Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

tollywood actor Arjun Sarja Visits Kondagattu Hanuman Temple1
కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్జున్ సర్జా

తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో హీరో అర్జున్ సర్జా ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్లు అంజన్న ఆలయాన్ని తన కూతురు ఐశ్వర్య అర్జున్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చానని అర్జున్ తెలిపారు. సీతాపయనం మూవీ రిలీజ్‌ తర్వాత కొండగట్టుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా అర్జున్ సర్జా మాట్లాడుతూ.. 'ఆంజనేయస్వామి ఆలయానికి రావడం అంటే నాకు చాలా ఇష్టం. కొండగట్టు చాలా సార్లు విన్నా. అందుకే మొదటిసారి ఇక్కడికి వచ్చా. ఈ ఆలయానికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. సీతాపయనం మూవీ రిలీజ్ సందర్భంగా కొండగట్టుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలి. సర్వేజనా సుఖినోభవంతు' అని అన్నారు.కాగా.. అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ సీతాపయనం. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయన్‌గా మెప్పించింది. ఈ మూవీ ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో అర్జున్‌ సర్జా కీలక పాత్రలో మెప్పించారు. Aanaadu #SriAnjaneyam lo Anjaneyudu laa manalni abhimanulu ga maluchukunna #Arjun garu Eroju #SeethaPayanam hit Aina Sandharbhamga #Kondagattu #SriAnjaneya Swamy vaarini dharsinchukunnaru... pic.twitter.com/nOCrnrarH6— Prabhas Fan (@ivdsai) February 16, 2026

Suhas Talk About Hey Balawanth Movie2
అదే బాధగా అనిపిస్తుంది : సుహాస్‌

నా కెరీర్‌ మొత్తంలో అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సినిమా ‘హే బల్‌వంత్‌’. కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యాను. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా వచ్చింది’ అన్నారు యంగ్‌ హీరో సుహాస్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హే బల్‌వంత్‌' (హే భగవాన్‌ చిత్రం టైటిల్‌ మార్పు) . శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..భగవాన్‌ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్‌ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో హేబల్‌వంత్‌గా మార్చాం. సినిమాలో నరేష్‌ క్యారెక్టర్‌ పేరు మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు.చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలని ఆలోచించే కుర్రాడు, నాన్న బిజినెస్‌ను టేకప్‌ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్‌ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంర్‌టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది. ఈ మూవీతో నాకు విజయం అందుతుందనే నమ్మకం ఉంది.ప్రతి సినిమా కోసం మీ ఎఫర్ట్‌ పెడుతున్నాను. కానీ సరైన విజయం అందడం లేదు. విజయం కోసం ఎదురుచూడటమే కాస్త బాధగా అనిపిస్తుంది. కానీ వెంటనే తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాను.వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత అందరూ కంట్రోల్‌గా ఆలోచించి సినిమా చేయమని చెప్పారు. ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్‌ ఇచ్చి హేబల్‌వంత్‌ చేశాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ‘మంచి యాక్టర్‌. మంచి సినిమా పడాలి’ అనే సానుభూతి అందరిలో ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.తమిళ్‌ సినిమా మందాడిలో మెయిన్‌ విలన్‌గా చేస్తున్నా. సినిమా రిజల్ట్‌ తరువాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. నేను వెయిట్‌ చేసిన లుక్‌ అండ్‌ క్యారెక్టర్‌. అంబాజీ పేట సినిమా చూసి ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్‌ అయ్యారు.నా కెరీర్‌ ప్రారంభంలో షార్ట్‌ఫిల్మ్‌స్‌లో నేను కామెడీ పాత్రలే చేశాను. ఈ సినిమాలో నా పాత్రను చూసి మా ఆవిడ కూడా ఇలాంటి సినిమాలు చేయమని కోరింది. లక్కీగా నాకు ఈ సినిమా వచ్చింది.కెరీర్‌ పట్ల సంతోషంగా ఉ‍న్నాను. ఈ సినిమా హిట్‌ అయితే అది ఇంకా పెరుగుతుంది. అందరూ సినిమా మీద ఫుల్‌ కాన్పిడెంట్‌గా ఉన్నారు. పెద్ద విజయం రాబోతుంది. ఈ సినిమా మా వైఫ్‌ కూడా చూసి ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది.ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్‌ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను.త్వరలోనే ఫైలన్‌ అవుతాయి.

