Mulugu
-
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు రాజీవ్శర్మ, ఈశ్వర్చంద్ శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
ప్రభుత్వ బడికే
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026ములుగు: వేసవి సెలవుల అనంతరం జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. దీంతో విద్యాలయాలు సందడిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్వానం పలికేలా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అలాగే చెత్తాచెదారం శుభ్రం చేశారు. మరికొన్ని పాఠశాలల్లో వర్షం నీరు నిల్వకుండా ఉండేలా మట్టిపోసి చదును చేశారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, బెంచీలు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన టాయిలెట్లు, డిజిటల్ క్లాసులు, ప్రత్యేక తరగతులు, నాణ్యమైన బోధన, విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. అదే విధంగా ఫలితాల్లో స్థిరమైన పురోగతి, ఆటలాడేందుకు క్రీడామైదానం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యునిఫాంలను ప్రభుత్వం సమకూర్చడంతో సర్కారు బడుల ముఖచిత్రాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో సర్కారు బడుల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతుండగా.. చిన్నారుల తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు మక్కువ చూపుతున్నారు. ప్రైవేట్ నుంచి.. ప్రభుత్వ బడులకు మారుతున్న ట్రెండ్ ఒకప్పుడు సర్కారు బడులంటే చిన్నచూపు ఉండేది. దీంతో ప్రైవేట్ స్కూళ్ల వైపే పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి కనబరిచేవారు. దీంతో మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలు వెలిశాయి. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి చాలావరకు మూతపడ్డాయి. కాని గత కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు డిజిటల్ బోధన కూడా మొదలు కావడంతో పరీక్ష ఫలితాల్లో సైతం సర్కారు పాఠశాలల విద్యార్థులే విజయఢంకా మోగిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే జిల్లాకు ప్రథమ స్థానం రావడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. ప్రైవేట్ పాఠశాలలను విడిచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో మూతపడిన కొన్ని పాఠశాలలను సైతం ఈ విద్యా సంవత్సరం విద్యాశాఖాధికారులు నూతనంగా ప్రారంభించారు. ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి యూపీఎస్ పాఠశాలలో ఏకంగా 12 మంది విద్యార్థుల నుండి 138 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆడ్మిషన్ పొందడం జిల్లాలోనే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే పాఠశాలను ఆదర్శంగా తీసుకొని మిగతా పాఠశాలలను సైతం బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. 374 పాఠశాలలు.. 19,653 మంది విద్యార్థులు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 374 ప్రభుత్వ పాఠశాలల్లో 19,523 మంది విద్యార్థులు బోధనను అభ్యసించనున్నారు. అలాగే 32 ప్రైవేట్ పాఠశాలల్లో 8 వేల మంది మాత్రమే అడ్మిషన్లు పొంది ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ఏటూరునాగారం మండలంలో 256, గోవిందరావుపేటలో 72, కన్నాయిగూడెంలో 126, మల్లంపల్లిలో 55, ములుగులో 163, ఎస్ఎస్ తాడ్వాయిలో 183 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అలాగే వెంకటాపురం(ఎం)లో 91, వెంకటాపురం(కె)లో 103, వాజేడులో 63, మంగపేటలో 162 మంది పిల్లలను నూతనంగా పాఠశాలల్లో చేర్పించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,274 మంది పిల్లలు బడిబాట కార్యక్రమం ద్వారా అడ్మిషన్లు పొందారు. వెంకటాపురం(ఎం) జెడ్పీ ఉన్నత పాఠశాల ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు వాజేడులోని పాఠశాల ఆవరణలో నీరు నిల్వకుండా పోస్తున్న మట్టినేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం జిల్లాలో మారుతున్న విద్యారంగ సమీకరణలు ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ గవర్నమెంట్ స్కూల్స్ వైపే విద్యార్థులు, తల్లిదండ్రుల చూపుసంవత్సరం పాఠశాలలు విద్యార్థులు 2022–23 335 16,850 2023–24 357 18,204 2024–25 352 17,549 2025–26 357 17,749 2026–27 374 19,523 -
ఐటీడీఏ ఏపీఓగా దామోదరస్వామి?
ఏటూరునాగారం: ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్గా టీవీఆర్ దామోదరస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఉట్నూరు ఐటీడీఏలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న దామోదరస్వామికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారానికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈయన గతంలో స్థానిక ఐటీడీఏఓగా పనిచేస్తూ ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న దామోదరస్వామికి ఉద్యోగోన్నతి రావడంతో ఏటూరునాగారంలో ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో మరో రెండు రోజుల్లో ఏటూరునాగారం ఏపీఓగా ఆయన బదిలీపై వచ్చి బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిసింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రవి ములుగు రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన తోకల రవిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 2004 నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సంఘం అభివృద్ధికి పాల్పడ్డాడని తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ఎంజీఎంలో డిప్యుటేషన్పై నర్సింగ్ సిబ్బంది కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్పేషంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఇప్పటికే ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది జాయిన్ కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. అవగాహన కల్పించినా కాల్చేస్తున్నారు మహాముత్తారం: రైతులు పంటలు పండించిన అనంతరం వాటిని పొలంలో కలియ దున్నాలి కానీ కాల్చవద్దని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. కానీ మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు వరికొయ్యలను కాల్చుతూ సారవంతమైన భూమిలోని క్రిమి కీటకాలను చంపేస్తున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వరికొయ్యలను కాల్వడం వలన భూమిలోని క్రిమి కీటకాలు చనిపోవడమే కాకుండా భూమిపొర వేడికి సారవంతాన్ని కోల్పోయి పంటదిగుబడి తగ్గుతుందని ఎవరైనా రైతులు కొయ్యకాళ్లను కాలబెడితే నష్టాన్ని బట్టి 5వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించనున్నట్లు రైతులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ గ్రామాల్లోని రైతులు మాత్రం కొయ్యకాళ్లను తగల బెడుతున్నారు. లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని లాడ్జిల్లో సీసీఎస్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతిథుల రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు, బస చేస్తున్న వ్యక్తుల వివరాలను సీసీఎస్ సీఐ రమేష్ పరిశీలించారు. లాడ్జిలకు వచ్చే ప్రతి అతిథి ఆధార్ వివరాలు, రాకపోకల సమయాలు, ఇతర వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. -
విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యం
విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యం అవుతుంది. చిన్నబోయినపల్లి పాఠశాల 1–8 వరకు ఉందని, దానిని 10 వరకు పెంచితే డ్రాపౌట్స్ లేకుండా నివారించవచ్చు. ఆశయం గ్రంథాలయం పేరుతో అక్కడ 2 వేల పుస్తకాలను యూపీఎస్సీ, గ్రూప్స్, డీఎస్సీ, ఎస్సై, పీసీలకు కావాల్సిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాం. దాంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. పాఠశాలను మ రింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. –దూపాటి సతీశ్, ఆశయ గ్రంథాలయ నిర్వాహకుడు, కానిస్టేబుల్, చిన్నబోయినపల్లి -
క్రీడలతో మానసికోల్లాసం
● సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ములుగు: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆదివారం నిర్వహించిన అస్మితబాలికల సైక్లింగ్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతులు, విద్యార్థినులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి విభాగంలో సంగీత, జూనియర్ విభాగంలో అలువాల సుమనశ్రీ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారు. కాగా వారికి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మెమోంటోలు అందజేయడంతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాదం ప్రవీణ్ మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది క్రీడాకారులు ముందుకొచ్చి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలన్నారు. అనంతరం కోచ్ హుస్సేన్ను బాదం ప్రవీణ్ను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పోరిక అసిలాల్, కోచ్ శ్రీరామ్, క్రీడాకారులు, 108 సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
వెదజల్లుతున్న దుర్వాసన
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం ప్రసాదశాల నుంచి వచ్చే డ్రెయినేజీ పైప్లైన్ జామ్ కావడంతో మురుగు నీరు బయటకు పొంగిపొర్లి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగిన సరస్వతినది అంత్య పుష్కరాల అనంతరం ఈ సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. పుష్కరాలు ముగిసి 14 రోజులుగా మురుగు నీరు బయటకు రోడ్డుమీద పారుతూ దుర్గంధం వెదజల్లుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. స్థానికులకు, సమీపంలోని ఇళ్లకు తీవ్ర దుర్వాసనతో ముక్కుపుటాలు అదిలిపోతున్నట్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు స్థానికులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వెంటనే పరిష్కరించాలని కోరారు. -
‘ప్రైవేట్’కు పంపొద్దని తీర్మానం
ఏటూరునాగారం: మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో చిన్నబోయినపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయదారుల కుటుంబాలు ఉంటాయి. వారి పిల్లలను ఏటూరునాగారం, కమలాపురం, ఇతర ప్రైవేట్ పాఠశాలలకు పంపేవారు. అయితే ప్రభుత్వ బడి ఉన్న తర్వాత ప్రైవేట్ పాఠశాలల కు ఎందుకు పంపాలని గ్రామ సర్పంచ్ నల్లబోయిన నాగార్జున, హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్థానిక గ్రామస్తులు దూపటి సతీశ్లు కలిసి గ్రామాన్ని ఏకం చేశారు. ఇక నుంచి గ్రామంలోని చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపొద్దని గ్రామసభలో ప్రజలంతా గతనెల 31న తీర్మానం చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి, ఎల్కేజీ, యూకేజీ సైతం చిన్నబోయినపల్లి డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తీర్మానించారు. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన గోగుపల్లి, శివాపురం, పెద్ద వెంకటాపురం, షాపెల్లి, హనుమాన్ నగర్ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకు రావడానికి ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి బడికి రావడం, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం వంటి ఏర్పాట్లు కూడా చేశారు. డీఎన్టీ పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయాన్ని కానిస్టేబుల్ సతీశ్, మరికొంత మంది యువకులు కలిసి సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ విషయం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు తెలిసి ఇటీవల సర్పంచ్ నాగార్జున, సతీశ్ను జిల్లా కేంద్రంలో సైతం సన్మానించారు. ఆ గ్రంథాలయం ఏర్పాటు విషయాన్ని కలెక్టర్కు వివరించగా ఆసక్తికనబర్చిన వెంటనే చిన్నబోయినపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో ఉన్న 2 వేల పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వెంటనే జిల్లాలోని ఎంఈఓలు సైతం ఇలాంటి ఆదర్శ గ్రంథాలయాలను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేయాలని అక్కడి నుంచే ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా పాఠశాల హెచ్ఎం కవితతో పాటు మరో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఈ పాఠశాలకు కేటాయించడం విశేషం. ఒకే రోజు 138 మందికి అడ్మిషన్లు చిన్నబోయినపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్కు వేరే గ్రామాలకు వెళ్లకుండా కలెక్టర్, ప్రభుత్వంతో మాట్లాడి అదే గ్రామంలోనే ప్రీప్రైమరీ స్కూల్ను గ్రామస్తులు మంజూరు చేయించుకున్నారు. ఈ క్రమంలో 138 మంది విద్యార్థులు మే 31న ఒకే రోజు పాఠశాలలో నూతనంగా అడ్మిషన్లను పొందారు. ఇలా వారం తరబడి అడ్మిషన్ల కోసం తిరిగిన ఉపాధ్యాయులకు సాధ్యం కానిది.. ఒకే రోజు గ్రామస్తులంతా కలిసి చేశారు. ఒకేరోజు 138 మంది డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలలో ఆడ్మిషన్లు పొందడంతో రాష్ట్రంలో మొదటి సారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఆ విద్యార్థులకు స్థానిక సర్పంచ్ నాగార్జున సొంత ఖర్చుతో బ్యాగులు, స్టడీ మెటీరియల్ను అందజేశారు. గ్రామసభలో ప్రభుత్వ పాఠశాలకే పెద్దపీట రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన చిన్నబోయిపల్లి పాఠశాల జిల్లా వ్యాప్తంగా ఆదర్శ గ్రంథాలయ ఏర్పాటుకు కలెక్టర్ సూచనలు ఒకే రోజు 138 అడ్మిషన్లు -
విద్యార్థులను బడిలో చేర్పించడమే లక్ష్యం
గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశాం. ప్రతీ విద్యార్థి చిన్నబోయినపల్లి డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవిధంగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాం. ఇందుకు కలెక్టర్ ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ట్రావెలింగ్ అలవెన్సులు రానున్నాయి. సర్కారు బడిని మరింత బలోపేతం చేస్తాం. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని మంత్రి సీతక్క, కలెక్టర్ సహదేవరావుకు విన్నవించాం. వారు కూడా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామన్నారు. – నల్లబోయిన నాగార్జున, చిన్నబోయినపల్లి సర్పంచ్ -
రక్తదానం మరొకరికి ప్రాణదానం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి అర్బన్: రక్తదానంతో మరొకరికి ప్రాణదానం కలుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్న్ఆధ్వర్యంలో ఆదివారం ఐటీ మాస్టర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు రక్తం ప్రాణాధారంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో ఎలాంటి హాని ఉండదని, నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేయడం ద్వారా సమాజానికి విలువైన సేవ చేసినవారిగా నిలుస్తారని తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ రెడ్క్రాస్ కార్యాలయం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వేముల శంకర్తో పాటు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ఐటీ మాస్టర్ సభ్యులు పాల్గొన్నారు. -
అక్కడో నియంత.. ఇక్కడో నియంత
● గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు కష్టపడాలి ● బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావుహన్మకొండ: హైదరాబాద్లో నియంత రేవంత్ ఉంటే.. ఇక్కడో మరో నియంత ఉన్నాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.అక్కడ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ మరోలా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం, ఎస్ఐఆర్పై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హరీశ్రావు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ఇది కీలకమవుతుందని, ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తుంచుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీలా పని చేస్తుందన్నారు. భద్రకాళి దేవస్థానం సమీపంలోని చెరబండరాజు కాలనీవాసులపై అమానుషంగా దాడి చేశారని, దాడిని ఖండించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్యెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సమ్మారావు పాల్గొన్నారు. -
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
● మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ములుగు రూరల్: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల సుపరిపాలనపై పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తొలుత ప్రధాని మోదీ 12 ఏళ్ల పరిపాలనలో దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టాక దేశంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. నేషనల్ హైవేలు, విమానాశ్రయాలు, బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని వెల్లడించారు. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని వివరించారు. అలాగే మోదీ నాల్గోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య జవహర్లాల్, అజ్మీర కృష్ణవేణి, భూక్య రాజునాయక్, కృష్ణాకర్, అల్లె శోభన్, విశ్వనాధ్, రాజ్కుమార్, సునీల్కుమార్, రవిరెడ్డి, యాదగిరి, వెంకటేశ్వర్లు, ఇమ్మడి రాకేశ్ పాల్గొన్నారు. -
‘మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి’
ములుగు రూరల్: ఈ నెల 17వ తేదీన ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పరిపాలన యంత్రాంగం మెగా జాబ్మేళా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు 70 కంపెనీల ప్రతినిధులు హాజరై ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. జాబ్మేళా ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, టెన్త్, ఇంటర్మీడియట్, డిప్లామా, ఐటీఐ, డిగ్రీ చదివిన వారు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు బయోడేటా, పాస్ఫొటోలు, ఆధార్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలని వివరించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8712670103, 8712267011 లలో సంప్రదించాలని సూచించారు. సర్పంచ్లకు తొలి వేతనాలు ● ఐదు నెలల బకాయిలు ఒకేసారి చెల్లించనున్న ప్రభుత్వం ఏటూరునాగారం: సర్పంచులుగా గెలిచిన తర్వాత ప్రభుత్వం మొదటిసారిగా వారి ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో సర్పంచ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 5 నెలల 10 రోజుల కాలానికి సంబంధించిన బకాయిలు ఒకేసారి విడుదల చేయనుండడంతో వారి కష్టాలకు కొంత ఊరటనిచ్చినట్లు అయ్యింది. జిల్లాలో 146 మంది తొలి వేతనాలు అందుకోనున్నారు. అయితే జిల్లాలో 171 పంచాయతీలుండగా అందులో మంగపేట మండలంలోని 25 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. దీంతో మిగతా 146 మందికి నేరుగా వారి వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 6,500ల చొప్పున జమ చేసేందుకు కావాల్సిన ఖాతాలు, ఆధార్, ఇతర పత్రాల వివరాలను ఆన్లైన్ చేశారు. ఖాతాల్లో నేరుగా గౌరవ వేతనం పడనుంది. పోడు భూములకు పట్టాలివ్వాలి వెంకటాపురం(ఎం): పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఏఐకేఎంఎస్ డివిజన్ ప్రథమ మహాసభకు బొమ్మెడ సాంబయ్య అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో 40 సంవత్సరాలకు పైగా పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకోకుండా ఆపేసి సాగుదారులపై అక్రమ కేసులు పెట్టారని పెట్టిందన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పోడుభూములకు పట్టాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి, ములుగు డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొమ్మెడ సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా కుర్రి ఐల య్య, కోశాధికారిగా శ్యామల రమేశ్తో పాటు తొమ్మిది మంది సభ్యులను ఎన్నుకున్నారు. శనిత్రయోదశి.. భక్తులు కిక్కిరిసి.. కాళేశ్వరం: శని త్రయోదశి, మాసశివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నవగ్రహాల వద్ద శని, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలను శనివారం భక్తులు అధికంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో బారులుదీరారు. దీంతో నవగ్రహ, కాలసర్ప పూజలు చేసిన భక్తులు స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నవగ్రహ పూజలు 435, కాలసర్పదోష పూజలు 175, స్వామివారి గర్భగుడిలో అభిషేకాలు 126, ఇతర పూజలు, ప్రసాదాలపై రూ. 4,59,200 ఆదాయం సమకూరిందని ఆలయవర్గాలు తెలిపాయి. దీంతో గోదావరి తీరం, ఆలయంలో భక్తులు కిక్కిరిసారు. -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
‘ప్రీ ప్రైమరీ విద్యను కొనసాగించాలి’
ఏటూరునాగారం: ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. పద్మశ్రీ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్స్లో కె.సరోజన అధ్యక్షతన జిల్లా స్థాయి సెమినార్ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఐసీడీఎస్కు తీవ్ర నష్టం కలిగించే విధంగా ప్రీ ప్రైమరీ విద్యను పాఠశాల విద్యలో కలపటం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4,131 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మంజూరు చేస్తూ సర్క్యూలర్ ఇవ్వడం దారుణమన్నారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్న ప్రీప్రైమరీ విద్యను అలాగే కొనసాగించాలని కోరారు. లేని పక్షంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సెమినార్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు రఘుపతి, వ్యకాస జిల్లా కార్యదర్శి దావూద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, పద్మారాణి, రమాదేవి, పార్వతి, లక్ష్మీ, నర్సమ్మ, సరిత, విజయలక్ష్మి, రత్నకుమారి, భిక్షపతి, భవాని, వనమాల, తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం● అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న యువత కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. హన్మకొండ అర్బన్: భూగర్భ జల శాఖలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఠాకూర్ ధరమ్సింగ్ స్వచ్ఛంద రక్తదానంలో విశేష గుర్తింపు పొందారు. 1988లో మామునూరులో జరిగిన ఎన్సీసీ శిబిరంలో తొలిసారి రక్తదానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 55 సార్లు రక్తం ఇచ్చారు. 50 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా 2024లో జాతీయ అవార్డు, 53వ సారి రక్తదానం చేసిన సందర్భంగా 2025లో న్యూఢిల్లీలో ‘హ్యుమనిటేరియన్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్నారు. -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ, మిరాకిల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. -
తెరుచుకున్న మూత‘బడి’
● పదేళ్ల తర్వాత కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రారంభం ● పది మంది విద్యార్థుల చేరిక ఎస్ఎస్తాడ్వాయి: ఒకప్పుడు విద్యార్థుల సందడితో కళకళలాడిన పాఠశాల.. విద్యార్థుల కొరతతో మూతపడింది. పదేళ్ల తర్వాత తలుపులు తెరుచుకుంది. మండల పరిధిలోని కన్నెపల్లికి చెందిన గ్రామస్తులు తమ పిల్లలను 10 మందిని ప్రభుత్వ పాఠశాలలో శనివారం చేర్పించారు. దీంతో పాఠశాలను జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, సర్పంచ్ కొమరం శైలజ, ఎంఈఓ గడ్డి శ్రీనివాసులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రేగ కల్యాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలే సమాజ ప్రగతికి పునాదులని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ను తమ సొంత ఖర్చులతో అందజేస్తామని కల్యాణి ప్రకటించారు. మంత్రి సీతక్క చొరవతో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామ ప్రజలు, ఉపాధ్యాయుల సహకారంతోనే మూసివేసిన పాఠశాలను మళ్లీ ప్రారంభించడం సాధ్యమైందన్నారు. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సరితను కన్నెపల్లి పాఠశాలకు డిప్యూటేషన్పై నియమించినట్లు తెలిపారు. సర్పంచ్ శైలజ మాట్లాడుతూ పాఠశాలను పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం విద్యాసాగర్, ఉప సర్పంచ్ రంజిత్, ఉపాధ్యాయురాలు సరిత పాల్గొన్నారు. పుష్కరఘాట్ ఏర్పాటుకు స్థల పరిశీలన మంగపేట: మండల కేంద్రంలోని దొంగల ఒర్రె వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పుష్కరఘాట్ నిర్మాణ ప్రదేశాన్ని ఆర్కెటెక్చర్ నవీన్ (డిజైనింగ్ ప్రైవేటు ఏజెన్సీ) బృందం శనివారం పరిశీలించింది. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు మండలంలోని మంగపేట, చుంచుపల్లి రెండు ప్రాంతాల్లో పుష్కరఘాట్లను నూతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రాంతాలను పరిశీలించింది. మండల కేంద్రంలోని దొంగలఒర్రె వద్ద నిర్మాణంలో ఉన్న కరకట్ట వద్ద 62 మీటర్ల మేర పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుత పుష్కరఘాట్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి కింద నుంచి ఒడ్డుపై వరకు 17 మీటర్ల ఎత్తు ఉండటంతో కనీసం 100 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని.. అందుకు మంజూరైన నిధులు సరిపోవని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేధించినట్లు సమాచారం. దీంతో పుష్కరఘాట్ నిర్మాణ ప్రాంతాన్ని పున పరిశీలించేందుకు ఆర్కెటెక్చర్ నవీన్ బృందం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ముందుగా పుష్కరాలను పురస్కరించుకుని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను సైతం ఆర్కెటెక్చర్ బృందం పరిశీలించింది. మంగపేట పుష్కరఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం టైర్ నంబర్ వన్ కింద రూ.8 కోట్లు ఇప్పటికే మంజూరు చేయగా చుంచుపల్లి వద్ద టైర్ నంబర్ 2 కింద మరో పుష్కరఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. -
రాజీమార్గమే రాజమార్గం
గోవిందరావుపేట: కోర్టు గడప ఎక్కిన ప్రతీ కేసు వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కుటుంబాల మధ్య విబేధాలు.. ఆస్తి తగాదాలు.. ఇంకొందరికి ట్రాఫిక్ ఉల్లంఘనలు. ఈ తప్పిదాలన్నీ కేసులుగా మారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత సంవత్సరాల తరబడి కొనసాగుతుంటాయి. ఆ సమయంలో నష్టపోయేది కేవలం డబ్బు మాత్రమే కాదు.. మనశ్శాంతి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రాజీమార్గమే రాజమార్గమని జాతీయ లోక్ అదాలత్లు నిరూపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు కోపం, బాధ, పట్టుదలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాయి. 20న జాతీయ లోక్ అదాలత్ జిల్లాలోని 10 మండలాల పరిధిలో గడిచిన మూడేళ్ల కాలంలో నిర్వహించిన లోక్ అదాలత్లలో మొత్తం 3,562 కేసులు పరిష్కారం అయ్యాయి. అంటే జాతీయ లోక్ అదాలత్లపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. అలాగే కేసుల పరిష్కారానికి న్యాయవ్యవస్థతో పాటు పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కక్షిదారులను చైతన్య పరుస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన జిల్లా కేంద్రంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీకి అనుకూలమైన కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలని న్యాయ, పోలీసు శాఖ అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ కేసులే అధికం.. మూడేళ్ల కాలంలో కేసులను లోతుగా పరిశీలిస్తే ప్రతీ ఏడాది అత్యధికంగా పరిష్కారమవుతున్నవి మోటారు వెహికల్ యాక్ట్ (ఎంవి యాక్ట్) కేసులేనని తెలుస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, వాహన పత్రాల లోపాలు, జరిమానాలకు సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో లోక్ అదాలత్ల ద్వారా ముగుస్తున్నాయి. 2024లో 883 ఎంవీ యాక్ట్ కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగి 978కు చేరింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్ కాకుండా వేగంగా ముగియడం వల్ల పోలీస్ శాఖ, న్యాయ వ్యవస్థతో ప్రజలకి ప్రయోజనం చేకూరుతోంది. సద్వినియోగం చేసుకోవాలి.. లోక్ అదాలత్లు కేసుల పరిష్కారానికే కాదు, మనుషుల మధ్య ఉన్న విబేధాలను తొలగించే వేదికలు. పెండింగ్లో ఉండి రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులు ఈ నెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలి. ములుగు ప్రజలు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కోర్టు వివాదాల నుంచి విముక్తి పొంది ప్రశాంత జీవితం గడపాలి. – సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ లోక్ అదాలత్లతో కోర్టు కేసుల పరిష్కారం మూడేళ్లలో 3,562 పరిష్కారం ఈ నెల 20న ములుగులో జాతీయ లోక్ అదాలత్సంవత్సరం కేసులు 2024 1,545 2025 1,685 2026(మార్చి 28 వరకు) 332 -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు యాకూబ్రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరికీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ములుగు మండలంలోని కోయగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బోయిని రాజయ్య ఇటీవల మరణించగా పీఆర్టీయూ సంక్షేమనిధి నుంచి మృతుని కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును శ్రీపాల్రెడ్డి అందజేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచినందుకు డీఈఓ సిద్ధార్థరెడ్డిని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డితో కలిసి పీఆర్టీయూ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీరంగం, సంఘం నాయకులు దేవులపల్లి సత్యనారాయణ, కె.రమేశ్, కాటం మల్లారెడ్డి, సూర్యనారాయణ, చెరుకుల ధర్మయ్య, ప్రభావతి, పెండ్యాల సలేంద్రం, ప్రమీల, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు అవగాహన
ఏటూరునాగారం: మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పరిధిలోని గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వాసం సాంబశివరావు ఆధ్వర్యంలో రొయ్యూర్, బూటారం గ్రామాల్లో ఉపాధి పనుల వద్దకు కూలీలకు ప్రభు త్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, భోజనం, రెండు జతల దుస్తులు, పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, వయస్సు నిండని వారిని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమన్నారు. గ్రామాల్లోని తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యాలయాలకు పంపించి డబ్బును వృథా చేసుకోవద్దని కోరారు. అనంతరం శంకరాజుపల్లి గ్రామాల్లో కూడా ఇంటింటా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉపాధ్యాయుడు శ్రావణ్ తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, సుమ న్, మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీకి వరప్రదాయని
మూత్రపిండ బాధితుల వివరాలు ‘డయాలసిస్ సెంటర్’ఏటూరునాగారం: మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేసుకునేందుకు గతంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ వరంగల్, మణుగూరు, ఖమ్మం తదితర జిల్లాలకు తరలివెళ్లేది. 2023లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం రూ.40లక్షలతో మూడు డయాలసిస్ యంత్రాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసి ప్రారంభించింది. ఇప్పుడు ఆ డయాలసిస్ సెంటర్ ఏజెన్సీ కిడ్నీ బాధితులకు వరప్రదాయినిగా మారింది. ప్రతీ రోగి వారంలో మూడు మార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటూరునాగారం మండలకేంద్రంలోని సామాజిక ఆస్పత్రి ఆవరణలో రూ.40లక్షలు నిధులు కేటాయించి మూడు మిషన్లతో సెంటర్ను ప్రారంభించారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నడుస్తున్నాయి. ఎలాంటి ఫీజులు చెల్లించకుండా చికిత్స పొందుతున్నారు. మరో రెండు యంత్రాలు అవసరం ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలకు చెందిన మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఏటూరునాగారం డయాలసిస్ సెంటర్ భరోసాగా నిలుస్తుంది. ప్రతీ వ్యాధిగ్రస్తుడు వారానికి మూడు మార్లు డయాలసిస్ చేసుకుంటే వారిలో ఉన్న రక్తం మళ్లీ శుద్ధి చేసి వారికి మళ్లీ ఎక్కించడం జరుగుతుంది. మూత్రపిండాలు పనిచేయకపోవడంతో వారిలో నీటి శాతం పెరిగిపోయి గుండెపోటు వచ్చి మరణించే ప్రమాదాలున్నాయి. అందుకు గాను వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకొని వెళ్తున్నారు. ఒక్కో రోగికి నాలుగు గంటల సమయం పడుతుంది. డయాలసిస్ చేసే సమయంలో మరికొంత మంది అవస్థలు పడుతూ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడంతో మిషన్లు మరో రెండు అవసరం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మూత్రపిండవ్యాధితో బాధపడే వారు ఎక్కువ సమయం వేచిఉండలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మరో రెండు మిషన్లు మంజూరు చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు భరోసాగా నిలుస్తున్న ఏటూరునాగారం డయాలసిస్ సెంటర్ దూరప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చికిత్స మరో రెండు యంత్రాలు అయితే పూర్తిస్థాయిలో సేవలు ప్రభుత్వం దృష్టి సారించాలని బాధితుల వేడుకోలు -
పట్టాల పంపిణీతో శాశ్వత హక్కులు
ములుగు రూరల్: రాంచంద్రాపురం భూములకు పట్టాల పంపిణీ ద్వారా భావితరాలకు శాశ్వత భూ హక్కులు కల్పిస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మల్లంపల్లి మండలం రాంచంద్రాపురం రైతు వేదికలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో మల్లంపల్లి, రాంచంద్రాపురం, గుర్తూర్తండా, భూపాల్నగర్, శివతండా, కొడిశలకుంట, ముద్దునూరుతండా ప్రజల నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాంచంద్రాపురం పరిధిలో 10,600 ఎకరాల భూములకు సంబంధించి 30, 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. రాంచంద్రాపురం గ్రామ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోయగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో శానిటేషన్ డ్రైవ్లో పా ల్గొని పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అమ్మ మాట అంగన్వాడీబాట కార్యక్రమంలో భాగంగా మల్లంపల్లి సెక్టార్ పరిధిలో ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి , తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యువత క్రీడల్లో రాణించాలి యువత క్రీడల్లో రాణించాలని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అస్మిత సైక్లింగ్ పోటీల పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఉపయోగ పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాష్మీనా, అదనపు కలెక్టర్ సంపత్రావు, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి ధనసరి సీతక్క -
ఔషధాల గని.. ‘లక్ష్మణఫలం’
ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధగని ‘లక్ష్మణఫలం’. విటమిన్ సీ, పోటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పండును క్రమం తప్పకుండా తినడం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంతో పాటు కేన్సర్ గుణాలను తగ్గింస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పైగా వీటి ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుందని తెలుస్తుంది. అరుదుగా లభించే లక్ష్మణ ఫలం చెట్టు వాజేడుకు చెందిన వేములవాడ దుర్గ, నాగేశ్వరరావు దంపతులు వారి ఇంట్లో పెంచగా ఇప్పుడు కాయలు కాసింది. ఈ పండ్ల కోసం పలు గ్రామాలు, జిల్లాల నుంచి వీటి ప్రత్యేకత తెలిసిన వారు వస్తున్నారని నాగేశ్వరరావు అంటున్నారు. – వాజేడు -
ఉచితంగా చికిత్స పొందుతున్నాం..
