Mulugu
-
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రి చలిగా ఉంటుంది.రెండు పంటలు పండిస్తున్నా.. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. 200 అడుగుల నుంచి బోరు బావులకు నీరు పడుతుండడంతో నేను కూడా బోరు వేయించాను. రెండు పంటలకు పుష్కలంగా నీరు అందుతోంది. పంటల సాగుకు ఎలాంటి డోకా లేదు. ప్రభుత్వం స్పందించి రైతుల కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. – భూక్యా లచ్ము, భాగ్యతండా రైతులకు సూచనలు చేస్తున్నాం.. ప్రతీ ఏడాది భూపాల్నగర్, రామచంద్రాపురం క్లస్టర్ ఏరియాల్లో రెండు పంటలు పండుతున్నాయి. భూగర్బ జలాలు సమృద్ధిగా ఉండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దీంతోపాటు నిమ్మనగర్ వద్ద దేవాదుల నీటి సరఫరా పాయింట్ ద్వారా సమీప చెరువులకు నీళ్లు అందుతున్నాయి. ఈ ప్రాంతంలో వరితోపాటు, మొక్కజొన్న ప్రధాన పంటగా సాగు అవుతోంది. – కావ్య, ఏఈఓ, భూపాల్నగర్ క్లస్టర్ -
ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి
వాజేడు/గోవిందరావుపేట: ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అకాడమి మానిటరింగ్ అధికారి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల ఉపాధ్యాయులకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ట్రైనింగ్లో భాగంగా పలు సూచనలు చేశారు. రానున్న కాలంలో ఇంటర్నెట్ ప్రభావం మరింత పెరిగి దానికి అనుగుణంగా పనులు జరుగుతాయన్నారు. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ శిక్షణలో ఇచ్చే సూచనలు పాటించి విద్యార్థులకు బోధిస్తే మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ఎంఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాట్ ప్యానెల్ గురించి తెలుసుకొని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు, హిందీ రీసోర్స్ పర్సన్స్ స్వరూప్ సింగ్, జాకీర్ అలి లఖావత్ బాలాజీ, అశోక్, రమేష్, సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే విధంగా గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అథిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులంతా ఈ విషయాన్ని గుర్తించి నూతన సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గొంది దివాకర్, శ్యాంసుందర్ రెడ్డి, షేక్ హాజీ నూరానీ, పాడ్య రవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి మల్లారెడ్డి -
రోజుకో చోట..
కాటారం/కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామ అటవీప్రాంతంలో మంగళవారం పెద్దపులి కనిపించింది. పదిరోజులుగా పెద్దపులి కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్టవేసి అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్పల్లి శివారులో ఓ రైతు పులి పాదముద్రలు(పగ్మార్క్) చూసి భయాందోళనకు గురయ్యాడు. మహదేవపూర్ మండలం అన్నారం, బీరాసాగర్, కుదురుపల్లి అడవిలో రెండు రోజులు సంచరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి మాత్రం కెమెరాల్లో చిక్కడం లేదని అటవీశాఖ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా.. నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు(ప్లగ్ మార్క్స్) గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి కదలికలపై దృష్టి సారించారు. మొదటి రోజు కాటారం, మహదేవపూర్ రేంజ్ పరిధిల్లోని అటవీ ప్రాంతం మొత్తాన్ని అధికారులు, సిబ్బంది జల్లెజ పట్టారు. పులి ఆనవాళ్లు కానరాకపోవడంతో నస్తూర్పల్లి, వీరాపూర్, అన్నారం, బీరాసాగర్, మహదేవపూర్ అటవీప్రాంతాల్లో ఝెనిమల్ ట్రాకర్ నిపుణులతో కలిసి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరు బృందాలుగా విడిపోయి అటవీశాఖ అధికారులు పులి జాడను కనుక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ పులి ఎక్కడ కూడా ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా సంచరిస్తుంది. గారెకుంటలో నీరుతాగి.. మంగళవారం ఏకంగా మహదేవపూర్ మండలం పలుగుల ఎస్సీకాలనీ పక్కన నీలగిరి వనంలో పులి సంచారం చేసింది. అదేగ్రామానికి చెందిన నిట్టూరి బాపు అనే రైతు ఎడ్లబండితో పత్తిచేనుకు వెళుతున్నాడు. కొంత దూరం నడిచిన ఎద్దులు ముందుకు నడిచేందుకు వెనుకడుగు వేశాయి. రైతు ఎద్దులను దబాయించినా ముందుకు సాగలేదు. దీంతో రైతు పరీక్షించి చూడడంతో ముందు పెద్దపులి నడుచుకుంటూ వెళ్తోంది. దీంతో రైతు భయానికి గురై వెంటనే ఎడ్ల బండిని వెనుకకు తిప్పి ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పులికోసం చెట్టు, పుట్ట, వాగు, వంకల్లో ముమ్మరంగా అన్వేషించారు. గారెకుంట పొచమ్మ కుంట వద్ద పులి నీరుతాగి వెళ్లినట్లు పాదముద్రలను అధికారులు సేకరించారు. అక్కడి నుంచి కాళేశ్వరం వైపున నల్లవాగుకు చేరినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పెద్దపులి రోజుకో చోట కనిపిస్తుండటంతో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని పంట పొలాల వద్దకు వెళ్లడానికి అన్నదాతలు జంకుతున్నారు. పలుగుల అటవీప్రాంతంలో పెద్దపులి.. 10రోజులుగా కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్ట ట్రాకింగ్ కెమెరాలకు చిక్కని ౖటైగర్ అటవీశాఖ అధికారులకు ముప్పు తిప్పలు -
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి/మంగపేట: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక లారీలను మంగళవారం అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా ఓవర్లోడ్తో వెళ్తున్న లారీల నుంచి ఇసుక తొలగించారు. వాజేడు, మంగపేట, వెంకటాపురం, మండలాల్లోని ఇసుక క్వారీల నుంచి వచ్చే లారీలను తనిఖీ చేసేందుకు పకడ్బందీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను కేటాయించింది. ఇసుక లారీల్లో అధిక లోడు, జీరో బిల్, డబుల్ నంబర్లు, ఇతరత్రా అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం స్పెషల్ క్రైం బ్రాంచ్ పోలీసులు, రెవెన్యూ, స్థానిక పోలీసులు, జీపీ సిబ్బందిని ప్రత్యేక క్యాంప్లకు కేటాయించింది. దీంతో ఆయా శాఖల అధికారులు ఉదయం 6నుంచి సాయంత్రం 6వరకు తనిఖీలను చేపడుతున్నారు. ఇసుక క్వారీల్లో టీఎస్ఎండీసీ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి ఇసుక రీచ్ రేజింగ్ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అక్రమ వ్యాపారం సాగిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుంది. దీంతో ములుగు, ఏటూరునాగా రం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి, మంగపేట మండల పరిధిలోని కమలాపురం, ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కాటాపూర్ క్రాస్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా చెక్ పోస్టుల వద్ద అధికారులు ఇసుక లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న లారీలను అనుమతిస్తున్నారు. సరైన పత్రాలను లేని లారీలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు ఇసుక లారీలు సీజ్ చర్ల మండలం వీరాపురం నుంచి అధికలోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు ఇసుక లారీలను సీజ్ చేసినట్లు రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ గంపల శంకర్ తెలిపారు. ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి వద్ద సీసీఎస్, కానిస్టేబుల్, రెవెన్యూ అధికారుల టీం ఇసుక లారీలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి ఇసుక ఉండడంతో దానిని సీజ్ చేసి స్టేషన్కు తరలించినట్లు శంకర్ వెల్లడించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులను సంప్రదించగా వివరాలు వెల్లడించలేదు. అక్కడ నింపుడు.. ఇక్కడ తీసుడు.. టీఎస్ఎండీసీ అధికారులు ఇష్టారీతిన ఇసుక రీచ్లలో లారీల్లో ఇసుక నింపుతుండగా వేబ్రిడ్జిల వద్ద అదనంగా ఉందని ఇసుక తీస్తూ ఇబ్బంది పెడుతున్నారని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగపేట మండల పరిధిలోని చుంచుపల్లి, కమలాపురం వే బ్రిడ్జిల వద్ద అధికారులు కాంటా పెట్టి అదనంగా ఉన్న ఇసుకను తీసివేస్తేనే పాసింగ్ ఆర్డర్తో వే బిల్లులను ఇస్తామని నిబంధనలు విధించారు. దీంతో ప్రధాన రోడ్డు వెంట ఉన్న ఆయా వేబ్రిడ్జీల వద్ద లారీలు క్యూ కట్టాయి. అక్కడ అదనంగా నింపుడు ఎందుకు ఇక్కడ నింపిన ఇసుక తీయించడం ఎందుకని అధికారుల తీరుపై లారీ డ్రైవర్లు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇసుక క్వారీల వద్దనే వేబ్రిడ్జిని ఏర్పాటు చేసి అనుమతి మేరకు లోడింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు. జిల్లాలో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు తనిఖీల కోసం అధికారుల కేటాయింపు -
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు
ములుగు: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీరు, విద్యుత్ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, వేసంగిలో సాగునీరు, రైతు భరోసా, సంక్షేమ వసతి గృహాల తనిఖీ, ప్రజాపాలన కుటుంబ సర్వే దరఖాస్తుల ఆన్లైన్ తదితర అంశాలపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్తో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తాగునీటి కొరత వచ్చిన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. యాసంగి పంటలకు సాగునీటి సమస్య రాకుండా ప్రాజెక్టులు చెరువుల్లో నీటి లభ్యతను పరిశీలించాలన్నారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ నీటి వాడకాన్ని అరికట్టాలని సూచించారు. యూరియా కొరత లేకుండా చూడాలని, వ్యవసాయం, తాగునీటి సరఫరాకు విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన సేవలను అందించాలని ఆదేశించారు. ప్రజా పాలనలో రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులందరికీ అందజేయాలన్నారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉందన్నారు. క్రమం తప్పకుండా వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. తాగునీటి కొరత వచ్చిన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, స్థానిక వనరులను గుర్తించడంతో పాటు లీకేజీలను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, పీఆర్ఈఈ, డీసీఎస్ఓ, డీఏఓ, ట్రాన్స్కో డీఈ తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి -
సమస్యలపై పోరాడే వ్యక్తిని గెలిపించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే వ్యక్తి పులి సరోత్తంరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడే నగేశ్ కోరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శాసన మండలి ఎన్నికలపై ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వరంగల్–ఖమ్మం–నల్లగొండ బీజేపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిని గెలిపించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘ కాలంగా ఆయన పోరాటం చేస్తన్నారని తెలిపారు. సరోత్తం రెడ్డి గెలిస్తే ఉపాధ్యాయుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు సరోత్తం రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, విశ్వనాథ్, రాజ్కుమార్, నాగరాజు, దేవేందర్రావు, రవిరెడ్డి, రాకేష్యాదవ్, సురేష్, రాకేష్రెడ్డి, టీపీఎస్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఏటూరునాగారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాటాల్డారు. ఎమ్మెల్సీగా సరోత్తం రెడ్డికి ఉపాధ్యాయులు ఓటువేసి గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప ల్లా బుచ్చయ్య, సురేందర్, రవీందర్, జనార్ధన్, స మ్మక్క, సంగీత, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడే నగేశ్ వనదేవతలకు పూజలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి విజయం సాధించేలా సమ్మక్క సారలమ్మలు దీవించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి పక్షాన ప్రచారం చేసేందుకు జిల్లాకు వచ్చిన సందర్భంగా సరోత్తంరెడ్డితో కలిసి అయన మంగళవారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజాలు చేశారు. అమ్మవార్ల ఆశీస్సులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క–సారలమ్మ పూజారులు నేడు (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి తిరుగువారం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవార్ల వస్త్రాలు, పూజా సామగ్రిని భద్రపరుస్తారు. అమ్మవార్లకు యాట నైవేద్యంగా సమర్పించనున్నారు. తిరుగువారం పండుగ రోజు పూజారుల కుటుంబీకులు, స్థానిక గ్రామస్థులు ఇళ్లను శుద్ధి చేసుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. తిరుగువారం పండుగతో మినీజాతర (మండమెలిగె) పండుగ పూజా కార్యక్రమాల ముగియనున్నాయి. సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఏటూరునాగారం: సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని పీఎం ఎస్ఆర్ఐ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ లక్ష్మణ్ తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 130 మంది మంగళవారం హనుమకొండలోని ఎన్ఐటీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్య, శాసీ్త్రయ విద్య పెంపొందించేందుకు స్టెమ్ సంస్థ ద్వారా స్టడీ టూర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించామని వివరించారు. ఈ టూర్లో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లయ్య, రాజు, రజిని, రజిత పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం ములుగు రూరల్: విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి సర్కిల్ డీఈఈ(టెక్నికల్) వెంకటేశం, ములుగు డీఈఈ నాగేశ్వర్రావులు సూచించారు. ఈ మేరకు మండల పరిధిలోని జగ్గన్నపేట రైతులకు మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కెపాసిటర్లు బిగించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టుకోకూడదని, చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ సర్వీస్ వైరు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ బానోత్ రవి, ఏఎల్ఎం కమలాకర్, రైతులు పాల్గొన్నారు. ‘పది’ ఫలితాలపై ప్రత్యేక దృష్టి వెంకటాపురం(కె): పదో తరగతి విద్యార్థులు ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏటీడీఓ క్షేత్రయ్య ఉపాధ్యాయులకు సూచించారు. మండల పరిధిలోని చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉన్న ఉపాధ్యాయులు, సిలబస్ పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమపాఠశాల సందర్శన వాజేడు: మండల పరిధిలోని పేరూరు ఆశ్రమ పాఠశాల, హాస్టల్ను డీఎంహెచ్ఓ గోపాల్రావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లోని వంటశాలను పరిశీలించి పలు సూచనలను చేశారు. దోమలు లోపలికి రాకుండా కిటికీలకు జాలీలను ఏర్పాటు చేయడంతో పాటు దోమ తెరలను వాడాలని సూచించారు. విద్యార్థుల సిక్ రిజిస్టర్ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేరూరులోని సోయం వినీత్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించి విద్యార్ధి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం వాజేడు వైద్యశాలను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. -
స్వచ్ఛమైన పెట్రోల్ అందిస్తాం
జైళ్ల శాఖ ద్వారా స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ అందిస్తామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు.– 8లోuపంపుసెట్ నుంచి పంట పొలంలోకి పారుతున్న నీరు200 అడుగుల నుంచే పుష్కలంగా నీరు రామచంద్రాపురం, భూపాల్నగర్ పరిధిలోని గుర్తూరు తండా, యాపలగడ్డ, భాగ్యతండా, రహీంనగర్, రావోజీ తండా, సాంక్రు తండా, కొడిశల కుంట, చంద్రుతండా, మాన్సింగ్ తండా, రామచంద్రాపురం, పందికుంట, శివతండా, వెంకటేశ్వర్లపల్లి, నౌశ్యతండా, ముద్దునూరుతండా, దేవనగర్ గ్రామాల్లో మొక్కజొన్నతో పాటు వరిసాగు ప్రత్యేక ఆధార పంటగా రైతులు సాగుచేస్తారు. ఇక్కడి రైతులు కాలనుగుణంగా పంటల సాగు చేపడడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. గతేడాది ఈ ప్రాంతంలో జనవరి మాసం వరకు భూగర్భ జలాలు 6.92 మీటర్ల అడుగులో నీరు ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు 7.42 మీటర్ల అడుగులో భూగర్భ జలాలు నిల్వ ఉన్నాయి. -
