Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Suniel Shetty: I Dont Like South Movies Casting Hindi heroes As Villains1
సౌత్‌లో విలన్లుగా బాలీవుడ్‌ హీరోలు.. నచ్చట్లేదు!

కొంతకాలంగా సౌత్‌ సినిమాల్లో బాలీవుడ్‌ యాక్టర్స్‌ విలన్‌గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలను మాత్రమే ఆఫర్‌ చేయడం సబబు కాదంటున్నాడు. ద లాలంటాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్‌ శెట్టి మాట్లాడుతూ.. నాకు సౌత్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. నచ్చట్లే..కానీ ఇక్కడేం జరుగుతుందంటే మాకు నెగెటివ్‌ పాత్రలే ఆఫర్‌ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెప్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్‌ దర్బార్‌లోనూ నెగెటివ్‌ రోల్‌ చేశాను. కాకపోతే రజనీ సర్‌తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నాను. కంటెంటే కింగ్‌ఈ మధ్యే 'జై' అనే తుళు సినిమా చేశాను. ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్‌ చేయాలన్న ఉద్దేశంతోనే అందులో యాక్ట్‌ చేశా.. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్‌ ఒక్కటే కింగ్‌. కంటెంట్‌ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్‌ శెట్టి చివరగా కేసరి వీర్‌, నడానియన్‌ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్‌కమ్‌ టు ద జంగిల్‌, హెరా ఫెరి 3 మూవీస్‌ చేస్తున్నాడు. ఈయన తెలుగులో మోసగాళ్లు, గని సినిమాలు చేశాడు.చదవండి: తనూజతో అతి చేసిన యావర్‌.. చివరి కెప్టెన్‌ ఎవరంటే?

Raj Tarun Paanch Minar Movie Streaming on This OTT Platform2
కామెడీ థ్రిల్లర్‌.. వారం రోజులకే ఓటీటీలోకి..

థియేటర్‌లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాల తర్వాత కానీ ఓటీటీలోకి రావు. కానీ ఓ తెలుగు మూవీ మాత్రం కేవలం వారానికే ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఆ సినిమాయే పాంచ్‌ మినార్‌. రాజ్‌తరుణ్‌ హీరోగా, రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్‌ మూవీ పాంచ్‌ మినార్‌. రామ్‌ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మించారు. ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్‌ తరుణ్‌ గత సినిమాలకంటే ఈ మూవీకి మంచి టాక్‌ వచ్చింది. అయినప్పటికీ కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్‌ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సడన్‌ సర్‌ప్రైజ్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.కథేంటంటే..కిట్టు (రాజ్‌ తరుణ్‌) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్‌కాయిన్‌ స్కామ్‌ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్‌ డ్రైవర్‌గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్‌ బుక్‌ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌ చివరి కెప్టెన్‌ ఎవరంటే?

Bigg Boss 9 Telugu: These Contestants Final Captaincy Contenders3
ఓవర్‌ చేసిన యావర్‌.. అతడే చిట్టచివరి కెప్టెన్‌!