డయాలసిస్ సెంటర్లో ఉచితంగా చికిత్స పొందుతున్నాం. నా భర్త మీరాసాబ్కు వ్యాధిగ్రస్తుడై ఇబ్బంది పడుతున్నాం. వేరే ప్రాంతాలకు వెళ్లలేక ఇక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. ఈ సెంటర్ లేకపోతే నా భర్తకు నయం అయ్యేది కాదు. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. మరో రెండు మిషన్లు తెప్పిస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది. – షాలిమా, పెద్ద వెంకటాపురం మూత్రపిండ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. మొత్తం 26 మంది రోగులు వారానికి మూడు రోజుల చొప్పున రావడంతో సమయం సరిపోవడం లేదు. మరో రెండు మిషన్లు ఈ సెంటర్లోకి అందుబాటులోకి తీసుకొస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది. – బోడ పవన్, డయాలసిస్ సెంటర్ టెక్నిషియన్, -
ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించాలి
ములుగు రూర్: ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించి, పాస్టిక్ రహిత ములుగు లక్ష్య సాధనకు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం, ఆర్గానిక్ వస్తువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారులు 120 మైక్రాన్ కంటే తక్కువ మందం గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వినియోగించొద్దన్నారు. నిబంధనలను ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్ఎంట్ సైంటిస్ట్, మున్సిపల్ కమిషనర్ సంపత్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్, జేఏఓ సుధాకర్ తదితరులు ఉన్నారు. -
హేమాచలక్షేత్రంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహాస్వామిని ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) పింగళి శ్రీపాల్రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు అనిపెద్ది రాజీవ్శర్మ సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి ప్రత్యేకతలు, ఆలయ చరితర వివరించి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు. పిల్లలతో పనులు చేయిస్తే చర్యలుములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు తప్పవని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ మేకల మహేందర్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలతో పనిచేయించడం నేరమన్నారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ బానోత్ స్వామిదాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది సంజీవ, ఎల్సీపీఓ కౌన్సిలర్ సంధ్య, సోషల్ వర్కర్ సుమన్ తదితరులు ఉన్నారు. కాళేశ్వరాలయం హుండీ ఆదాయం రూ.48.25 లక్షలు కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీలను విప్పి నగదు లెక్కించగా రూ.48,25,170 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గ్రంధసిరి సత్యనారాయణ, సీతయ్య, ప్రశాంత్రెడ్డి, శ్రీధర్రావు, పద్మ, శ్యామసుందర్, కాటం సత్తయ్య, దుర్గయ్య పాల్గొన్నారు. 20న జాతీయ లోక్అదాలత్ భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్దఎత్తున కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ సూచించారు. శుక్రవారం పోలీసు అధికారులు, న్యాయవాదులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి లోక్ అదాలత్ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. కేసుల పరిష్కారంలో రాజీమార్గాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, ధనం ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో రాజీద్వారా పరిష్కారం పొందిన వారికి చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి అందజేస్తారని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, అదనపు ఎస్పీ ఎ.నరేష్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. బీఎంఎస్ రాజీలేని పోరాటం భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, బొగ్గు పరిశ్రమల రక్షణ కోసం బీఎంఎస్ రాజీలేని పోరాటాలు చేస్తోందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–8వ గనిలో శుక్రవారం నూతనంగా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా ‘బీఎంఎస్ కార్మిక భరోసా’ పేరుతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధి విషయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. -
పల్స్ పోలియో విజయవంతానికి కృషి చేయాలి
ములుగు రూరల్: పల్స్ పోలియో కార్యక్రమం విజ యవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాలరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధుల నియంత్రణకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. జూన్ 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులు సమన్వయం పరచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధీర్, పోగ్రాం అధికారి శ్రీకాంత్, వైద్యాధికారులు రంజిత్, నాగ అన్వేష్, మాస్ మీడియా అధికారి సంపత్, సాంబయ్య, తదితరులు ఉన్నారు. డీఎంహెచ్ఓ గోపాలరావు -
సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్తో విచారణ జరిపించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో జరుగుతున్న రూ.వేలకోట్ల అవినీతి అక్రమాలపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్తో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో.. సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సింగరేణిలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. తెలంగాణకు సింగరేణి అమూల్యమైన సంపద అని, 137 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. గతంలో లాభాలు, ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సంస్థ ప్రస్తుతం జీతాల చెల్లింపుల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితికి చేరుకుందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో టెండర్ల వ్యవస్థలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి కొందరికి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మైనస్కు వెళ్లిన ఓబీ టెండర్లు ప్రస్తుతం అదనపు ధరలకు కేటాయిస్తున్నారని, దీనివల్ల సింగరేణికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. బొగ్గు నిల్వల్లో భారీ వ్యత్యాసాలు.. బొగ్గు నిల్వల లెక్కల్లో కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, లక్షల టన్నుల బొగ్గు మాయమైనప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రికల్ టన్నుల బొగ్గు లేదని, 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. మూతపడిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ వద్ద 1.81లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్స్ప్లోజివ్స్ కొనుగోళ్లలో మార్కెట్ ధర రూ.37వేలు ఉంటే అధిక ధరలు రూ.44వేలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల నష్టం కలిగించారని ఆరోపించారు. డీజిల్ కొనుగోళ్లను ప్రభుత్వ సంస్థలనుంచి కాకుండా ప్రైవేట్ వ్యవస్థలకు అప్పగించడం ద్వారా అదనపు ఆర్థికభారం మోపుతున్నారని విమర్శించారు. వీటన్నింటిలో నిజాలు తేలాలంటే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు, పెద్ది సుదర్శన్రెడ్డి, నాయకులు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వాసుదేవరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు–2 సందర్శించేందుకు వెళ్లిన హరీశ్రావు, నాయకులను అనుమతి లేదని సింగరేణి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఉన్నతాధికారులను అనుమతి తీసుకుని రావాలని చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడినుంచి వెనక్కి వచ్చారు. రెండున్నరేళ్లలో సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్ టెండర్లలో కొందరికే లబ్ధి చేకూరేలా నూతన నిబంధనలు సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు -
సాగుకు తొందరొద్దు
ములుగు రూరల్: రైతులు తొలకరి వర్షాలకు తొందరపడి పత్తి విత్తనాలు విత్తుకోవద్దు. నేల పూర్తి స్థాయిలో తడిసిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం వంటి సందేహాలను నివృత్తి చేశారు. రైతులు ప్రతీ సంత్సరం ఒకే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి చేసుకోవాలన్నారు. నత్రజని ఎరువుల వినియోగం తగ్గించాలని సూచించారు. పంటల సాగు విషయం, విత్తన ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ సమాధానం ఇచ్చారు. ప్రశ్న: కొన్ని రకాల సన్నాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. వాటికి మాత్రమే ఇస్తారా?– ఇమ్మడి భిక్షపతి, రైతు, ములుగు జవాబు: రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రకాల సన్నాలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని ఆదేశించింది. అంతేకాని వాటికి మాత్రమే బోనస్ అనేది లేదు. గతంలో ఎంపిక చేసిన 32 రకాలకు బోనస్ వస్తుంది. ప్రజలు తినడానికి, మిల్లర్ల అనుకూలత, దిగుబడి ఉంటుందని ప్రమోషన్ చేశాం. ప్రశ్న: నాకు ఉన్న ఆరు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఏటా దిగుబడి తగ్గుతుంది? – బొంతల రాజు, రైతు ములుగుజవాబు: ప్రతీ ఏటా ఒకే రకమైన పంట సాగు చేయడంతో దిగుబడి తగ్గుతుంది. కాబట్టి పంట మార్పిడి చేయాలి. దీంతో పాటు భూమి సారవంతం పెంచడానికి పశువుల ఎరువు గాని పచ్చిరొట్ట సాగు చేయడం చేయాలి. భూసారం పెరిగిన దిగుబడి పెరుగుతుంది. ప్రశ్న: భూమిలో ఎక్కువ రోజులు నీటి నిల్వలు ఉంటున్నాయి. ఎలాంటి పంట సాగు చేయాలి?– రమేష్, రొయ్యూరు జవాబు: భూమిలో ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉండే భూముల్లో ఐఆర్ 64 రకం లేదా తెల్లహంసలు సాగు చేసుకుంటే మేలు. ఈ రకాలు సుమారు 40 రోజులు నీరు నిలిచి ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు. ప్రశ్న: మిర్చి సాగులో నల్లి తెగులు నివారణకు సూచనలు ఇవ్వండి.– శ్రీనివాస్, రొయ్యూరు జవాబు: మిర్చి సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. పంటలో ఎల్లో స్టికిస్, బ్లూ స్టిక్కిస్, లైట్ ట్రాప్స్ పెట్టుకోవాలి. రైతులకు సమ్మక్క–సారక్క ఎన్జీఓ ద్వారా ఉచితంగా ఇప్పిస్తాం. పురుగు మందులతో నల్లి తెగులు నివారణ కష్టం. ప్రశ్న: పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? – అల్లం చంటి, ఏటూరునాగారం జవాబు: పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. మీకు అందుబాటులో ఏటూరునాగారం పీఏసీఎస్లో ఉన్నాయి. 50శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు. 40 కేజీల బ్యాగు సుమారు మూడు ఎకరాల్లో సాగు చేసుకోవాలి. ప్రశ్న: వరి సాగులో ఏ విత్తనాలు మేలు? –కొనుపుల కుమార్, ములుగు జవాబు: వరి సాగులో స్వల్ప, మధ్య రకం విత్తనాలను సాగు చేసుకోవడం మేలు. ఈ ఏడాది వర్షాభావం తక్కువగా ఉండే పరిస్థితి ఉంది. ధీర్ఘకాలిక విత్తనాల సాగుతో నీటి వినియోగానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. స్వల్ప, మధ్యకాలిక విత్తనాలు సాగు చేసుకుంటే మంచిది. ప్రశ్న: వర్షాదారంతో సాగుకు అనుకూలంగా ఉండే వరి విత్తనాలను వివరించండి? – సత్యనారాయణ, వెంకటాపురం(కె)జవాబు: వర్షాదారంపై ఆధారపడి సాగు చేసే రైతులు స్వల్పకాలిక విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం, 1010 రకాలు సాగు చేసుకోవాలి. వాటి కాలపరిమితి 120 రోజుల నుంచి 130 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పూర్తిస్థాయిలో వర్షాలు కురిసిన తర్వాతే పత్తి విత్తుకోవాలి వరి సాగులో స్వల్ప, మధ్యకాలిక రకాలు మేలు అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు యూరియా వాడకం తగ్గించాలి ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ -
బంగారు భవితను కాపాడాలి
భూపాలపల్లి అర్బన్: పరిశ్రమలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారి బంగారు భవితను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం కోర్టుహాల్లో పోలీసు అధికారులతో చర్చించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న బాలలను గుర్తించి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పారా లీగల్ వాలంటీర్లు, కార్మిక శాఖ, రెవెన్యూశాఖ అధికారుల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, ిసీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. -
డీఎస్బీ ఎస్సై బదిలీ
గోదావరిఖని: కాళేశ్వరం జోన్పరిధిలోని ములుగు జిల్లా డీఎస్బీ ఎస్ఐగా పనిచేస్తున్న యు.ఉపేందర్రావును సీసీఎస్ రామగుండానికి బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి మహాముత్తారం: రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులను ఆదేశించారు. గురువారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భుభారతి పెండింగ్ దరఖాస్తులతో పాటు సాదాబైనామా, ఎలక్షన్ వర్కపెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశ్కరించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్తో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. వాహనాల తనిఖీ మహాముత్తారం: మండలంలోని యామన్పల్లి ప్రధాన రహదారి వద్ద మహాముత్తారం ఎస్సై రమేష్ గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనపత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రేగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని భాగిర్థిపేట క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భాగిర్థిపేట క్రాస్ వద్ద పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై పరకాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తేజావత్ రజిత, భూక్య లక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను అంబులెన్స్లో పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రతీ గురువారం విచారణభూపాలపల్లి అర్బన్: జిల్లాలో 18 ఏళ్లలోపు బాల నేరస్తులకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం అందించేందుకు తొలి సారి జిల్లాలో ఏర్పాటు చేసి జువైనైల్ జస్టిస్ బోర్డు ప్రతీ గురువారం కేసుల విచారణ నిర్వహించనున్నట్లు బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, న్యాయమూర్తి జి.అఖిల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన జిల్లా సెషన్స్ ఇన్చార్జ్ జడ్జి ఎస్వీపీ సూర్య చంద్రకళ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. బాలల కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమన్నారు. -
నేడు సింగరేణి పరిరక్షణ సదస్సు
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) భూపాలపల్లి ఏరియాలో సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే 8వ గనిలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్కు రాజిరెడ్డి హాజరై మాట్లాడారు. సదస్సును జయపద్రం చేయాలని కోరారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలతో కార్మికులను ఇబ్బందులు గురి చేస్తుంటే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడితెల సమ్మయ్య, సదానందం, అవినాష్రెడ్డి, మధు, రాజేందర్, మూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. 14న ఆల్ చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 14న కల్నల్ సంతోశ్బాబు స్మారక ఓపెన్ టు ఆల్ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ రెడ్డి కాలనీలోని మాస్టర్జీ వికాస్ హై స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్–10, 12, 14 బాలబాలికల విభాగం నుంచి ఇద్దరి చొప్పున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు ఫోన్ 90595 22986 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
నేడు డీఏఓతో సాక్షి ఫోన్ ఇన్
ములుగు రూరల్: వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేశ్కుమార్తో నివృత్తి చేసుకునేలా సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, నకిలీ విత్తనాల గుర్తింపు తదితర అంశాలపై రైతులు డీఏఓతో ఫోన్లో సంప్రదించి నివృత్తి చేసుకోగలరు. పంటల సాగులో వ్యవసాయ అధికారి సలహాలు, సూచనలు అందించనున్నారు. నేడు (శుక్రవారం) సమయం : ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 89777 51139, 8977751156 -
చేయూత ఏది?
ములుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పథకం కింద కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించింది. దీంతో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు సంతోషించారు. కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశ చెందారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 37,353 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి ప్రతినెలా రూ.9.07 కోట్లను ప్రభుత్వం అందిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో చివరిసారిగా పింఛన్లు మంజూరు చేసింది. పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు ప్రజావాణిలో, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడమే కాకుండా నేరుగా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులకు దరఖాస్తులు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 4,500 మందికి పైగా వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రకటించటంతో జిల్లాలో వందలాది మంది దరఖాస్తుదారులు పలు రకాల ధ్రువపత్రాలను మీసేవ కేంద్రాల ద్వారా తీసుకున్నారు. ప్రధానంగా భర్త మరణ ధ్రువీకరణ, వయస్సు నిర్ధారణ కోసం ఆధార్, సదరం క్యాంపుల్లో పొందిన వికలాంగుల ధ్రువీకరణ తదితర పత్రాలు తీసుకొని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పింఛన్ల కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. వృద్ధాప్య పింఛన్ పొందే వ్యక్తి చనిపోతే మృతుడి భార్య జీవించి ఉంటే ఆమెకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేస్తున్నారు. కానీ వయస్సు రీత్యా 65 ఏళ్లు దాటిన వారికి, సదరం క్యాంపు ద్వారా వికలాంగుల సర్టిఫికెట్ పొందిన వారికి, చిన్న వయస్సులో భర్త చనిపోయిన వారికి, ఒంటరి మహిళలు, బీడీ, గీత, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. నాలుగేళ్లుగా పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతున్నారు. అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో సైతం పింఛన్లు ఇప్పించాలంటూ అధికారులను, సర్పంచ్లను వేడుకుంటూ మళ్లీ దరఖాస్తులను అందజేశారు. నేరాల నియంత్రణలో రాజీపడొద్దుసమావేశంలో మాట్లాడుతున్న పీఓ లెనిన్ వత్సల్ టొప్పో జూన్ 2న ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ అవతరణ వేడుకల్లో ఊసెత్తని సర్కార్ నాలుగేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూపులు జిల్లాలో 4,500 మంది నూతన దరఖాస్తుదారులునా భర్త కోదండపాణి ఆనారోగ్యంతో మృతిచెందాడు. పింఛన్ కోసం దరఖాస్తు చేశాను. నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదు. గ్రామ సభలలో సైతం దరఖాస్తులు అందజేశాను. పింఛన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. – అల్లెం సుజాత, ఎస్ఎస్ తాడ్వాయి -
వేలం పాటల ఆదాయం రూ.8.10 లక్షలు
మంగపేట : మండల పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపుల నిర్వహణపై గురువారం నిర్వహించిన బహిరంగ వేలం పాటల ద్వారా రూ.8.10 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జ్, కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో 2026 మే 15 నుంచి 2027 జూన్ 25 వరకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి విక్రయాలకు 2 షాపులు, 2 క్యాంటీన్లు, 2 బొమ్మలు, గాజులు, దేవుడి ఫొటోలు విక్రయ షాపులకు బహిరంగ వేలం పాటలను వరంగల్ నాగమయ్య దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటయ్య సమక్షంలో గురువారం నిర్వహించారు. వేలం పాట లో 15 మంది పాల్గొనగా కొబ్బరి కాయలు, పూజా సామగ్రి విక్రయాల షాపు నంబర్ నంబర్ 1 నర్సింహారావు రూ 2,25,000, షాపు నంబర్ నంబర్ 2 ఎం.అనురాధ రూ.2,25,000, హోటల్, కూల్డ్రింక్స్ షాపు నంబర్ 1 శివయ్య రూ.1,10,000, షాప్ నంబర్ 2ను సతీష్ రూ.1,10,000కు పాట పాడి దక్కించుకున్నారు. అలాగే బొమ్మలు, గాజుల షాపు నంబర్ 1 గోవర్ధన్ రూ.70వేలకు, షాప్ నంబర్ 2 వెంకటేశ్వర్లు రూ.70వేలలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మార్కెట్లోకి ‘మా శక్తి’ ఉత్పత్తులు
ములుగు: జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఇకపై మా శక్తి బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి మా శక్తి బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలు తయారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్త కళలు, పెయింటింగ్స్, బొమ్మలు, టైలరింగ్ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు మా శక్తి బ్రాండ్ను రూపొందించినట్లు తెలిపారు. బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరగడంతో పాటు మార్కెట్లో విశ్వసనీయత, గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి డిజిటల్ వేదికల ద్వారా విక్రయాలకు అవకాశం కల్పించి మహిళల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, ఒకే గుర్తింపు కల్పించడం ద్వారా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. అలాగే మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడుతుందని వివరించారు. మేడారం, లక్నవరం, బొగత జలపాతం, రామప్ప వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అదనపు డీఆర్డీఓ గొట్టె శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వైద్యసేవల్లో ఆదర్శంగా నిలవాలి రాష్ట్రంలోనే ములుగు జిల్లా వైద్యసేవల్లో ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో వైద్య సేవల విస్తరణ, వర్షాకాల ఆరోగ్య సన్నద్ధతపై గురువారం మంత్రి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ గోపాల్రావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
ఆక్యుప్రెషర్ పార్కు నిరుపయోగం
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, నడక వ్యాయామం కోసం సుమారు రూ.36.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆక్యుప్రెషర్ పార్కు ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఎంతో ఆశయంతో నిర్మించిన ఈ పార్క్ మూడేళ్లుగా ప్రజలకు అందుబాటులో లేక పాడుబడిపోతోంది. భూపాలపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ప్రైవేట్ వెంచర్లో గ్రీన్ బడ్జెట్లో నిర్మించిన ఈ పార్క్లో ఆక్యుప్రెషర్ ట్రాక్, పచ్చదనం, వ్యాయామ, విశ్రాంతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రారంభ రోజుల్లో కొంతమంది ప్రజలు వినియోగించినప్పటికీ, అనంతరం సరైన నిర్వహణ లేకపోవడంతో పార్క్ క్రమంగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుతం పార్క్ ప్రవేశ ద్వారం వద్దనే పాడుబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోపల కలుపు మొక్కలు పెరిగిపోవడం, పరికరాలు దెబ్బతినడం, శుభ్రత లేకపోవడం వల్ల ప్రజలు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పార్క్లోని కొంతభాగం దెబ్బతింది. ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్కు ప్రజలకు ఉపయోగపడకుండా ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన ఆస్తిని సంరక్షించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. పార్కును వెంటనే పునరుద్ధరించి, దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేపట్టి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి న అవసరం ఉంది. ఆరోగ్యానికి ఉపయోగపడే ఇటువంటి వనరులు నిర్లక్ష్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రూ.36.50 లక్షల ప్రజాధనం వృథా నిర్వహణ లేక శిథిలావస్థకు.. -
జిల్లాలో 1.06 లక్షల గృహాలు
ములుగు: జనగణనలో మొదటి అంకం పూర్తయింది. జిల్లాలో గృహాల గుర్తింపు ప్రక్రియ మంగళవారం పూర్తి కాగా జిల్లా వ్యాప్తంగా 1,06,145 గృహాలు ఉన్నట్లు ఎన్యూమరేటర్లు గుర్తించారు. ఇందులో ములుగు మున్సిపాలిటీ పరిధిలో 6,952 గృహాలు ఉండగా 18,652 జనాభా ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 99,193 గృహాలు ఉండగా 2,94,510 జనాభా ఉన్నట్లు నిర్ధారించారు. ఫిబ్రవరి–2027లో జనాభాను అధికారికంగా లెక్కించేందుకు అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. 29 రోజుల పాటు కొనసాగిన సర్వే జనగణన కార్యక్రమంలో భాగంగా తొలి ప్రాధాన్యతలో గృహగణన కార్యక్రమాన్ని మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు డిజిటల్ విధానంలో ఎన్యుమరేటర్లు సర్వే చేపట్టారు. జిల్లాలో 815 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించి ప్రతీ బ్లాక్లో 250 నుంచి 300 గృహాలు సర్వే చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రతీ 300 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 370 మందికి పైగా ఎన్యుమరేటర్లను నియమించి జిల్లాలో గృహగణన నిర్వహించారు. గృహగణనలో ఎన్యుమరేటర్ ప్రతీ ఇంటికి వెళ్లి 33 ఆంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. 100 శాతం గృహగణన పూర్తి జిల్లాలోని 10 మండలాల పరిధిలో 99,193 గృహాలు ఉన్నాయి. ఇందులో ములుగు మున్సిపాలిటీ పరిధిలో 6,952 గృహాలు ఉన్నట్లు ఎన్యుమరేటర్లు నిర్ధారించారు. సుమారు 370 మందికి పైగా ఎన్యుమరేటర్లు మండుటెండలో సైతం గృహగణన కార్యక్రమాన్ని చేపట్టి 100 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా డిజిటల్ పద్ధతిలో జనగణన కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే గృహగణన కార్యక్రమాన్ని జూన్ 9న పూర్తి చేశారు. ఫిబ్రవరి 2027లో జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.వాజేడులో గృహగణనలో భాగంగా వివరాలు నమోదు చేసుకుంటున్న ఎన్యుమరేటర్ ములుగు మున్సిపాలిటీ పరిధిలో గృహగణన చేస్తున్న ఎన్యుమరేటర్ జనగణనలో మొదటి అంకం పూర్తి పట్టణంలో 6,952, పల్లెల్లో 99,193 ఇళ్లు గృహగణన 100 శాతం పూర్తి -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
ములుగు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ పనుల్లో కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య గణనీయంగా పెంచాలన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వీవో భవనాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ కేటగిరీల సామాజిక భద్రత, పింఛన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అందిన పింఛన్ల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హులైన వారి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్కు సంబంధించి అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడ్వాయి మండలం కొండపర్తిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిర్చి, పసుపు ప్రాసెసింగ్ యూనిట్, ఇప్పపూల లడ్డు తయారీ యూనిట్ కార్యకలాపాలు, ఉత్పత్తుల క్రయవిక్రయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, అదనపు పీడీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి
ములుగు: పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 16, 19 వార్డులలో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వార్డు సభలు బుధవారం నిర్వహించగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వర్షాకాలంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుని సీజనల్ వ్యాధులు, దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. పట్టణంలోని విద్యుత్, మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్రెడ్డి, సీడీపీఓ కె.శిరీష, ఆర్ఐ యుగంధర్ రెడ్డి, ములుగు సబ్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్, మున్సిపల్ కౌన్సిలర్ కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 18వ వార్డు సభను బహిష్కరించిన కౌన్సిలర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదంటూ 18వ వార్డు కౌన్సిలర్ బైకాని అనూషసాగర్ తన వార్డులో చేపట్టిన సభను బహిష్కరించారు. ప్రజలచే ఎన్నుకోబడిన తమ పేర్లను శిలాఫలకాలపై నమోదు చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ చంద్రకళ -
వచ్చే ఏడాది ఖరీఫ్కు సాగునీరు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో మరమ్మతుల పూర్తి చేసి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్కు సాగునీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక హెలికాప్టర్లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడినుంచి కాన్వాయ్లో బ్యారేజీ దిగువకు వెళ్లారు. పుణేకు చెందిన సైంటిస్టులు, ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో మాట్లాడి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అక్కడి నుంచి బ్యారేజీ ఎగువన యాగశాల వద్ద ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ముందుగా కల్నల్ పరీక్షిత్ మెహ్రా బ్యారేజీల్లో జరుగుతున్న పరీక్షలను ఒక్కొక్కటిగా వీడియోలు, ఫొటోల ఆధారంగా వివరించారు. రాత్రిపగలు పరీక్షలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్ల ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్లనే కుంగినట్లు తెలిపారు. కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలతో పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్–ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిప్లేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను తిరిగి సురక్షితంగా, సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ సెక్రెటరీ శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి గంటపాటు మేడిగడ్డ బ్యారేజీలో పర్యటన.. పరిశోధనల తనిఖీ మూడు బ్యారేజీల్లోని పరీక్షల వివరాలు వెల్లడి -
తయారీ క్లోజ్
ఆదరణ లేక మూతపడిన న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ తయారీ కేంద్రం ఆర్డర్లు నిల్..ఏటూరునాగారం: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అధికారులు పట్టింపులేనితనంతో ఆర్డర్లు రాక.. ఉత్పత్తి నిలిచిపోయిందని గ్రూపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే మిషనరీ తుప్పుపడుతున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు ఐటీడీఏ పరిధిలోని అప్పటి ప్రభుత్వం ట్రైకార్ ద్వారా గిరిజన మహిళా సంఘాలకు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రూ. 39 లక్షల బడ్జెట్ను కేటాయించింది. దీంతో ఏటూరునాగారంలో 2022–23లో ఐటీడీఏ కార్యాలయానికి కూతవేటు దూరంలోని క్రాస్రోడ్డులో స్వయంకృషి జాయింట్ లయబిలిటీ గ్రూపు పేరుతో పది మంది సభ్యులు కలిసి న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలుత ఆరు నెలలకు సరిపడా ఇండెంట్లు రావడంతో న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ తయారు చేసి పంపిణీ చేశారు. ఆపై ఆర్డర్లు రాకపోవడంతో పరిశ్రమ మూతపడింది. ఆ తర్వాత 2025 నవంబర్లో ఐటీడీఏ నుంచి ఆర్డర్స్ ఇవ్వడంతో ఉత్పత్తులను తయారు చేసి అందజేశారు. అనంతరం మళ్లీ అర్డర్లు లేకపోవడంతో ఉత్పత్తి చేయలేమని నష్టం వస్తుందని దానిని సభ్యులు మూసివేశారు. పరిశ్రమకు తాళాలు వేసి ఉండడంతో చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. గిరిజన మహిళలకు అప్పగించిన ఈ పరిశ్రమ మూతపడడంతో మిషనరీ అంతా తుప్పు పడుతున్న పరిస్థితి నెలకొంది. 10శాతం నగదు.. 50శాతం సబ్సిడీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రైకార్ ద్వారా ప్రభుత్వం రూ. 39 లక్షలు వెచ్చించగా అందులో 10 శాతం నగదును వాటా దారులైన మహిళలు చెల్లించారు. ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ రూపంలో బ్యాంకులో జమ చేసింది. మిగతా 30 శాతం నిధులు బ్యాంకు రుణంగా అందజేసింది. దీంతో పరిశ్రమను నెలకొల్పిన మహిళలు పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, రాగులు, పల్లీలను కలిపి డ్రైమిక్స్ పౌడర్ను తయారు చేసి ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు గతంలో అందజేశారు. విద్యార్థులకు అందని పౌష్టికాహారం ఆ తర్వాత పరిశ్రమ మూసివేయడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా పోయింది. ఈ విషయంపై గతంలో సాక్షి పలుమార్లు కథనాలు రాయగా అప్పటి పీఓ చిత్రామిశ్రా పరిశ్రమకు డిమాండ్ ఆర్డన్ను అందజేసి తెరిపించారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పరిశ్రమ నడిపి ఉత్పత్తి చేసి జీసీసీ ద్వారా విద్యాసంస్థలకు సరఫరా చేశారు. కానీ ఆ తర్వాత మార్చి నుంచి మూసివేశారు. దీంతో మహిళలకు ఇచ్చిన లక్షలాది రూపాయల విలువచేసే పరిశ్రమ పాడైపోగా.. పిల్లలకు పౌష్టికాహారమైన డ్రైమిక్స్ పౌడర్ కూడా అందకుండా పోతుంది. అయితే పాఠశాలలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. కానీ ఎలాంటి ఆర్డర్స్ లేకపోవడంతో ఇప్పటి వరకు కూడా తయారీ మొదలు పెట్టలేదు. ఈ విషయంపై సాక్షి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోను సంప్రదించగా దానిని పరిశీలించి తెరిపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సంవత్సరం ఉత్పత్తి వ్యాపారం 2023 1,600(కిలోలు) రూ.25.6లక్షలు 2025 1,000(కిలోలు) రూ.16లక్షలు పట్టించుకోని ఐటీడీఏ అధికారులు తుప్పుపడుతున్న మిషనరీ -
‘ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి’
ములుగు రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ అన్నారు. ఈ మేరకు బుధవారం డీఈఓ సిద్ధార్థరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యను వ్యాపారంగా చేస్తున్న పాఠశాలల యజమానులపై అధికారులు చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్కుమార్, దిలీప్, కుమార్, ప్రవీణ్, నవీన్ పాల్గొన్నారు. -
రేపు డీఏఓతో సాక్షి ఫోన్ ఇన్
ములుగు రూరల్: వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేశ్కుమార్తో నివృత్తి చేసుకునేలా సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, నకిలీ విత్తనాల గుర్తింపు తదితర అంశాలపై రైతులు డీఏఓతో ఫోన్లో సంప్రదించి నివృత్తి చేసుకోగలరు. పంటల సాగులో వ్యవసాయ అధికారి సలహాలు, సూచనలు అందించనున్నారు. తేదీ : 12న(శుక్రవారం) సమయం : ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 89777 51139, 8977751156 -
పెంచిన ధరలు తగ్గించాలి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేటఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా పెట్రోల్, డీజిల్, గ్యాస్పై ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికల హామీలను సైతం నాయకులు విస్మరించారని తెలిపారు. ధరల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎరువుల బస్తాపై పెంచిన ధరలను తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, నర్సయ్య, కొమురయ్య, అయిలయ్య, సారయ్య, శ్రీనివాస్, కొండయ్య, రాజేందర్, శ్రీనివాస్, రాజకుమారి, శోభ, రజిత, కవిత, అనూష, సుమలత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకుల ధర్నా -
కాల్వ ఇలా.. పాఠశాలకు వెళ్లేదెలా?
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 6 వార్డులో అంబేడ్కర్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదుట ఉన్న మురుగు కాల్వ నుంచి దుర్గంధం వస్తుంది. మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు అనేక మంది ఈ పాఠశాలలోకి రానున్నారు. కాల్వలో చెత్తాచెదారం పేరుకుపోయి పచ్చగా నీరు మారి విషకీటకాలు తిరుగుతున్నాయి. పురుగులు, దోమలు, ఈగలు విపరీతంగా పాఠశాల ఆవరణ చుట్టూ తిరుగుతున్నాయి. అయినా ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. అధికారులు వెంటనే కాల్వలను శుభ్రం చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
యువత మత్తుకు బానిసకావొద్దు
ములుగు రూరల్: యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో గంజాయి కేసుల్లో శిక్షపడిన వారితో వృక్ష రూపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమేనని తెలిపారు. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ముందుకు సాగాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ బాగుంటుందని వెల్లడించారు. గంజాయి అమ్మకాలపై సమాచారం అందించిన వారికి రూ. 5,116 నగదు బహుమతి అందిస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, సీఐ సురేశ్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ స్వామి, ఎస్సైలు ఉపేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ -
పెట్టుబడుల మాసం..
ములుగు: ఒకవైపు పిల్లల చదువులకు.. మరో వైపు వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులకు తప్పనిసరిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి అన్నదాతలకు నెలకొంది. ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో ఇప్పటికే ఆడ్మిషన్లు, పుస్తకాలు, యునిఫాంల కోసం పాఠశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. వానాకాలం సాగు పనులు కూడా ప్రారంభం కావడంతో దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులను ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు రైతులు తహతహలాడుతున్నారు. జిల్లాలో జూన్ నెల వచ్చిందంటే పెట్టుబడుల కోసం అప్పులు చేసేందుకు వేలాది మంది రైతులు, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి నెలకొంది. పిల్లల భవిష్యత్ కోసం విద్యపై రాజీ పడలేరు. అటు పంటల కోసం సాగు పనులను ఆపలేరు. ఈ నెలలో చాలా కుటుంబాలు ఇలాంటి తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రైతులకు రెండింతలు.. వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్ల అద్దె, కూలీల వేతనాలు వంటి ఖర్చులు ఒకేసారి రావడంతో రైతులపై ఆర్థిక భారం పెరుగుతోంది. యాసంగి పంటలను ఇప్పుడిప్పుడే అమ్మేసి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఽపూర్తి స్థాయిలో ధాన్యం, మొక్కజొన్న పంటల డబ్బులు చేతికి రాలేదు. దీంతో అప్పులు చేసైనా పిల్లల చదువులు, సాగు పనులను ముందుకు సాగించేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా వర్షాకాలం సీజన్ కావడంతో ఇళ్లకు మ రమ్మతులు చేపట్టడంతో పాటు ఇతరత్రా ఖర్చులు అదనంగా మారి కుటుంబ బడ్జెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఆందోళనలో విద్యార్థుల వివరాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 507 ఉన్నాయి. వీటిల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 34,858 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నప్పటికీ నోట్బుక్స్, గైడ్స్, సమయానికి యునిఫాం అందకపోవడంతో కొంతమేర విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతీ ఒకటి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పుస్తకాలు, నోట్బుక్స్, యునిఫాం, వ్యాన్ ఫీజులు, స్కూల్ ఫీజులతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి చదువుకు సగటున రూ.20వేల నుంచి రూ.40వేల వరకు తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. పదో తరగతి వరకే ఇలా ఉంటే ఇంటర్, డిగ్రీ, ఇతర చదువులకు మరింత ఖర్చులు అధికం కానున్నాయి. ఎకరానికి రూ.20 నుంచి రూ.40వేల వరకు పెట్టుబడి జిల్లాలో 1,63,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతుండగా అత్యధికంగా వరిపంట సాగవుతుంది. వరిపంటకు ఎకరానికి సుమారు రూ.20వేల వరకు రైతులు పెట్టుబడి పెడుతుండగా, పత్తికి ఎకరానికి సుమారు రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. మిర్చి పంట అయితే ఎకరానికి సుమారు లక్ష రూపాయాల పెట్టుబడి పెట్టాలి. పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొ ప్పున ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం కూడా సమయానికి అందకపోవడంతో జూన్ మా సం అన్నదాతలకు అగమ్యగోచరంగా మారింది. ఈనెల 15 నుంచి పాఠశాలల పునఃప్రారంభం విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం మొదలైన వానాకాలం సాగు పనులు రైతులకు ఎరువులు, విత్తనాల ఖర్చులుపంట సాగు(ఎకరాల్లో) పెట్టుబడి(ఎకరానికి) వరిపంట 1,07,700 రూ.20వేలు పత్తిపంట 28,600 రూ.40వేలుప్రభుత్వ పాఠశాలలు 475 ప్రైవేట్ పాఠశాలలు 32విద్యార్థులు 26,858 -
తుదిదశకు ‘ఇన్వెస్టిగేషన్’
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 70శాతానికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరా జ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతోపాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. ఈనెల 20 వరకు పరీక్షలు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. నేడు మంత్రి పరిశీలన.. సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బరాజ్లలో పరీక్షలు తుది దశకు చేరడంతో బుధవారం మధ్యాహ్నం 12.45 గంటలకు మేడిగడ్డ బరాజ్కు ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు రానున్నారు. బరాజ్ వద్దనే రెండు గంటల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సాగుతున్న పరీక్షలు నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సింగరేణిని కాపాడేందుకు ఏకం కావాలి
భూపాలపల్లి అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తోందని, కార్మిక లోకం ఏకమై సింగరేణిని కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఏరియాలోని గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ అన్ఫిట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం సింగరేణికి బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఈ నెల 12న మాజీ మంత్రి హరీశ్రావు భూపాలపల్లిలో నిర్వహించనున్న సమావేశానికి కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
మోహన్నాయక్పై ఇక్కడా ఆరా!
సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు–భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇంజనీర్ఇన్చీఫ్ జె.మోహన్నాయక్ అక్రమాస్తులపై సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. మంగళవారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీయడం సంచలనంగా మారింది. హైదరాబాద్తోపాటు బంధువులు, సన్నిహితులకు చెందిన నివాసాలు సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారి కావడంతో ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన లావాదేవీలపై అందిన ఫిర్యాదులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడం స్థానిక కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎవరీ మోహన్ నాయక్..? జె. మోహన్ నాయక్ తెలంగాణ ఆర్అండ్బీ శాఖలో అత్యంత కీలకమైన ‘ఇంజనీర్–ఇన్–చీఫ్ (స్టేట్ రోడ్స్)’ హోదాలో ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్డీసీ) మేనేజింగ్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ, పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ ఆయన పరిధిలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపడుతున్న అనేక రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు, డబుల్ రోడ్లు, బ్రిడ్జిలు, అభివద్ధి పనులు స్టేట్ రోడ్స్ విభాగం ఆధ్వర్యంలో సాగుతున్నాయి. వరంగల్–ములుగు, వరంగల్–నర్సంపేట, వరంగల్–మహబూబాబాద్ తదితర ప్రధాన రహదారి పనుల పర్యవేక్షణలో ఆయన కార్యాలయానికి కీలక పాత్ర ఉంది. ఈఎన్సీ పదోన్నతికంటే ముందు ఉమ్మడి వరంగల్ ఎస్ఈగా సుమారు నాలుగేళ్లు పనిచేశారు. దీంతో మోహన్ నాయక్ పేరు ఉమ్మడి వరంగల్లోని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ వర్గాలకు సుపరిచితం. తాజాగా రూ. 6 లక్షల వసూలు.. కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే.. గ్రేటర్ వరంగల్ను కలుపుకునే ఉండే ఓ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఓ ఎర్త్వర్క్ (తారు వేసే ముందు)(మట్టి పనికి) సంబంధించిన వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టర్కు భారీగా లాభం జరిగేలా అంచనాలు పెంచినట్లు తెలుసుకున్న సదరు ఈఎనన్సీ హైదరాబాద్ నుంచి వచ్చి ఆగమేఘాల మీద ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కాంట్రాక్టర్నుంచి కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే రూ.6 లక్షలు తీసుకోవడంపై ఇప్పుడు ఆర్అండ్బీ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్ల నుంచి పనుల బిల్లులు, అనుమతులు, కాలపరిమితి పొడిగింపుల పేరుతో వసూళ్లు జరిగాయన్న ప్రచారం కూడా ఉంది. అర్హత లేని కాంట్రాక్టర్కు భారీ పనులా? వరంగల్లో ఎస్ఈగా పనిచేసిన కాలంలో ఉన్న పరిచయాలతో అర్హత ప్రమాణాలు పూర్తిగా లేని ఓ కాంట్రాక్టర్కు సుమారు రూ.60 కోట్ల విలువైన రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు ఏడాది కింద అప్పగించారన్న ఫిర్యాదులున్నాయి. ఆ రూ.60 కోట్ల పనికి టెండర్ అయిన సమయంలో అంతే విలువ గల పనులకు రెండేళ్లు కాలపరిమితి ఇచ్చి.. సదరు కాంట్రాక్టర్కు మాత్రం మూడేళ్లు ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదమైంది. అంతేకాకుండా పనుల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక అనుమతులతో గడువు పెంచి పనులు కొనసాగించేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించిన పాత రికార్డులు, టెండర్ పత్రాలను కూడా విచారణ సంస్థలు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇంజనీరింగ్ అధికారులకు కీలక పోస్టింగులు, బదిలీలు, పనుల కేటాయింపుల్లో మోహన్నాయక్ ప్రభావం చూపారనే ప్రచారం ఆ శాఖలో సాగుతోంది. దీంతో ఏసీబీ దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఆ వర్గాల్లో నెలకొంది. చర్చనీయాంశంగా ఆర్అండ్బీ ఈఎన్సీపై ఏసీబీ దాడులు ఉమ్మడి వరంగల్లో రోడ్ల విస్తరణ, నిర్మాణ టెండర్లనుంచి ఎర్త్వర్క్ల వరకు ఆరోపణల జాబితా తాజాగా రూ.6 లక్షలు వసూలు? కిందిస్థాయి అధికారుల్లో చర్చ ఉమ్మడి వరంగల్లో నాలుగేళ్లు ఎస్ఈగా సేవలు అర్హత లేకున్నా కొందరు కాంట్రాక్టర్లకు పనులు.. రూ.60కోట్ల ఓ టెండర్పైనా ఆరా ఏసీబీ దాడులతో ఆర్అండ్బీ వర్గాల్లో కలకలం -
పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలి
ములుగు/ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతం విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని, జీరో విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపుతో పాటు పాఠశాలల పునఃప్రారంభ తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లోని బడికి వెళ్లని వారిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో 12 నుంచి 120 మందికి పైగా పెంచడంలో విశేష కృషి చేసిన కానిస్టేబుల్ దూపాటి సతీశ్, గ్రామ సర్పంచ్ నాగార్జున కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్ చిన్నబోయినపల్లిలోని డీఎన్టీ పాఠశాలలో సతీశ్ ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ పరిశీలించి ప్రశంసించారు. బ్లాక్బెర్రీ ఐలాండ్ను సందర్శించిన కలెక్టర్ ఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని ఏటూరునాగారం హైవే మార్గంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బ్లాక్ బెర్రీ ఐలాండ్ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ సౌకర్యాలు, వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐలాండ్లో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ను సందర్శించి పరిసర ప్రాంతాల అందాలను వీక్షించారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా సౌకర్యాలను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు. అనంతరం ఐలాండ్లోని అభివృద్ధి పనులు, నిర్వహణ అంశాలపై అధికారులతో చర్చించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
ముగిసిన సమ్మర్ క్యాంప్
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లోని విద్యార్థిని విద్యార్థులకు చేపట్టిన సమ్మర్ క్యాంప్ కరాటే శిక్షణ నేటితో ముగిసినట్లు కరాటే మాస్టర్ హుస్సేన్ తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులను 40 మంది విద్యార్థులకు ఇచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలోని ఏటూరునాగారంలో మాత్రమే ఈ కరాటే శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మాస్టర్ వివరించారు. స్వీయరక్షణ అనే అంశంపై విద్యార్థినులకు ప్రత్యేక మెలకువలను నేర్పించామని తెలిపారు. ఆపద సమయంలో ధైర్యంగా ఉంటూ తప్పించుకోవడంతో పాటు పోలీసులను ఆశ్రయించాల్సిన పద్ధతులను వివరించినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఏటూరునాగారం కరాటే అకాడమిలో చేరాలని సూచించారు. పాలెంవాగు ప్రాజెక్టు తనిఖీ వెంకటాపురం(కె): మండల పరిధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు ప్రాజెక్టును మంగళవారం సీడీఎస్ఈ డ్యామ్ సేఫ్టీ బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించడంతో పాటు ప్రాజెక్టులోని నీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టులో ఎంత నీరు నిల్వ ఉంటుంది.. ఎంత విడుదల చేశారు. డ్యామ్ సేఫ్టీ విషయాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో రిటైరర్డు సీడబ్ల్యూపీఆర్ఎస్ చైర్మన్ విజయ్ త్రయంబక్ దేశాయ్, సివిల్ డిపార్ట్మెంట్ ఎన్ఐటీడబ్ల్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీకాంత్ రెడ్డి, ఐఐటీ, రేగొండ అసోసియేట్ ప్రొఫెసర్ సతీశ్కుమార్, ఎస్ఈ ఎస్డీఎస్వో సారంగం, ఈఈ ఎస్డీఎస్వో శ్రీలత, ఎస్డీఎస్వో డీఈఈ శైలజ, పాలెంవాగు ప్రాజెక్టు డీఈ కిశోర్ కుమా ర్, ఏఈలు కార్తీక్, సాయి ప్రసాద్, సాయిరాం, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి ప్రశంసపత్రాలుభూపాలపల్లి: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడంలో ప్రతీ పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీ, సేవాదక్పథంతో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. గణపురం పోలీస్స్టేషన్ తనిఖీ గణపురం: గణపురం పోలీస్స్టేషన్ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. -
మాది ప్రజాప్రభుత్వం
చిల్పూరు/జఫర్గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ఝా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంపుసెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్రనిధు రుణాల కింద రూ.3.07 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య ఓటు హక్కుపై ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్ను 220/133 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి వసతులతో ఘన్పూర్లో వలసలు తగ్గాయి పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.60.62 కోట్లతో 4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన -
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు డీఈఓ సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ బానోత్ నిర్మల వెంకన్న ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇల్లిల్లూ తిరుగారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించామన్నారు. ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలకు నిదర్శనమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వల్లపు మహేశ్, పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీ, వార్డు సభ్యులు మాలోతు శంకర్, తేజావత్ హుని, లిక్కి కుమారస్వామి, కూరాకుల సురేశ్, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. డీఈఓ సిద్ధార్థ రెడ్డి -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో అందించిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, డీఆర్వో రవికుమార్, ఆర్డీఓ కృష్ణవేణితో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు సత్వర పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా సాద్యాఅసాద్యాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. గ్రీవెన్స్లో మొత్తం 64 దరఖాస్తులు రాగా ఇందిరమ్మ ఇళ్లు 20, పెన్షన్లు 17, ఇతర శాఖలకు సంబంధించినవి 27 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో గ్రీవెన్స్లో 64, గిరిజన దర్బార్లో 27 దరఖాస్తులు -
సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తోందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి
● మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ ములుగు: ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ పేర్కొన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో జరిగిన సభలకు ఆమె హాజరై మాట్లాడారు. మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన వాడ శుభ్రంగా ఉంటుందని, మన వాడ శుభ్రంగా ఉంటే మన పట్టణం శుభ్రంగా ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను నివారించేందుకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, కౌన్సిలర్లు గుగ్గిల్ల దివ్య సృజన్, నల్లెల్ల స్వాతి భరత్కుమార్, పౌడల ఓంప్రకాష్, ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్టేషన్ ఘన్పూర్లో నేడు డిప్యూటీ సీఎం పర్యటన
జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నేడు (మంగళవారం) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్స్టేషన్లను ప్రారంభించడంతోపాటు మరో 3 సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు హాజరుకానున్నారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలుగణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.హేమాచలక్షేత్రంలో 11న బహిరంగ వేలంమంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపుల నిర్వాహణ హక్కులు పొందేందుకు ఈనెల 11న దేవాదాయఽ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటలను నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి వీరస్వామి సోమవారం తెలిపారు. 2026 మే 15 నుంచి 2027 జూన్ 25 వరకు సంవత్సరం పాటు కొబ్బరి కాయలు, పూజసామగ్రి విక్రయాలు జరుపుకునేందుకు 2 షాపులు, క్యాంటీన్లు 2, బొమ్మలు, గాజులు, దేవుడి ఫొటోలు విక్రయ షాపులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు హేమాచల క్షేత్రంలోని కల్యాణ మండపంలో నిర్వహించే వేలంలో పాల్గొనే వారు కొబ్బరికాయలు, పూజ సామగ్రి ఒక్కో షాపుకు రూ.50,000, బొమ్మలు, గాజులు, క్యాంటీన్లు ఒక్కో షాపుకు రూ.25,000 చొప్పున దరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. 14న సైక్లింగ్ పోటీలుములుగు/ములుగు రూరల్: ఈ నెల 14న జిల్లాకేంద్రంలో అస్మిత ఖేలో ఇండియా బాలికల సిటీ సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలకు మెరిట్ సర్టిఫికెట్తో పాటు మెడల్స్ అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతీఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ సొంత సైకిల్, ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలని, ఆసక్తి కలవారు ఈ నెల 12తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సైక్లింగ్ కోచ్ శ్రీరామ్ (88868 17492)ను సంప్రదించాలని కోరారు. భారీగా ఎస్సైల బదిలీలుభూపాలపల్లి: జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్బీ ఎస్సైగా పని చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్ను కాటారం ఎస్హెచ్ఓగా, వీఆర్లో ఉన్న జె.మహేష్ను కాటారం ఎస్సై 2గా, మహాముత్తారం ఎస్సై పి.మహేందర్కుమార్ను కొయ్యూరుకు, వీఆర్లో ఉన్న ఎ.కల్యాణ్ను కొయ్యూరు ఎస్సై 2, భూపాలపల్లి ఎస్సై 2 జి.రమేష్ను మహాముత్తారం ఎస్హెచ్ఓగా, వీఆర్లో ఉన్న సాయి శశాంక్ను పలిమెల ఎస్హెచ్ఓ, భూపాలపల్లి ఎస్సై 1 మచ్చ సాంబమూర్తిని మహదేవపూర్ ఎస్హెచ్ఓగా, పలిమెల ఎస్సై జె.రమేష్ను మహదేవపూర్ ఎస్సై 2, మహదేవపూర్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్న కె.పవన్కుమార్ను భూపాలపల్లి ఎస్సై 1, చిట్యాల ఎస్సై 2గా పని చేస్తున్న ఎండీ షాఖాన్ను వీఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. -
ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలో 1.16 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యం సేకరణములుగు రూరల్: జిల్లాలో యాసంగి (రబీ) ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసింది. పీఏసీఎస్, జీసీసీ, ఐకేపీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 149 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టారు. కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు ధాన్యం అమ్మకాలకు పడిన అవస్థలు అంతాఇంతా కాదు. అకాల వర్షం, గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత కారణంగా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి రవాణా డబ్బులు చెల్లించి ధాన్యం ఎగుమతులు చేపట్టారు. దీంతో రెండు రోజుల క్రితం ధాన్యం కొనుగోళ్ల ముగింపు ప్రకటించారు. జిల్లాలో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా.. జిల్లాలోని పది మండలాల్లో మొత్తం యాసంగి దిగుబడి అంచనా 1.08 లక్షల మెట్రిక్ టన్నులుగా అధికారులు అంచనా వేశారు. అంచనాలకు మించి ధాన్యం కల్లాలకు రావడంతో కొనుగోలు అంచనా 1.20 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ద్వారా 1,16,121 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టి మిల్లులకు తరలించారు. జిల్లాలో 11,277 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.218.51 కోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటికీ ట్యాబ్ ఎంట్రీ కాని రైతులకు సుమారు రూ.50 కోట్ల వరకు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. 11,277 మంది రైతులకు రూ.218.51 కోట్లు చెల్లింపు సుమారు రూ.50కోట్లు పెండింగ్ -
పింఛన్ కొనసాగించాలి
కాళ్లు పని చేయకపోవడంతో 2020లో సదరం క్యాంపులో 66శాతంతో సర్టిఫికెట్ జారీ చేసి పింఛన్ మంజూరు చేశారు. ఇటీవల పింఛన్ నిలిపేశారు. సదరం క్యాంపునకు హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు. మరోసారి సదరం క్యాంపునకు అవకాశం కల్పించి పింఛన్ కొనసాగించాలి. – అన్నం శ్రీను, కమలాపురం, మంగపేట ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలిపూరి గుడిసులో జీవనం కొనసాగిస్తున్నా. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు చేయలేదు. ఇందిరమ్మ ఇంటికి అర్హతలు ఉన్నప్పటికీ అధికారులు, నాయకులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – ఎర్రం వెంకన్న, బుచ్చంపేటఅల్పాహారం పెండింగ్ బిల్లులు చెల్లించాలిపెండింగ్లో ఉన్న అల్పాహార బిల్లులను తక్షణమే చెల్లించాలని ఏఐటీయుసీ అనుబంధ సంఘం, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ కోరారు. ఈ మేరకు నాయకులు భారతి, ప్రమీల, రాజకుమారి, సరోజిని, స్వరూప, శ్రీలత, రమ, వనజ తదితరులతో కలిసి గ్రీవెన్స్లో విన్నవించారు. -
గిరిజన దర్బార్లో ఇలా..