తప్పిపోయిన చిన్నారి అప్పగింత
ఎస్ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం మేడారానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నర్సంపేటకు చెందిన రాజు తన కుటుంబ సభ్యులతో దర్శనానికి రాగా తన కుమార్తె హఫియా తప్పిపోయింది. ఈ విషయాన్ని రాజు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమైన వాకీటాకీల ద్వారా సమన్వయంతో చిన్నారి అచూకీ కనుగొన్నారు. డీఎస్పీ రవీందర్ సమక్షంలో హఫియాను తల్లిదండ్రులకు అప్పగించారు. తన కుమార్తె సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక ఏటూరునాగారం: జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఏటూరునాగారం గ్రామానికి చెందిన క్రీడాకారులు సాయిరాం, నరేంద్ర చారి, సంజయ్, రామయ్య, ప్రేమ్సాగర్, అర్జున్లు ఎంపికై నట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు ఆదివారం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కోచ్, గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ ఈ నెల 17నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. క్రీడాకారులను గ్రామ పెద్దలు డాక్టర్ వరప్రసాద్, చిటమట రఘు, ఎల్లయ్య, మల్లయ్య, ప్రభాకర్, శ్రీనివాస్లు అభినందించారు. ఎన్ఎంఎంఎస్లో విద్యార్థుల ప్రతిభ ములుగు రూరల్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలో బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల ప్రిన్సిపాల్ దేవకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పెద్దపల్లి హర్షిత, అజ్మీరా సాయిరాం, పత్తి తన్మయిలు నవంబర్ –2024లో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి స్కాలర్షిప్కు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నెలకు రూ.1000 చొప్పున స్కాలర్ షిప్ అందుతుందని పేర్కొన్నారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్ ఆవిష్కరణ ములుగు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన, గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్ను ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ములుగు ఇన్చార్జ్ ప్రవీణ్, మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గరిగె రఘు, వేములపల్లి రఘుపతి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గొర్రె సమ్మయ్య, ఎండీ యూనిస్, సోషల్ మీడియా ఇన్చార్జ్ బొమ్మినేని సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి భూపాలపల్లి అర్బన్: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని నియంత్రిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని హెచ్పీసీఎల్ సెల్స్ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. ఎలక్ట్రికల్, సోలార్ వైపు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు గండ్ర హరీశ్రెడ్డి, శ్యామ్, అశోక్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ
హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేధ బాంక్వెట్ హాల్లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో అసంతృప్తి మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ఏడాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్–కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, అందరూ విజయం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్.పి.జయంత్లాల్, డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్రెడ్డి, చాడా సరిత, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి -
కార్పొ‘రేట్’ వేట
భూపాలపల్లి అర్బన్: కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థుల కోసం ఇప్పటినుంచే వేట మొదలుపెట్టాయి. టెన్త్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాకముందే పీఆర్ఓలను రంగంలోకి దింపి విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకునేలా కార్యాచరణను ముమ్మరం చేశాయి. పాఠశాలల యాజమాన్యాలకు భారీగా ముడుపులు అందించి ఏఏ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారో వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలల్లో చదువు బాగుందని, ఇక్కడ చదవిన వారు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు అయ్యారని ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో పీఆర్ఓల సందడి కనిపిస్తుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పలు కార్పొరేట్ కళాశాలల గురించి వివరాలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు మొదటి సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎయిమ్స్ సూపర్ 60, ఇంజనీరింగ్లో ఐఐఐటీలతో పాటు గ్రూప్స్కు సంబంధించిన శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వివరాల సేకరణ కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమ సంస్థల తరఫున పీఆర్ఓలకు ఏర్పాటు చేసుకున్నాయి. వారి ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు నజరానాలు ప్రకటించి, విద్యార్థుల వివరాలు సేకరించుకొని ఏ ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారో, వారు ఎలా చదువుతున్నారో వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అన్న విషయాలను ఆరా తీస్తున్నాయి. సుమారు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పీఆర్ఓలకు నజరానాలు ఇచ్చి విద్యార్థుల వివరాలను సేకరించి ఆ వివరాల ఆధారంగా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. ఆదేశాలు బుట్టదాఖలు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం ఎవరూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు గతంలోనే జారీ చేశారు. అయినా వాటిని బేఖాతరు చేసి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్ఓలను రంగంలోకి దింపి విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఎన్నికలను ప్రచారానికి మించి ప్రచారం చేయిస్తున్నాయి.టెన్త్ విద్యార్థుల కోసం ప్రైవేట్ కళాశాలల అన్వేషణ మెడికల్, ఇంజనీరింగ్లో శిక్షణ ఇస్తామని ఎర ప్రైవేట్ పాఠశాలలకు ప్రత్యేక నజరానా రహస్యంగా విద్యార్థుల వివరాల సేకరణ పీఆర్ఓలను నియమించుకున్న సంస్థలురూ.10వేలు అడ్వాన్స్ ప్రైవేట్ కళాశాలల్లో సీట్ కావాలంటే కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.10వేలను అడ్వాన్స్గా చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కుడా సీట్ దొరకదేమోనన్న ఆత్రుత, ఫీజులో రాయితీ ఉంటుందో అన్నదానితో పీఆర్ఓలు వచ్చిన వెంటనే ఏ కళాశాల, బోధన ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకొని సీట్ బుక్ చేసుకుంటున్నారు. ఏసీ బుకింగ్ అయితే మరో రూ.10వేల నుంచి రూ.30వేల వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. -
అడవిలో మంటలార్పిన అటవీశాఖ సిబ్బంది
వాజేడు: అడవిలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది కొన్ని చోట్ల మంటలను ఆర్పారు. మండల పరిధిలోని దూలాపురం రేంజ్లో ఉన్న పెనుగోలు గుట్టలపై ఆదివారం మంటలు చెలరేగాయి. ఫైర్ పాయింట్స్ ఆధారంగా మంటలు చెలరేగినట్లు గుర్తించిన డిప్యూటీ రేంజర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో లలిత, వాసు, హతీరామ్, సంతోష్, ఫైర్ వాచర్స్ పెనుగోలు గుట్టలపైకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో నేరేడు బండ వద్దకు చేరుకోగానే మంటలు కనిపించడంతో ఆర్పారు. సమయం లేకపోవడంతో పెనుగోలు గుట్టపైకి వెళ్లలేదని బాలకృష్ణ వివరించారు. -
మేడారం క్లీన్..
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు ● మినీ జాతరలో ఐదు వేల టన్నుల చెత్త సేకరణ ● తిరుగు వారం వరకు విధుల్లో 400 మంది కార్మికులుఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక–సారలమ్మ మినీజాతరలో పారిశుద్ధ్య కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. జాతర వారం రోజుల ముందు నుంచి స్థానిక పారిశుద్ధ్య కార్మికులతోపాటు రాజమండ్రి నుంచి కార్మికులను అధికారులు రప్చించారు. దీంతో జాతరలో సుమారు 400 మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పడేసిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. తిరుగువారం వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగనున్నాయి. 10 ట్రాక్టర్లలో చెత్త తరలింపు.. జాతర ముందు, జాతర నాలుగు రోజుల్లో సుమారు 5వేల టన్నుల చెత్త సేకరించారు. ఈ చెత్తను కార్మికులు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ ప్రాంతాలకు తరలించారు. జాతరలో రోజుకు 10 ట్రాక్టర్ల ద్వారా రెండు షిప్టుల వారీగా చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. తిరుగువారం అనంతరం పారిశుధ్ధ్య పనులను స్థానిక గ్రామ పంచాయతీ అధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. గద్దెల ప్రాంగణంలో.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో భక్తులు వేసే బంగారం (బెల్లం), కొబ్బరినీళ్లు, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, ఇతర వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు కార్మికులను జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో నియమించారు. వీరు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు గద్దెల వద్ద చెత్తాచెదారం తొలగిస్తున్నారు. -
సింగరేణి కార్మికుడి మృతి
భూపాలపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూపాలపల్లి ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు పూజారి అనిల్(31) మృతిచెందాడు. మంచిర్యాలలో వివాహ వేడుకకు పట్టణానికి చెందిన నలుగురు కారులో వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అనిల్ ఏరియాలోని కేటీకే 5వ గనిలో జనరల్ మజ్ధూర్గా పని చేస్తున్నారు. అదే గనిలో పని చేస్తున్న మరో ముగ్గురు అండర్ మేనేజర్లు రాము, సంజయ్, దేవేందర్లకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. -
మేము సైతం..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శించుకునే భక్తులు పలువురు జంపన్నవాగు సమీపంలో కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి దేవేంద్ర, తాడ్వాయి గ్రామానికి చెందిన ఉమలు తలనీలాలు తీసే పనిలో తామేమీ తక్కువ కాదంటూ వచ్చి పనిలో నిమగ్నమయ్యారు. కులవృత్తిలో భాగంగా మహిళలు అందరితో సమానంగా కల్యాణకట్టలో కూర్చుని భక్తుల తలనీలాలు తీశారు. పుట్టవెంట్రుకలు సమర్పించే చిన్నారుల తల్లిదండ్రులు ఎక్కువగా వారి వైపునకు వెళ్లి తలనీలాలు తీయించారు. పురుషులతో సమానంగా పాల్గొని పనిచేసిందుకు పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
భక్తులకు మెరుగైన సేవలందించాం..
మేడారం మినీజాతరలో భక్తులకు మెరుగైన సేవలందించాం. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాతరకు 10 రోజుల ముందు, జాతర నాలుగు రోజుల్లో 400 మంది కార్మికులు నిత్యం విధుల్లో ఉంటూ మెరుగైన సేవలందించారు. తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తాం. డీఎల్పీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమష్టిగా పనిచేయడంతో భక్తులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలను అందించాం. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. – దేవరాజ్, డీపీఓ -
ప్రత్యేక పూజలకు ఉపయోగించే సామగ్రి తయారీకి ప్రసిద్ధి నడికూడ
మాకు ఇదే జీవనాధారం నేను మా పూర్వీకుల నుంచి గజ్జల లాగుపోయడమే వృత్తిగా ఎంచుకున్నా. ఒక్కొక్క గజ్జెల లాగు తయారు చేయడానికి ఐదు రోజుల నుంచి వారం రోజుల సమయం పడుతుంది. చేతి పని ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇదే జీవనాధారం ఆదాయం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ దేవుడిపై భక్తితో ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. – బుర్ర రవీందర్, నడికూడ 20 ఏళ్లుగా వస్తున్నాను.. ఏ పట్నం వేయాలన్నా కావాల్సిన పూజా సామగ్రి కోసం నడికూడకు రావాల్సిందే. నేను 20 ఏళ్లుగా వచ్చి తీసుకుని వెళ్తున్నాను. రూ.12వేల నుంచి రూ.15 వేలలో నాణ్యమైన గజ్జెల లాగు సెట్టు దొరుకుతుంది. – రామ్మూర్తి, కేసముద్రం కొత్తకొండ ఈరన్న.. కొమురెల్లి మల్లన్న.. ఎములాడ రాజన్న.. ఓదెల, ఐనవోలు మల్లికార్జున స్వామి.. ఇలా దేవాలయాలు, జాతరలు ఏవైనా శివసత్తులు, పోతరాజులుంటేనే భక్తజన సందోహం. చిన్నపట్నం, పెద్దపట్నం, అమ్మవారి బోనాలు.. పూజా కార్యక్రమాల్లో పరవశించిన శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఈరకోల ఆటలు.. మేకపోతులు, కోడిపుంజులను గావుపట్టే పూనకాలు భక్తులను మైమరిపిస్తాయి. ఆయా ఉత్సవాలకు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువుల తయారీ, సరఫరా కేంద్రం హనుమకొండ జిల్లా నడికూడలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర.. ప్రాంతాల్లోని పేరున్న దేవాలయాల్లో శివసత్తులు, పోతరాజులు, భక్తులకు సుమారు 60 ఏళ్లుగా గజ్జెల లాగులు మొదలు ఈరకోలలు, పట్నాల గొంగడి, ఢమరుకం, శూలం.. వరకు ప్రతి ఒక్కటీ నడికూడ నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరవై కుటుంబాలు సుమారు 200 మంది నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతుండగా.. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు నడికూడకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు. -
నష్టపోతున్న ‘ఇసుక మేట’ బాధిత రైతులు
ప్రకృతి వైపరీత్యాలతో వరదలు ఉప్పొంగి పంటలు సాగు చేసే భూముల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో కొన్నేళ్లుగా పంటలు పండించుకునే పరిస్థితి లేకపోవడంతో అటు కౌలు రాక, ఇటు పంటలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇసుక మేటలను తొలగించడానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో సంవత్సరాల తరబడి మేటలు పొలాలను కప్పి ఉన్నాయి. ఇసుక మేటలు వేసి పంటలు పండక రైతులు ఒకవైపు నష్టపోతుంటే, ఇసుక భూములకు రైతు భరోసా తొలగిస్తున్నామని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక మేటలు వేసిన భూముల్లో సర్వే చేస్తున్న అధికారులు(ఫైల్)మండలాల వారీగా తొలగింపు వివరాలు (ఎకరాల్లో..) ఏటూరునాగారం 49.36 గోవిందరావుపేట 28.05 కన్నాయిగూడెం 24.18 మంగపేట 152.39 ములుగు 1087.02 తాడ్వాయి 252.25 వెంకటాపురం(ఎం) 61.27 వెంకటాపురం(కె) 98.14 వాజేడు 140.31 -
సెట్టు రూ.13వేల వరకు..
శివసత్తులు, పోతరాజులు, భక్తులు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువులు 10–12 రకాలను ఒక సెట్టుగా విక్రయిస్తారు. అవసరాలను బట్టి విడివిడిగా కూడా అమ్ముతారు. ఒక సెట్టులో ఎల్లమ్మ గవ్వలు, ఈరకోల, ఢమరుకం, వల, ప్రతిమలు, కాళ్ల గజ్జలు, తౌతులు, శూలం, గొంగళి, కుల్ల(గవ్వల టోపీ), నిలువు ప్యాంట్లు ఉంటాయి. నాణ్యతను బట్టి ఈ సెట్టును రూ.6వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత ఆకర్షించేలా మెషిన్ ఎంబ్రాయిడరీతో గజ్జెల లాగుల తయారీ వస్త్రాలపై దేవతల నమూనాలను కూడా వేస్తున్నారు. పూజకు కావాల్సిన ప్రతీ సామగ్రి ఇక్కడ లభిస్తుండడంతో జాతరల సీజన్లో వివిధ ప్రాంతాల భక్తులు నడికూడ బాట పడుతున్నారు. ఎల్లమ్మ గవ్వల బుట్ట -
ఆలయం తరలిస్తారా..?