యోధులొస్తున్నారు.. రణరంగంలోకి దిగండి, గెలిచి చూపించండి అని వీర లెవల్లో బిల్డప్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9). మొదటిరోజు నిజంగానే గట్టి పోటీనిస్తూ ఆడారు. కానీ తర్వాత వచ్చినవాళ్లంతా హౌస్‌మేట్స్‌ను గెలిపించడానికే ఓడిపోయినట్లుగా కనిపించింది. మరికొందరేమో ఈ ఆటలన్నీ మా వాళ్ల కాదు, చిల్‌ అవడానికే వచ్చామన్నట్లుగా ఉన్నారు. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో గురువారం (నవంబర్‌ 27వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..అతి చేసిన యావర్‌బిగ్‌బాస్‌ 7 నుంచి ప్రిన్స్‌ యావర్‌ వచ్చాడు. వచ్చీరావడంతోనే తనూజ నీకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడా? అని సూటిగా అడిగాడు. ఆమె లేదని చెప్పగానే తనతో కలిసి రొమాంటిక్‌ పాటకు స్టెప్పులేశాడు. కాకపోతే సాల్సా డ్యాన్స్‌ చేసి తనను ఇబ్బందిపెట్టినట్లుగానే కనిపించింది. ఆ తర్వాత ఆమె కోసం ప్రేమ పాట పాడాడు. అనంతరం ఇమ్మాన్యుయేల్‌తో కలిసి గేమ్‌ ఆడాడు. ఈ ఆటలో ఇమ్మూ గెలిచాడు.భరణి వర్సెస్‌ దివ్యకొన్నివారాలుగా తన ఆట కనిపించడం లేదని నామినేట్‌ చేసేసరికి బాగా హర్టయింది సంజన (Sanjana Galrani). అందరికీ కనిపించాలి, అంతేగా.. అని భరణి ట్యాబ్లెట్లు దొంగిలించేసింది. దొంగతనాలు సంజనాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి.. తీస్తే ఇచ్చేయండి అని వెళ్లి ఆమెనే అడిగాడు భరణి. ఇమ్మాన్యుయేల్‌ కూడా ఇది సరదా విషయం కాదని చెప్తే ఆమె మాత్రం ఏం పర్లేదంది. మధ్యలో దివ్య కలగజేసుకుని సంజనా ఎలాగో వినది.. ఇమ్మాన్యుయేల్‌ పడుకో, లైట్‌ తీసుకో అంది.శోభాపై గెలిచిన దివ్యదీంతో భరణి.. దివ్యపై అరిచాడు. మధ్యలో ఎందుకు మాట్లాడతావ్‌? ఆరిందలా దిగుతావ్‌.. అన్నాడు. అలా ఇద్దరూ గొడవపడ్డారు. అప్పటికీ అదంతా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయిన సంజనా.. ఉదయానికి టాబ్లెట్స్‌ ఇచ్చేసింది. అనంతరం బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ శోభా శెట్టి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. శోభాతో పోటీపడి దివ్య గెలిచి కంటెండరయింది. తర్వాత బిగ్‌బాస్‌ 4 ఫైనలిస్ట్‌ సోహైల్‌ అడుగుపెట్టాడు. అతడి ఎంట్రీతో హౌస్‌లో కొత్త ఎనర్జీ వచ్చింది.అతడే చివరి కెప్టెన్‌కిలో చికెన్‌, రెండు పాల ప్యాకెట్స్‌, కాఫీ పౌడర్‌ పంపించమని బిగ్‌బాస్‌కే ఆర్డరేశాడు సోహైల్‌. కాసేపు అతడిని ఆటాడుకున్నప్పటికీ చివరకు సోహైల్‌ అడిగినవన్నీ పంపించాడు. తర్వాత రీతూ, సంజనాతో కలిసి సోహైల్‌ గేమ్‌ ఆడాడు. ఈ ఆటలో సంజన, రీతూ గెలిచారు. అలా చివరి కెప్టెన్సీ కోసం కల్యాణ్‌, పవన్‌, దివ్య, ఇమ్మాన్యుయేల్‌, సంజన, రీతూ పోటీపడనున్నారు. సోషల్‌ మీడియా లీక్స్‌ ప్రకారం కెప్టెన్సీ గేమ్‌లో చివరి రౌండ్‌లో పవన్‌, ఇమ్మాన్యుయేల్‌ నిలిచారు. ఇమ్మూని ఓడించి డిమాన్‌ పవన్‌ చిట్టచివరి కెప్టెన్‌ అయినట్లు తెలుస్తోంది.

Thalaivar 173: Sai Pallavi to act in Rajinikanth Movie4
రజనీకాంత్‌ సినిమాలో సాయిపల్లవి?

తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్‌హాసన్‌ (Kamal Haasan), రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్‌ హిట్‌ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్‌ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. రజనీ హీరోగా, కమల్‌ నిర్మాతగాఅయితే దీనికంటే ముందు కమల్‌హాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్‌ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్‌ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.సాయిపల్లవి?పార్కింగ్‌ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్‌ టాక్‌. ఈ భారీ బడ్జెట్‌ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Chiranjeevi Charitable Trust under FCRA approved Central govt5
చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (CCT)కు కేంద్ర హోంశాఖ గుడ్‌న్యూస్‌ తెలిపింది. సుమారు 27 ఏళ్లుగా ఛారిటబుల్‌ ట్రస్టు కింద బ్లడ్‌ బ్యాంక్‌తో పాటు ఐ బ్యాంకు కూడా చిరంజీవి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (Chiranjeevi Charitable Trust)ను ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదుకు కేంద్ర హోంశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇకనుంచి విదేశీ విరాళాలు తీసుకునే వెసులుబాటును ట్రస్టుకు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి కోసం కేంద్రాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఆమోద ముద్రవేసినట్టు తెలుస్తోంది.

Premalo Rendosari Movie OTT Details6
'ప్రేమలో రెండోసారి' త్వరలో ఓటీటీలో విడుదల

సిద్ధా క్రియేషన్స్ బ్యానర్‌పై రమణ సాకే, వనితా గౌడ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ప్రేమలో రెండోసారి'. సాకే రామయ్య సమర్పించిన ఈ చిత్రాన్ని సత్య మార్క దర్శకత్వం వహించారు. నీరజ లక్ష్మి నిర్మించారు. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి, సతీష్ సారేపల్లి, చిరంజీవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. రెస్పాన్స్ బాగుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చిన్న సినిమాగా విడుదలైన మా చిత్రానికి రోజూ థియేటర్లు పెరుగుతున్నాయి. అందుకు కారణం పాజిటివ్ టాకే. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తీశాం. త్వరలోనే మా చిత్రం ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని తెలిపారు.

