breaking news
Mulugu
-
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
కాటారం: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి అన్నారు. నషాముక్త్త్ భారత్ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో సామూహికంగా మొక్కలు నాటారు. నషాముక్త్ భారత్ లక్ష్యాలపై సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు మత్తుపదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై వివరించారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, కేజీబీవీ ప్రిన్సిపల్ చల్ల సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
పింఛన్ ఇప్పించండి.. ఐదు సంవత్సరాల క్రితం పెరాలసిస్తో కాలు, చేయి పడిపోయింది. అప్పటి నుంచి భార్య కూలీ పనులు చేసి సాదుతుంది. పింఛన్ కోసం ఐదు సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నా పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. – సమ్మయ్య, సర్వాపూర్, ములుగు మండలం నిరుపేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించొద్దు ములుగు మండలం మదనపల్లి గ్రామంలో 49 నిరుపేద కుటుంబాలకు గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం 75 గజాల చొప్పున కేటాయించి పట్టాలు అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇంటి పట్టాలను రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కేటాయిస్తుందని తెలుస్తుంది. నిరుపేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయొద్దు. – పసుల ప్రభాకర్, మదనపల్లి గిరిజన మహిళల సమస్యలు తెలుసుకుంటున్న పీఓ చిత్రామిశ్రా గ్రీవెన్స్లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ దివాకర ●పోడు పట్టాలు ఇవ్వాలి ఏటూరునాగారం మండలంలోని ఆకులవారిఘణపురం పరిధిలో ఉన్న రైతులు 2006 నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి పోడు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వాలు మారుతున్నా పోడు పట్టాలు మాత్రం రావడం లేదు. రెవెన్యూ, ఐటీడీఏ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని 15 మంది రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశాం. – ఆలం రమేష్, రైతు, ఏటూరునాగారం ప్రజావాణిలో వచ్చిన వినతుల వివరాలు.. భూ సమస్యలు 23 గృహ నిర్మాణశాఖ 15 ఉపాధి కల్పన 01 పింఛన్లు 02 ఇతర సమస్యలు 15 -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ములుగు రూరల్: లేబర్ కోడ్లను రద్దు చేయాలని జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా వచ్చే నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆశ కార్యకర్తలతో కలిసి కలెక్టర్ టీఎస్.దివాకర, పంచాయతీ కార్మికులతో కలిసి డీపీఓ దేవరాజుకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చి న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు. ఐసీడీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ స్కీములను ప్రభుత్వ శాఖలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహచారి, నీలాదేవి, చంచు మంజూల, శ్రీను తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు రూరల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఎదుగుదలకు గొడ్డలిపెట్టు లాంటిదని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాల సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 112కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఇన్చార్జ్ డిడబ్ల్యూఓ తుల రవి, వైద్యారోగ్యశాఖ, యాంటి నార్కోటిక్ విభాగం అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వైద్యకళాశాలను కలెక్టర్ దివాకర సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత విద్యాసంవత్సరంలో అందుతున్న వసతులు, వచ్చే విద్యా సంవత్సరంలో కావాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. కళాశాల ప్రహరీకి ఔషధ గిడ్డంగులను, సీసీ రోడ్డు కొరకు స్థలాన్ని పరిశీలించారు. ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ వరకు రెండేళ్లు కావాల్సిన అనుమతి కోసం, సదుపాయాలపై టీజీఎంఐడీసీ ఇంజనీర్లతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ లాల్, డీసీహెచ్ఎస్ జగదీశ్వర్, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, నరేందర్ రెడ్డి, డీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాలని వేడుకోలు..
మంగపేట: భర్త అనారోగ్యంతో మరణించగా ఇద్దరు కూతుళ్లతో ఉన్న తనకు అండగా నిలవాల్సిన బంధువులు, ఓ బీఆర్ఎస్ నాయకుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ మహిళ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.. న్యాయం కోసం అధికారుల ఆశ్రయిస్తే తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విలేకర్లకు బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన కోరుకొప్పుల సత్యం, రాణి దంపతులు నివాసం ఉంటున్నారు.. ఈ క్రమంలో భర్త అనారోగ్యానికి గురై మృతువాత పడ్డాడు.. ఈ క్రమంలో ఉమ్మడి కుటుంబంలోని తన వాటాకు రావాల్సిన భూమిని తాను ఇంటివద్ద లేని సమయంలో చిన్న పిల్లలైన కూతుళ్లను బెదిరించి సంతకాలు పెట్టించి అమ్మారని వాపోయింది. అంతేకాకుండా తన భర్త వైద్యం కోసం దాతలు అందించిన రూ.10 లక్షల్లో నుంచి రూ.6 లక్షల నగదును వారే తీసుకున్నారని ఆరోపించింది. న్యాయం కోసం తాను ఎస్పీ, సీఐ, ఎస్సై, తహసీల్దార్ను ఆశ్రయించానని వివరించింది. స్పందించిన అధికారులు తమ భూమిని తమకు ఇవ్వాలని సూచించడంతో తమపై ఫిర్యాదు చేస్తారా అనే కోపంతో అంతుచూస్తామంటూ కమలాపురంకు చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడి అండతో తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని వాపోయింది. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది. -
పంట రుణాలను రెన్యూవల్ చేయాలి
ములుగు రూరల్: రైతులు తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. జిల్లాలో 30 శాతం మంది రైతులకు మాత్రమే పట్టాలు ఉన్నాయన్నారు. గతంలో మాదిరిగా పహాణీ నకల్ ఆధారంగా రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంకిడి కృష్ణయ్య, భిక్షపతి, ఐలయ్య, అబ్ధుల్, నబి, శాంతమ్మ, నారాయణ, లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు.రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్పాషా -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
వెంకటాపురం(ఎం): జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు జాతీయ క్వాలిటీ సర్టిఫికెట్ పొందడంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని డీఎంహెచ్ఓ గోపాల్రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని నల్లగుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆయన సోమవారం సందర్శించారు. రిజిస్టర్, మందుల నిల్వలు, ఐఈసీ మెటీరియల్, మందిర్ ప్రాంతంలో నాటిన హెర్బల్ మొక్కలను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. జిల్లాలో 9 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో క్వాలిటీ కంట్రోల్ వర్చువల్ అసెస్మెంట్ కార్యక్రమాలు నిర్వహించగా 7 కేంద్రాలు క్వాలిటీ సర్టిఫికెట్ సాధించాయన్నారు. మిగిలిన రెండు కేంద్రాలు సైతం క్వాలిటీ సర్టిఫికెట్లు పొందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో నీటినిల్వలు లేకుండా చూడాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వారంలో ఒక ఇంటిని రెండుసార్లు సందర్శించాలన్నారు. జ్వరం వచ్చిన ప్రతీ వ్యక్తికి పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని సూచించారు. అవసరమైన గ్రామాలలో వైద్యశిబిరాలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీకాంత్, వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రాం అధికారి రణధీర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల వైద్యులు పార్వతి, అనిత, సంఘమిత్ర, శ్రీనివాస్, డెమో సంపత్, సీహెచ్ఓ సంపత్రావు, డీపీఎం సంజీవరావు, సాంబయ్య, క్వాలిటీ మేనేజర్ శరత్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
పొగాకు ఉత్పత్తులు విక్రయించొద్దు
ములుగు రూరల్: విద్యా సంస్థల పరిధిలో 100 గజాల వరకు పొగాకు ఉత్పత్తులు సిగరేట్, గుట్కా, తంబాకు వంటివి విక్రయించొద్దని ఎస్పీ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిగరేట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం–2003, జువైనెల్ జస్టిస్ యాక్ట్–2015 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా యువత, ప్రజలు పాటుపడాలని సూచించారు. సీఎంతో ముఖాముఖిలో పాల్గొనాలి ములుగు రూరల్: రైతు భరోసా లబ్ధిదారులతో సీఎం రేవంత్రెడ్డితో నేడు(మంగళవారం) ముఖాముఖి చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని వివరించారు. రైతులు అందుబాటులో ఉన్న రైతు వేదికల్లో సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లలోనే ఉంటున్నారు’ వాజేడు: గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లల్లోనే దివ్యాంగులు ఉంటున్నట్లు ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు తెలిపారు. మండల పరిధిలోని చీకుపల్లి గ్రామనికి చెందిన ముగ్గురు దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరూ.. శీర్షికతో సోమవారం సాక్షిలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆయన దివ్యాంగులు పొడెం విజయ తమ తండ్రికి వచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటుండగా, గొంది పాపారావు, గొంది సుజాతలు తమ సోదరులకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్లల్లోనే వారితోనే కలిసి ఉంటున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు సర్వే సమయంలోనూ వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఆ ముగ్గురు దివ్యాంగులకు పెళ్లిళ్లు కాలేదని వారు ఒంటరి వారని వివరించారు. మావోయిస్టులకు సహకరించొద్దు పలిమెల: మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని పలిమెల ఎస్సై రమేష్ సూచించారు. మండలంలోని అయా గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ (మావోయిస్టు) దళాలు జిల్లాలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మావోయిస్టు సాయుధ దళాలు, దళ సభ్యులు, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఆదివాసీ గుంపుల దగ్గరలో సంచరించినట్లయితే వెంటనే డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చి తగిన పారితోషకం పొందాలని పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘనంగా ఒలింపిక్ డేభూపాలపల్లి అర్బన్: ఒలింపిక్ డేను పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో రన్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఒలింపిక్ టార్చ్తో రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, డీపీఓ వీరభద్రయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికిరణ్, సీఐ నరేష్, ఎస్ఐ సాంబమూర్తి, క్రీడాసంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గ్రీవెన్స్కు 56, గిరిజన దర్బార్కు 27 అర్జీలు
ములుగురూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరు తూ వివిధ సమస్యలపై 83 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్.దివాకర, ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో 56 ఫిర్యాదులు రాగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 27 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆ యా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. పరిశీ లించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజన దర్బార్కు వచ్చిన వినతులు కన్నాయిగూడెం మండలం కంతనపల్లి సీఎంఏ 2013లో వచ్చిన జడ్జిమెంట్ కాపీని సర్టిఫై చేసి ఇవ్వాలని కోరారు. గోవిందరావుపేట మండలం మొద్దలగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ఏజెన్సీ సర్టిఫికెట్ కావాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లిలో భూ భారతి సదస్సు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించాలని గిరిజనులు పీఓకు విన్నవించారు. మహబూబాబాద్ మండలం గంగారం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగుడు ఉద్యోగం ఇప్పించాలని పీఓను కోరారు. పోడు పట్టాలు ఇప్పించాలని గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ప్రాంతంలో ఉన్న గిరిజనులు 2006 నుంచి పోడు చేసుకుంటున్నామని, తమకు పట్టాలు ఇప్పించాలని కోరారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు కోరారు. ఏటూరునాగారం మండలం వీరాపురం ప్రాంతానికి చెందిన నిరుద్యోగురాలు ఉద్యోగ అవకాశం ఇప్పించాలని కోరారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం కామారంలోని హర్టికల్చర్ భూములకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు పీఓను కోరారు. కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లికి చెందిన గిరిజనుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలో భూమి బోరు నిర్మించుటకు అనుమతి ఇవ్వాలని పీఓకు మొరపెట్టుకున్నారు. మహాముత్తారం గ్రామంలోని నల్లగుంట, మీనాజీపేట గ్రామస్తులు గిరివికాసం పథకాలు అందడం లేదని పీఓకు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన వినతుల వివరాలు.. భూ సమస్యలు 23 గృహ నిర్మాణశాఖ 15 ఉపాధి కల్పన 01 పింఛన్లు 02 ఇతర సమస్యలు 15 స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలుఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమి ఆన్లైన్ చేయాలి 3.30 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమి ఆన్లైన్లో లేదు. దీంతో బ్యాంక్లు క్రాప్ లోన్లు ఇవ్వడం లేదు. పెట్టుబడి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు ఇలాంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆన్లైన్ చేయాలి. – కాపుల సమ్మయ్య, రైతు, అల్లంవారిఘణపురం -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
వెంకటాపురం(కె): విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో అభయ మిత్ర కార్యక్రమంపై విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ను తరిమి కోడదాం, యువతను కాపాడుకుందామని వివరించారు. విద్యార్థులకు డ్రగ్స్పై, పొక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతి రావు, ట్రైనీ ఎస్సై తిరుపతి రెడ్డి. మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ఉపాధ్యాయులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరూ..!
వాజేడు: వారంతా దివ్యాంగులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో వారి పేర్లు ఉన్నాయి. కాని మంజూరు లీస్టులో పేర్లు లేకపోవడంతో వారికి ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. తమకు కూడా ఇళ్లు ఇప్పించాలని పలువురు దివ్యాంగులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని చీకుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు గొంది సుజాత. ఇల్లు లేకపోవడంతో కోడళ్ల వద్ద ఉంటూ కాలం వెళ్లదీస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చినప్పటికీ ఈమెకు మంజూరు పత్రం రాలేదు. అధికారులు స్పందించి తన సమస్య పరిష్కరించాలని వేడుకుంటోంది. చీకుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు గొంది పాపారావు. మూడు చక్రాల సైకిల్పై తిరుగుతుంటాడు. ఇతని పేరు అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ ఇళ్లు మాత్రం రాలేదు. అదే గ్రామానికి చెందిన పొడెమ విజయలక్ష్మి పుట్టు మూగ, ఒంటరి మహిళ. అర్హుల జాబితాలో పేరు ఉన్నా ఇళ్లు మంజూరు చేయలేదని సైగలతో ఆరోపిస్తుంది. తక్షణమే ఉన్నతాధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్పందించి ఇళ్లు మంజూరు చేయాలని బాధిత దివ్యాంగులు కోరుతున్నారు.దివ్యాంగుల వేడుకోలు -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని బృందం వివరించింది. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకుల బృందం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధుల బృందం వెనుతిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్తో ‘కొండా’ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
‘ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి క్షమాపణ చెప్పాలి’
ములుగు రూరల్: సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌశిక్రెడ్డి ఎన్నికల్లో గెలిపించకపోతే కుటుంబంతో సహ ఆత్మహత్య చేసుకుంటామని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి సీతక్క గురించి మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్పాషా, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
శరవేగంగా గ్యారేజ్
రూ.7 కోట్లతో ఆర్టీసీ డిపో పనులు ప్రారంభంఏటూరునాగారం: ఏటూరునాగారంలో ఆర్టీసీ బస్డిపో నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఆర్టీసీ బస్సులను మరమ్మతులు చేసే గ్యారేజ్ పనులును అధికారులు షురూ చేశారు. రూ.7 కోట్లతో ఆర్టీసీ డిపోను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఈనెల 12వ తేదీన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ డిపోతో పాటు డీఎం కార్యాలయం, బస్సు నిలుపు స్థలం, గ్యారేజ్, ఇతర సిబ్బంది కార్యాలయాలతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించేందుకు తగిన ఇంజనీరింగ్ ప్లాన్ను రూపొందించారు. ఈ మేరకు గ్యారేజ్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించి శరవేగంగా పూర్తి అయ్యేలా చూస్తున్నారు. పలు రాష్ట్రాలకు రవాణా ఏటూరునాగారం బస్డిపో నిర్మాణం పూర్తి అయితే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్తోపాటు తెలంగాణలోని పలు దూర ప్రాంతాలకు ఇక్కడ డిపో బస్సులను వినియోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు కావాల్సిన నిర్మాణ పనులను ముందుగా చేపట్టారు. గతంలో డిపో స్థలంలో ఉన్న పాత భవనాలను కూల్చివేసి అక్కడే నూతన భవనాన్ని నిర్మించడానికి పూనుకున్నారు.కొనసాగుతున్న పిల్లర్ల పనులు ప్రస్తుతం బస్సులను మరమ్మతులు చేసేందుకు గ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ల పనులు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఏటూరునాగారం ఏజెన్సీలో ప్రజలు గత 30 సంవత్సరాలుగా బస్సు డిపో కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి మరో మణిహారంగా డిపో ఏర్పాటు మారనుంది. పనులు నడుస్తున్నాయి.. ఆర్టీసీ డిపో ఏర్పాటు పనులు సాగుతున్నాయి. సుమారుగా తొలుత 30 బస్సులతో ఏర్పాటు చేయనున్నాం. అందుకు కావాల్సిన చర్యలు, ఏర్పాట్లను చేస్తున్నారు. ముందుగా గ్యారేజ్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత బస్సుల మరమ్మతులతో పాటు నిలుపు స్థలం, డిపో మేనేజర్ ఇలా అనేక భవనాలను నిర్మించనున్నారు. – విజయ్భాను, ఆర్టీసీ ఆర్ఎం ● ఇంజనీరింగ్ ప్లాన్తో మిగతా కార్యాలయాల నిర్మాణం తొలుత 30 బస్సులతో డిపో ఏర్పాటు -
హేమాచల క్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై నెలకొన్న హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ గా తరలివచ్చారు. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజ మండ్రి, విశాఖ పట్టణం తదితర సుదూర ప్రాంతా ల నుంచి కార్లు, ఆటోలు, డీసీఎం, ప్రైవేట్ వాహనాల్లో ఉదయాన్నే భక్తులు గుట్టపైకి చేరకున్నారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని పూలు పండ్లు, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. నాభిచందన ప్రసాదం సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా మారింది.లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు -
సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి
ములుగు రూరల్: సామాజిక న్యాయం కోసం ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడు పోరిక శ్యామల్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల జాబితాలో రెడ్డి కులానికి చెందిన వారికే ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. కుమ్మరి, చాకలి, లంబాడ, వడ్డెర కులాలకు మంత్రి పదవులు దక్కలేదన్నారు. మిగతా సామాజిక వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక సభ్యులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను శిక్షించాలిహన్మకొండ: ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రజలు భారీగా మద్దతు పలికి అధికారం ఇస్తే గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూలదోశారని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉపయోగించుకొని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రాజరిక వంశ పారంపర్య పాలనను చిరకాలం కొనసాగించడానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడం కోసం వేలాది మంది ఫోన్లను బీఆర్ఎస్ పాలకులు ట్యాప్ చేసి దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా ఎన్నికై న ప్రజాస్వామ్య ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, ప్రముఖ సామాజిక వేత్త బొమ్మినేని పాపిరెడ్డి, రాచకొండ ప్రవీణ్ పాల్గొన్నారు. జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాల ఎంపిక భూపాలపల్లి అర్బన్: ఈ నెల 25వ తేదీన క్రీడా పాఠశాలకు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాము ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలస్థాయిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పుట్టినతేది ధృవీకరణ పత్రం, కుల, స్టడీ సర్టిఫికెట్, పాస్ ఫొటోలు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు. హామీలను నెరవేర్చాలిభూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ.6లక్షల నిధులు కేటాయించాలని దళితులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి రాజారత్నం డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పొనగంటి లావణ్య అధ్యక్షతన మూడవ జిల్లా మహాసభకు రాజారత్నం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని కోరారు. అంబేడ్కర్ యోజన పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి భద్రయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, నేరెళ్ల జోసెఫ్, పసరగొండ మహేందర్, బౌతు కమలాకర్, దొంతుల రవీందర్, రాజమౌళి, గుర్రం సంపత్, రమేష్ రాజేష్, చిట్యాల పద్మ, బానమ్మ పాల్గొన్నారు. -
క్లైమాక్స్కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైమాక్స్కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలనుకుంటుండడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది అసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్ ఇవ్వడంపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత ‘ఈ–మెయిల్స్’ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్లైన్లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. త్వరలో కలెక్టర్కు నివేదిక.. దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకటిరెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్లో చైల్డ్ హెల్ప్లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది. – రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ విభాగాధికారి 8 మందిని విచారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అసలు లేని పాఠశాల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి రాజీనామాతో అనుమానాలు -
సమ్మక్కసాగర్లో ఇసుక మేటలు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల గోదావరిపై నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీకి నీటి ప్రవాహం తగ్గడంతో ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో చెదురుమదురు వర్షాలు పడడంతో బ్యారేజీలోకి కొంత నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీలో నీటి ప్రవాహం కొంత పెరిగింది. ప్రస్తుతం వర్షాలు పడకపోవడంతో ఎగువ నుంచి గోదావరిలోకి వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో సమ్మక్క సాగర్ బ్యారేజీలో ఇసుక మేటలు తేలి కొంత మేర ఎడారిగా దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి 5,800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా బ్యారేజీ వద్ద రెండు గేట్లు ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.922 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. -
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని 16 దేశాలకు చెందిన 49 మంది విదేశీ అధికారులు కొనియాడారు. హైదరాబాద్లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా, ఉగాండా, కజకిస్తాన్, సుడాన్, ఇథియోఫియా, చీలీ, టూనిషియా, సెర్రిలియాన్ తదితర దేశాలకు చెందిన 49మంది అధికారులు శిక్షణలో భాగంగా రామప్ప ఆలయాన్ని శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరున్ని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని వారు కొనియాడారు. అదే విధంగా రామప్ప ఆలయాన్ని వరంగల్ రీజియన్ సీఐడీ ఎస్పీ నవీన్కుమార్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ఆర్డీఐటీ అధికారులు నంద కిశోర్, రవి, సతీష్, సీఐడీ డీఎస్పీ జితేందర్, సీఐలు, ఎస్సై చల్లా రాజు పాల్గొన్నారు. విదేశీ అధికారుల ప్రశంస -
పౌష్టికాహారంతోనే ఎదుగుదల
ములుగు రూరల్: పౌష్టికాహారంతోనే బాలల ఎదుగుదల సాధ్యమని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదనం–బాలికల వసతి గృహాన్ని ఆయన శనివారం సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థినులకు అందుతున్న భోజన వసతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాలలో పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ రఘు, ఓంకార్, కృష్ణవేణి, శ్యామల, అరుణ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్కు ఘన నివాళి ములుగు రూరల్: మలిదశ తెలంగాణ ఉద్యమసారధి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజానికం జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్ పాషా, వంగ రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు. హేమాచలక్షేత్రంలో ‘బెల్లంకొండ’ కుటుంబీకులు మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ పద్మ దంపతులు, కుమారులు సినీ హీరో సాయి శ్రీనివాస్, గణేశ్ బాబుతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన వారు ఆలయంలో నిర్వహించిన స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలు పండ్లు సమర్పించారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అర్చకులు బెల్లంకొండ కుటుంబ సభ్యులను స్వామివారి గర్భాలయంలోకి ఆహ్వానించి స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించారు. అనంతరం వారికి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సినీ నిర్మాత, సినీ హీరో సాయి శ్రీనివాస్ను చూసేందుకు వందలాది మంది భక్తులు పోటీ పడ్డారు. కొందరు వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పవన్కుమార్, రాజీవ్ శర్మ, ఆలయ రికార్డు అసిస్టెంట్ గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది శివరాజు శేషు, నూతలకంటి అజయ్, నవీన్, గొర్లపెల్లి గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
ములుగు రూరల్/గోవిందరావుపేట: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రసుత్త సమాజంలో ప్రజలు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అదే విధంగా గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్లో కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, తహసీల్దార్ విజయ్భాస్కర్, డీఎంహెచ్ఓ గోపాల్రావు, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర – మరిన్ని ఫొటోలు 9లోu -
ఉద్రిక్తత.. ఉత్కంఠ
హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకు వచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆందోళన, పరామర్శలతో సుబేదారి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఆయనకు బెయిల్రావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. – వరంగల్ క్రైం● ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ ● శంషాబాద్లో అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. ● బీఆర్ఎస్, విద్యార్థి నేతల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం.. ● బెయిల్ రావడంతో కార్యకర్తల ఆనందోత్సాహం– వివరాలు 8లోu -
మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలి
ములుగు రూరల్: మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. సమాజానికి పెను సవాలుగా మారిన మత్తు పదార్థాల నివారణకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి రవాణా చేసే అవకాశాలు ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీ కేంద్రం వద్ద నిఘా పెంచాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల రవాణాపై సమాచారం అందించడానికి టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపిక్ డేను పురస్కరించుకుని ఒలంపిక్ రన్ జ్యోతిని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే బంగారు భవిష్యత్ ఉంటుందని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి ఒలంపిక్ స్థాయికి ఎదగాలని సూచించారు. డ్రగ్స్నిర్మూలనలో భాగస్వాములు కావాలి ఎస్ఎస్తాడ్వాయి: డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వాములు కావాలని ఎస్పీ శబరీశ్ కోరారు. తాడ్వాయి పోలీసుల ఆధ్వర్యంలో ప్రజల భద్రత భరోసాకు అభయ మిత్ర కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా యువతను భాగస్వాములను చేస్తూ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. రోడ్డు సేఫ్టీ కమిటీల ద్వారా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచించారు.వాలీబాల్ పోటీల్లో విన్నర్గా కామారం జట్టు, రన్నర్గా గంగారం జట్టు విజయం సాధించగా ఎస్పీ షీల్డ్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. ఆక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెట్టే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
కాంగ్రెస్ పాలనలో పేదలకు అన్యాయం
ఎస్ఎస్తాడ్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో పేదలకు అన్యాయం జరుగుతుందని జెడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని కాటాపూర్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కాటాపూర్లో 108 మంది భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూమి కేటాయించినట్లు తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక రెవెన్యూ అధికారులను, కలెక్టర్ను బాధితులు కలిసి విన్నవించుకున్నా పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక దందాకు అడ్డుపడిన ఇద్దరు తహసీల్దార్లను అధికార బలంతో బదిలీ చేసి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటే ఇన్చార్జ్ తహసీల్దార్ను నియమించడం ఏమిటని ప్రశ్నించారు. అడవినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీల గుడిసెలను ఫారెస్ట్ అధికారులు తొలగించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామ సహాయం శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లయ్య, మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, నుశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి -
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
ములుగు రూరల్: జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాల నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు, కళాశాలల్లో పోస్టర్లు అంటించాలన్నారు. గంజాయి, పొగాకు, మద్యం వాటి వినియోగంతో యువత ఎలా బలైపోతున్నారో వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.విధులకు గైర్హాజరైతే చర్యలు ఎస్ఎస్తాడ్వాయి: అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కొడిశాల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో స్టాఫ్ నర్సు ఒక్కరే విధులకు హాజరు కాగా మిగతా వైద్యాధికారితో పాటు సిబ్బంది అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు తెలిపారు. వర్షాకాలం సీజన్లో వ్యాధుల నిర్మూలనకు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. మారుమూల గిరిజన గ్రామంలోని కొడిశాల పీహెచ్సీలో వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డీపీఎం సంజీవరావు ఉన్నారు. మావోయిస్టుల బంద్ పాక్షికం వాజేడు/వెంకటాపురం(కె): మావోయిస్టులు బంద్ శుక్రవారం వాజేడు, వెంకటాపురం (కె) మండలాల్లో పాక్షికంగా జరిగింది. వాజేడు మండలంలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆటోలు, వాహనాలు యథావిధిగా తిరిగాయి. కొన్ని దుకాణాలను మాత్రమే మూసి ఉంచగా ఎక్కువ దుకాణాలు తెరిచారు. ప్రజలు రోజువారీగా ఎవరి పనులను వారు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కొనసాగాయి. వెంకటాపురం (కె) మండలంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్ని షాపులు తెరచుకున్నాయి. 108, 102 వాహనాల తనిఖీ వెంకటాపురం(కె): మండలకేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పోగ్రాం మేనేజర్ నధీర్, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రాజ్కుమార్లు 102, 108 వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 108, 102 వాహనాలకు సంబంధించిన రికార్డులను, యంత్రాల పని విధానాన్ని పరిశీలించారు. భవిషత్లో ప్రజలకు ఏవిధంగా సేవలు అందించాలని సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ రాజ్యలక్ష్మి, పైలట్ కుమార్, రాధస్వామి, 102 కెప్టెన్ వెంకటేష్ తదితరులు ఉన్నారు. 23న ఒలింపిక్ డే రన్ భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ ఒలింపిక్ డేను పురస్కరించుకొని ఈ నెల 23న రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీహెచ్.రఘు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
ములుగు రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సీపీఐ జిల్లా సమితి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కారించాలన్నారు. మొక్కజొన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులైన బొగ్గుల వాగు, మెడికుంట వాగు, గుండ్ల వాగు సమస్యలను పరిష్కారించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, కార్యవర్గ సభ్యులు ఎండీ అంజాద్పాషా, బండి నర్సయ్య, గడ్డం రామకృష్ణ, బట్టి సంతోష నాసర్, రవి, కుమ్మరి సాగర్ తదితరులు ఉన్నారు. -
ఆదివాసీలకు చట్టబద్ధత కల్పించాలి
ములుగు రూరల్: షెడ్యూల్ ప్రాంతంలో పూర్వం నుంచి జీవిస్తున్న ఆదివాసీలకు చట్టబద్ధత కల్పించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చింత కృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దివాకరకు తుడుందెబ్బ, ఎమ్మార్పీఎస్ నేతలు కలిసి వినతి ప్రతం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా భూభాగం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ భాగాన్ని కాపాడాల్సిన దేశ అత్యున్నత ఇండియన్ సర్వీసెస్ అధికారులే చోద్యం చేయడం బాధాకరమన్నారు. ఏటూరునాగారంలోని శివపురం షెడ్యూల్డ్ ఏరియా గ్రామంలో కొంతమంది గిజనేతరులు ఆదివాసీల పట్టా భూమిని సాగు చేయడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నెమలి నర్సయ్య, నాయక పోడ్ దెబ్బ వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యుడు బొల్లెం సారయ్య, ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు వావిలాల స్వామి పాల్గొన్నారు. -
వాతావరణం
జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రత ఉంటుంది. సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి ● కలెక్టర్ దివాకర ములుగు రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర శుక్రవారం కోరారు. నేడు (శనివారం) గిరిజన భవన్లో అంతర్జాతీయ యోగా వేడుకలను నిర్వహిస్తున్నారని, ఈ వేడుకలకు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం, ఆయుష్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా జిల్లా కేంద్రంలో యోగా దినోత్సవ వేడుకలను ఉదయం 7 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ఆర్గనైజర్లు, జిల్లా పోగ్రాం మేనేజర్ (ఆయుష్) డాక్టర్ ఎన్ లీ చంద్ర, జిల్లా ఇన్చార్జ్ సంధ్య, యోగా ఇన్స్ట్రక్టర్ శివకృష్ణ, మానస, హరిత పాల్గొననున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ వందశాతం పూర్తిములుగు రూరల్: జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న మూడు నెలల సన్నబియ్యం పంపిణీ వందశాతం పూర్తి అయిందని జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ శుక్రవారం తెలిపారు. రేషన్కార్డుదారులకు జూన్, జూలై, ఆగస్టు నెల బియ్యాన్ని జిలాల్లో 222 రేషన్ షాపుల ద్వారా 5,218 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీలో జిల్లాలో అన్ని శాఖల అధికారుల సహకారంతో 19 రోజుల్లోనే పూర్తి చేశామన్నారు. రూ.75.13కోట్లు జమ ములుగు రూరల్: ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేసిందని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ శుక్రవా రం తెలిపారు. జిల్లాలో 73,129 మంది రైతులకు గాను రూ.75.13 కోట్లు జమ చేశామన్నారు. రైతుభరోసా డబ్బులను వ్యవసాయ అవసరాలకు వాడుకోవాలని సూచించారు. -
మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి
కాటారం: నర్సరీల్లో మొక్కల పెంపకం పట్ల తగు జాగ్రత్తలు పాటించి సక్రమంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మహదేవపూర్ డివిజన్ అధికారి సందీప్రెడ్డి సూచించారు. కాటారం మండలకేంద్రంలోని సెంట్రల్ నర్సరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. మొక్కల పెంపకం, మొక్కల రకాలు తదితర అంశాలపై ఎఫ్డీఓ ఆరాతీశారు. మొక్కల పెంపకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం గుమ్మాళ్లపల్లి అటవీ ప్రాంతంలో కలియ తిరిగి అటవీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున అటవీశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎఫ్డీఓ వెంట కాటారం రేంజ్ అధికారి స్వాతి, డిప్యూటీ రేంజ్ అధికారి సురేందర్, బీట్ అధికారులు రాజేందర్, రాజ్కుమార్ ఉన్నారు.ఎఫ్డీఓ సందీప్రెడ్డి -
వెలిశాల.. శోకసంద్రం
టేకుమట్ల: మూడు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియలు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో శుక్రవారం ముగిశాయి. రంపచోడవరంలో గురువారం రాత్రి పోస్టుమార్టం అనంతరం రవి పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించగా శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వగ్రామమైన వెలిశాలకు చేరుకుంది. ఉద్యమ గీతాలతో కవులు, కళాకారులు, ఉద్యకారులు ఉద్యమాల బిడ్డా, నిను మరువదు ఈ గడ్డ అంటూ నివాళులర్పించారు. కాగా, రవి మృతదేహాన్ని వెలిశాలకు తీసుకొస్తున్న సమయంలో చిట్యాల, చల్లగరిగలో వాహనాన్ని ఆపి పలువురు నివాళులర్పించారు. ఎరుపెక్కిన వెలిశాల.. గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పెద్దఎత్తున ఎర్రజెండాలు, రవి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పార్థీవ దేహం వెలిశాలకు చేరుకోగానే ఉద్యమ గీతాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన అంతిమయాత్ర కూతవేటు దూరానికే సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఉద్యమ నినాదాలు, గీతాలు, డప్పు కళాకారుల దరువులకు వెలిశాల దద్ధరిల్లింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప ఉద్యమ గీతాలు, నృత్యాలతో విప్లవానికి చావు లేదనే విధంగా ఆడి పాడారు. అంతిమ యాత్ర ప్రారంభం నుంచి చివరి అంకం వరకు ఉద్యమ గీతాలు, నృత్యాలతో హోరెత్తించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు గాజర్ల రవికి అంతిమ వీడ్కోలు తెలిపేందుకు మాజీ మావోయిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, గాయకులు, ప్రజలు, అభిమానులు తరలిరావడంతో వెలిశాల జన సంద్రమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షా కనుసన్నల్లో పని చేస్తున్నాడని భారత్ భచావో అధ్యక్షుడు, తెలంగాణ సిద్ధాంతకర్త గాదె ఇన్నయ్య, విమలక్క మండిపడ్డారు. హక్కులు సాధించుకోవాలంటే పోరాడాలని అమ్మే నేర్పిందని గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అన్నారు. కష్టమున్న చోట ఎదురించి పోరాడమని వెలిశాల చెప్పిందని అన్నారు. దొరలు, పెత్తందార్లు చేసే అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం గాజర్ల కుటుంబం పోరాడిందని.. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు వెలిశాల ప్రజలకు తెలుసన్నారు. చివరికి అన్నయ్య రవన్న మృతదేహాన్ని సైతం రంపచోడవరం ఆస్పత్రిలో చూపించకుంటే పోలీసులను ప్రశ్నిస్తేనే చూపించారని అన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న గాజర్ల రవి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు వేలాది మంది నడుమ జరిగిన అంతిమయాత్ర అనంతరం గాజర్ల రవి అలియాస్ గణేష్ చితికి సోదరుడు అశోక్ అలియాస్ ఐతు నిప్పంటించారు. మావోయిస్టు నేత గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు ఎర్రజెండాలతో ఎరుపెక్కిన గ్రామం తరలివచ్చిన ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు -
దిగుమతి భారం తగ్గించేందుకే ఆయిల్పామ్ సాగు
గోవిందరావుపేట: దేశంలో వంటనూనె దిగుమతి భారాన్ని తగ్గించేందుకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యాన అధికారి దండు సంజీవరావు అన్నారు. మండల పరిధిలోని రాంనగర్ గ్రామంలో రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ దేశంలో వంట నూనె ఉత్పత్తి 16.69 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా 33.20 మిలియన్ మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతుందన్నారు. దేశంలో పామ్ ఆయిల్ 259 లక్షల టన్నులు వినియోగానికి అవసరం కాగా 100 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని, 67% పామాయిల్ ఇతర దేశాలనుంచి సుంకం చెల్లించి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దేశంలో 13.24 లక్షల ఎకరాల్లో సాగు ఉండగా ఇంకా 70 లక్షల ఎకరాల్లో సాగు కావాలన్నారు. ప్రభుత్వం రాయితీ, సబ్సిడీతో మొక్కలు, పరికరాలు ఇస్తుందని, ఆసక్తి ఉన్న రైతులు సమీప ఆయిల్పామ్ ప్రతినిధి, ఉద్యాన అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీకాంత్, కేఎన్ బయో సైన్స్ మండల ప్రతినిధి సురేష్, నవీన్ నాయక్, రైతులు సోనియా నాయక్, భూక్య మోహన్, సీతారాం, సమ్మయ్య, సారక్క, రజిత, శారద తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి సంజీవరావు -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
ములుగు రూరల్: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ శబరీష్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ అధికారికి అందించి విచారణ అనంతరం కేసులు నమోదు చేయాలన్నారు. రికార్డులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, విచారణ చేపడుతున్న కేసుల్లో ప్లాన్, యాక్షన్ కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా అప్రమత్తం చేయాలన్నారు. డీఎస్పీ రవీందర్, ఎస్బీ సీఐ శంకర్, సీఐ సురేష్, ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ శబరీష్ -
విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు
సంతోషంగా ఉంది కేజీబీవీ బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతన మెనూ అమలు చేయడం సంతోషంగా ఉంది. మెస్ చార్జీలు కూడా పెంచడంతో మాకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. – పలిశెట్టి ప్రసన్న, 10వ తరగతి, కేజీబీవీ జవహర్నగర్ప్రభుత్వానికి కృతజ్ఞతలు గతానికి భిన్నంగా సీఎం రేవంత్రెడ్డి నూతన మెనూ అమలు చేయడం సంతోషంగా ఉంది. మంచి పోషకాహారం అందడంతో చదువుపై మరింత దృష్టి సారిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – బండారి సింధూ, 9వ తరగతి, కేజీబీవీ జవహర్నగర్నూతన మెనూ ప్రకారమే.. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నూతన మెనూ అమలు చేస్తున్నాం. నూతన మెనూ చార్టులు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాం. బాలికలకు పౌష్టికాహారం అందడంతో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చదువులో మరింత రాణించే అవకాశం ఉంటుంది. – జయ వసంతలక్ష్మి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్వెంకటాపురం(ఎం): నిరుపేద బాలికలు చదువును మధ్యలో ఆపేయకుండా కేంద్రప్రభుత్వం 2004–05లో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలను (కేజీబీవీ) ప్రారంభించింది. ప్రతీ మండలంలో కేజీబీవీలను నెలకొల్పి హాస్టల్ వసతితో పాటు బాలికలు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. నిరుపేద బాలికలను అక్కున చేర్చుకుని వారి ఆలనాపాలనా చూసుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. రాష్ట్రంలోని కేజీబీవీల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేజీబీవీ విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కేజీబీవీ బాలికల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. 2025–26 విద్యా సంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. పెరిగిన మెస్ చార్జీలు గతంలో 6 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులందరికీ ఒకే విధంగా నెలకు రూ.1,225 లను ప్రభుత్వం అందించేది. కానీ నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,330లు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,540లు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2,100లను ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 9 కేజీబీవీలు ఉండగా వాటిలో 1,933 మంది విద్య నభ్యసిస్తున్నారు. మెస్ చార్జీలను ప్రభుత్వం పెంచడంతో కేజీబీవీ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.1,225 నుంచి రూ.1,540లకు పెంపు జిల్లా వ్యాప్తంగా 9 విద్యాలయాల్లో 1,933 మంది విద్యార్థినులు మెస్చార్జీలు పెరుగుదలతో ఆనందం -
విద్యార్థులు వచ్చినప్పుడే ప్రార్థన..
వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని లింగాపూర్ పాఠశాలలో 21 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. విద్యార్థులు వచ్చినప్పుడే పాఠశాలలో ప్రార్థన చేస్తున్నారు. అలాగే జవహర్నగర్ కేజీబీవిలో 370 మంది విద్యార్థులకు 43 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక్కడ ఉపాధ్యాయినులు సమయపాలన పాటించకపోవడంతో పాటు వాట్సాప్ మేసేజ్్ ల ద్వారానే సెలవులు పెడుతున్నట్లు తెలిసింది. కేజీబీవీలో హాస్టల్ వసతులు సరిగా లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. నూతనంగా నిర్మిస్తున్న 15 గదుల భవనాన్ని స్వాధీనం చేస్తే బాలికల సమస్యలు పరిష్కారం కానున్నాయి. -
ఊరట్టం పాఠశాలలో తాగునీరు కరువు
ఎస్ఎస్తాడ్వాయి మండల పరిధిలోని ఊరట్టంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు కరువైంది. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వం ఎంపిక చేసి పాఠశాలలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాగునీటి కోసం ప్యూరిఫైయర్ వాటర్ మిషన్ ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. కానీ తాగునీటి వసతి మాత్రం లేదు. అమ్మ ఆదర్శ పాఠశాలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా సంబంధిత అధికారులు ఇవ్వలేదు. విద్యార్థులు ఇంటి వద్ద నుంచే వాటర్ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుని తాగుతున్నారు. మరుగుదొడ్లకు నీటి సరఫరా లేకపోవడంతో వినియోగించని పరిస్థితి. -
సమస్యల బడి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువుమరుగుదొడ్డి.. వంట షెడ్డు అధ్వానం ఏటూరునాగారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. గత ప్రభుత్వం ఈ పాఠశాలను మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా అప్గ్రేడ్ చేసింది. ఈ పాఠశాలలో మూడు తరగతి గదులు ఉండడంతో విద్యార్థులను ఒకే గదిలో రెండు క్లాస్లను కూర్చోబెట్టి స్కూల్ నడుపుతున్నారు. ఒకే మరుగుదొడ్డి ఉంది. శిథిలమైన వంటషెడ్డు, అధ్వానంగా టాయిలెట్స్ ఉన్నాయి. అదే విధంగా పాఠశాల ఆవరణలోని భవనం పైకప్పు పూర్తిగా శిథిలమై ఉండడంతో వర్షాలు కురిస్తే గదిలో మొత్తం వర్షపు నీరే దర్శనమిస్తుంది. తరగతి గది సరిగా లేకపోవడంతో విద్యార్థులను వరండాలోనే కూర్చొబెట్టి పాఠాలను బోధిస్తున్నారు. ● తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి ● పలుచోట్ల శిథిలావస్థలో భవనాలు ● విద్యార్థులు లేక మూతపడుతున్న పాఠశాలలుమూతబడి తెరుచుకున్నా ప్రయోజనం లేదు.. ఎస్ఎస్తాడ్వాయి మండల కేంద్రంలోని నర్సింగాపూర్లో ఎంపీపీఎస్ పాఠశాల గతేడాది విద్యార్థులు లేక మూతపడింది. విద్యార్థులు లేకపోవడంతో ఉపాధ్యాయుడు కీర్తిమంతరావును మండలంలోని బంజరఎల్లాపూర్ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు డిప్యుటేషన్పై పంపించారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమంలో ముగ్గురు విద్యార్థులను గుర్తించి బడిలో చేర్పించారు. అయితే కొద్దిరోజులు మాత్రమే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బడి మానేశారు. ఉపాధ్యాయుడు కీర్తిమంతరావు మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక వసతులు సైతం కరువయ్యాయి. కొన్ని పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థలకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల విద్యార్థులు లేకపోవడంతో గతేడాది 54పాఠశాలలు మూతపడిన దుస్థితి నెలకొంది. అలాగే పలు పాఠశాలల్లో టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తాగునీటి వసతి సైతం లేకపోవడంతో ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. బడిబాట కార్యక్రమంలో పిల్లలను పాఠశాలల్లో చేర్పించిన వారిని సైతం బడికి వచ్చేలా చూసుకోవడం లేదు. ఇలా.. జిల్లాలోని ప్రతీ పాఠశాలను ఏదో ఒక సమస్య వేధిస్తున్నట్లు గురువారం ‘సాక్షి’ విజిట్లో వెల్లడయ్యింది. -
‘సికిల్సెల్’తో అనారోగ్యం
ములుగు రూరల్: సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు రక్తహీనతతో తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుందని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సికిల్ సెల్పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా సికిల్ సెల్ను గుర్తించవచ్చన్నారు. సికిల్ సెల్ జన్యు సంబంధమైన వ్యాధి అన్నారు. వ్యాధిగ్రస్తులకు దృష్టిలోపం, కీళ్ల నొప్పులు, చాతి నోప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. పోషకాహార సమతుల్యత, వైద్యుల పర్యవేక్షణ, శారీరక శ్రమతో నియంత్రించవచ్చని వివరించారు. జిల్లాలో 22,392 మందికి వైద్య పరీక్షల కార్డులను అందించినట్లు వెల్లడించారు. అందులో 15 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీహెచ్ జగదీశ్, ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, పవన్కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు కృషి ఎస్ఎస్తాడ్వాయి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు కోరారు. మండలంలోని పడిగాపూర్, ఎల్బాక గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆయన సందర్శించారు. గ్రామాల్లో సిబ్బందితో కలిసి ఇంటింటిని పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఇంటి పరిసరాల్లో, రోడ్లపై నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. దోమతెరలను వినియోగించడంతో పాటు మస్కుటోకాయల్స్ వాడాలన్నారు. నీటి నిల్వల్లో ఆయిల్ బాల్ వేయాలని కార్యదర్శి ధర్మేందర్కు సూచించారు. డీఎంహెచ్ఓ వెంట వైద్యాధికారి పవన్ కుమార్, డీఎంఓ సంపత్, ఏఎంఓ దుర్గారావు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకట్రెడ్డి, సూపర్వైజర్ పద్మ, ఫార్మసిస్టు వెంకట్, ఆశలు ఉన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ములుగు రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో కుట్టుమిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు, ధ్రువపత్రాలను మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మహిళ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం కుట్టే పనితో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. 15నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చేరాలని సూచించారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్లు, ఇందిరా శక్తి క్యాంటీన్లు, బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలలో చేరిన చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి తుల రవి, డీఎస్పీ రవీందర్, ట్రైబల్ వెల్పేర్ డీడీ పోచం, ఎంపీడీ రామకృష్ణ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం అధికారి రమాదేవి, డీసీపీఓ ఓంకార్, సీడీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి పొట్లాపూర్ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు అంచనా విలువ రూ.19 కోట్లతో రోడ్డు వెడల్పు, పటిష్ట పరిచేందుకు నిధులు కేటాయించినట్లు సీతక్క వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన మండల పరిధిలోని బండారుపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ దివాకరతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు విద్యాబుద్దులతో పాటు సంస్కారం నేర్చుకోవాలన్నారు. గత సంవత్సర కాలంలో పలు కంపెనీల సహకారంతో పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్యాబోధన చేయడానికి అవకాశాలను మెరుగుపరచామని తెలిపారు. అనంతరం మంత్రి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పాఠశాల ప్రిన్సిపాల్ దేవకి, ఎంఈఓ తిరుపతి, సైన్స్ అధికారి జయదేవ్, కో ఆరి ్డనేటర్ రాజు, సాంబయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
భూ భారతిపైనే ఆశలు
ములుగు రూరల్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను తొలగించి భూ భారతిని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. దీంతో భూ సమస్యలు పరిష్కారమై పట్టాలు జారీ అవుతాయనే ఆశతో రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని పాస్పుస్తకాలు ఉన్నవారికి మాత్రమే అందించడంతో లేని వారు భూభారతి చట్టంపై ఆశలు పెట్టుకున్నారు. 3 నుంచి 18వరకు రెవెన్యూ సదస్సులు జిల్లాలోని పది మండలాలు ఉండగా వెంకటాపురం(ఎం) మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. మిగతా మండలాల్లో ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 327 రెవెన్యూ గ్రామాలు ఉండగా 297 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో మిస్సింగ్ సర్వే నంబర్, పెండింగ్ మ్యూటేషన్, విస్తీర్ణంలో తేడాలు, ఆక్రమణలు, పట్టాదారుడి పేరు సవరణ, నిషేధిత భూముల నుంచి తొలగింపు, అసైండ్ భూముల క్రమబద్ధీకరణ, సాదాబైనామా, వారసత్వం, భూ సేకరణ వంటి సమస్యలపై బాధితులు ఫిర్యాదులు అందించారు. సమస్యలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా మొత్తం దరఖాస్తులు 8,504 రాగా ఇందులో సాదాబైనామా దరఖాస్తులు 7,894 ఉన్నాయి. పోడు భూమికి సంబంధించి 53, అసైండ్ భూమి పార్టేషన్ 208, నూతన అసైన్డ్ మెంట్ 151, పీఓటీ 21, సర్వే 4, సర్వే ఎర్రర్ 1, నాలా 1, ఇంటి స్థలం 1, ఖాతా మెర్జింగ్ 4, కోర్టు కేసులు 3, భూదాన్ ల్యాండ్ 1, ఎల్పీజీ 18, గిఫ్ట్డీడ్ 11, సర్వే నంబర్ మిస్సింగ్ 1, ఇతరులపై పట్టా ఎంట్రీ 9, నాన్ ట్రైబల్స్ 1/70 యాక్టు 96, పసుపు కుంకుమలు 24, ఆధార్ కరెక్షన్ 1, ల్యాండ్ డిస్ప్ట్ 2 వంటి సమస్యలు పరిష్కరించాలని రైతులు అధికారులకు వినతులు అందజేశారు. ఆన్లైన్ ప్రక్రియ పూర్తి .. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేశాం. ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులను పరిశీలించి సర్వే చేపట్టి భూ భారతి చట్టంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తాం. – మహేందర్ జీ, అదనపు కలెక్టర్(రెవెన్యూ)మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలుమండలం దరఖాస్తులు ములుగు 4,589 గోవిందరావుపేట 1,239 ఎస్ఎస్తాడ్వాయి 661 ఏటూరునాగారం 113 కన్నాయిగూడెం 303 మంగపేట 1,179 వాజేడు 217 వెంకటాపురం(కె) 203 భూమి పట్టాల కోసం 8,504మంది రైతుల దరఖాస్తులు అధికంగా సాదాబైనామా ఫిర్యాదులు ముగిసిన రెవెన్యూ సదస్సులు -
పోలీసుల అత్యుత్సాహం
కన్నాయిగూడెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పథకం అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో పోలీసులు అత్యుత్సాహంగా ప్రవర్తించారు. ప్రజలు, విలేకర్లపై దురుసుగా ప్రవర్తించారు. వివరాల్లోకి వేళ్తే.. మండల పరిధిలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలో బుధవారం భూ భారతిపై రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్రామంలోని భూసమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో పేరు పిలిచిన వారు రావాలని చెప్పడంతో రైతులు కొంతదూరంలో కూర్చున్నారు. దరఖాస్తులు పోలీసుల చేతుల్లో.. ఈ క్రమంలో రెవెన్యూ అఽధికారులకు ఇచ్చిన దరఖాస్తులను కానిస్టేబుళ్లు చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అధికారుల వద్ద ఉండాల్సిన దరఖాస్తులు పోలీసులు తీసుకోవడం ఏమిటని ప్రజలు మండి పడ్డారు. భూముల సమస్యలు పోలీసులు పరిష్కరిస్తారా.. లేక అధికారులు పరిష్కరిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు సదస్సు విజయవంతానికి కృషి చేయాలి కాని అత్యుత్సాహంగా ప్రవర్తించడంపై వాపోయారు. రెవెన్యూ సదస్సులో ప్రజలు, విలేకర్ౖలపై దురుసు ప్రవర్తనవివరాల సేకరణకు వెళ్లిన విలేకర్లకు.. ఇదే క్రమంలో దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న కొంతమంది విలేకర్ల పట్ల ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి దురుసుగా ప్రవర్తించారు. మీరు ఎవరు.. బయటికి వెళ్లండి అంటూ బూతులు తిడుతూ బయటికి నెట్టివేశాడు. బయట నిల్చోని జరిగిన సంఘటనపై చర్చించుకుంటే మరో కానిస్టేబుల్తో వచ్చి ఓ విలేకరి చేతులో ఉన్న ఫోన్ లాక్కొని మరో కానిస్టేబుల్కు ఇచ్చి మరోసారి తిట్టసాగాడు. అంతలోనే చుట్టుపక్కల ఉన్న జనం ఎదురుతిరిగారు. అనంతరం 15నిమిషాల తర్వాత ఫోన్ అప్పగించారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