ఏటూరునాగారం మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనదర్బార్ చేపట్టి 27 మంది గిరిజనుల నుంచి వినతులను స్వీకరించారు. మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గిరిజనుడు 2008–09 నుంచి ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదని, దానికి కోసం నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. ములుగు గ్రామంలో సంధ్యారాణి ఎంబీఏ కంప్యూటర్ పూర్తి చేసి ఉన్నానని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన గిరిజనులు రుణం కావాలని విన్నవించారు. గోవిందరావుపేట మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన స్వప్న తన భర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఐటీడీఏ ద్వారా టీఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం చేయాలని కోరారు. గిరిజన సహకార సంస్థ మహాదేవ్పూర్లోని గ్యాస్ గోదాంలో డెలవరీ బాయ్స్గా పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారిని నియమించాలని గిరిజన ప్రాథమిక సహకార సంస్థ డైరెక్టర్లు బుచ్చయ్య, పోచయ్య తెలిపారు. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం లోని ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో వ్యవసాయ సాగు కోసం బోరు నిర్మిస్తుండగా అటవీశాఖ వారు అడ్డుకుంటున్నారని, వారి నుంచి అనుమతి ఇప్పించాలని కోరారు. భూపాలపల్లి సుబ్బక్కపల్లిలో సౌర గిరిజల వికాసం నుంచి బోరు మంజూరు చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చేపడుతున్న పల్స్ పోలియో, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయా కార్యక్రమాలపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. వలస కార్మికులు నివసించే ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనుల ప్రాంతాలు వంటి ప్రాంతాలను గుర్తించి అక్కడి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. వర్షాకాలంలో ప్రబలే డయేరియా వ్యాధి నివారణకు గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జూలై నెలలో నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్రావు మాట్లాడుతూ జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జిల్లాలో 22,572 మంది 0–5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 312 పోలియో బూత్లు, మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ పాయింట్లు, అధిక ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జూన్ 15 నుంచి జూలై 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, జూలై 13, 20 తేదీల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఒకటి నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి సంపత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. గోదాం సీల్ను, సీసీ కెమెరాల పనితీరు, ఇతర భద్రత పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సలీం, డిప్యూటీ తహసీల్దార్ నితీష్కుమార్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గి రిజన పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని, బడిబాట ముమ్మరంగా చేపట్టా లని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. సోమవారం మండలకేంద్రంలోని తన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్లు, మానిటరింగ్ అధికారులు, రిసోర్స్ పర్సన్లతో గూగుల్ మీటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ జూన్ 15వ తేదీన పాఠశాలలు తెరుచుకునే నాటికి అధికారులు తమతోపాటు ఉపాధ్యాయులను విద్యార్థుల వద్దకు పంపిస్తూ హాజరు శాతాన్ని పెంచాలన్నారు. ప్రతీ విద్యార్థికి ప్రభుత్వం కేటాయిస్తున్న ఖర్చును వివరించాలన్నారు. సున్నా నమోదు ఉన్న గిరిజన సంక్షేమ సంస్థల్లో విద్యార్థులను తప్పనిసరిగా చేర్పించాలన్నారు. విద్యాసంస్థల్లో తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిగా ఉన్నాయా లేదా రిపోర్ట్ చేయాలన్నారు. డీడీలు, డీటీడీఓలు, ఏటీడీఓలు పాఠశాలలను తిరిగి సమస్యలను గుర్తించాలన్నారు. హెడ్మాస్టర్లు, వార్డెన్లు వారి సంస్థల పనితీరును మరింత మెరుగుపర్చాలన్నారు. గిరిజన సంక్షేమ సంస్థల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట అదనపు ఉపాధ్యాయుల కోసం అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ ఫిరంగి, దేశిరామ్, నారాయణరెడ్డి, భూపాలపల్లి డీటీడీఓ గొట్టిముక్కుల నాగసాగర్, ఏటీడీఓలు శివకృష్ణ, హసీనా, ఉపేందర్, రవీందర్, వాగ్యా, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలి
ములుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారాన్ని అందించాలని, పాఠశాలలు, వసతి గృహాల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని విద్యాసంస్థల భవనాలు, తరగతి గదులు, వంటశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో శుభ్రపరచాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి, సంప్రదాయాలు, మంచి అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ‘నమస్కారం–మన సంస్కారం’ అనే భావనను విద్యార్థుల్లో పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాల ప్రాముఖ్యత, స్థల పురాణా లను విద్యార్థులకు తెలియజేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి కృషి చేసిన జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల్లో వైద్య శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రవికుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి మంత్రి ధనసరి సీతక్క -
మృగశిర కార్తె సందడి
మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపల మార్కెట్లో మత్స్యకారులు, వ్యాపారులు పెద్ద ఎత్తున గోదావరి, తదితర ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకుని విక్రయించారు. సాధారణంగా రూ.200 కిలో ఉండగా మృగశిర కార్తె సందర్భంగా రూ.250లకు కిలో చేపలను విక్రయించారు. రకరకాల చేపలు మార్కెట్కు రావడంతో ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేశారు. కార్తె రోజు చేపలను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని ప్రజల విశ్వా సం. దీంతో చేపలు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. – ఏటూరునాగారం/వెంకటాపురం(కె) -
అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!
ములుగు జిల్లా : చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని టేకులకుంట గొత్తికోయ గుంపులో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల సమాచారం మేరకు మృతులను కాశపు కోమల (18), కోరం ఇరవయ్య (18)గా గుర్తించారు. వీరిద్దరూ గొత్తికోయ తెగకు చెందినవారని తెలిసింది. ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట ఇప్పపువ్వు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన యువతి, యువకుడు తిరిగి ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు. కాగా, కర్లపల్లి శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పస్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కచి్చతమైన కారణాలు, ఇతర వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. -
మేడారంలో భక్తుల రద్దీ
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో వనదేవతలను ప్రాంగణంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు మేడారానికి తరలివచ్చి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. తల్లులకు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే గద్దెల వద్ద భక్తుల రాకపోకలు పెరగడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. భక్తులు కొబ్బరికాయలు కొట్టి ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అమ్మవార్ల గద్దెల వద్ద దొంగలు చేతివాటం ప్రదర్శించారు. భక్తుల జేబుల్లోని సుమారుగా రూ. 25వేల నగదు కాజేసినట్లు బాధితులు తెలిపారు. ఈవిషయంపై బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. -
పాఠశాల పాకకు మరమ్మతులు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని మోట్లగూడెంలోని ఎంపీపీ పాఠశాలకు ప్రభుత్వ భవనం లేకపోవటంతో గ్రామస్తులు సమష్టిగా గ్రామంలో గతేడాది పాకను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది సైతం పాఠశాల అదే పాకలో కొనసాగించనుండడంతో పైకప్పు దెబ్బతిని ఉంది. దీంతో వర్షాకాలంలో ఉరిసే అవకాశం ఉండడంతో మరమ్మతులు చేపట్టారు. గ్రామస్తులు సమష్టిగా పాఠశాల పైకప్పుకు తాటాకులు, కోర గడ్డిని తీసుకొచ్చి కప్పారు. పాఠశాల చుట్టూ గ్రీన్మెట్ ఏర్పాటు చేసి ఆవరణను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు ఇర్పా పెంటయ్య, కుర్సం ఎడమయ్య, సమ్మయ్య, శ్రీను, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్మరక్షణ కోసం ముందుకు సాగాలి
హన్మకొండ కల్చరల్: ధర్మరక్షణ కోసం ముందుకు సాగాలని తోగుట పీఠం పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి ఉద్బోధించారు. వరంగల్ ఎంజీఎం ఎదుట ఉన్న రాజరాజేశ్వరీదేవి దేవాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు, అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, బ్రాహ్మణసంఘాల నాయకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాతించారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. దేవాలయ కల్యాణమండపంలో స్వామివారి పాదుకలకు పాదుకపూజ, గురువందనం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ అర్చక ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ సంఘాల నాయకులు మోత్కూరి రాజేశ్వరరావు, ఐనవోలు సాయికృష్ణశర్మ, రాధాకృష్ణశర్మ, నాగిళ్ల షణ్ముఖ అవధాని తదితరులు స్వామిని ఆశీర్వాదం తీసుకున్నారు. -
హేమాచల క్షేత్రంలో కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. సెలవురోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భక్తులు భారీ సంఖ్యలో వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
విరివిగా మొక్కల పెంపకం
ఏటూరునాగారం:రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు గ్రామ పంచాయతీల పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టింది. వేసవిలో మొదలైన మొక్కల పెంపకం వర్షాకాలం ప్రారంభం నాటికి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టింది. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల్లో 171 నర్సరీలను ఏర్పాటు చేసింది. 5,64,950 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటికి ఐదు మొక్కలు ఇచ్చేలా.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భూగర్భ జలాల పెంపకం, గ్రామాలు పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నర్సరీల్లో పెరిగిన మొక్కలను ఇంటికి ఐదు మొక్కల చొప్పున ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో పండ్లు, పూల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా మొక్కలు నాటినందుకు, గోతులు తీసినందుకు కూడా ఈజీఎస్ ద్వారా డబ్బులు చెల్లించనున్నారు. ఉపాధి హామీ కార్డు ఉన్న కూలీలను ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. సంరక్షణ జీపీల బాధ్యత గ్రామంలోని ఇళ్ల పరిసరాలు, రోడ్ల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటించనున్నారు. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి నీటి సదుపాయాలను కల్పించేందుకు జీపీకి బాధ్యతలను అప్పగించారు. వీటితో పాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, రైతులను భాగస్వామ్యం చేయనున్నారు. ఉచితంగా పంపిణీ వేప, రావి, మర్రి, కానుగ, నేరేడు, ఉసిరి, మామిడి, జామ, సీతా ఫలాలు, గులాబీ, మల్లె, పచ్చని పూలు మొక్కలను పంపిణీ చేయనున్నారు. ఎక్కువగా గ్రామ పంచాయతీల నర్సరీల్లో పండ్లు, పూల మొక్కలు మాత్రమే ఉండగా నీడనిచ్చే మొక్కలను అటవీశాఖ ద్వారా పెంచే నర్సరీల ద్వారా ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. దీనివల్ల ఇళ్లలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫలాలు, పూలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయి. వీటితో పాటు గతేడాది నాటిన మొక్కలు ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కలను కూడా నాటించనున్నారు. ఏ మొక్క ఎలా ఉందని తెలిసేందుకు కూడా జియోట్యాగింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. వర్షాలు పడే వరకు మొక్కలను ఏపుగా పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం గృహాల్లో పెంచేందుకు పండ్లు, పూల మొక్కలుమండలం జీపీలు నర్సరీల టార్గెట్ ఏటూరునాగారం 12 37,060 గోవిందరావుపేట 18 68,000 కన్నాయిగూడెం 11 34,000 మల్లంపల్లి 10 37,000 మంగపేట 25 78,000 ములుగు 19 58,600 ఎస్ఎస్ తాడ్వాయి 18 58,600 వెంకటాపురం(కె) 23 80,090 వెంకటాపురం(ఎం) 18 59,600 వాజేడు 17 54,000 -
రాళ్లవాగుపై నూతన బ్రిడ్జి నిర్మించాలి
వెంకటాపురం(కె): మండ పరిధిలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలోని రాళ్ల వాగుపై నూతన బ్రిడ్జిని నిర్మించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి రఘురాం అన్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు ఆదివారం శిథిలావస్థలో ఉన్న రాళ్లవాగు బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ రాళ్లవాగు పై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందన్నారు. దీంతో బ్రిడ్జి గడ్డర్లు దెబ్బతిన్నాయన్నారు. బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి ప్రత్యామ్నాయ వంతెన నిర్మించకపోతే రవాణా స్తంభించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంకిశోర్, శ్రీకిషన్, శేఖర్, అంకా దుర్గ, సాయి ప్రసాద్, ఉప్పల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పూజల నిర్వహణ ఎక్కడ?
● 17న కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి పనుల ప్రారంభం ● షాపింగ్ కాంప్లెక్సు నిర్వాహకుల ఆందోళన కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి పనులకు ఈనెల 17న ముహూర్తం ఖరారు కావడంతో భక్తులు, ప్రజల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం దేవస్థానానికి రూ.198కోట్ల వ్యయంతో రాతి నిర్మాణం పనులు చేపడుతుండగా, ప్రస్తుత గర్భాలయంతో పాటు పలు ఉప ఆలయాల తొలిగింపు ప్రక్రియ జరుగనుంది. దీంతో గర్భాలయంలోని జోడు లింగాలకు తమిళనాడులోని శిల్పులు కొలతలు తీసుకున్నారు. వాటిని యధాస్థితిలో ఉంచి నిర్మాణ సమయంలో ప్రమాదం లేకుండా పైన కప్పులాగా నిర్మించనున్నారు. అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయం ఏర్పాటు కానుందని తెలిసింది. అక్కడే పూజలు నిర్వహణ జరుగుతుందని తెలిసింది. కానీ శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు ప్రతీ మంగళవారం నిర్వహిస్తారు. శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలు భక్తులు నిర్వహిస్తుంటారు. ఆలయ పునరుద్ధరణ నేపథ్యంలో పూజలు ఎక్కడ నిర్వహిస్తారనేది భక్తుల్లో ఆందోళనలు కలుగుతున్నాయి. కాలసర్ప, శనిపూజలు వీఐపీఘాటులో ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. -
ఫిట్నెస్పై కదలట్లే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బస్సులు, వ్యాన్లలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థుల ప్రాణ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక ప్రైవేట్ పాఠశాలల బస్సులు, వ్యాన్లు ఫిట్నెస్ చేయించుకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 33.43 శాతం బస్సులు ఇంకా సామర్థ్య పరీక్షల నిర్ధారణ (ఫిట్నెస్) సర్టిఫికెట్లు పొందలేదు. సోమవారం (జూన్ 1) నాటికి 820 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నాయి. ఫిట్నెస్ నత్తనడకపై సాక్షి కథనం.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ నత్తనడకన నడుస్తోందని ‘సాక్షి’ వారం కిందటే కథనం రూపంలో అధికారులు దృష్టికి తీసుకెళ్లింది. వారిలో పెద్ద కదలిక లేకపోవడం, ఇటు స్కూల్ యాజమాన్యాలు కూడా మాములుగా తీసుకోవడంతో వారం రోజుల్లో 125 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేశారు. ఇంకా 693 బస్సులకు బీమా, పర్మిట్లు, కాలుష్య ధ్రువపత్రాలు సైతం నవీకరించకపోయినా అధికారులు కఠిన చర్యలకు కదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు, చర్యలు ఇంకెప్పుడు..? హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో వందలాది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువభాగం విద్యార్థుల రవాణాకు బస్సులు, వ్యాన్లు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఈ వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణా శాఖ, పోలీసులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి. కానీ పాఠశాలలు తెరుచుకునే సమయం దగ్గరపడుతున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరగలేదని తెలుస్తోంది. రవాణాశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో మొత్తం 2,079 స్కూల్ బస్సులు, వ్యాన్లు ఉంటే.. శనివారం నాటికి 1,386 వాహనాలకే సామర్థ్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేశారు. 693 బస్సులకు ఇంకా ఫిట్నెస్ నిర్వహించలేదు. హనుమకొండ జిల్లాలో 348, వరంగల్లో 172, మహబూబాబాద్లో 43, జనగామలో 75, జేఎస్ భూపాలపల్లిలో 28, ములుగులో 27 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతేడాది తనిఖీల్లో అరిగిపోయిన టైర్లు, పని చేయని ఎమర్జెన్సీ డోర్లు, గడువు ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విస్టర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం, సీట్లకు మించి విద్యార్థులను ఎక్కించడం, జీపీఎస్ పరికరాలు పనిచేయకపోవడం, స్పీడ్ గవర్నర్లు లేకపోవడం వంటి ప్రధాన లోపాలను గుర్తించి సరిచేశారు. ఈసారి 693 బస్సులు ఇంకా ఫిట్నెస్కు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిట్నెస్ లేకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ తోపాటు డ్రైవర్ తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. క్లీనర్తోపాటు మిగతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు. – నాగలక్ష్మి, ఎంవీఐ, హనుమకొండ గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారుకొన్ని పాఠశాలల నిర్వాహకులు ఫిట్నెస్ లేని బస్సులను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్నారు. ఇక్కడ తనిఖీలు ఎక్కువ జరగవని, ఎవరూ పట్టించుకోరని నడుపుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే అధికారులు తనిఖీలు నిర్వహించాలి. – నద్దునూరి నాగరాజు, పేరెంట్ సీరియస్గా తీసుకోని స్కూళ్ల యాజమాన్యాలు, అధికారులు ఉమ్మడి జిల్లాలో 2,079 స్కూల్ బస్సులకు 1,386కే సామర్థ్య పరీక్షలు వారంలో 125 బస్సులకే ఫిట్నెస్.. ఇంకా ఫిట్నెస్ లేనివి 33.43 శాతం వారంలో తెరుచుకోనున్న స్కూళ్లు.. తనిఖీలు, చర్యలపై మీనమేషాలుఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలా... స్కూల్ బస్సులు : 2,079 ఫిట్నెస్ చేసినవి : 1,386 చేయించుకోనివి : 693 -
నేడు మృగశిర కార్తె..