History Of Movie Piracy And Where It Starts7
పైరసీ ఎప్పుడు మొదలైంది? ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు?

పైరసీ.. పైరసీ.. పైరసీ.. దీని గురించి చాలామందికి తెలుసు. కానీ గత కొన్నిరోజుల నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మెయిన్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం 'ఐ బొమ్మ' రవి అరెస్ట్. అతడు చేసింది తప్పా ఒప్పా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతకీ పైరసీ అంటే ఏంటి? ఏళ్లకు ఏళ్లుగా వైరస్‌లా పెరిగిపోతున్నా సరే దీన్ని పోలీసులు ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి?పైరసీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. వ్యక్తిగత కంప్యూటర్ల వాడకం అంటే 1990-2000ల కాలంలో ఇది మొదలైంది. మొదట్లో ఫ్లాపీ డిస్క్‌ల్లో సమాచారాన్ని కాపీ చేసుకునేవారు. తర్వాత వీసీడీలు, డీవీడీల ట్రెండ్ మొదలైంది. వీటిల్లో వినేందుకు పాటలు కాపీ చేసేవారు. థియేటర్ ప్రింట్ రూపంలో సినిమాలని కూడా కాపీ చేసి ఇళ్లలో చూసుకునేవారు. 2000 తర్వాత కాలంలో వీటి వాడకం ఎక్కువైంది. 2010 వచ్చేసరికి మెమొరీ కార్డ్స్ వచ్చాయి. 2020 వచ్చేసరికి స్మార్ట్ ఫోన్, పెన్ డ్రైవ్ ఇలా చాలా సదుపాయాలు వచ్చేశాయి. ప్రస్తుతానికైతే పైన చెప్పిన వాటి కంటే ఆన్‌లైన్‌లో ఉండే కొన్ని వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి సినిమాని ఉచితంగా చూసేయొచ్చు. కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే.పైరసీ చూడటం కరెక్టేనా అంటే అస్సలు కాదు. మొబైల్‌లో ఉచితంగా చూపిస్తున్నాడు కదా అని వీటిని చాలామంది చూస్తున్నారు. కానీ తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలు వాడికి అప్పగించేస్తున్నారు! ఎలా అంటే? మీ స్మార్ట్‌ఫోన్‌లో సదరు పైరసీ సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు, అప్పటికే మొబైల్‌లో మీ మొయిల్ ఐడీతో లాగిన్ అయ్యింటారు కదా. హ్యాకర్లు కావొచ్చు, సైట్ నిర్వహకులు కావొచ్చు.. మీ వివరాలని మీకు తెలియకుండానే స్టోర్ చేసుకుంటారు. మరి వాటితో ఏం చేస్తారు అంటే చాలా చేయొచ్చు. డార్క్ వెబ్‌లో మీ వివరాలని ఎవరికైనా అమ్మేస్తే.. దానితో వాళ్లు ఏమైనా చేయొచ్చు. అప్పుడప్పుడు మీకు తెలియని వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీ పేరు సహా కొన్ని వివరాలని వాళ్లు చెబుతుంటారు. వాళ్లకు మీ గురించి ఎలా తెలిసిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచిస్తే మీకు ఇప్పుడు చెప్పిన విషయం కచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి పైరసీ సైట్లని గానీ, అనుమతి లేని లింక్స్ గానీ ఓపెన్ చేసేముందు తస్మాత్ జాగ్రత్త.పైరసీ అనేది రకరకాల పద్ధతుల్లో చేస్తారు. అప్పట్లో థియేటర్‌కి వెళ్లి రహస్యంగా మొబైల్ ఫోన్‌తో లేదంటే కెమెరాతో రికార్డ్ చేసేవారు. తర్వాత దాన్ని డీవీడీలు లేదా మెమొరీ కార్డ్‌లో కాపీ చేసి పైరసీ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఎంతలా అంటే సర్వర్లు హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్స్ డౌన్‌లోడ్ చేసేంతలా! 'ఐ బొమ్మ' రవి కేసునే తీసుకుందాం. సినిమా రిలీజ్‌కి ముందే వాటిని లోడ్ చేసి ఉంచిన సర్వర్లని హ్యాక్ చేసి మరీ సినిమాలని తస్కరించేవాడు. ముందే పైరసీ సైట్లలో పెడితే ఎక్కడ అనుమానం వస్తుందోనని.. సరిగ్గా సినిమా విడుదల రోజు.. సైట్లలో అప్‌లోడ్ చేసేవాడు. మన దగ్గరే ఉంటే దొరికిపోతాడు కాబట్టి నైజీరియన్ దేశాల్లో ఉంటూ ఇదంతా చేసేవాడు.నైజీరియన్ దేశాలతో పాటు చైనా, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ సైబర్‌ మాయగాళ్లు తిష్టవేసి.. పైరసీ సైట్లని నడుపుతున్నారు. పైరసీలో మనం సినిమా ఫ్రీగా చూస్తాం కదా వాడికి ఎలా డబ్బులొస్తాయి అని మీరు అనుకోవచ్చు. సినిమా ప్లే అవుతున్నప్పుడు పైనో దిగువనో ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్‌ యాప్స్ యాడ్స్ వస్తుంటాయి. వాటి నిర్వహకులు సదరు పైరసీ చేసిన వాడికి డబ్బులిస్తుంటారు. కొందరు సినిమా చూసి వదిలేస్తారు. మరికొందరు మాత్రం బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.పైరసీ వల్ల భారతీయ సినీ పరిశ్రమ 2023లో రూ.22,400 కోట్లు నష్టపోయింది. అందులో థియేటర్లు కోల్పోయింది రూ.13,700 కోట్లు కాగా ఓటీటీల వాటా రూ.8,700 కోట్లు. ఆ ఏడాది మీడియా, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆదాయంతో పోలిస్తే పైరసీ వల్ల కలిగిన నష్టం అందులో నాలుగో వంతుగా తేలింది. పైరసీ వల్ల గతేడాది ఒక్క టాలీవుడ్‌ రూ.3,700 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. గత పదేళ్లలో తీసుకుంటే ఆ నష్టం రూ.20 వేల కోట్లకు పైమాటే!ఇంతా జరుగుతున్నా పోలీసులు ఎందుకు పైరసీ సైట్లని ఆపలేకపోతున్నారు అని అనుకోవచ్చు. ఒకదాన్ని బ్లాక్‌ చేస్తే, రావణాసురుడి తలలా చాలా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కి పైగా వెబ్‌సైట్లు తెలుగు సినిమాలని అక్రమంగా చూసేందుకు అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో పోలీసులని.. సదరు పైరసీ చేస్తున్నవారిని పట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది. పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం పైరసీ చేశారని తేలితే.. మూడేళ్ల జైలుశిక్ష, మూడు లక్షల రూపాయల నుంచి నిర్మాణ వ్యయంలో అయిదు శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా సరే పైరసీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది.