డయేరియా నిర్మూలనకు చర్యలు
ఏటూరునాగారం: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు డయేరియా ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, స్వయంగా ఓఆర్ఎస్ను తయారు చేసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ ప్రేమలత సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో స్టాప్ డయేరియా క్యాంపనింగ్ 2025 కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సెర్ప్ సంఘాలతో అవగాహన కల్పించినట్లు తెలిపారు. జూన్ 16 నుంచి జూలై 31 వరకు ఈ కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని ఐదేళ్ల లోపు పిల్లలు డయేరియా బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు సహాయ సహకారాలు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్, జింక్ తయారు చేసే విధానం, ఉపయోగించే పద్ధతులను టీచర్లకు వివరించామని తెలిపారు. ఈ వర్షాకాలంలో డయేరియా బారిన పడకుండా ఓఆర్ఎస్, జింక్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డయేరియా ప్రబలితే సెంటర్ చుట్టూ శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు సుమలత, డీఆర్డీఓ ఏపీడీ చౌహన్, సూపర్వైజర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. చట్టప్రకారం దత్తత తీసుకోవాలి సంతానం లేని తల్లిదండ్రులు ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు, సిబ్బందిని సంప్రదించి చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవాలని సీడీపీఓ ప్రేమలత సూచించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దత్తత విషయంపై అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టబద్ధమైన దత్తత తీసుకోవడం సంతోషకరమన్నారు. సీడీపీఓ ప్రేమలత -
ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం
గాజర్ల రవి (ఫైల్)భూపాలపల్లి/టేకుమట్ల: వెలిశాల తల్లడిల్లింది. ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. 2008లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్లో చనిపోగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన తమ్ముడు రవి అలియాస్ గణేష్ మృతిచెందాడు. దీంతో మావోయిస్టు ఉద్యమంలో గాజర్ల కుటుంబ ప్రస్థానం ముగిసినట్లయ్యింది. విషయం తెలియడంతో వెలిశాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యమాల బిడ్డ–నిను మరువదు పోరు గడ్డ అంటూ పలువురు ఉద్యమకారులు రవి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మూగబోయిన వెలిశాల.. ఎన్కౌంటర్లో రవి మృతి చెందిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో ఇద్దరు ఉద్యమకారులు నేలకొరిగారంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు రవితో గడిపిన సమయాలను నెమరువేసుకుంటున్నారు. 2008లో జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల సారయ్య హతమవగా కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికీ కూలిపోయిన సారయ్య విగ్రహం అక్కడ ఉంది. కాగా, గాజర్ల కుటుంబంలో నక్సల్స్లో చేరిన ముగ్గురిని చూసి గ్రామంలో చాలామంది ఉద్యమ బాట పట్టారు. దీంతో 2005లో అప్పటి సీఐ శ్యాంసుందర్రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వెలిశాల గ్రామంలో శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత రవి మృతి 33 ఏళ్ల క్రితం ఎర్రజెండా పట్టి అజ్ఞాతంలోకి.. సెంట్రల్ కమిటీ సభ్యుడి హోదాలో మరణం వెలిశాలలో ముగిసిన అన్నల శకం -
వాతావరణం
జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.ఇళ్ల పురోగతిని ఆన్లైన్లో నమోదు చేయాలి కలెక్టర్ దివాకరములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మొదటి విడతలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను గ్రౌండింగ్ చేయాలన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు అందిస్తుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు టోకెన్ల పద్ధతి ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాతో టోకెన్ల జారీ విధానంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను మ్యాపింగ్ చేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ అధికారులు, ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఇంజనీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు, సీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా వాసంతి ములుగు రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారిగా వాసంతికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమె ములుగు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో ములుగు జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన వాసంతికి తిరిగి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలను అరికట్టి అర్హులకు ఇళ్లు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బీరెల్లిలో బుధవారం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుచరులకు, కార్యకర్తలకే ఇళ్లు కేటాయించి అర్హులైన పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతుందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. మంత్రి సీతక్క సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వివరించారు. మాట ఇచ్చి తప్పడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టి న విద్య అని విమర్శించారు, అర్హులైన నిరుపేదల కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేంత వరకు పోరా టాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ సర్పంచ్ జాజ చంద్రం, మండల ప్రధాన కార్యదర్శి నగేష్, దిడ్డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి -
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య– కనకమ్మలకు ఐదుగురు కుమారులు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్. మల్లయ్య వ్యవసాయం, గౌడ కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. 1987లో గుమ్మడవెల్లి కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో గాజర్ల సారయ్య చైర్మన్ బరిలో నిలిచి గెలుపొందాడు. అయినప్పటికీ అప్పటి పెత్తందారులు బ్యాలెట్ బాక్స్లను గల్లంతు చేసి ఓడినట్లుగా అధికారులతో ప్రకటింపజేశారు. దీంతో సారయ్య మందమర్రిలో ఉండే తన అన్న సమ్మయ్య దగ్గరికి వెళ్లి ఉపాధి కోసం చూస్తాడు. అక్కడ కూడా అతనిపై అక్రమ కేసులు మోపడంతో 1990లో పూర్తిస్థాయిలో నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లాడు. సారయ్య అలియాస్ ఆజాద్గా గుర్తింపు పొందాడు. ఆయన బాటలోకి గాజర్ల రవి, అశోక్ వెళ్లారు. 2008లో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య అలియాస్ ఆజాద్ చనిపోయాడు. తాజాగా రవి కూడా ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అశోక్ మాత్రం 2016లో పోలీసుల ఎదుట లొంగిపోయి, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. న్యూస్రీల్ఉద్యమానికి పురుడు పోసిన ఘటన.. -
వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి
ములుగు రూరల్: ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రజలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు సూచించారు. మండల పరిధిలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని రాంచంద్రాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆయన బుధవారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధారణ పరీక్షల్లో హైపర్ టెన్షన్, టీబీ, డయాబెటీస్, సుఖ వ్యాధులు, హెచ్ఐవీ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ప్రజలు శారీరక శ్రమ, ఆరోగ్య సూత్రాలను పాటించడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించడం ఆరోగ్య కార్యకర్తల బాధ్యత అన్నారు. ఇమ్యూనైజేషన్ డ్యూ, వ్యాక్సిన్, వీవీఎం, కండిషనింగ్ ఐస్ ప్యాక్, రిజిస్టర్లను పరిశీలించారు. దోమలు వృద్ధి చెందకుండా పంచాయతీ సిబ్బందితో స్ప్రే చేయించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాలు, నియంత్రణ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రణదీర్, డెమో సంపత్, హెచ్ఐవీ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, ఆరోగ్య కార్యకర్తలు శ్రీలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
స్వయం సహకార సంఘాలకు శిక్షణ
ములుగు రూరల్: స్వయం సహకార సంఘాలకు రైజింగ్ అండ్ ఎక్సలెటరింగ్ ఆధ్వర్యంలో జీవనోపాధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో మూడు మండలాలకు చెందిన 124 మంది సభ్యులకు హైదరాబాద్ లీప్ సంస్థ మేనేజర్ పల్లవి జోషి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ స్వయం సహకార సంఘం సభ్యులకు టైలర్స్, బట్టల వ్యాపారం, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సంపత్రావు, సంస్థ మేనేజర్ ప్రియాంక, డీపీఎం వేణుగోపాల్, ఏపీఎం పాషా, తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటి కేసులు నమోదు చేయాలి ములుగు రూరల్: ఆదివాసీలపై దాడులకు పాల్పడి ఇళ్లు ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేయాలని ఆదివాసీ నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కోయగూడెంను సందర్శించి బాధితులను పరామర్శించారు. ఐదవ షెడ్యూల్డ్ ప్రకారం అటవి సంపదపై ఆదివాసీలకు హ క్కు ఉందన్నారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై అధికారులు విచారణ చేసి ఇంటి స్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడెందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్, గణేశ్, బాబు, మధుసుదన్, దేవేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు గోవిందరావుపేట: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మండల పరిధిలోని దుంపెల్లిగూడెంలో బుధవారం ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణ పనులకు ముగ్గుపోయడంతో పాటు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు అశోక్ ఆదేశాల మేరకు గ్రామాల్లో అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు గృహాలను నిర్మించుకోవాలని కోరారు. దశాబ్ద కాలంలో గత ప్ర భుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ షాపుల తనిఖీభూపాలపల్లి రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో విత్తనాలు, ఫర్టిలైజర్ షాపుల్లో డీఏఓ వీరునాయక్, ఏఓ సతీష్ తనిఖీలు చేపట్టారు. బుధవారం కొంపెల్లి, గుడాడ్పల్లి, గోర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో షాపుల్లో రికార్డులను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, తప్పకుండా రశీదు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని యజమానులకు సూచించారు. తనిఖీల్లో వ్యవసాయశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 226 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత? చిట్యాల: మండలంలోని కొత్తపేట శివారు మేఘన రైస్ మిల్లు వద్ద 266 క్వింటాళ్ల రేషన్ సన్న బియ్యం లారీని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో అధికారులు మిల్లు వద్ద వేచి చూసి దాడు లు నిర్వహించారు. దీంతో లారీలో ఉన్న సన్నబియ్యం స్థానిక పీఎస్కు తరలించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారా..లేదా? అనేది నేడు నిర్థారణ కోసం బియ్యం నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా లారీని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి
ములుగు రూరల్: నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. మండల పరిధిలోని జాకారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన అభయ మిత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల భద్రత, భరోసాకు అభయ మిత్ర కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిడం వల్ల నేర రహిత సమాజ నిర్మాణం, పోలీసులకు, ప్రజలకు సత్సంబంధాలు పెంపొందుతాయన్నారు. నిషేధిత మాదకద్రవ్యాల వ్యతిరేఖ చట్టాలపై అవగాహన కల్పించారు. యు వత మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితం నాశనం చేసుకోవద్దన్నారు. తల్లితండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని సూచించారు. గంజాయి, నకిలీ విత్తనాల అమ్మకాలపై సమాచారం అందించిన వారికి రూ.10 వేలు నగదు బహుమతి అందిస్తామన్నారు. మండల పరిధిలోని 32 పంచాయతీల్లో యాంటీ డ్రగ్ కమిటీలను నియమించినట్లు తెలిపారు. రైతులు అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు కరెంట్ ఫినిసింగ్ వేయకూడదని సూచించారు. యువత పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలతో ప్రేమ, శారీరక సంబంధాలు పెట్టుకోవడం నేరమని వివరించారు. సైబర్ క్రైం నేరస్తుల బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్లు, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు, యాంటీ డ్రగ్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.ఎస్పీ శబరీశ్ -
వసతులు అంతంతే!
జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో సౌకర్యాల లేమిములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్) అడ్డంకులు తెలిపింది. ఈ మేర కు మెడికల్ కళాశాలలో నిబంధనల మేరకు వైద్య విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలో అరకొర వసతుల మధ్య వైద్య విద్య కొనసాగిస్తున్నారు. వైద్య విద్యార్థులకు ల్యాబ్లు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అనుసంధాన ఆస్పత్రి, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంచాలి. ఈ వసతుల కొరతను గుర్తించిన నేషనల్ మెడికల్ కమిషన్ సీరియస్ అయ్యింది. ఉమ్మడి జిల్లాలోని పలు వైద్య కళాశాలలతో పాటు ములుగు కళాశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ప్రవేశాల లోపు కళాశాలలో ఎన్ఎంసీ నిబంధనల మేరకు వసతులు కల్పిస్తేనే ప్రవేశాలకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇచ్చేందుకు బుధవారం ఢిల్లీకి ఆయా కళాశాలల ప్రిన్సిపా ల్స్, డీన్స్ వెళ్లనున్నారు.. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల భవితవ్యం నేడు (బుధవారం)తేలనుంది. ఏర్పాట్లలో నిమగ్నం మెడికల్ కళాశాలలో నిబంధనల మేరకు ఏర్పాట్లు, తగిన వసతులు కల్పించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది అడ్మిషన్లకు సుమారు 2 నెలల సమయం ఉండడంతో నిబంధనల మేరకు కళాశాలలో వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లకు అనుమతి పొందేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.నేడు తేలనున్న భవితవ్యం.. ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం నేడు (బుధవారం)తేలనుంది. గుర్తించిన లోపాలు, షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇవ్వాలని, ఇందుకోసం బుధవారం ఢిల్లీకి రావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈలను ఆదేశించింది. ఆ లోపాలను సరిచేస్తామని అన్ని కళాశాలలనుంచి హామీ పత్రాలు ఇవ్వనున్నారు. కానీ, వాటికి కూడా సంతృప్తి చెందక సీట్లు తగ్గిస్తారా? జరిమానాలు విధిస్తారా..? మందలించి వదిలేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో పూర్తి వివరాలు సమర్పించేందుకు అన్ని జిల్లాల, మెడికల్ కళాశాలల డీన్స్/ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో డీఎంఈ సోమవారం, మంగళవారంలలో సమావేశమై కళాశాలల సమగ్ర సమాచారం సేకరించారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ కొర్రీలు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు వసతులు కల్పిస్తేనే ప్రవేశాలకు అనుమతి వచ్చే అవకాశంఅధ్యాపకుల అవసరం ఉంది.. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో అధ్యాపకుల అవసరం ఉంది. ప్రస్తుతం కళాశాల, హాస్పిటల్లో మొత్తం 75 మంది అధ్యాపకులు ఉన్నారు. మరో 25మంది అవసరం ఉంది. మెడికల్ బోర్డుకు నివేదికలు అందించాం. కళాశాలలో విద్యార్థుల ప్రాక్టికల్స్కు మృతదేహాలు అందుబాటులో లేవు. అందుకు కాకతీయ మెడికల్ కళాశాల నుంచి తెప్పించడంతో పాటు పోలీసులను ఆశ్రయించాం. ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కళాశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. – మోహన్లాల్, ప్రిన్సిపాల్, వైద్య కళాశాల -
పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని బాల్య వివాహ నిరోధక అధికారిణి, సీడీపీఓ ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగము ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు బాల్యవివాహాల నిషేధ చట్టం – 2006 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగము అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు సవాల్గా మారాయన్నారు. మారుమూల ప్రాంతాల్లో వివిధ కారణాలతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ స్థాయిలో బాల్యవివాహ నిరోధక అధికారులుగా పంచాయతీ కార్యదర్శులు వ్యవహరించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహాల నిర్మూలనలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. బాల్య వివాహ రహిత జిల్లాగా ములుగును మార్చడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీఓ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైన బాల్య వివాహాలు జరిగితే వెంటనే ఆ ప్రదేశాన్ని సందర్శించి ఆపాలన్నారు. బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం –2006 ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయిలు, 21ఏళ్లు నిండని అబ్బాయిలకు వివాహం చేయడం చటరీత్యా నేరమన్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉంటుందన్నారు. బాల్య వివాహాలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ 1098, 112లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీవిద్య, కార్యదర్శులు పాల్గొన్నారు. సీడీపీఓ ప్రేమలత -
జీసీసీ సేవలను విస్తృతం చేయాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన సహకార సంఘం పరిధిలో గల ప్రజలకు అందుతున్న సేవలను మరింత విస్తృత పర్చాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జీసీసీ అధికారుల సమావేశంలో పీఓ మాట్లాడారు. జీసీసీ వాహనాల మరమ్మతులు ఇప్పటి వరకు ఎన్ని చేయించారని, ఇంకా ఎన్ని చేయించాల్సి ఉందని ఆరా తీశారు. మహదేవ్పూర్ సొసైటీకి చెందిన గ్యాస్గోదాం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీఆర్ డిపోలు, ఎంఎల్ఎస్ పాయింట్ల గోదాంలు, పెట్రోల్ బంక్ల తనిఖీలను మరింత ముమ్మరం చేయాలన్నారు. డీఆర్ డిపోల నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, లాభాలపై చర్చించారు. జీసీసీ గోదాంలు, ఆఫీసులు, డీఆర్ డిపోల స్థలాలను తనిఖీ చేసి గుర్తించాలన్నారు. ఆహార సదుపాయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సకాలంలో డీఆర్ డిపోలు, హాస్టళ్లలకు సరఫరా అయ్యేలా చూడాలని, ఆహారం నిల్వలు గడువు ముగిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటూరునాగారం డివిజన్ పరిధిలో పనిచేసే పెట్రోల్ బంక్లు దగ్గర తప్పకుండా సౌండ్బాక్సుల స్కానర్లను అమర్చాలన్నారు. బంక్లు, గోదాంల వద్ద బోరు సదుపాయం లేకపోతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డీఎం వాణి, మేనేజర్లు దేవ్, స్వామి, డీఈఓఎస్ అన్వర్, ప్రసాద్ పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
ఆదివాసీలకు అండగా ఉంటాం..
ఏటూరునాగారం: అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలను గుడిసెలు వదిలిపొమ్మనడం దారుణమని, ఆదివాసులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని రొయ్యూరు సమీపంలోని ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను ఆమె మంగళవారం పరిశీలించారు. అటవీశాఖ అధికారులు గుడిసెలు కూల్చివేసేందుకు చేసిన ప్రయత్నాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలో ఉండగానే అటవీశాఖ అధికారులు గుడిసెలను జేసీబీలతో కూల్చివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆదివాసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు ఇచ్చిన హామీలు మర్చిపోయారా అంటూ మంత్రి సీతక్కను ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు ఇలాంటి చర్యలు పునరావృతం చేస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్, మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఖాజాపాషా, దున్నపునేని కిరణ్, కాళ్ల రామకృష్ణ, కుమ్మరి చంద్రబాబు, చిన్ని కృష్ణ, చంద్రమౌళి, రాంబాబు, ఆదివాసీలు, తదితరులు పాల్గొన్నారు.జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి -
పెట్టుబడి సాయం..
రూ.48.47 కోట్లు రైతుల ఖాతాల్లో జమ జిల్లాలోని 10 మండలాల పరిధిలో 85,990 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తుండగా రైతు భరోసా పథకం కింద సుమారు రూ.103 కోట్లు ప్రభుత్వం అందించనుంది. సోమవారం రెండు ఎకరాలలోపు ఉన్న 49,356 మంది రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం రూ.30,10 కోట్లు రైతు ఖాతాల్లో జమ అయ్యాయి. మంగళవారం మూడున్నర ఎకరాలలోపు ఉన్న 12,310 మంది రైతులకు రూ.18.37 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఈ రెండు రోజుల్లో మూడున్నర ఎకరాలలోపు ఉన్న 61,666 మంది రైతులకు రూ.48.47 కోట్లను ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు విడతల వారీగా రైతులందరికీ రైతుభరోసా డబ్బులను ప్రభుత్వం అందజేయనుంది. జూన్ 5వ తేదీలోపు పాస్పుస్తకాలు కలిగిన ప్రతీ రైతుకు రైతు భరోసా వర్తింపజేస్తామని అధికారులు వెల్లడించారు. వెంకటాపురం(ఎం): వానాకాలం సాగు ప్రారంభంలోనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండడంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా సాగు సమయానికే డబ్బులు అందుతుండడంతో రైతులు సంబరపడిపోతున్నారు. ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన ప్రతీ ఒక్కరికి పెట్టుబడి సాయం అందనుంది. సోమవారం రెండెకరాలలోపు, మంగళవారం మూడున్నర ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల చొప్పున డబ్బులు జమ చేసింది. ప్రతిఏటా ఎకరానికి రూ.12వేల చొప్పున రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఏడాదికి రూ.12వేలు.. రైతులు సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటిసారిగా 2018 యాసంగి సీజన్కు ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించింది. 2019లో తిరిగి రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎకరానికి రూ. 5వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయాన్ని పెంచి రూ.10 వేలు అందించింది. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఏడాదికి రూ.12వేలకు పెంచి అన్నదాతకు భరోసా కల్పించింది. మండలాల వారీగా ఖాతాల్లో జమ అయిన నిధులుమండలం రైతులు నిధులు ఏటూరునాగారం 5,344 4,11,42,084 గోవిందరావుపేట 5,146 4,48,05,368 కన్నాయిగూడెం 3,794 2,72,73,687 మంగపేట 6,809 6,27,57,450 ఎస్ఎస్తాడ్వాయి 4,946 4,22,88,890 వెంకటాపురం(కె) 6,176 4,66,01,333 వాజేడు 6,710 4,80,29,756 ములుగు 14,098 10,53,70,686 వెంకటాపురం(ఎం) 8,643 6,64,50,876రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ అవుతున్న డబ్బులు జిల్లాలో 61,666 మందికి రూ.48.47 కోట్ల సాయం ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ములుగు రూరల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు సిబ్బందికి సూచించారు. ఈ మేరకు మంగళవారం కీటక జనిత వ్యాధుల నియంత్రణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది మలేరియా, డెంగీ వ్యాధులు ఎక్కువగా నమోదైన గ్రామాలలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. సర్వే, యాంటీ లార్వా స్ప్రే, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, నీటి నిల్వలపై మూతలు పెట్టడం, నీటి గుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం లాంటి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి గ్రామాల్లో ఆంటీ లార్వా స్ప్రే చేయించాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా పరీక్షలు నిర్వహించేందుకు మైక్రోస్కోప్ పనితీరును పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, శ్రీకాంత్, డెమో సంపత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: నిరుద్యోగ యువత రేపు(19న) జిల్లాకేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో నిర్వహిస్తున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ పొందిన టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ పొందిన టెన్త్, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ములుగు, వరంగల్, హైదరాబాద్లోని సాబిక్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, టాటా స్ట్రీవ్, జస్ట్డియల్, జహ్నావి కమ్యూనికేషన్, హెచ్బీడీ ఫైనాన్స్, షణ్ముక బయో ఆర్గానిక్స్, ముథూట్ మైక్రోఫిన్ లిమిటెడ్, శ్రీరాం ఫైనాన్స్తో పాటు ఇతర కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు టాస్క్ రీజినల్ కో ఆర్డీనేటర్ సెల్ నంబర్ 9618449360లో సంప్రదించాలని తెలిపారు. సమ్మె నోటీస్ అందజేత ములుగు రూరల్: జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అంగన్వాడీలతో కలిసి జిల్లా కార్యాలయ అధికారి రాజ్కుమార్, జిల్లా ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ తుల రవికి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో తీసుకు వచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవని తెలిపారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఐసీడీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ స్కీములను ప్రభుత్వ శాఖలుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, భవాని, సునీత, సుమంజలి తదితరులు పాల్గొన్నారు. పోల్టాక్స్ రద్దుచేయాలని వినతి భూపాలపల్లి అర్బన్: కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం విధిస్తున్న పోల్ టాక్స్ను రద్దుచేయాలని కోరుతూ కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేశాల రమేష్బాబు మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పనిచేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించి టాక్స్ రద్దుచేయాలని కోరారు. మైనర్లతో వాహనాలు నడిపిస్తే చర్యలు కాటారం: మైనర్లకు వాహనాలు ఇచ్చి పనులు చేయిస్తే సదరు వాహన యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. కాటారం మండలం మేడిపల్లి పరిధిలోని బస్వాపూర్కు చెందిన బాలుడు మంగళవారం ట్రాక్టర్తో పని చేస్తుండగా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ యజమాని వెన్నపురెడ్డి సమ్మయ్య, ట్రాక్టర్పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి డ్రైవింగ్ చేయించడం, పనులు చేయించడం నేరమన్నారు. అలాంటి వారిని ఉపేక్షించబోమని పేర్కొన్నారు. మైనర్లతో పనులు చేయిస్తే బాలకార్మిక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని డీఎస్పీ హెచ్చరించారు. వాహనాల యజమానులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. లక్ష్మారెడ్డి పల్లెలో వింత పాము గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లెలో మంగళవారం సాయంత్రం వింత విషపాము దర్శనమిచ్చింది. లక్ష్మారెడ్డిపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో రోడ్డుపై రెండు తలలతో ఎరుపు రంగుతో నల్లని కట్లతో గ్రామస్తులకు పాము కనిపించింది. కొందరు రక్త పింజర అని.. కాటు వేస్తే చాలా ప్రమాదమని అంటుండగా, మరికొందరు మాత్రం ఇది ఇప్పటివరకు చూడని పాము అని చర్చించుకుంటున్నారు. -
వినతులు 88