Paathirathri Movie OTT Streaming Details3
ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్

మలయాళ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్.. గతేడాది వచ్చిన 'కూలీ'తో మిగతా దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక మూవీ చేస్తూనే ఉంటాడు. అలా ఇతడి పోలీస్ కానిస్టేబుల్‌గా చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. దాదాపు నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి వస్తుంది?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)2000-10 మధ్య హీరోయిన్‌గా ఫేమస్ అయిన నవ్య నాయర్ తర్వాత అప్పుడో ఇప్పుడో అన్నట్లు ఒకటి రెండు సినిమాలు చేస్తూ వస్తోంది. ఈమె, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ సినిమా 'పాతిరాత్రి'. ఈ టైటిల్‌కి అర్థరాత్రి అని అర్థం. గతేడాది అక్టోబరు 17న థియేటర్లలో రిలీజైంది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం చాన్నాళ్ల తర్వాత అంటే ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.'పాతిరాత్రి' విషయానికొస్తే.. ఝాన్సీ కురియన్(నవ్వ నాయర్) ఎస్సై. హరీష్(సౌబిన్ షాహిర్) ఓ కానిస్టేబుల్. ఓ రోజు రాత్రి గస్తీలో ఉన్నప్పుడు ఓ అనుమానాస్పద వ్యక్తిని వెంబడిస్తారు. తర్వాత అతడు అదృశ్యమవుతాడు. తర్వాత రోజు అతడి మృతదేహం దొరుకుతుంది. దీంతో పోలీసులిద్దరూ నిందితులు అవుతారు. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

Tollywood Hero Vishwak Sen comments about His Career Struggles4
సొంతిల్లు లేదు.. అకౌంట్‌లో రూ.50 వేలు చూడటం నా కల: విశ్వక్ సేన్

మాస్‌ కా దాస్‌ విశ్వక్ సేన్‌ ఇటీవలే రోటిన్‌ భిన్నంగా కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌ డైరెక్షన్‌లో వచ్చి ఫంకీ లవర్స్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. కేవలం ఫన్‌ కోసమే ఈ మూవీ తీశామని నిర్మాత నాగవంశీ కూడా సక్సెస్‌ మీట్‌లో ప్రకటించారు. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టకపోయినా.. ఓకేలా అనిపించేశాడు విశ్వక్ సేన్. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ మూవీతో విశ్వక్‌ సేన్ అలరించిన తీరు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా నాన్న మొదట్లో పిల్లలకు కరాటే నేర్పించేవారని తెలిపారు. దానివల్ల ఎక్కువ డబ్బులు రావడం లేదని కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. నా హైయర్‌ ఎడ్యుకేషన్‌కు ఎక్కువ డబ్బులు అవసరమవుతాయని డిగ్రీతో సరిపెట్టుకున్నారని వెల్లడించారు.నేను పుట్టినప్పుడు మాకు సొంతిల్లు కూడా లేదని విశ్వస్ సేన్ తెలిపారు. ఒకానొక సమయంలో నా అకౌంట్‌లో రూ.50 వేలు చూడడం ఓ కల అన్నారు. హిట్‌ సినిమాకు అడ్వాన్స్‌ బ్యాంక్‌లో పడే వరకూ తన అకౌంట్‌లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు. ఫలక్‌నుమా దాస్‌ రిలీజ్‌ అయిన తర్వాతనే మొదటిసారి నా అకౌంట్‌లో లక్ష రూపాయలు చూశానని గుర్తు చేసుకున్నారు. అంతకుముందే హిట్‌ సినిమాకు అడ్వాన్స్‌ రూ.50 వేలు బ్యాంక్‌ ఖాతాలో చూసి చాలా సంతోషించానని తెలిపారు.

