఆరెం లచ్చుపటేల్, మేడారం జాతర మాజీ చైర్మన్అధ్వానంగా మేడారం మరుగుదొడ్లు కాటేజీల్లో వసతులు కరువు ఇబ్బందులు పడుతున్న భక్తులు పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు -
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లోuములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఫేస్ రికగ్నేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలలో పారదర్శకతను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బాలామృతం, గుడ్లు, పాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సమస్యను అధిగమించి లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు మహిళ శిశు సంక్షేమశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐసీడీఎస్ అధికారులు సిద్ధమయ్యారు. నిత్యం చిన్నారుల ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు.. ఫేస్ రికగ్నేషన్ విధానం ఉపయోగించి ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులకు బాలామృతం, గుడ్లు వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా చిన్నారి తల్లి ఫొటోను ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఫొటోలను తీసుకొని పోషన్ ట్రాకర్ యాప్లో నమోదు చేసి సరుకులు అందిస్తున్నారు. జూలై నుంచి అందరికీ.. అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన బాలింతలకు, గర్భిణులు, చిన్నారులు జూలై నుంచి ఫేస్ రికగ్నేషన్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్ల మొబైల్ ఫోన్లో పోషన్ ట్రాకర్ యాప్ను అప్డేట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూప్లో ఫొటోలు నమోదు కావడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ రికగ్నేషన్ ఫొటోలు అప్లోడ్ చేసే క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో సాంకేతిక సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు పౌష్టికాహారం అందించే క్రమంలో తప్పనిసరిగా ఫొటో అప్లోడ్ చేయాల్సి రావడంతో సరుకుల పంపిణీ సమస్యగా మారుతుందని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నెట్వర్క్ సమస్యలపై అంగన్వాడీ టీచర్లు సమాచారం అందించినట్లు తెలుస్తుంది. 640 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలోని పది మండలాల్లో నాలుగు ప్రాజెక్టులు ఏటూరునాగారం, ములుగు, ఎస్ఎస్ తాడ్వాయి, వెంకటాపురం(కె)లో ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తంగా 640 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు 8,722 మంది ఉన్నారు. గర్భిణులు 1,864, బాలింతలు 1,800, 3నుంచి ఆరేళ్ల వయస్సు కలిగిన వారు 6,424 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు.ఏజెన్సీలో నెట్వర్క్ సమస్య ఉంది.. జిల్లాలోని 24 ఏజెన్సీ గ్రామాలలో నెట్వర్క్ సమస్య కారణంగా చిన్నారుల ఫేస్ రికగ్నేషన్ నమోదు ప్రక్రియ ఇబ్బంది అవుతుంది. మిగితా కేంద్రాలలో తప్పని సరిగా పోషన్ ట్రాకర్లో నమోదు చేస్తున్నారు. యాప్ ద్వారా ఫౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులకు చేరుతుంది. – తుల రవి, జిల్లా సంక్షేమాధికారిన్యూస్రీల్అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ పారదర్శకత పెంచేలా చర్యలు జిల్లాలో 4 ప్రాజెక్టులు 640 కేంద్రాలు ఇంటర్నెట్ సమస్యతో ఇబ్బందులు -
ఒంటేరు వాగుపై కల్వర్టు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక పంచాయతీ పరిధిలోని ముత్తారం గిరిజనులు తమ సొంత ఖర్చులతో ఒంటేరు వాగుపై కల్వర్టును గురువారం నిర్మించుకున్నారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటంతో పాటు వాగుపై వంతెన లేకపోవటంతో ముత్తారం గ్రామస్తులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామ పెద్దల నిర్ణయంతో గ్రామంలోని 120 కుటుంబాల వారు ఒకో కుటుంబానికి రూ.4వేల చొప్పున వసూలు చేసుకుని కల్వర్టు నిర్మాణంతో పాటు రోడ్డు పనులను శ్రమదానం చేసి నిర్మించుకున్నారు. కల్వర్టు, రోడ్డు సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుంజా సూరిబాబు, బొగ్గుల లక్ష్మయ్య, బాడిశ కన్నయ్య, సోడి గోపి తదితరులు పాల్గొన్నారు.సొంత డబ్బులతో నిర్మించుకున్న గిరిజనులు -
బూత్లెవల్ ఆఫీసర్లకు శిక్షణ
శిక్షణ తరగతులకు హాజరైన బూత్లెవల్ ఆఫీసర్లుములుగు రూరల్: జాతీయ స్థాయి ఎన్నికల బూత్ లెవల్ ఆఫీసర్లకు జిల్లా కేంద్రంలోని కాన్ఫరెన్స్హాల్లో గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మేరకు ములుగు మండలంలోని 59 బూత్ లెవల్ అధికారులు ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరైనట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఓటర్ జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్భాస్కర్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ నితీష్, మాస్టర్ ట్రైనర్ తిరుపతి, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ మనోహర్, శివసాయిరాం, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
వైద్యాధికారులు అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని లక్ష్మినగరం బాలుర ఆశ్రమ పాఠశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వండి పెడుతున్న ఆహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జ్యోతి ఆశ్రమ పాఠశాలలోని 310 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వారి వద్ద నుంచి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామని వివరించారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పవన్, మనోహర్, స్నేహ, సిబ్బంది సత్యనారాయణ, యాకమ్మ, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాజేడు: వర్షాకాలంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని ఏడ్జెర్లపల్లి, ముత్తారం గ్రామాల్లో గురువారం వైద్య శిబిరాలను ప్రగళ్లపల్లి పల్లె దావఖానా వైద్యాధికారి గ్యానస ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్య క్రమానికి క్రాంతికుమార్ హాజరై మాట్లాడారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. గ్రామాల్లో మురికి గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 94 మంది రోగులను పరీక్షించి మందులను అందించడంతో పాటు కణతితో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఏటూరునాగారం సివిల్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు గర్భిణులను నేడు 102 అంబులెన్స్ వాహనంలో ఏటూరునాగారం లోని ఆస్పత్రికి తరలించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆశ కార్యకర్తలు, జీపీ సిబ్బంది గ్రామంలో ఉన్న మురుగు గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు తీమో పాస్ మందును చల్లారు. ఈ వైద్య శిబిరంలో కోటిరెడ్డి, శ్రీను, పంచాయతీ కార్యదర్శి కార్తీక్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ -
పాఠశాలల బలోపేతానికి కృషి
వెంకటాపురం(ఎం): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు పాఠశాలలోని రికార్డులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, మధ్యాహ్న భోజన రిజిస్టర్, బియ్యం స్టాక్ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి నిర్వహించిన ఎల్ఐపీ ప్రోగ్రాం, ఎఫ్ఎల్ఎన్కు సంబంధించిన మూల్యాంకనం పేపర్లను తక్షణమే ఆన్లైన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు, హెచ్ఎం రాధిక, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, రాజయ్య, వేణు, సీఆర్పీ కుమార్పాడ్య తదితరులు పాల్గొన్నారు.విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ -
విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
ములుగు రూరల్: వర్షాల కారణంగా సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూలై, ఆగస్టు నెలలో జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు, సలహాలను పాటించాలన్నారు. జిల్లాలో 61 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, 970 శిథిలావస్థలో ఇళ్లు ఉన్నాయని వారంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. ప్రమాద స్థలాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 800 చెరువులు ఉండగా 13 పెద్ద చెరువులు ఉన్నాయని తెలిపారు. వర్షాలకు నిండిన చెరువులను ముందస్తుగా గమనించాలని వివరించారు. లోతట్టు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరుకులను ముందస్తుగా తరలించాలని సూచించారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే ప్రజలు సురక్షత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో ఫ్లడ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో ప్రమాద పరిస్థితిలో ఉన్న 30 గ్రామాల ప్రజలకు రిస్క్ జాకెట్లను అందించామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు నీటి ప్రవాహంలో దిగకూడదన్నారు. వర్షం విపత్తును ఎదుర్కొనేందుకు పోలీస్, అగ్ని మాపక, విద్యుత్, వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో 58 పునరావాస కేంద్రాలలో 15 వేల మందికి ఆశ్రయం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అధికారి రఫీక్, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
ఏటూరునాగారం: ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి సీతక్క అనుచరులు ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని పుర వీధుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ప్రశ్నించినందుకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా అతనిని బెదిరించి సెల్ఫోన్ లాక్కోవడం జరిగిందన్నారు. తర్వాత బెదిరింపులకు దిగడంతో మనస్తాపానికి గురైన చుక్కా రమేష్ గురువారం వారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రశ్నిస్తున్న వారిపై భౌతికదాడులు, బెదిరింపులకు దిగి మానసికంగా ఇబ్బందులకు గురిచేసి చంపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వీటికి మంత్రి సీతక్కను బాధ్యులను చేస్తూ మంత్రి పదవి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా విషయం తెలుసుకున్న ఎస్సై రాజ్కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నాగజ్యోతితో పాటు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్కుమార్, తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, ఎండి ఖాజా పాషా, దన్నపునేని కిరణ్, సప్పిడి రాంనరసయ్య, గండేపల్లి నర్సయ్య, కుమ్మరి చంద్రబాబు, జాడి బోజారావు, తురం పద్మ, వావిలాల ముత్తయ్య, దేపాక శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి -
నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి
వెంకటాపురం(ఎం): నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని రామప్ప ఆలయ కార్యనిర్వహణ అధికారి బిల్లా శ్రీనివాస్ తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం రామప్ప గార్డెన్లో వేప, ఉసిరి, మందార మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు కోమల్లపల్లి హరీశ్ శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది సంతోష్, అవినాష్రెడ్డి, పురావస్తుశాఖ అధికారి కుమార్ పాల్గొన్నారు. డీసీసీ బ్యాంకు మార్కెట్ రోడ్డుకు తరలింపు ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని పాత చేపల మార్కెట్ రోడ్డులో ఉన్న డీసీసీ బ్యాంకు ను ములుగు కూరగాయల మార్కెట్ రోడ్డు (ఎకై ్సజ్ ఆఫీస్) పక్కకు తరలిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ తిరుపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు నూతన భవనంలో రేపటి(5వ తేదీ) నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి పొలంబాట ములుగు రూరల్: రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి సర్కిల్ సేఫ్టీ ఆఫీసర్, డివిజనల్ టెక్నికల్ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా వంగిన పోల్స్ 351, లూజ్లైన్స్ 134, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు 36 మార్చినట్లు వివరించారు. రైతులకు మెరుగైన విద్యుత్ను సరఫరా చేస్తామని తెలిపారు. పొలంబాట కార్యక్రమంలో రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు మోటార్ల వద్ద ఎర్తింగ్ చేసుకోవడంతో పాటు మోటార్లకు కెపాసిటర్లు ఉపయోకరంగా ఉంటాయని వివరించారు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే రైతులు 1912 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన 48 గంటల వ్యవధిలో విద్యుత్ సరఫరా అందించలేని పక్షంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని వివరించారు. ‘ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం’ ములుగు రూరల్: ఎన్నికల సమయంలో బండారుపల్లి గ్రామంలోని బుడగజంగాల కాలనీ వాసులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని జిల్లా గరంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. ఈ మేరకు గురువారం కాలనీవాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. బుడుగజంగాల కాలనీ వాసులకు ఎన్నికల సమయంలో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింత నిప్పుల భిక్షపతి, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్ కుమార్, నాయకులు అశోక్, రాజన్న, నాగరాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. చిన్న కాళేశ్వరం పనుల అడ్డగింత కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కేంద్రంలోని ఎర్రచెరువు మీదుగా సర్వే చేస్తున్న మెయిన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను స్థానికులు గురువారం అడ్డుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే జరుపుతుండగా రైతులు, ప్రజలు అడ్డుకొని కెనాల్ నిర్మాణం వద్దని అధికారులతో తేల్చిచెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. తహీసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ, ఏఈ భరత్ తదితరులు ఉన్నారు. -
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు
ఏటూరునాగారం: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయవసలే వ్యాఖ్యానించడం దేశ ప్రజలందరినీ అవమానించినట్లేనని తెలిపారు. రాజ్యాంగం మార్పుననకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఇద్దరు దళిత యువకులు ఆవు దూడలను తీసుకెళ్తుండగా గోరక్షక దళాల పేరుతో దాడులు చేయడం దారుణమన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 19 వేల మంది దళిత విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.154 కోట్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 9వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు ఎండీ.దావుద్ నాయకులు మురళి, రత్నం, దేవయ్య, రమేష్, యశోద, ప్రసాద్, సమ్మయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు -
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
గోవిందరావుపేట: ఎయిడ్స్పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం సంస్థ సూపర్వైజర్ రజిని అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్ నిర్వహించి స్థానికులకు ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులతో బాధపడకుండా అన్ని టెస్ట్లతో పాటు హెచ్ఐవీ టెస్ట్ కూడా చేయించుకోవాలన్నారు. హెచ్ఐవీ నాలుగు విధాలుగా సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలతో, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవీ సోకుతుందని వివరించారు. హెచ్ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు సైతం వస్తుందన్నారు. గర్భిణులు తప్పకుండా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకవేళ గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే బిడ్డకి రాకుండా మందులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శకుంతల, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.వైఆర్జీ కేర్ లింక్ సంస్థ సూపర్వైజర్ రజిని -
బీరన్నకు బోనాలు
ములుగు రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదవ కులస్తులు బీరన్న స్వామికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం మహిళలు బోనాల ఆలయానికి బయలుదేరి వెళ్లి నైవేద్యం సమర్పించి యాటపోతులను బలిచ్చారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు గొర్రె అంకూస్, ఇమ్మడి భిక్షపతి, కొనుపుల కుమార్, బైకాని ప్రకాశ్, బొంతల వేణు, గోపు చంద్రమల్లు, బైకాని సారయ్య, ఇమ్మడి శ్రీనివాస్, ఇమ్మడి రమేష్, మహిళలు పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థి మొక్కలు నాటాలి భూపాలపల్లి అర్బన్: పర్యావరణ సమతుల్యతలను కాపాడేందుకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవరణంలో సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటి, విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు కొమల, సరోత్తంరెడ్డి, రామకృష్ణ, రాజయ్య, సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ములుగు రూరల్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న స్కావెంజర్లకు ప్రభుత్వం ఏడు నెలల నుంచి వేతనాలు అందించడం లేదన్నారు. స్కావెంజర్ల వేతనాలు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా కాకుండా ప్రభుత్వం నేరుగా చెల్లించాలని కోరారు. స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనాలు వేతనాలు నేరుగా ఖాతాలలో జమ చేయాలని కోరారు. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి నర్సయ్య, ముత్యాల రాజు, సామల రమ, మునెమ్మ, కమలక్క, రాజమ్మ, రమాదేవి, పద్మ, నిర్మల, కమల తదితరులు పాల్గొన్నారు.ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ -
దారి ఇలా.. వెళ్లేదెలా?
ఏటూరునాగారం: ఏజెన్సీలోని కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు బురదమయంగా మారింది. ప్రతిరోజూ తమ అవసరాల నిమిత్తం ప్రజలు వచ్చి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇక బైక్పై వెళ్లాలనుకుంటే నరకయాతన పడాల్సిందే. ఇటీవల కురుస్తున్న వర్షాలతో మట్టిరోడ్డు అంతా దిగబడిపోతుందని.. ఈ దారిపై నుంచి ఎలా వెళ్లాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి 2023 జూలై 27న కొండాయి బ్రిడ్జి అకాల వర్షాలతో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. ఆ ఘటనలో 8 మంది జలసమాధి అయ్యారు. అప్పటి నుంచి ఎలాంటి దారిలేకపోయినా ఆయా గ్రామాల ప్రజలు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలికంగా మట్టి రోడ్డును ఓ ఇసుక కాంట్రాక్టర్ నిర్మించాడు. దాంతో కొంత మేర ప్రజలు రవాణా సాగించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దొడ్ల– కొండాయి గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై ఉన్న మట్టిరోడ్డు బురదమయంగా మారిపోయింది. వాహనాలపై వెళ్తుంటే అందులో చిక్కుకుపోతున్న పరిస్థితి ఉంది. అలాగే కాలినడకన వెళ్తే కాలు తీసి కాలు వేయలేని దుస్థితి. ఒక పక్క వాగు నీరు ఉండడంతో ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. 40 కిలోమీటర్లు తిరిగి రావాలి.. కేవలం ఈ బురదరోడ్డు పైనే కొండాయి, గోవిందరాజుల కాలనీ, మల్యాల, ఐలాపురం గ్రామాల ప్రజలు రవాణా సాగించాల్సి ఉంది. ఈ రోడ్డు వల్ల వాహనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఊరట్టం, మేడారం, తాడ్వాయి మీదుగా ఏటూరునాగారం మీదుగా 40 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బురదమయంగా కొండాయి రోడ్డు అవస్థలు పడుతున్న నాలుగు గ్రామాల ప్రజలుముందుకు సాగని బ్రిడ్జి పనులు రూ.16.50 కోట్లతో బ్రిడ్జి పనులు మొదలు పెట్టి నెలకావస్తోంది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో వర్షాలు కూడా తోడు అయ్యాయి. ఇక అంతే ఈ ఏడాది ఏ బ్రిడ్జిలేనట్లే.. మళ్లీ బురదరోడ్లే శరణ్యంగా మారాయి. పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.బురదలో నుంచి నడిచిపోవాలి.. ఏ కష్టం వచ్చినా ఎలాంటి వాహనాలు రావు. నడుచుకుంటూ పోవాలి. ట్రాక్టర్లు తప్ప వేరే బండ్లు వచ్చే పరిస్థితి లేదు. మోకాలు లోతు బురద దిగబడిపోతుంది. కొండాయి నుంచి దొడ్ల వరకు 4 కిలోమీటర్లు నడవాలి. ఏ అవసరం వచ్చినా ఏటూరునాగారం పోవాలి అంటే నడుచుకుంటూ పోవడం తప్పా వేరే మార్గం లేదు. – రాము, మల్యాల -