ప్రజావాణిలో 63, గిరిజన దర్బార్లో 25 ఫిర్యాదులుములుగురూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 88దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ దివా కర, ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో 63 ఫిర్యాదులు రాగా కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి స్వీకరించారు. అదే విధంగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 25 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు. మొత్తంగా 88 వినతులను పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజన దర్బార్కు వచ్చిన వినతులు.. ఏటూరునాగారం మండలం లంబాడీతండా నుంచి ఈఎస్ఎస్ పథకం ద్వారా రుణం మంజూరు చేయాలని విన్నవించారు. ఎస్ఎస్తాడ్వాయి మండలం కౌశెట్టివాయి నుంచి పోడు భూమిలో వ్యవసాయం చేస్తుంటే అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాగారం గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలో మార్పులు చేయాలని విన్నవించారు. నెల్లికుదురు మండలం పంతులు తండా, శ్రీరామగిరి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. వరంగల్ గిరిజన గురుకుల కాలేజ్ ఆఫ్ ఎక్సెలెన్స్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పించాలని నిరుద్యోగ యువకుడు విన్నవించారు. మంగపేట మండలం నర్సింహసాగర్ వీఎస్ఎస్ అటవీశాఖ ద్వారా కార్పొరేషన్ సంస్థలో వేసిన జామాయిల్ తోటలోని కర్రను విక్రయించేందుకు పెసా గ్రామసభ ద్వారా తీర్మాణం చేసిన తర్వాతనే విక్రయాలు జరపాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం చెల్పాక ఏయూపీఎస్లో సోషల్ సీఆర్టీగా ఇప్పించాలని నిరుద్యోగ గిరిజనుడు కోరారు. ఇలా పలువురు తమ తమ సమస్యలపై పీఓకు వినతులు వెల్లడించారు.ప్రజావాణి దరఖాస్తుల వివరాలుఇందిరమ్మ ఇళ్లు మంజూరు 30 భూ సమస్యలు 17 ఉపాధి కల్పనకు 06 ఇతర సమస్యలు 10ఇందిరమ్మ ఇళ్లు కావాలి.. గడ్డిగుడిసెలో జీవిస్తున్నాం. సరైన ఇళ్లు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు పడితే ఇంటిలో ఒక్క చోట నీరు పడని ప్రాంతం లేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నాయకులను కోరినా పట్టించుకోవడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – కోరం రామక్క, సమ్మక్క, చుంచుపల్లి, మంగపేట స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సమస్యలు ఆలకించి.. సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు -
వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం
ములుగు రూరల్: వ్యాయామం చేస్తే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని తోపుకుంట వద్ద రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మంత్రి ప్రారంభించి జిమ్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రసుత్త సమాజంలో అన్నిటికంటే ఎంతో విలువైనది ఆరోగ్యమన్నారు. జిల్లాలో నిరుపేదలకు 6వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయాల కోసం ప్రజలను తప్పుతోవ పట్టిస్తూ పబ్బం గడుపుతున్నారని వివరించారు. పదేళ్లు అధికారంలో ఉండి నియోజకవర్గంలోని వెయ్యి ఇళ్లు ఇచ్చి సంగం కూడా పూర్తి చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికి అందిస్తామని వివరించారు. ప్రజలు అపోహలకు పోకూడదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని వివరించారు. ఇచ్చిన హామీ మేర కు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, బోనస్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తుందని సీతక్క వివరించా రు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్.దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల కుటుంబాలకు భరోసా అని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు రూ. 15.22లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కార్పోరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన పేదలకు సీఎం సహాయనిధి కింద 70శాతం డబ్బులు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు
గోవిందరావుపేట: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. మండల పరిధిలోని పస్రాలో పార్టీ మండల అధ్యక్షుడు మార్క సతీష్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన నిరుపేదలకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముడుపులు అప్పజెప్పిన వారికి ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇస్తున్న ఇళ్లను అర్హులందరికీ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తామే పూర్తిగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్వరూపనాయక్, రవీందర్ రెడ్డి, కృష్ణాకర్, వెంకట్, వెంకన్న, సత్యనారాయణ, సాంబశివరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇళ్లు వెంకటాపురం(ఎం): ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకం కింద సగం నిధులు మంజూరు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం పేర్కొన్నారు. మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు పైడాకుల మల్లేష్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి తీసుకవెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించి పల్లెపల్లెన కమలం జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూక్య జవహర్లాల్, దండిగ వెంకన్న, కారుపోతుల యాదగిరి, అల్లె శోభన్, వైద్గుల తిరుపతిరెడ్డి, చర్లపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం -
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు
ఎస్ఎస్తాడ్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తండాల శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని నార్లాపూర్లో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో పార్టీ నాయకులు, లబ్ధిదారులు కలిసి మంత్రి సీతక్క చిత్రపట్టానికి సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది రాజకీయ లబ్ధికోసమే ఇళ్ల విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎన్ని గ్రామాల్లో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారో ప్రజలకే తెలుసని వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఇప్ప నాగేశ్వర్రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు మొక్క శ్రీనివాస్, మండల యూత్ నాయకులు ఎనగంటి నరేష్, సంకే శ్రావణ్, బోప్ప వినోద్, సాయి కృష్ణ, రాపోలు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేరుగా ఇసుక వ్యాపారం చేసుకోవాలి
ఏటూరునాగారం: జిల్లాలోని ఇసుక రీచ్లకు గిరిజన సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తూ 30 మంది సభ్యుల భాగస్వామ్యంతో గిరిజన సంఘాలు నేరుగా ఇసుక వ్యాపారం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ, టీజీఎండీసీ సంయుక్తంగా గిరిజన మహిళా సంఘాల సభ్యులకు ఇసుక రీచ్లపై సోమవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఇసుక వ్యాపారంలో థర్డ్పార్టీ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ఇసుక కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు సంఘాల సభ్యులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎనిమిది సంఘాలకు వ్యాపారాన్ని ఎలా నిర్వహించుకోవాలో వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన సంఘాలకు ఇసుక వ్యాపారం ఎలా చేయాలని టీజీఎండీసీ సిబ్బందితో శిక్షణ, అవగాహన పూర్తిగా ఇప్పించినట్లు వెల్లడించారు. ఇసుక రీచ్లను స్వతంత్రంగా స్థిరంగా నిర్వహించడానికి గిరిజన సంఘాలకు అధికారం ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇందుకోసం కావాల్సిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్, కిశోర్ కుమార్, టీజీఎండీసీ సిబ్బంది, ఇసుక సొసైటీల సభ్యులు పాల్గొన్నారు. అటవీ భూములపై గిరిజనులతో పీఓ చర్చ మండలంలోని రొయ్యూర్ అటవీశాఖ పరిధిలో ఉన్న భూముల్లో గిరిజనులు గుడిసెలు వేడయంతో గోడవకు దారి తీసిన విషయంపై సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ఆర్ఓఎఫ్ఆర్ విభాగం డిప్యూటీ తహసీల్దార్లు గిరిజనులతో చర్చించారు. రెవెన్యూ భూములు, అటవీశాఖ భూములు పరిస్థితి, హక్కుల విధానాన్ని డీటీలు అనిల్, కిశోర్కుమార్ గిరిజనులు వివరించారు. అనంతరం ఐటీడీఏ పీఓ సమావేశానికి హాజరై అటవీభూముల్లో ఇళ్ల సమస్య, అందుబాటులో ఉన్న పట్టా భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను మంత్రి సీతక్క, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఐటీడీఏ డీడీ పోచం, గిరిజన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
రైతులకు పెట్టుబడి సాయం
ములుగు రూరల్: వానకాలం పంట పెట్టుబడికి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మల్లంపల్లి మండల పరిధిలోని రైతు వేదికలో కలెక్టర్ దివాకర, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్, రైతులు పాల్గొన్నారు. రైతులకు వర్షాకాలంలో పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులకు అందుబాటులో మాట్లాడుతాం. నకిలీ విత్తనాల అమ్మకాలు, రవాణా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోగ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, శ్రీధర్, వినయ్, వ్యవసాయ విస్తర్న అధికారులు జ్యోతిరాణి, కావ్య, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, రైతులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్రెడ్డి -
ఇళ్ల జాబితా నుంచి పేరు తొలగించారు
నిరుపేద కుటుంబానికి చెందిన మాకు నివసించేందుకు ఇళ్లుకూడా లేదు టార్పాలిన్ వేసుకొని ఉంటున్నాం.. ఇందిరమ్మ ఇళ్లుకు దరఖాస్తు చేసుకోగా అధికారులు పరిశీలించి ఇందిరమ్మ ఇంటికి ఎంపిక చేశారు. మాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎలాంటి స్థిర ఆస్తులు లేవు. నేను ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నానని ఇందిరమ్మ ఇళ్లును లిస్టు నుంచి తొలగించారు. అధికారులు పునః పరిశీలన చేసి ఇందిరమ్మ ఇంటిని మంజూరి చేయాలని సాక్షితో కన్నీటి పర్యతమయ్యారు. – గండెపల్లి రాజమణి, చల్వాయి, గోవిందరావుపేట -
డయేరియా మరణాలను అరికట్టాలి
ములుగు రూరల్: డయేరియా మరణాలను అరికట్టాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం స్టాప్ డయేరియా క్యాంపియన్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుందని గ్రామాలలో క్లోరినేషన్ చేసి నీటిని అందించాలన్నారు. డయేరియా నివారణకు గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ, స్తీ–శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, విద్యాశాఖ, రూరల్ డెవలప్మెంట్, మిషన్ భగీరథ శాఖలు సమన్వయంగా పని చేయాలన్నారు. గ్రామాలలో 0–5 సంవత్సరాల పిల్లలు ఉన్న ఇళ్లకు ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లు అందించాలని తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండాలన్నారు. అనంతరం జిల్లా శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్రావు, అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
రంగాపూర్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని రంగాపూర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం హెచ్ఎం ఈసం కృష్ణయ్య పాఠశాలను పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని గిరిజన విద్యార్థులకు ఇంగ్లిష్ విద్యాబోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రవేశపెట్టిందన్నారు. తల్లిదండ్రులు పిల్ల లను ప్రైవేటు పాఠశాలలకు పంపించవద్దని సూచించారు. బడిబాట కార్యక్రమంలో 21 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలో చేర్పించి రంగాపూర్ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాప సమ్మయ్య, కొక్కెర రమేష్, మైపతి సంతోష్కుమార్ పాల్గొన్నారు. రామప్పలో బెల్జియం దేశస్తులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం బెల్జియంకు చెందిన జాస్ బైకేన్, అన్నిసుస్కోపిలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకుని ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వారికి వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని కొనియాడారు. నిబంధనల మేరకు స్టోన్ క్రషర్లు నడిపించాలి ములుగు రూరల్: ప్రభుత్వ నిబంధనల మేరకు స్టోన్ క్రషర్లు నడిపించాలని డీఎస్పీ రవీందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్గౌస్పల్లిలో ఉన్న సహాయాద్రి, వాసుదేవ స్టోన్ క్రషర్లను తనిఖీ చేశారు. క్రషర్ అనుమతి పత్రాలు, పేలుడు పదార్ధాలను పరిశీలించారు. పేలుడు పదార్ధాలను నిల్వ చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దుచేయాలని ప్రోగ్రెస్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (పీఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు పసుల వినయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ధనార్జనే ధ్యేయంగా భావిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బు దోచుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాలలోనే పుస్తకాలు, బట్టలు అమ్ముతూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తమకు ఇష్టం వచ్చిన ఫీజులు పెట్టుకొని వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. 18, 19 తేదీల్లో ఎంపిక పోటీలు భూపాలపల్లి అర్బన్: స్పోర్ట్స్ పాఠశాలల ఎంపికకు ఈ నెల 18, 19వ తేదీల్లో మండల స్థాయి ఎంపిక క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు మండల ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి దేవానాయక్ తెలిపారు. సోమవారం మండలంలో పీఈటీలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలా బాద్ స్పోర్ట్స్ స్కూల్ పాఠశాలలకు మండలస్థాయిలో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలి పారు. 4వ తరగతి కోసం 8నుంచి 9ఏళ్లలోపు బాలబాలికలు హాజరుకావాలని సూచించారు. పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పీఈటీలు పాల్గొన్నారు. -
స్థలాల దుర్వినియోగం సరికాదు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి స్థలాలను ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తూ యాజమాన్యం దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. కేటీకే 8వ గనిలో ప్రధాన రహదారి పక్కన సింగరేణి యాజమాన్యం 15 ఏళ్లకు పైగా పెంచినటువంటి వందలాది చెట్లను తొలగించి ప్రభుత్వ సబ్స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు ఆరోపించారు. సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించడమే కాకుండా చెట్ల తొలగింపు, భూమి చదును చేసేందుకు సివిల్, ఎస్టేట్, ఫారెస్ట్ అధికారులను కేటాయించి కంపెనీ యంత్రాలను సైతం కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వ అవసరాల కోసం సింగరేణి నిధులను దుర్వినియోగం సరికాదన్నారు. -
రైతులకు పంటనష్ట పరిహారం చెల్లించాలి
గోవిందరావుపేట: వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఏప్రిల్, మే నెలలో కురిసిన భారీ వడగండ్ల వర్షాలకు మండల పరిధిలోని పంటపొలాలు 60శాతం వరకు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 2,993 ఎకరాలకు రూ.5.72లక్షలను మంజూరు చేసినా రైతుల అకౌంట్లలో జమ కాలేదని తెలిపారు. రైతుల అకౌంట్లలో వెంటనే మంజూరైన డబ్బులను జమ చేయాలన్నారు. యాసంగిలో పండించిన ధాన్యానికి బోనస్ డబ్బులు పడలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, ఆదిరెడ్డి, మల్లారెడ్డి, మురళి, లెనిన్, సమ్మయ్య, పుల్లారెడ్డి, శ్రీనివాస్తో పాటు మరో 50 మంది రైతులు పాల్గొన్నారు.తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి -
ప్రారంభ దశలోనే కరకట్ట నిర్మాణ పనులు
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuమంగపేట: వర్షాకాలం ప్రారంభం కావడంతో ఏజెన్సీలోని గోదావరి పరీవాహక ప్రాంతమైన మండల పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. 2022 జూలైలో గోదావరి జల ప్రళయం సృష్టించిన బీభత్సాన్ని తలుచుకుని మండలంలోని గోదావరి ఒడ్డువెంట ఉన్న కమలాపురం, మండల కేంద్రంలోని పొదుమూరు, సినిమాహాల్ వీధి, వాడగూడెం, కత్తిగూడెం, దేవనగరం, అకినేపల్లి మల్లారం తదితర లోతట్టు ప్రాంతాల్లోని గోదావరి వరద ముప్పు ప్రాంతాల ప్రజలు వణికి పోతున్నారు. ఈ సారైనా కరకట్ట పనులు పూరై వరద ముప్పు తప్పేనా అని చర్చించుకుంటున్నారు. 2008లో నాబార్డు నిధులు మంజూరు మండల పరిధిలోని కమలాపురం నుంచి మంగపేట వరకు గోదావరి ఒడ్డు వెంట 5.5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్యాకేజీ వర్క్ కింద రూ.5,77,40,450 నాబార్డు నిధులను మంజూరు చేశారు. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న గుత్తేదారు దొంగల ఒర్రె వద్ద నుంచి పొదుమూరు పుష్కరఘాట్ వరకు కరకట్ట నిర్మించకుండా వదిలేయడంతో ప్రతిఏటా వర్షాకాలంలో గోదావరి ఒడ్డు వరద కోతకు గురై ఒడ్డు వెంట ఉన్న కోట్లాది రూపాయల విలువైన నల్లరేగడి భూములు ప్రతిఏటా గోదావరిలో కలిసిపోతున్న విషయం తెలిసిందే. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరకట్ట నిర్మాణానికి గోదావరి తీరం వెంట సందర్శనలు, హామీలు, అంచనాలు, నిధుల మంజూరు, భూ సర్వేలతోనే సరిపెట్టింది. స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో ఎట్టకేలకు 2022లో మండల కేంద్రంలోని దొంగలఒర్రె వద్ద నుంచి పుష్కరఘాట్ వరకు 2.5 కిలో మీటర్ల కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం రూ.54 కోట్లు్, భూసేకరణకు రూ.1.50 కోట్లు నిధులను మంజూరు చేసింది. గోదావరి ఒడ్డు నుంచి సుమారు 34 మీటర్ల వెడల్పు, రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు 25 ఎకరాల భూసేకరణకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో 2022 జూలైలో వచ్చిన వరదలను అరికట్టే విధంగా కరకట్ట నిర్మాణానికి రీడిజైనింగ్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులు నిలిచిపోయాయి. 2022లో ఉప్పొంగి ప్రవహించిన గోదావరి కరకట్ట నిర్మాణం చేపట్టకపోడంతో 2022 జూలైలో భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. గోదావరి వరద నీటికి వాగులు వంకలు వరద పోటెత్తడంతో మండల పరిధిలోని కమలాపురం(పాతూరు), పొదుమూరు, ముస్లింవాడ, సినిమాహాల్వీధి, చుంచుపల్లి, వాడగూడెం, కత్తిగూడెం, దేవనగరం, అకినేపల్లిమల్లారంలో తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. పలు గ్రామాల్లో మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తులో వరదనీరు వచ్చి చేరడంతో స్థానికులు సామగ్రిని సద్దుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కొద్ది రోజులు పాటు తలదాచుకున్నారు. ఈ క్రమంలో ఇళ్లలోని విలువైన వస్తువులు పాడైపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఈసారి కూడా వరద ముప్పు తప్పదేమో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లాంచింగ్ యాప్రాన్ విత్ క్రేడ్స్ టెక్నాలజీతో పనులుసీడీఓ హైదరాబాద్ వారి నుంచి కరకట్ట నిర్మాణం పనుల డ్రాయింగ్ ఇటీవల రావడంతో పనులను ప్రారంభించాం. ప్రస్తుతం దొంగల ఒర్రె ప్రాంతం నుంచి లాంచింగ్ ఆప్రాన్ విత్ క్రేడ్స్ టెక్నాలజీతో పనులను ప్రారంభించాం. 34 మీటర్ల వెడల్పు, 1.2 మీటర్ల తిక్నెస్తో లాంచింగ్ ఆప్రాన్, ఒడ్డు వెంట 50 మీటర్ల స్లోబ్తో 0.9 మీటర్ల తిక్నెస్తో 2.5 కిలో మీటర్ల వరకు కరకట్ట నిర్మాణం పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ప్రారంభ దశలోనే పనులు ఉన్నాయి. – వలీమ్ మహ్మద్, ఇరిగేషన్ ఏఈ మంగపేటన్యూస్రీల్ రెండేళ్లుగా ముందుకు సాగని వైనం వర్షాకాలం ప్రారంభంతో ముప్పుప్రాంత ప్రజల్లో ఆందోళనరెండేళ్లుగా ప్రారంభ దశలోనే..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో కరకట్ట నిర్మాణ పనుల టెండరు దక్కించుకుని ప్రభుత్వంతో అగ్రిమెంటు కుదుర్చుకున్న హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం 2024 ఏప్రిల్లో సాయల్ టెస్టింగ్ పనులను ప్రారంభించింది. జూన్ వరకు ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణానికి స్లోబ్ లెవలింగ్ పనులను కొనసాగించారు. అనంతరం వర్షాలు, కరకట్ట నిర్మాణ డ్రాయింగ్ రాకపోవడం కారణంగా పనులు నిలిచిపోయాయి. నెల రోజుల క్రితం నుంచి తిరిగి కరకట్ట నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం సమీపించడంతో గోదావరిలో వరద నీరు వచ్చి చేరే ప్రమాదం ఉండడంతో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. -
పార్టీలకు స్థానిక జోష్!
మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడిసాక్షి ప్రతినిధి, వరంగల్: పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు! మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతోంది. 2019 ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల, అధికార యంత్రాంగం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఓటర్ల లిస్టును సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్ రూరల్ (వరంగల్) జనరల్, జనగామ అన్ రిజర్వుడ్ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్ రిజర్వుడ్ పురుషుడు/మహిళ, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించబోయే ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబఽంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు సమయం ఉంది.. వాస్తవానికి గతంలో సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది.2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు జిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు స్థానాలు స్థానాలు వరంగల్ అర్బన్ 07 07 86 వరంగల్ రూరల్ 16 16 178 జేఎస్.భూపాలపల్లి 11 11 106 ములుగు 09 09 72 మహబూబాబాద్ 16 16 198 జనగామ 12 12 140 మొత్తం 71 71 780 వారంలో నోటిఫికేషన్ ఉంటుందన్న సంకేతాలు నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీలో మళ్లీ మొదలైన ఆశావహుల ప్రయత్నాలు ‘స్థానిక’ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తం -
చెరువు ఆయకట్టు రైతుల నిరసన
మంగపేట: మండల పరిధిలోని బోరునర్సాపురం, చెరుపల్లి రెవెన్యూ పరిధిలోని ఉప్పల నర్సయ్య చెరువు శిఖం భూములను కొంతమంది కబ్జాచేసి బోరు బావులను నిర్మించి అక్రమంగా సాగు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయకట్టు రైతులు ఆదివారం చెరువుకట్టపై అరగంట పాటు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయకట్టు రైతులు మాట్లాడారు. చెరువు శిఖం భూములను కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసి సాగు చేస్తున్నారని తెలిపారు. మరికొందరు ఏకంగా మత్తడిని సైతం కబ్జా చేసి అందులో బోరుబావిని నిర్మించి సాగు భూమిగా మార్చుకున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా వర్షాకాలంలో చెరువులోకి నీరు వచ్చి చేరడంతో అక్రమంగా కబ్జా చేసి శిఖం భూముల్లో సాగు సాగు చేసిన పంట నీట మునగడంతో కబ్జాదారులు చెరువు షటర్లను ధ్వంసం చేసి చెరువులోని నీటిని బయటకు వెళ్లగొట్టడంతో ప్రతిఏటా ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ప్రతిసారి ఓ అధికారి వచ్చి చూడటం సర్వేయర్ లేరని రెవెన్యూ అధికారులతో కలిసి ఉమ్మడిగా సర్వే చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతూ దాటవేత దోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఏటూరునాగారం – బూర్గంపాడు ప్రధాన రోడ్డు వెంట వందల ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉప్పలనర్సయ్య చెరువుతో పాటు పక్కనే ఉన్న కోతుల కుంట చెరువు ఆనవాళ్లు లేకుండా కబ్జాకు గురైందని, మామిడికుంట చెరువు సైతం పూర్తిగా కబ్జాకు గురైందన్నారు. దీంతో పాటు మండలంలోని దాదాపు అన్ని చెరువుల పరిస్థితి ఇదే విధంగా తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి చెరువుల్లోని శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేసి, ఆయకట్టు భూములకు సాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ -
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో అక్రమాలు
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఎస్ఎస్తాడ్వాయి: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మాజీ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని నార్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఽగ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పూర్తిగా అనర్హులకే కేటాయించారని ధ్వజమెత్తారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయకుండా పార్టీ కార్యకర్తలకు, డబ్బులిచ్చిన వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని తెలిపారు. అనర్హులను ఎంపిక చేసిన జాబితాలపై అధికారులు ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో రైతు భరోసా చెల్లించడంతో పాటు సన్న ధాన్యానికి ఇచ్చే రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సకాలంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించకుండా ఎన్నికల స్టంట్గా విడుదల చేసి ప్రజలను మభ్యపెడితే ఊరుకునేది లేదన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలన్నారు. లేని పక్షంలో అర్హులైన లబ్ధిదారుల పక్షాన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద్నాయక్, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు సోమ నాగమ్మ, మాజీ ఎంపీటీసీ కుక్కల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గొంది ఽశ్రీధర్, మేడారం జాతర మాజీ చైర్మన్ కాక లింగయ్య, నాయకులు రతన్సింగ్, మొక్క భాస్కర్, తాడూరి శుభాష్రెడ్డి, పత్తి గోపాల్రెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు. -
అరకొరగా మెస్చార్జీలు పెంచడం సరికాదు
ఏటూరునాగారం: మధ్యాహ్న భోజన కార్మికులకు వంటలు వండేందుకు ప్రభుత్వం అరకొరగా మెస్చార్జీలను పెంచడం సరికాదని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంట కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలలుగా వంట, కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు రావడం లేదన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ప్రారంభమైన అల్పాహారం బిల్లులు, వేతనాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం కావడంతో పెండింగ్లో ఉన్న బిల్లులతో కిరాణం, కూరగాయల వద్ద బిల్లులు చెల్లించకపోవడంతో అప్పు పుట్టడం లేదన్నారు. మెనూ ప్రకారం వంటలు చేయాలని కొందరు అధికారులు ఒత్తిడి చేయడం చూస్తుంటే, పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా ఉందన్నారు. కోడిగుడ్లు పూర్తిగా ప్రభుత్వమే సరఫరా చేస్తేనే విద్యార్థులకు అందించడం సాధ్యం అవుతుందన్నారు. అలాగే వంటగ్యాస్ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే మెనూ చార్జీలు అరకొరగా పెంచి పెద్ద మొత్తంలో నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. ఈ సమావేశంలో పోరెడ్డి ప్రమీల, రమ, చిటమట లక్ష్మీ, మట్టి లక్ష్మీ, ఇర్సవడ్ల నర్సమ్మ, మామిడి పార్వతి, కల్పన, మల్లమ్మ, కుప్ప చిన్నమ్మ, బొల్లె సత్తెమ్మ, రామక్క, గుంటి సరోజన, కుమ్మరి కొమురక్క పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన ఛతీ్త్సగఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణ కట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. సుమారుగా 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అదే విధంగా మంత్రి సీతక్క దృష్టిసారించి భక్తుల కావాల్సిన సౌకర్యాలను దేవాదాయశాఖ అధికారులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పూజారులు కోరుతున్నారు. -
తండ్రి తాపీ మేసీ్త్ర.. కుమార్తె డాక్టర్
కాజీపేట రూరల్: ఆయన చదువుకోలేదు. తనలా పిల్లలు కావొద్దని బాగా చదివించాడు. సమాజంలో గొప్ప స్థాయిలో కూతుళ్లను చూస్తూ మురిసిపోతున్నాడు కాజీపేట బాపూజీనగర్కు చెందిన తాపీ మేసీ్త్ర లింగాల వీరస్వామి. వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు. 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. పెద్ద కూతురు హేమలతను వైద్య విద్య చదివించాడు. ఆమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రైమరీ వెటర్నరీ సెంటర్ పెగడపల్లిలో అసిస్టెంట్ సర్జన్గా పని చేస్తున్నారు. చిన్న కూతురు సు మలత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నాన్న జీవితమే తమకు ప్రేరణనిచ్చిందని.. సుమలత, హేమలత చెబుతున్నారు. -
నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..
వరంగల్ క్రైం: చిన్నప్పటి నుంచి మా నాన్న జన్నేల్సింగ్ నాలో నింపిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. నాన్న ప్రిన్సిపాల్ కావడంతో చదువులో ప్రోత్సాహం అందించారు. సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఆయన మోటివేషన్ నాలో రెట్టింపు ఉత్సాహం నింపింది. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలో అవగాహన కల్పించేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా తీర్చిదిద్దారు. సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొంటున్న ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించారు. ప్రతీ దశలో వెన్నంటి ప్రోత్సహించారు. – సన్ప్రీత్సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
బియ్యం దందా?