● చేపల విక్రయానికి మత్స్యకారుల ఏర్పాట్లు ఏటూరునాగారం: నేటి మృగశిర కార్తెకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది సంప్రదాయకంగా రుతుపవన వర్షాల ప్రారంభాన్ని సూచిస్తుంది. మృగశిర కార్తె రోజు చేపలను తింటే అనారోగ్య సమస్యలు ఉండవని ప్రజలు భావిస్తుంటారు. అందుకని మత్స్యకారులు పెద్ద ఎత్తున చేపలు పట్టి విక్రయించడానికి వలలు సిద్ధం చేసుకున్నారు. నేడు(సోమవారం) ఉదయం నుంచే చేపలు అమ్మడానికి ఏటూరునాగారం మండల కేంద్రంలోని చేపల మార్కెట్ వద్దకు చేపలను తరలించడంతో పాటు ఓడవాడ, రామన్నగూడెం, రాంనగర్, జెడ్పీహెచ్ఎస్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా చేపల విక్రయదారులు ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా మణుగూరు, రామప్ప, తుపాకులగూడెం, పాలెం ప్రాజెక్టుల నుంచి కూడా చేపలను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. -
భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి
● డీఆర్డీఓ చంద్రశేఖర్ వెంకటాపురం(కె): గ్రామ సమాఖ్య ఫెడరేషన్ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని డీఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండలపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు గ్రామ సమాఖ్య వీఓలు, స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలో 31 గ్రామసమాఖ్య భవనాలకు ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలోనే అత్యధికంగా వెంకటాపురం మండలానికి భవనాలు మంజూరయ్యాయని, ఈనెల 25వ తేదీ లోపు బేస్మెంట్ లెవల్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బొగ్గం నారాయణ, ఏపీఎంలు రాజు, అప్పారావు, పీఆర్ఏఈ చరణ్, ఏపీఓ భవాని, సీసీలు శంకరమ్మ, నర్సయ్య, సమ్మయ్య, వెంకటలక్ష్మి, మండల సమాఖ్య అధ్యక్షురాలు పూనెం ఉషారాణి తదితరులు ఉన్నారు. వాజేడులో.. వాజేడు: మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలని డీఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు, కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. వీఓ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీఓ కృపాకర్, ఎంపీఓ చందులాల్, ఏపీఎం సతీష్ తదితరులు ఉన్నారు. -
పస్రా పోలీస్స్టేషన్ తనిఖీ
గోవిందరావుపేట: పరిపాలన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, రికార్డులు సరైన నిర్వహణకు నిర్థారించే లక్ష్యంతో ములుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రవీందర్, పస్రా సర్కిల్ ఇన్స్పెక్టర్ దయాకర్తో కలిసి శుక్రవారం పస్రా పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా అధికారులు కేస్ డైరీ (సీడీ) ఫైళ్లు, స్టేషన్ రికార్డులు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. డాక్యుమెంటేషన్ సక్రమంగా నిర్వహించబడుతుందా, క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తున్నారా అని తనిఖీ చేశారు. రిసెప్షన్ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాలను సమీక్షించారు. స్టేషన్ పరిపాలన, పరిశుభ్రత, రికార్డు నిర్వహణ విధానాలను సమీక్షించారు. రికార్డులను ఖచ్చి తంగా నిర్వహించడం, ప్రజలకు సత్వర సేవలు అందించడం, సిబ్బంది అప్రమత్తంగా ఉండాల ని సిబ్బందికి సూచించారు. తనిఖీ సందర్భంగా ఎస్సై తాజుద్దీన్ను నిబంధనల పట్టింపుపై ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. నేడు బూర్గుపేటలో ప్రజాదర్బార్ వెంకటాపురం(ఎం): ప్రజల సమస్యలను స్థానికంగానే తెలుసుకొని పరిష్కరించే విధంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నేడు (శనివారం) మండలంలోని బూర్గుపేట ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలపై దరఖాస్తులను అందజేయాలని కోరారు. సత్తన్న వర్ధంతి సభను విజయవంతం చేయాలి గోవిందరావుపేట: సీపీఐ(ఎంఎల్) ప్రజాప్రతిఘటన రాష్ట్ర కమిటీ కార్యదర్శి సామ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దుంపెల్లిగూడెం గ్రామంలో నేడు నిర్వహించనున్న సామ అంతిరెడ్డి అలియాస్ సత్తన్న పూలక్క వర్ధంతి సభను విజయవంతం చేయాలని పీవైఎల్ రాష్ట్ర కన్వీనర్ పావురాల భిక్షపతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం అధ్యక్షుడు బొబ్బల సాంబయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానంములుగు రూరల్: సమ్మక్క, సారక్క కేంద్రియ విశ్వవిద్యాలయంలో ఐదు విద్యా విభాగాల్లో 17 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం గెస్ట్ ప్యాకల్టీ విధానంలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కంప్యూటరింగ్, డాటా సైన్స్ అనలైటిక్స్, ఇంగ్లిష్, ఎకానమిక్స్ విభాగంలో అన్ రిజర్వుడ్ కోటా 6, ఈడబ్ల్యూఎస్ కోటా 2, ఓబీసీ కోటా 5, ఎస్సీ 3, ఎస్టీ 1 పోస్టులు (మొత్తం 17) భర్తీ చేయన్నుట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక పక్రియ యూనివర్సిటీ నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. యువకుడి దుర్మరణంమంగపేట: ద్విచక్ర వాహనం అదుపుతప్పి మండలంలోని అబ్బాయిగూడెంకు చెందిన కోరెం అరుణ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై టీవీఆర్ సూరి తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ్ మండలంలోని కత్తిగూడెం గోదావరి ఇసుక ర్యాంపులో పనిచేస్తున్నాడు. పని ప్రదేశం నుంచి గురువారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. రాత్రి సమయంలో మార్గమధ్యలోని వాడగూడెం వద్దకు వచ్చే సరికి ద్విచక్ర వాహనం అదుపుచేయలేక రోడ్డు పక్కన పంట పొలలాల్లోకి దూసుకుపోయింది. దీంతో తల నుదుటిభాగం వాహనం హ్యాండిల్కు బ లంగా గుద్దుకోవడంతో అధిక రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో సంఘటనను ఎవరు కూడా గమనించకపోవడంతో వెలుగులోకి రాలేదు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు సంఘటనా స్థలంలో అరుణ్ మృతి చెంది ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కోరెం అంజమ్మ, నారాయణ కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతిఒక్కరిని కంటనీరు తెప్పించింది. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సూరి తెలిపారు. -
ప్రజాదర్బార్తో సమస్యల పరిష్కారం
● మంత్రి ధనసరి సీతక్కఎస్ఎస్తాడ్వాయి: ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని పోచాపూర్, లింగాల గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో అటవీ అనుమతుల కారణంగా నిలిచిన రహదారి పనులకు అవసరమైన అనుమతులు సాధించి వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో వాగులు, చెరువుల అభివృద్ధికి రూ.70 నుంచి రూ.80 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ప్రజావాణికి దూర ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామాలకు చేరువగా ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అంతకుముందు రూ.10 లక్షలతో నిర్మించిన అంతర్గత రహదారి, రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అలాగే రూ. 11కోట్లతో బొల్లెపల్లి –పోచాపూర్, పోచాపూర్–అల్లిగూడెం బీటీ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్మీనా, అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ, వసంతరావు, మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి, సర్పంచులు మంకిడి మొగిలిపల్లి రవీందర్, మంకిడి శ్రీలత, డీపీఓ వెంకయ్య, ట్రైబల్ ఈఈ వీరభద్రం పాల్గొన్నారు. అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యం ములుగు రూరల్: అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఇంచర్ల ఎకో పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అడవుల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కీలకమన్నారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సందర్శించారు. అలాగే దేవగిరి పట్నంలో అడవిపందుల దాడిలో మృతి చెందిన వెంకటేశ్వరరెడ్డికి రూ.పది లక్షల ఆర్థిక సాయం చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో అటవీ సంరక్షణ అ ధికారి కాళేశ్వరం జోన్ (సీసీఎఫ్ఓ) ప్రభాకర్, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడే.. బాగుండె!
నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్ సర్జరీలుకాశిబుగ్గ: నాడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఆస్పత్రిలో కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ ద్వారా రెగ్యులర్గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్కు హెడ్గా ఉన్న డాక్టర్ అమరవాది ప్రభాకర్ 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ నామ్కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు అధిక డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. నేడు మూతపడిన కార్డియో థొరాసిక్ యూనిట్.. గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థొరాసిక్ యూనిట్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మార్చారు. ఈ యూనిట్ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థొరాసిక్ యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఫర్ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యూనిట్ మూతబడి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ యూనిట్లో గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయకపోయినా ఐదుగురికి గుండె శస్త్ర చికిత్సలు చేశారు. మరో 40 వరకు వాస్కులర్ సర్జరీలు చేశారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి రూ.60లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం హృద్రోగులకు ఓపీ సేవలు అందిస్తూ మిగతా సమయంలో ఫ్యాకల్టీ మొత్తం ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఆగిన శస్త్రచికిత్సలు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లోనూ నిలిచిన సేవలు 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు డాక్టర్ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు.. 2004 నుంచి 2007 వరకు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థొరాసిక్ సర్జన్గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థోరాసిక్ యూనిట్లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ ఆన్లైన్ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు. -
నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రైతులను మోసంచేసే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్లు నమోదు చేస్తామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీసీఎస్ టీం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీ చేసిందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలోని ప్రతీ మండలంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాఖల సమన్వయం కీలకం.. మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాస సేవలు అందించేందుకు సంబంధిత అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘చల్వాయి’కి రాష్ట్రస్థాయి గుర్తింపు
గోవిందరావుపేట: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, గ్రామ పరిశుభ్రత కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మండలంలోని చల్వాయి గ్రామ పంచాయతీకి రాష్ట్రస్థాయి ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు లభించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో చల్వాయి గ్రామ పంచాయతీ చేపట్టిన తడి–పొడి చెత్త సేకరణ, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ హిత కార్యక్రమాలు, పరిశుభ్రత చర్యలు, గ్రామ సుందరీకరణ పనులను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేకల రాధసుదర్శన్ మాట్లాడుతూ చల్వాయి గ్రామాన్ని పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, గ్రామ ప్రజల సహకారం, పంచాయతీ సిబ్బంది కృషి, ప్రజాప్రతినిధుల సమష్టి ప్రయత్నాల ఫలితంగానే ఈ అవార్డు లభించిందన్నారు. ఈ గుర్తింపు గ్రామాభివృద్ధికి మరింత ప్రేరణగా నిలుస్తుందన్నారు. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సనత్నగర్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
రైతన్నపై ఎరువుల భారం!
ములుగు: వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఎరువుల ధరలు పెరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కూలీల కొరతతో పాటు యంత్రాల ఖర్చులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎరువుల ధరలు పెరగడం పంటల సాగుపై ప్రభావం చూపుతుంది. ఒకవైపు నకిలీ విత్తనాలు, మరోవైపు ఎరువుల కొరత, పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు కలవరపడుతుంటే ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎకరానికి రూ.4 వేలకు పైగా పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రైతు భరోసా డబ్బులు సకాలంలో రాకపోవడంతో పాటు యాసంగిలో రెండు ఎకరాల వరకే పెట్టుబడి సాయం అందడంతో ఆందోళన చెందుతున్నారు. రూ.400ల వరకు పెరిగిన ధరలు కాంప్లెక్స్ ఎరువులు ఒక బస్తాకు రూ.100 నుంచి రూ.400ల వరకు పెరిగాయి. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఎరువులను అధికంగా వాడుతున్నారు. ఎరువుల ధరల పెరుగుదల రైతులకు ఆర్థికభారం పెంచుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో సాగు ఖర్చులు మరింత పెరిగి అన్నదాతలపై ఆర్థికభారం పడనుంది. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పంట పొలాలను సిద్ధం చేసి విత్తనాల కొనుగోలుకు మాత్రమే సరిపోతుంది. ఎరువుల కొనుగోలుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మద్దతు ధర లేకపోవడంతో పాటు క్వింటా ధాన్యానికి మిల్లర్లు సుమారు 10 కిలోల వరకు కోత పెడుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం బదులు వందశాతం సబ్సిడీపై ఎరువులను ఉచితంగా అందించాలని రైతులు కోరుతున్నారు. అవసరమయ్యే ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) యూరియా 17,504 డీఏపీ 10,000ఎంఓపీ 8,000పెరిగిన ఎరువుల ధరలు ఇలా (రూ.లల్లో) కొత్త ధరపాత ధర2,2501.9502,3501,9752,4001,3502,1752,0251,6001,8001,8501,500615775సూపర్పొటాష్డీఏపీ20:20:0:1312:32:1610:26:2614:35:1415:15:1528:28:0 వానాకాలం ముందే పెరిగిన ధరలు అన్నదాతలకు సాగు ఖర్చులు రెట్టింపు జిల్లాలో 1,63,229 ఎకరాల్లో సాగు అంచనాఉచితంగా అందించాలి రైతే దేశానికి వెన్నెముక, రైతు లేకపోతే రాజ్యం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు బాగుపడాలంటే ప్రభుత్వం ఎరువులను ఉచితంగా అందించాలి. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తున్నా.. చివరికి అవి చేతికొచ్చే పరిస్థితి లేదు. అతివృష్టి, అనావృష్టితో నిత్యం సతమతమవుతున్నా.. మళ్లీ వ్యవసాయానికే మొగ్గుచూపి పంటలను పండిస్తున్నారు. ఇప్పటికై న రైతులకు ఎరువులు ఉచితంగా అందించి పంటలకు మద్దతు ధర అందించాలి. –అల్లాడి రాజేశ్వర్రావు, రైతు, ములుగు -
ప్లాస్టిక్ను నిషేధించాలి
ములుగు: ప్రపంచ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కవర్స్, గ్లాసులు, ప్లేట్స్ నిషేధించాలని కోరుతూ శుక్రవారం పర్యావరణ విభాగం ములుగు ప్రముఖులు కొండా గిరివర్థఽన్, గండ్రకోట కుమార్ ములుగు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. ములుగులో ప్లాస్టిక్ పదార్థాలు చాలామంది కాల్చి వేస్తున్నారని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధించి స్టీల్ పాత్రలు వాడే వి ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి పోషన్న, భాష బోయిన మహేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్ఎంఎంఎస్లో ప్రతిభ ములుగు రూరల్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంస్) పరీక్షలో బండారుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటా రు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బండారుపల్లి మోడల్ స్కూల్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు స్కాలర్ షిప్కు ఎంపికై నట్లు ప్రిన్స్పాల్ దేవకి తెలిపారు. విద్యార్థులను అభినందించారు. -
నియంత్రణే లక్ష్యం
ములుగు రూరల్: క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రత పెరిగిపోవడంతో పాటు ఇతరులకు సంక్రమిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అవసరమైన మందులతో పాటు పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం నిక్షయమిత్ర ద్వారా కిట్లను అందిస్తోంది. క్షయవ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామాలలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. దీంతో పాటు గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 14 ఏళ్లు నిండిన వారి నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారికి తెమడ పరీక్షలతో పాటు స్క్రీనింగ్ చేసి వ్యాధి నిర్ధారణ చేపడుతున్నారు. జిల్లాలోని పది మండలాల పరిధిలో క్షయవ్యాధిగ్రస్తులు 248 మంది ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ నివేదికలు తెలుపుతున్నాయి. క్షయవ్యాధి నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో క్షయవ్యాధి తీవ్రత ఆధారంగా 20 గ్రామాలను ఎంపిక చేసి 100 శాతం ప్రజలకు క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తొలుత మూడు గ్రామాలను ఎంపిక చేసి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెమడ పరీక్షల్లో నిర్ధారణ కాని వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు అధునాతన పరికరాలతో స్క్రీనింగ్ వ్యాధిగ్రస్తులకు పోషణ కిట్ల అందజేత మండలం వ్యాధిగ్రస్తులు ములుగు 46వెంకటాపురం(ఎం) 25గోవిందరావుపేట 27ఎస్ఎస్ తాడ్వాయి 25ఏటూరునాగారం 24కన్నాయిగూడెం 13మంగపేట 30వెంకటాపురం(కె) 36వాజేడు 22 -
రామప్ప అభివృద్ధికి కృషి
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి గురువారం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకై క యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేవాలయంలో పురావస్తు, పర్యాటక, దేవాదాయ శాఖల అభివృద్ధి నిధులకు ప్రతిపాదనలు పంపిస్తే పార్లమెంటులో ప్రస్తావించి నిధుల సమీకరణకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ పేర్కొన్నారు. రామప్ప శిల్పకళ సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, దశరథ్, దేవాదాయ, టూరిజం, పురావస్తు శాఖల సిబ్బంది ఉన్నారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి -
మేలో జిల్లాల వారీగా వివరాలు..
97,66092,6261,39,3561,20,8801,37,8211,22,59146,16542,83660,61656,097హనుమకొండజనగామభూపాలపల్లిములుగువరంగల్ -
డయాగ్నొస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి
మంగపేట : డయాగ్నొస్ట్టిక్ సెంటర్లకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ రక్తపరీక్ష కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయాగ్నొస్టిక్స్ సెంటర్ల సర్టిఫికెట్లతో పాటు ఓపీ రిజిస్టర్లు, ల్యాబ్ సౌకర్యాలను పరిశీలించి నిర్వహణలో లోపాలను గుర్తించి వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు పాటించాలని సూచించారు. అదే విధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈఎస్ఆర్ డయాగ్నొస్టిక్ సెంటర్ను తనిఖీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సెంటర్ను నిర్వహించడం, అర్హత లేకుండా పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే పరీక్షలు నిలిపివేసి వారం రోజుల్లో నిర్వహణకు సంబంధించి అనుమతులు చూపించాలని నోటీసులను జారీ చేశారు. ఆయన వెంట మంగపేట పీహెచ్సీ వైద్యాధికారి అఖిల ఉన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ -
వైభవంగా ముయ్యలమ్మ జాతర
● భారీగా తరలివచ్చిన భక్తజనం వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామంలో గురువారం ముయ్యలమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొంది ఇంటిపేరు ఉన్న వారు జాతరను నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చారు. పూజారుల సమక్షంలో గ్రామస్తులు మేళతాళాల నడుమ గుట్ట నుంచి నేరుగా ముయ్యలమ్మ గద్దెకు వనం తీసుకుకొచ్చారు. సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు గుట్ట నుంచి ముయ్యలమ్మ దేవతను తీసుకొచ్చారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు తీర్చాలని దేవతను వేడుకున్నారు. కొత్తగూడెం, ములుగు, ఛత్తీస్గఢ్ నుంచి గొంది వంశస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
వెంకటాపురం(ఎం): గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కేశవాపూర్ లో గురువారం నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను సందర్శించి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామసభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పనులను ప్రణాళికతో అమలు చేస్తామని, డీఆర్డీఏ, ఎంపీడీవోలు, ఎంపీఓల సమన్వయంతో జిల్లా స్థాయిలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని వెల్ల డించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అందించే పథకాల ప్రయోజనాలు సకాలంలో అందాలంటే నమోదు కీలకమని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ప్రజలు అధికంగా పాల్గొనాలని, ఉపాధి పనుల్లో కార్మికుల భాగస్వామ్యం పెరిగితే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీఓ భవనాలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు లభించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, పంచాయతీరాజ్ శాఖ అధికా రులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికా రులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్శకులకు మెరుగైన సేవలు అందించాలి గోవిందరావుపేట: లక్నవరం సరస్సుకు వచ్చే సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మండల పరిధిలోని లక్నవరం సరస్సును కలెక్టర్ గురువారం సందర్శించారు. పర్యాటకకేంద్రంగా పేరుగాంచిన లక్నవరం సరస్సులో పర్యాటకులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సరస్సు పరిసర ప్రాంతాలు, ఉయ్యాల వంతెన, బోటింగ్ కేంద్రం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పరిశుభ్రత నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అదికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటకులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే బోటింగ్ కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సరస్సు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని సూచించారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
భద్రతకు అత్యంత ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఏరియాలోని కేటీకే–1 గనిలో గురువారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా నియమాలు, పనిస్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సింగరేణి నిర్దేశించుకున్న జీరో హార్మ్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అప్రమత్తతతో విధులు నిర్వహించడం ద్వారా ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ మాటూరి రవీందర్, ఏరియా ఇంజనీర్ రాజారావు, కేటీకే–1వ గని మేనేజర్ ప్రవీణ్ విక్రమ్, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.● ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి -
సర్వీస్ రికార్డే కీలకం..!?
పోలీస్శాఖలో కొత్త ఫార్ములా.. ● పోస్టింగ్ల ‘రాజకీయా’నికి డీజీపీ బ్రేక్ ● ‘సేఫ్ పోస్టింగ్’లకు ‘డిప్యుటేషన్’తో చెక్.. లూప్లైన్ డ్యూటీలు ఇక తప్పనిసరి ● ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కంటే డీజీపీ రూల్సే పవర్ఫుల్ ● ఒకేచోట ఉంటే కూడా ఔట్... పోలీస్వర్గాల్లో కలకలంసాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో తప్పనిసరి డిప్యుటేషన్ విధానం మళ్లీ అమల్లోకి రాబోతుంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ కొత్త నిబంధనలను అమలు చేసే పనిలో పడ్డారు. పోలీస్ అధికారి ఇకపై ప్రమోషన్కు ముందు.. తర్వాత కనీసం రెండేళ్లయినా డిప్యుటేషన్పై లూప్లైన్ పోస్టింగుల్లో పనిచేయాల్సిందే. గతంలోనూ ఈ నిబంధనలున్నా.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా అమలు కాలేదు. చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ/ఏసీపీల వరకు శాంతిభద్రతల విభాగంలోనే కొనసాగుతూ వస్తున్నారు. డీజీపీ కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే డిప్యుటేషన్పై ఇతర యూనిట్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. సిఫార్సులు కాకుండా సర్వీస్ రికార్డులు ప్రామాణికంగా పదోన్నతులు, పోస్టింగ్లు దక్కనున్నాయన్న చర్చ ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. బదిలీ లేదా డిప్యుటేషన్.. పలువురు అధికారులకు ఎఫెక్ట్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురిపై బదిలీ లేదా డిప్యుటేషన్ వేటు తప్పేట్టులేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు గణనీయ సంఖ్యలో ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ/ఏసీపీలు 10–15 మంది, సీఐలు 30 మందికిపైగా, ఎస్ఐలు 40–50 మంది వరకు ఉండగా, కొత్త విధానం అమలైతే వీరంతా బదిలీ, డిప్యుటేషన్ పరిధిలోకి వచ్చే అవకాశముందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సీఐ, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న పలువురు రెండు నుంచి మూడు ప్రమోషన్లు పొందినా.. చాలామంది సీఐడీ, డీసీఆర్బీ, పీసీఆర్, పీటీసీ, సీటీసీ, ఇంటెలిజెన్స్ తదితర లూపులైన్ విభాగాలవైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో డీజీపీ కొత్త నిర్ణయంతో ఉమ్మడి వరంగల్లో చాలామందికి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. కుటుంబం, పిల్లల విద్య, స్థానిక అనుబంధాల కారణంగా కొందరు సీనియర్ అధికారులు డిప్యుటేషన్లు, బదిలీల నిర్ణయంపై ఆందోళన చెందుతుండగా, కీలక పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్న యువ అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఒకే వర్గం అధికారుల ఆధిపత్యానికి చెక్ పడి కీలక పోస్టుల్లో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయని, ఫీల్డ్, లాఅండ్ఆర్డర్, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ విభాగాల్లో అనుభవం, పోస్టింగ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని వారంటున్నారు. లూప్లైన్ విధులు తప్పనిసరి.. దీర్ఘకాలికంగా శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులకు లూపులైన్ పోస్టింగ్లు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు పట్టణ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ప్రత్యేక విభాగాల పోస్టింగులలో రాజకీయ ప్రభావం కీలక పాత్ర పోషించేదన్న అభిప్రాయం ఉంది. కొత్త విధానం అమలైతే ఒకేచోట ఎక్కువకాలం కొనసాగడం కష్టమవడంతోపాటు సిఫార్సుల ప్రభావం కూడా తగ్గే అవకాశముంది. ఒకే కమిషనరేట్, జిల్లా లేదా ప్రత్యేక విభాగంలో ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న అధికారులను ఇతర యూనిట్లు, జిల్లాలు లేదా విభాగాలకు పంపడం అనివార్యం కానుంది. ఇకపై పోస్టింగ్లలో వ్యక్తిగత సిఫార్సుల కంటే సర్వీస్ రికార్డు, పనితీరు, పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. సీపీ/ఎస్పీ కార్యాలయాలు 04 ఏసీపీ/డీఎస్పీ కార్యాలయాలు 21 సర్కిల్ కార్యాలయాలు 26 మొత్తం పోలీసుస్టేషన్లు 91 -
గోదావర్రీ
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు సాయిని లక్ష్మీనర్సయ్య. ఏటూరునాగారంలోని శంకరాజుపల్లి. ముళ్లకట్ట శివారు ప్రాంతంలో 106/బీ సర్వే నంబర్లోని ఒక ఎకరం భూమి గోదావరి వరదలో కలిసిపోయింది. పక్కనే మరో 20 గుంటల భూమి ఉండగా క్రమంగా అదికూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. ప్రతీ ఏడాది మిర్చి పంటను ఎక్కువగా పండించేవారు. ఎకరంన్నర భూమి కనుమరుగు అయ్యింది. అందులో బోరు పాయింట్ సైతం గోదావరిలోనే కలిసిపోయింది. ఈయనతో పాటు మరో 33 మంది రైతులు భూములు కూడా గోదావరిలోనే కలిసిపోయాయి. ఏటూరునాగారం: జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు గోదావరి పరీవాహక ప్రాంతాలకు చెందిన రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గోదావరి వరదలకు విలువైన పంట భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉండడంతో పాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఒడ్డు వెంట కాంక్రీట్ వాల్స్తో పాటు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలని సర్వే బృందం ఇచ్చిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు ప్రాంతాల్లోని గోదావరి మూలమలుపుల వద్ద ఉన్న భూమి ఎక్కువగా ఒర్లిపోతుంది. ఏటూరునాగారంలోని 6 చోట్ల, కన్నాయిడెంలో 5 చోట్ల, మంగపేట మండలంలోని 8 చోట్ల మూలమలుపులున్నాయి. రైతుల ఒత్తిడి మేరకు 2024లో అప్పటి సర్వే బృందం అవసరమైన చోట్ల క్రాస్ సెక్షన్లు(నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు తీరం వద్ద నదిలో కాంక్రీట్ వాల్ నిర్మాణాలు) నిర్మాంచాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగానే జియోట్యూబ్స్ ప్రతిపాదన చేయగా ప్రస్తుతం రామన్నగూడెం వద్ద పనులు కొనసాగుతున్నాయి. కాని ముళ్లకట్ట, రొయ్యూర్, శంకరాజుపల్లి, ఓడవాడ, రాంనగర్, కమలాపురం ప్రాంతాల్లో రాతికట్టడాలను కట్టాల్సి ఉండగా ఆ పనులు మొదలు కాలేదు. స్థానిక వాగులు, వంకల నుంచి వచ్చే వరదను గోదావరి నదిలోకి ఎత్తిపోయడానికి ఏడు చోట్ల లిఫ్టుల ఏర్పాటు చేయాల్సి ఉందని నివేదికలు ఇచ్చారు. పంపుల ఏర్పాట్లకు సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ కావాల్సి ఉంది. గోదావరికి ఇరువైపులా కరకట్టల నిర్మాణంతో పాటు స్థానిక ప్రవాహాలను నది దిగువ భాగంలో కలిపేలా ప్రత్యేకంగా కాల్వల నిర్మాణం చేయాల్సి ఉంది. అన్ని నిర్మాణాలకు సుమారు రూ. 4,100 కోట్ల వరకు బడ్జెట్ అవసరమని నివేదికలో సర్వే బృందం పేర్కొంది. ఇవి ప్రతిపాదనల దశలోనే ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 1986లో అత్యంత భారీ వరదలు రావడంతో అనేక ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. దాని ఆధారంగానే 1991లో ఎక్కెల నుంచి రామన్నగూడెం, మంగపేట వరకు 10.64 కరకట్ట నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. 2022లో అతి భారీ వరదలు వచ్చాయి. ఈ సారి ఏజెన్సీ గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేసి అప్పటి ప్రభుత్వానికి రూ.119 కోట్లతో వరద ముంపు ఉన్న ప్రాంతాలకు కాంక్రీట్ వాల్ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. కానీ ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో ఒక్క అడుగు పడలేదు. కనుమరుగవుతున్న విలువైన పంటభూములు ఇబ్బందులు పడుతున్న రైతులు కాగితాలకే పరిమితమైన రక్షణ చర్యలు కానరాని కాంక్రీట్వాల్, కరకట్టల నిర్మాణం -
అత్యవసరంగా కావాల్సినవి..