The Kerala Story 2 Goes Beyond Official Trailer out now5
ది కేరళ స్టోరీ సీక్వెల్.. బోల్డ్ అండ్‌ వయొలెంట్‌గా ట్రైలర్‌

ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఎన్ని విమర్శలు, వివాదాలు ఎదురైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కేరళలోని అమ్మాయిలను మత మార్పిడి చేసి గల్ఫ్‌ దేశాలకు తీసుకెళ్లిన రియల్‌ స్టోరీతో ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. . సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచింది.తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ వస్తోన్న ది కేరళ స్టోరీ-2 గోల్ బియాండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ చూస్తుంటే మనదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను లవ్ పేరుతో మత మార్పిడి చేసి చిత్ర హింసలకు గురి చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రియల్ సంఘటనల ఆధారంగానే రూపొందించారు. ఈ చిత్రాన్ని ముగ్గురు హిందూ అమ్మాయిల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌లో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ సినిమాకు మన్నన్ షా సంగీతం అందించారు. ఈ సీక్వెల్‌ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.కాగా.. 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.

Actress Prathyusha Mother First Reaction After Supreme Court Order6
నిజమైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన

నటి ప్రత్యూష కేసులో ఎట్టకేలకు తుదితీర్పు వెలువడింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని పేర్కొంది. అలానే అతడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలుశిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు అనంతరం స్పందించిన ప్రత్యూష తల్లి సరోజిని దేవి.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)'హైకోర్డు తీర్పునే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎక్కడున్నా సరే సిద్ధార్థ్ రెడ్డి వచ్చి లొంగిపోవాలని తీర్పులో పేర్కొన్నారు. రెండున్నరేళ్లని ఖరారు చేశారని అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే నా కూతురిపై అత్యాచారం జరిగిందని నేను నమ్ముతున్నా. చంపేశారని కూడా నమ్ముతున్నా. నా కూతురు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఎవరేం చెప్పినా ఈ రెండింటి గురించి వేరేది నమ్మే పరిస్థితిలో లేను''నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం దక్కలేదు. సిద్ధార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడాలని నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాది సుప్రీంకోర్టులో 14 ఏళ్ల పోరాటం. 2011 నుంచి పోరాడుతూనే ఉన్నాను. హైకోర్టులో ఇచ్చిన రెండున్నరేళ్ల శిక్షని.. ఇక్కడ రెట్టింపు చేస్తారని భావించాను. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత నా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. నా బిడ్డ ఆత్మకు శాంతి కలగదలేదని అనుకుంటున్నాను' అని సరోజిని దేవి చెప్పుకొచ్చారు.