ఏటూరునాగారం: రేషన్ బియ్యం కోసం ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం ఒకేసారి లబ్ధిదారులకు జూన్లోనే పంపిణీ చేస్తున్నాయి. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో బియ్యం ఆయా కుటుంబాలకు వస్తుండడంతో లబ్ధిదారులపై దళారుల చూపు పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బియ్యాన్ని విక్రయించాలని దళారులు దందాకు తెరలేపుతూ లబ్ధిదారుల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ఒకేసారి మూడు నెలల బియ్యం నిల్వ చేసుకునేందుకు లబ్ధిదారులు ఇళ్లకు తరలించే క్రమంలో మధ్యలోనే దళారులు తక్కువ ధరలకు బేరాలు చేసుకొని అక్రమమార్గంలో రేషన్ బియ్యాన్ని రాష్ట్రం దాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సభ్యుడికి 6 కిలోల బియ్యం కేంద్రం ప్రభుత్వం ఆహార భద్రత కింద ఒక సభ్యుడికి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో చొప్పున ఉచితంగా రేషన్కార్డు లబ్ధిదారులకు అందజేస్తోంది. రేషన్పాపుల ద్వారా ఒక్కో లబ్ధిదారుడి వేలి ముద్రలను డీలర్లు తీసుకుని సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. బియ్యం పంపిణీ చేసే క్రమంలో ఒక్కో లబ్ధిదారుడు మూడు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి ఇస్తుండడంతో రేషన్కార్డుదారులందరూ బియ్యం తీసుకుంటున్నారు. దళారులపై నిఘా అవసరం అక్రమ మార్గంలో రేషన్ బియ్యం తరలిస్తున్న దళారులపై అధికారులు నిఘా వేసి ఉంచాలని లబ్ధిదారుడుల కోరుతున్నారు. లబ్ధిదారుల వద్ద బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాంటి దళారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి బియ్యం దందాకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. మరో 15రోజులుగా బియ్యం పంపిణీ జిల్లాలో మొత్తం 277 రేషన్ షాపులు ఉన్నాయి. 6,746 మెట్రిక్ టన్నులు సన్నబియ్యం దిగుమతి కాగా 5,468 మెట్రిక్ టన్నులు బియ్యం ఇప్పటి వరకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 1,277 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి ఉంది. 80శాతం బియ్యం పంపిణీ పూర్తి అయ్యింది. మరో 15 రోజుల్లో మొత్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. – రాంపతి, సివిల్ సప్లయీస్ డీఎంజిల్లాలో రేషన్ కార్డులు, బియ్యం పంపిణీ వివరాలు వినియోగదారులపై దళారుల చూపు తక్కువ ధరకు కొనుగోలు ఇప్పటికే 80శాతం బియ్యం పంపిణీ మండలం వచ్చిన కార్డుల పంపిణీ చేసిన బియ్యం సంఖ్య బియ్యం(శాతంలో)ఏటూరునాగారం 9,483 4,823 78.46 గోవిందరావుపేట 10,208 3,992 78.69 కన్నాయిగూడెం 4,261 1,647 66.82 మంగపేట 15,053 5,104 71.86 ములుగు 19,168 7,787 76.29 ఎస్ఎస్తాడ్వాయి 6,917 3,062 71.86 వెంకటాపురం(ఎం) 10,783 4,609 76.37 వెంకటాపురం(కె) 10,357 4,145 73.65 వాజేడు 8,398 2,363 54.40 -
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధం
ములుగు రూరల్: ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురిసిన లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు వచ్చినా, ముంపునకు గురైనప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు సహాయార్ధం బృందాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటే సమీప పోలీస్స్టేషన్కు గాని, 100కు కాల్ చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే అక్కడికి చేరుకుని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సులభంగా ఉంటుందని వివరించారు. డీఆర్డీఓ, అదనపు కలెక్టర్ సంపత్రావుకు అవార్డు ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రక్తం అందజేసిన ములుగు డీఆర్డీఓ, అదనపు కలెక్టర్ సంపత్రావుకు అవార్డును ప్రదానం చేశారు. ఈ మేరకు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రాజ్భవన్లో శనివారం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అత్యధికంగా బ్లడ్ యూనిట్లను అందించినందుకు గాను కేటగిరి–1 విభాగంలో అవార్డుతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ ప్రతినిధులు డాక్టర్ విజయ్చందర్రెడ్డి, ఈవీ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ తప్పనిసరి ములుగు రూరల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై వెంకటేశ్వర్రావు శనివారం ఒక ప్రటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదని వివరించారు. వాహనదారులు వాహనపత్రాలతో పాటు, లైసెన్స్, నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని సూచించారు. లేని పక్షంలో వాహనం సీజ్ చేయడంతో పాటు ఫైన్ విధించడం జరుగుతుందని వెల్లడించారు. విమాన ప్రమాద ఘటన బాధాకరం ములుగు రూరల్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 290 మంది మృతి చెందడం బాధాకరమని జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ పోరిక రవిందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల హాస్టల్ భవనంపై కూలడంతో 50మంది విద్యార్థులు దుర్మరణం చెందడం దారుణమని తెలిపారు. వైద్య విద్యార్థులను కోల్పోవడం దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలిగోవిందరావుపేట: అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని పస్రా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోడెం సమ్మయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. జీపీఎఫ్, సరెండర్, మెడికల్ మొదలగు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న తెలుగు. హిందీ పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చి ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గొప్ప సమ్మారావు, వాసుదేవ రెడ్డి, ములకాల వెంకటస్వామి, కొండ చెంచయ్య, కె.రఘురాం, కె.శివరాం, జి.పురుషోత్తం, పి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నడిచే దైవం.. నాకు తొలినేస్తం
ఖిలా వరంగల్: వరంగల్ 34వ డివిజన్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రసెంటేటివ్గా పని చేస్తూ పిల్లల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్ ఇండియా సివిల్ సర్వీస్లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈస్థానంలో నిలబెట్టింది. -
భూమి అమ్మి చదివించారు..
నల్లబెల్లి: చదువు ఒక్కటే తరగని ఆస్తి అని బలంగా నమ్మారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల రవీందర్. కూలీ చేసి కొనుక్కున్న 4 ఎకరాల భూమిని కుమారుడు ప్రశాంత్ చదువు కోసం అమ్మేశారు. తండ్రి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రశాంత్ ఇష్టంగా చదివారు. ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో పని చేస్తున్నారు. ‘నాకోసం భూమి అమ్మి కుటుంబ పోషణ కోసం నాన్న 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. నాన్న ప్రోత్సాహమే నన్ను వైద్యుడిని చేసింది. నా విజయం నాన్నకు అంకితం’ అంటున్నారు ప్రశాంత్. -
హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం శనివారం భక్తుల సందడితో కోలాహలంగా మారింది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, ప్రైవేటు బస్సులు తదితర ప్రైవేట్ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం హేమాచలకొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు స్వామివారికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు. బక్తులు స్వామివారికి సమర్పించిన నూతన పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూల దండలను అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని మానవ శరీరంతో పోలిఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. అనంతరం అర్చకులు ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు స్వామివారి నిజరూప దర్శనంతో పులకించిన భక్తజనం -
రేషన్షాపుల వద్ద పడిగాపులు
ములుగు రూరల్: రేషన్ షాపుల వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండి.అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మండల పరిధిలోని కాశిందేవిపేటలోని రేషన్ షాపును సందర్శించి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో బియ్యం సరఫరాకు ఇబ్బందులు ఎదురుకాకుండా రేషన్కార్డుదారులకు ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి అందిస్తుందని తెలిపారు. దీంతో రేషన్కార్డుదారులు మూడు నెలల బియ్యానికి మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో ఆలస్యం అవుతుందన్నారు. లబ్ధిదారుడు ఒకసారి వేలిముద్ర వేస్తే మూడు నెలల బియ్యం ఇచ్చేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, రమేష్, కొమురయ్య, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025జఫర్గఢ్: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు ఇన్నయ్యను నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.న్యూస్రీల్ -
రాజీమార్గమే రాజమార్గం
ములుగు రూరల్: కక్షిదారులు తమ కోర్టు కేసులను రాజీ మార్గలో పరిష్కరించుకోవడం రాజమార్గమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీపీ సూర్యచంద్రకళ అన్నారు. ఈ మేరకు శనివారం జాతీయ లోక్అదాలత్ను జిల్లాకోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్లో మూడు బెంచీలను ఏర్పాటు చేసి 875 కేసులను పరిష్కరించామని తెలిపారు. ఎంవీఓపీ కేసులు 01, కాంపిన్సేషన్ రూ.15 లక్షలు, కాంఫౌండబుల్ క్రిమినల్ కేసులు 228, సివిల్ కేసులు 02, సమ్మరీ ట్రయల్ కేసులు 639, రికవరీ అమౌంట్ రూ.6,95,800, ఫ్రీ లిటిగేషన్ బ్యాంకు కేసులు 21, బ్యాంక్ రికవరీ రూ.18,32,015 చెల్లించి కేసులు రాజీ కుదుర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జోత్స్న, డీఎస్పీ రవీందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలచారి, జనరల్ సెక్రటరీ భిక్షపతి, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీపీ.సూర్యచంద్రకళ -
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్నధాన్యానికి క్వింటాకు బోనస్ రూ.500 ప్రకటించిన విషయం విధితమే. దీంతో యాసంగి సాగులో జిల్లాలో ఎక్కువశాతం రైతులు సన్నరకం ధాన్యం సాగు చేశారు. యాసంగి పంట అమ్మకాలు చేపట్టి నెలరోజులు గడుస్తున్నా.. సన్నధాన్యానికి బోనస్ అందక పోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించగా ప్రభుత్వం చెల్లించాల్సిన మ ద్దతు ధర రూ.2,320 చెల్లించింది. కానీ బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కాలేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి ఖర్చులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. నెల రోజులు దాటినా..అందని డబ్బులు ● జిల్లాలో కొనుగోలు చేసిన సన్నధాన్యం 39,412.180 క్వింటాళ్లు ● రావాల్సిన బకాయి రూ.19.70 కోట్లు ● రైతులకు తప్పని ఎదురుచూపులుత్వరగా చెల్లించాలి.. ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో నాలుగున్నర ఎకరాల్లో సాగు చేశా. సన్నరకం వరి సాగుకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ కాగా దిగుబడి మాత్రం తక్కువగా వచ్చింది. వరి ధాన్యం అమ్మి నెల రోజులు గడుస్తుంది. ప్రభుత్వం బోనస్ డబ్బులను త్వరగా చెల్లించాలి. – ఇమ్మడి భిక్షపతి, రైతు ములుగు బడ్జెట్ కేటాయించలేదు బడ్జెట్ కేటాయించలేదు. రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఎంఎస్పీ డబ్బుల చెల్లింపులు జరిగాయి. జిల్లాలో సన్న ధాన్యం అమ్మకాలు చేపట్టిన రైతుల వివరాలు ఐఎఫ్ఎంఎస్ లాగిన్ నుంచి ప్రభుత్వానికి అందించాం. బడ్జెట్ కేటాయించిన వెంటనే బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. – ఫైజల్ హుస్సేన్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి●రావాల్సిన బకాయిలు రూ.19.70 కోట్లు జిల్లాలోని పది మండలాల్లో యాసంగి సాగులో సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం రూ.19.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 6,182 మంది రైతులు 39,412.180 క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు. న్యూస్రీల్ -
కొనసాగుతున్న రేషన్ పంపిణీ
ములుగు రూరల్: జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల మొదటి వారంలో లబ్ధిదారులకు పంపిణీని ప్రారంభించిన అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ అవకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభు త్వం ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు అందిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేయడాన్ని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీలో 80శాతం మంది లబ్ధిదారులు అమ్మకాలు చేపట్టడంతో ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టేది. కానీ సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు సద్వినియోగం అవుతుంది. జిల్లాలో 94,628 కార్డులు జిల్లాలోని పది మండలాల్లో 94,628 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతీ నెల జిల్లాలో 1,714 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంతో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా మూడు నెలల బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో మూడు నెలలకు గాను 5,157 టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరిసాగు చేస్తున్నారు.మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి అందజేత జిల్లాలో 94,628 కార్డులు తూకాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్ -
మత్స్యకారులకు అండగా ఉంటాం..
ములుగు రూరల్: ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని గిరిజన భవన్లో యుఎల్టీ, నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందించిన తెప్పలు, వలలను కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు అవసరమైన తెప్పలు, వలలు అందించడం అభినందనీయమన్నారు. ములుగు మండలంలోని జీవింతరావుపల్లిని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ క్లోరినేషన్ డౌసింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సాంకేతికతతో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.మంత్రి సీతక్క -
యూనిఫాం అందజేత
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నూతనంగా డిప్యూటేషన్పై వెళ్లిన మహిళా ఎస్అండ్పీసీ సిబ్బందికి శుక్రవారం ఏరియా ఇన్చార్జ్ జీఎం కవీంద్ర యూనిఫాంలు అందజేశారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా విధుల్లో చేరుతున్న మహిళా ఉద్యోగులు ఎస్అండ్పీసీకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. సింగరేణి ఉద్యోగంలో చేరే మహిళలు సంస్థలో అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్ పద్మజ, మారుతి, మురళీమోహన్, మహిళా సెక్యూరిటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం బస్టాండ్లో షీ, మాతాశిశు కేంద్రం
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్లో షీ రూమ్ (సానిటరీ హైజిన్ ఎంపవర్మెంట్), మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే మహిళలు, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షీ, మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాల మేరకు శుక్రవారం కాళేశ్వరంలోని శాశ్వత బస్టాండ్కు మార్చినట్లు కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం వచ్చే మహిళలకు బస్టాండ్లో షీ, మాతా శిశు కేంద్రం రూములు అందుబాటులో ఉంటాయని తెలిపారు. షీ రూమును, బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాన్ని పాలిచ్చే తల్లులు వినియోగించుకోవాలని సూచించారు. -
నెరవేరనున్న నిరుపేదల సొంతింటి కల
ములుగు రూరల్: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని గ్రంథాలయ సంస్థచైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాన్ని బట్టి ప్రతీ సోమవారం బిల్లు చెల్లిస్తున్నామని, లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతనిప్పుల భిక్షపతి, భోడ రఘు, అనిల్, షకిల్, జాఫర్, అభినయ్, రాజన్న, మహేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు ఇచ్చి లాక్కున్నారు.. వాజేడు: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ మంజూరు పత్రాలను ఇచ్చారని, మీరు అర్హులు కారని తిరిగి తీసుకున్నారని మండల అంగన్వాడీ సిబ్బంది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కర్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, మాజీ జెడ్పీటీసీ తల్లడి పుష్పలతలతో కలిసి భద్రాచలంకు వెళ్లారు. తమకు గత నెల 7న మంత్రి పర్యటనలో భాగంగా మంజూరు పత్రాలను ఇవ్వడంతో 5 రోజులు ఆగి తాము కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి పాత ఇంటిని తొలగించినట్లు ఎమ్మెల్యేకు తెలిపారు. ఇంటిని తొలగించిన తర్వాత ఎంపీడీఓ వచ్చి మీరు అంగన్వాడీ ఉద్యోగులు అయినందున ఇందిరమ్మ ఇల్లు రాదని మంజూరు పత్రాలను వెనక్కి ఇవ్వాలని నోటీసులు ఇచ్చినట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ములుగు రూరల్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ముందస్తుగా యోగా దినోత్సవాన్ని గిరిజన భవన్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా తప్పనిసరిగా చేయాలన్నారు. మానవ జీవితంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ చంద్ర, సంధ్య, యోగా ఇన్స్ట్రక్టర్ గురు శివకృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్ దివాకర -
ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
ఎస్ఎస్తాడ్వాయి : జిల్లాలోని అన్ని మండలాల్లో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వే డుకలను ఘనంగా జరుపుకోవాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల ఇన్చార్జ్ గోసంగి దుర్గారావు అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు కరుణాకర్, ఎంఎస్పీ జిల్లా అ ధికార ప్రతినిధి గజ్జల ప్రసాద్ హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎ మ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నూతన కమిటీలను ఎన్నుకోవాలన్నారు. జెండా గద్దెలను నిర్మాణం చేసుకోవాలన్నారు. మన ఉద్యమానికి స హకరించిన గ్రామాల్లోని అన్ని కులపెద్దలను, పార్టీ లకతీతంగా ఆహ్వానించి సన్మానం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రశాంత్, నాయకులు మంతెన సారంగపాణి, వంకాయల సతీష్, మంతెన అన్వేష్, శివశంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలి
వాజేడు : మండలంలోని ధర్మవరం పట్టా ల్యాండ్ ఇసుక క్వారీలో అక్రమ తవ్వకాలను ఆపాలని ఓడబలిజ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్, అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్రావు అన్నారు. శుక్రవారం వారు ఇసుక క్వారీని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చట్టప్రకారం రెండు మీటర్ల మేర ఇసుక తవ్వకాలను చేపట్టాల్సిన కాంట్రాక్టర్ 6 నుంచి ఏడు మీటర్ల వరకు తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపించారు. రానున్న గోదావరి వరదల కారణంగా ఒడ్డును ఆనుకుని ఉన్న పొలాలు, పంటలు మొత్తం కోతకు గురై రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వుతున్నా.. అధికారులు మాత్రం ‘నిమ్మకు నీరెత్తిన’ చందంగా ఉంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొల్లె ఆదినారాయణ, ఓడబలిజ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. ఓడబలిజ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ -
వా.. నర ప్రేమ!
విశ్వాసం గురించి చెప్పాల్సి వస్తే కుక్కనో, మరేయితర జంతువునో ప్రస్తావన తీసుకొస్తాం. ఎందుకంటే.. పట్టెడన్నం పెడితే మూగ జీవాలు చూపించే ప్రేమ అలాంటిది మరి!. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఓ ఘటన.. పలువురిని కంటతడి పెట్టిస్తోంది. వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళ.. తన ఇంటి పక్కనే ఉన్న దుర్గమ్మ గుడి వద్ద రోజూ సేవ చేస్తూ ఉండేది. ఆమె కొడుకు బొల్లె వీర్రాజు తల్లికి సాయంగా ప్రసాదం తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ వానరం వీర్రాజు దృష్టిని ఆకర్షించింది. అలా క్రమం తప్పకుండా ఆ వానరానికి ప్రసాదం పెట్టడంతో వాళ్లు మంచి స్నేహితులయ్యారు. అయితే అంతలోనే.. విధి వక్రీకరించింది. అనారోగ్యంతో వీర్రాజు మొన్నీమధ్యే కన్నుమూశాడు. రోజూ తనకు తిండి పెట్టి అపురూపంగా చూసుకునే వీర్రాజు రాకపోవడంతో.. ఆ వానరమే కదిలి వచ్చింది. ఇంట్లో విగత జీవిగా చాపలో ఉన్న వీర్రాజు చుట్టూ తిరిగింది. పాపం.. అతన్ని శాశ్వత నిద్ర నుంచి లేపేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. అవేవీ జరగకపోవడంతో చివరకు తన స్నేహితుడి చెంత కాసేపు విశ్రమించింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. వీర్రాజు అంతిమ యాత్రలోనూ కాసేపు ఆ వానరం కనిపించింది. గుడి దగ్గరకు రాగానే వీర్రాజు పార్థివదేహం మీద పడి విలపించినంత పని చేసింది. కొద్ది దూరం అంతిమ యాత్రలో జనాలతో కలిసి వచ్చి.. ఆపై వెనక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడున్న వాళ్లను కంటతడి పెట్టించాయి. ఆ వా‘నర’ ప్రేమను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఏటూరునాగారం: రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను మంత్రి సీతక్క గురువారం పంపిణీ చేశారు. ముందుగా ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇవ్వగా, ఇది ఏజెన్సీ ప్రాంతమని సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు వివరిస్తే ఐటీడీఏ ద్వారా మరో 1500ఇళ్లు మంజూరు చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క వెయ్యి ఇళ్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి దరఖాస్తు పత్రాల ను మంత్రి స్వీకరించారు. ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం జంపన్నవాగు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే దానిని మరో చోటుకు తరలించి ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకున్నారు. రూ. 7 కోట్లతో బస్డిపో ఏజెన్సీ ప్రజల కల సాకారం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం బస్ డిపోకు రూ. 7 కోట్లు మంజూరు అయ్యాయని, పనులు వేగంగా నాణ్యతగా చేసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని మంత్రి కాంట్రాక్టర్, ఆర్టీసీ అధికారులను కోరారు. ఏటూరునాగారంలో బస్డిపోకు మంత్రి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని చూడాలని ఆర్ఎం విజయభానును కోరారు. అలాగే గట్టమ్మ వద్ద కోటి రూపాయలతో అదనపు బస్టాండ్, ములుగులో రూ.5కోట్లతో బస్టాండ్ నిర్మాణం పనులు చేపట్టినట్లు వివరించారు. అదే విధంగా ఏటూరునాగారంలో ఒక కోటి రూపాయలతో కూరగాయల మార్కెట్ నిర్మిస్తామన్నారు. అనంతరం గిరిజన భవన్లో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని మంత్రి చేపట్టారు. అలాగే జెడ్పీహెచ్ఎస్లో ఏకరూప దుస్తులను, పుస్తకాలు, నోట్బుక్స్లను మంత్రి సీతక్క విద్యార్థులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా బీఈడీ కాలేజీని మంజూరు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ రేణుక మంత్రి సీతక్కకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కొమురం భీమ్ స్టేడియంలో నిర్వహించనున్న యోగా శిక్షణ కార్యక్రమం కరపత్రాలను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్, డీఎం హరిప్రియ, రవీంద్రనాథ్ సింగ్, సిబ్బంది చల్లా శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షుడు చిటమట రఘు, దేవేందర్, ఎల్లయ్య పాల్గొన్నారు. మహనీయుడు అంబేడ్కర్ ఎస్ఎస్తాడ్వాయి: అన్ని వర్గాల ప్రజలకు సమానత్వ హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అని మంత్రి సీతక్క తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేశారు. అలాగే కొమురంభీం విగ్రహానికి కూడా పూలమాల వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీతక్క మాట్లాడుతూ అంబేడ్కర్ దేశంలోని ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించాడని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తాను ఈ స్థానంలో ఉన్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆశోక్, మండల అధ్యక్షుడు దేవేందర్, మేడారం జాతర కమిటీ మాజీ చైర్మన్ లచ్చుపటేల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కల్యాణి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ తదితరులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
ఏరువాక పౌర్ణమి.. వ్యవసాయ పనులు షురూ
ఏటూరునాగారం: జిల్లాలోని పలు మండలాల్లో ఏరువాక పౌర్ణమితో వ్యవసాయ పనులను రైతులు మొదలు పెట్టారు. రైతులు ఇంటి వద్ద విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసుకొని ఆ తర్వాత పంట పొలాల్లోకి వెళ్లి దుక్కిటెద్దులకు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి వ్యవసాయ పనులను ప్రారంభించారు. బుధ, గురువారాల్లో ఏరువాక పౌర్ణమి రావడంతో రెండు రోజుల పాటు పూజలు చేసి వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో గ్రామాల్లోని పంటపొలాల వద్ద రైతుల సందడి నెలకొంది.రాంనగర్లో పంట పొలంలో ఎరువు, విత్తనాలను చల్లుతున్న రైతులు -
హాజరు అంతంతే!
ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టారు. ఇన్నిరోజులు బోసిపోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. ఉదయాన్నే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల వద్ద దింపారు. పలు బుక్స్టాళ్లు, షూమార్టులు, బట్టల షాపులు విద్యార్థులతో కిక్కిరిశాయి. తొలిరోజు తక్కువే.. జిల్లాలోని పది మండలాల్లో ప్రాథమిక పాఠశాలలు 269 ఉండగా విద్యార్థులు 7,251 మంది ఉన్నారు. అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలలు 45ఉండగా 1,937, హైస్కూళ్లు 53మంది ఉండగా విద్యార్థులు 8,361మంది విద్యనభ్యసిస్తున్నారు. తొలిరోజు మాత్రం సుమారుగా 20శాతం మంది విద్యార్థులే హాజరయ్యారు. పిల్లలు ఎక్కువగా రాకపోవడంతో ఉపాధ్యాయులు సైతం పాఠాలు బోధించలేదు. వచ్చిన వి ద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆడుతూ, పాడుతూ కనిపించారు. సర్కారు పాఠశాలలకు భిన్నంగా ప్రై వేట్ స్కూళ్లు విద్యార్థులతో కళకళలాడాయి. అధికశాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు సర్కారు బడుల్లో తాగునీరు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు దర్శనమిచ్చాయి. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను అందించారు. అలాగే విద్యార్థులకు యూనిఫాం సైతం అందించారు. తొలిరోజు ఏటూరునాగారంలోని ప్రభు త్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి సీతక్క యూనిఫామ్ అందించారు. అలాగే డీఈఓ పాణిని బండారుపల్లి పాఠశాల, పస్రా, తాడ్వాయి పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్ అందజేశారు. 930 నూతన అడ్మిషన్లు జిల్లాలోని పది మండలాల పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం రోజున ఒకటవ తరగతిలో 930 నూతన అడ్మిషన్లు నమోదయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన చేపడుతుండడంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు తొలిరోజు పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థుల అనాసక్తి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పుస్తకాల పంపిణీ -
తెరుచుకున్న ‘మూత’బడి
వాజేడు: విద్యార్ధులు లేరనే కారణం చూపుతూ నాలుగు సంవత్సరాల క్రితం మూసేసిన ప్రభుత్వ పాఠశాలను అధికారులు గురువారం తెరిపించారు. మండల పరిధిలోని పాయబాటలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా నుంచి వచ్చిన సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గుళ్లపల్లి సాంబయ్య, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ జిల్లా మేనేజర్ అప్పని జయదేవ్లతో పాటు ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. గ్రామస్తులతో పాఠశాల ప్రాధాన్యత గురించి మాట్లాడి గ్రామంలోని ఇద్దరు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ఇప్పటి నుంచి పాఠశాల నిర్వహణ కొనసాగుతుందని వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం మూసేసిన పాఠశాల తెరవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
సహచరుడి కుటుంబానికి చేయూత
ములుగు రూరల్: పత్రికా రంగంలో సహచరుడు భూక్య సునీల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ మేరకు పత్తిపల్లి పంచాయతీ కొడిశలకుంటలో గల బాధిత కుటుంబాన్ని ములుగు జర్నలిస్టులు గురువారం పరామర్శించి ఆర్థిక సాయంగా రూ.1.30లక్షలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సునీల్ కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గండ్రకోట సుధీర్యాదవ్, సీనియర్ జర్నలిస్టులు మహ్మద్ షఫీ, పిట్టల మధుసూదన్, సుంకరి సంపత్, బేతి సతీష్, గాదం దేవేందర్, రామిడి కృష్ణారెడ్డి. సుమన్, జాలిగం శ్రీనివాస్, చుంచు రమేష్, ఎనగందుల కొమురయ్య, రాజవర్ధన్, గండ్రకోట విష్ణు, వెంకన్న, సృజన్, బోయినపల్లి శ్రీధర్రావు, ఇందిర, శరత్, పింగిళి నాగరాజు, నగరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఆర్థిక సాయంగా రూ.1.30లక్షలు అందజేత -
మందులు అందుబాటులో ఉంచుకోవాలి
ములుగు రూరల్: వర్షాకాలంలో మూడు నెలలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్యకళాశాలలో ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధుల చికిత్సకు సరిపడా మందులను సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో ఉంచుకోవాలన్నారు. లేకపోతే ఇండేంట్ ద్వారా సమకూర్చుకోవాలని స్టోర్ ఫార్మసీ అధికారి శ్రీనివాస్కు సూచించారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు పంపిణీ చేయాలన్నారు. స్టోర్లోని అన్ని గదులను ఆయన పరిశీలించారు. స్టోర్లో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, జిల్లా మెడిసిన్ స్టోర్ ఫార్మసీ అధికారి వినోదర్, ఫార్మసీ అధికారి హిమ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
ములుగు రూరల్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేఖ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భవన నిర్మాణ కార్మికులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలతో పని చేయించడం నేరం అన్నారు. పిల్లలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
గోవిందరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు అన్నారు. మండల కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్లో తెలంగాణ రైతు సంఘం రెండో జిల్లా మహాసభ చిట్టెం ఆదినారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మొదటగా మండల కేంద్రం నుంచి పీఎస్ఆర్ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండు సత్యనారాయణ జెండా ఆవిష్కరించి మహాసభ సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా రైతులను మోసం చేస్తూ కాలం గడుపుతుందన్నారు. ఎన్నికల ముందు గిట్టుబాటు ధర చట్టం తెస్తామని హామీనిచ్చి రైతులను మోసం చేశారని వివరించారు. కార్పోరేట్లకు మాత్రం అనుకూలంగా చట్టం తెచ్చి వేలాది ఎకరాల భూములను పాలకులు అప్పజెప్పుతున్నారని వివరించారు. నూతనంగా జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా పేరుతో కార్పోరేట్లకు అనుకూలంగా చట్టం తెచ్చారని వివరించారు. రైతు భరోసాను రైతులు కాస్తు చేస్తున్న భూములన్నింటికి ఇస్తామని చెప్పి మూడెకరాల వరకే రైతు భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ ఖరీఫ్లో అసలు ఇస్తారో, ఇవ్వరో కూడా క్లారిటి లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, అంతే కాకుండా నకిలీ విత్తనాలతో మొక్కజొన్న రైతులు నష్టపోయారని తెలిపారు. వారికి ఎకరాకు లక్ష రుపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోడు భూములకు పట్టాలివ్వాలని సుదర్శన్రావు కోరారు. ఈ కార్యక్రమంలో సూడి కృష్ణారెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, ఎండి గఫూర్, తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, సోమా మల్లారెడ్డి, గుండు లెనిన్, నాగేశ్వరరావు, సుధాకర్, చంద్రశేఖర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్రావు -
ఐటీడీఏ ఏపీఓగా వసంతరావు జాదవ్
ఏటూరునాగారం: ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్గా వసంతరావు జాదవ్ గురువారం విధుల్లో చేరారు. గతంలో ఇక్కడ పనిచేసి గతేడాది బదిలీపై ఉట్నూరు ఐటీడీఏకు వెళ్లారు. ఉట్నూరులో పనిచేసే ఏపీఓ భీమ్రావు గతేడాది డిసెంబర్ 25న అనారోగ్యంతో మరణించారు. గత ఆరు నెలల నుంచి ఐటీడీఏ ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో ఐటీడీఏ అధికారుల ప్రతిపాదన మేరకు ఉట్నూరులో ఏపీఓగా పనిచేస్తున్న వసంతరావును ఏటూరునాగారం ఏపీఓగా నియమించారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరారు. మర్యాదపూర్వగా పీఓ చిత్రామిశ్రాను కలిశారు. అనంతరం ఏపీఓను సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.సమస్యలపై అధికారులు దృష్టి సారించాలిములుగు రూరల్: అధికారులు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవితేజ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యుత్, తాగునీటి సౌకర్యం ప్రహరీ లేని పాఠశాలలకు ప్రహరీ నిర్మించాలన్నారు. సమయానికి స్కూల్ యూనిఫామ్స్, పుస్తకాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, యుగంధర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.సాగు భూములకు హక్కు కల్పించాలివెంకటాపురం(కె): ఆదివాసీల సాగులో ఉన్న భూములకు హక్కు కల్పించాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అన్నారు. మండల కేంద్రంలోని కొమురంభీం కాలనీలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడగూడెంలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికై నా కొమురం భీమ్ కాలనీ ఆదివాసీల సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.‘మొక్కలు నాటుదాం’వాజేడు: మొక్కలను నాటి కాలుష్యాన్ని నివారించడం ద్వారా భావితరాలను కాపాడుకోవచ్చని ఓ ఆటోవాలా ప్రచారం చేపట్టారు. ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రచారం చేస్తూ గురువారం ములుగు జిల్లాలోకి అడుగు పెట్టాడు. మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి దర్గా తండాకు చెందిన ఆటో అంజి మూడేళ్లుగా మొక్కలను నాటాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుత జీవన విధానంలో కాలుష్యం భాగా పెరిగిందని మొక్కలను పెంచి ప్రకృతిని రక్షించుకోవడం మనందరి బాధ్యతని వివరించారు. ప్రతిఒక్కరూ సంవత్సరానికి నాలుగు మొక్కలు నాటితే కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆటోకు జాతీయ జెండా కట్టుకుని మొక్కలను తీసుకెళ్తూ ప్రచారం చేసుకుంటూ వాజేడు మండలానికి వచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో 15 జిల్లాల్లో ప్రచారం చేసినట్లు తెలిపారు.మెడికల్ బోర్డును పునరుద్ధరించాలిభూపాలపల్లి అర్బన్: మూడు నెలలుగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య కోరారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల నుంచి సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టకపోవడంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో మెడికల్ బోర్డులో జరిగిన కుంభకోణం దోపిడీ విషయంలో విచారణ పేరుతో మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం సరైనది కాదన్నారు. -
సెకండ్ ఏఎన్ఎంలను రెన్యువల్ చేయాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో సెకండ్ ఏఎన్ఎలుగా పనిస్తున్న వారిని ఈ ఏడాది రెన్యువల్ చేయాలని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గండెపల్లి సత్యం, బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి అన్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల 54 ఆశ్రమ పాఠశాలలున్నాయని తెలిపారు. అందులో 54 మంది సెకండ్ ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారిని తక్షణమే రెన్యూవల్ బీజేపీ నాయకులు బుధవారం ఐటీడీఏ డీడీ పోచంను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. అందుకోసం ఏఎన్ఎంలను వెంటనే రెన్యూవల్ చేసి వేతనాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యం -
రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
గోవిందరావుపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల హక్కులను కాలరాస్తుందని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని పీఎస్ఆర్ గార్డెన్లో నేడు నిర్వహించనున్న రైతుసంఘం మహాసభకు రైతులు తమ హక్కుల సాధనకు కదలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర రైతు సంఘానిదని తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో దొడ్డిదారిన మరో చట్టం తీసుకువచ్చి రైతులను దగా చేయడం కోసం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ చట్టంపై రైతాంగానికి అవగాహన కల్పించడం కోసం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పోతినేని సుదర్శన్ హాజరుకానున్నట్లు వెల్లడించారు. ప్రతీ రైతు ఈ సదస్సుకు హాజరు కావాలని విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుండు రామస్వామి, తీగల ఆదిరెడ్డి, కన్నోజు సదానందం, మోటం సాంబయ్య, భీమేష్, నగేష్, కృష్ణ, సూర్యనారాయణ, శ్రీను, సారయ్య, ధర్మారెడ్డి, లెనిన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం కమిటీ సభ్యుడు వెంకట్రెడ్డి -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ములుగు రూరల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూశాఖ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు మండల పరిధిలోని ఇంచర్లలోని ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు 2.54లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం 92వేల డబుల్ బెడ్ రూం ఇళ్లకు టెండర్లు పిలిచి 60వేలు మాత్రమే పూర్తి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి కల నెరవేర్చేందుకు ప్రతీ ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ములుగు నియోజకవర్గానికి అత్యధికంగా 5 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.22,500 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి రెవెన్యూ అధికారులు ఉచిత ఇసుకకు సంబంధించిన టోకెన్లు అందించాలని సూచించారు. నిరుపేదల కలను నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను పెద్దఎత్తున అందించారని వెల్లడించారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 4.50లక్షల ఇళ్లను మొదటి విడుతలో అందిస్తున్నారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ నియోజనవర్గంలో డబుల్బెడ్రూం ఇళ్లను అందించలేకపోయారని తెలిపారు. ములుగు నియోజకవర్గానికి మొదటి విడతలో 5వేల ఇళ్లను అందించడంతో ప్రతిపక్ష పార్టీ నాయకలు ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళా సంఘాల సభ్యులు వ్యాపారాలు చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పేదోడి సొంతింటి కలను నిజం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు
ఏటూరునాగారం: పోలీసులకు విధి నిర్వహణలో తగిన గుర్తింపు లభిస్తుందని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. డివిజన్ పరిధిలోని పోలీసులు, సిబ్బందికి బుధవారం ఆయన ఏఎస్పీ కార్యాలయంలో రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజలు ఆపదలో ఉంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న తక్షణ సేవలను అందజేయాలన్నారు. సమాజంలో పోలీసులంటే ప్రజలు గౌరవించే విధంగా సేవలు చేయాలన్నారు. ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రజలతోపాటు అధికారుల వద్ద కూడా గుర్తింపు లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ అనుముల శ్రీనివాస్, వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, ఎస్సైలకు తాజొద్దీన్, టీవీఆర్ సూరి, వెంకటేష్, రాజ్కుమార్ పాల్గొన్నారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయం ఉత్తమ సేవలు అందజేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ములుగురూరల్: వైద్యాధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. మండల పరిఽధిలోని రాయినిగూడెం, పత్తిపల్లి, మధనపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ రానున్న వర్షాకాలం సీజన్లో వచ్చే మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణలో ఆరోగ్య సిబ్బంది ముఖ్య పాత్ర పోషించాలన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకుని డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి గుంటల్లో నీరు నిల్వ ఉంటే వాటిలో ఆయిల్బాల్స్ వేయాలన్నారు. తాగునీటిని క్లోరినేషన్ చేయాలని సూచించారు. సిబ్బంది గ్రామాల్లోని ఇంటింటిని సందర్శించి లార్వా కంటైనర్లను తొలగించాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో మూడు నెలల పాటు మందులు నిల్వ ఉంచుకోవాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించి సకాలంలో షెడ్యూల్ ప్రకారం చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని తెలిపారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాయలంలో రాష్ట్రీయ బాల స్వస్తియా కార్యక్రమంలో పని చేసే వైద్యులకు, ఫార్మసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధుల నియంత్రణలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ, ఆశ్రమ పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలలో పిల్లలకు ఐ స్కానింగ్ ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ ప్రొవైడర్ రవళిదీప్తి, ఆరోగ్య కార్యకర్తలు ఉపేంద్ర, కల్పన, భాస్కర్, జిల్లా ఉప ఆరోగ్యశాఖ అధికారి విపిన్ కుమార్, ఆర్బీఎస్కే జిల్లా పోగ్రాం అధికారి రణధీర్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
మోగనున్న బడిగంట
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ములుగు రూరల్: వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈమేరకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు చెత్తాచెదారం తొలగించి అందంగా ముస్తాబు చేశారు. ఈ మేరకు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు మామిడాకుల తోరణాలు కట్టారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన చేపట్టే విధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో వేసవిలో రెండు విడతలుగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.మొదటి రోజే పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించేందుకు అన్నీ సిద్ధం చేశారు. పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సిద్ధం జిల్లాలోని 10మండలాలు ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 555 ఉన్నాయి. వీటిల్లో విద్యార్థిని విద్యార్థులు గతేడాది 29,117మంది విద్యను అభ్యసించారు. అదే విధంగా పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యవంతంగా తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, మధ్యాహ్నా భోజన పథకం పటిష్టంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థుల పెంపునకు బడిబాట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుతున్నారు.గోవిందరావుపేట: పస్రా జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పారిశుద్ధ్య పనులు విద్యార్థుల సంఖ్య పెంపునకు బడిబాట విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు -
నేడు జస్టిస్ పీసీ ఘోష్ పర్యటన
హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు పూర్వ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ గురువారం హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ పి.ప్రావీణ్య మొక్క అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు రామప్పకు చేరుకుంటారు. రామప్పలో దైవదర్శనం చేసుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రామప్పలో బయలుదేరి 1.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి మూడు గంటలకు హైదరాబాద్ వెళ్తారు. పది మందికి జైలు శిక్ష వెంకటాపురం(ఎం): మద్యం తాగి వాహనాలు నడిపిన వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10మందికి జిల్లా జడ్జి జైలు శిక్ష విధించినట్లు వెంకటాపురం ఎస్సై జక్కుల సతీష్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 22మందిని బుధవారం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా అందులో కొంత మందికి రూ.34,500లు జరిమానా విధించడంతో పాటు 8 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష జడ్జి విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మొక్కలు నాటిన భక్తురాలు ఎస్ఎస్తాడ్వాయి: భద్రాద్రికొత్తగూడ జిల్లాలోని సుజాత్నగర్ మండలానికి చెందిన భక్తురాలు దుర్గ మేడారంలో అటవీ ప్రాంతంలో బుధవారం మొక్కలు నాటారు. దుర్గ కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకున్నారు. వైల్డ్లైఫ్ ప్రాంతంలో 116 మొక్కలు నాటుతామని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటి మొక్కు తీర్చుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు అడవుల సంరక్షణకు మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. దుర్గ కుటుంబ సభ్యులను రేంజ్ అధికారి నరేందర్తో పాటు సిబ్బంది అభినందించారు. పాండవుల గుట్టలు అద్భుతంరేగొండ: పాండవుల గుట్టలు అద్భుతంగా ఉన్నాయని ట్రెయినీ కలెక్టర్లు అన్నారు. బుధవారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ల బృందం సౌరభ్శర్మ, సలోని చబ్ర, హర్ష చౌదరి, ప్రణయ్ కుమార్, కరోలిన్ చింగ్తాయిన్మావిలు సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా వారు గుట్టలోని కుంతీదేవి, కొలనుకుంటా, పాండవుల కాలం నాటి రాతి చిత్రాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాండవుల గుట్టలు అతి సుందరమైనవని, మహాభారత కాలం నాటి చారిత్రాక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయన్నారు. వారి వెంట తహసీల్దార్ శ్వేత, జిల్లా యువజన, క్రీడాల శాఖ అధికారి రఘు, కోర్సు డైరెక్టర్ కందుకూరి ఉషారాణి, నోడల్ అధికారి శ్రీనివాస్, ఎఫ్ఎస్ఓ గౌతమి, ట్రెయినీ ఎస్సై దివ్య, ఆర్ఐ భరత్రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. పోల్టాక్స్ను రద్దు చేయాలి భూపాలపల్లి అర్బన్: కేబుల్ ఆపరేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతున్న పోల్ టాక్స్ను వెంటనే రద్దు చేయాలని ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేశాల రమేశ్బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై బుధవారం జి ల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్క్లబ్లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి మాట్లాడారు. గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకు న్న స్వయంకృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు వినోదాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కే బుల్ ఆపరేటర్లు ముందు వరుసలో ఉంటున్నారన్నారు. ప్రస్తుత సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్లతో పోటీ పడడం కష్టమవుతుందన్నారు. ఇప్పటికే నష్టాల్లో నడుపుతున్న కేబుల్ ఆపరేటర్లపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆయిల్పామ్ సాగుపై దృష్టి పెట్టాలి
ఏటూరునాగారం: జిల్లాలోని రైతులు ఆయిల్పామ్ పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఉద్యానశాఖ జిల్లా అధికారి సంజీవరావు అన్నారు. మండలంలోని శంకరాజుపల్లి రైతు వేదిక కార్యాలయంలో ఉద్యాన పంటలపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. ఈ వర్షాకాలంలో ఉద్యాన పంటల సాగు అంతర, మిశ్రమ పంటల సాగు ఆవశ్యకత, ఆయిల్ పామ్ తోటలకు రాయితీ వివరాలు, పోడు పట్టాలు కలిగిన ఎస్టీ రైతులకు ఇందిర సౌర పథకం, గిరివికాసం పథకం రాయితీలపై వివరించారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి రూ.50,918ల వరకు రాయితీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. డ్రిప్పై రాయితీ ఎస్టీ, ఎస్సీ రైతులకు 100శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం రాయితీ ఉంటుందని వివరించారు. సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి పథకంలో మామిడి, అరటి, బొప్పాయి, జామ, డ్రాగన్ ఫ్రూట్ పంటలకు 50 శాతం రాయితీ, పందిళ్లపై తీగజాతి కూరగాయలను సాగు చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం డివిజన్ ఉద్యాన అధికారి కోపిరి లావణ్య, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధి దుగ్గి అఖిల్, ఫినోలెక్స్ డిప్ కంపెనీ ప్రతినిధి రోహిత్, రైతులు విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, జాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఉద్యానశాఖ జిల్లా అధికారి సంజీవరావు -
రామప్పను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్లు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం ట్రెయినీ ఐఏఎస్లు సౌరభ్శర్మ, సలోని చబ్ర, హర్ష చౌదరి, ప్రణయ్ కుమార్, కరోలిన్ చింగ్తాయిన్మావిలు సందర్శించారు. హైదరాబాద్లోని శిక్షణ పొదుతున్న ట్రెయినీ ఐఏఎస్లు తెలంగాణ దర్శన్లో భాగంగా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు, టూరిజం అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.ఎవరై న వ్యాపారస్తులు,సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చే స్తూ నకిలీ విత్తనాలను,పురు గు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం.ఇందుకోసం ప్రత్యే క ప్రణాళిక రూపొందించి టీమ్లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్ కమిషనరేట్● -
‘అవగాహన రాహిత్యంతో మాట్లాడడం సరికాదు’
ములుగు రూరల్: ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడడం సరికాదని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎండి. చాంద్పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంతో అసూయతో ప్రజలను తప్పుతోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. జిల్లాలో మంత్రి సీతక్క చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, రాజేందర్గౌడ్, సుమన్రెడ్డి, రవియాదవ్, భిక్షపతి, భరత్కుమార్ పాల్గొన్నారు. -
సీడ్.. ఫ్రాడ్..
రైతుల మెడపై నకిలీ విత్తనాల కత్తిజిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా జిల్లా సాగు అంచనా అవసరమయ్యే (ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు హనుమకొండ 85,000 1,70,000 వరంగల్ 1,22,358 2,44,716 మహబూబాబాద్ 84,070 1,68,140 భూపాలపల్లి 1,01,500 2,03,000 జనగామ 1,45,000 2,90,000 ములుగు 29,430 58,860సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నకిలీ విత్తనాలే ఇందుకు ఉదాహరణ. వరి తర్వాత పత్తివైపే రైతుల మొగ్గు.. ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా, 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈ సారి బీటీ–3 పేరిట వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో ఏటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు.. రూ.400 వరకు అదనం.. ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆ మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఓవైపు నకిలీ బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకెట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా బీటీ–2 రకాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901లకు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350ల నుంచి రూ.1,450ల వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సీజన్ ఆరంభం నుంచే దందా పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్న రైతులు -
నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
ములుగు రూరల్: జిల్లాలో నేడు(బుధవారం) రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కలు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మంత్రులు హెలీకాప్టర్లో జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలకు ఉదయం 10.20 గంటలకు చేరుకుంటారు. 10.30 గంటలకు మండలంలోని ఇంచర్లలో ఇందిరమ్మ కాలనీకి చేరుకుని లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందిస్తారు. అనంతరం గోవిందరావుపేట మండల పరిధిలోని చల్లాయిలో రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో భోజన విరామం అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. బడిబాటపై కళాప్రదర్శన వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంపై తెలంగాణ సాంస్కృతిక సారధి కోఆర్డినేటర్ రాగుల శంకర్ ఆధ్వర్యంలో కళాకారులు ఆటపాటలతో అవగాహన కల్పించారు. కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం సర్కారు బడులలో అందిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకే పంపాలని పేర్కొంటూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు మార్త రవి, గోల్కొండ బుచ్చన్న, ఈర్ల సాగర్, రహీమోద్దిన్, రాజేందర్, సురేష్, విజయ్కుమార్, కిషన్, సామ్రాజ్యం, శోభ పాల్గొన్నారు. మావోయిస్టుల బంద్ పాక్షికం వెంకటాపురం(కె): మావోయిస్టులు చేపట్టిన భారత్ బంద్ మండలంలో పాక్షికంగా జరిగింది. ఉదయం 11గంటల వరకు షాపులు తెరుచుకోలేదు. కాగా మంగళవారం వారపు సంత కావటంతో మధ్యాహ్నం నుంచి షాపులు తెరుచుకున్నాయి. బస్సులు, ఆటోలు యధావిధిగా తిరిగాయి. క్రికెట్ లీగ్ మ్యాచ్లో ములుగు జట్టు విజయం ములుగు రూరల్: అండర్–19 క్రికెట్ లీగ్ మ్యాచ్లో ములుగు జట్టు విజయం సాధించిందని ఉమ్మడి వరంగల్ జిల్లా సెక్రటరీ చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాకారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లో జనగామ, ములుగు జట్లు తలపడగా ములుగు జట్టు విజయం సాధించిందని వివరించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాఽయి పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. లీగ్ మ్యాచ్లలో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభను కనబర్చాలని సూచించారు. ‘అభివృద్ధిని విస్మరిస్తున్న అధికారులు’ ఏటూరునాగారం: ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలోని పథకాలు, అభివృద్ధిని ఐటీడీఏ పీఓ విస్మరించారని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్కు బీజేపీ నాయకులు ఐటీడీఏ పీఓ, ఐటీడీఏ చైర్మన్, కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా కోట్ల రూపాయల ఐటీడీఏకు నిధులు కేటాయిస్తే వాటిని గిరిజన సంక్షేమానికి ఖర్చు చేయకుండా దారి మళ్లించారని తెలిపారు. ఏజెన్సీలో 317 జీవో ద్వారా స్థానికేతరులు ఏజెన్సీ ప్రాంతాలలో చేరి స్థానికులకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రాకుండా చేస్తున్నారని వివరించారు. అన్ని శాఖలలోని రిజర్వేషన్లను స్థానిక గిరిజనులకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. రాబోయే రోజుల్లో ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పల్లా బుచ్చయ్య, వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా సెక్రటరీ మైపతి సంతోష్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కల్లెపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ములుగు రూరల్: మధ్యాహ్న భోజన తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యత ప్రమాణాలతో అందించాలని సూచించారు. వంటల్లో నాణ్యత ప్రమాణాల మేరకు సరుకులను వినియోగించాలని సూచించారు. మధ్యాహ్న భోజన ఇన్చార్జ్ ఉపాధ్యాయులు భోజన తయారీని తప్పకుండా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుళ్లపెల్లి సాంబయ్య, డీసీఈవి కార్యదర్శి సూర్యనారాయణ, కో ఆర్డినేటర్లు హర్షం రాజు, రమాదేవి, ఎంఈఓ తిరుపతి, రిసోర్స్ పర్సన్లు వినోద్కుమార్, విద్యాసాగర్, వంట కార్మికులు పాల్గొన్నారు.డీఈఓ పాణిని -
జర్నలిస్టు శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం
ములుగు రూరల్: ఆంధ్రప్రదేశ్లోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని పలువురు జర్నలిస్టులు ఏపీ ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కులను, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు వృత్తి ధర్మం పాటిస్తారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రభుత్వాలు కక్షసాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎండి షఫీ అహ్మద్, పిట్టల మధుసూదన్, దూడబోయిన రాకేష్, సుంకరి సంపత్, రాంమూర్తి, గాదం దేవేందర్, జాలిగం శ్రీనివాస్, బోయినపల్లి శ్రీధర్రావు, గజ్జి రాజేష్, శరత్, కొమురయ్య, రాజువర్ధన్, రమేష్, మహేందర్, జలీల్ఖాన్, వెంకన్న, స్వామి, సంజీవ పాల్గొన్నారు. -
