ప్రధాన వార్తలు
‘ధురంధర్’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1
ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన ‘ధురంధర్’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్ఫ్లిక్లో పాక్ ప్రజలు చూస్తున్న టాప్ 10 సినిమాల్లో దురంధర్ మొదటి స్థానంలో ఉంది.గతేడాది డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్స్లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. అయితే పాకిస్తాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ హీరోగా నటించగా.. విలన్గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ధురంధర్ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
హీరోగా సినిమాలు ఫ్లాప్.. కౌంటరిచ్చిన తరుణ్ భాస్కర్
ఈ నగరానికి ఏమైంది?, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. మీకు మాత్రమే చెప్తా మూవీతో హీరోగా మారాడు. ఇటీవల ఈయన హీరోగా నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. మలయాళ హిట్ సినిమా జయజయజయహేకి ఇది రీమేక్గా తెరకెక్కింది. తెలుగమ్మాయి ఈషా రెబ్బా కథానాయికగా నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.గాయపడ్డ సింహంతాజాగా తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కల్యాణ్ చక్రవర్తి, భానుకిరణ్, విజయ్ కృష్ణ, ఉమేశ్ కుమార్ నిర్మించారు. సోమవారం ఈ మూవీ ట్రైజర్ రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్ను మిక్స్ చేస్తే వచ్చిన పదమే ట్రైజర్. ఈ ట్రైజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్పై కొన్ని కామెంట్స్ వచ్చాయి.హీరోగా సక్సెస్ లేదుఓ రిపోర్టర్ మాట్లాడుతూ.. తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు కొన్ని నిరాశపర్చాయి. ఆయన ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు కానీ బాక్సాఫీస్ మనసులు గెల్చుకోలేదు అన్నాడు. దానికి వెంటనే తరుణ్ భాస్కర్ స్పందిస్తూ.. సర్, మీరు ఓ కథ రాసి నిర్మించండి, మనం దాన్ని హిట్టు కొడదాం.ఫెయిలైతే..అయినా నేను ఫెయిలవ్వాలని మీరు ఎందుకని అంతలా కోరుకుంటున్నారు అని సెటైర్ వేశాడు. జీవితంలో ఒక్కసారి ఫెయిలైనందుకు ప్రయత్నం ఆపొద్దు. మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎంతమంది ఇలాంటి ప్రశ్నలడిగినా సరే మళ్లీ ట్రై చేస్తా, సక్సెస్ వచ్చేవరకు ప్రయత్నిస్తా అనాలి. ఆ ప్రయత్నంలోనే మమీ విజయం దాగి ఉంది. మిగతాదంతా మర్చిపోండి అని యూత్కి సలహా ఇచ్చాడు తరుణ్ భాస్కర్.చదవండి: స్పిరిట్ నుంచి ఎగ్జిట్.. స్పందించిన ప్రకాశ్ రాజ్
'నా సూపర్ పవర్ నువ్వే.. సతీమణికి కాంతార హీరో స్పెషల్ విషెస్'
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా తర్వాత రిషబ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. గతేడాది కాంతార-2 ప్రీక్వెల్తో మరో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రిషబ్ శెట్టి.. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టిని పెళ్లాడారు. 2017లో పిబ్రవరి 9న వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. వీరి పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు రిషబ్ శెట్టి. ట్విటర్ వేదికా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు.రిషబ్ శెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ఈరోజుతో అందమైన, ప్రేమపూర్వక వివాహానికి తొమ్మిదేళ్లు. ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీతో కలిసి గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకాల నిధి. ఇందులో ఆనందం, బాధ, నవ్వు, ఉత్సాహం ప్రతిది ఉన్నాయి. అన్నింటినీ మించి అంతులేని ప్రేమ ఉంది. ప్రేమ ప్రసరింపజేసే వెలుగు, అది తెచ్చే శాంతి, అది నింపే ఆత్మవిశ్వాసమే నన్ను ఈ రోజు ఇలా మార్చాయి. నా భార్య, నా సహచరురాలు, అదృష్ట దేవత, నా జీవితాన్ని సముద్రమంత విశాలంగా మార్చేసిన నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా నా సూపర్ పవర్, నన్ను నడిపించే శక్తి, నా బలానికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నువ్వు నా చేయి పట్టుకున్నప్పుడు జీవితం మరింత బాగుంటుందని తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన రిషబ్ అభిమానులు తమ అభిమాన హీరో జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ಬಂಧ ಬೆಸೆದು, ಚಂದ ಹೊಸೆದು ಒಂದಾದ ಒಲವಿನ ದಾಂಪತ್ಯಕ್ಕಿಂದು ಒಂಭತ್ತು ತುಂಬಿದೆ. ಹಿಂದೆ ನೋಡಿದರೆ ಜೊತೆ ಕಳೆದ ಪ್ರತಿ ಗಳಿಗೆಯೂ ಸಿಹಿ ನೆನಪಿನ ನಿಕ್ಷೇಪಗಳಾಗಿವೆ. ಅಲ್ಲಿ ನಲಿವಿದೆ, ನೋವಿದೆ, ನಗುವಿದೆ, ಸರಸವಿರಸಗಳಿವೆ.. ಎಲ್ಲವನ್ನು ತೂಗುವ ಸಮರಸವಿದೆ.. ಎಲ್ಲಕ್ಕೂ ಮಿಗಿಲಾಗಿ ಕೊನೆಯಾಗದ ಒಲವಿದೆ.. ಅ ಒಲವು ಬೀರಿದ ಬೆಳಕು, ತಂದ ನೆಮ್ಮದಿ,… pic.twitter.com/lBbongYlA9— Rishab Shetty (@shetty_rishab) February 9, 2026