పరికరం సంఖ్య వ్యయం ఫుల్రూమ్ డీఆర్ ఎక్స్రే 2 70 లక్షలు మొబైల్ డీఆర్ ఎక్స్రే 4 80 లక్షలు అల్ట్రాసౌండ్ 4 1.20 కోట్లు హారిజొంటల్ ఆటోక్లేవ్స్ 3 15 లక్షలు ఓటీ టేబుల్స్ 4 16 లక్షలుప్రధాన పరికరాల పరిస్థితి ఇలా పరికరం ఎంజీఎం సూపర్ స్పెషాలిటీఎంఆర్ఐ 1 (తరచూ మరమ్మతు) లేదు సీటీ స్కాన్ 1 (మరమ్మతు) 1 (పనిచేయదు) క్యాథ్ ల్యాబ్ లేదు 1 (పనిచేయదు) డీఆర్ ఎక్స్రే పాతది (మరమ్మతు) 1 ( ఏఎంసీ డ్యూ) అల్ట్రాసౌండ్ 4 (పాతవి, మరమ్మతు) 2 2డీ ఇకో 1 (పనిచేయదు) పనిచేస్తోంది ఈసీజీ 4 తరచూ మరమ్మతు 2 పనిచేస్తున్నాయిఎంజీఎం ఆస్పత్రి ఓపీలు, పరీక్షలు (సుమారుగా) రోజువారీ ఓపీ : 2,000 ఇన్పేషంట్లు : 1,000 ఎంఆర్ఐ/సీటీ స్కాన్ అవసరమయ్యే వారు : 500 ప్రస్తుతం జరుగుతున్న స్కాన్లు : 50 అల్ట్రాసౌండ్ అవసరమయ్యే వారు : 200 ప్రస్తుతం జరుగుతున్న అల్ట్రాసౌండ్లు: 100లోపు -
ఐటీడీఏ డీడీ జనార్దన్ బదిలీ
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలోని గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఉప సంచాలకుడి(డీడీ)గా పనిచేస్తున్న దబ్బగట్ల జనార్దన్ బుధవారం బదిలీ అయ్యారు. మంచిర్యాల గిరిజన సంక్షేమ అధికారిగా వెళ్లారు. ఆయన స్థానంలో నాగర్కర్నూలు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఫిరంగికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారం డీడీగా బదిలీ చేశారు. అదే విధంగా ఐటీడీఏ ఇన్చార్జ్ ఏఓగా ఎస్డీసీ విభాగంలో డీటీగా పనిచేస్తున్న అనిల్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలిములుగు రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా నోడల్ ఆఫీసర్ అరుణాదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈకో క్లబ్, బండారుపల్లి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో తెలంగాణ కాలు ష్య నియంత్రణ మండలి సహకారంతో ప్రజా పాలన ప్రగతి ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణాదేవి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా యువత కృషిచేయాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ‘పచ్చని భవిష్యత్ కోసం సుస్థిర అభివృద్ధి, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు’ అంశాలపై నిర్వహించారు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ సరిత, మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ దేవకి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రసన్న కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహనతోనే ప్రమాదాల నివారణ భూపాలపల్లి అర్బన్: భద్రతపై అవగాహన కలిగిఉన్నప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఏరియాలోని కేటీకే–5వ గనిలో బుధవారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు భద్రతా నిబంధనలు, పనిస్థలాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్మికులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల భద్రత సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున భద్రత విషయంలో రాజీ పడొద్దన్నారు. సంస్థ నిర్దేశించుకున్న ‘జీరో హార్మ్’ లక్ష్య సాధనకు యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) తప్పనిసరిగా వినియోగించడం, యంత్రాలు, పరికరాలను నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. పనిస్థలంలో అసురక్షిత పరిస్థితులు కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రమాదాలను గుర్తించి నివారించే సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఏటూరునాగారం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం పనిచేస్తుందని ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి తెలిపారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం నిర్వహించిన వినియోగదారుల ఫోరం వేదికలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారులు వినియోగదారుల సమస్యలను పట్టించుకోకపోతే ఫోరానికి ఫిర్యాదు చేయాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు తీసివేయడం, కొత్తవి మార్చడం, మీటర్లను అమర్చడం, బిల్ అధికంగా రావడం వంటి సమస్యలను ఫోరం పరిష్కరిస్తుందని వెల్లడించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు వెంట ఉన్న స్తంభాలు కొత్తవి వేయాలని, తీగలను అమర్చాలని పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. 1912 నంబర్కు కాల్ చేసి సమాచారం అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు వివరించారు. అనంతరం వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాల చారి ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా అధికారులు, సిబ్బంది ఘనంగా చైర్మన్ను సన్మానించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఫైనాన్స్ సభ్యుడు దేవేందర్, ఇండిపెండెంట్ సభ్యుడు రామారావు, డీఈ పురుషోత్తం, ఏడీఈ ఉమారావు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి -
సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ములుగు: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజలకు సామాజిక న్యాయంతో పాటు రాష్ట్ర ఆర్థిక పురోగతిని పెంచే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తూ ప్రతీ కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఐక్యతతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలో పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉద్యమకారుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చామని తెలిపారు. రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా జిల్లాలో 7,095 మందికి వైద్యం అందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పేదలకు రూ. 29,15కోట్ల లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 2,500 గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 24,038 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. 34 మలేరియా, 10 డెంగీ కేసులను నిర్ధారించి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించినట్లు వివరించారు. అటవీ ప్రాంతాల్లో తక్షణ వైద్య సహాయం అందించుటకు 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 1,965 మంది పేదగిరిజన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వైద్యం అందించినట్లు వివరించారు. సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలను అందించినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం రాష్ట్రంలోనే వినూత్నంగా మొట్టమొదటిసారిగా జిల్లాలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీతక్క తెలిపారు. వెంకటాపురం, ములుగు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని మారుమూల 50 గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించి అర్జీదారుల నుంచి 1,421 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. అందులో 321 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళా సంఘాలకు రూ.26 కోట్లకు పైగా రుణాలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలుమహిళల ఆర్థిక సాధికారతకు రుణాలు మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ఊతమిచ్చేలా వివిధ పథకాల కింద రూ.28 కోట్లకు పైగా రుణాలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. జిల్లాలోని 210 స్వయం సహాయక సంఘాలకు రూ.20.50 కోట్ల రుణాలను, 59 గ్రామ సంస్థలకు మార్కెటింగ్ కమీషన్ రూ.1.89 కోట్లను, గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధే లక్ష్యంగా మహిళా సభ్యులకు రూ.1.59 కోట్లను అందించినట్లు వెల్లడించారు. అలాగే సీ్త్ర నిధి ద్వారా రూ.2.20 కోట్లను, మెప్మా బ్యాంకేజీ కింద రూ.2.15 కోట్లను లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు వెల్లడించారు. -
అలుపెరుగని పోరాటం
● తెలంగాణ ఉద్యమంలో పార్టీలకతీతంగా ఉద్యమించిన ప్రజలు ● సకలజనుల సమ్మెతో స్తంభించిన ములుగు ● రోడ్డెక్కిన ఉపాధ్యాయులు, కళాకారులు, యువత, విద్యార్థులు ● పలువురిపై కేసులు నమోదైనా సంకల్పం కోల్పోకుండా ముందుకు..ములుగు: త్యాగాల నేల.. పోరాటాల గడ్డ ములుగు ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు అలుపెరుగని పోరాటం చేశారు. ఉద్యమ సమయంలో కళాకారులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకులు, యువత, విద్యార్థులు పార్టీలకతీతంగా రోడ్డెక్కి ఉద్యమించారు. పలువురిపై కేసులు నమోదైనప్పటికీ సంకల్పం కోల్పోకుండా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. కవులు, కళా కారులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. కళాకారుల పాటలే ఉద్యమానికి ఊపిరి అయ్యాయి. డప్పులు చేత పట్టుకొని యువత, విద్యార్థులు కదం తొక్కుతూ పల్లెల నుంచి పట్టణం వరకు తెలంగాణ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లారు. సకలజనలు సమ్మెతో ఉద్యమం తీవ్రరూపం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2000 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ 2011లో తీవ్ర రూపం దాల్చింది. 2011 సెప్టెంబర్ 13న మొదలైన సకలజనుల సమ్మెలో పార్టీలకతీతంగా నాయకులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కుల సంఘాలు ఒక్కటై తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లారు. ర్యాలీలు, రాస్తారోకో, నిరహార దీక్షలు, వంటావార్పు, బతుకమ్మలతో మహిళలు ఆటలాడుతూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ములుగులో నిర్వహించిన సకలజనుల సమ్మెకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరై ఉద్యమానికి ఊపిరి పోశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఊరురా చైతన్య సదస్సులు నిర్వహించారు. 42 రోజుల పాటు చేసిన సకలజనుల సమ్మెతో జిల్లా స్తంభించిపోయింది. హైదరాబాద్లో నిర్వహించిన మిలియన్ మార్చ్కు సైతం ములుగు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జిల్లా నుంచి మాజీ మంత్రి దివంగత అజ్మీర చందూలాల్, ప్రస్తుత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కూడా పాల్గొన్నారు. ప్రాణత్యాగానికి పాల్పడిన శ్రీనివాస్ ములుగు మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన దసరాపు శ్రీనివాస్ 2011లో రాష్ట్రం కోసం ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాష్ట్ర ఉద్యమంలో అసువులుభాషిన శ్రీనివాస్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు భార్య రజితకు మామునూర్ పోలీస్ క్యాంపులో ఉద్యోగం కల్పించారు. అతను ఉద్యమ సమయంలో తలపెట్టిన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.ఉద్యోగులందరూ భాగస్వాములే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతీ ఉద్యోగి ఉద్యమంలో భాగస్వామిగా మారి ఆందోళనలు నిర్వహించారు. సకల జనుల సమ్మెలో ఉపాధ్యాయ జేఏసీ తరఫున నిరహారదీక్షలు చేపట్టాం. రోడ్డుపై వంటావార్పు, మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆటలాడుతూ తెలంగాణ ఆకాంక్షను చాటాం. పల్లెల్లో ప్రజా చైతన్య రథంతో తిరిగాం. – గంట సంజీవరెడ్డి, మాజీ ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ఇల్లు వదిలి ఉద్యమాలు చేశాం..తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఇల్లు, వాకిలి వదిలిపెట్టి ఉద్యమాలు చేశాం. 2002లో కామారెడ్డిలో ధూందాం ప్రారంభించి జిల్లాల్లో తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. కళాకారులమంతా బృందాలుగా ఏర్పడి ఉద్యమ ఆకాంక్షను సాంస్కృతిక కళారూపాలతో వివరించాం. అప్పుడు ఉన్న పాలకపక్షాలు బెదిరించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో గొంతెత్తి పాటలు పాడాం. – రేలా విజయ్, కవి,గాయకుడు, ములుగు -
గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలి
● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుములుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 4, 6, 8, 10వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామసభలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సభల కార్యక్రమాల ప్రణాళిక, ఏర్పాట్లు, వ్యవసాయం, విపత్తు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ పర్యావరణ వారోత్సవాల నిర్వహణతో పాటు గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజలు మొక్కలు నాటడం, వర్షాభావ పరిస్థితులు వస్తే ఏ విధమైన పంటలు సాగు చేయాలి, సురక్షిత, తాగునీటి సరఫరా, పంటలు మార్పిడి తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జూన్ నెలలో ప్రారంభమయ్యే ప్రత్యే క ఓటరు జాబితా సవరణపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. రైతులు పంటల మార్పిడి పద్ధతులను అనుసరించాలన్నారు. వర్షాకాల సన్నద్ధత, మొక్కల నాటకం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ.ఆనంద్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్, ఎస్పీ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల గ్రామ, వార్డు సభల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మండలాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఐఓ అప్పలనాయుడు, డీఏఓ సురేశ్కుమార్, డీహెచ్ఓ సంజీవరావు, డీఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రీల్స్ కాంపిటీషన్ విజేతలకు నగదు పురస్కారం
పర్యాటక వారోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక ప్రాంతాలను సృజనాత్మకంగా రీల్స్ చేసి పంపిన ఇన్ఫ్లుఝెన్సర్స్ రీల్స్ కాంపిటీషన్ విజేతలకు మంత్రి సీతక్క నగదు పురస్కారాన్ని అందించారు. మంగపేట మండలానికి చెందిన శ్రావణ్కుమార్కు ప్రథమ బహుమతి రూ.21 వేలు, ఏటూరునాగారం మండలానికి చెందిన రాకేష్కు రూ.15వేలు, మామునూరుకు చెందిన కావ్యకు రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సీతక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కల్యాణి, ఇన్చార్జ్ ఆర్డీఓ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్తం ఖరారు!
● ఈనెల 17న కాళేశ్వరంలో రాతి నిర్మాణాల పనులు ప్రారంభం ● వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రారంభోత్సవాలుకాళేశ్వరం: కాకతీయులు, చాలుక్యులు 11వ శతాబ్దంలో నిర్మించిన కాళేశ్వరం దేవస్థానం మరో సరికొత్త నిర్మాణాలకు వేదిక కానుంది. 1982కు పూర్వం శిథిలావస్థలో ఉన్న కాళేశ్వరాలయం..దినదినాభివృద్ధి చెందుతుంది. తాజాగా కాళేశ్వరాలయంలో రాతి నిర్మాణాలకు ఏప్రిల్ 20న సీఎం ఎనుముల రేవంత్రెడ్డి రూ.198కోట్ల వ్యయంతో భూమి పూజ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం దేవస్థానంలోని నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఈనెల 17న ఉదయం 8 గంటలకు శాస్త్రోక్తంగా విశేష పూజలతో పనులు ప్రారంభిస్తారని ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు స్వయాన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమంలో చెప్పారు. దీంతో కాళేశ్వరం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చి కొంగొత్త రూపు దిద్దుకోనుంది. రూ.198కోట్లతో ఇలా.. రూ.133.50కోట్లతో ఆలయ కాంప్లెక్స్లోని గర్భాలయం, అర్థమండపం, శిఖరం, నందులు, ధ్వజం, 11 ఉప ఆలయాలు, ప్రాకారం, ఆగ్నేయంలో పాకశాల, నైరుతిలో విజయగణపతి ఆలయం, వాయువ్యంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, నాలుగు రాజగోపురాల నిర్మాణాలు చేస్తారు. ఈఓ కార్యాలయం, దేవస్థానం, దుకాణాల సముదాయం, ఎస్ఎస్ఆర్ కాటేజీ, సింగరేణి గెస్ట్హౌస్లు తొలిగిస్తారని తెలిసింది. రూ. 5కోట్లతో భూసేకరణ కింద సమీపంలోని కొన్ని గృహాలకు సంబంధించి తొలిస్తారని సమాచారం. రూ.35.50కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులు వెయిటింగ్ షెడ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, టిక్కెట్ కౌంటర్ హాల్, కల్చరల్ సెంటర్, బ్యాంకు, ఎస్ఆర్ఆర్ కాటేజీ, ఈఓ కార్యాలయం, ప్రవేశ తోరణం, అభివృద్ధి పనులు చేస్తారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ ఏటూరునాగారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఏటూరునాగారం దక్షిణం రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతిలో ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ చిన్నబోయినపల్లి పల్లె ప్రకృతి వనం నుంచి అటవీశాఖ చెక్ పోస్టు వరకు చెత్తాచెదారం ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు పెంచాలని కోరారు. విద్యార్థులు పాఠశాలల్లో క్రీడా మైదానాల వెంట మొక్కలను పెంచాలని సూచించారు. మీడియా క్రికెట్ పోటీలు ప్రారంభం ములుగు రూరల్: మీడియా క్రికెట్ పోటీలు అట్టహాసంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జాకారం పోలీస్ హెడ్ క్వాటర్స్లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ , డీఎఫ్ఓ వికాస్ మీనా క్రీడాపోటీలను ప్రారంభించారు. ములుగు ప్రింట్ మీడియా, వాజేడు టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. ములుగు మీడియా టీంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆడగా వాజేడు జట్టులో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆడారు. ఈ పోటీలో వాజేడు జట్టు విజయం సాధించింది. అన్ని మండలాల జట్లు పోటీలలో పాల్గొని గెలిచిన జట్టుతో పోలీస్ టీం తలపడనుంది. -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
ములుగు: నేటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు. కలెక్టరేట్లో నేడు(మంగళవారం)నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 8 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అనంతరం పోలీసులతో మంత్రి సీతక్క గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలపై వివరించనున్నట్లు తెలిపారు. వేడుకల నిర్వహణకు సంబంధించి తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు సంబంధిత శాఖల అధికారులు చేపట్టినట్లు తెలిపారు. -
పర్యాటక హబ్..
మేడారం జాతరలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మాస్టర్ ప్లాన్లో భాగంగా మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లతో పనులు చేపట్టారు. మరో రూ. 100 కోట్లతో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాట్లతో పాటు మేడారం ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో పెను మార్పులు తీసుకొచ్చారు. అలాగే రామప్ప, లక్నవరం, మేడారం, బొగత జలపాతం, మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి కొలువైన హేమాచలక్షేత్రం వంటి ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. జిల్లాలోని జంగాలపల్లి, తాడ్వాయి ఎన్హెచ్పై ప్రధాన కూడళ్లలో థీమ్స్ నిర్మాణాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. -
ప్రభుత్వ పాఠశాలలో 103 అడ్మిషన్లు
ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో 103 మంది విద్యార్థులు సోమవారం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులు హెడ్మాస్టర్ కవిత ద్వారా అడ్మిషన్లు స్వీకరించినట్లు చిన్నబోయినపల్లి సర్పంచ్ నల్ల బోయిన నాగార్జున తెలిపారు. మండల పరిధి లోని చిన్నబోయినపల్లి డీఎన్టీ పాఠశాలలో ప్రత్యేక విద్యాబోధన కోసం ఎల్కేజీ, యూకేజీతో పాటు 7వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో ప్రత్యేక బోధన, సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అడ్మిషన్లను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్ఐటీఐ, ఏటీసీ అడ్మిషన్లు పొందాలి ఏటూరునాగారం: జిల్లాలోని ఆర్ఐటీఐ, ఏటీసీ కేంద్రాల్లో అర్హులైన విద్యార్థులు అడ్మిషన్లను పొందాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ఆర్ఐటీఐ, ఏటీసీ సెంటర్ల అడ్మిషన్ల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గిరిజన యువతకు ప్రభుత్వ ఆర్ఐటీఐ , ఏటీసీ సంస్థల్లో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల గురించి సమాచారం అందించడంతో పాటు శిక్షణ ఇస్తామన్నారు. నైపుణ్య ఆధారిత విద్య ద్వారా విజయవంతమైన ఉపాధి, కేరిర్ అవకాశాలను పొందేలా ప్రోత్సహించడమే లక్ష్యమని పీఓ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, యాదగిరి, మువీన్, విక్రమ్ పాల్గొన్నారు. రామప్పలో సినిమా షూటింగ్వెంకటాపురం(ఎం): షైన్ స్టూడియో బ్యానర్ పై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నంబర్ నెం. 2 సినిమా షూటింగ్ను రామప్ప దేవాలయంలో సోమవారం మంత్రి సీతక్క తనయుడు సూర్య, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షైన్ స్టూడియోస్ బ్యానర్స్ సినిమాను చిత్రీకరించడం అభినందనీయమన్నారు. యూనిట్ బృందంతో కలిసి రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్లారాజు, ప్రొడ్యూసర్ వేణు యాదవ్, హీరో అజయ్, మూవీ డైరెక్టర్ నేరెళ్ల దేవేందర్, కో డైరెక్టర్ ఆర్య అరవింద్ తదితరులు పాల్గొన్నారు. 49 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో మే మాసంలో లక్ష్యంలో 49శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2.38 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,16లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. జూన్ మాసంలో 2.35 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గైర్హాజరు శాతం తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. -
ప్రకృతి పరిరక్షణే ప్రగతి ప్రణాళిక లక్ష్యం
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: ప్రకృతి పరిరక్షణే ప్రగతి ప్రణాళిక లక్ష్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి ప్రకృతిని పరిరక్షించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాల నిర్వహణ సమీక్ష సమావేశం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. వన మహోత్సవం ద్వారా ప్రజల్లో ప్రకృతి సంరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువత, ప్రజలు వన మహోత్సవ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీలు, పరిశుభ్రత కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రతాప్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పార్టీలకతీతంగా పోరాటం
● ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు, యువత ములుగు: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన పోరాటంలో నాయకులు పోరాటాలకతీతంగా పోరాటం సాగించారు. ములుగు గిరిజన ప్రాంతంలో మొదలైన ఉద్యమం 2009 తర్వాత తీవ్రస్థాయికి చేరుకుంది. ములుగు ఏజెన్సీలోని 8 మండలాల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. పార్టీలకతీతంగా, సంఘాల కతీతంగా నాయకులు కలిసి రోడ్డెక్కారు. మహిళా సంఘాలు సైతం బతుకమ్మ ఆడుతూ, రోడ్లపై వంటావార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణాల్లో చదువుకునే విద్యార్థులంతా గ్రామాలకు చేరుకొని యువతతో కలిసి ఉద్యమం తీవ్రరూపం దాల్చేలా పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం మారుమోగింది. అందరూ ఏకతాటిపైకి వచ్చి అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమ పోరాటాన్ని కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ కోసం రాష్ట్రంలో బలిదానాలు చేసుకుంటుంటే బలిదానాలు వద్దని, పోరాటాల ద్వారానే తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందామంటూ పోరాటం చేశారు. వాహనాలతో ర్యాలీలు, రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు, నిరహారదీక్షలు చేపట్టారు. సకల జనుల సమ్మెలో విద్యార్తులు సైతం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. -
అభివృద్ధి వెలుగులు..
ములుగుమంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 202612 ఏళ్లలో మారిన ములుగు రూపురేఖలు7అడవుల ఖిల్లాగా పేరొందిన ములుగు ఏజెన్సీ ప్రాంతం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు అనేక రంగాల్లో వెనుకబడిన గిరిజన ప్రాంతం నేడు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. 12 ఏళ్లలో అనేక మార్పులతో ములుగు ముఖచిత్రం మారింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి చందూలాల్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సాధించిన అభివృద్ధిపై సాక్షి ప్రత్యేక కథనం.. – ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి● 2019లో 33వ జిల్లాగా ఏర్పాటు ● 2025లో మున్సిపాలిటీగా ఆవిర్భావం ● వైద్య కళాశాల, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతో మహర్దశ మేజర్ పంచాయతీ నుంచి జిల్లాగా.. 2011లో మేజర్ గ్రామపంచాయతీగా ఏర్పాటైన ములుగును 2019 ఫిబ్రవరి 17న 33వ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లాలో కన్నాయిగూడెం మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేసి 174 గ్రామ పంచాయతీలతో జిల్లా ఏర్పాటు చేశారు. 2025 ఏప్రిల్ 5న ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అంతేకాకుండా మంత్రి సీతక్క చొరవతో మాజీ జెడ్పీ చైర్మన్ జగదీశ్ పేరుతో మల్లంపల్లి గ్రామాన్ని జేడీ మల్లంపల్లి మండలంగా ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2021 జూలై 25న రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రశాద్ ప్రాజెక్ట్ కింద రూ.62 కోట్ల నిధులతో రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ది పనులు చేపడుతోంది. దేవాదుల నీటితో పెరిగిన ఆయకట్టు కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై నిర్మిందిన దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రామప్ప సరస్సును రిజర్వాయర్గా మార్చి దేవాదుల నీటిని అందిస్తుండడంతో జిల్లాలో ఆయకట్టు సాగు పెరిగింది. ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట, గణపురం మండలాలకు చెందిన రైతులు సాగునీటికి కొరత లేకుండా రెండు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఒకప్పుడు 80 వేల ఎకరాలకే ఆయకట్టు సాగుకు పరిమితమైన జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల భూములు సాగు అవుతున్నాయి. జిల్లాలో అయిల్పామ్ సాగు పెంపుతో మంత్రి సీతక్క సహకారంతో జవహర్నగర్ సమీపంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. విద్య, వైద్యంలో పురోగతి జిల్లా విద్య, వైద్యంలో పురోగతి సాధించింది. విద్యలో 65 శాతం ఉత్తీర్ణత ఉన్న జిల్లా ప్రస్తుతం 90 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే గత ప్రభుత్వం 2023 మే నెలలో వైద్య కళాశాల నిర్మాణానికి 25 ఎకరాల భూమిని అప్పగించి రూ.60 కోట్లను కేటాయించి పనులు ప్రాంభించింది. జిల్లా కేంద్రంలోని కళాశాలకు కేటాయించిన స్థలంలో మూడు భవనాలను నిర్మించి 2024–25 నుంచి వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిగా మారిపోయింది. మెడికల్ కళాశాల విద్యార్థులకు తరగతుల బోధన, ఆస్పత్రి విధులకు 48 మంది వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. మెడికల్ కళాశాలలో ఇప్పటి 100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసి సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ గిరిజన యూనివర్సిటీగా నామకరణం చేశారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ భవన నిర్మాణాలకు రూ. 900 కోట్లు కేటాయించింది. 2023–24 విద్యాసంవత్సరంలో తరగతులను ప్రారంభించింది. కంటైనర్ ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటు ఎస్ఎస్తాడ్వాయి మండల పరిధిలోని కొడిశాలలో పూరి గుడిసెలో ఉన్న ఆస్పత్రిని ప్రస్తుతం కంటైనర్ ఆస్పత్రిలోకి మార్చారు. మంత్రి సీతక్క చొరవతో కంటైనర్ ఆస్పత్రిని నెలకొల్పి రోగులకు వైద్య సదుపాయాలను అందజేస్తున్నారు. ఐలాపురంలో గుడిసెలో సబ్ సెంటర్ ఉండగా ఇప్పుడు దానిని కంటైనర్ ఆస్పత్రిగా మార్చి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సదుపాయాలతో పాటు మందులు అందజేస్తున్నారు. ఎడ్జెర్ల పల్లిలో సైతం కంటైనర్ సబ్సెంటర్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. అలాగే కంటైనర్ పాఠశాలలను గొత్తికోయగూడేలు, గిరిజన గూడేల్లో ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తున్నారు. అలాగే జిల్లాలో నూతనంగా ఐదు పాఠశాలలను సైతం గతేడాది మంత్రి సీతక్క చొరవతో ప్రారంభం అయ్యాయి. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా బాధ్యతగా వినతులు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తంగా 100 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పింఛన్లు 37, ఇందిరమ్మ ఇళ్లు 25, ఇతర శాఖలకు సంబంధించినవి 38 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించి ఆయా శాఖలకు బదిలీ చేశారు. గిరిజన దర్బార్లో 28 దరఖాస్తులు ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై వచ్చిన 28 దరఖాస్తులను పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు. గిరిజన మహిళా టైలర్లు స్కూల్ యూనిఫాం కుట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో వ్యవసాయ పనుల కోసం వినియోగిస్తున్న ట్రాక్టర్ను హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పారెస్టు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ట్రాక్టర్ను విడుదల చేయాలని కోరారు. ఏటూరునాగారం లంబాడీతండా శివారు ప్రాంతంలో కల్వర్టు వరకు మెటల్ రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో నిర్మించిన మెటల్ రోడ్డు పనులకు ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ విన్నవించారు. ఇలా అనేక సమస్యలపై వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్దన్, ఈఈ వీరభద్రం, ఏఓ రాజ్కుమార్, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ అనిల్కుమార్, జీసీసీ డీఎం వాణి, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, జియాలజిస్ట్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రజావాణిలో 100 వినతుల రాక -
బడి బస్సు భద్రమేనా?