Niharika And Rakul Preet Singh Latest8
పింఛం పట్టుకున్న నిధి.. చీరలో నిహారిక గ్లామర్

వైట్ అండ్ వైట్ డ్రస్‌లో రకుల్ హొయలుచీరలో మరింత అందంగా అనసూయనిహారిక గోవా ట్రిప్.. ఎర్రచీరలో గ్లామర్‌తోకెన్యా ట్రిప్‌లో హీరోయిన్ చాందినీ చౌదరినెమలి పింఛంతో నిధి అగర్వాల్ క్యూట్‌నెస్కొడైకెనాల్‪‌లో చిల్ అవుతున్న మానస చౌదరి View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine)

Anaganaga Oka Raju Movie Bhimavaram Balma Song Lyrical9
సింగర్‌గా నవీన్ పొలిశెట్టి.. హుషారెత్తించే పాట రిలీజ్

'జాతిరత్నాలు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మరో హిట్ అందుకున్నాడు. దీని తర్వాత మరో మూవీ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే చిత్రం చేస్తున్నాడు. రాబోయే సంక్రాంతికి దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఇ‍ప్పటికే దసరా, దీపావళికి ప్రమోషనల్ వీడియోలు వదిలిన నవీన్.. ఇప్పుడు తొలి పాటని రిలీజ్ చేశారు. 'భీమవరం బల్మా' అంటూ సాగే ఈ గీతాన్ని.. భీమవరంలోనే ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్‌లోనే గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. పాట కలర్‌ఫుల్‌గా ఉంది. నవీన్-మీనాక్షి కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి మారి దర్శకుడు.(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?)

Chikiri Chikiri Song Location Details Latest10
'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం 'చికిరి చికిరి' అని సాగే తొలి పాట రిలీజైంది. వెంటనే సంగీత ప్రియులకు నచ్చేసింది. అప్పటినుంచి రీల్స్, షార్ట్స్.. ఇలా ప్రతిచోట ఈ పాట వీడియోలే కనిపించాయి. తాజాగా ఈ గీతం అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్‌ప్రైజ్ వచ్చింది. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఈ వీడియోలో టీమ్ అంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్‌కి చేరుకున్నారు. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో 'చిరుత' గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది.అసలు విషయానికొస్తే.. 'చికిరి' పాటని నిజమైన లొకేషన్‌లో తీశారు. మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ (Savlya Ghat) అనే ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన 'చికిరి చికిరి' పాట షూటింగ్ చేశారు. దీనిపై ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మూవీ టీమ్ అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష‍్మీ)

Advertisement
Advertisement