ప్రత్యూష ఎవరనేది ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90స్ ప్రేక్షకులని అడిగితే చెప్తారు. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్ధార్థ్ కుటుంబం.. ఈ ప్రేమని అంగీకరించకపోవడంతో వీళ్లిద్దరూ 2002 ఫిబ్రవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూషని ఆత్మహత్యకు ప్రేరేపించాడని చెప్పి సిద్ధార్థ్ రెడ్డికి తొలుత ఐదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే 2011లో ఈ శిక్షని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Regina Cassandra Exposes How Bollywod Treated Her7
నన్ను వేరేలా చూసేవారు.. బాలీవుడ్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లలో చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. ఇక్కడ స్టార్‌ హోదా వచ్చాకా..బాలీవుడ్‌కి వెళ్లి సత్తా చాటాలని అనుకుంటారు. సౌత్‌లో రెండు, మూడు హిట్లు పడితే చాలు.. బాలీవుడ్‌పై ఫోకస్‌ చేస్తారు. అలా దక్షిణాది నుంచి వెళ్లిన తారల్లో కొంతమంది బాలీవుడ్‌లోనూ రాణిస్తే.. మరికొంతమంది అవకాశాలు రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి వచ్చారు. చాన్స్‌ల సంగతి పక్కన పెడితే.. సౌత్‌ వాళ్లకు సరైన గౌరవం కూడా ఇవ్వరని అంటోంది నటి రేజీనా కసాండ్రా. 16 ఏళ్లకే కెరీర్‌ని ప్రారంభించిన రెజీనా.. తెలుగులో రవితేజ, గోపీచంద్‌, సాయిదుర్గు తేజ్‌, సందీప్‌ కిషన్‌ లాంటి హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. అయితే ఇక్కడ వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్‌ ప్రయత్నాలు చేసింది. ‘ఏక్ లడ్కీకో దేఖా తో ఐసా లగా’ అనే చిత్రంలో ఆమె నటించింది. ఆ మూవీతో రెజీనాకు కూడా అంత పేరేమీ రాలేదు. తర్వాత మరి కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ సినిమా ఫలితాల సంగతి పక్కన పెడితే.. అసలు బాలీవుడ్‌కి దక్షిణాది నటీనటులు అంటే చిన్నచూపు అని.. వాళ్ల ప్రవర్తననే వెరైటీగా ఉంటుందని రెజీనా అంటోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో తనకు ఎదురైన అనుభవాల గురించి రెజీనా చెప్పుకొచ్చింది. ‘బాలీవుడ్ లో నా ప్ర‌యాణం ఊహించినంత సుల‌భంగా సాగ‌లేదు. హిందీ భాష‌పై నాకు పూర్తి ప‌ట్టు ఉన్నా, మాట్లాడ‌టంతో పాటూ హిందీ రాయ‌గ‌లిగినా, వేరే సినిమాల్లో ఇత‌ర హీరోయిన్ల‌లాగా డ‌బ్బింగ్ ఆర్టిస్టుల‌ను వినియోగించుకోక‌పోయినా బాలీవుడ్ లో నేను పూర్తిగా క‌లిసిపోయాన‌నే ఫీలింగ్ క‌లగ‌లేదు. సౌత్‌ నుంచి వచ్చిన నన్ను కొందరు వేరేలా చూశారు. నా నేపథ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన, మాట తీరు అసౌకర్యానికి గురి చేసింది. అవన్నీ చూశాక నాలో ఒక రకమైన భయం మొదలైంది’ అని రెజీనా చెప్పుకొచ్చింది.ఇలాంటి అనుభవం అందరికి ఎదురవుతుందని కూడా చెప్పలేమన్నారు. అంతేకాదు బాలీవుడ్ మొత్తం అలాంటిదే అని చెప్పడం కూడా కరెక్ట్‌ కాదని రెజీనా అన్నారు. అంద‌రూ ఒకేలా ఉండ‌రని, త‌న‌కు మ‌ద్దతుగా నిలుస్తూ, గౌర‌వించిన వాళ్లు కూడా ఉన్నార‌ని రెజీనా చెప్పింది.

Sharukh Khan To Salman Khan, Indian Stars Interested To Buy A House In Dubai8
సెలబ్రిటీల కళ్లు, ఇళ్లు అక్కడే.. ఎందుకంటే...