రాళ్లవాగు.. రాకపోకలకు తిప్పలు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని రాళ్లవాగుపై వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాళ్లవాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షాల కారణంగా బురదమయంగా మారిపోయింది. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఆర్టీసీ అధికారులు సైతం భద్రాచలం డిపోకు చెందిన బస్సులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మీదుగా వెంకటాపురం రావాల్సిన బస్సులను మణుగూరు టు ఏటూరునాగారం మీదుగా తిప్పుతున్నారు. దీంతో మండల పరిఽధిలోని ఎదిర గ్రామం నుంచి వెంకటాపురం వరకు ఉన్న గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సులు రాకపోవటంతో ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వాగుపై వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
మాటల మంటలు!
స్వపక్షంతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి కార్నరైన కొండా మురళి వ్యాఖ్యలు ● మాజీ ఎమ్మెల్సీ తీరుతో కాంగ్రెస్ కేడర్లో అయోమయం ● ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ● స్థానిక ఎన్నికల ముందు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిసాక్షి, వరంగల్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాటలు అధికార పార్టీ కాంగ్రెస్లో కల్లోలం రేపుతున్నాయి. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీకి కూడా అస్త్రశస్త్రాలు దొరకడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేసిన కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా చెలామణి అవుతున్న కొండా మురళి మాటలతో అందరికీ కార్నర్ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరిపై పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎర్రబల్లులేనని విమర్శించడంతో మాటల మంటలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి బదులుగా కొండా మురళిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు.. నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడు రేవంత్రెడ్డి సహకారంతో పదవులు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలు, సొంత పార్టీ నేతలు, వరంగల్ తూర్పు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా కొన్నిరోజుల నుంచే వరంగల్ రాజకీయం అంతా కొండా చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం. ఇంకోవైపు పరకాల ఎమ్మెల్యేగా కొండా సుష్మితాపటేల్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులవడం, సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. -
సాయిబాబా ఆలయంలో చోరీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని బయటకు ఎత్తుకెళ్లి పగులగొట్టి సొత్తును ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రాజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జీవీవీ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలనుకునే నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే వారు టీసీ, స్టడీ, కులం సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు, పాస్ఫొటో తీసుకుని రావాలని కోరారు. ఇంటర్మీడియట్లో చేరేందుకు టెన్త్ మెమో, స్టడీ, కులం, ఆధార్, టీసీతో పాటు పాస్ఫొటోలతో రావాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ములుగు రూరల్: ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కాటాపురంలో పట్టాలిచ్చిన నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2023లో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 108 మందికి ఇళ్ల పట్టాలను అందించిందని తెలిపారు. ఒక్కొక్కరికి 75 గజాల ఇంటి స్థలానికి పట్టాలు అందించారని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ఇంటి స్థలాలు కేటాయించలేదని పేర్కొన్నారు. మంత్రి సీతక్క, కలెక్టర్ చొరవ తీసుకుని పట్టాలిచ్చిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. టెక్నాలజీ నైపుణ్యాలు పెంచుకోవాలి వెంకటాపురం(కె): రానున్న కాలంలో టెక్నాలజీకి అనుగుణంగా ఫొటోగ్రఫీలో ఫొటో గ్రాఫర్స్ తమ నైపుణ్యాలను పెంచుకోవాలని ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాలెంవాగు ప్రాజెక్టు సమీపంలో మండల ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకంలో ప్రతిఒక్కరూ చేరి వాటి ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫొటో గ్రాఫర్స్ అధ్యక్షులు లింమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్, వెంకటాపురం, వాజేడు మండలాల అధ్యక్షులు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
ములుగు రూరల్: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. విద్యాశాఖ కార్యకలాపాలు సకాలంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాల్లో తరగతులను నిర్వహించకూడదని సూచించారు. మోడల్ కళాశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, సమగ్ర శిక్షా కోఆర్డినేటర్లు అర్షం రాజు, రమాదేవి, సూపరింటెండెంట్ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.డీఈఓ చంద్రకళ -
మేడారం సమ్మక్క జాతర 2026.. తేదీలు ప్రకటించిన పూజారులు
సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Jathara) తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది మేడారంలో జరగబోయే సమ్మక్క, సారలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ఈ మేరకు తేదీలను వెల్లడించారు. 2026 జనవరి 28వ తేదీన జాతర ప్రారంభం కానుంది.జాతర తేదీలు ఇవే..2026 జనవరి 28వ తేదీన(బుధవారం) శ్రీ సారాలమ్మ దేవత..29న సమ్మక్క దేవతలు (గురువారం) వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు.30వ తేదీన (శుక్రవారం) మొక్కులు చెల్లించుట.31వ తేదీన (శనివారం) సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం. చదవండి: బయ్యారం చెరువు.. చరిత్రకు సాక్ష్యం.. -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025బొగతకు రావాలంటూ పిలుపు తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికారులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికి మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు. -
పల్లెల్లో పడకేసిన ప్రత్యేక పాలన
ఏటూరునాగారంలో రోడ్డు పక్కన పడేసిన చెత్తకనిపించని ప్రత్యేకాధికారులు జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 174 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల ములుగు మున్సిపాలిటీలో మూడు పంచాయతీలు విలీనం కావడంతో పంచాయతీల సంఖ్య 171కి చేరింది. 2024 ఫిబ్రవరి 1న పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో మరుసటి రోజున ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. మండలానికి జిల్లా స్థాయి అధికారి, గ్రామాలకు సీనియర్ అసిస్టెంట్ నుంచి పైస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించడంతో వారు బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీల్లో ప్రత్యేక పాలన సుమారుగా 18 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేకాధికారులు పంచాయతీలకు వచ్చి విధులు నిర్వహించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు తప్పా ఇతర రోజుల్లో పంచాయతీ విధులకు హాజరుకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వెంకటాపురం(ఎం): పంచాయతీల్లో ప్రత్యేక పాలన పడకేసింది. జీపీల్లో విధులు నిర్వర్తించాల్సిన ప్రత్యేకాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో గ్రామాలాభివృద్ధి, ప్రజల సంక్షేమం గాలిలో దీపంలా మారి పల్లెలన్నీ మసకబారిపోతున్నాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరవేస్తూ, గ్రామాల్లో సమస్యలు పరిష్కారించాల్సిన ప్రత్యేకాధికారులు జీపీలను పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే అన్నీ తామై గ్రామ పంచాయతీలను నెట్టుకొస్తున్నారు. కనిపించని అభివృద్ధి పంచాయతీల పాలకవర్గం గడువు ముగియడంతో ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు లేకపోవడంతో గ్రామాలాభివృద్ధి కుంటుపడుతోంది. గత పాలకవర్గాలు చేసిన పనులకే ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్క గ్రామపంచాయతీకి సుమారు రూ.2 లక్షల నుంచి 20 లక్షలకు పైగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లాలోని 174 గ్రామపంచాయతీలకు సుమారుగా రూ.20 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు మాజీ సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. 2023 సెప్టెంబర్ నుంచి చేసిన పనులకు బిల్లులు రాలేదని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు సైతం అప్పులు చేసి గ్రామాల నిర్వహణ కొనసాగిస్తున్నారు. తాగునీటి పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, గ్రామాల్లోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్కు చేరవేయడం లాంటి పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేస్తున్నారు. ఖర్చు చేసిన డబ్బులకు బిల్లులు పెట్టి ఎస్టీఓలకు చెక్కులు పంపుతున్నప్పటికీ చెక్కులు పాస్ కావడం లేదని కొంతమంది కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారుల పాలనలో లక్షలు వెచ్చించి గ్రామాల నిర్వహణ కొనసాగిస్తుండడంతో పాటు విధుల నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. నెలసరి వచ్చే వేతనం కూడా పంచాయతీ అభివృద్ధికే ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి నెలకొందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. పంచాయతీల వైపు కన్నెత్తి చూడని ప్రత్యేకాధికారులు పంచాయతీ కార్యదర్శులే నెట్టుకొస్తున్న వైనం నిధుల్లేక కుంటుపడుతున్న గ్రామాల అభివృద్ధి -
వైద్యవృత్తికి ఎంతో గౌరవం
ములుగు రూరల్: సమాజంలో వైద్య వృత్తికి ఎంతో గౌరవం ఉందని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ కేక్ కట్ చేసిన అనంతరం ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలన్నారు. వైద్యాధికారులందరూ వైద్య వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ నియంత్రణకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాధులను అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్, పవన్కుమార్, చంద్రకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
విపత్తుల సమయంలో సహాయక చర్యలు
ములుగు రూరల్: విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ తన చాంబర్లో అదనపు కలెక్టర్ మహేందర్జీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామప్ప, లక్నవరం సరస్సు, గోదావరి నది, జంపన్న వాగు నీటిప్రవాహం, గతంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 28 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వర్షాకాలం ముగిసే వరకు జిల్లాలో ఉంటుందని తెలిపారు. గోదావరి నది, జంపన్న వాగు పరిసర ప్రాంతాలతో పాటు ఊరట్టం, నార్లాపూర్, మేడారం నీటి ప్రవాహ ప్రాంతాలను పరిశీలించి వరదలు వచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బృందా నికి కావాల్సిన ఏర్పాట్లను సమకూర్చాల్సిందిగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, కలెక్టరేట్ సెక్షన్ పర్యవేక్షకులు శివకుమార్, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి గోవిందరావుపేట: బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజులు పోలీస్శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, కార్మికశాఖ చైల్డ్ హెల్ప్లైన్, మహిళా సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులను గుర్తించి బాలలను రక్షించాలన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎంహెచ్ఓ గోపాల్ రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవ రావు, సర్వశిక్షా అభియాన్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజు, అగ్రికల్చర్ ఆఫీసర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
● జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు ఎస్ఎస్తాడ్వాయి: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు అన్నారు. మండల కేంద్రంతో పాటు నార్లాపూర్లోని రైతు వేదికల్లో ఉద్యాన శాఖ, కేఎన్ బయోసైన్స్ ఆయిల్పామ్ కంపెనీ వారి అనుబంధంతో రైతులకు మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సరిపడా నూనె ఉత్పత్తి లేదని తెలిపారు. దేశంలో 259 లక్షల టన్నుల ఆయిల్పామ్ వినియోగం అవసరం కాగా 97లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దీంతో ఇతర దేశాల నుంచి నూనె దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఇతర దేశాల నుంచి దిగుమతి తగ్గించి మన రైతులు ఆయిల్పామ్ పంటల సాగుపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. అదే విధంగా రైతులు పండ్లు, కూరగాయలు సాగుచేయాలని సూచించారు. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి శ్రీకాంత్, ఆయిల్ పామ్ కంపెనీ ఏరియా మేనేజర్ హేమంత్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనిరుద్, ఏఈఓలు రాజ్కుమార్, దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. -
రూ. 19 లక్షలు రావాల్సి ఉంది
వెంకటాపురం(ఎం) సర్పంచ్గా ఉన్న సమయంలో రూ.19లక్షలు ఖర్చుపెట్టి అభివృద్ధి పనులు చేశాను. పంచాయతీకి ప్రహరీ నిర్మాణం, సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా వీధి దీపాల ఏర్పాటు, గ్రావెల్ పనులు చేసినప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. చేసిన పనులకు గాను ఎంబీ రికార్డులు సైతం ఉన్నాయి. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. – మేడబోయిన అశోక్, సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు వెంకటాపురం(ఎం) -
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో స్వరాష్ట్ర సాధన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మురహరి భిక్షపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరవదిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డు, 25 వేల పింఛన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిక అనంతరం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్నారు. హామీలను అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్నాయక్, జంపాల రవీందర్, చంటి భద్రయ్య, ముంజాల భిక్షపతి, సర్ధార్పాషా, గోపాల్రెడ్డి, రాజేశ్వర్రావు, సదయ్య, శ్రీధర్, శ్రీనివాస్, మల్లయ్య, సమ్మక్క, లక్ష్మీ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షపతి -
ప్రజావాణి దరఖాస్తుల వివరాలు
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్కు వినతులు వెల్లువలా వచ్చాయి. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 121అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి 85 దరఖాస్తులు స్వీకరించగా ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా 36 వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కరించిన దరఖాస్తుదాడుడికి ఫోన్ సమాచారం అందించాలని సూచించారు.గిరిజన దర్బార్లో వినతులు ఇలా..మంగపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు విన్నవించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గిరిజనులు వేడుకున్నారు. మహబూబాబాద్ మండలం మిర్యాలపేట గ్రామానికి చెందిన పలువురు రైతులు రైతుభరోసా తమ ఖాతాల్లో పడడం లేదని, పడే విధంగా చేయాలని పీఓను వేడుకున్నారు. ఏటూరునాగారం మండలంలోని చింతలమోరి గొత్తికోయగూడెంలో చిన్న పిల్ల లు చదువుకునేందుకు ఒక రేకుల షెడ్డు ఏర్పాటు చేయాలని గిరిజనులు పీఓను వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్లోని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని విన్నవించారు. భూపాలపల్లి మండలం వెలిశాలపల్లిలో పీఎంహెచ్ హాస్టల్లో ఏఎన్ఎంగా నియమించాలని కోరారు. గంగారంలో రెవెన్యూ అసైన్డ్ భూములకు పట్టాలు చేయాలని గిరిజనులు పీఓను వేడుకున్నారు. మంగపేట మండలం పేరుకులకుంట గిరిజన సంక్షేమశాఖలో అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. తొండ్యాల గ్రామానికి చెందిన గిరిజనులు 49వ జీఓను రద్దు చేయాలని పీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు.పింఛన్ అందించి ఆదుకోవాలి..నా కుమారుడు డేవిడ్ పట్టుకతోనే దివ్యాంగుడు. ప్రస్తుతం 6 సంవత్సరాలుగా మంచానికి పరిమితమై ఉంటున్నాడు. తాము నిరుపేద కుటుంబానికి చెందినా.. సాధ్యమైనంత వరకు ఆస్పత్రుల్లో డబ్బులు ఖర్చు చేసి చికిత్స చేయించాం. అయినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారులు దయతలిచి నా కుమారుడికి పింఛన్ అందించి ఆదుకోవాలి.– అర్షం రజిత, మల్లూరు, మంగపేటభూ సమస్యలు 39గృహ నిర్మాణం 16ఉపాధి కల్పన 03పింఛన్లు 06ఇతర సమస్యలు 21 -
స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లుగా పనిచేస్తున్న వర్కర్లకు 8 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో స్కావెంజర్లను 2024 అక్టోబర్లో నియమించినట్లు తెలిపారు. 8 నెలలుగా పనిచేస్తున్నా వీరికి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబం గడవటమే కష్టంగా మారిందని తెలిపారు. స్కావెంజర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కావెంజర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు యన్నమల్ల ప్రవీణ్కుమార్. జనగాం రమేష్, నవీన్, మల్లికార్జున్, ఉమా, సమ్మయ్య, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
ఉపాధ్యాయులు లేక కుంటుపడుతున్న విద్య
ఏటూరునాగారం: వాజేడు, వెంకటాపురం మండలాల్లోని ప్రభుత్వ, గిరిజన విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు లేక విద్య కుంటుపడుతుందని, వెంటనే ఖాళీగా ఉన్న చోట ఉపాధ్యాయులను నియమించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహామూర్తి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రెండు మండలాలను ములుగు జిల్లాలో కలపడం వల్లనే విద్యావ్యవస్థ కుంటుపడుతోందని తెలిపారు. ఏజెన్సీలోని చిరుతపల్లి –2 ఆశ్రమ పాఠశాలలో పలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జీపీఎస్ చిరుతపల్లిలో 54 మంది, బోదాపూర్లో 55మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరే ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. అలాగే కలిపాక, ముత్తారం పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరని, వాజేడు మండలంలోని పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల, జంగాలపల్లి, కాసారం పాఠశాలల్లో ఏకో ఉపాధ్యాయులతో పాఠశాలలను నడుపుతున్నట్లు పీఓకు వివరించామన్నారు. గుడిసెవాసులకు హక్కు పత్రాలివ్వాలి జీఓ నంబర్ 49ని రద్దు చేసి, గుడిసెవాసులకు హక్కుపత్రాలివ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జజ్జరి దామోదర్, జిల్లా అధ్యక్షుడు దుర్గి చిరంజీవి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ చెల్లిస్తే రెన్యువల్ చేయాలి