ఫుల్ హ్యాపీగా సమంత- రాజ్ నిడిమోరు.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో వీరిద్దరి వివాహా వేడుక జరిగింది. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.అయితే సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తోంది. ఓ బేబీ మూవీ తర్వాత సామ్తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ కావడం విశేషం. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ప్రస్తుతం సామ్ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ లీగ్ను ఆస్వాదిస్తోంది. ఈ లీగ్లో తన టీమ్ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ సందడి చేసింది. అదే సమయంలో రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. #TFNExclusive: #Samantha & #RajNidimoru celebrating and cheering with joy for their team 🤩#MaIntiBangaram #TeluguFilmNagar pic.twitter.com/H9nmfS2Lew— Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2026
బిగ్బాస్
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
యాక్సిడెంట్తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
A to Z
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించ...
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం...
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంద...
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సిని...
తెలుగులో ఏకైక మూవీ.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఒకప్పుడు హీరోయిన్గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర...
దురంధర్కు అదే పెద్ద మైనస్.. అలా జరిగితే భారీ వసూళ్లు: అమిర్ ఖాన్
గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ ద...
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ షో...
నన్ను అలా అన్నందుకు బాధలేదు.. కానీ..: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామె...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
అజిత్ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు
హీరో అజిత్.. వివాదాలకు చోటు ఇవ్వని అరుదైన నటుడు....
క్లైమాక్స్లో 'ఆకాశంలో ఒక తార'
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో హీరోయిన్లు...
అర్ధరాత్రి రజనీతో బైక్ రైడ్.. అనిరుధ్ తండ్రి మమ్మల్ని అడ్డుకుని!
దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టిన రా...
జన నాయకుడు జగన్తో 'జన నాయగన్'
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత...
ఫొటోలు
‘గాయపడ్డ సింహం’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
‘విప్లవ వీరుడు’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
గ్లామర్తో పడేస్తున్న శ్రద్ధా దాస్.. నెట్టింట ఫోటోలు వైరల్
'ఎర్రచీర' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్, తేజ సజ్జా (ఫోటోలు)
ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
'అమరావతికి ఆహ్వానం' హారర్ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
గాసిప్స్
View all
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
రివ్యూలు
View all
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
2.75
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
బాలీవుడ్ మూవీ.. పైసా తీసుకోని తమన్నా, విక్రాంత్!
వాలంటైన్స్ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.స్టార్ అవడానికి ముందే..అయితే విక్రాంత్ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్ తర్వాత అతడు పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. ఉచితంగానే..నేను డైరెక్ట్ చేసిన మఖ్బూల్ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్కు కూడా వచ్చింది అని విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నాడు.చదవండి: సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్
మరోసారి భయపెట్టబోతున్న ఆది సాయికుమార్!