జాడలేని వాన
వెంకటాపురం(ఎం): ప్రకృతి ఏదో ఒక రూపంలో రైతాంగాన్ని దెబ్బతీస్తూనే ఉంది. రోళ్లు పగిలే ఎండలు కొట్టాల్సిన రోహిణీ కార్తెలో ముందస్తు వర్షాలు పడడంతో రైతన్నలు మురిసిపోయారు. నైరుతి రుతుపవనాలు కూడా ముందస్తుగానే రాష్ట్రానికి చేరుకోవడంతో పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే దీమాతో జిల్లాలోని రైతులు మే నెలలోనే సాగుకు సన్నద్ధమయ్యారు. వేలాది రూపాయలు వెచ్చించి దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటారు. పది రోజులుగా.. మే మాసం చివరి వారంలో వేలాది ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలను నాటి నైరుతి రుతుపవనాల మీద గంపెడాశలు పెట్టుకున్నారు. జూన్ తొలివారంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో నాటిన విత్తనాలు 60 శాతం మాత్రమే మొలకెత్తాయి. పది రోజులుగా వర్షాలు జాడలేకపోవడంతో మొలకెత్తిన విత్తనాలు సైతం ఎండలకు వాడిపోతున్నాయి. రైతులంతా వరుణుడి మీద భారం వేసి వెయ్యికళ్లతో వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 12తర్వాతనే వర్షాలు కురిసే అవకాశం జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభమైన జూన్ 12 తర్వాతనే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్లో జిల్లాలో 27,143 ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకే సుమారు 6 నుంచి 8 వేల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలను నాటారు. వర్షాలు కురవకపోతే నాటిన విత్తనాలతో పాటు, మొలకెత్తిన మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పది రోజులుగా కురవని వర్షం వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తిన రైతులు 60 శాతమే మొలకెత్తిన గింజలు ఎండ తీవ్రతకు వాడిపోతున్న మొక్కలుముందస్తు సాగుకే ప్రాధాన్యం వ్యవసాయ పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతు కుటుంబాలు తొలకరి వర్షానికి మురిసిపోయి ముందస్తు పంటలను సాగు చేయడంతో నష్టాన్ని చవిచూస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశించాక 65 నుంచి 75 మిల్లీమీటర్ల శాతం వరకు వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలను నాటాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నప్పటికీ రైతులు తొందరపడి ముందస్తు సాగుకే మొగ్గుచూపారు. -
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు
ప్రజావాణిలో ఈ వినతులే అధికం ● అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ● కలెక్టర్ టీఎస్ దివాకర ● గ్రీవెన్స్లో మొత్తం 31 దరఖాస్తులుఈ ఫొటోలో కనిపిస్తున్న నిరుపేద దంపతులు వెంకటాపురం (ఎం) మండలం జవహార్నగర్కు చెందిన అన్నారపు తిరుపతి, సుమలత దంపతులు. 13 సంవత్సరాలుగా జవహార్నగర్లో పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో ఇల్లు మంజూరు చేస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మించుకుంటామని కలెక్టర్ను వేడుకున్నారు. ఇలా జిల్లాలో చాలా మంది నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతిపత్రాలు అందించారు. ● -
ఇసుక క్వారీ నిర్వహణకు ఆమోదం
మంగపేట: మండలంలోని వాడగూడెంలో శ్రీ నల్ల పోచమ్మతల్లి గిరిజన ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీ నిర్వహణకు పెసా గ్రామ సభలో 115 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. కలెక్టర్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు గ్రామంలోని 3వ ఇసుక క్వారీ నిర్వహణకు అర్హత కలిగిన రిజిస్టర్ గిరిజన లేబర్ సొసైటీని గుర్తించేందుకు పంచాయతీ ప్రత్యేకాధికారి, ఏఈఓ భావన అధ్యక్షతన పెసా గ్రామసభను సోమవారం నిర్వహించారు. గ్రామసభకు ఏటూరునాగారం ఐటీడీఏ పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. గ్రామంలోని 3వ ఇసుక క్వారీ నిర్వహణకు శ్రీ నల్లపోచమ్మతల్లి, పగిడిద్దరాజు సమ్మక్క–సారక్క సొసైటీలు పోటీపడ్డాయి. క్వారీ నిర్వహణ బాధ్యతలు తమకు కావాలంటూ పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క సొసైటీ సభ్యులు కోరారు. దీంతో నల్లపోచమ్మ సొసైటీ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో కొంత వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఎస్సై సూరీ గొడవ పడకుండా గ్రామసభ నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రామసభకు హాజరు కావడం ఇష్టంలేదని పగిడిద్దరాజు సమ్మ క్క, సారక్క సొసైటీ సభ్యులు లేచివెళ్లిపోయారు. అయితే గ్రామంలో రెండు సొసైటీల్లో 200 మంది సభ్యులు ఉండగా కోరం ఉండాలంటే 66 మంది హాజరు కావాల్సి ఉంది. అందులో 115 మంది సభ్యులు హాజరు కావడంలో అధికారులు గ్రామసభను కొనసాగించారు. ఇసుక క్వారీ బాధ్యతలను నిర్వహించేందుకు శ్రీ నల్లపోచమ్మతల్లి సొసైటీని గుర్తిస్తూ పెసా నిబంధనల మేరకు చేతులు ఎత్తి ఆమోదం తెలిపారు. సభ్యుల తీర్మానం నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని ప్రభాకర్ తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బద్రూనాయక్, ఎంపీ మమత, పంచాయతీ కార్యదర్శి వనజ, పెసా కోఆర్డినేటర్ మడి శోభన్ పాల్గొన్నారు. -
విమానాశ్రయానికి మరో అడుగు
సాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనేపథ్యంలో సమీప గ్రామాల ప్రజల నుంచి సేకరించే భూమికి పరిహారం నిర్ణయించడం.. అందుకు భూనిర్వాసితులు సానూకూలత వ్యక్తం చేయడంతో విమానాశ్రయ నిర్మాణానికి మరో అడుగు పడ్డట్లైంది. కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని జిల్లా చర్చల కమిటీ నిర్వాసితులతో చర్చించింది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887 ఇస్తామని, అంతకు మించి పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి భూనిర్వాసితులు భూములు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. వీరిలో గుంటూరుపల్లికి చెందిన కొందరు రైతులు తమ భూములు మెయిన్ రోడ్డుకు ఉన్నాయని, ఇంకాస్త ఎక్కువ ధర వస్తుందన్న ఆలోచనలో ఉన్నవారితో తహసీల్దార్, ఆర్ఐ తదితరులు చర్చించి ఎక్కువ ధర ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. కలెక్టర్ తనకున్న విచక్షణాధికారాలతో జనరల్ అవార్డు కింద రూ.65 లక్షలు ఉంటే కన్సంట్ అవార్డు కింద రూ.కోటి 20లక్షల వరకు తీసుకొచ్చారని వివరించారు. గత బుధ, గురువారాల్లో జరిగిన భూసేకరణ ధర పెంపు నిర్ణయంపై సమావేశంలో పాల్గొనని రైతులకు కూడా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. అయితే తమ భూములు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్న చాలా మంది రైతులు అవసరమైన వివరాలు, పత్రాలు(పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పాస్బుక్) సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికే డాక్యుమెంట్లు ఇచ్చారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కలెక్టర్ సత్యశారద నిర్ణయంతో మరో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు అదనంగా అవసరం కానుండడంతో ఇప్పటికే ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించినట్టు తెలిసింది. భూసేకరణ కాగానే పనులు మొదలు.. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఉండొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్కు ఒప్పందం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరపడంతో గతేడాది నిరంభ్యంతర పత్రం వచ్చింది. 2024 నవంబర్లోనే 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయిస్తూ జీఓను ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ సైతం భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాగానే పనులు ప్రారంభించేందుకు రూ.450 కోట్లు నిధులను కేటాయించింది. భూ సేకరణ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే ఏఏఐ విమానాశ్రయ విస్తరణ పనులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని 136 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, అది కూడా పూర్తి కావచ్చింది. భూ నోటిఫికేషన్ ప్రకారం రైతులు తమ భూపత్రాల వివరాలు ఇవ్వగానే, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూనే భూమి సేకరించనుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు పలు దఫాలుగా సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించే వీలున్న 37.6 మీటర్లు పొడవున్న ఏ 320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా.. ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్ పోర్ట్ రన్వే కింద 1.06 గంటల భూమి కోల్పోతున్నా. ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 కోట్టుగా నిర్ణయించింది. ఇటీవల కలెక్టర్ సత్యశారద భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. త్వరలోనే పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – మన్నే శ్రీనివాస్, భూనిర్వాసితుడు మామునూరు ఎయిర్పోర్ట్ భూనిర్వాసితులతో చర్చించిన అధికారులు ధరల నిర్ణయాలపై మెజార్టీ నిర్వాసితుల సానుకూలత వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు.. వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4,000.. -
మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు
వెంకటాపురం(కె): మావోయిస్టులకు సహకరిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని ఏటూరునాగారం ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బోదాపురం పంచాయతీ సీతా రాంపురం గ్రామంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యను తె లుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావే శం నిర్వహించారు. గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాబోయో వ ర్షాకాలం సీజన్లో వాగులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున, వాగుల వద్దకు ఎవరూ వెళ్లొద్దన్నారు. అనంతరం గ్రామస్తులకు దోమ తెరలను పంపిణీ చేశారు. ఎస్సై కొప్పుల తిరుపతి రావు, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు ఉన్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలి
ములుగు రూరల్: దివ్యాంగులకు ఉపకరణాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ సంక్షేమాధికారి తుల రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉపకరణాల మంజూరు చేపట్టారని, అర్హత కలి గిన వారు ఈ నెల 18వ తేదీ లోపు టీజీఓబీఎంఎంఎస్. సీజీజీ. జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జిల్లాకు రెట్రోఫిటేడ్ స్కూటీలు –14, బ్యాటరీ వీల్ చైర్లు– 4, మొబైల్ బిజిపనెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్– 6, హైబ్రిడ్ వీల్ చైర్స్ –1, లాప్ట్యాప్స్–5, జి స్మార్ట్ ఫోన్లు –1, ట్రై సైకిల్స్–3, వీల్ చైర్స్–2, చేతి కర్రలు–7, వినికిడి యంత్రాలు–1, స్మార్ట్ కేన్స్–4, ఎంసీఆర్ చెప్పల్స్ –4 కేటాయించినట్లు తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో.. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజేసీ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు 8332864686, 9515960845 నంబర్లలో సంప్రదించాలన్నారు. అధికారుల సూచనలు పాటించాలి ములుగు రూరల్/వాజేడు: బొగత జలపాతాన్ని సందర్శించే క్రమంలో పర్యాటకులు అటవీశాఖ అధికారుల సూచనలు పాటించా లని డీఎఫ్ఓ రాహుల్ జాదవ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జలపాతం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించామని, పర్యాటకులు భద్రతా సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సోషల్ మీడియాలో లోతుగా ఉన్న జలపాతాలను సందర్శించాలని పోస్టులు పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని, అలాంటి జలపాతాలను పర్యాటకులు సందర్శించొద్దన్నారు. మధ్యాహ్న భోజన సామగ్రి పంపిణీకి సిద్ధంములుగు రూరల్: జిల్లాలోని 298 ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజన వంట సామగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ కమిషనర్ జిల్లాకు సుమారు రూ.20లక్షల విలువైన 9 రకాల వస్తువులను పంపిణీ చేశారు. ఇందులో ఐదు కిలోల గిన్నెల నుంచి 40 కేజీల గిన్నెలు, బియ్యం భద్రపరచడానికి, వడ్డించడానికి, తాగునీరు నిల్వ చేసేందుకు తదితర వస్తువులు ఉన్నాయి. వీటిని జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల భవనంలో భద్రపరిచారు. త్వరలో మండలాల వారీగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న వారిపై చర్య తీసుకోవాలి ములుగు రూరల్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నాయని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మమన్యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్ట్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. స్టేషనరి దుకాణాలను పాఠశాలల్లో ఏర్పాటు చేసి విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నారన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరాం, రజినీకాంత్, జశ్వంత్, శ్రీతన్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
ములుగు రూరల్: ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ జాతీయ నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్కు ఎంపికై తే మౌలిక వసతులు మెరుగుపడతాయని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్ అన్నారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండలంలోని పందికుంట ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రిజిస్టర్లను తనిఖీ చేయడంతో పాటు మందుల నిల్వలను, గదులను, ఐఈసీ మెటీరియల్ పోస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య మందిర్లో రోగులకు ఆరోగ్య భద్రత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి అన్వేష్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంపత్రావు, శరత్, నందకిషోర్, జితేందర్, శ్యాం, ఆర్బీఎస్కే వైద్యాధికారులు మల్లికార్జున్, భూపాల్రెడ్డి, వినోదర్, స్వామి, సూపర్వైజర్లు దేవమ్మ, ఆరోగ్య కార్యకర్త దేవమ్మ, నాగరాణి, వెంకన్న, హరి , ఆశలు పాల్గొన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్ -
ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలి
ములుగు రూరల్: ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలు నవంబర్ నెల నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క, సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ టీఎస్ దివాకర, అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, అధికారులు వీసీలో పాల్గొన్నారు. పెట్రోల్ పంపు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన భూములను పది రోజుల్లో గుర్తించాలన్నారు. జూన్ 12వ తేదీన పాఠశాల పునఃప్రారంభం పండుగలా నిర్వహించాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు అందించాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో అద్దె బస్సులు, పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల ఏకరూ ప దుస్తుల కుట్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని, పెండింగ్లో ఉన్న కుట్టు పనులను త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలు నవంబర్ నాటికి పూర్తి చేసేందు కు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెట్రోల్ పంప్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటునకు స్థలం గుర్తించాలి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క -
గిరిజనుల సమస్యలపై దృష్టిసారించాలి
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సమస్యలపై ఐటీడీఏ సెక్టార్ అధికారులు దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్భార్లో దరఖాస్తులు స్వీకరించారు. జయశంకర్ జిల్లా మహాముత్తారం బొగ్గుపల్లి గ్రామంలో బోర్లు చేశామని, వాటికి విద్యుత్ అమర్చాలని 14 మంది రైతులు కోరారు. ఆదివాసీ సంఘాల్లో అర్హులైన సభ్యులకు, గోవిందరావుపేట మండలం ముంపునకు గురైన ప్రాజెక్టునగర్ వాసులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోరారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలని, ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేయాలని గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు కొత్త సురేందర్, జిల్లా నాయకులు గండెపల్లి సత్యం విన్నవించారు. సోలార్ వీధిలైట్లు ఇప్పించాలని అందుగులమీది గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. కాగా గిరిజన దర్భార్లో వచ్చిన 41 వినతులను ఆయా సెక్టార్ అధికారుల ద్వారా పరిష్కారం చూపేవిధంగా చర్య తీసుకుంటామని పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. -
‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఓరుగల్లు నేతలకు ఆదివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో మూడో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిన సీనియర్ల ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కొండా సురేఖ, ధనసరి సీతక్కలకు రేవంత్రెడ్డి కేబినేట్లో స్థానం దక్కింది. సుమారు 16 నెలల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మూడో మంత్రి కోసం పలువురు సీనియర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆశావహులకు నిరాశ మంత్రివర్గ విస్తరణ చాలా కాలం నుంచి వాయిదా పడుతుండగా.. చివరకు శుక్రవారం పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్.. ఇలా ఎవరికి తోచిన దారిలో వారు అగ్రనేతలతో ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఈసారి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. 2014లో టికెట్ దక్కకున్నా ఇండిపెండెంట్గా గెలుపొందిన మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యత ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ టికెట్పైన గెలిచిన ఈయనకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినా జరగలేదు. ఈసారి కూడా తనకు మంత్రివర్గంలో చోటివ్వాలని కోరినా దక్కలేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీని వదలకుండా ఉన్న తనకు కూడా అవకాశం ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పార్టీ పెద్దలకు తన వాయిస్ వినిపించారు. మాజీ ఐపీఎస్ అధికారి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఎస్సీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని అడిగినట్లు ప్రచారం. అయితే ఉమ్మడి వరంగల్ నుంచి ఆశించిన ఎవరికీ అమాత్యపదవి దక్కక పోవడం కొంత నిరాశ పర్చింది.అమాత్యుల శాఖలు పదిలం మంత్రివర్గ విస్తరణలో ఈసారి కనీసం నలుగురికి అవకాశం ఉంటుందని భావించినా.. ముగ్గురికే అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన మరో ఎమ్మెల్యే, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రానున్న కాలంలో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టినట్లు సమాచారం. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విస్తరణ సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులకు చెందిన శాఖల మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం మంత్రి సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(గ్రామీణ నీటిసరఫరా సహా), మహిళా శిశుసంక్షేమ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు ఆదివారం రాత్రి వరకు శాఖలు కేటాయించలేదు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరగలేదు. దీంతో మంత్రుల శాఖలు మారతాయనేది ఉత్త ప్రచారమని తేలిపోయింది. ఫలించని ఓరుగల్లు సీనియర్ నేతల ప్రయత్నాలు డిప్యూటీ స్పీకర్తోనే సరిపెట్టిన పార్టీ అధిష్టానం విప్ నుంచి డిప్యూటీ స్పీకర్గా రామచంద్రునాయక్ శాఖలను పదిలం చేసుకున్న మహిళా మంత్రులు ఊహాగానాలకు తెర దింపిన హైకమాండ్ -
రూ.70 లక్షలతో టెండర్లు
గోదావరి కరకట్ట నాలుగు చోట్ల గండిపడి ప్రమాదంగా మారింది. 2022–23లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కరకట్ట కోతకు గురికాకుండా నిర్మించాలని ప్రభుత్వం, ఇంజనీరింగ్ అధికారులు సర్వేలు చేశారు. అయితే అస్సాంలోని బ్రహ్మపుత్ర నది వద్ద జియోట్యూబ్స్తో నూతనంగా సాంకేతిక పరిజ్ఞానం జోడించి జియోట్యూబ్స్ను అమర్చగా ఫలితాలు బాగున్నాయని తెలుసుకున్న ప్రభుత్వం ఆ పనులు ఏటూరునాగారం గోదావరి కరకట్ట వద్ద చేపట్టేందుకు 2023లో శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 70 లక్షలు నిధులు కేటాయించి టెండర్ల పిలిచింది. దీంతో అస్సాంకు చెందిన గుత్తేదారులు టెండర్లను దక్కించుకొని జియోట్యూబ్స్ అమర్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే రెండేళ్ల నుంచి జియోట్యూబ్స్ను అమర్చడానికి ఇంజనీరింగ్, గుత్తేదారులు జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు నిర్మించలేదు. -
కొనసాగుతున్న తాత్కాలిక బస్టాండ్ పనులు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4.80కోట్ల నిధులను కేటాయించింది. బస్టాండ్ పరిసరాల్లో ఉన్న పాలశీతలీకరణ కేంద్రాన్ని ఇప్పటికే తరలించారు. బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభానికి ముందు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరలో దేవాదాయశాఖకు సంబంధించిన స్థలంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. బస్సులు నిలపడంతో పాటు ప్రయాణికులు వేచి ఉండేందుకు రేకుల షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే జిల్లాకేంద్రంలో మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం వాజేడు: ప్రజలకు సుపరిపాలన, సంక్షేమ పథకాలను అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మ అన్నారు. మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనపై ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తూ సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంతో దేశ ప్రతిష్ట పెరిగిందని వివరించారు. నాయకులు పార్టీని బూత్ లెవల్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది జగపతి, జిల్లా కౌన్సిలర్ మెంబర్ సీతారామ రాజు, కందుల రాంకిశోర్, ఆత్మకూరి ప్రవీణ్, ఆంజనేయులు, సుబ్బయ్య, కృష్ణకుమారి పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతి గోవిందరావుపేట: విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని రాఘవపట్నంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాఘవపట్నం గ్రామానికి చెందిన గాదె మురళి, పెద్దపుండ్ర మధు, కొడాలి ప్రసాద్, ఎండి అజాంకి చెందిన నాలుగు గేదెలు రోజు మాదిరిగా శనివారం సాయంత్రం మేత మేస్తుండగా అదే సమయంలో వీచిన బలమైన గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడ్డాయి. ఈ క్రమంలో విద్యుత్ తీగలకు గేదెలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన గేదెల విలువ రూ.2.50లక్షలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. ఘనంగా స్వామి వారి జయంతి రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం, స్వామి వారికి అభిషేకం కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు. ముగ్గురికి గాయాలు కాళేశ్వరం: బైక్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన మహదేవపూర్ మండలపరిధిలోని కొత్త బ్రాహ్మణపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సూరారం గ్రామానికి చెందిన చెన్నూరి కార్తీక్ ఆజంనగర్కు చెందిన తన స్నేహితులు కిరణ్, మహేష్లతో కలిసి ద్విచక్ర వాహనంపై సూరారం నుంచి మహదేవపూర్కు వస్తున్నారు. కొత్త బ్రాహ్మణపల్లి క్రాస్ వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో బైక్పై వెచ్తిన్న చెన్నూరి కార్తీక్ చెవు, ముక్కు భాగంలో తీవ్ర గాయాలు, కిరణ్, మహేష్లకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించారు. -
రెస్క్యూ.. సెవెన్ అవర్స్!
కాళేశ్వరం: సమీప బంధువు వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను ఏడు గంటల పాటు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్లో వివిధ బృందాల గాలింపుతో పోలీసులు త్వరగా కనుగొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోవివాహ వేడుకలు ముగిసిన తర్వాత సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ చూద్దామని సరదాగా శనివారం సాయంత్రం ఆరు గంటలకు సొంత ఆటోలో పట్టి వెంకట్స్వామి అతడి ఇద్దరు కుమారులు, మరో ఐదుగురితో కలిసి వెళ్లారు. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ అప్స్ట్రీమ్ మూడో బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రాంతంలో ఈతకు దిగిన ఏడుగురిలో ఆరుగురు గల్లంతయ్యారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. కవలల్లో ఒకరు మృతి అంబట్పల్లికి చెందిన సమ్మయ్యకు కుమారుడు కర్ణాల సాగర్(16), స్రవంతి కవలలు. వారిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. సాగర్ మృతి చెందడంతో సోదరి కన్నీటి ధారలతో వీడ్కోలు పలికింది. వారిదీ కూలీ కుటుంబమే. కొడుకు మరణంతో.. మల్హర్ మండలం మల్లారానికి చెందిన తొగరి రాజయ్య–సాంబ దంపతుల కుమారుడు తొగరి రక్షిత్(13) 9వ తరగతి చదువుతున్నాడు. వారు అంబట్పల్లిలోనే నివాసం ఉంటున్నారు. కూలీ పని చేస్తూ జీవించే వీరికి కుమార్తె కూడా ఉంది. రక్షిత్ మృత్యువాత పడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి సాంబ రోదనలు మిన్నంటాయి. కొడుకు మృతితో.. మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల వెంకటయ్య–స్వర్ణ దంపతుల పెద్ద కుమారుడు రామ్చరణ్(17) డిగ్రీ చదువుతున్నాడు. వీరు వ్యవసాయ కూలీలు.. వారికి చిన్న కుమారుడు ఉన్నాడు. రామ్చరణ్ మృతిచెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం అలుముకుంది. అన్నా.. అంటూ నీటిలోకి.. పట్టి వెంకట్స్వామి చిన్న కుమారుడు శివమనోజ్ నీటిలోకి దిగి అన్నా..అన్నా అని పిలుస్తూ లోతుకు జారుకుంటున్నాడు. ఆక్రమంలో ఒడ్డున ఉన్న అన్న మధుసూదన్ తమ్ముడిని పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నం చేసి అతడు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పట్టి మధుసూదన్ను కాపాడే ప్రయత్నంలో పట్టి శివమణి(18) కూడా నీటిలోకి దిగి చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డాడు. సెల్ఫీలతోనే.. ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగారు. ఆ క్రమంలోనే జారి లోతు ప్రవాహంలో పడినట్లు తెలిసింది. దీంతో ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు అంతా గల్లంతై మృత్యువాత పడ్డారని తెలిసింది. ముమ్మర గాలింపు.. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5 నుంచి 12 గంటల వరకు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భూపాలపల్లి ఏఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి, డీడీఆర్ఎఫ్, ఫైర్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఆరుగురి మృతదేహాలు వెలికి తీశారు. అంబులెన్స్ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా ఆర్తనాదాలతో మార్మోగింది. రాత్రి ఫలించని రెస్క్యూ ఆపరేషన్.. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఘటన జరగడంతో హుటాహుటిన కదిలిన అధికారులు లైటింగ్ ఏర్పాటు చేసి కొంతమేర లోతుకు వెళ్లి పరిశీలించి రాత్రి 11.50గంటలకు వరకు వేచి చూసి నిలిపి వేశారు. శనివారం గోదావరి ప్రవాహం 5,100 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 4,500 క్యూసెక్కులకు తగ్గింది. రూ.10లక్షలు పరిహారం చెల్లించాలి : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి వదిలేశారని, నీటిని నిల్వ చేసి కాపలా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. ఆరుగురు మృతి ఘటనకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబే కారణమని ఆరోపించారు. 7 గంటల్లో ఇలా.. ఆదివారం ఉదయం 5గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. మొదట 5.41 గంటలకు తొగరి రక్షిత్, 6.50 గంటలకు పసుల రాహుల్, 9.45 గంటలకు కర్ణాల సాగర్, 10.07 గంటలకు మధుసూదన్, 11.16 గంటలకు రామ్చరణ్, 11.45 గంటలకు శివమనోజ్ మృతదేహాలను వెలికితీశారు. ఏఎస్పీ నరేశ్కుమార్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సైలు పవన్కుమార్ పర్యవేక్షించారు. మృతదేహాలను అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పరిశీలించారు. ఆయన వెంట డీటీ కృష్ణ, ఆర్ఐ జగన్మోహన్రెడ్డి, ఇరిగేషన్ డీఈ సురేశ్ ఉన్నారు. అన్నీ కూలీ కుటుంబాలే.. అంబట్పల్లికి చెందిన పట్టి వెంకట్స్వామి–యశోద దంపతులకు ఇద్దరు కుమారులు పట్టి మధుసూదన్(18) డిగ్రీ, చిన్నకుమారుడు పట్టి శివమనోజ్(15) (పదో తరగతి పూర్తి), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆటో నడుపుతూ.. వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాడు. ఇద్దరు కుమారులు కళ్ల ముందే నీటిలో మునిగి కొట్టుకుపోతుండగా రక్షించే ప్రయత్నం చేసినా ఫలించకపోవడంతో ఇద్దరు మృతిచెందారు. పిల్లల చెప్పులు, బెల్టులు పట్టుకొని తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం తెల్లవారుజామున 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపు మృతులందరివీ సాధారణ కూలీ కుటుంబాలే తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లిన బ్యారేజీ పరిసర ప్రాంతాలు ప్రాణాలు తీసిన ఈత సరదా.. సెల్ఫీలపై ఆసక్తి!వివాహ వేడుకలకు వచ్చి.. మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల శ్రీనివాస్–లక్ష్మీ దంపతుల చిన్న కుమారుడు రాహుల్(19) డిగ్రీ చదువుతున్నాడు. వివాహ వేడుకలకు వచ్చి రాహుల్ మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. వారు కూడా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
చేపలకు భలే డిమాండ్..
ములుగులో చేపలు కొనుగోలు చేస్తున్న ప్రజలు మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు తినడం ఆనవాయితీ వస్తున్న ఆచారం. దీంతో ఆదివారం మృగశిర కార్తె ప్రారంభం అవుతుండడంతో చేపలకు భలే డిమాండ్ ఉంది. ములుగు జిల్లా కేంద్రంలో, ఏటూరునాగారం, వెంకటాపురం(కె), వాజేడు మండల కేంద్రాల్లో చేపలు విక్రయించే వ్యాపారులు రకరకాల చేపలను తీసుకొచ్చారు. వీటిని కొనుగోలు చేసేందుకు జనం పోటీ పడ్డారు. ఆయా ప్రాంతాల్లో గిరాకీని బట్టి కిలో చేపలకు రూ.200ల నుంచి రూ.300ల వరకు విక్రయించారు. గోదావరిలో కూడా మత్స్యకారులు చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. అలాగే ఏటూరునాగారం మండల కేంద్రంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు రైతులు పంట పొలాల్లో కూడా పంటలు బాగా పండాలని, వర్షాలు సంమృద్ధిగా కురవాలని భూతల్లికి పూజలు చేశారు. – ములుగు రూరల్/ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఉదయాన్నే బస్సులు, కార్లు, ఆటోలు ఇతర వాహనాల్లో గుట్టపైకి చేరుకున్నారు. దీంతో దైత అమ్మవారు(వనదేవత), ఆలయ ప్రాంగణం, కల్యాణ మండపంతో పాటు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు హేమాచలకొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు పూజారులు పవన్కుమార్, శేఖర్శర్మ స్వయంభు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
జియోటెక్స్టైల్ క్లాత్ ఆపేనా!