ములుగు రూరల్: జిల్లాలో పంట రుణాలు పొందిన రైతులు వడ్డీ చెల్లిస్తే రుణాలను రెన్యువల్ చేయాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పహాణీ నకల్ ఆధారంగా పొందిన పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుకు రూ. 2లక్షల మేరకు రుణమాఫీ చేయాలన్నారు. యాసంగి సాగులో సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. ఏజెన్సీలో ఉన్న రైతులకు 30శాతం మందికి మాత్రమే పట్టాదార్ పాస్పుస్తకాలు ఉన్నాయని పహాణీ నకల్ ఆధారంగా రుణాలు అందించాలన్నారు. అటవీహక్కు పత్రాలు పొందిన రైతులకు రైతుభరోసా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, బండి నర్సయ్య, నటరాజ్, నారాయణసింగ్, కృష్ణయ్య, సమ్మయ్య, పరంసింగ్, జనార్ధన్, రమేష్, లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు.రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్పాషా -
ఉద్యోగ విరమణ సహజం
ములుగు రూరల్: ఉద్యోగ విరమణ సహజమని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ఉద్యోగ విరమణ పొందిన బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి చిట్టిరెడ్డి రవీందర్రెడ్డిని అదనపు కలెక్టర్ మహేందర్జీతో కలిసి శాలువాలతో సోమవారం సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నప్పుడు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. తమ శేషజీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, తహసీల్దార్లు, ఎంపిడీఓలు, మండల అధికారులు పాల్గొన్నారు.ట్రాఫిక్లో చిక్కుకున్న 108 వాహనంవాజేడు: మండల పరిధిలోని మండపాక వద్ద 163 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం సుమారు అర్ధగంట పాటు 108 అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది. అక్కడ రహదారికి ఇరువైపులా ఇసుక లారీలను నిలిపి వేయడంతో ముందుకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. దీంతో ఏటురునాగారం వైపు నుంచి వెంకటాపురం(కె) వైపునకు వస్తున్న 108 అంబులెన్స్ లారీల వెనుక నిలిపి ఉంచాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్లో రోగులు ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. కాని ఒక వేళ రోగులు ఉంటే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.పోక్సో కేసులో ఇద్దరికి జైలుములుగు రూరల్: జిల్లాలో ఇద్దరు నిందితులకు పోక్సో కేసులో నేరం నిరూపణ కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్పీ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపురం(ఎం)పోలీస్స్టేషన్లో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మేడిపల్లి భాస్కర్కు ఇరవై ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.6వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చినట్లు వివరించారు. అదే విధంగా వెంకటాపురం(కె)పోలీస్స్టేషన్లో 2018లో మాచర్ల హరిబాబుపై నమోదైన కేసులో అతనికి ఇరవై ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.11 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని జడ్జీ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. ఈ కేసుల్లో శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
గోవిందరావుపేట: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని పస్రా పీహెచ్సీని డీఎంహెచ్ఓ గోపాల్రావు ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. పీహెచ్సీకి వైద్యం కోసం వచ్చిన రోగులకు బీపీ, షుగర్ లాంటి పరీక్షలతో పాటు జ్వరంతో వచ్చిన వారికి మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఓపీ రిజిస్టర్ను పరిశీలించగా 45మంది రోగులు వచ్చారని తెలిపారు. అనంతరం డ్రగ్ స్టోర్ను, ల్యాబ్ టెక్నీషియన్, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించారు. కుక్క, పాము కాటుకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ మందులను మూడు నెలల వరకు సరిపోయే విధంగా రోగులకు ఇవ్వాలన్నారు. గ్రామాలలో మెడికల్ క్యాంప్లను నిర్వహించి రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ సుచిత, ఫార్మసీ ఆఫీసర్ శారద, ఎన్సీడీ స్టాఫ్నర్స్ సంధ్య, రమాదేవి, ల్యాబ్, టెక్నీషియన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
బ్యాంకు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు
మా నాన్నమ్మ లాలమ్మ 2023లో మరిణించింది. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును విడిపించి ఇవ్వాలని పలుమార్లు బ్యాంకు అధికారులను కలిసి దరఖాస్తులు అందించినా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును విత్ డ్రా చేసి ఇవ్వాలని సంబంధిత పత్రాలు అందజేసినా బ్యాంక్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. – పూనెం రాంకుమార్, అంకన్నగూడెం, మంగపేట -
పర్యాటకులకు ఇబ్బంది కలగొద్దు