‘శంబాల’ చిత్రంతో రీసెంట్గా ఆది సాయి కుమార్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మరోసారి అద్భుతమైన కథతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక హీరోయిన్గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘జంగిల్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రూపొందింది అని చిత్రయూనిట్ చెబుతోంది.ఈ చిత్రాన్ని ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ మీద రాఘవ రెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్తో పాటు అన్ని హక్కులను ఫ్రైడే పిక్చర్స్ స్వాధీనం చేసుకోవడం విశేషం. అతి త్వరలోనే గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీం. ప్రస్తుతం ‘జంగిల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.ఈ మూవీలో ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. హారర్తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ట్రైలర్తో పాటు ఫస్ట్ లుక్ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇకపై కంటిన్యూగా అప్డేట్లను ఇస్తామని టీం చెబుతోంది.
అప్పుడు ‘షోలే’..ఇప్పుడు ‘ధురంధర్’.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
గత కొన్ని దశాబ్దాలుగా ‘ధురంధర్’లాంటి సినిమా వెండితెరపై రాలేదంటోంది చిత్ర నిర్మాత జ్యోతి దేశ్పాండే. ‘షోలే’ తర్వాత ఆ స్థాయి విజయం అందుకున్న సినిమా ఇదేనని గర్వంగా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ధురంధర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ధురంధర్ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఇది దర్శకనిర్మాత విజయం కాదు.. ప్రేక్షకులది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా విడుదలై.. విజయం అందుకున్న చిత్రాలు చాలా అరుదు. గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి సినిమాలు రాలేదు. ఈ చిత్రాన్ని ఒకటి ఎక్కువ సార్లు థియేటర్స్కి వచ్చి చూశారు. మౌత్ టాక్తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు నెలల పాటు థియేటర్స్లో అలరించింది. ‘షోలే’ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే అనుకుంటా. ఈ విజయాన్ని మేం డబ్బులతో కొనలేదు. డబ్బులతో సాధించలేని విజయం ఇది’అని జ్యోతి దేశ్పాండే అన్నారు. ఇక సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది. కాగా, ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ధురంధర్.. డిజిటల్ స్క్రీన్పై కూడా రికార్డు క్రియేట్ చేస్తుంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.
సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య.. వీడియో వైరల్
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఐశ్వర్య రాజేశ్ దశ తిరిగిపోతుందనుకున్నారంతా! స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్ అందుకుని ఫుల్ బిజీ అవుతుందనుకున్నారు! కానీ, అలాంటిదేమీ జరగలేదు. పెద్ద సినిమాల ఆఫర్లు రాలేదు. దీంతో తెలుగులో చిన్న సినిమా అయినప్పటికీ కథ నచ్చడంతో 'ఓ సుకుమారి'లో కథానాయికగా నటిస్తోంది.స్వయంగా వడ్డించిన హీరోయిన్అలాగే తమిళంలో రెండు, కన్నడలో ఒక మూవీ చేస్తోంది. తాజాగా తను సెట్లో చెఫ్గా మారింది. సెట్లో ఉన్నవారికి స్వయంగా దోసెలు/ ఊతప్పం వేసి వడ్డించింది. సెట్లో ఈ పని చేయడమంటే నాకెంతో ఇష్టం అంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కీర్తి ఫేవరెట్పద్ధతిగా చీర కట్టుకున్న ఐష్.. పెనంపై చిన్న దోసెలు వేస్తూ, వాటిని తిరగేస్తూ వేడివేడిగా వడ్డించింది. ఇంకా ఎవరికి కావాలి, రండి అంటూ అక్కడున్నవారితో ఇట్టే కలిసిపోయింది. ఈ వీడియో వైరల్గా మారగా కీర్తి సురేశ్ హే, దోసె.. దోసె అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది. అందుకు ఐష్ స్పందిస్తూ.. అవును, నీ ఫేవరెట్ అని రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) చదవండి:
Funky Movie: ఉర్రూతలూగించేలా ‘యమ యమ్మ’ పాట
‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఫంకీ’. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘యమ యమ్మ’ విడుదలైంది.భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మాస్ గీతానికి దేవ్ పవార్ సాహిత్యం అందించాడు. గాయని రోహిణి సోరట్ తో కలిసి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించడం విశేషం. తమ ఉత్సాహభరితమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. విశ్వక్ సేన్, కయాదు లోహర్ అదిరిపోయే మాస్ బీట్ లు, ఆట సందీప్ మాస్టర్ అద్భుతమైన నృత్యరీతులతో మాస్ పాటల అభిమానులకు విందు భోజనంలా మారింది.గీతావిష్కరణ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే సంవత్సరం విరామం తీసుకొని ఫంకీ సినిమా చేశాను. ఈ చిత్రం మీ అందరినీ మెప్పిస్తుంది. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్. మీ కుటుంబంతో కలిసి థియేటర్ కి రండి. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు." అన్నారు.