ములుగు: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ మోడల్ బస్టాండ్ పునరుద్ధరణలో భాగంగా ములుగు బస్టాండ్ ఆవరణలో ఉన్న పోచమ్మ ఆలయ తరలింపుపై పట్టణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. పోచమ్మ ఆలయాన్ని అక్కడి నుంచి కదిపితే ఉరుకునేది లేదని పట్టణవాసులు, హిందూత్వ సంఘాలు పట్టుబడుతున్నాయి. కలెక్టర్ తీరుపై సర్వత్రా విమర్శలు ఆర్టీసీ మోడల్ బస్టాండ్ పునరుద్ధరణకు పోచమ్మ ఆలయం అడ్డంకిగా మారిందని కలెక్టర్కు నివేదిక అందించినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో హిందూపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్కు వినతిపత్రతం అందించి, పోచమ్మ ఆలయాన్ని తరలించకూడదని కోరారు. అయినప్పటికీ కలెర్టర్ ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా అందరి సమక్షంలో పోచమ్మ ఆలయానికి వేరేచోట స్థలాన్ని కేటాయిస్తామన్ని తెలిపినట్టుగా సమాచారం. దీనిపై హిందూత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానికులు శనివారం ఆలయం ఎదుట జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాత, ముత్తాల నుంచి ఉన్న పోచమ్మ గుడిని తరలిస్తామంటే ఉరుకునేది లేదని తెలిపారు. రూ.5.11 కోట్ల నిధులు మంజూరు జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పునరుద్ధరణ(మోడల్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.5.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ఏరియాను సర్వే చేసి డిజిటల్ మ్యాప్ను సిద్ధం చేశారు. మ్యాప్ను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కకు అందజేశారు. ములుగు చుట్టుపక్కన ఉన్న జిల్లాలకు ప్రత్యేక బస్స్టేషన్ పాయింట్లతో డిజిటల్ మ్యాప్ను సిద్ధం చేసి అందించారు. సానుకులంగా స్పందించిన సీతక్క వెంటనే పనులను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం జిల్లాకేంద్రంలోని అన్ని వర్గాల అభిప్రాయం మేరకే పోచమ్మ గుడి తరలింపుపై నిర్ణయం తీసుకుంటాం. జిల్లాకేంద్రంలో గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, ఇతరత్రా అంశాలలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారి ప్రయాణ సౌకర్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని వర్గాలకు పోచమ్మ ఆలయం తరలింపు అడ్డంకిగా మారుతుందని తెలుస్తుంది. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీపుకుంటాం. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు. – టీఎస్ దివాకర, కలెక్టర్ పోచమ్మ గుడి తరలింపుపై ఉత్కంఠ తరలించొద్దంటున్న పట్టణవాసులు, హిందూత్వ సంఘాలు -
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సామగ్రికి ప్రసిద్ధి.. తెలంగాణ జానపద సంస్కృతిలో నిర్వహించే పూజల్లో భాగంగా ధరించే గజ్జెల లాగుల తయారీకి నడికూడ గ్రామం ప్రసిద్ధి. కొమురెల్లి మల్లన్న, ఐనవోలు, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతరలో, పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న జాతరల్లో ఈ గజ్జెల లాగులు, పసుపుపచ్చని అంగీలు ధరిస్తారు. వేములవాడ, కొండగట్టు, శ్రీశైలం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ తదితర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చి సామగ్రిని తీసుకెళ్తారు. గజ్జల లాగులకు బ్రాండ్గా నడికూడ గ్రామం నిలుస్తోంది. వీటిని ధరించే వారు ఎంత నిష్టగా ఉంటారో.. తయారు చేసేవారూ అంతే నిష్టతో ఉంటారు.పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా.. ● వీటి తయారీని నమ్ముకున్న 200 మంది ● 60 ఏళ్లుగా ఉపాధి పొందుతూ..న్యూస్రీల్ -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, చింతామణి జలపాతం, వనదేవత(దైత) అమ్మవారి ప్రాంత పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి హేమాచల కొండపైకి చేరుకున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం నిర్వహించారు.సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
గజ్జెల లాగులు.. గవ్వల కుల్లలు
గజ్జెల లాగుశివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు ప్రీతి.. అత్యంత పవిత్రంగా చూస్తారు.. నీసు తగలనివ్వరు.. తల స్నానం చేయనిదే తాకనైనా తాకరు.. మట్టి రేణువులు కూడా లాగును తాకొద్దని నేలపై సంచులు పరిచి విప్పుతారు.. మిగతా వస్త్రాలతో కాకుండా వేరుగా శుభ్రం చేస్తారు.. భక్తులు అంత పవిత్రంగా భావించే ఆ లాగుల్ని తయారు చేస్తున్నాయి నడికూడ మండలకేంద్రానికి చెందిన కొన్ని కుటుంబాలు. ఆ గజ్జెల సవ్వడే భక్తుల నాదమవుతోంది. శివరాత్రి సమీపిస్తున్న సందర్భంలో శిగాలెత్తే శివభక్తుల అలంకరణ వస్తువులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షిప్రతినిధి, వరంగల్/నడికూడదేవతల ప్రతిమలు,ఢమరుకం● -
త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఇవ్వాలని ఆందోళన
వాజేడు : తమ కాలనీకి త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఇవ్వాలని కోరుతూ పెనుగోలు కాలనీ ఆదివాసీలు శనివారం ఆందోళన చేపట్టారు. నిరంతరం విద్యుత్ లైట్లు వెలిగేలా చూడాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మండల కేంద్రంలోని జంగాలపల్లి గ్రామం వరకు త్రీఫేజ్ విద్యుత్ లైన్ వేసి తమ కాలనీకి ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జంగాలపల్లి వరకే త్రీఫేజ్ లైన్ వచ్చిందని పెనుగోలు కాలనీకి త్రీఫేజ్ లైన్ మంజూరు కాగానే లైన్ వేస్తామని రాజేందర్ వారికి తెలిపారు. బంజారాల ఆరాధ్యుడు సేవాలాల్ ములుగు : సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్యదైవం అని సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పోరిక శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో సేవాలాల్ 286 జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్టీయూ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్ హాజరై బంజారాలకు శుభాకాంక్షలు తెలిపారు. పాల్తీయ సారయ్య, సోమా, జయరాం, కసన్సింగ్, కుమార్ పాడ్య, రవి, సర్దార్ సింగ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా.. ●ములుగు రూరల్ : బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పులి సరోత్తం రెడ్డి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సూచించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రేమేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డిని గెలిపించాలని జిల్లాలోని ప్రతీ ఓటరు ఉపాధ్యాయులను అభ్యర్థించాలని, గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. నియోజకవర్గ కన్వీనర్ వెన్నెంపల్లి పాపన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీరా కృష్ణవేణి నాయక్, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, ఎమ్మెల్సీ జిల్లా కన్వీనర్ కొత్త సుధాకర్ రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి శ్రీమంతుల రవీంద్రాచారి, ఉపాధ్యక్షు డు కృష్ణాకర్ రావు, నాయకులు పాల్గొన్నారు. అంతిమయాత్రకు అరిగోస ● దహన సంస్కారాలకు వెళ్లేందుకు దారి ఏది?వెంకటాపురం(కె) : మండలంలోని ఉప్పెడువీరాపురం పంచాయతీ పరిధిలోని వెంగళరావుపేటలో ఎవరైనా మృతిచెందితే అంతిమయాత్ర చేసేందుకు దారి లేక అరిగోస పడుతున్నారు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఇసుక పాయకు వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు మార్గం (దారి) ఏర్పాటు గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి చెందిన మాదాల రాంబాబు శనివారం మృతిచెందగా అంత్యక్రియలు నిర్వహించేందుకు దారిలేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేందుకు గ్రామస్తులు వాపోయారు. 30ఏళ్ల నుంచి గ్రామంలో ఎవరైనా చనిపోతే ఇసుక పాయకు తీసుకు వెళ్లేందుకు ఉన్న దారిని మూసేసి మిర్చి పంటలు సాగుచేస్తున్నారు. దీంతో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకు వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని ఆరోపించారు. దళిత కుటుంబాలు ఉండే గ్రామం నుంచి చాలా వెడల్పుతో దారి ఉండేదని ప్రస్తుతం కనీసం నడిచి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి గతంలో ఉన్న విధంగా రోడ్డును ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం..
గజ్జెల లాగులు కొనడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం. వర్క్ కూడా చాలా బాగా ఉంటుంది. – రావుల సుమలత, నడికూడ నడికూడకు రావాల్సిందే.. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తారు. పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న ఏ జాతరైనా మా తాతల కాలం నుంచే గజ్జెల లాగుల కోసం నడికూడకు వచ్చేవారు. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. – రాజ్కుమార్ యాదవ్, సిరిసేడు, కరీంనగర్ జిల్లా -
మేడారం జాతర భద్రత సక్సెస్
ములుగు : మినీ మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎన్.రవీందర్ ఆధ్వర్యంలో భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 1,000 మంది పోలీసులకు ఆయా ప్రాంతాల్లో భద్రత కోసం విధులు కేటాయించారు. బుధవారం నుంచి శనివారం వరకు జరిగిన జాతర రెండు చైన్స్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, సీసీ కెమెరాల ఆధారంగా సీసీఎస్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో 25 మంది సిబ్బందిని కేటాయించి అప్పటికప్పుడు వాటిని ఛేదించారు. దీంతో పాటు మంచిర్యాలకు చెందిన దొంగల ముఠాను గుర్తించి వారి నుంచి ఆటో, కారుతో పాటు రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన పర్యాటకురాలు పద్మ మినీ జాతరకు వచ్చి బ్యాగ్తో పాటు పాస్పోర్ట్ పోగొట్టుకోగా స్పందించిన పోలీసులు అరగంటలో ఛేదించి ఆమెకు పాస్పోర్టు అందజేశారు. ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి ఓఎస్డీ మహేష్ బిగితే ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకున్నారు. జంపన్నవాగు నుంచి సమ్మక్క గద్దెల మీదుగా ఆర్టీసి బస్టాండ్ కి వెళ్లే దారిలో, చిలుకలగుట్టకు వెళ్లే దారిలో ప్రతి క్షణం ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు సక్సెస్ అయ్యారు. పస్రా సీఐ జి.రవీందర్ గత మేడారం అనుభవం జాతరలో చాలా ఉపయోగపడింది. -
నైపుణ్యంతోనే గుర్తింపు
ఏటూరునాగారం: జూట్ బ్యాగుల తయారీ శిక్షణలో నైపుణ్యం ప్రదర్శించినప్పుడే గుర్తింపు వస్తుందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. ఐటీడీఏ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో 13 రోజుల పాటు జూట్బ్యాగుల శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ట్రైనింగ్ సెంటర్ను పీఓ సందర్శించి అభ్యర్థులతో మాట్లాడారు. ఆసక్తితో ఇష్టంగా జూట్ బ్యాగులు, ఇతర తయారీ వస్తువులపై దృష్టి పెట్టి ఆర్థికంగా ఎదగాలన్నారు. 35మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ శిక్షణని చక్కగా వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. వీరికి సర్టిఫికెట్లు అందజేసిన తర్వాత స్వయం ఉపాధి పొందే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్బాబు, జేడీఎం కొండల్రావు, ట్రైనర్ తౌటినాయుడు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
వచ్చేనెల 8న జాతీయ లోక్ అదాలత్
ములుగు: వచ్చే నెల 8వ తేదీన జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఎస్వీపీ సూర్య చంద్రకళ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోర్టు కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాతీయలోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా అసోసియేషన్ సభ్యులు సహకరించాలని సూచించారు. రాజీపడే కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సహాయాన్ని అందించాలన్నారు. న్యాయ సలహాల విషయంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించాలని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్య లాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్రగాని వినయ్ కుమార్, న్యాయవాదులు బానోత్ స్వామిదాస్, రాచార్ల రాజ్ కుమార్, బాలుగు చంద్రయ్య, తొండి రవీందర్, మేకల మానస, రాజేందర్, సూర్యం తదితరులు పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయగా జడ్జి సూర్య చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగిన కారణంగా కోర్టుకు వస్తున్న కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.జిల్లా జడ్జి సూర్య చంద్రకళ -
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు
ములుగు రూరల్: పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ వెంకటేశ్వర్లకు ఆయన వినతిపత్రం అందించి మాట్లాడారు. సీసీఐ ద్వారా ఎకరా పట్టా భూమి ఉన్న రైతుకు 12 క్వింటాలు అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. దళారులు ఎకరం ఉన్న రైతులకు 10ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి మార్కెట్శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. విజిలెన్స్ అధికారులచే విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రచారి, కృష్ణాకర్, నాగరాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులుగా భక్తులకు సేవలు ఏటూరునాగారం: మండల పరిధిలోని బస్టాండ్ ప్రాంతంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిస ప్రత్యేక శిబిరంలో మూడు రోజుల పాటు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు సీడీపీఓ ప్రేమలత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సీడీపీఓ ఆర్టీసీ బస్టాండ్లోని క్యాంప్లో చిన్నారులకు బాదంపాలు, స్నాక్స్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భక్తులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు టీచర్లు, ఆయాలు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు గ్రూపులుగా సేవలు అందజేశారన్నారు. అంతేకాకుండా ఎవరు కూడా అనారోగ్య బారిన పడకుండా తగు సూచనలు, సలహాలను ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లలితకుమారి, భవాని, ఆయాలు రోజా, దీనమ్మ, నాగమణి, వెంకటరమణ, జ్యోతి, సరోజన, స్వరూప, శకుంతల తదితరులు పాల్గొన్నారు. కోడిగుడ్లు, రాగిజావ అందించడం సాధ్యంకాదు వెంకటాపురం(కె): మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, రాగి జావ అందించడం సాధ్యం కాదని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. యూనియన్ మండల కమిటీ సమావేశాన్ని కుడుముల సమ్మక్క అధ్యక్షతన శుక్రవారం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో వంటలు చేస్తున్న కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయన్నారు. మార్కెట్ ధరలకు, ప్రభుత్వం ఇస్తున్న మెనూ చార్జీలకు పొంతన లేదన్నారు. ఈ కారణంగానే కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికి రూ.25 చెల్లించాలన్నారు. చిన్నా, చితక కారణాలను చూపుతూ 24ఏళ్ల సర్వీసు ఉన్న వంట కార్మికులను తొలగించకుండా జీవో విడుదల చేయాలన్నారు. అల్పాహారం బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. -