అత్యధికశాతం మంది భారతీయులకు నచ్చే టూరిస్ట్‌ డెస్టినేషన్‌ కావచ్చేమో కానీ గత కొన్నేళ్లుగా దుబాయ్‌ భారతీయ సినీ సెలబ్రిటీలకు పెట్టుబడులకు కేంద్రంగా కూడా మారింది. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ ప్రముఖ నటులు దుబాయ్‌లో ఇళ్లు, స్థలాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఎంటర్టైన్మెంట్‌ ప్రాపర్టీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కొందరైతే మరింత ముందుకెళ్లి అక్కడ స్థిరనివాసాలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.కారణాలివే...అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రత, విలాసవంతమైన జీవనశైలి, అలాగే గ్లోబల్‌ బిజినెస్‌ అవకాశాలు సెలబ్రిటీలను దుబాయ్‌ వైపు ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలు. అంతేకాకుండా, సినిమా షూటింగ్‌లకు బాగా అనుకూలమైన లొకేషన్లు, వరల్డ్‌ క్లాస్‌ ఎంటర్టైన్మెంట్‌ వేదికలు కూడా దుబాయ్‌ను ఫేవరెట్‌ డెస్టినేషన్ గా మార్చాయి. ఇటీవలే దుబాయ్‌లో స్టూడియో సిటీ పేరుతో ఒక అత్యాధునిక షూటింగ్‌ వేదికను కూడా ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా సినిమా అవార్డుల వేడుకలు దుబాయ్‌లో విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండడం వల్ల ఎంటర్‌టైన్‌ మెంట్‌ షోలు, మూవీ ప్రమోషన్లు నిర్వహించడానికి దుబాయ్‌ అనువైన వేదికగా మారింది. అది సెలబ్రిటీలకు మరో ప్లస్‌ పాయింట్‌గా మారింది. అంతేకాక ప్రపంచంలోని అనేక దేశాలకు కేవలం 8 గంటల్లోనే దుబాయ్‌ నుంచి రాకపోకలు సాగించవచ్చు కూడా. నాణ్యమైన విద్యను అందించే ఇంటర్నేషనల్‌ స్కూల్స్, అత్యాధునిక వైద్య వసతులు, విలాసవంతమైన లైఫ్‌ స్టైల్‌...వంటివన్నీ ఆకర్షణలే.పన్ను తక్కువ భధ్రత ఎక్కువ...దుబాయ్‌లోని పన్నుల వ్యవస్థే అత్యంత ప్రధాన ఆకర్షణ అనేది విశ్లేషకుల మాట. అక్కడి వారు వ్యక్తిగత పన్నును చెల్లించనక్కర్లేదు. అలాగే అధిక సంపదపై విధించే పన్ను లేదా వారసులకు ఆస్తుల బదిలీపై పన్ను బెడద కూడా ఉండదు. కార్పొరేట్‌ కంపెనీల లాభాలపై.. అదీ ఓ మోస్తరుగా పన్ను కడితే సరిపోతుంది. ఫలితంగా అక్కడ చిన్న, మధ్య స్థాయి వాణిజ్య వ్యాపారాల ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. రాజకీయ సుస్థిరత, నేరాల శాతం తక్కువగా ఉండటం, వంటి వాటి వల్ల సెలబ్రిటీలు తమ కుటుంబాలతో సహా దుబాయ్‌కు మకాం మారుస్తున్నారు. దుబాయ్‌లో అనుమతి లేకుండా అవతలి వారి ఫొటోలు తీయడం నిషిద్ధం. విలేకరుల హడావుడి కూడా ఉండదు. ఇలా ప్రైవెసీని కాపాడేలా కట్టుదిట్టమైన చట్టాలు, భద్రత కూడా సెలబ్రిటీలను దుబాయ్‌కి రా రమ్మంటున్నాయ్‌. బాలీవుడ్‌ పాగా...