బుల్లిరాజు కొత్త సినిమా.. పవర్పుల్గా టీజర్
అనన్య శర్మ, ఎస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు ఎస్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు క్రైమ్ స్టోరీని తలపించేలా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు(రేవంత్) ఈ టీజర్లో స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాడు. కాగా.. ఈ సినిమాలో రేవంత్ (బుల్లిరాజు), పల్లవి దొర, కృష్ణ కమల్, సాయికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస బాదిసా సంగీతమందిస్తున్నారు.
‘ధురంధర్’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1
ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన ‘ధురంధర్’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్ఫ్లిక్లో పాక్ ప్రజలు చూస్తున్న టాప్ 10 సినిమాల్లో దురంధర్ మొదటి స్థానంలో ఉంది.గతేడాది డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్స్లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. అయితే పాకిస్తాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ హీరోగా నటించగా.. విలన్గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ధురంధర్ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
హీరోగా సినిమాలు ఫ్లాప్.. కౌంటరిచ్చిన తరుణ్ భాస్కర్
ఈ నగరానికి ఏమైంది?, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. మీకు మాత్రమే చెప్తా మూవీతో హీరోగా మారాడు. ఇటీవల ఈయన హీరోగా నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. మలయాళ హిట్ సినిమా జయజయజయహేకి ఇది రీమేక్గా తెరకెక్కింది. తెలుగమ్మాయి ఈషా రెబ్బా కథానాయికగా నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.గాయపడ్డ సింహంతాజాగా తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కల్యాణ్ చక్రవర్తి, భానుకిరణ్, విజయ్ కృష్ణ, ఉమేశ్ కుమార్ నిర్మించారు. సోమవారం ఈ మూవీ ట్రైజర్ రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్ను మిక్స్ చేస్తే వచ్చిన పదమే ట్రైజర్. ఈ ట్రైజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్పై కొన్ని కామెంట్స్ వచ్చాయి.హీరోగా సక్సెస్ లేదుఓ రిపోర్టర్ మాట్లాడుతూ.. తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు కొన్ని నిరాశపర్చాయి. ఆయన ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు కానీ బాక్సాఫీస్ మనసులు గెల్చుకోలేదు అన్నాడు. దానికి వెంటనే తరుణ్ భాస్కర్ స్పందిస్తూ.. సర్, మీరు ఓ కథ రాసి నిర్మించండి, మనం దాన్ని హిట్టు కొడదాం.ఫెయిలైతే..అయినా నేను ఫెయిలవ్వాలని మీరు ఎందుకని అంతలా కోరుకుంటున్నారు అని సెటైర్ వేశాడు. జీవితంలో ఒక్కసారి ఫెయిలైనందుకు ప్రయత్నం ఆపొద్దు. మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎంతమంది ఇలాంటి ప్రశ్నలడిగినా సరే మళ్లీ ట్రై చేస్తా, సక్సెస్ వచ్చేవరకు ప్రయత్నిస్తా అనాలి. ఆ ప్రయత్నంలోనే మమీ విజయం దాగి ఉంది. మిగతాదంతా మర్చిపోండి అని యూత్కి సలహా ఇచ్చాడు తరుణ్ భాస్కర్.చదవండి: స్పిరిట్ నుంచి ఎగ్జిట్.. స్పందించిన ప్రకాశ్ రాజ్
'నా సూపర్ పవర్ నువ్వే.. సతీమణికి కాంతార హీరో స్పెషల్ విషెస్'