డీసీసీ పీఠాలపై ఎవరు..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లపై కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంటోంది. ప్రభుత్వ పథకాల ప్రచారంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కమిటీలుండాలని అధిష్టానం భావిస్తోంది. ఈ ఏడాదంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. మరోవైపు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీల నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యేలు లేదంటే సీనియర్లు.. టీపీసీసీ, అధిష్టానం సంకేతాల మేరకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త జిల్లా అధ్యక్షులు రానున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సమన్వయం చే యగలిగే వ్యక్తులను ఎంపిక చేయాలని ఆలోచిస్తు న్న అధిష్టానం.. ఆర్థికంగా బలంగా ఉండే వాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను గానీ, సీనియర్లను గానీ ఈసారి నియమించే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నా యి. హనుమకొండ జిల్లాలో ఇద్దరు, వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో ఇద్దరు అధికార పా ర్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనగామలో ఇద్దరు, ము లుగు, జేఎస్ భూపాలపల్లిలో ఒక్కరేసి ఉన్నారు. ● హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి కొనసాగాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని అధిష్టానం కోరుతున్నా ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్, తనకు అనుచరుడిగా ఉండే ఇద్దరు పేర్లు సూచిస్తున్నట్లు చెబుతున్నారు. ● వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలని కొందరు.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని మరికొందరు సూచించినట్లు సమాచారం. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్రెడ్డిల నిర్ణయం ఫైనల్ కానుంది. ● మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిల నిర్ణయం కీలకంగా కానుంది. ● జేఎస్ భూపాలపల్లి అధ్యక్షుడు అయిత ప్రకాష్రెడ్డి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నందున.. అయననే కొనసాగించాలా? మార్చాలా? అన్న విషయమై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో టీపీసీసీ చర్చించింది. ● ములుగు జిల్లా నుంచి మళ్లీ పైడాకుల అశోక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ● జనగామ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడుతోంది. కొమ్మూరి ప్రతాప్రెడ్డిని కొనసాగించలేని పరిస్థితి వస్తే ఎలా? అన్న చర్చపై ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అత్త, పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పేరును ఆ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు ప్రచారం ఉంది. అనివార్యంగా మారిన డీసీసీ అధ్యక్షుల నియామకం.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల తర్వాత రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డీసీసీ కమిటీలను ప్రకటించారు. రెండు విడతల్లో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మొదటి విడతలో నియమితులైన అధ్యక్షుల పదవీకాలం రెండేళ్లు దాటిపోగా.. రెండో విడత డీసీసీలకు రెండేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి కొత్త కమిటీల ఏర్పాటు అనివార్యంగా మారింది. 2022, డిసెంబర్ 10న హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా నాయిని రాజేందర్ రెడ్డి, నల్లెల కుమారస్వామి, జె.భరత్చంద్రారెడ్డిలను నియమించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ములుగు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి అనారోగ్యంతో మృతిచెందాడు. 2023, మే 16న కుమారస్వామి స్థానంలో పైడాకుల అశోక్ను ములుగు అధ్యక్షుడిగా.. వరంగల్కు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జేఎస్ భూ పాలపల్లికి ఎ.ప్రకాష్రెడ్డిలను నియమించారు. జనగామ జిల్లా అధ్యక్షుడి నియామకం అప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డిల మధ్య వివాదంగా మారినా.. చివరకు కొమ్మూరి ప్రతాప్రెడ్డినే నియమించారు. ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది రేవంత్రెడ్డి సీఎం కావడం, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్ నియమితులయ్యారు.జిల్లా కాంగ్రెస్ కమిటీలపై టీపీసీసీ కసరత్తు ‘స్థానిక’ఎన్నికలే లక్ష్యంగా కొత్త కమిటీలు జిల్లా అధ్యక్షుల నియామకంపై అభిప్రాయ సేకరణ ఎమ్మెల్యేలు, సీనియర్లతో అధిష్టానం సంప్రదింపులు అవకాశం రాని సీనియర్లకు టీపీసీసీలో స్థానం నెలాఖరులో కొలిక్కి వచ్చే అవకాశం -
డీసీసీబీ, ‘పాక్స్’ల పదవీకాలం పొడిగింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగే విధంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం గడువు శుక్రవారంతో ముగియగా.. అదే రోజున మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. సహకార సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల నియామకం ఇబ్బందికరం కాగా.. పాలకవర్గాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ‘పాక్స్’ల పదవీకాలం ఆరు నెలలు పొడిగించినట్లు చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి వరంగల్లో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాలు మరో ఆరు నెలలు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా.. సహకార సంఘాల పదవీ కాలం పొడిగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖలకు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం -
జాతరలో సకల సౌకర్యాలు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఐలాపూర్లో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో సకల సౌకర్యాలు కల్పించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఐలాపూర్ జాతరకు శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలతో చేరుకుని మేకపోతుతో మొక్కు సమర్పించుకున్నారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ఐలాపూర్ జాతరకు నిధులు సరిగా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాతరకు రూ.85లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. జాతరలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, గుడి ప్రాంగణంలో జాలి కంచె ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, మండల ఇన్చార్జ్ జాడి రాంబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న నాయకులు ప్లీ భాస్కర్, తిరుపతి, సురేష్, రాంబాబు పాల్గొన్నారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ ఏటూరునాగారం: మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ కాలనీలో ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్మాణ కమిటీ వ్యవస్థాపకులు గోగు మల్లయ్యజ్యోతి, కొమురవెల్లి మల్లన్న పట్నాల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాల వాల్పోస్టర్ను శుక్రవారం ఐలాపూర్లో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
రైతులకు ‘భరోసా’
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఈ మేరకు భూ భారతిలో నమోదైన వ్యవసాయ పంటసాగుకు యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందుతుందని ప్రకటించింది. డైరెక్టర్ బెనిఫిషరి ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఈ మేరకు ఎకరాకు రూ.12వేల చొప్పున రెండు దఫాలుగా రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ మేరకు మొదటి దఫా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. జిల్లాలో 33,280 మందికి భరోసా జిల్లాలోని 10మండలాల్లో రైతు భరోసా కింద 33,280 మంది రైతుల ఖాతాల్లో రూ.23.54 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. దీంతో రైతులకు కష్టకాలంలో ఈ డబ్బులు పంటల పెట్టుబడికి చేదోడువాదోడుగా నిలిచాయి. మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నగదు జమ చేసింది. ఆపై భూమి ఉన్న వారికి రైతు భరోసా అందుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.మండలాల వారీగా రైతు భరోసా వివరాలు మండలం రైతుల నగదు జమ సంఖ్య రూ.లక్షల్లోఏటూరునాగారం 2,786 రూ.17.65 గోవిందరావుపేట 3,157 రూ.26.31 కన్నాయిగూడెం 1,736 రూ.11.04 మంగపేట 2,879 రూ.26.36 ఎస్ఎస్ తాడ్వాయి 1,616 రూ.11.13 వాజేడు 2,629 రూ.13.39 ములుగు 9,058 రూ.57.05 వెంకటాపురం(కె) 6,879 రూ.58.29 వెంకటాపురం(ఎం) 2,540 రూ. 14.14మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
ఘనంగా మండమెలిగె
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో మినీజాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. నాలుగురోజులపాటు జరిగే జాతర మొదటిరోజు బుధవారం మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో ఘనంగా మండమెలిగె పండుగ నిర్వహించారు. ఉదయం ఆలయాలను శుద్ధి చేసిన పూజారులు.. మండమెలిగె పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. మేడారంలోని సమ్మక్క గుడిలో అమ్మవారి శక్తి పీఠాన్ని, గుమ్మాన్ని ఆడపడుచులు, పూజారులు పసుపు, కుంకుమలతో అలంకరించారు. సమ్మక్క పూజారి సిద్దబోయిన నితిన్ ఇంటినుంచి పవిత్ర జలం, పసుపు, కుంకుమలను తీసుకొని పోచమ్మగుడికి వెళ్లి.. చీర సమరి్పంచి పూజలు చేశారు. నితిన్ ఇంటి వద్ద తయారు చేసిన మామిడి తోరణాలను డోలు వాయిద్యాల నడుమ తీసుకొని వెళ్లి చిలకలగుట్ట వెళ్లే దారి సమీపంలో రోడ్డుకు ఇరువైపులా కట్టి, ధ్వజస్తంభాన్ని నిలిపారు. రాత్రి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి తీసుకొని డోలు వాయిద్యాలతో సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. అనంతరం రహస్య పూజలు నిర్వహించారు. అలాగే కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక సారయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి సారలమ్మ పూజారులతో పాటు గ్రామంలోని ఆదివాసీలంతా కలసి సారలమ్మ గుడి నుంచి పసుపు, కుంకుమ, శాకహానం (ఇప్పపువ్వు సారా) తీసుకొని గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. మంత్రిసీతక్క బుధవారం రాత్రి మండమెలిగెపండుగలో పాల్గొన్నారు. ముందుగా సమ్మక్క గుడిలో పూజలు చేశారు. అనంతరం గద్దెలను దర్శించుకున్నారు.భక్త జన సందడి.. అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచేమొదలైన భక్తుల తాకిడి మధ్యాహ్నం వరకుకొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద షవర్ల కింద స్నానాలు అచరించి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బాయిలర్ కోళ్ల అమ్మకాలు డీలా.. జాతరలో కోళ్లు, యాటలను మొక్కుగాసమర్పించడం ఆనవాయితీ. అయితే బర్డ్ఫ్లూ వార్తల ప్రభావం మినీ జాతరపై కూడా పడింది. కోళ్ల వ్యాపారులు గిరాకీ సరిగా లేక డీలా పడిపోయారు. మార్కెట్ రేట్ ప్రకారం మినీ జాతరలో బాయిలర్ కోడి కేజీ రూ.180, జుట్టు కోడిరూ.గుత్తకు రూ.200 అమ్మకాలు చేపట్టినా భక్తులు ముందుకు రాలేదు. దీని గురించి పలువురు భక్తులను ప్రశ్నించగా, బర్డ్ఫ్లూ వార్తల కారణంగా సొంత గ్రామాల నుంచి నాటుకోళ్లను తీసుకొచి్చనట్లు తెలిపారు. మరికొందరు స్థానికుల వద్ద రేటు ఎక్కువైనా నాటుకోళ్లనే కొనుగోలు చేశారు. -
మేడారంలో వాటర్ ప్లాంట్
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మినీజాతర సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున మినరల్ వాటర్ అందించేందుకు వాటర్ ప్లాంట్ను వినియోగంలోకి తీసుకువచ్చారు. గత మహాజాతర సందర్భంగా ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురాలేదు. మినీ జాతరను పురస్కరించుకొని వాటర్ ప్లాంట్కు షెడ్ నిర్మాణంతో పాటు వాటర్ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎండోమెంట్ కార్యాలయంలో భోజనాలు చేసే పోలీస్ అధికారులు, దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది, మీడియా, భక్తులకు ఈ వాటర్ ప్లాంట్ నీరు అందించనున్నారు.జాతరలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులుములుగు: మినీ మేడారం జాతరలో పంచాయతీరాజ్ శాఖ తరఫున పటిష్టమైన పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పక్షం రోజులుగా రాజమండ్రి నుంచి వచ్చిన 300 మందితో పాటు స్థానికంగా ఉన్న 100మంది కార్మికులతో రోజుకు 12గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో పనులు చేయిస్తున్నారు. జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, కొంగల మడుగు, రెడ్డిగూడెం, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం, చింతల్క్రాస్, రెడ్డిగూడెం, కొత్తూరు, ఇంగ్లిష్మీడియం, చిలుకలగుట్ట, ఊరట్టం, వీవీఐపీ పార్కింగ్ ప్రాంతాలలో మరుగుదొడ్లు, పేరుకుపోయిన చెత్తాచెదారం ఏరి వేస్తున్నారు. నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో నిత్యం బ్లీచింగ్ పౌడర్ను చల్లిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను ఏరివేయడానికి, మాంసం దుకాణాల నుంచి వేస్టేజ్ను తరలించడానికి సిబ్బందిని కేటాయించారు. కార్మికులకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు భోజన వసతి కల్పిస్తున్నారు. మినీ మేడారం జాతరను మూడు జోన్లు, 21 సెక్టార్లుగా విభజించారు. వచ్చే 5 రోజుల పాటు 40మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఎంపీఓలు, 10మంది కారోబార్లు, డీపీఓ పనిచేయనున్నారు.వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలివెంకటాపురం(ఎం): జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపునకు వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని జవహర్నగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ను డీఎంహెచ్ఓ మంగళవారం తనిఖీ చేశారు. జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు పొందేందుకు చేస్తున్న మౌలిక ఏర్పాట్లపై ఆరా తీశారు. సెంటర్ పరిసరాలను పరిశీలించి ఆవరణలో నాటిన ఔషధ మొక్కలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. మందుల నిల్వల వివరాలను సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంఘమిత్ర, ఏఎన్ఎంలు ఫాతిమున్నీసా, స్వర్ణలత పాల్గొన్నారు.అడవికి నిప్పు.. పర్యావరణానికి ముప్పువాజేడు: అడవిలో నిప్పు పెడితే పర్యావరణానికి ముప్పు తప్పదని దూలాపురం రేంజ్ ఇన్చార్జ్ రేంజర్ బాలకృష్ణ అన్నారు. మండల పరిధిలోని ఘనపురం గ్రామస్తులకు అడవి సంరక్షణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అడవుల సంరక్షణతోనే స్వచ్ఛమైన గాలితో పాటు పండ్లు లభిస్తాయని తెలిపారు. అడవికి నిప్పు పెడితే జీవరాసులకు నీడ, ఆహారం కరువై అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ఇప్పపువ్వు, చీపురు సేకరణకు వెళ్లినప్పుడు అడవికి నిప్పు పెట్టకూడదన్నారు. ఇప్పచెట్ల కింద పరదాలు పరిచి పువ్వులను సేకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్బీఓలు వాసు, ఆదిలక్ష్మి, లలిత, హతీరామ్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. -
ఓటర్లు@2,45,015
ములుగు: జిల్లాలోని 10 మండలాల్లో 10 జెడ్పీటీసీ స్థానాలు, 87 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల వివరాలను మంగళవారం రాత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ అథారిటీ ఆఫీసర్ సంపత్రావు వివరాలను వెల్లడించారు. జిల్లాలో 400వరకు ఓటర్లు కలిగిన పోలింగ్ స్టేషన్లు 117, 400నుంచి 500మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 165, 501 నుంచి 750 మంది వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలు 210గా గుర్తించగా మొత్తం 492 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2,45,015 మంది ఓటర్లు ఉండగా 1,18,572 మంది పురుషులు, 1,26,418 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 25 మంది ఉన్నారు. మండలాల వారీగా ఓటర్ల వివరాలుమండలం ఎంపీటీసీ పోలింగ్ మొత్తం స్థానాలు కేంద్రాలు ఓటర్లు ములుగు 13 73 38,910 మల్లంపల్లి 5 25 13,462 వెంకటాపురం(ఎం) 9 58 28,350 గోవిందరావుపేట 9 64 25,490 ఎస్ఎస్తాడ్వాయి 7 38 18,389 ఏటూరునాగారం 9 41 24,590 మంగపేట 14 77 39,689 వాజేడు 7 41 19,411 కన్నాయిగూడెం 5 21 9,943 వెంకటాపురం(కె) 9 54 26,781 మొత్తం 87 492 2,45,015వివరాలు వెల్లడించిన అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ అథారిటీ ఆఫీసర్ సంపత్రావు -
భక్తులకు పౌష్టికాహారం పంపిణీ
ఏటూరునాగారం: ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం గ్రామంలో ఈనెల 12 నుంచి 15 వరకు జరిగే మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు సీడీపీఓ ప్రేమలత తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో మంగళవారం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో 6నెలల నుంచి ఆరేళ్ల బాల బాలికలకు, గర్భిణులు, బాలింతలకు బాలామృతం, స్కాక్స్, బాదంపాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు మేడారానికి తల్లిదండ్రులతో వెళ్లే చిన్నారులు జాతరలో నీరసానికి గురికాకుండా ఈ పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారంతో పాటు ఐలాపూర్లో ఏర్పాటు చేసిన జాతరలో తప్పిపోయిన భక్తులను పునరావాస కేంద్రాల వద్దకు చేర్చి బంధువులకు సమాచారం చేరవేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆఫ్రీన్, పుష్పలతతో పాటు చైల్డ్ హెల్ప్లైన్ చంటి, అంగన్వాడీ టీచర్లు భవాని, లలిత, ఆయాలు పాల్గొన్నారు.సీడీపీఓ ప్రేమలత -
‘మండమెలిగె’కు పూజారులు సిద్ధం..