ఖిలా వరంగల్: పాఠశాలల పునఃప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈక్రమంలో బడి బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. బస్సుల ఫిట్నెస్ గడువు మే 15తోనే ముగిసింది. బస్సులను మరమ్మతులు చేసి ఫిట్నెస్ పరీక్షలకు తీసుకురావాలని ఆర్టీఏ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) గడువు ముగిశాక బస్సులు రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు ఉన్నాయి. ఫిట్నెస్ నిబంధనలు ఇలా.. బస్సుకు పవర్ స్టీరింగ్ ఉండాలి. డ్యాష్ ప్యానల్ బోర్డులో ఎడమ, కుడి ఇండికేటర్స్ తప్పనిసరి. బ్రేకుల్లో లోపం తెలిపే ఎరుపు ఇండికేటర్ ఉండాలి. ఫ్యూయల్ గేజ్, స్పీడో మీటర్, డ్రైవర్ సీట్ దగ్గర ఎయిర్ హైండ్ బ్రేక్ ఉండాలి. గేర్ లీవర్లో అంతర్గత స్ప్రింగ్ బాగుండాలి. వెనకదారి కని పించేలా అద్దం తప్పనిసరిగా ఉండాలి. బస్సులో విద్యార్థుల కదలకలు కనిపించేలా ఇంటర్నల్ అద్దం, విద్యార్థులు ఎక్కుడం, దిగడం స్పష్టంగా కనిపించేలా కన్వీక్స్క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. ఫుట్బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు మించి ఉండరాదు. ఫార్మింగ్ లైట్లు, అత్యవసర ద్వారం విధిగా ఏర్పాటు చేయాలి. బస్ డ్రైవర్కు 60 ఏళ్లు పైబడి ఉండొద్దు. బస్సులో డ్రైవర్ లై సెన్స్, బస్నంబర్, ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్ కలిగిన కాగితం పటం కట్టించి డ్రైవర్ కుడివైపు పెట్టాలి. స్కూల్ కరస్పాండెంట్ ఫోన్ నంబర్ ఉండాలి. బస్సు కండీషన్ పరిశీలించాలి.. స్కూల్ బస్సు కండీషన్ పరిశీలిస్తుండాలి. యాజ మాన్యం నిబంధనలు అతిక్రమిస్తే ఆర్టీఏ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. డ్రైవర్ తీరును గమనిస్తుండాలి. మద్యం సేవించినట్లు గుర్తిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. బ్రేక్ నిబంధనలు ఇవే.. బస్ బ్రేక్ చేసేందుకు 32 నిబంధనలు పరిశీలిస్తారు. బస్సు పసుపు రంగులో ఉండాలి. డ్రైవర్కు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. పిల్లల జాబితా, ఎక్కడ ఎక్కుతున్నారో వివరాలు ఉండాలి. బ్రేక్ ఇంజన్, టైర్లు, లైటింగ్ సిస్టం మొత్తం పరిశీలించి ఆర్టీఏ అధికారులు ధ్రువపత్రం జారీ చేస్తారు. ఎంవీఐ రూల్స్.. ఎంవీఐ రూల్ 185 (జీ) ప్రకారం పాఠశాల యాజమాన్యాలు 32 నిబంధనలు పాటించాలి. నెట్లో స్కూల్ పూర్తి వివరాలు, స్కూల్ అడ్రస్, స్కూల్ బస్ నంబర్, డ్రైవర్ వివరాలు, లైసెన్స్, బ్యాడ్జీ నంబర్, బీమా, ట్యాక్స్ ఫోన్ నంబర్లు పొందుపరచాలి. డ్రైవర్, అటెండర్ ఫొటోలను నెట్లో అప్లోడ్ చేయాలి. అనంతరం ప్రభుత్వ ధ్రువపత్రాన్ని రవాణా అధికారులకు అందించి తగిన రుసుం తెల్లించాలి. పరీక్షల అనంతరం ఫిట్నెస్ ధ్రువీకరణ జారీ అవుతుంది. ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు444 225 219162 121 41ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే సీజ్ వాహనాలు తీసుకురావాలని యాజమాన్యాలకు ఆర్టీఏ అధికారుల నోటీసులు ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లిసెలవుల్లోనే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేసుకోవాలి. ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్) గడువు ముగిసిన బస్సులు రోడ్లపై కనిపిస్తే సీజ్చేస్తాం. తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకొని సర్టిఫికెట్ తీసుకోవాలి. నిబంధనలు పాటిస్తేనే ఎంవీఐలు ఎఫ్సీ జారీ చేస్తారు. విద్యాసంస్థల యజమాన్యాలు సహకరించాలి. – సురేశ్రెడ్డి, డీటీసీ వరంగల్ -
డివిజన్ కల నెరవేరేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రైల్వే రంగంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధి గణనీయంగా మారనుండగా.. ఉమ్మడి వరంగల్లో రైల్వే డివిజన్ ఏర్పాటు హామీగానే మిగలనుంది. అన్నీ ఉన్నా.. డివిజన్ లేదు.. కాజీపేటను డివిజన్గా ఏర్పాటు చేయడానికి అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్ లోకోషెడ్, రెండు పిట్లైన్లు, భారీ రైల్వేయార్డు, కోచ్ నిర్వహణ కేంద్రం, కొత్తగా నిర్మిస్తున్న మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఇంటర్సిటీ కోచ్ తయారీ యూనిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాలతో కొత్త డివిజన్లు ఏర్పాటవుతున్నా అన్ని అర్హతలు ఉన్నా కాజీపేటకు మాత్రం డివిజన్ ప్రకటించకపోవడం ఉమ్మడి వరంగల్ వాసుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి.. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ లభించిన నేపథ్యంలో కాజీపేట డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్కు డివిజన్ వల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల మంజూరు, సరుకు రవాణా ఆదాయం పెరగనుంది. 1980 నుంచే ఉద్యమం.. కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాల ని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 1980 నుంచి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వస్తుండడంతో కాజీపేట డివిజన్ కోసం ఉద్యోగ, ప్రజాసంఘాలు మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా మొండిచెయ్యే నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ అమలు డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉద్యోగ, ప్రజాసంఘాలుఉమ్మడి వరంగల్ (కాజీపేట)కు డివిజన్ వస్తే కాజీపేట–బల్లార్షా, కాజీపేట–మోటుమర్రి, పెద్దపల్లి–నిజామాబాద్, డోర్నకల్–మణుగూరు, డోర్నకల్–భద్రాచలం రోడ్–సత్తుపల్లి మార్గాలు చేరే అవకాశం ఉంది. దాదాపు 695 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ డివిజన్లో సింగరేణి బొగ్గు రవాణా కూడా ఉండడంతో ప్రారంభం నుంచే లాభాల్లో నడిచే అవకాశముందని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రైల్వే పరిపాలన అంతా సికింద్రాబాద్ కేంద్రంగానే కొనసాగుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటైన జంక్షన్.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలకు వెళ్లే రైళ్లకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కాజీపేటను డివిజన్ చేస్తే ఉమ్మడి వరంగల్ కొత్త గుర్తింపు రానుంది. -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, పుష్కర ఘాట్, త్రివేణి సంగమం వద్ద భక్తుల, ట్రాఫిక్ రద్దీని డ్రోన్ సహాయంతో నిరంతరం పర్యక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. భక్తుల వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. భక్తులు నదిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తులు సురక్షితంగా పుష్కర స్నానాలు ఆచరించేలా పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏర్పాట్లపై స్వామిజీ అభినందనలు
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై శ్రీ మాధవనంద సరస్వతి స్వామీజీ అభినందలు తెలిపారు. ఆదివా రం కాళేశ్వరం వచ్చిన ఆయనను మంత్రులు పొ న్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు స్వామీజీ ఆశీ స్సులు పొందారు. అంత్య పుష్కరాలకు వచ్చే భక్తు ల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ పట్ల స్వామిజీ సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యు డు గొడుగు రుద్రరాజు, తదితరులు పాల్గొన్నారు. మాధవనంద సరస్వతి ఆశీస్సులు పొందిన మంత్రులు -
భక్తులు మురిసె.. ‘త్రివేణి ’మెరిసె
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరస్నానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన లక్షన్నర మంది త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేశారు. మెదక్లోని కొల్చారం పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి పుష్కర స్నానాలు చేసి నదీమాతకు నైవేద్యం సమర్పించారు.సరస్వతీ ఘాట్లో పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులు – కాళేశ్వరం -
కిటకిటలాడిన హేమాచల క్షేత్రం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రం వేలాది మంది భక్తజనంతో ఆదివారం కిటకిటలాడింది. ఆలయంలో స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలం మారింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలో వేచి ఉండి భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు. ఉదయం నుంచి సాయంత్రం 05 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. -
పేదరికాన్ని జయించి ట్రిపుల్ ఐటీకి ఎంపిక
గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి గ్రామం గౌరారం గడ్డకు చెందిన గంగారపు ప్రజ్వల బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 559 మార్కులు సాధించిన ప్రజ్వల ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి పలువురి మన్ననలు పొందుతుంది. ఉపాధి నిమిత్తం హనుమకొండకు వెళ్లిన ప్రజ్వల తల్లిదండ్రులు గంగారపు జ్యోతి, ప్రకాశ్ అక్కడి వడ్డెపల్లి ప్రభుత్వ పాఠశాలలో కుమార్తెను చదివించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ప్రజ్వల.. పట్టుదలతో చదువుకొని విద్యలో రాణించింది. ఈ సందర్భంగా చల్వాయి గ్రామస్తులు, బంధుమిత్రులు ప్రజ్వలను అభినందించారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (సీబీసీఎస్), (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈ నెల 8వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల ని యంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలి పారు. 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 12న మూడో పేపర్ పరీక్షలు ఉంటాయన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు. కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విద్యారణ్యపురి: డీఈఐఈడీలో మొదటి సంవత్సరంలో తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రవేశాలకు గాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 2నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తామని హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈసెట్– 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెరిఫికేషన్కు ర్యాంక్ కార్డు, హాల్టికెట్, టెన్త్, ఇంటర్మీడియట్ మెమో, 4వతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, టీసీ, ఎన్సీసీ/స్పోర్ట్స్, పీహెచ్సీ పత్రాలతో రావాల్సింటుందన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులు 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్కకు పూజరులు అమ్మవార్ల ప్రసాదం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర మాజీ చైర్మన్ లచ్చు పటేల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, పులి సంపత్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కాల్వపల్లికి చెందిన ఉపాధ్యాయుడు బొదెబోయిన బుచ్చయ్య ఇటీవల మృతి చెందగా.. ఆదివారం జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క నివాళులర్పించారు. తునికాకు సేకరణ వెళ్లి ఇటీవల మృతి చెందిన పాయం సుచిత్ర కుటుంబ సభ్యులను సీతక్క పరామర్శించారు. -
పల్లెలో చిత్రీకరణ.. ప్రజల్లో ఆదరణ
ఏటూరునాగారం: ప్రస్తుతం యువత చాలామంది జల్సాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చే సుకుంటున్నారు. చెడు వ్యసనాలతో కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కానీ.. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఈ యువకులు మాత్రం యువత ఎలా ఉండకూడదో వివరిస్తూ లఘుచిత్రాలను రూపొందించి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. వాళ్లే ఫన్నీ బాయ్స్ క్రియేటర్స్.. ఇన్స్ట్రాగామ్ వేదికగా రీల్స్తో ప్రాంభమైన వారి ప్రయాణం ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్ తీసేవరకు చేరుకుంది. అందుబాటు ఉన్న వనరులతో చిత్రాలను తీస్తున్న వీరికి మండల కేంద్రానికి చెందిన కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఇచ్చిన ఆర్థిక బలం అందించడంతో కెమెరాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసుకుని మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. వారు నివాసముండే ప్రదేశాలతోపాటు సమీప అటవీ ప్రాంతంలోనే షూటింగ్ చేస్తూ తమ చిత్రాలను ప్రజలముందుకు విడుదల చేస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పటి వరకు పది చిత్రాల రూపకల్పన.. ఫన్నీ బాయ్స్ ఇప్పటి వరకు పొరపాటు, బంధం, విలువ, నమ్మకం, ఎగతాళి, నిర్లక్ష్యం, నిజ జీవితం, నష్టం, బానిసతోపాటు మే 31న కొత్త షార్ట్ఫీల్మ్ కర్మ ఫలం పేరుతో లఘుచిత్రాలను రూపొందించారు. షార్ట్ ఫిల్మ్స్తో ఆకట్టుకుంటున్న యువకులు ఫన్నీ బాయ్స్ పేరుతో చిత్రీకరణ -
కష్టపడేవారికి ఎప్పటికై నా గుర్తింపు
● మంత్రి సీతక్క ములుగు రూరల్: పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం ని ర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులకు అందించేలా పార్టీ నాయకులు కృషి చేయాలన్నా రు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎన్నికలు, పార్టీ నిర్మాణంలో బూత్ ఏజెంట్ల వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ డాక్టర్స్ సెల్, మెడికల్ వింగ్ ములుగు జిల్లా చైర్మన్గా మల్లంపల్లి మండలానికి చెందిన ఆనందపు రవిబాబును నియమించగా ఆయనను శాలువాలతో సన్మానించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఇంచర్ల గ్రామానికి చెందిన మట్టెవాడ తిరుపతిని నియమించగా వారికి నియామకపత్రాలను అందించారు. ఇదిలా ఉండగా.. పేదలు సైతం కార్పొరేట్ వైద్యం పొందేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అనంతరం కొత్తగూడ మండలం సాధిరెడ్డిపల్లికి చెందిన దివ్యాంగుడు పుల్సం రవికిరణ్కు మూడు చక్రాల వాహనం అందించారు. కార్యక్రమంలో గ్రంథాల య సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు. -
నకిలీల గుబులు
గోవిందరావుపేట: ఏజెన్సీలో రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నకిలీ విత్తన ముఠాలు కొన్నేళ్లుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. వానాకాలంలో విత్తనాలు విత్తేందుకు దుక్కులు సిద్ధం చేసుకుని రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా నాసిరకం విత్తనాలతో పంటలు సాగు చేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏడాది అయినా అధికారులు నాసిరకం విక్రయ ముఠాలపై దృష్టి సారించాలని రైతన్నలు కోరుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో వానాకాలంలో 1,07,700 ఎకరాల్లో వరిపంట, 28,600 ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 11,329 ఎకరాల్లో, ఇతర పంటలు 15,600 ఎకరాల్లో సాగు కానున్నాయి. నాసిరకం విత్తనాలతో నష్టం గత రెండేళ్ల కాలంలో ఎస్ఎస్తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో నాసిరకం మొక్కజొన్న విత్తనాలు సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. స్థానిక ఏజెంట్లు తమ కమీషన్ల కోసం వివిధ కంపెనీల పేర్లు చెప్పి బాండ్ మొక్కజొన్న పేరుతో విత్తనాలను రైతులకు విక్రయించగా పంట ఆశించిన స్థాయిలో రాక రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆగ్రహించిన రైతులు ఆయా కంపెనీలను నిలదీయడంతో ఎకరానికి రూ.65వేలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా చివరకు అతి స్వల్ప మొత్తాలు చెల్లించి చేతులు దులుపుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే పలు మండలాల్లో నాసిరకం మిర్చి విత్తనాలతో కూడా రైతులు భారీగా నష్టపోయారు. ఇక గోవిందరావుపేట మండల పరిధిలోని సీడ్ వరి పేరుతో విక్రయించిన విత్తనాలు సాగు చేసిన రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. ప్రముఖ కంపెనీల పేరుతో మోసం సీజన్ ప్రారంభానికి ముందు కొందరు అక్రమ వ్యాపారులు ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ ప్యాకెట్లను తయారు చేస్తారు. అసలు కంపెనీల ప్యాకింగ్ను పోలి ఉండేలా ముద్రించి రైతులను మోసం చేసే అవకాశం ఉంది. తక్కువ ధరకు వస్తున్నాయని భావించి రైతులు కొనుగోలు చేస్తే చివరికి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. విత్తనం వేశాక కొన్ని రోజుల్లో మొలక రావాలి. కానీ నకిలీ విత్తనాల వల్ల మొలకలు సరిగా రాకపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలు కొనాలి. మళ్లీ భూమి చదును చేసి విత్తనాలు వేయాలి. ఇలా డబ్బులు ఖర్చు వస్తుంది. ఒకవైపు అప్పులు, మరోవైపు దిగుబడిపై అనిశ్చితి రైతును మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే ప్రమాదం ఉంది. దీంతో కొనుగోళ్ల ప్రారంభానికి ముందే వ్యవసాయ అధికారులు నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. రైతులు సైతం ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ప్యాకెట్పై లాట్ నంబర్, గడువు తేదీ, మొలక శాతం వివరాలను పరిశీలించాలి. అనుమానం వస్తే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలి. వానాకాలం విత్తనాల కొనుగోళ్లకు రైతుల సన్నద్ధం ఏజెన్సీలో రెండేళ్లుగా నష్టపోయిన రైతులు నాసిరకం విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని వేడుకోలు వరి విత్తనాల ప్యాకెట్లు 35,000 మొక్కజొన్న 400 క్వింటాళ్లు పత్తి విత్తనాల ప్యాకెట్లు 60వేలు పప్పు దినుసుల విత్తనాల ప్యాకెట్లు 40 క్వింటాళ్లుఈ ఫొటోలోని రైతు పేరు నాంపల్లి సత్యబాబు. వాజేడు మండల పరిధిలోని ఎడ్జెర్లపల్లి గ్రామం. గతేడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. నాసిరకం విత్తనాలు సాగు చేయడంతో మొలక శాతం తగ్గిపోయింది. మొక్కలు సైతం ఆశించిన విధంగా ఎదగలేదు. చివరకు దిగుబడి రాక రూ.లక్షల్లో నష్టపోయాడు. నాసిరకం విత్తనాల నియంత్రణకు చర్యలు ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నాసిరకం విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. విత్తన విక్రయ కేంద్రాలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే సంబంధిత డీలర్ల లైసెన్సులను వెంటనే రద్దు చేయడంతో పాటు విత్తన చట్టం–1966 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటాం. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు వ్యవసాయ శాఖ కట్టుబడి ఉంది. – వి.సురేశ్కుమార్, డీఏఓ -
ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరి
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్ చేయని విభాగాలు●రావాల్సిన ఆదాయం (రూ. లక్షల్లో)కార్డియాక్ అండ్ 37 కార్డియోథొరాసిక్ కార్డియాలజీ 56 ఈఎన్టీ 480 జనరల్ మెడిసిన్ 227 యూరినరీ 32 మెడికల్ అంకాలజీ 672 నెఫ్రాలజీ 47 ఆర్థోపెడిక్ సర్జరీ 39 పాలీ ట్రామా 91 ప్లాస్టిక్ సర్జరీ 112 సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105 సర్జికల్ అంకాలజీ 195కాశిబుగ్గ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఇలా..డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్ కేర్ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు సమాచారం. జనరల్ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం) పలు డిపార్ట్మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం ట్రస్ట్కు వివరాలు పంపడంలో నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు విమర్శలువిభాగాలు, కేసులు -
హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సుమారు నాలుగు వేలకు పైగా భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. వివిధ వాహనాల్లో గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి పరవశించారు. అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
గోదావరిలో డిస్టిలేషన్ రద్దు చేయాలి
● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేందర్ ములుగు: గోదావరి నదిలో డిస్టిలేషన్ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం అదనపు కలెక్టర్ మహేందర్జీకి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఎదిర, సూరవీడు, బోదాపురం గ్రామాల పరిసరాల్లోని గోదావరి నది నుంచి ఇసుక తీసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. సుమారు 15 కిలో మీటర్ల విస్తీర్ణంలో 4 వేల ఎకరాల్లో ఇసుకను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ డిస్టిలేషన్ కేవలం ఇసుక మాఫియా, బడా బాబుల కోసం చేపడుతున్నట్లు అనుమానం వస్తుందని ఆరోపించారు. గోదావరి నదిలో కోట్లాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తీయడం వల్ల ఒకవైపు పర్యావరణం, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో సాగు, తాగునీటి సమస్యలను గిరిజనులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దామెర కిరణ్, రత్నం ప్రవీణ్, కొర్ర రాజు, తోకల రవి తదితరులు పాల్గొన్నారు. -
డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు రవి కుమార్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు శుక్రవారం బైటాయించారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసిల్టింగ్ పేరుతో గోదావరి నది గర్భాన్ని ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో నది పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పేరుతో డిసిల్టింగ్ విధానం ప్రవేశ పెట్టి ప్రభుత్వం సర్వే చెపట్టిందని వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లేవని కోర్టు నిలుపుదల చేసినా ప్రాజెక్టు పేరుతో ఏజెన్సీ మండలాల్లో అధికారులు సర్వే చేయటం విడ్డూరంగా ఉందన్నారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయకపోతే పార్టీలు, ప్రజా సంఘాలతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, నాయకులు రత్నం రాజేందర్, దావూద్, చిట్టిబాబు, గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, చిట్టెం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ -
రైల్వే ప్రాజెక్ట్లకు భారీగా నిధులు
● వరంగల్ ఆర్వోఆర్ సర్వేకు రూ.10 కోట్లు ● కాజీపేట–ఘన్పూర్, 3,4వ లైన్ల సర్వేకు రూ.0.43 కోట్లు ● రైల్వే పింక్బుక్లో కేటాయింపులు కాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలో గల పలు రైల్వే ప్రాజెక్ట్లకు రైల్వేశాఖ నిధులు కేటాయించినట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ 2026–27లో కాజీపేటకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్ట్లు, సర్వేలు ప్రతిపాదించారు. కాజీపేటకు సంబంధించిన ప్రధాన రైల్వే సర్వేలు సికింద్రాబాద్–కాజీపేట మధ్య డబ్లింగ్ సర్వే 85.45 కి.మీ.గాను రూ.1.71 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య గల 3వ, 4వ లైన్ల సర్వే 21.25 కి.మీ. గాను రూ.0.43 కోట్లు, కాజీపేట–బల్లార్షా మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 220 కి.మీ.గాను రూ.4.40 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 234 కి.మీ.గాను రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య కాడ్రుప్లింగ్ సర్వే 120 కి.మీ గాను రూ.2.40 కోట్లు, వరంగల్ స్టేషన్ వద్ద రైల్ ఒవర్ రైల్ సర్వేకు రూ.రూ.10 కోట్లు, కాజీపేట– భూపాలపల్లి (హసన్పర్తి) వరకు కొత్త రైల్వే లైన్ సర్వే 24 కి.మీ.గాను రూ.1.60 కోట్లు, కాజీపేట వద్ద వరంగల్ దిశ నుంచి సికింద్రాబాద్ దిశకు బైపాస్లైన్తో కూడిన ఆర్ఓఆర్ సర్వే 38 కి.మీ. రూ.75 కోట్లు మంజూరైనట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. -
ధాన్యం తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం
ఏటూరునాగారం: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటావేసి మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలోని జీసీసీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. 40 రోజులుగా ధాన్యం అమ్ముడుపోక కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న స్థానిక రైతుల ఇబ్బందులను, వారి ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేస్తూ అన్నదాతలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. మంత్రి సీతక్క హామీలు మాటలకే పరిమితం అయ్యాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులకు పైగా ధాన్యం నిల్వలు పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసిన వడ్లన్నీ నల్లబడిపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యమంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రదీప్రావు, తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, కిరణ్, రామ్మూర్తి, అశోక్, చిన్ని కృష్ణ, వలిబా బా, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు -
సీఎం, మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ములుగు రూరల్: పంచాయతీలకు అధిక స్వేచ్ఛ, సొంత ఆదాయాన్ని పెంచుకునేలా వెసులుబాటు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం జిల్లా నాయకులు ఇంచర్ల సర్పంచ్ కుమార్గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు తమ ఖాతాల్లోనే పంచాయతీ సొంత ఆదాయాన్ని ఉంచుకునేలా ప్రభుత్వం నిబంధనలు మార్చడం హర్షనీయమన్నారు. పంచాయతీ సిబ్బందికి ప్రతినెలా ఒకటవ తేదీన వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వం రూ. 50 కోట్లు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కంచర్ల రఘు, దారావత్ సారయ్య, కరుణ సాగర్, పూలమ్మ, నాయకులు వంగ రవి యాదవ్, యాసం రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లు తనిఖీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, రోజుకు ఎంత మేర వడ్లు స్వీకరిస్తున్నారనే అంశాలపై యజమానిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రైతుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ వడ్లను పారదర్శకంగా కొనుగోలు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రైస్ మిల్ యాజమాన్యాలకు సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రోజువారీగా వడ్ల కొనుగోలు, ఎగుమతులపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని సూచనలు చేశారు. ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేష్ కుమార్ ఉన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ఏటూరునాగారం: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఏపీఓ కొమురం నాగోరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు చెందిన పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వహకులు, ఫొటో గ్రాఫర్లు, ప్లెక్సీలు ముద్రించేవారు, బ్యాండ్మేళం, క్యాటరింగ్ నిర్వహకులతో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికడితేనే బాలల భవిష్యత్కు భరోసా లభిస్తుందన్నారు. ఏజెన్సీలో వందశాతం బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. తద్వారా అందరూ కలిసికట్టుగా ములుగును బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి కొమురం నాగోరావు అన్నారు. అనంతరం డీడబ్ల్యూఓ ఈసంపెల్లి ప్రేమలత మాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారం ముందుగా తెలిసే అవకాశం పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వహకులకు తెలిసి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలోనే వారిని కట్టడి చేసి వయస్సు నిండని అమ్మాయిలకు వివాహం చేస్తే జరిగే నష్టాలపై వివరించాలని సూచించారు. వివాహాలతో సామాజిక, ఆరోగ్య, కుటుంబ పరమైన దుష్ప్రభావాలను తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుందన్నారు. వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండాలని అలా కాకుండా తక్కువ వయస్సు ఉన్నవారికి వివాహం చేస్తే పోక్సో కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. అలాగే రెండేళ్ల జైలుతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తారని వివరించారు. ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించి హాజరైన వారికి వాటిని అందజేశారు. ఈ కార్మక్రమంలో వెంకటాపురం సీడీపీఓ ముత్తమ్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఓంకార్, హరికృష్ణ, సర్పంచ్లు, వీసీపీసీ కన్వీనర్లు, టీచర్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ, సుమన్, జ్యోతి, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగోరావు -
గర్భిణులకు పౌష్టికాహారం తప్పనిసరి
ములుగు రూరల్: గర్భిణులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని ములుగు ప్రాజెక్టు సీడీపీఓ శిరీష సూచించారు. జిల్లా కేంద్రంలోని యాదవనగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలు రెండేళ్ల వయస్సుకు వచ్చే వరకు తీసుకునే సంరక్షణ చర్యలపై వెయ్యి రోజుల ప్రాముఖ్యతను వెల్లడించారు. గర్భం దాల్చినప్పటి నుంచి కడుపులో బిడ్డ ఎదుగుదల, ప్రతినెలా బరువు, రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెలివరీ అయిన తర్వాత అరగంట సమయంలో పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలను తాగించాలని సూచించారు. చిన్నారులకు ఆరు నెలల వరకు తల్లి పాలను మాత్రమే పట్టించాలని సూచించారు. పిల్ల లు ఏడు నుంచి 9 నెలల మధ్య స్వతహాగా కూర్చుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోనెల భరత్, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు. సీడీపీఓ శిరీష -
పూర్వ ప్రాథమిక పాఠశాలల పునరుద్ధరణ
ములుగు రూరల్: విద్యార్థుల సౌకర్యాల దృష్ట్యా జిల్లాలో 36 పూర్వ ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి పూర్వ ప్రాథమిక పాఠశాలలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ తాజాగా ఆమోదం తెలిపినట్లు వివరించారు. దీంతో జిల్లాలో ప్రాథమిక స్థాయి విద్యా సదుపాయాలు విస్తరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 11 పూర్వ ప్రాథమిక పాఠశాలలు కొనసాగుతున్నాయని విద్యార్థుల సంఖ్య ఆధారంగా బడులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల సహకారంతో చిన్నారుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వాజేడు: ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 3 నుంచి 13 వరకు జిల్లాలోని గోవిందరావుపేటలోని పీఎస్ఆర్ గార్డెన్లో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థలు తప్పనిసరిగా ఈ శిక్షణ తరగతులకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కరపత్రాలను విడుదల చేసిన వారిలో బోదెబోయిన సాయి, పూనెం మనోహర్, మురళీ కృష్ణ, శ్రీరాం, తేజ, అవినాష్ ఉన్నారు. పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలనభూపాలపల్లి అర్బన్: పాలిసెట్ అడ్మిషన్ల కోసం ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ సమన్వయకర్త డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. ఈ పరిశీలనకు అధికారులుగా శ్రీధర్, దేవేందర్, శ్రీనివాస్, రాజకుమార్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు మల్హర్(కాటారం): కాళేశ్వరం వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడగా ఆరుగురికి గాయాలైన ఘటన కాటారం మండలం బస్వాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన ఆరుగురు కారులో శుక్రవారం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలకు వెళ్లారు. పుష్కర స్నా నాలు చేసి దర్శనం అనంతరం హనుమకొండకు తిరుగుపయనమయ్యారు. కాటారం మండలం బస్వాపూర్ క్రాస్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యా యి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వా హనంలో భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాలివానతో కూలిన టెంట్లు పలిమెల(కాళేశ్వరం): మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో శుక్రవారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో భక్తులకోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి. -
మోక్షమెప్పుడో?