వాజేడు : బొగత జలపాతం వద్ద పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని వెంకటాపురం(కె) ఎఫ్డీఓ ద్వాలియా సిబ్బందిని సూచించారు. శనివారం మండల పరిధిలోని చెరుకూరు వద్ద ప్లాంటేషన్లో చేపట్టిన పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం బొగత జలపాతానికి వచ్చిన ద్వాలియా అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. జలపాతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది జలపాతాలకు పర్యాటకులను వెళ్లకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్ఎస్ఓ నారాయణ, సిబ్బంది ఉన్నారు.పోలీస్ ఔట్పోస్ట్ సేవలు ప్రారంభంములుగు రూరల్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీస్ ఔట్ పోస్టు సేవలను మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్లాల్, సీఐ సురేష్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ ఔట్ పోస్టులో 24గంటలు పోలీసులు విధుల్లో ఉంటారని ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్రావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.రాజీవ్ యువవికాసం అమలు చేయాలిములుగు రూరల్ : రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని దరఖాస్తులు స్వీకరించి అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి పథకం నిలిపివేయడం నిరుద్యోగ యువత అసహనానికి గురవుతున్నారని వెల్లడించారు. రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేసి యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.రేపు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుములుగు రూరల్ : జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈ నెల 30న(సోమవారం) నిర్వహిస్తున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10, 12, 14 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులను ఏ,బీ,సీ విభాగాలుగా బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో 60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, కిడ్స్ జావిలిన్ త్రో అంశాల్లో ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు, పోటీల్లో పాల్గొనే బాలబాలికలు తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలలో హాజరు కావాలని తెలిపారు. పాఠశాల పీఈటీ రాజ్కుమార్కు జనన ధ్రువీకరణ పత్రం అందించి పోటీల్లో పాల్గొనాలని సూచించారు.సాగు భూములు తీసుకోవద్దువెంకటాపురం(కె) : పాలెం ప్రాజెక్టు కాల్వ పనుల్లో భాగంగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తే సహించేది లేదని ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్సా నర్సింహామూర్తి పేర్కొన్నారు. తమ భూములు తీసుకోవద్దని తహసీల్దార్ వేణుగోపాల్కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలెం ప్రాజెక్టు నుంచి కాల్వ నిర్మాణానికి ముకునూరు పాలెం, కమ్మరిగూడెంలో భూములు తీసుకోవడానికి ఆదివాసీ రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రైతులకు తెలియకుండా అధికారులు సర్వే చేయడం సరికాదన్నారు. ఆదివాసీ చట్టాలను విస్మరించి సాగు భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. నాయకులు కుంజా మహేష్, రాము, సమ్మయ్య, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. -
ఏజెన్సీలో చెరువులపై హక్కు కల్పించాలి
వాజేడు : ఏజెన్సీలో నివసిస్తున్న ఓడబలిజలకు చెరువులపై పూర్తిస్థాయిలో హక్కు కల్పించాలని ఓడబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. దామోదర్తో పాటు ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు గగ్గురి రమణయ్య హైదరాబాద్లో సాయికుమార్ను కలిసి ఓడ బలిజలు, బీసీలు ఏజెన్సీలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఓడ బలిజలకు మత్స్యకార సభ్యత్వాలు ఇవ్వాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో మత్స్యకారుల సభ్యత్వాల్లో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మెట్టు ధనరాజ్, తోట ప్రశాంత్, బొల్లె విజయబాబు తదితరులు ఉన్నారు. -
బ్యూటిఫుల్.. రామప్ప టెంపుల్
వెంకటాపురం(ఎం) : బ్యూటిఫుల్..రామప్ప టెంపుల్ అంటూ స్వీడన్ దేశానికి చెందిన ప్రొఫెసర్ లూయిస్ స్టేవా పేర్కొన్నారు. శనివారం మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఆయన సందర్శించి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా, టూరిజం గైడ్ విజయ్కుమార్ ఆలయ విశిష్టతను వివరించారు. కాగా రామప్ప శిల్పకళా సంపద బాగుందని స్టేవా కొనియాడారు. మురుగు కాల్వలో మొసలి పిల్ల వెంకటాపురం(కె): పాత్రపురం గ్రామంలోని మురుగు నీటికాల్వలో శనివారం మొసలి పిల్ల ప్రత్యక్షం కాగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో గ్రామస్తులు పంచాయతీ అధికారులకు సమాచారం అందించగా వారు అటవీశాఖ అధికారులకు విషయం చెప్పారు. అనంతరం అధికారులు మొసలి పిల్లను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలిలేశారు. ఇంకెన్ని మొసలి పిల్లలు గ్రామంలోకి వచ్చి ఉంటాయోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మకు బోనాలు
ఏటూరునాగారం : మండల కేంద్రంలోని రామాలయం వీధిలో గల ముత్యాలమ్మకు స్థానికులు శనివారం భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ముత్యాలమ్మ ఆలయం నిర్మించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పండితులు అమ్మవారికి వార్షికోత్సవ పూజలు చేశారు. గ్రామంలోని బొడ్రాయివద్ద ప్రత్యేక పూజలు చేసి డప్పుచప్పుళ్ల ఊరేగింపుగా బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సునార్కని శ్రీనివాస్, జాడి భోజారావు, కుమ్మరి చంద్రబాబుతోపాటు రాజ్కుమార్, సమ్మయ్య, లక్ష్మయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
సమస్యలు పరిష్కరించడంలో విఫలం
● మాజీ ఎంపీ మిడియం బాబురావు ఏటూరునాగారం : వలస ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదివాసీ హక్కులపై శనివారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించగా బాబురావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల గూడేలకు కనీస వసతులు కల్పించకుండా, వారిని వలసవాదులుగా ముద్రించి, కుల ధ్రువీకరణ పత్రాలు, కనీస వసతులు కల్పించకుండా ఆదివాసీ హక్కులను కాలరాస్తోందన్నారు. వారిని అడవి నుంచి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆదివాసీలు దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందని, వారికి అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని సూచించారు. అటవీ సంరక్షణ, జంతు, జీవజాతుల రక్షణ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి పంపేందుకు జీఓ 49 తీసుకువచ్చి 339 ఆదివాసీల గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు. జీఓ 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జెజ్జరీ దామోదర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు అలెం అశోక్, కుర్సం శాంతకుమారి, కోరం చిరంజీవి, తోలెం కృష్ణయ్య, కుర్సం చిరంజీవి, పూనెం నగేష్, ఊకే ప్రభాకర్, కొట్టెం కృష్ణారావు పాల్గొన్నారు. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్ : కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు.. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీరా బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్