ఎస్ఎస్ తాడ్వాయి : జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలో గల మేడారం సమ్మక్క–సారలమ్మ మినీ జాతర (మండమెలిగె) పండుగ నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాలు, గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతర మొదటి రోజు (బుధవారం) మేడారం, కన్నెపల్లిలోని అమ్మవార్ల ఆలయాల్లో మండమెలిగె పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు నిర్వహించనున్నారు. ముందుగా సమ్మక్క గుడి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆడపడుచులు రంగవల్లులు వేసి ముస్తాబు చేస్తారు. డోలు వాయిద్యాలతో తూర్పు, పడమర పొలిమేర్లలో ధ్వజస్తంభాలు (దిష్టి తగలకుండా) మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ముందుగా పూజారులు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేస్తారు. అనంతరం గుడికి చేరుకొని అమ్మవారికి దీప, ధూపాలతో పూజలు నిర్వహించి యాటతో నైవేద్యం సమర్పిస్తారు. రాత్రి సమయంలో పూజారులు అమ్మవారి పూజాసామగ్రి, పసుపు, కుంకుమలను తీసుకొని డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు వెళ్లి అమ్మవారి గద్దె వద్ద కూడా పూజలు చేస్తారు. అలాగే, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కూడా సారలమ్మ పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహించి రాత్రి సమయంలో గద్దెల ప్రాంగణంలోకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క–సారలమ్మ పూజారులు గద్దెల వద్ద కలుసుకొని శాకాహానం (ఇప్పపువ్వు సారా) ఇచ్చి పుచ్చుకొని రాత్రంతా గద్దెల వద్ద డోలు వాయిద్యాలతో జాగారం చేస్తూ సంబురాలు జరుపుకుంటారు.ముస్తాబైన గద్దెల ప్రాంగణం...దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల క్యూలైన్లపై చలువ పందిళ్లు వేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో పాటు అమ్మవార్ల గద్దెలు జిగేల్మనేలా సాలాహారం చుట్టూ విద్యుత్ దీపాలను అలంకరించారు. మధ్యాహ్నం సమయంలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రాంగణంలో కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేశారు. -
గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించాలి
ఏటూరునాగారం: గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించి పక్కా భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్హాల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ములుగు జిల్లా 3వ మహాసభలను పురస్కరించుకుని మంగళవారం జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందన్నారు. ములుగు జిల్లాకిచ్చిన గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. దీంతో పక్క భవనాల నిర్మాణం ఎలా జరుగుతుందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలన్నారు. 8నెలలుగా మెస్ కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీఎల్.రవి, ఉపాధ్యక్షుడు సాదు రాకేష్, మోర లక్ష్మణ్, రవితేజ, బాలేశ్వర్, భరత్, రంజిత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ -
ఒక నామినేషన్ తిరస్కరణ
● సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించిన ఎన్నికల అధికారులు నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సమర్పించిన నామినేషన్లలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా.. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం (స్క్రూట్నీ) నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి తండు ఉపేందర్ నామినేషన్ పత్రంపై సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మిగిలిన 22 మంది నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ములుగు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని 174 గ్రామపంచాయతీల్లో 87ఎంపీటీసీ స్థానాలు, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ముందుకుసాగాలని సూచించారు. ఆర్ఓలు నోటిఫికేషన్ జారీ చేసి మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియను చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. తదుపరి అన్ని రకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్ను అభ్యర్థుల పేర్లపై అక్షర క్రమంగా ముద్రించాల్సి ఉంటుందని వివరించారు. నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ప్రతిరోజూ రిపోర్ట్ను అందించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ, విత్డ్రాలను వీడియో చిత్రీకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఎంపీడీఓలు, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు పాల్గొన్నారు. ‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి వచ్చే నెల 21వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ ఫలితాల కోసం ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా పాటుపడాలన్నారు. డీఈఓ పాణిని ప్రతిరోజూ అన్ని మండలాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వార్షిక పరీక్షలకు తమ చిన్నారులను పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేలా చూడాలనే విషయాన్ని వివరించాలన్నారు. 40 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఉత్తమ ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి సూర్యనారాయణ, ఏసీజీ అప్పని జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం
కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: నేటినుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నల్లాలు, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునే గదులను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య పనులు చేపట్టారని, వైద్యశాఖ తరఫున శిబిరాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. అమ్మవారి గద్దెల ప్రాంగణంలో, క్యూలైన్ వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. ఏటూరునాగారం మండలం కొండాయి, ఐలాపూర్ మినీ మేడారం జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ తరఫున చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు, ఊరట్టం నుంచి కొండాయి వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకొని ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. -
జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు
ఏటూరునాగారం: కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల పరిధిలోని ఐలాపూర్, కొండా యి గ్రామాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి జరిగే జాతరలకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. సోమవా రం ఐలాపూర్ జాతర కోసం ఆ గ్రామంలో ఏర్పా టు చేసిన కంటైనర్ అదనపు ఆరోగ్య ఉపకేంద్రం, కొండాయిలోని సబ్ సెంటర్లను క్రాంతికుమా ర్ వైద్యులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు కావాల్సిన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు మందులు సైతం అందుబాటులో ఉంచామని తెలిపారు. గర్భి ణులు, రోగుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అభినవ్, ప్రణీత్కుమార్, ఎన్హెల్త్ మిషన్ మేనేజర్ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ -
అక్రమాలపై విచారణ చేపట్టాలి
వెంకటాపురం(కె): వెంకటాపురం(కె) ఐసీడీఎస్ కార్యాలయం పరిధిలో అక్రమంగా బిల్లులు చేసిన వాటిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాననాయకులు సోమవారం అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. చిన్నారులకు మెరుగైన విద్యను బోధించడంతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్, డీడబ్ల్యూఓ 2023 నుంచి 2024 వరకు వెంకటాపురం ప్రాజెక్ట్ పరిధిలో చేసిన అక్రమ బిల్లులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పర్శిక సతీష్, తాటి రాంబాబు, నాగరాజు, సురిటి నవదీప్, బొగ్గుల రాజ్కుమార్, సోర్లం మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యతవాజేడు: అడవులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని వాజేడు రేంజర్ చంద్రమౌళి అన్నారు. మండల పరిధిలోని కృష్ణాపురం, కోయవీరాపురం గ్రామాల్లోని ప్రజలకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులకు నిప్పుపెడితే జీవకోటికి ప్రమాదం ఉంటుందని తెలిపారు. అడవులు లేకపోతే సమస్త ప్రాణులకు ఆక్సిజన్ అందకపోవడంతో పాటు వర్షాలు కురవవని తెలిపారు. అదే విధంగా ఏడ్జర్లపల్లి బీట్లో ఎఫ్ఎస్ఓ నాగమణి ఆ గ్రామస్తులకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓలు నారాయణ, నాగమణి, భిక్షపతి, బీట్ ఆఫీసర్లు రాంమూర్తి, పున్నమయ్య, గంగా భవాని, పద్మ, ప్రసాదరావు, మనీషా తదితరులు పాల్గొన్నారు.రేపటి నుంచి బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ ములుగు: నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో రేపటి(12వ తేదీ)నుంచి ములుగు బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ను నిర్వహించనున్నట్లు ఆ కేంద్రం వలంటీర్ నవీన్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12, 13వ తేదీలలో యువకులకు కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్ పోటీలు ఉంటాయని వెల్లడించారు. వివరాలను నమోదు చేసుకోవడానికి ఫోన్ నంబర్ 9502126384, 9505496034లలో సంప్రదించాలని సూచించారు. విజేతలకు ఎలాంటి నగదు బహుమతి ఉండదని, ప్రశంస పత్రాలు, మెడల్స్ మాత్రమే అందిస్తామని వివరించారు. తాడిచర్లలో క్షుద్రపూజల కలకలం మల్హర్: తాడిచర్ల శివారులోని తోళ్లపాయ వైపు.. పెద్దమ్మ గుడి, బీసీ కాలనీ పోయే మూడు బాటల వద్ద ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయడం కలకలం రేగింది. మూడు రోడ్లు కలిసే చోట నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో కూడిన ముద్దలు చేసి, గొర్రె పిల్లను బలిచ్చారు. క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురువుతున్నారు. ఈ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. మరి కొంతమంది రైతులు బిక్కుబిక్కుమంటూ వారి పనులకు వెళ్తున్నారు. బొమ్మల కొలువు భూపాలపల్లి అర్బన్: మంజూర్నగర్లోని ఇల్లందు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఏరియాలో బొమ్మల కొలువు నిర్వహించారు. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి దేవాలయం నమూనాతో ఏర్పాటు చేసిన బొ మ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి సీఎండీ సతీ మణి శారద బలరాం హాజరై సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి, లేడీస్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. -
జాతరకు సిద్ధం
ముగింపు దశకు చేరుకున్న మినీ మేడారం పనులు● రేపటినుంచి 15వ తేదీ వరకు జాతర● నిత్యం అధికారుల పర్యవేక్షణ అడుగడుగునా నిఘా.. మేడారంలో భక్తుల రద్దీ కారణంగా దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిత్యం పర్యవేక్షించేందుకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ఆర్టీసీ వై జంక్షన్, మేడారం ఐలాండ్ ప్రాంతం, గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు, తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న సీసీ కెమెరాలను మరమ్మతులు చేయించారు. అన్నింటినీ మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. ఫుటేజీలను నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మినీ జాతరకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతరకు వచ్చే భక్తుల సేవల కోసం అన్ని ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్టీసీ కూడా బస్టాండ్ కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు మేడారం ఎండోమెంట్ కార్యాలయంలో ఒక ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచారు. -
ఐలాపూర్ పనులు త్వరగా పూర్తిచేయాలి
కన్నాయిగూడెం: ఐలాపూర్ సమ్మక్క–సారలమ్మ జాతర పనులను త్వరితగతిన పూర్తిచేసి జాతరను విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి ఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణ అన్నారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి ఐలాపుర్ సమ్మక్క గుడి ప్రాంగణంలో చేస్తున్న పనులను పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో చేస్తున్న శానిటేషన్ తో పాటు వివిధ పనులపై ఆరా తీశారు. వెంటనే పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో ఇంజనీరింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి డీఈ శరత్బాబు, తహసీల్దార్ వేణుగోపాల్, ఏపీఓలు సురేష్, సాజిత, ఆర్ఐ గణేశ్, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.– వివరాలు 8లోuఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణభద్రత.. భారీగా జాతర విధులకు వెయ్యి మంది సిబ్బంది బుధవారం నుంచి ఆదివారం వరకు కొనసాగనున్న భద్రత -
మళ్లీ పులి సంచారం..!
కాటారం/కాళేశ్వరం: మండలంలోని నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం ప్రకంపనలు సృష్టిస్తుంది. అడవి ప్రాంతంలో తప్పిపోయిన ఎద్దు కోసం వెళ్లిన వ్యక్తికి పులి కనిపించినట్లు బయటకు రావడంతో అటు దిశగా విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులకు ఆనవాళ్లు కనిపించాయి. కాటారం మండలం నస్తూర్పల్లికి చెందిన ఓ వ్యక్తి ఎద్దు తప్పిపోవడంతో సోమవారం తెల్లవారుజామున ఎద్దు జాడ కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఎద్దు ఆచూకీ లభించడంతో తిరిగి వస్తున్న క్రమంలో పులి వెళ్లడం గమనించినట్లు పలువురు గ్రామస్తులకు తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం చేరడంతో అటవీ ప్రాంతానికి చేరుకొని పులి సంచారంపై విచారణ చేపట్టారు. మహారాష్ట్ర టు చెన్నూర్.. రెండేళ్ల క్రితం డిసెంబర్, జనవరి మాసంలో మండలంలో పులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించి పూర్తి నిఘా పెట్టారు. కానీ పులి మండలంలో పలు ప్రాంతాల్లో తిరిగాడి చివరగా అదిలాబాద్ ఉమ్మడి జిల్లా చెన్నూర్ వైపుగా వెళ్లినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర నుంచి మహదేవపూర్ అటవీప్రాంతం మీదుగా మండలంలోకి ప్రవేశించిన పులి ఒడిపిలవంచ, జాదారావుపేట, దామెరకుంట లేదా విలాసాగర్ మీదుగా చెన్నూర్ అటవి ప్రాంతంలోకి చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని అటవిలో నీటి వనరులు, శాఖాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉండటంతో పులి నిలకడగా ఉండే పరిస్థితి లేదంటున్నారు. పులి అలజడి మొదలవడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పూట అటవి ప్రాంతంలోకి వెళ్లొద్దని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు. పాదముద్రలు సేకరించాం.. నస్తూర్పల్లి గ్రామానికి సమీపంలో అటవీప్రాంతంలో పులిని చూసినట్లు ఓ వ్యక్తి చెప్పడంతో సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాం. పలుచోట్ల పులి పాదముద్రలను గుర్తించి సేకరించాం. మరింత సమాచారం సేకరిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై విచారణ జరిపి పులి ఎటు వెళ్లిందో తెలుసుకుంటాం. – రాజేశ్వర్, డిప్యూటీ రేంజర్, మహదేవపూర్అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు -
కామేశ్వరాలయ పనులు ప్రారంభం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం ఆవరణలోని కామేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కామేశ్వరాలయ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.11కోట్ల నిధులను మంజూరు చేయడంతో గత డిసెంబర్ నెలలో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ప్లేట్లోడ్ టెస్టును నిర్వహించి ఆలయ నిర్మాణం చేపడితే శిల్పాల బరువును భూమి ఎంతమేరకు తట్టుకుని నిలబడుతుందోనని పరీక్షలు నిర్వహించారు. ముందుగా కామేశ్వరాలయం చుట్టూ వాల్ నిర్మించేందుకు వారం రోజులుగా కందకం తవ్వకాలు చేపడుతున్నారు. రామప్పలో నిర్మించిన ఆలయాలు కేవలం ఇసుకనే పునాదిగా చేసి నిర్మించారు. కాలక్రమేణా ఇసుకను చీమలు తోడేస్తుండడంతో ఆలయం కుంగిపోయే ప్రమాదం ఉండడంతో ఆలయం చుట్టూ పది అడుగుల మేర కందకం తవ్వి రాయితో వాల్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఆలయ పునాదిలోకి చీమలు, ఎలుకలు వెళ్లి ఇసుకను తోడే ప్రమాదం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. -
నేతకానీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
ఏటూరునాగారం: నేతకాని కులస్తులకు ప్రత్యేక కేటగిరి కల్పించడంతో పాటు బడ్జెట్ కేటాయించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కుల గణన వివరాల్లో ఎస్సీ నేతకాని సామాజిక వర్గం 1,33,000 జనాభా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా 18లక్షల పైచిలుకే జనాభా ఉంటుందని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రీ సర్వే చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేక కోటాతో పాటు కేటగిరి కల్పించి బడ్జెట్ కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో బక్కయ్య, కాంతారావు, చంద్రబాబు, పోచయ్య, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు -
వాతావరణం