మూడో విడతకు.. ములుగు: యాసంగి సీజన్ పంటలు చేతికి వచ్చినా పెట్టుబడి సాయం( (రైతు భరోసా) పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించలేకపోవడం పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే అందాల్సిన పెట్టుబడి సాయం ఆలస్యమైనప్పటికీ రెండు విడతల్లో రెండు ఎకరాల వరకు మాత్రమే అందించడంతో మూడో విడతకు మోక్షమెప్పుడు లభిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత సాయం డబ్బులను మార్చి 23న, రెండో విడత ఏప్రిల్ 20న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. నెల రోజులు దాటినా మూడో విడత సాయానికి సంబంధించిన షె డ్యూల్ ఇంకా ప్రకటించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు విడతల్లో అందిన సాయం ఇలా.. జిల్లాలో 88,138 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.106,08 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా, రెండు విడతల్లో కలిపి 81,096 మంది రైతులకు రూ.66.56 కోట్లను జమ చేసింది. ఇంకా 7,042 మంది రైతులకు రూ.39.52 కోట్లను జమ చేయాల్సి ఉంది. ప్రతీ రైతుకు రెండెకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఐదెకరాల వరకై నా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని రైతులు భావించినప్పటికీ రెండెకరాల వరకు మాత్రమే పరిమితం చేయడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఖరీఫ్ పంటలకు.. రైతు భరోసాపై అయోమయం వానాకాలం పంటల సాగును జిల్లాలో రైతులు ఇప్పటికే ప్రారంభించారు. మరో 10 రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలను సాగు చేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి పంటకే పెట్టుబడి సాయాన్ని రెండెకరాలకు పరిమితం చేయడంతో వానాకాలం పంటకు అందే రైతు భరోసాపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం 5 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందిస్తామని కటాఫ్ ప్రకటించి ప్రతీ రైతుకు పెట్టుబడి సాయాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని పెట్టుబడి సాయం రెండు విడతల్లో ఇప్పటి వరకు అందింది రెండు ఎకరాలకే.. మూడో విడత రైతు భరోసాపై ఇప్పటికీ ఖరారు కాని షెడ్యూల్మండలం రైతులు పెట్టుబడి సాయం (రూ.కోట్లలో) ఏటూరునాగారం 6,785 5.43 గోవిందరావుపేట 6,346 5.49 కన్నాయిగూడెం 4,828 3.74 మంగపేట 10,121 9.57 ఎస్ఎస్తాడ్వాయి 7,557 6.85 వెంకటాపురం(కె) 8,014 6.39 వాజేడు 8,624 6.65 మల్లంపల్లి 5,676 4.41 ములుగు 11,952 9.09 వెంకటాపురం(ఎం) 11,193 8.94 -
ఓటరు జాబితా సవరణ వేగంగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి వీసీకి ఇన్చార్జ్ ఆర్డీఓ ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది లాంటిదని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్ పంపిణీ, సేకరణ చేపట్టాలని సూచించారు. ఓటర్లు ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఎలక్షన్ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి -
టీబీవ్యాధి వ్యాప్తిని అరికట్టాలి
ములుగు రూరల్: టీబీ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం టీబీ నియంత్రణ సిబ్బంది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ నియంత్రణ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం టీబీ నిర్ధారణకు రెండు డిజిటల్ ఎక్సరే మిషన్లు అందించిందని తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన 20 గ్రామాలలో 14 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీబీ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు పంపిణీ చేయాలని సూచించారు. టీబీ నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని డీఎంహెచ్ఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీ నియంత్రణ కోఆర్డినేటర్ రమేశ్, చంద్రమౌళి, సమ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి గోపాల్రావు -
మీడియాపై బెదిరింపులు మానుకోవాలి
ఏటూరునాగారం: వార్తలు రాసిన జర్నలిస్టుల ఇళ్లను ముట్టడిస్తామని కొంత మంది మీడియాపై చేస్తున్న బెదిరింపులు మానుకోవాలని పలువురు జర్నలిస్టులు అన్నారు. కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టులపై చేసిన వాఖ్యలకు నిరసనగా గురువారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్ వద్ద నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏటూరునాగారంలో జరిగిన మంత్రి సీతక్క ప్రెస్మీట్ను బహిష్కరించారు. అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు సోషల్మీడియాలో ఇళ్లను ముట్టడిస్తామని బెదిరింపులకు పాల్పడడం అప్రజాస్వామికం అన్నారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అఫ్జల్పాషా, అలువాల శ్రీనివాస్, బట్టు గోపి, కుదురు పాక రాజేష్, నూక ప్రభాకర్, వసంత రమేష్, చింతలపల్లి వెంకటేశ్వర్లు, పర్వతాల లాలయ్య, ఎగ్గడి రవి, ఎండి. అక్తర్, శ్రీనివాస్, గంజి రమేష్, గణపనేని చంద్రశేఖర్, రాజేష్, కుదురుపాక ప్రవీణ్, నూతి ప్రణయ్, గౌరిశంకర్ పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’ జర్నలిస్టులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన సందర్భంగా నాగజ్యోతి మాట్లాడారు. మండలం లోని జర్నలిస్టులు ఇళ్లను ముట్టడిస్తామని, వారిపై దాడులు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. -
పంట వ్యర్థాలను కాల్చొద్దు
ములుగు రూరల్: పంట పొలాలలో వ్యర్థాలను కాల్చడం సరికాదని ఎస్సై ఉపేందర్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పంట వ్యర్థానాలను కాల్చుతున్న క్రమంలో పక్కన ఉన్న పంటలు, పైప్లైన్లు దగ్ధం కావడంతో తోటి రైతులు ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. వ్యర్ధాలను కాల్చడం వల్ల భూమిలోని పంటలకు మేలు చేసే కీటకాలు చనిపోవడంతో భూసారం తగ్గిపోతుందని అన్నారు. రహదారుల పక్క పంటలను తలబెట్టడంతో పొగ కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వ్యార్థాలను తగలపెట్టె వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ములుగు మండల పరిధిలో ఇప్పటికి రెండు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. -
టిఫిన్ సెంటర్లకు గిరాకీ అంతంతే..
టేకుమట్ల(కాళేశ్వరం): శ్రీ సరస్వతీ అంత్య పుష్కరాలలో టిఫిన్ సెంటర్లకు గిరాకీ అంతంత మాత్రంగా ఉంది. పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని ఆశించి నూతనంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసుకున్న టిఫిన సెంటర్ నిర్వాహకులకు ఆశలుఆవిరి అయ్యాయి. సాధారణంగా ప్రధాన రోడు్డ్ సైడు ఏర్పాటు చేసుకున్న టిఫిన్ సెంటర్లకు సుమారుగా రూ.2వేల నుంచి రూ.5వేల వరకు గిరాకీ అవుతుంది. అదే పుష్కరాలకు వేలాదిగా తరలివస్తారని ఆశపడి టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తే కొన్ని చోట్ల అంతంత మాత్రమే గిరాకి కాగా, మరి కొన్ని చోట మరీ అధ్వానంగా మారింది. ఖర్చులు కూడా రావడం లేదుపుష్కరాల ప్రారంభంలో సరస్వతీ పుష్కర ఘాట్ బస్టాండ్ వద్ద టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నాం. పుష్కరాల ప్రారంభం నుంచి అంతంతగానే గిరాకీ రావడంతో అక్కడి నుండి గోదావరిలో భక్తులు వచ్చే దారికి టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేసాం. ఇక్కడ గిరాకి మరీ దారుణంగా ఉంది. ఒక్కో రోజు కనీసం 5 ప్లేట్ల గిరాకీ కూడా కావడం లేదు. పిండి ఖర్చులు, నూనె, తదితర సామాను ఖర్చులు మేమే భరించాల్సి వస్తుంది. – శైలజ, టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు, ఎడప్పలి● -
బోటులో షికారు.. హుషారు
టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరం సరస్వతీ అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులు గోదావరి ప్రవాహంలో బోటులో ప్రయాణించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రూ.100ల చార్జీ వసూల్ చేయగా భక్తులు నిరంతరం గోదావరిలో హుషారుగా షికారు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. గోదావరిలో సుమారు 10 నిమిషాల పాటు కొనసాగే బోటు ప్రయాణం కొత్త అనుభూతి అంటూ పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బోటు ప్రయాణంలో నీటి అలలను తాకుతూ మైమరిచి పోతున్నారు. ప్రత్యేక అనుభూతి....కాళేశ్వరంలో ఆలయంతో పాటు, గోదావరిలో బోటు ప్రయాణం అనుభూతినిస్తుంది. నా కుటుంబంతో పుష్కరాలకు వచ్చి బోటు ప్రయాణం చేశా. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు కొత్త అనుభూతి. బోటు ప్రయాణం చాలా ఇష్టం. – చందు భక్తుడు, వరంగల్గతంలో కంటే తక్కువే గిరాకీగోదావరిలో మొత్తం 8బోట్లు నడిపిస్తున్నాం. సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఎంతో గిరాకీ ఉంటుందని ఆశించాం. రోజుకు కేవలం రూ.30 వేల నుంచి రూ.40వేలకు వరకు మాత్రమే గిరికి అవుతుంది. సాధారణ సమయంలో అ ంతకంటే ఎక్కువే గిరాకి అయిన రోజులున్నాయి. గో దావరి పుష్కరాల సమయంలో చాలా బాగా గిరాకి అ య్యేది. గతంతో పోల్చితే చాలా తక్కువ గిరాకీ అవుతుంది. – మధు, బోట్ డ్రైవర్, కాళేశ్వరం -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరలో నిర్వహిస్తున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు విద్యుత్ అధికారులు నెల రోజుల ముందే విద్యుత్ ఏర్పాట్లుకు సన్నాహాలు ప్రారంభించి నిరంతరం విద్యుత్ సరాఫరా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో అందిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిధులు కేటాయించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ వద్ద, టెంట్ సీటీ, పుష్కరఘాట్ ప్రదేశాల్లో సుమారుగా 490 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అలాగే 15 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 4 జనరేటర్లు ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ ఏర్పాట్లలో ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు 140 మంది సిబ్బందిని కూడా నియమించారు. -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని, యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అధికారుల సమన్వయ లోపంతో కొన్నిచోట్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వర్షాలు కురిసేలోగా కొనుగోళ్లు, లిఫ్టింగ్, నిల్వ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొని వెంటనే మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి టీం వర్క్తో పనిచేయాలని సూచించారు. ఆర్డీఓలు, సివిల్ సప్లై, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులు పండించిన ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల మధ్య గోదాంల కేటాయింపులో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కొనుగోలు, రవాణా 80 శాతం పూర్తి.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జనగామ జిల్లా పరిధి పలు మండలాల్లో ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యంగా జరుగుతోందని, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు, రవాణా ప్రక్రియ 80 శాతం పూర్తయ్యిందన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ లారీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు కొనుగోలు చేసిన గన్నీ సంచుల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం సేకరణ 80 శాతం పూర్తయినట్లు తెలి పారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 97 శాతం ధాన్యం షిఫ్టింగ్ పూర్తయ్యిందన్నారు. జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ములుగు కలెక్టర్ హేమంత్ బొర్ఖడే సహదేవరావు మాట్లాడుతూ.. జిల్లాల్లో కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. సమావేశానికి రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, శ్రీకుడాశ్రీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.హాజరైన కలెక్టర్లు సందీప్కుమార్ఝా, బోర్ఖడే హేమంత్ సహదేవరావు, సత్యశారద, చాహత్ బాజ్పాయ్మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, చిత్రంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, నాయిని, సత్యనారాయణరావు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు -
పేరుకుపోతున్న చెత్త
వెంకటాపురం(కె): మండల కేంద్రలలోని శివాపురం వీధిలోని టెలిఫోన్ ఎక్సెజ్ సెంటర్లో పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన చెత్త కుండిలో చెత్తను తొలగించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులుగా చెత్త కుండిలోని చెత్త ఉండడంతో దుర్వాసన వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తచెదారం పెరుకుపోయి దోమలకు అవాసాలుగా మారి వ్యాధుల బారిన పడుతున్నమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెత్తను తొగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
మంగపేట: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేవిధంగా చూస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 29మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను పొదుపు సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యోరి యానయ్య, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
రైతుల పరిస్థితి ఆగం
భూపాలపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగం ఉందని.. రైతుల సమస్య గాలికి వదిలేసి ప్రభుత్వం గాలిలో సంచిరిస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. గురువారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎగుమతి కాక, ఎగుమతి అయిన ధాన్యం దిగుమతి కాక రైతులు అరిగోస పడుతుంటే ముఖ్యమంత్రి గాలిలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే అధ్వాన పరిస్థితి ఏర్పడిందన్నారు. రానున్న రెండు మూడు రోజులో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. బీజేపీ రైతు గోస–బీజేపీ భరోసా యాత్ర రైతుల గోస చూడటానికి వచ్చినట్టు లేదని, బీజేపీ ప్రచారానికి వచ్చినట్టు హంగు ఆర్బాటాలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జన్దాన్, కౌన్సిలర్లు, నాయకులు మోతె రాజు, నూనె రాజు, సతీష్ పాల్గొన్నారు. బీజేపీది ప్రచార యాత్ర మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
రామప్ప దేవాలయంలో సీవీఓ శశిధర్ రాజు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ సివిల్ సప్లయీస్ డిపార్ట్మెంట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) శశిధర్ రాజు కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూ జారులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం(ఎం)ఎస్సై చల్లా రాజు, టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, భద్రు ఉన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక ఏటూరునాగారం: జిల్లాలోని బండారుపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలలో మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణానికి చెందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. స్టాండింగ్ జంప్లో అండర్ 14 విభాగంలో సంజన, 60 మీటర్ల పరుగు పందెంలో అండర్ 8లో వర్షిత, 100, 600 మీటర్ల పరుగు పందెంలో అండర్ 16 విభాగంలో సాయి రామ్ విజయం సాధించారు. షాట్పుట్ డిస్కస్ త్రోలో నందిని, వంద మీటర్ల పరుగుపందెంలో అండర్ 16 విభాగంలో భవాని, 600 మీటర్ల పరుగు పందెంలో హరిప్రియ ఎంపికై నట్లు తెలిపారు. వీరు హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భవన, క్రీడాకారులు పాల్గొన్నారు.ఈదురుగాలులు.. భారీవర్షంమంగపేట: మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం గురువారం రాత్రి కురిసింది. రాత్రి 8గంటల వరకు భారీ గాలులు, చిరజల్లులతో ప్రారంభమైన వర్షం 9 గంటల వరకు మంగపేట, మల్లూరు, రాజుపేటతో పాటు తదితర గ్రామాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది. దీంతో సాయంత్రం వరకు వడగాలులతో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఉపశమనం పొందారు. గాలులతో కూడిన వర్షానికి రమణక్కపేట సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా పడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై టీవీఆర్ సూరి వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీతో రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్టును తొలిగించి రూట్ క్లియర్ చేశారు. మోహన్కుమార్కు సేవారత్న అవార్డు ములుగు రూరల్: నాయీబ్రాహ్మణ జన సంస్థ ఆధ్వర్యంలో అందించిన ప్రతిభా పురస్కారాలు –2026లో భాగంగా జిల్లా కేంద్రానికి చెందిన అన్నం మోహన్కుమాకు సేవారత్న అవార్డు అందుకున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని బీసీ సాధికారిక సంస్థ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ జన సంస్థ అధ్యక్షుడు శ్రీధర్ మురహరి అవార్డును మోహన్కుమార్కు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్కుమార్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి పదేళ్లుగా పోరాటాలు చేస్తున్నందుకు గాను గుర్తింపుగా అవార్డు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంఘం ఉపాధ్యక్షులు సుశీల్కుమార్, తెలంగాణ నాయీ బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గారాణి, సుబ్బయ్య, అశోక్కుమార్, రమేశ్, శివరాం, ప్రసాద్, సతీష్, సుమలత, తదితరులు పాల్గొన్నారు. -
ఐకేపీ కేంద్రాల్లో రైతుల అవస్థలు
గోవిందరావుపేట: ఐకేపీ కేంద్రాల్లో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని పస్రా మొద్దులగూడెం గ్రామాల మధ్యలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గన్ని బ్యాగుల కొరత, లారీల సమస్యలతో రైతులు ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోసుకుంటూ అకాల వర్షాల భయంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. లారీల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, మిల్లర్లు తేమ పేరుతో ధాన్యానికి కోత విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటిన ఎస్సై
ములుగు రూరల్: పిడుసుతో పడిపోయిన మహిళను ఆస్పత్రికి తరలించి ఎస్సై చంద్రశేఖర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మనోహరబాద్ మండలకేంద్రానికి చెందిన ఠాకూర్ ఆశ(38) జిల్లాకేంద్రంలో తెలిసిన వారిని కలిసేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఫోన్లో చార్జింగ్ లేకపోవడంతో కలెక్టర్ ఆఫీస్రోడ్డులో ఓ షాపులో చార్జింగ్ పెట్టి వేచి ఉంది. ఈ క్రమంలో పిడుసు వచ్చి పడిపోవడంతో దగ్గరలో ఉన్న ఎస్సై చంద్రశేఖర్ గమనించి వెంటనే అతడి వాహనంలో సిబ్బందితో కలిసి ములుగు జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేజీబీవీలో అడ్మిషన్లు ప్రారంభం మొగుళ్లపల్లి: మండలంలోని కొరికిశాల గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రత్యేకాధికారి ఆలూరి చైతన్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ నుంచి కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేపు క్రీడాకారుల ఎంపిక మొగుళ్లపల్లి: జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడలకు బాలబాలికల ఎంపిక ఈనెల 30న జిల్లాలోని దిఏవీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు బాస్కెట్బాల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘీ చరత్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2010 తరువాత జన్మించిన వారు అర్హులని ఆసక్తి గల క్రీడాకారులు వారి వెంట ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురాగలరని కోరారు. -
సేవాట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం
మంగపేట: మండలంలోని దోమెడ పంచాయతీ పరిధిలోని గొత్తికోయగూడెంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ సంస్థ చైర్మన్ బాడిష నాగరమేశ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ స్థాపించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా గూడెంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్చేసి స్వీట్లు పంచారు. గూడెంలోని బడీడు పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆకాక్షిస్తు చిన్నారులు, విద్యార్థులు దుస్తులు, పలకలు, నోట్బుక్లు, పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారు. కష్టాల్లో ప్రజలకు తొడు ఉంటూ ముందుకు సాగుతునన చైర్మన్ నాగరమేష్ను గ్రామస్తులు అభినందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు వైస్ చైర్మన్ బాడిష నవీన్, గ్రామస్తులు లక్ష్మయ్య, పుల్లారావు, సద్ధాం, నర్సింగరావు పాల్గొన్నారు. -
బోరు మోటారు ఏర్పాటు
గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి గ్రామం 5వ వార్డులో మరమ్మతులకు గురైన బోరు మోటారును తొలగించి కొత్త మోటారును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ.. నీటి సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించిన వార్డు సభ్యుడు తాటి రమణతో పాటు గ్రామ పంచాయితీ సిబ్బంది సాగర్, వెంకన్న, సాంబయ్య, ఓదేలుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటూరునాగారం: మండలంలోని రామన్నగూడెంలో ఆర్టీసీ కండక్టర్ జుపాక తిరుపతి తల్లి ఇటీవల వడదెబ్బతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని మాజీ జెడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి గురువారం పరామర్శించారు. అలాగే కందుకూరి మహేష్ తల్లి కందుకూరి సారమ్మ ఇటీవల వడదెబ్బతో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని నాగజ్యోతి పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. పల్లా మాణిక్యం, ఆకుల రోశయ్య, మూతినేని సత్యనారాయణ, తుమ్మ మల్లారెడ్డి, కోనేరు నగేష్, గడదాసు సునీల్, అంతటి నాగరాజు, ఈసం రామ్మూర్తి, కర్ర రవీందర్, రాంబాబు, చిన్ని కృష్ణ, నర్సయ్య, రమేష్ ఉన్నారు. గోవిందరావుపేట/మంగపేట: గోవిందరావుపేట మండలం మచ్చాపూర్–చల్వాయి గ్రామాల మద్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురానికి చెందిన నానవరకు సందీప్(34) మృతి చెందగా అతడి కుమారుడు లలిత్సాయి, తల్లి రాణి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కమలాపురం ఆటోస్టాండ్ సెంటర్లో సందీప్ హోటల్ నడుపుకుంటు జీవనం సాగిస్తున్నాడు. మృతుడు తల్లి రాణి, కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి కమలాపురానికి వస్తున్నారు. మార్గ మధ్యలోని మచ్చాపూర్–చల్వాయి గ్రామాల మధ్య ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొనడంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి సృహతప్పి పడిఉన్న రాణితో గాయపడిన కుమారుడు లలిత్సాయిని స్థానికుల సాయంతో 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సృహతప్పి పడిఉన్న రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. పస్రా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీలు సమకూర్చి ధాన్యం తరలిస్తాం.. మహాముత్తారం: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉందని ఎస్సై మహేందర్కుమార్ తెలిపారు. గురువారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని రెండు రోజుల్లో మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తామని లారీలకొరతతోఽ అధికారులు ధాన్యాన్ని తలించలేకపోయారన్నారు. అన్ని కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని రైతులు ఆధైర్య పడవద్దని తెలిపారు. సబ్సిడీపై జీలుగ విత్తనాలు మొగుళ్లపల్లి: మండలంలోని రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి సురేందర్రెడ్డి తెలిపారు. మండలానికి మొత్తం 834 బస్తాలు కేటాయించగా, 30 కిలోల బస్తా రైతులకు రూ.2,452.50కు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ విత్తనాలను వినియోగించడం వల్ల నేల సారవంతం పెరిగి పంట దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ మొగుళ్లపల్లి: మండలంలోని కొర్కిశాల గ్రామ చెరువు వద్ద ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దానవేణి రాములు, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు ప్రత్యేక చర్యలు
ములుగు: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వేగంగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు అకాల వర్షాలతో ధాన్యం తడవలేదన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో కూడా రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా, నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 76 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో 9 వేలకు పైగా రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర కింద రూ.141 కోట్ల పైగా డబ్బులు జమ చేసినట్లు వెల్ల డించారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతుందని వివరించారు. అవసరమైన చోట టార్పాలిన్లు, నిల్వ సదుపాయాలు, వేగవంతమైన రవాణా ఏర్పాట్లు కల్పిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రొక్యూర్మెంట్కు సంబంధించిన అన్ని ఏజెన్సీలు, సంబంధిత శాఖల అధికారులు, డీఆర్డీఓలు, డీసీఓలు, జీసీసీ ప్రతినిధులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు వచ్చే పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా భద్రపర్చాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్యలు, సందేహాల పరిష్కారానికి జిల్లా సివిల్ సప్లయీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్/కంట్రోల్ రూం నంబర్ 9347416178లో సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