గోదావరి కరకట్ట కోతకు గురికాకుండా తాత్కాలిక మరమ్మతులుఏటూరునాగారం: గోదావరి కరకట్ట కోతకు గురికాకుండా జియోటెక్స్టైల్క్లాత్తో చేస్తున్న మరమ్మతులు ఆపేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని గోదా వరి కరకట్టకు తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. నాలుగేళ్లక్రితం వచ్చిన గోదావరి వరదకు కరకట్ట రామన్నగూడెం పుష్కరఘాట్కు 4.4 కిలోమీటర్ల పాయింట్ వద్ద ఒడ్డు కోతకు గురైంది. దీంతో అక్కడ ప్రమాదకరంగా మారింది. అయితే ప్రతీ ఏడాది కరకట్టకు ఇసుక బస్తాలను వేస్తూ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఇసుక బస్తాలతో పాటు నూతన సాంకేతికంగా జియోటెక్స్టైల్ (క్లాత్)ను ఇసుక బస్తాలపై నుంచి కప్పుతున్నారు. వరద ఎంత వచ్చినా ఈ ఇసుక బస్తాలు కొట్టుకుపోకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇది పూర్తిగా కరకట్టను సంరక్షించే పద్ధతులు కావని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రస్తుతం ఈ వర్షాకాలంలో వరద మరింత పెరిగితే గోదావరి కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ఇసుక బస్తాలను కరకట్టకు అడ్డుగా వేశారు. అస్సాం గుత్తేదారులతో ఇసుక బస్తాలు వేయించిన చోట జియోటెక్స్టైల్క్లాత్ను ఇసుక బస్తాలపై అమర్చే పనులు చేపట్టారు. ఈ వర్షాకాలంలో వచ్చే వరదలకు ఇసుక బస్తాలు కొట్టుకపోకుండా ఈ జియోటెక్స్టైల్ క్లాత్ కాపాడుతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కానీ ఈ వర్షాకాలం పూర్తి అయ్యే వరకు మాత్రం ఏటూరునాగారం, రొయ్యూర్, శంకరాజుపల్లి, రామన్నగూడెం తదితర ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలస్యం అవుతున్న జియోట్యూబ్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్న ఇసుక బస్తాలపై క్లాత్ ఏర్పాటు -
సర్కారు బడి రమ్మంటోంది..
వెంకటాపురం(ఎం): సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరింతగా చర్యలు చేపడుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా నిర్వహిస్తుండడంతో సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ అధికారులు కృషిచేస్తున్నారు. బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం ఈనెల 19వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంది. ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించడమే కాకుండా బడీడు పిల్లలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా ఉపాధ్యాయులు బడిబాట ర్యాలీలు, ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 1,754మంది బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. ఈసారి విద్యార్థుల సంఖ్య మరింతగా పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 27,514 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ పాఠశాల పునప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 27,514మంది విద్యార్థులకు 1,61,130 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా 1,49,070 పాఠ్య పుస్తకాలు జిల్లాకేంద్రానికి చేరుకున్నాయి. జిల్లా కేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను ఎంఆర్సీల ద్వారా ఆయా పాఠశాలలకు సరఫరా చేశారు. మరో 12,060 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. పాఠశాల ప్రారంభం రోజున పుస్తకాలతో పాటు యునిఫాంలు, నోట్ పుస్తకాలు కూడా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12న పాఠ్యపుస్తకాలు అందజేస్తాం.. జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేస్తాం. ఇప్పటికే ఎమ్మార్సీల ద్వారా ఆయా పాఠశాలలకు కావాల్సిన పుస్తకాలను సరఫరా చేశాం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రారంభమైన మొదటిరోజే విద్యార్థులకు పుస్తకాలు పంపీణీ చేయాలని సూచించాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసే నోట్ పుస్తకాలు కూడ ఎమ్మార్సీల ద్వారా పాఠశాలలకు సరఫరా చేశాం. – అప్పని జయదేవ్, జిల్లా మేనేజర్ పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం పాఠశాల తొలిరోజే పాఠ్యపుస్తకాల పంపిణీకి చర్యలు జిల్లాలో 510 పాఠశాలల్లో 27,514మంది విద్యార్థులు -
టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలి
ములుగు రూరల్: జిల్లాలోని రామప్ప, బొగత, మల్లూరు పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచరామాలు వెళ్లేందుకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసిందని వరంగల్ –2 డిపో మేనేజర్ జ్యోత్స్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామప్ప, బొగత, మల్లూరు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.530, పంచరామాలు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.2300 చార్జి తీసుకుంటున్నామని అన్నారు. పూర్తి వివరాల కోసం 99592 26048, 90634 52131, 93465 54351 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు. దరఖాస్తు చేసుకోండి వాజేడు: ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కోర్సులలో చేరడం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వాజేడు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి గాను 10వ తరగతి పాసైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ చేసే సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 21వరకు గడువు ఉందని ఆ లోగా తప్పనిసరిగా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. మౌలిక వసతులు కల్పించాలి ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను అందించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పారు. జిల్లాకేంద్రంలో గిరిజన యూనివర్సిటీకి భూములు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి గిరిజన యూనివర్సిటీ పనులను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్, దిలీప్, రాజ్కుమార్, వేణు, శరత్, నవీన్, రమేష్, ప్రవీణ్ పాల్గొన్నారు. రేపటినుంచి లోక్ అదాలత్ భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా కోర్టు ఆవరణలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సీఐ నరేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో వివిధ కారణాలతో కేసుల పాలైన వారు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇరువర్గాలు హాజరై సంబంధిత కేసులను తొలగించుకోవాలని సూచించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి కన్నాయిగూడెం: మండలంలో బాండ్ పేరుతో రైతులను మోసం చేసిన మొక్కజొన్న కంపెనీలు రైతుల అకౌంట్లలో తక్షణమే డబ్బులు జమ చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు కావిరి నాగయ్య అధ్యక్షతన శనివారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకట్రెడ్డి హాజరై మాట్లాడారు. సోమవారం వరకు డబ్బులు జమ చేయకుంటే రైతులను సమీకరించి ఆందోళన చేస్తామన్నారు. నకిలీ విత్తనా ల క్రయ విక్రయాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తోకల రవి, సురేష్, పాషా, రామారావు, లక్ష్మిపతి, మధు, రవీందర్, పాపారావు, రాజబాబు, రఘుపతి, శ్రీను, మహేష్ పాల్గొన్నారు. గీత కార్మికుడికి తీవ్రగాయాలు చిట్యాల: మండలంలోని జడల్పేట గ్రామానికి చెందిన బయగాని సమ్మయ్య వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి తలకు తీవ్రంగా గాయమైంది. తోటి కార్మికులు 108లో వరంగల్కు తరలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
విస్త్తృత తనిఖీలు చేపడతాం..
విద్యాసంస్థల ప్రారంభంలోగా.. బస్సులన్నింటికీ సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే విస్తృత తనిఖీలు చేపట్టడం ద్వారా పట్టుబడిన వాహనాలు సీజ్ చేస్తాం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తాం. పరీక్షలకు రాని బస్సులకు సంబంధించి యజమానులకు నోటీసులు పంపిస్తాం. అనుభవం ఉన్న డ్రైవర్ల నియామకం చేయాలి. పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – పురుషోత్తం, ఇన్చార్జ్ డీటీసీ, హనుమకొండ -
బడి బస్.. ఫిట్లెస్!
మొత్తం బస్సులు ఫిట్నెస్ చేసుకున్నవి చేయించుకోవాల్సినవిజనగామ భూపాలపల్లి 103 54 49130 58 72ఇవీ నిబంధనలు.. ● 15 ఏళ్లు నిండిన వాహనాలను స్టూడెంట్స్ రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లో ఉండాలి. ● విద్యా సంస్థ పేరు, సెల్ఫోన్ నంబరు, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. ● ప్రతీ విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. ● డ్రైవర్ షుగర్, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. ● బస్సులో ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. బస్సుకు సంబంధించి వైపర్స్, విండ్ స్క్రీన్, పార్కింగ్ లైట్స్, లైటింగ్ ఉండాలి. ● ప్రతి బస్సులో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. డ్రైవర్కు విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించేలా అద్దాలు అమర్చుకోవాలి. ● ప్రతి బస్సులో అటెండర్ ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ పట్టిక కూడా ఉండాలి. బస్సులో స్టూడెంట్స్ బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. ● కిటికీలకు మధ్యలో లోహపు కడ్డీలు కచ్చితంగా ఉండాలి. ● ఫుట్బోర్డ్పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించకుండా చూడాలి. అన్ని మెట్లు జారకుండా లోహంతో నిర్మించాలి. ములుగు హనుమకొండ95 46 49920 485 435(917 బస్సుల్లో 225 బస్సులను వివిధ కారణాలతో తిరస్కరించారు)వరంగల్ మహబూబాబాద్222 48 134350 172 178ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తికాని బడి బస్సుల పరీక్షలు‘పిల్లలున్నారు జాగ్రత్త’ అని బడి బస్సుల వెనకాల రాసి ఉంటుంది. కానీ.. చాలా బస్సుల నిర్వాహకులు మాత్రం.. ఆ విషయాన్నే మరిచిపోతున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో అవేమీ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్బడి గంట మోగే సమయం ఆసన్నమవుతోంది.. ఇప్పటికే అడ్మిషన్ల బిజీలో ఉన్న పాఠశాలలు బడి బస్సుల భద్రతపై దృష్టి సారించడం లేదు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిట్నెస్ పరీక్షలకు వందలాది బస్సులు దూరంగా ఉండడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,820 పాఠశాలల, కాలేజీల బస్సులు ఉన్నా.. ఇప్పటివరకు 863 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు పొందాయి. పదిహేనేళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్నా.. వివిధ కారణాల చేత 225 బస్సులను అధికారులు ఫిట్నెస్ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 692 బస్సులకు ఆన్లైన్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా బస్సులు వచ్చి సాధ్యమైనంత త్వరగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు కోరుతున్నారు. ఫిట్నెస్ పరీక్షల్లో పాసైతే విద్యార్థుల భద్రతకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. ‘యాబై రోజులకుపైగా మూసి ఉన్న విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లూ విద్యార్థులను తరలించే బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటి సామర్థ్య పరీక్షల గడువు కూడా మే 15కే ముగిసింది. ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని బడి బస్సులు వచ్చి త్వరగా చేసుకోవాలి’ అని వరంగల్ ఆర్టీఓ శోభన్బాబు కోరారు. ఇలా చేస్తే మంచిది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అధికారులు అప్రమత్తమవుతున్నారని.. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి బస్సు ఫిట్నెస్ పకడ్బందీగా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులుంటాయి. ఒకటి రెండు బస్సులను చూసే ఫిట్నెస్ అయ్యిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్ చేస్తూ ఉండాలి. ఏవైనా లోపాలు ఉంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్ చేయాలి’ అని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. 1,820కి ఇప్పటివరకు పూర్తి చేసుకుంది 887 పరీక్షలు చేసుకోవాల్సింది 917.. ఫిట్నెస్ తనిఖీలకు రాని వందల బస్సులు ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభంతో చర్చ స్పెషల్ డ్రైవ్లకు సిద్ధమవుతున్న ఆర్టీఏ అధికారులు -
నదీతీరం..శోకసంద్రం
మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విషయం తెలియక మోకాల్లోతు నీటిలో ఆడుకుంటుండగా ఒకరు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లిపోతుండగా అతన్ని కాపాడబోయి మరొకరు.. ఇతన్ని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ ఎగువ భాగంలో మూడవ బ్లాక్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాధం అలుముకుంది. అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు.. సాయంత్రం 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థానికులు, పోలీసులకు సమాచారం అందింది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమైంది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ఆపద మిత్ర గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. కాగా రాత్రివేళ కావడం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాలేదు. రాత్రి 11.50 గంటలకు గాలింపు చర్యలు ఆపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. కాగా కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి గోదావరిలోకి దిగి నది ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ఐదు కుటుంబాల్లో విషాదం... పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది. బిడ్డల కోసం ఎదురుచూస్తూ... గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపివేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండటం స్థానికులను కలచివేసింది. అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే.. ఈతకు వెళ్లిన వారిలో అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి. నేనూ సచ్చిపోయేవాడినే: పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి) స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తరువాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేనే భయపడి ఒడ్డుకు చేరుకున్నా. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.50 వరకు సాగిన గాలింపు చర్యలు.. లభించని ఆచూకీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో విషాదంగల్లంతైన వారు.. అంబట్పల్లి వాసులు: పట్టి మధుసూదన్(18), పట్టి శివమనోజ్(15), తొగరి రక్షిత్(13), కర్ణాల సాగర్(16) మహాముత్తారం మండలం కొర్లకుంట వాసి: బొల్లెడ్ల రాంచరణ్(17), స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల రాహుల్(19) -
గాలివాన బీభత్సం
ఏటూరునాగారం : మండలంలోని ఎలిశెట్టిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ వైర్లు తెగిపడగా, ఇంటి కప్పులు, రేకులు ఎగిరిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. కొన్ని చోట్ల మామిడికాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో జంపన్నవాగు నుంచి ఈదుకుంటూ పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో పడవలను నడుపుతున్నారని వాపోయారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి ● జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని గోవిందరావుపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని అన్నారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో క్లీనింగ్, హైజీన్ అండ్ సానిటేషన్ వన్ డే వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా విద్యా శాఖ అధికారి జి.పాణిని, జీసీడీఓ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాణిని మాట్లాడుతూ పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 9 మండలాల కేజీబీవీ, టీఎస్ఎంఎస్ గర్ల్స్ హాస్టల్స్, టీఎస్ఆర్ఈఐఎస్ బండారుపల్లికి చెందిన స్కావెంజర్స్, ఏఎన్ఎంఎస్లు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలి
ములుగు రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా, మండల స్థాయి పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్రావు మాట్లాడుతూ వికసిత్ భారత్ సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం, దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పరిపాలనను ప్రపంచదేశాలు హర్షిస్తున్నాయని వివరించారు. దేశ ఆర్థిక, రక్షణ, విద్యా, వైద్యం, పారిశ్రామిక పురోగతి మేక్ ఇన్ ఇండియా వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, నరేష్, స్వరూప, రామరాజు, సునీల్, కృష్ణాకర్, యాదగిరి, వాసుదేవరెడ్డి, రవిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ములుగు మున్సిపల్ కమిషనర్ సంపత్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సన్మానించి, మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు మోహన్రావు -
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్/వాజేడు : ములుగు మండలంలోని ఇంచర్లలో గల తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీలో అడ్మిషన్లకు విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 83339 25356, 89194 36509 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాజేడు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కశాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్లో 38, బైపీసీ ప్రథమ సంవత్సరంలో 27 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాని కోరారు. తొందరపడి విత్తనాలు నాటొద్దు ములుగు రూరల్ : సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాతనే రైతులు విత్తనాలు నాటుకోవాలని, తొందరపడి విత్తుకోని నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారనే సమాచారం వచ్చిందని, దాదాపు 65నుంచి 75 మిల్లిమీటర్ల వర్షం కురిసిన తర్వాత మాత్రమే విత్తనాలు నాటుకోవాలని సూచించారు.పుష్కర పనులు పూర్తి చేయాలికాళేశ్వరం: గత నెల 15 నుంచి 26వ తేదీ వరకు కాళేశ్వరంలో జరిగిన సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా పుష్కరాల సమయంలో సమయాభావంతో కొ న్ని పనులు నిలిచిపోయాయి. వాటిని రెండు రోజుల్లో ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు ఈఓ మహేష్ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆయన సంబంధిత కాంట్రాక్టర్లకు రెండు రోజుల్లో నిలిచిన పనులు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, వీఐపీ ఘాటు పుష్కరఘాటు, సరస్వతీ అమ్మవారి విగ్రహంపై స్లాబు, అక్కడి తోరణాలు, ప్రసాద కౌంటర్, కల్యాణకట్ట, మరుగుదొడ్ల నిర్మాణాలు, మెయిన్ఘాటు తోరణం పనులు నిలిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతో తహసీల్దార్ మృతి హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రె శ్రీపాల్రెడ్డి (47) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై ‘కుడా’లో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సాయంతోనే విధులు నిర్వహిస్తు రెవెన్యూ సదస్సుల్లోనూ పాల్గొంటున్నారు. సహచర ఉద్యోగులు, అధికారుల్లో ఆయనకు మంచిపేరు, గుర్తింపు ఉన్నాయి. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసి పలువురు హనుమకొండ రాంనగర్లోని ఆ యన ఇంటికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. శ్రీ పాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
ములుగు రూరల్: జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా విజయవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అటవీశాఖ అధి కారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్రావుతో కలిసి అటవీ, డీఆర్డీఓ, నీటిపారుదల, వ్యవసాయం, హార్టికల్చర్, విద్యాశాఖ, మున్సిపల్, పట్టణ అభివృద్ధి అధికారులు, పోలీసులు, పశుసంవర్ధక, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువు, సమతుల్య వాతావరణం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రైతులు పొలం గట్లపై మొక్కలు పెంచుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సగం సగమే..
అసంపూర్తిగా ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులుఈ ఫొటో ఏటూరునాగారం మండలంలోని మానసపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలది. ఇందులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. నలుగురు ఉపాధ్యాయులు, 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు తరగతి గదులు ఉండాల్సి ఉండగా మూడు గదులే ఉండడంతో ఒకటి ఆఫీస్ రూమ్, మరో రెండు గదుల్లో ఐదు తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. సౌకర్యాల లేమి కారణంగా విద్యార్థులు పాఠశాలలో చేరడం లేదని వాపోతున్నారు. శిథిలమైన ప్రహరీ ఎప్పుడు కూలిపోతుందోన ని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ప్రారంభించి అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర మరమ్మతులకు నిధులు కేటాయించి పనులను ప్రారంభించింది. ఈ విద్యాసంవత్సరానికి విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ పాఠశాలలను పునఃప్రారంభించాల్సి ఉంది. గత సంవత్సరంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను ప్రారంభించినా.. ఇంత వరకు ఆయా పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మరో ఐదు రోజులైతే పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యం జిల్లాలో పలు పాఠశాలలను శుక్రవారం ‘సాక్షి’ పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసంపూర్తిగా పనులు.. మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు పనులను ప్రారంభించారు. నిధుల కొరత కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో గతంలో నిలిచిన పనులను పూర్తి చేయకుండా నూతన పనులు మొదలుపెట్టారు. అవికూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఏటూరునాగారం జెడ్పీఎస్ఎస్లో మరుగుదొడ్లు, మూత్రశాలల వద్ద పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉంది. జిల్లాలో 318 పాఠశాలల్లో పనులు.. జిల్లాలోని 318 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ.120 కోట్లతో పనులను చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు 226, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ 13, 79 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో పనులు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో 90శాతం వరకు పనులు పూర్తి అయినప్పటికీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. జిల్లాలో 318 సూళ్లకు రూ.120 కోట్లు కేటాయింపు పలు పాఠశాలల్లో ప్రారంభం కాని మరుగుదొడ్ల నిర్మాణాలు మరో ఐదు రోజుల్లో బడులు పునఃప్రారంభం -
వాతావరణం
జిల్లాలో ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వడగాలులు వీస్తాయి. సాయంత్రం ఉక్కపోతగా ఉంటుంది.బాలింతల పాట్లు● ప్రభుత్వ ఆస్పత్రిలో సొంతంగా ఫ్యాన్లు ఏర్పాటు ● అసహనం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు ఫ్యాన్లు లేక నానా పాట్లు పడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం రోగులు ఇచ్చిన సమాచారం మేరకు ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్కు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా నిధులు లేవని, ఎవరికై న చెప్పుకొండి అంటూ సమాధానం ఇస్తున్నారన్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా ఉందని, కలెక్టర్ స్పందించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుతోట చంద్రమౌళి, వాంకుడోత్ రాందాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనలు ఏటూరునాగారం : తెలంగాణ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి తుల రవి, రాష్ట్ర హ్యాండ్బాల్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ శుక్రవారం ములుగులో అభినందించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి క్రీడా మైదానంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ బాలికల టీం గోల్డ్మెడల్, వరంగల్ బాలుర టీం సిల్వర్ మెడల్ గెలుపొందినట్లు కోచ్ పర్వతాల కుమార్ తెలిపారు. ములుగు జిల్లా హ్యాండ్ బాల్ క్రీడాకారులు జాడి రాధిక గోల్డ్ మెడల్, ఎండీ ఇమ్రాన్, జాడి వాసు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ శాఖ జూనియర్ అసిస్టెంట్ లావణ్య కుమారి, రెజ్లింగ్ కోచ్ సతీష్, సైక్లింగ్ కోచ్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
టీబీ రహిత జిల్లాగా మార్చాలి
● జిల్లా వైద్యాధికారి గోపాల్రావు ములుగు రూరల్ : ములుగును టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో 100 రోజుల అవగాహన కార్యక్రమాల ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మొదట టీబీ బాధితులు, మద్యపానానికి గురైన వ్యక్తులు, మధుమేహం కలిగినవారు, హెచ్ఐవీతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించాలన్నారు. ప్రతీఒక్కరికి తెమడ పరీక్షల నిర్వహణకు గ్రామాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. నడవలేని వారి వివరాలను సేకరించి 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి ఎక్స్రేలు, సిబినాట్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని అన్నారు. టీబీ మిత్రను భాగస్వాములను చేసి న్యూట్రిషియన్ కిట్లు, ఆర్థికసాయం అందించాలని తెలిపారు. టీబీపై ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య, ఆశ కార్యకర్తలు సమన్వయంతో పోషకాహారలోపం ఉన్న వ్యక్తులు గుర్తించి తెమడ పరీక్షలు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, టీబీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సమ్మయ్య, చంద్రమౌళి, రాజు ల్యాబ్ టెక్రిషియన్, ప్రోగ్రాం సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
గోవిందరావుపేట : జిల్లాలో ఇటీవల అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం పస్రాలో సీపీఎం కార్యకర్తల జిల్లా సమావేశం రత్నం రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రవికుమార్ హాజరై మాట్లాడారు. గల ఏప్రిల్, మే నెలలో కురిసిన వర్షాలతో 2,933 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా పరిహారం కింద రూ.5.72 కోట్లు జిల్లాకు విడుదల చేశారని వివరించారు. ఏజెన్సీలో రైతులకు పట్టాలు లేవని, కాస్తులో ఉన్న రైతులకు సైతం బ్యాంకు ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేయాలని కోరారు. ఇప్పటికై నా పరిహారం చెల్లించని క్రమంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాసిరకం విత్తనాల అమ్మకాలపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. నాయకులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, తుమ్మల వెంకట్రెడ్డి, ఎండీ దావూద్, చిట్టిబాబు, రఘుపతిరావు, ఆదిరెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్ -
ఆయిల్ ఫ్యాక్టరీకి భూ కేటాయింపు హర్షణీయం
ములుగు రూరల్ : జిల్లాలోని ఇంచర్ల గ్రామశివారులో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం 12ఎకరాల భూమిని కేటాయించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు చాంద్పాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మల్లంపల్లి మండలం, ములుగు, ఏటూరునాగరంలో బస్టాండ్, బస్ డిపోల ఏర్పాటు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వెంకన్న, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మర్రి రాజు యాదవ్, వంగ రవియాదవ్, ఓంప్రకాశ్, చిక్కుల రాములు, నల్లెల్ల భరత్కుమార్, మామిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ -
ఉద్యానవన పంటల సాగుతో అధిక దిగుబడి
ములుగు రూరల్ : ఉద్యానవన పంటల సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని ఉద్యానవనశాఖ జిల్లా అధికారి సంజీవరావు సూచించారు. శుక్రవారం మండలంలోని అంకన్నగూడెం గ్రామంలో రైతులకు అందజేస్తున్న వివిధ రాయితీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇందిర సౌర గిరి జల వికాస్ పథకం ద్వారా ఆయిల్పామ్, పండ్ల తోటలు, పూలసాగుపై రాయితీ లభిస్తోందని వివరించారు. ఎంఐడీహెచ్ పథకం ద్వారా పండ్లు, కూరగాయల సాగులో 50శాతం రాయితీ, మల్చింగ్, పందిరి కూరగాయల సాగుకు రాయితీ వర్తిస్తోందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుచేసే రైతులు రూ.20 చెల్లిస్తే మొక్కలు అందజేస్తామని, అంతర పంట సాగుకు రూ.4,200లు యజమానికి అందిస్తుందని అన్నారు. 5ఎకరాల లోపు ఉన్న రైతులకు 90శాతం రాయితీ, అంతకుపైన ఉన్న రైతులకు 80శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 100శాతం రాయితీ బిందు సేద్యానికి అందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యానవనశాఖ అధికారి శ్రీకాంత్, విస్తరణ అధికారి రమేష్, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు హేమంత్రెడ్డి, నవీన్ నాయక్, జగదీశ్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు దేవేందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.జిల్లా అధికారి సంజీవరావు -
తొంబై శాతం పనులు పూర్తి చేశాం..
జిల్లాలో 226 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా పనులు చేపట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తరగతి గదులు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్ పనులు చేపట్టాం. ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తుంది. జిల్లాలో 1,600 మంది ఉపాధ్యాయులకు వేసవిలో విద్యాబోధనపై రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి. – పాణిని, జిల్లా విద్యాశాఖ అధికారి -
మల్లంపల్లికి రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు
ఏటూరునాగారం: ములుగు జిల్లా పరిధిలోని మల్లంపల్లి గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని టీపీసీబీలో పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా గురువారం మల్లంపల్లి పంచాయతీ కార్యదర్శి పోలురాజు అవార్డు అందుకున్నారు. మల్లంపల్లిలో తడి, పొడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీలో భాగంగా ఉత్తమ అవార్డు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరలకు పంచాయతీ కార్యదర్శి రాజు కృతజ్ఞతలు తెలిపారు.