ఈ నేపధ్యంలో దుబాయ్‌లో పలువురు బాలీవుడ్‌ నటులు పాగా వేస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశంగా పేరొందిన దుబాయ్‌లోని పామ్‌ జుమైరా ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఉంది. ఇది అక్కడి ఆయన అభిమానులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా కూడా. ఇదే ప్రదేశంలో మన దేశానికి చెందిన వ్యాపార ప్రముఖులు అంబానీ కుటుంబీకులకు కూడా నివాసాలు ఉన్నాయి. అలాగే సల్మాన్‌ ఖాన్, సంజయ్‌ దత్‌ లాంటి నటులు కూడా దుబాయ్‌లో ఖరీదైన రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రముఖులతో పాటు భారత్‌కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు యూఏఈకి ఇప్పటికే మకాం మార్చారు. స్విమ్మింగ్‌లో రాణిస్తున్న తన తనయుడి కెరీర్‌ కోసం అని చెబుతూ ప్రముఖ నటుడు మాధవన్‌ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు అడ్రెస్‌ మార్చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మాజీ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మిర్జా కూడా విడాకుల అనంతరం దుబాయ్‌లోనే నివసిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ భార్య తమ పిల్లల చదువుల కోసం దుబాయ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. పాప్‌ స్టార్‌ యో యో హనీ సింగ్, నటి రాఖీ సావంత్‌ కూడా దుబాయ్‌లోనే సెటిలైపోయారు. కార్‌ రేస్‌ల గురించి తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ తరచుగా దుబాయ్‌కు రాకపోకలు సాగిస్తున్నారు.టాలీవుడ్‌ నుంచి కూడా పలువురు నటులు దుబాయ్‌లో అపార్ట్‌మెంట్లు, హాలిడే హోమ్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ల సమయంలో ఉండేందుకు, కుటుంబంతో విహారానికి వీలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. నివాసాలకే కాకుండా, కొంతమంది సెలబ్రిటీలు దుబాయ్‌లోని అభివద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు, కమర్షియల్‌ స్పేస్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. పర్యాటక పరంగా దూసుకుపోతున్న ప్రాంతం కావడంతో భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశాలు ఉండటంతో, సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.వినోదానికి లోటు లేదు...ఇస్లామిక్‌ దేశమైనప్పటికీ మతపరమైన అంశాల్లో ఇతర మధ్య ప్రాచ్య దేశాలతో పోలిస్తే దుబాయ్‌ చాలా సరళమైన విధానాలను అనుసరిస్తుంది. అక్కడి ముస్లిమేతరుల కోసం దేశవ్యాప్తంగా సివిల్‌ పర్సనల్‌ స్టేటస్‌ చట్టం అమలులో ఉంది. అలాగే ప్రస్తుతం సెలబ్రిటీల్లో ఎక్కువ మంది అనుసరిస్తున్న లివ్‌–ఇన్‌ రిలేషన్‌ షిప్స్‌ను నేరంగా పరిగణించొద్దని కొంత కాలం క్రితం యూఏఈ నిర్ణయించింది. అంతేకాదు దుబాయ్‌కి సమీపంలో ఉన్న యూఏఈ లోని రస్‌ ఉల్‌ ఖైమా ప్రాంతంలో త్వరలోనే క్యాసినో కూడా రానుంది. దీంతో మరింతగా ఈ ఎడారి దేశం సెలబ్రిటీలు ఎంచుకునే రహదారిగా మారడం తధ్యంగా కనిపిస్తోంది.

Ilayaraja vs Saregama Issue And Delhi High Court Order9
ఇళయరాజా.. ఇకపై కేసులు పెట్టడానికి నో ఛాన్స్

ఇళయరాజా పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. ఇప్పుడు జోరు తగ్గిపోయింది గానీ 90స్, 20స్ టైంలో భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. అయితే గత కొన్నాళ్ల నుంచి కాపీరైట్ పేరుతో కోర్టులో కేసులు వేస్తూ పలువురు దర్శకనిర్మాతలని ఇబ్బంది పెడుతూ వచ్చారు. వీటిలో చాలావరకు ఈయన అనుకూలంగా తీర్పులే వచ్చాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈయనకు పెద్ద షాకిచ్చింది.(ఇదీ చదవండి: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు)గతేడాది 'అగత్యా' అనే సినిమా విడుదల సందర్భంగా ఇళయరాజా, ఆడియో సంస్థ 'సరిగమ'కు మధ్య వివాదం మొదలైంది. ఇదికాస్త కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేంతవరకు 'సరిగమ'కు సొంతమైన 134 సినిమాల్లో పాటలని ఇళయారాజా ఉపయోగించడానికి ఏ మాత్రం వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.1976 నుంచి 2001 వరకు ఇళయరాజా స్వరపరిచిన 134 సినిమాల పాటల హక్కులని ఆయా నిర్మాతలు.. శాశ్వత ప్రాతిపదికన సరిగమ ఆడియో సంస్థకు విక్రయించారు. అయితే అందులోని కొన్ని పాటలని ఉపయోగించుకోవచ్చని.. ఇళయరాజా కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కి అనుమతి ఇచ్చారు. దీంతో సరిగమ.. కోర్టుని ఆశ్రయించగా ఇప్పుడు ఇళయారాజాకు షాకిచ్చేలా తీర్పు వచ్చింది. నిర్మాత నుంచి కొనుగోలు చేసిన ఆడియో సంస్థకే సర్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. వారి అనుమతి లేకుండా సాంగ్స్ ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొంది. దీనిబట్టి ఇకపై సదరు పాటలపై కాపీరైట్ లాంటివి వేయడానికి ఇళయరాజాకు కుదరదు. అలానే సదరు పాటలకు ఈయనకు హక్కు లేనట్లే.(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)

Podcaster And Brand Strategist Kaveri Baruah Apologise to Allu Arjun10
అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు నా కల్పితమే.. క్షమాపణలు కోరిన కావేరి

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి కావేరీ బారువా అనే బ్రాండ్‌ స్ట్రాటజర్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఆమె తాజాగా క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్‌ (Allu Arjun)తో యాడ్‌ షూటింగ్‌ అంటే చాలా ప్రోటోకాల్స్‌ ఉంటాయని కావేరీ బారువా పేర్కొంది. ఆయన్ను కలిసిన తర్వాత ఏం చేయాలి..? ఏం చేయకూడదన్న 42 నిబంధనలు ఉంటాయని చెప్పడంతో బన్నీ మేనేజర్లు ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు.కొన్ని రోజుల తర్వాత కావేరి క్షమాపణలు చెబుతూ తాజాగా ఆమె ఒక నోట్‌ విడుదల చేసింది. అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు తన సొంత వాదనగా ఆమె చెప్పింది. 42 నిబంధనలు అనే మాట తన కల్పితమేనంటూ ఆమె పేర్కొంది. 42 నిబంధనలకు సంబంధించిన లిస్ట్‌ ఎవరు విడుదల చేశారో తనకు తెలీదని ఆమె చెప్పింది. తాను ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. బన్నీ గురించి తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. తన వ్యాఖ్యలను వాస్తవమని ఎవరూ తీసుకోకూడదని విన్నవించుకుంది. బన్నీ గురించి అలాంటి ప్రకటనలు చేసినందుకు చింతిస్తున్నానని తెలిపింది. ఈ వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాని కావేరి తెలిపింది. అల్లు అర్జున్‌పై ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఫైనల్‌గా బన్నీ గురించి వైరల్‌ అయిన 42 నిబంధనలు అనేవి తాన కల్పితమేనని కావేరి బారువా చెప్పడం విశేషం. అదంతా కేవలం ఆమె పాపులర్‌ అయ్యేందుకే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.ఈ ఇంటర్వ్యూ పాడ్‌కాస్టర్ స్వీకృతి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్ గురించి కావేరి మాట్లాడిన పూర్తి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌తో పాటు ఇన్‌స్టా రీల్‌ను తొలగించినట్లు వెల్లడించింది. దీంతో తమ హోస్ట్‌పై వేధింపులు ఆపేయాలని ఆమె కోరింది. View this post on Instagram A post shared by Sweekriti Talks Podcast (@sweekriti.talkspod)

Advertisement
Advertisement