మరోసారి అవకాశం ఇవ్వండి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన తనను గెలిపించాలని అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు.జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.– 8లోuఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి గ్రామంలో గోవిందరాజులు, నాగులమ్మ, సారలమ్మ జాతర ఈ నెల 12నుంచి నిర్వహిస్తున్నందున జాతరకు రావాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రఘు, జనార్ధన్లు ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతరకు వచ్చి ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూపేష్, యువసేన, గౌరి పాల్గొన్నారు.కొండాయి జాతరకు ఆహ్వానం -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఏటూరునాగారం: మార్చి 21వ తేదీ నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని షెడ్యూల్డ్ కులాల జిల్లా అభివృద్ధి అధికారి లక్ష్మణ్ నాయక్ అన్నారు. జిల్లాలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు పదోతరగతి పరీక్షలపై ప్రేరణ, శిక్షణ కార్యక్రమాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో జరగబోయే టెన్త్ పరీక్షలు ఎలా రాయాలనే దానిపై ఇంగ్లిష్, తెలుగు, హిందీ, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. పరీక్షలకు ఇంకా 40రోజులే ఉన్నందున ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలను విద్యార్థులకు వివరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సాంబశివరావు, హెచ్డబ్ల్యూఓలు ప్రశాంత్, రేణుక, శ్రీనివాస్, ఓదెమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.షెడ్యూల్డ్ కులాల జిల్లా అభివృద్ధి అధికారి లక్ష్మణ్నాయక్ -
జోరుగా ‘ఉపాధ్యాయ’ నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి చివరిరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులనుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నామినేషన్లు స్వీకరించారు. సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు వేయగా.. మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి దాఖలు వేశారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మంగళవారం వాటి పరిశీలన జరగనుంది. వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. భారీగా సమావేశాలు, ర్యాలీలు ఇంతకుముందే నామినేషన్లు వేసిన వారు కూడా సోమవారం పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి మరోసెట్ దాఖలు చేశారు. అందులో ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్రెడ్డి, పులి సరోత్తమ్రెడ్డి, పూల రవీందర్, ఎస్.సుందర్రాజు యాదవ్ తదితరులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. పూల రవీందర్ బహుజన వాదంతో పెద్దఎత్తున ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయగా, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి కూడా ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా, టీపీయూఎస్ మద్దతుతో పులి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించారు. సుందర్రాజు యాదవ్ వాహనాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. సుందర్రాజుయాదవ్, పూల రవీందర్ నామినేషన్ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి గతంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు కూడా హర్షవర్ధన్రెడ్డి తరఫున ఆయన కూతురు హేమంత సంధ్యారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు వేశారు. 13 వరకు ఉపసంహరణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 13వ తేదీన 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి చివరి రోజున 18 మంది నామినేషన్ మొత్తంగా 23 మంది 50 సెట్లు దాఖలు భారీ ర్యాలీలతో హోరెత్తిన నల్లగొండ నేడు నామినేషన్ల పరిశీలనఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య 25,797 నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు పెరిగారు. డిసెంబరు 30న ప్రకటించిన జాబితా ప్రకారం ఉపాధ్యాయ ఓటర్లు 24,905 మంది ఉన్నారు. అయితే నామినేషన్ల వరకు కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. దీంతో మరో 892 మంది ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. తుది ఓటరు జాబితాకు ఈ సప్లిమెంటరీ జాబితా జత చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 25,797 మంది ఓటర్లు ఉన్నారు. -
ఉత్తమ సేవలు
భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని జిల్లా సూపెరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారు డు తన అప్లికేషన్ స్థితిని ట్రాకింగ్ సిస్టంద్వారా తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు. అప్లికేషన్ నంబర్తో టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారం ముగియనుంది. ఎన్నికల కమిషన్ జనవరి 29న షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నాటికి పూర్వ వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి ఉపాధ్యాయ ప్రధాన సంఘాలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కలిపి 17 మంది 23 సెట్లలో నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ఆశావహులందరూ చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. రేపు పరిశీలన.. 13న ఉప సంహరణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 13 మంది స్వతంత్రులు 16 సెట్లలో నామినేషన్లు వేశారు. ప్రధాన సంఘాలు బలపరిచిన నలుగురు మరో ఏడు సెట్లలో నామినేషన్లు భారీ ర్యాలీల నడుమ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి టీచర్స్ జేఏసీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ, టీఎస్యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్, ఏలే చంద్రమోహన్, దామెర బాబూరావు, తలకొప్పుల పురుషోత్తంరెడ్డి, డాక్టర్ పోలెపాక వెంకటస్వామి, సంగంరెడ్డి సుందర్రాజ్, చాలిక చంద్రశేఖర్, కంటె సాయన్న తదితరులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. సోమవారం కూడా పూర్వ మూడు జిల్లాల నుంచి నామినేషన్లు వేసేందుకు నల్లగొండకు తరలనుండగా.. మరుసటి రోజు మంగళవారం ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ఖరారు కానున్నాయి.రసవత్తరంగా ‘ఉపాధ్యాయ’ పోరు..ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఈనెల 14 నుంచి రసవత్తరంగా మారనుంది. ప్రచారం హోరెత్తించేందుకు అభ్యర్థులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో 191 మండలాల నుంచి 24,905 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా పురుషులు, సీ్త్ర ఓటర్లు కలిపి 5,098 మంది ఉండగా.. అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలోని నాలుగు మండలాల నుంచి 163 మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 4,483, ఖమ్మం 3,955, సూర్యాపేట 2,637, వరంగల్ 2,225, భద్రాద్రి కొత్తగూడెం1,949, మహబూబాబాద్1,618, యాదాద్రి 921, జనగామ 921, ములుగు 612, జయశంకర్ భూపాలపల్లిలో 323 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. కాగా నామినేషన్ల ఘట్టం ముగియడమే తరువాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుందన్న చర్చ ఆ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే 23 సెట్లలో 17 మంది నామినేషన్లు.. రేపు పరిశీలన.. 13న ఉపసంహరణ సై అంటే సై అంటున్న స్వతంత్ర అభ్యర్థులు రసవత్తరంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు -
నేటి ప్రజావాణి, గిరిజన దర్బార్ రద్దు
ములుగు/ఏటూరునాగారం: నేటి(సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని తెలిపారు. ఎన్నికల అనంతరం యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. అదే విధంగా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నేటి గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు పీఓ చిత్రామిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపారు. -
జాతరలో భక్తులకు మెరుగైన వైద్యసేవలు
ఎస్ఎస్తాడ్వాయి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మేడారం మినీ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందిస్తామని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ఆదివారం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. భక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ కల్యాణ మండపం, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్, బయ్యక్కపేట గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఒక్కో వైద్యశిబిరానికి ప్రోగ్రాం ఆఫీసర్లను నియమించామన్నారు. ఈ నెల 12నుంచి 15వ తేదీ వరకు జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు పవన్, రణధీర్, శ్రీకాంత్, చంద్రకాంత్, డీపీఎంఓ సంజీవరావు పాల్గొన్నారు.జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి ములుగు రూరల్: ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో నిర్వహించనున్న రైతుసంఘం జిల్లా ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎండి అమ్జద్పాషా ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రైతాంగ సమస్యల పరిష్కారంపై ఈ సభల్లో చర్చించనున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభలకు రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పాశం పద్మ హాజరుకానున్నట్లు వివరించారు. నాణ్యత లోపించిన వస్తువులు విషతుల్యం ములుగు: నాణ్యత లోపించిన వస్తువులను కొనుగోలు చేసి వినియోగిస్తే విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని వరల్డ్ కన్జ్యూమర్ రైట్ నేషనల్ డిప్యూటీ చైర్మన్ భూక్యా జంపన్ననాయక్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల ఫోరం సమావేశం సంతోష్ అధ్యక్షతన ఆదివారం వరంగల్లో నిర్వహించగా వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లమస శ్రీకాంత్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అన్నంపల్లికి చెందిన జంపన్న నాయక్ను కన్జ్యూమర్ రైట్ నేషనల్ డిప్యూటీ చైర్మన్గా నియమించి నియామక పత్రాన్ని అందించారు. దాతల అసంతృప్తి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్ధానంలో జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవంలో పలు రకాలుగా విరాళం ఇచ్చిన దాతలు పలువురు అసంతృప్తి చెందారు. ఆదివారం కుంభాభిషేకం ముగిసిన తరువాత కలశ దాతలు, ఇతర దాతలకు సన్మానం చేయాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన భక్తుడు మహేందర్ రూ.లక్ష విరాళంగా అందజేశారు. కనీసం అతని పేరు పిలవలేదని, సన్మానం చేయలేదని వాపోయాడు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయం ప్రాంగణంతో పాటు చింతామణి జలపాతం, వనదేవత ప్రాంతం కోలాహలంగా కనిపించింది. వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు దర్శించుకుని పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్శర్మ, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులకు పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
గోవిందరావుపేట: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క కోరారు. మండల పరిధిలోని చల్వాయి పీఎస్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. అదే విధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి రూ.12వేలు అందిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి ఇళ్లు ఇస్తుందని వివరించారు. కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మల్లాది రాంరెడ్డి, వంగ రవియాదవ్, దాసరి సుధాకర్, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇస్సార్ ఖాన్, పన్నాల ఎల్లారెడ్డి, రసుపుత్ సీతారాం నాయ క్, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మండల కేంద్రంలో అరుణోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి మాస్టర్స్ ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం బహుమతుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేసి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని తెలిపారు. అంతరించి పోతున్న క్రీడలను నేటి యువతకు పరిచ యం చేసిన ఘనత అరుణోదయ యూత్ క్లబ్ వారి దేనని తెలిపారు. నేటి యువకులు సెల్ఫోన్ల మత్తులో మునిగి తేలుతున్నారని వివరించారు. ఈ మండలం నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నా గ్రామాన్ని మరిచిపోకుండా ఏదో ఒకటి వినూత్నంగా చేస్తూ ఉండే సంస్కృతి ఉందన్నారు. నేటి యువతకు స్ఫూర్తిగా 45ఏళ్లు పైబడిన వారు బాల్ బ్యాడ్మింటన్లో పాల్గొనడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, అరుణోదయ యూత్ క్లబ్ సభ్యులు, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. ఉదయం, సాయంత్రం గంట సమయం ఉపాధ్యాయులు స్పెషల్ క్లాసులు బోధిస్తున్నారు. విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికతో ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు సైతం ప్రభుత్వం అల్పాహారం అందిస్తోంది. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ జిల్లాలోని పాఠశాలల్లో పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణపై జిల్లా, రాష్ట కమిటీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిత్యం ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తున్నారు. -
రామప్పలో పర్యాటకుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం పర్యాటకులు, విద్యార్థులు సందర్శించారు. రెండో శనివారం హాలిడే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుని చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు నిర్వహించారు. రామప్ప శిల్పాల వద్ద గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం రామప్ప సరస్సులో బోటింగ్ చేస్తూ కేరింతలు కొట్టారు. విదేశీయుల రాక.. రామప్ప దేవాలయాన్ని ఇటలీకి చెందిన మైక్రో, మార్కో, స్టెపీనో, జాద, జర్మనీకి చెందిన మార్కుస్, క్లాడియాలు వేరు వేరుగా సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ రామప్ప అందాలను తమ సెల్ఫోన్లో బందించుకున్నారు. -
మోడల్ బస్టాండ్కు ప్రణాళిక సిద్ధం
● ఊహా చిత్రం విడుదల చేసిన అధికారులు ములుగు: జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ప్రదేశంలో 80(సుమారు రెండు ఎకరాలు) గుంటల ప్రదేశంలో నూతనంగా నిర్మించనున్న మోడల్ బస్టాండ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు ఊహా చిత్రాన్ని ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క మ్యాప్ను పరిశీలించారు. ఇప్పటికే ప్రభుత్వం మోడల్ బస్టాండ్ కోసం రూ.5.11కోట్లు మంజూరు చేయగా నిధులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని మంత్రి సీతక్క సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సిద్ధం చేసిన మ్యాప్పై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇందులో 4795.47 స్క్వేర్ఫీట్లలో 10 బస్టాప్లకు చెందిన ప్రత్యేక ప్లాట్ఫాంలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్లాట్ ఫాంలు, 2410.22 స్క్వేర్ ఫీట్లు పార్కింగ్ స్థలానికి కేటాయించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్ను జాతీయ రహదారి 163వైపు ఉండేలా మ్యాప్ సిద్ధం చేశారు. తీక్షణంగా మ్యాప్ను గమనించిన మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపట్టాలని సూచించారు. -
No Headline
ములుగు రూరల్: ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలోని ఎంఆర్ గార్డెన్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శనివారం ములుగు, వెంకటాపురం(ఎం)మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుల సంక్షేమానికి ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో సుమారు రూ.30 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్, ఏటూరునాగారంలో బస్డిపోకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ నాయకులు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యుర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు రేషన్కార్డులు ఇచ్చిన పాపానాపోలేదన్నారు. భూమి లేని రైతుకూలీలను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన విధంగా నూతన రేషన్కార్డులు, రైతు భరోసా, బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వేతనాలు అందించాలని వినతి ములుగు: పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్, కోశాధికారి పాడ్య కుమార్ మంత్రి సీతక్కను కోరారు. ఈ మేరకు వారు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన మంత్రి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారి నరసింహారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పెండింగ్ వేతనాలతో పాటు సమ్మె కాలపు వేతనాన్ని అందించాలని సూచించారు. -