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా తర్వాత రిషబ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. గతేడాది కాంతార-2 ప్రీక్వెల్తో మరో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రిషబ్ శెట్టి.. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టిని పెళ్లాడారు. 2017లో పిబ్రవరి 9న వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. వీరి పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు రిషబ్ శెట్టి. ట్విటర్ వేదికా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు.రిషబ్ శెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ఈరోజుతో అందమైన, ప్రేమపూర్వక వివాహానికి తొమ్మిదేళ్లు. ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీతో కలిసి గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకాల నిధి. ఇందులో ఆనందం, బాధ, నవ్వు, ఉత్సాహం ప్రతిది ఉన్నాయి. అన్నింటినీ మించి అంతులేని ప్రేమ ఉంది. ప్రేమ ప్రసరింపజేసే వెలుగు, అది తెచ్చే శాంతి, అది నింపే ఆత్మవిశ్వాసమే నన్ను ఈ రోజు ఇలా మార్చాయి. నా భార్య, నా సహచరురాలు, అదృష్ట దేవత, నా జీవితాన్ని సముద్రమంత విశాలంగా మార్చేసిన నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా నా సూపర్ పవర్, నన్ను నడిపించే శక్తి, నా బలానికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నువ్వు నా చేయి పట్టుకున్నప్పుడు జీవితం మరింత బాగుంటుందని తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన రిషబ్ అభిమానులు తమ అభిమాన హీరో జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ಬಂಧ ಬೆಸೆದು, ಚಂದ ಹೊಸೆದು ಒಂದಾದ ಒಲವಿನ ದಾಂಪತ್ಯಕ್ಕಿಂದು ಒಂಭತ್ತು ತುಂಬಿದೆ. ಹಿಂದೆ ನೋಡಿದರೆ ಜೊತೆ ಕಳೆದ ಪ್ರತಿ ಗಳಿಗೆಯೂ ಸಿಹಿ ನೆನಪಿನ ನಿಕ್ಷೇಪಗಳಾಗಿವೆ. ಅಲ್ಲಿ ನಲಿವಿದೆ, ನೋವಿದೆ, ನಗುವಿದೆ, ಸರಸವಿರಸಗಳಿವೆ.. ಎಲ್ಲವನ್ನು ತೂಗುವ ಸಮರಸವಿದೆ.. ಎಲ್ಲಕ್ಕೂ ಮಿಗಿಲಾಗಿ ಕೊನೆಯಾಗದ ಒಲವಿದೆ.. ಅ ಒಲವು ಬೀರಿದ ಬೆಳಕು, ತಂದ ನೆಮ್ಮದಿ,… pic.twitter.com/lBbongYlA9— Rishab Shetty (@shetty_rishab) February 9, 2026
ఫుల్ హ్యాపీగా సమంత- రాజ్ నిడిమోరు.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో వీరిద్దరి వివాహా వేడుక జరిగింది. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.అయితే సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తోంది. ఓ బేబీ మూవీ తర్వాత సామ్తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ కావడం విశేషం. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ప్రస్తుతం సామ్ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ లీగ్ను ఆస్వాదిస్తోంది. ఈ లీగ్లో తన టీమ్ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ సందడి చేసింది. అదే సమయంలో రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. #TFNExclusive: #Samantha & #RajNidimoru celebrating and cheering with joy for their team 🤩#MaIntiBangaram #TeluguFilmNagar pic.twitter.com/H9nmfS2Lew— Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2026
సినిమా
ఖైదీ 2 సంగతేంటి..? ఉన్నట్టా..? లేనట్టా...?
ప్రభాస్ స్పిరిట్ లో మెగాస్టార్?
చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?
సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!
మా వాడు మాట్లాడింది రెండు, మూడు బూతులే..! కానీ మీరు చేస్తుందేంటి...
చరణ్, తారక్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. RRR సీక్వెల్ కన్ఫర్మ్.. త్వరలోనే..!
పెళ్ళిలో హీరో సూర్య, కార్తీ తో వైఎస్ జగన్
అట్లీ మూవీకి.. బన్నీ రికార్డ్ రెమ్యునరేషన్
సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు