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: ఎయిడ్స్పై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని వైఆర్జీ కేర్ సంస్థ లింక్ వర్కర్ కిషన్, ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని పల్లె దవాఖానలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్ నాలుగు రకాలుగా వస్తుందని తెలిపారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన ఇంజక్షన్లతో, పరీక్షించని రక్త మార్పిడితో పాటు హెచ్ఐవీ ఉన్న గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు ఎయిడ్స్ సోకుతుందన్నారు. ప్రతిఒక్కరూ హెచ్ఐవీ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిలో ఉన్న ఐసీటీసీ కేంద్రంలో హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. హెచ్ఐవీ ఉన్న వారిపై వివక్షత చూపకుండా ప్రేమతో ఆదరించాలన్నారు. ఈ హెల్త్క్యాంపులో 30 మందికి హెచ్ఐవీ పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు గీత, సుగుణావతి, ఆశ వర్కర్లు కాళిక, సరిత, అరుణ తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో ద్వితీయ స్థానం గోవిందరావుపేట: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో టీజీఎస్పీ 5వ బెటాలియన్ ద్వితీయ స్థానంలో నిలిచింది. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్ సిబ్బంది ఇటీవల కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 18 క్రీడాకారులు పోటీల్లో పాల్గొని 25 మెడల్స్ సాధించారు. ఈ టోర్నమెంట్లో పతకాలు సాధించిన వారిని కమాండెంట్ సుబ్రహ్మణ్యం అభినందించారు. విధుల్లోనే కాకుండా క్రీడాల్లోనూ టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బంది ముందంజలో ఉండడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వేణుగోపాల్, సద్దాం హుస్సేన్, విజేతలు పాల్గొన్నారు. అడవిలో నిప్పు పెట్టొద్దు వాజేడు: అడవుల్లో ఇప్ప పువ్వు సేకరించే సమయంలో చెట్టు చుట్టూ శుభ్రం చేసుకోవాలని, ఎలాంటి సందర్భంలో కూడా నిప్పు పెట్టవద్దని ఎఫ్ఎస్ఓ నాగమణి అన్నారు. మండల పరిధిలోని బొమ్మనపల్లిలో ప్రజలు, విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడవులతో ఉండే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. కాటమయ్య కిట్లు వినియోగించుకోవాలి ములుగు రూరల్: కల్లుగీత కార్మికులు ప్రభుత్వం అందించిన కాటమయ్య రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి రవీందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అబ్బాపూర్లో 3వ విడత రక్షణ కిట్లు కల్లుగీత కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిదారులకు సేఫ్టీ కిట్లపై ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. గీత కార్మికుల ప్రమాదాల నివారణకు సేఫ్టీ మోకులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. అనంతరం ఆ సంఘం నాయకుడు రవిగౌడ్ మాట్లాడుతూ ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ తేడా లేకుండా కల్లుగీత కార్మికులందరికీ మోకులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుర్ర శ్రీనివాస్, పులి రమేష్, సత్యనారాయణ, రఘుపతి, రవిగౌడ్, శంకరయ్య, సదానందం, మధుకర్, శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మాతృ దేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ.. ఇలా మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. విద్యార్థులకు తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత స్థానంలో నిలపాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. పాఠశాలలకు వచ్చే బిడ్డల్లాంటి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. ఆ విషయాన్ని బాధిత విద్యార్థులు అటు తల్లిదండ్రులకు, ఇటు సన్నిహితులకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. లైంగిక వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో చివరికి ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులకు చెబుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థినులకు ‘ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్’ అనేది తల్లిదండ్రులు ఇంటి వద్దనే నేర్పించాలని, బ్యాడ్ టచ్ అయితే భయపడకుండా చెప్పాల్సిన అవసరం ఉందని మానసిక వికాస నిపుణులు చెబుతున్నారు. – తొర్రూరు/కాజీపేటజనవరిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపాడు మోడల్ స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థినులను సీఎం కప్ పోటీల నిమిత్తం హైదరాబా ద్కు తీసుకెళ్లిన పీఈటీ వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విచారణ చేసి అతడిని సస్పెండ్ చేశారు. ఇటీవల తొర్రూరు మండలం అరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. ఉపాధ్యాయుల వేధింపుల వ్యవహారం బయటకు పొక్కడంతో పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టి వారికి దేహశుద్ధి చేశారు. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం సక్రాంనాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు చిన్నారుల కు నీలి చిత్రాలు చూపించాడు. తమతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు టీచర్కు దేహశుద్ధి చేశారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. రెండేళ్ల క్రితం దంతాలపల్లి మండలం దాట్ల గ్రామ ఉన్నత పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు క్రీడల పేరిట తాకరాని చోట తాకుతూ విద్యార్థినులను వేధించాడు. విషయం బయటకు పొక్కడంతో టీచర్పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.చెడు స్పర్శఛాతిపై చేయి వేయడం, నడుం కింద, వెనుకవైపు తాకడం, అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యకర రీతిలో వ్యవహరించడం. మంచి స్పర్శతల, వీపుపై తట్టడం, కరచాలనం, ప్రశంసిస్తూ బుగ్గలు, చెవులను తాకడం ఫిర్యాదుకు భయపడొద్దు.. చిన్నతనం నుంచి బాలికల్లో ధైర్యాన్ని నూరిపోయాలి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఇంకా ఏమైనా జరిగినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి. ఇంట్లో చెబితే తనను నిందిస్తారని బాలికలు భయపడొద్దు. లేదంటే ఆ సమస్య పెద్దగా మారే ప్రమాదం ఉంది. పిల్లలు చెప్పే విషయాన్ని తల్లిదండ్రులు సావధానంగా వినాలి. అంతే కానీ, వారి మనసుకు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. ఫిర్యాదు చేస్తే సమాజంలో ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు కూడా భయపడొద్దు. ఆపద సమయంలో బాలికలు వెంటనే 100 నంబర్కు డయల్ చేయడం ఉత్తమం. – వై.సుధాకర్రెడ్డి, సీఐ, కాజీపేట చిన్నప్పటినుంచే అవగాహన కల్పించాలి తల్లిదండ్రులు ఆడపిల్లలకు మంచి చెడులు వివరించి చెప్పాలి. బ్యాడ్టచ్, గుడ్ టచ్ అంటే ఏమిటి? వాటి పర్యవసానాలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అవగాహన కల్పించాలి. పిల్లలను ఇష్టారీతిగా తాకితే వెంటనే రియాక్ట్ అయ్యేలా చూడాలి. పిల్లలు ఇటువంటి అనుభవం ఎదురైనప్పుడు నిర్భయంగా తల్లికి చెప్పుకునేలా మనోధైర్యం కల్పించాలి. బయట ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా తయారు చేయాలి. – అశోక్ పరికిపండ్ల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు, సైకాలజిస్ట్ అనైతిక, క్షమార్హం కాని చర్యలకు పాల్పడుతున్న పలువురు ఉపాధ్యాయుల తీరుతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేక పేదింటి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో చిన్నారులపై వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కన్నవారు కుమిలిపోతున్నారు. చదువు మాన్పించేందుకు సైతం తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లే అవకా శం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై నిఘా ఉంచాల ని, తప్పు చేసినట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని అన్ని గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థినులు నేరుగా చెప్పుకోలేని సమస్యలను తెలుసుకునేందుకు ఫిర్యాదు పెట్టెలను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేశారు. నేరుగా చెప్పలేని సమస్యలను విద్యార్థులు పేపర్పై రాసి ఆ ఫిర్యాదు పెట్టెలో వేస్తున్నారు. ఈ పెట్టెల నిర్వహణను స్వయంగా కలెక్టరే చూస్తున్నారు. ఇటీవల నెక్కొండలోని గురుకులం, కేజీబీవీలో ఆ ఫిర్యాదు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఇద్దరు ప్రిన్సిపాళ్లు, వార్డెన్, పీఈటీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఫిర్యాదు పెట్టెలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుల వికృత చేష్టలను విద్యాశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు గురువులు తమ మానసిక ఆనందం కోసం బిడ్డల్లాంటి చిన్నారులపై మృగాలుగా ప్రవర్తిస్తూ వృత్తికే కళంకం తీసుకువస్తున్నారు. న్యూస్రీల్విద్యార్థినులకు చెబుదాం.. మంచీచెడు ఎవరైనా అసభ్యంగా తాకినా వద్దని చెప్పే ధైర్యం నూరిపోయాలి. కుటుంబ సభ్యులతోనూ నడుచుకోవాల్సిన విధానం వివరించాలి. బడుల్లో మహిళా ఉపాధ్యాయులు, మార్గదర్శకులు అర్థమయ్యేలా వివరించాలి. రోజువారీ విషయాలు తమతో ఆడపిల్లలు పంచుకునే వాతావరణం తల్లిదండ్రులు కల్పించాలి. ఆత్మరక్షణ విద్య నేర్పించాలి. పోలీసులతోపాటు విద్య, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్ విభాగాల అధికారులు తరచూ పాఠశాలలను సందర్శించాలి. పక్కాగా కమిటీలు వేయాలి. విద్య, శిక్షణ సంస్థల్లో పనిచేసే సిబ్బంది పూర్వాపరాలు తెలుసుకోవాలి. పాఠశాలల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఘటనలుఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనకొందరు ఉపాధ్యాయుల తీరుతో విద్యాశాఖకు మచ్చ పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన తల్లిదండ్రుల్లో ఆందోళన..అన్ని జిల్లాల్లో ఇలా చేస్తే బెటర్.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
● సినీ హీరో సంజోష్ ఏటూరునాగారం: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మండల పరిధిలోని శంకరాజుపల్లికి చెందిన బేవర్స్ సినిమా హీరో సంజోష్ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఆయన శనివారం టై, బెల్ట్లు, షూస్, నోటుబుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టిన మండలానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 150 మంది విద్యార్థులకు తన వంతు సాయం చేశానని తెలిపారు. అదే విధంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 96 మందికి ఎగ్జామ్స్ కిట్లను అందజేసినట్లు వివరించారు. బేవర్స్ సినిమా తనకు ఎంతో పేరుతెచ్చిందని తెలిపారు. త్వరలోనే సోదర సినిమా రిలీజ్ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజన్ కంపెనీ కో ఫౌండర్ ఉపేంద్ర రాజ్పల్లి, రామన్నగూడెం హెచ్ఎం కొయ్యడ మల్లయ్య, కోడి వెంకటేశ్వర్లు, ప్రభాకర్, సయ్యద్ సర్వర్, రాములు, రమాదేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
● ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వాజేడు: మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ సిబ్బందికి ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్ను ఏఎస్పీ శనివారం వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్తో కలిసి వెళ్లి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో పాటిస్తున్న 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ కొనసాగించాలన్నారు. స్టేషన్ పరిసరాలను, సీఆర్పీఎఫ్ క్యాంపును పరిశీలించారు. సీఆర్పీఎఫ్ డీఎస్పీ, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న సెక్యూరిటీ పెన్సింగ్పై సూచనలు చేశారు. గంజాయి, పేకాట, కోడి పందేలు,వన్య ప్రాణుల వేట, విద్యుత్ ఉచ్చుల ఏర్పాటును ఉపేక్షించవద్దన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.సీఆర్పీఎఫ్ సిబ్బందికి సూచనలు చేస్తున్న ఏఎస్పీ -
రామప్పను సందర్శించిన శ్రీలంక టూరిస్టులు
వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం శ్రీలంకకు చెందిన 15 మంది టూర్ ఆపరేటర్స్ సందర్శించారు. తెలంగాణ పర్యాటక శాఖ, శ్రీలంక ఎ యిర్లైన్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తె లంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన నాగర్జునసాగర్, నేలకొండపల్లి, బుద్దవనం, వరంగల్ కోట, భద్రకాళి, వేయిస్తంభాల గుడిని సందర్శించారు. పర్యటనలో భాగంగా శుక్రవారం రా మప్ప ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు ద ర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. శ్రీలంక నుంచి తెలంగాణలోని పర్యాటక ప్ర దేశాలకు త్వరలో టూర్లను కండక్ట్ చేసేందుకు ప ర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నామన్నారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. లక్నవరం సరస్సు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చిందన్నారు. వారి వెంట టూరి జం అధికారులు సాయిరాం, శ్రీనాథ్లు ఉన్నారు. అదే విధంగా క్రొయేషియా దేశానికి చెందిన పీటర్ సందర్శించారు. శుక్రవారం సందర్భంగా రామలింగేశ్వరస్వామిని శ్రీ దుర్గ అవతారంలో అలంకరించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు హరీష్శర్మ తెలిపారు. -
జూనియర్ vs సీనియర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో ఉండే కొందరు విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారు. ఇటీవల రెండు సంఘటనల్లో పలువురు విద్యార్థులను హాస్టళ్లనుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరిచిపోకముందే తాజాగా శుక్రవారం కామన్ మెస్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. భోజనం చేస్తున్న సమయంలోనే విద్యార్థులు పరస్పరం దాడి చేసుకున్నారు. భోజనం ప్లేట్లు, గిన్నెలను కిందపడేశారు. ఆ సమయంలో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు. సాయంత్రం మరోసారి ఘర్షణ.. క్యాంపస్లోని పీహెచ్సీలో చికిత్స పొందిన ఇద్దరు జూనియర్లు సాయంత్రం గణపతిదేవ హాస్టల్కు వచ్చారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు.. జూనియర్లకు, సీనియర్లకు మధ్య మళ్లీ ఘర్షణ మొదలైంది. సీఐ రవికుమార్, ఎస్సై మాధవ్ ఇతర పోలీస్సిబ్బంది అక్కడి చేరుకొని ఇరువర్గాలకు చెందిన 18 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కు తరలించారు. తొలుత కామన్మెస్లో దెబ్బలు తగిన ఇద్దరు జూనియర్లను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. హాస్టళ్ల డైరెక్టర్ ఏమంటున్నారంటే.. తమకు గౌరవం ఇస్తలేరనే కారణంతోనే సీనియర్ విద్యార్థులు.. జూనియర్లతో గొడవ పడినట్లు హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ చెబుతున్నారు. మొదట ‘నావైపు ఎందుకు చూస్తున్నావు’ అని ఓ సీనియర్.. జూనియర్ విద్యార్థిని ప్రశ్నించగా.. మాటమాట పెరిగి పరస్పరం కొట్టుకున్నారని తెలిపారు. అదే కారణమా? మరేదైనా ఉందా అనే కోణంలో విచారించాల్సి ఉందని చెబుతున్నారు. తమను సీనియర్లు కొట్టారని ముగ్గురు జూనియర్లు, జూనియర్లే కొట్టారని ముగ్గురు సీనియర్ విద్యార్థులు తమ దృష్టికి తెచ్చినట్లు రాజ్కుమార్ తెలిపారు. నేడు వీసీ వచ్చాక నిర్ణయం ఘర్షణ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న వీసీ కె.ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా యూనివర్సిటీలోనే ఉన్న రిజిస్ట్రార్ రామచంద్రం, కెమిస్ట్రీ విభాగం అధిపతి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. శనివారం వీసీ వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది సమావేశమై నిర్ణయించనున్నట్లు సమాచారం. హాస్టల్నుంచి సస్పెండ్ చేయాలా.. ఒక సెమిస్టర్ మొత్తం సస్పెండ్ చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. కామన్ మెస్లో ప్లేట్లు, గిన్నెలు పడేయడంతో జరిగిన నష్టం ఎంత అనేది కూడా అంచనా వేస్తున్నారు. సీసీ పుటేజీలు కూడా పరిశీలించాలని యూనివర్సిటీ అధికారులు యోచిస్తున్నారు. ఎవరెవరి మీద ఎవరు దాడి చేసుకున్నారనేది స్పష్టంకానుంది. కేసు నమోదు కొట్టుకున్న విద్యార్థులను కేయూ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు సీనియర్లు 8 మంది, జూనియర్లు 10మంది, నలుగురు ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొట్టుకున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత సీనియర్లకు గౌరవం ఇస్తలేరనే కారణంతో గొడవ? కామన్మెస్లో ఒకసారి, హాస్టల్ వద్ద మరోసారి ఘర్షణ ఇద్దరు జూనియర్లను ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో 18మంది విద్యార్థులు నేడు వీసీతో చర్చించి చర్యలు తీసుకునే అవకాశం ఆధిపత్యం కోసమేనా.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు సీనియర్లు తమకు జూనియర్లు గౌరవం ఇవ్వడం లేదని కొంతకాలంగా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కామన్మెస్లో అందరూ భోజనం చేస్తున్నారు. ఏమి జరిగిందో తెలియదు.. ఒక్కసారిగా జూనియర్లకు, సీనియర్లకు మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్, కేయూ పోలీస్టేషన్ ఎస్పై మాధవ్ తన పెట్రోలింగ్ సిబ్బందితో కామన్మెస్కు చేరుకున్నారు. దెబ్బలు తాకిన ఇద్దరు జూనియర్లను క్యాంపస్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఘర్షణకు దారితీసిన పరిస్ధితులను పోలీసులు అక్కడి సిబ్బంది, విద్యార్థులను, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
ములుగు: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని డిప్యూటీ ఎన్నికల అధికారి, అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్జీ అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన అవగాహన శిక్షణ శిబిరంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మేరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు. పోలింగ్ ముందు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లను తెరిచి చూపించాలన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసుశాఖ తరఫున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ విజయభాస్కర్, సూపరింటెండెంట్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నులిపురుగుల నివారణను అన్ని శాఖల అధికారులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్రావు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 1 నుంచి 19 సంవత్సరాలు ఉన్న 73,244 మంది చిన్నారులకు మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ -
మూడు జోన్లు, 21 సెక్టార్లు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు ఇంకా నాలుగు రోజులే మిగిలింది. జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కాకుండా జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముందస్తుగా మేడారంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతుండగా జాతర నాలుగు రోజులు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్యల తలెత్తకుండా డీపీఓ దేవరాజు ప్రత్యేక చర్యలకు కసరత్తు చేస్తున్నారు. సెక్టార్ల వారీగా కార్మికులు.. మేడారం మినీజాతరలో పారిశుద్ధ్య పనుల కోసం మూడు జోన్లు, 21 సెక్టార్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెల కోర్ ఏరియా, ఊరట్టం కన్నెపల్లి ఈ మూడు జోన్లలో 21 సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఈ సెక్టార్ల వారీగా పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్ కేంద్రాలను తరలించనున్నారు. చెత్త పూడ్చివేతకు రెండు జేసీబీలు, రెండు డోజర్లను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచనున్నారు. ఈ సెక్టార్లలో డీపీఓ పర్యవేక్షణలో ఇద్దరు ఎంపీఓలు, 30 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది కారోబార్లను నియమించారు. రోజుకు రెండు షిఫ్టులు.. మేడారం జాతరలో పారిశుద్ధ్య సేవలను 400 మంది కార్మికులను ప్రత్యేకంగా నియమించనున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో కార్మికులు మేడారంలో పారిశుద్ధ్య సేవలు చేపడుతున్నారు. జాతర ప్రారంభం నాటికి మొత్తం 400 మంది పారిశుద్ధ్య కార్మికులను రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా రప్పించనున్నారు. వీరు ఈ 21 సెక్టార్లలో రోజుకు రెండు షిఫ్టుల వారీగా పనులు చేయనున్నారు. ఈసారి మినీ జాతరలో ఎక్కడి చెత్త అక్కడే సేకరించి ఒక దగ్గర వేసేందుకు గ్రీన్ మ్యాట్తో ఒక మినీ డంపింగ్ కేంద్రం లాగా ఏర్పాటు చేశారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో భక్తుల తాగునీటి వసతి కోసం ప్రత్యేకంగా 10 వాటర్ ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. శానిటేషన్ ప్రాంతాలు, భక్తులు విడిది చేసే ప్రదేశాల్లో ఎక్కడా కూడా చెత్త, దోమలు, ఈగలు నిల్వకుండా కార్మికులు ఎప్పటికప్పుడు తొలగించి బ్లీచింగ్ చేసేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మేడారంలోని రోడ్లపై దుమ్ము, దూళి లేవకుండా ట్యాంకర్లతో రోడ్లపై నీళ్లు చల్లుతున్నారు. భక్తుల విడిది చేసే తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులను ప్రత్యేకంగా నియమించారు. పక్కా ప్రణాళికతో పనులు మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరలో పారిశుద్ధ్య పనులకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జాతరకు ముందస్తుగా 10 రోజుల నుంచి పనులు చేపడుతున్నాం. జాతర సమయంలో ఎలాంటి పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. గత రెండు జాతరల్లో ములుగు డీఎల్పీఓగా పనిచేసిన అనుభవంతో పారిశుద్ధ్య పనుల్లో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మంత్రి సీతక్క, కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తాం. – దేవరాజ్, డీపీఓ మేడారంలో ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు 30 మినీ డంపింగ్ కేంద్రాల ఏర్పాటు చెత్త ఏరివేతకు 400 మంది కార్మికులు -
స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలి
మంగపేట: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని బోరునర్సాపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సీతక్కకు వివరించారు. మొదటి నుంచి పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారికి ప్రాధాన్యం లేకపోవడంతో అసంతృప్తి నెలకొందని సయ్యద్హుస్సేన్ మంత్రికి వివరించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ, మండల నాయకులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేసి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పటేల్, మహిళా విభాగం అధ్యక్షురాలు రేగ కల్యాణి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇస్సార్ఖాన్, కర్రి నాగేంద్రబాబు, యానయ్య, వెంకటేశ్వర్లు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ పరిశీలన ఏటూరునాగారం: ఏటూరునాగారం మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ నుంచి వై జంక్షన్ వరకు నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను శుక్రవారం రాత్రి మంత్రి పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి లైట్లు వెలుగుతున్న స్తంభాలను చూస్తూ పాదయాత్ర చేశారు. విబేధాలు వీడి సమన్వయంతో పనిచేయాలి పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క -
సకాలంలో జాతర పనులు పూర్తి చేయాలి
ఏటూరునాగారం: కొండాయి, దొడ్ల ప్రాంతాల్లో జరిగే మినీ జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీఓ నేత వెంకటేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండాయిలోని గోవిందరాజుల గుడిలో ఆర్డీఓ, డీడీ పోచం కలిసి పూజలు చేశారు. అనంతరం జాతర జరిగే ప్రాంతాలను, భక్తులు ఎంత మంది వస్తారని సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రాంతా ల్లో నిర్మిస్తున్న ప్రహరీ, షెడ్డు, తాగునీటి వసతి, విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావాలన్నారు. రో డ్డుపై ఎక్కడ కూడా గుంతలు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జగదీష్, ఐటీడీఏ ఏఓ రాజ్కుమార్, ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి సతీష్, గోవిందరాజుల పూజారి దబ్బగట్ల గోవర్ధన్, రాజారాం, రఘు తదితరులు పాల్గొన్నారు.వైభవంగా సీతారాముల కల్యాణం మంగపేట: మండలంలోని బోరునర్సాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఈ నెల 4 నుంచి కొనసాగుతున్న 18వ వార్షికోత్సవాల చివరి రోజు సందర్భంగా ఉదయం సంక్షేప రామాయణం, ఆదిత్య హృదయం హోమం పూజలను నిర్వహించారు. అనంతరం సీతారాముల ఉత్సవ మూర్తుల కల్యాణం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మంగపేట, చెరుపల్లి, కమలాపురం తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇసుక క్వారీల నిర్వహణకు డీఎల్ఎస్సీ నిర్వహించాలిఏటూరునాగారం: గిరిజన సొసైటీ క్వారీల నిర్వహణకు డీఎల్ఎస్సీ నిర్వహించాలని ఇసుక సొసైటీల అధ్యక్షుడు ఈసం రాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో గిరిజన సొసైటీ సభ్యులు, నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ డీఎల్ఎస్సీ నిర్వహించకుండా ఉండడంతో క్వారీలు నడవడం లేదన్నారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలంలోని వివిధ గ్రామాల ఇసుక సొసైటీలను గిరిజనేతరలకు అప్పగించడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టా భూములకు ఎలాంటి ఫారెస్టు అనుమతి అవసరం లేదన్నారు. డీఎల్ఎస్సీ నిర్వహించి క్వారీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దబ్బగట్ల సుమన్, బుచ్చయ్య, సుభద్ర, నాగబాబు, నర్సింగరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ఆందోళన వాజేడు: మండల పరిధిలోని పెనుగోలు కాలనీలో సోలార్ సిస్టం ద్వారా ఏర్పాటు చేసిన మోటారు కాలిపోయింది. దీంతో తమకు తాగునీరు వసతి కల్పించాలని కోరుతూ పెనుగోలు కాలనీ గిరిజనులు ఖాళీ బిందెలతో శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ సోలార్ సిస్టం ద్వారా ఏర్పాటు చేసిన మోటారు కాలిపోయి నెలరోజులు అవుతున్నా.. అధికారులు మరమ్మతు చేయడం లేదని ఆరోపించారు. ఉదయం, సాయంత్రం మిషన్ భగీరథ, గ్రామ పంచాయతీ నీరు వస్తున్నప్పటికీ అవి తాగడంలేదన్నారు. సోలార్సిస్టం ద్వారా సరఫరా అవుతున్న నీరు పెనుగోలు కాలనీ గ్రామస్తులకే కాకుండా మండల కేంద్రంలోని నాగారం, జంగాలపల్లి, వాజేడు గ్రామాలకు చెందిన ప్రజలు తీసుకు వెళ్లి తాగుతుంటారు. అయితే సోలార్సిస్టం ద్వారా నడిచే మోటారు స్థానికంగా మరమ్మతు చేయడం కుదరదని, తప్పనిసరిగా హైదరాబాద్కు తీసుకెళ్లి మరమ్మతు చేయించాల్సి ఉంటుందని తెలిసింది. -
మిర్చి పంటసాగు వివరాలు
ములుగు– ఏటూరునాగారంగోవిందరావుపేటవాజేడుమొత్తంవెంకటాపురం(కె)మంగపేటకన్నాయిగూడెంతాడ్వాయివెంకటాపురం(ఎం)ఏటూరునాగారంరైతులు12,2652,59886725218491,4011,4022,59730ఎకరాలు1,2522,9593,81301,21019,7334,3832,0763,98060 -
బాధితులకు అండగా భరోసా కేంద్రం
ములుగు: బాధిత మహిళలకు భరోసా కేంద్రం ఎల్లవేళలా అండగా ఉంటుందని డీఎస్పీ, డీసీఆర్బీ(డిస్ట్రిక్ క్రైం రికార్డ్సు బ్యూరో) కిశోర్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పోలీసులతో కలిసి వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువతులు, వృద్ధులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులతో పాటు తదితర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వన్ స్టాఫ్ సొల్యూషన్గా పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలు సమాజంలోఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సెలింగ్ నిర్వహించి ధైర్యాన్ని పెంపొందించేందుకు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ఎస్పీ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం జిల్లా ఇన్చార్జ్, ఎస్సై ఎన్.స్రవంతి, సెంటర్ కో ఆర్డినేటర్ అనూష, సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మహిళలు, యువతులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.డీఎస్పీ కిశోర్కుమార్ -
15 రోజులపాటు చికిత్స.. దక్కని ప్రాణం
కన్నాయిగూడెం: మండల పరిధిలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలోని కొత్తూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు (41) ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభలోనే పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. 15 రోజులు మృత్యువుతో పోరాడి బుధవారం అర్ధరాత్రి వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడి కూతురు షాలిని తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23న బుట్టాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభలో అధికారులు ప్రదర్శించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నాగేశ్వర్రావు పేరు లేకపోవడంతో ఆవేదనకు గురై అక్కడే పురుగుల మందు తాగాడు. వెంటనే అక్కడున్న వారు 108లో ఏటూరునాగారం తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు, ఆ తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యఖర్చులకు ఉన్న భూమిని కుదవపెట్టారు. సరిపోకపోవడంతో బుధవారం వరంగల్ ఎంజీఎంకి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 2 గంటలకు మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సాయంత్రం గ్రామంలో నాగేశ్వర్రావు అంత్యక్రియలు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏటూరునాగారం సీఐ శ్రీనువాస్, ఎస్సైలు వెంకటేష్, సురేష్లు బందోబస్తు నిర్వహించారు. అంత్యక్రియల నిమిత్తం ములుగు ఆర్డీఓ రూ.50వేల ఆర్థికసాయం అందించారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామసభలో పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ప్రకటన -
గిట్టుబాటు ధర చెల్లించాలి..
ఎండుమిర్చికి ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలి. మార్కెట్లో మిర్చిని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలి. గతేడాది ఏసీల్లో (నిల్వ) పెట్టిన రైతులు చాలా మంది నష్టపోయారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టి మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. తెగుళ్లు సోకి పెట్టుబడి పెరిగింది. ఈ సారి మంచి ధరకు ఎండు మిర్చికి కొనుగోలు చేసి ఆదుకోవాలి. – గడబోయిన శ్రీకాంత్, రాంనగర్, ఏటూరునాగారం అధికారుల సూచనలు పాటించాలి.. ల్యామ్డా, అసిఫేట్, బైఫిరాన్తోపాటు తెగులు మందు కలిపి పిచికారీ చేయాలి. ఎకరంలో 20 నుంచి 30 వరకు జిగురు అట్టలను అమర్చాలి. దానివల్ల పురుగు శాతాన్ని అదుపుచేయవచ్చు. రైతులు హార్టికల్చర్ అధికారుల సూచనలు, సలహాలను పాటించి మిర్చి దిగుబడిని పెంచుకోవాలి. – శ్రీకాంత్, జిల్లా హార్టికల్చర్ అధికారి నల్లివ్యాధితో నష్టం.. నల్లి వ్యాధి సోకి పంట దిగుబడి అధికంగా తగ్గింది. ఏఈఓలు, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు పంటలను పరిశీలించడం లేదు. కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. రెండు ఎకరాలు సాగు చేస్తే ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తెగుళ్లతో దిగుబడి అధికంగా తగ్గింది. మార్కెట్లలో చాలా తక్కువ ధర పలుకుతోంది. – ఎగ్గడి వెంకటేశ్వర్లు, ఏటూరునాగారం -
తప్పుడు ఆరోపణలతో మానసికంగా వేధిస్తున్నారు
ములుగు: 15 రోజులుగా పలు పత్రికల్లో తప్పుడు ఆరోపణలు చేపిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఇన్చార్జ్ జిల్లా సంక్షేమ అధికారి కూచన శిరీష తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ పనుల్లో పురోగతిని సాధించానని తెలిపారు. శాఖా పరమైన పనులు చిత్తశుద్ధితో చేస్తున్న తనపై కొంతమంది రెండు నెలల క్రితం వచ్చిన సీడీపీఓ ధనలక్ష్మి ద్వారా తప్పుడు ఆరోపణలు చేపిస్తూ పలు పత్రికల్లో వార్తలు రాపిస్తూ తనను మానసిక వేదనకు గురిచేస్తున్నారని తెలిపారు. అలాగే విధులకు ఆటంకం కలిగించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజనిర్ధారణ జరిగే వరకు తాను సీడీపీఓగానే కొనసాగుతానని అసత్య ఆరోపణలు చేస్తున్న వారితో పాటు సూత్రదారులు, పాత్రదారులపైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను కోరుతున్నట్లు ఆమె వివరాలను వెల్లడించారు.జిల్లా సంక్షేమ అధికారి శిరీష -
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె
ములుగు రూరల్: జిల్లాలోని రెండో ఏఎన్ఎంల సమస్యలను ఈ నెల 17వ తేదీ వరకు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని ఆ సంఘం అధ్యక్షురాలు సుజాత, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం డీఎంహెచ్ఓ గోపాల్రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ రెగ్యులర్ చేయడం లేదన్నారు. అనేక పోరాటాల చేయగా గ్రాస్ సాలరీ ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని తెలిపారు. అందుకే 100శాతం గ్రాస్ సాలరీ వెంటనే అమలు చేయడంతో పాటు రూ.10లక్షల లైఫ్ టైం గ్రాట్యుటీ, హెల్త్ ఇన్యూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఏడు నెలల పీఆర్సీ ఏరియర్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను ఈ నెల 17వ తేదీ వరకు స్పందించకపోతే సమ్మెకు వెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కన్వీనర్ అమ్జద్పాషా, నాయకులు సరోజన, పావని, మమత, సరోజిని, శోభారాణి, స్వప్న, సరిత, సరస్వతి, పుణ్యవతి, లలిత, సూర్యకాంతం, సమ్మక్క, సబిత, కవిత, లక్ష్మీ పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావుకు వినతి పత్రం అందజేసిన రెండో ఏఎన్ఎంలు -
మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఈనెల 12నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ టీఎస్. దివాకర తెలిపారు. మండల పరిధిలోని మేడారంలో ఆయా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ దివాకర క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. మేడారంలోని వైద్య శిబిరం, జంపన్నవాగు వద్ద స్నాన ఘట్టాలను, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. అనంతరం గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు 10 నుంచి 20 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతతరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వైద్య సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట, చోరీలు జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని డీపీఓ దేవరాజ్ను ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తుల వాహనాలు వస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోండడంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు, మ్యాట్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సుమారుగా రూ.5.30 కోట్ల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేసినట్లు వివరించారు. పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి సౌకర్యం కల్పించామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు హనుమకొండ నుంచి నిరంతరం బస్సులను మేడారం జాతరకు నడిపించనున్నారని తెలిపారు. జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, డీపీఓ దేవరాజ్, డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఇరిగేషన్ ఈఈ నారాయణ తదితరులు పాల్గొన్నారు. జాతరలో భక్తులకు సౌకర్యాలు కలెక్టర్ టీఎస్.దివాకర -
వనదేవతల సన్నిధిలో 32 హుండీలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ వనదేవతల సన్నిధిలో భక్తుల కానుకలు సమర్పించేందుకు 32 హుండీలను ఏర్పాటు చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఇన్స్పెక్టర్ కవిత పర్యవేక్షణలో గురువారం హుండీలకు సీల్ వేసి గద్దెలపై ఏర్పాటు చేసినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. సమ్మక్క గద్దైపె 14, సారలమ్మ గద్దైపె 14, గోవిందరాజు గద్దె వద్ద 2, పగిడిద్దరాజు గద్దె వద్ద 2 హుండీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులు కానుకలను హుండీల్లో వేసి మొక్కులు చెల్లించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ క్రాంతికుమార్, రికార్డు అసిస్టెంట్ వీరయ్య, పూజారులు పాల్గొన్నారు.