Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Aaromaley Movie OTT Telugu Streaming Details1
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీల్లోకి ఈ వారం పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీతో పాటు 'త్రీ రోజెస్' అనే తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 2 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.. తమిళంలో హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ మూవీ 'ఆరోమలే'. కిషన్ హీరోగా నటించాడు. నవంబరు 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. హౌస్‌ఫుల్స్ కూడా బాగానే అయ్యాయి. నెల పూర్తయిందో లేదో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (డిసెంబరు 12) నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. బయట దేశాల్లో సింప్లీ సౌత్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.'ఆరోమలే' విషయానికొస్తే.. ప్రేమ అనేది సినిమాల్లో చూపించినట్లు ఉంటుందని నమ్మే కుర్రాడు అజిత్ (కిషన్). స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమిస్తాడు కానీ అపర్థాల వల్ల బ్రేకప్ అవుతుంది. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఓ మ్యాట్రిమోనీ ఏజెన్సీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ ఇతడి బాస్ అంజలి (శివాత్మిక)తో సమస్యలొస్తాయి. ఈమె.. ప్రేమ అనేది లాజిక్ అని నమ్మే టైపు. అలా ప్రేమ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్న వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా? అజిత్‌కి మూవీ టైపు ప్రేమ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ. ప్రేమ అనే ఎమోషన్స్‌ని చూపిస్తూనే కామెడీ కూడా బాగుందనే టాక్ అయితే వచ్చింది. ఓటీటీలోకి వచ్చాక తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?Fall in love. Laugh out Loud..❤️😂 #Aaromaley from Nov 12#Aaromaley streaming from Dec 12 only on #JioHotstar#AaromaleyOnJioHotstar #AaromaleyStreamingFromDec12 #JioHotstarTamil @kishendas @ShivathmikaR @SarangThiagu #HarshathKhan pic.twitter.com/Phe82tuBti— JioHotstar Tamil (@JioHotstartam) December 10, 2025

Bigg Boss 9 Telugu: Bharani Shankar Disappointed over Thanuja Commanding2
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి

ఇమ్యూనిటీ + ఓట్‌ అప్పీల్‌ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. లీడర్‌ బోర్డులో మొదటి స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టించిన ఇమ్మాన్యుయేల్‌ అందరికంటే మొదటగా ఓట్‌ అప్పీల్‌ గెలిచాడు. ఇప్పుడు మరో ఓట్‌ అప్పీల్‌ కోసం టాస్కులు జరుగుతున్నాయి. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.బాల్‌ గేమ్‌అందులో సంజనా, కల్యాణ్‌ సంచాలకులుగా ఉండగా మిగతావారు గేమ్స్‌ ఆడారు. సంచాలకులు విసిరే బాల్స్‌ను తమ జంబో బ్యాగుల్లో పడేలా చూసుకోవాలి. ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు సమాచారం. ఈ గేమ్‌ అయిపోయాక భరణి.. సుమన్‌తో మాట్లాడుతూ.. ఎంత దారుణం.. తనూజ కూర్చో అంటే (కల్యాణ్‌) కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు. భరణిపై సెటైర్స్‌తనూజ ఎక్కువ కమాండ్‌ చేస్తున్నట్లు అనిపిస్తోంది అని ఫీలయ్యాడు. ఈ ప్రోమో కింద కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. దివ్య మిమ్మల్ని కమాండ్‌ చేసినప్పుడు ఏమైపోయారు? అని భరణిపై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో తనూజ ఓట్‌ అప్పీల్‌ గెలిచినట్లు భోగట్టా! చదవండి: ఇమ్మాన్యుయేల్‌ ప్రభంజనం.. టాప్‌5లో ఉంచమని రిక్వెస్ట్‌

Venkatesh Trivikram Movie Titled Aadarsha Kutumbam3
ఏఎన్నార్ టైటిల్‌తో త్రివిక్రమ్-వెంకీ కొత్త సినిమా

వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోకి టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. అలా అని వీళ్లు దర్శకుడు-హీరోగా కలిసి పనిచేయలేదు. త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకీ హీరోగా చేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' మూవీస్‌కి పనిచేశారు. వాటిల్లో కామెడీ గానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ గానీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి పనిచేయాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకున్నారు. అది కొన్నాళ్ల ముందు నెరవేరింది.ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్లు అప్‌డేట్ ఇచ్చారు. 'ఆదర్శ కుటుంబం హౌస్ నం.47' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు వచ్చే ఏడాది వేసవిలో మూవీ రిలీజ్ అవుతుందని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇదే టైటిల్‌తో 1969లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే పేరుని టైటిల్‌గా ఉపయోగిస్తున్నారు. పేరు, పోస్టర్ చూస్తుంటేనే మంచి హోమ్లీ ఫీల్ అనిపిస్తుంది.ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సంగీత దర్శకుడిగా 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు వినిపిస్తుండగా.. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతేడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమా రిలీజైన తర్వాత నుంచి త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ చేయలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఓ సినిమా అనుకున్నారు కానీ తర్వాత ఎన్టీఆర్‌తో ఫిక్స్ అయ్యారు. కుమారస్వామి దేవుడు బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఇది తీయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ తీయడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశముండటంతో ఇంతలో వెంకీతో ఈ సినిమాని త్రివిక్రమ్ తీస్తున్నారు.ఇకపోతే త్రివిక్రమ్.. ఈ సినిమాతో మరోసారి 'ఆ' సెంటిమెంట్ రిపీట్ చేశారని చెప్పొచ్చు. గతంలో అతడు, అత్తారింటికి దారేది, అఆ, అల వైకుంఠపురములో, అరవింద సమేత.. ఇలా అ లేదా ఆ అక్షరంతో ఎక్కువగా టైటిల్స్ పెట్టారు. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. ఇప్పుడు తన సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ వెంకీతో తీస్తున్న చిత్రానికి 'ఆదర్శ కుటుంబం' అని పేరు పెట్టారా అనిపిస్తుంది.

Radhika Pandit 9th Wedding Anniversary post to Yash4
నా భర్తే నా సర్వస్వం.. ఎందుకో తెలుసా?: యష్‌ భార్య

కన్నడ స్టార్‌ హీరో యష్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లవుతోంది. 2016లో నటి రాధికా పండిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు ఐరా, కుమారుడు యాత్రవ్‌ సంతానం. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా రాధిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ అద్భుతమైన వీడియో షేర్‌ చేసింది. నా సర్వస్వం నా భర్తే అని ఎందుకంటానో తెలుసా? అంటూ మొదట్లో ఓ క్యాప్షన్‌ వచ్చింది. అతడే నా సర్వస్వంఆ వెంటనే దానికి సమాధానంగా.. నా భర్త నా పర్సనల్‌ బాడీగార్డ్‌, నా చాట్‌జీపీటీ, నా చెఫ్‌, నా పర్సనల్‌ ఫోటోగ్రాఫర్‌, నా మెంటార్‌, నా డీజే, నా డాక్టర్‌, నా కాలిక్యులేటర్‌, నా స్ట్రెస్‌ బస్టర్‌ అంటూ యష్‌ ఏఐ ఫోటోల్ని జత చేసింది. చివర్లో మాత్రం నా ప్రశాంతతకు కారకుడు అంటూ భర్తపై వాలిపోయి ఉన్న ఒరిజినల్‌ ఫోటోను యాడ్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ మ్యాన్‌ అని యష్‌ను కొనియాడుతున్నారు.సినిమాకేజీఎఫ్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్‌ ప్రస్తుతం రామాయణ మూవీలో రావణుడిగా నటిస్తున్నాడు. అలాగే టాక్సిక్‌ సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit)

Ajith, Simbu Reunites after 20 Years in Malaysia5
అజిత్‌ ఆశీర్వాదం తీసుకున్న హీరో శింబు

సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఒక నటుడికి మరో నటుడు అభిమానం కావడం కాస్త అరుదు. అలా సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు గాంచిన స్టార్‌ హీరో అజిత్‌కు శింబు వీరాభిమాని కావడం విశేషం. ఈ విషయాన్ని శింబు బహిరంగంగానే పలు వేదికలపై చెప్పారు. ఒక నటుడిగా తనకు అజిత్‌ మార్గదర్శి అని చెప్తూ ఉంటారు. తాజాగా శింబు.. అజిత్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఫేవరెట్‌ హీరోను కలిసిన శింబుఅజిత్‌ సినిమాలతోపాటు కార్‌ రేస్‌లపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్‌ రేసుల్లో పోటీ చేసి పథకాలను పొందారు. తాజాగా మలేషియాలో జరుగుతుననన్న కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌ కోసం మలేషియా వెళ్లిన శింబు ప్రత్యేకంగా అజిత్‌ను కలిసి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అజిత్‌ జట్టు కోసం చేసిన జెర్సీ ధరించడం విశేషం.ఆశీర్వాదంశింబు తాజాగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో అరసన్‌ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అజిత్‌కు తెలిపి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇలా అజిత్‌, శింబు కలుసుకోవడం మరో విశేషం. అజిత్‌తో కలిసి శింబు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆ డైరెక్టర్‌తో వన్స్‌ మోర్‌అజిత్‌ మలేషియాలో జరుగుతున్న కార్‌ రేస్‌ ముగిసిన తరువాత తన తర్వాతి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతారని తెలిసింది. ఈ చిత్రానికి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబోలో ఇంతకుముందు గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే చిత్రం వచ్చిందన్న విషయం తెలిసిందే! #SilambarasanTRமலேசியா Racing Circuitல் அஜித் குமாரை சந்தித்த சிம்பு#Simbu #Silambarasan #AK #Ajithkumar #AjithKumarRacing #Ajith #Malaysia #STR #Atman pic.twitter.com/OqE9vo7ptB— Actor Kayal Devaraj (@kayaldevaraj) December 6, 2025

Bigg Boss 9 Telugu: Emmanuel Got Vote Appeal6
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆడియన్స్‌.. టాప్‌ 5కి చేర్చండి అన్న ఇమ్మూ

ఇది ఫెయిర్‌ కాదు బిగ్‌బాస్‌ పేరిట హౌస్‌లో ఇమ్యూనిటీ చాలెంజ్‌ నడుస్తోంది. ఇప్పటికే ఓ గేమ్‌ పూర్తవగా లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో మరో రెండు గేమ్స్‌ పెట్టారు. అలాగే బిగ్‌బాస్‌ ప్రియులు హౌస్‌లోకి వెళ్లి మాట్లాడారు. ఆ విశేషాలేంటో మంగళవారం (డిసెంబర్‌ 9వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాకు సీక్రెట్‌ టాస్క్‌మూడుసార్లు జైలు నుంచి బయటకు రావాలని సంజనాకు సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీంతో ఆమె తెలివిగా ఆరోగ్యం బాలేదంటూ మూడుసార్లు జైలు ఓపెన్‌ చేయించింది. అలా ఆమె జైలు జీవితం రద్దవడంతో పాటు ఏ గేమ్‌ ఆడకుండానే 20 పాయింట్లు గెలుచుకుంది. ఇక ఇమ్యూనిటీ రేసులో భాగంగా రెండో గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. ఇందులో ఇమ్మూ గెలవగా డిమాన్‌ పవన్‌ రెండో స్థానంలో నిలిచాడు. సుమన్‌, తనూజ, సంజనా, భరణి తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచారు.గేమ్‌ నుంచి తప్పించే ఛాన్స్‌మూడో గేమ్‌లో ఒకరు ఆడకుండా సైడ్‌ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్‌. ఇమ్మూ.. సంజనాను పక్కకి పిలిచి అదిరిపోయే సలహా ఇచ్చాడు. వాళ్లు ముగ్గురూ (భరణి, తనూజ, సుమన్‌) కచ్చితంగా మా ఇద్దరి (పవన్‌, ఇమ్మ)లో ఒకరి పేరు చెప్తారు. కాబట్టి నువ్వు ఆ ముగ్గురిలో ఒకరి పేరు చెప్తే, నేను, పవన్‌, కల్యాణ్‌ కూడా అదే చెప్తాం. దీనివల్ల లీడర్‌ బోర్డులో చివర్లో ఉన్న నువ్వు ముందుకొస్తావ్‌ అని ఐడియా ఇచ్చాడు. కానీ, సంజనా వింటేగా.. నేను నీ పేరు కాదు, పవన్‌ పేరు చెప్తున్నా అంది.ప్లేటు తిప్పేసిన సంజనానువ్వు పవన్‌ పేరు చెప్తే.. వాళ్లంతా నా పేరు చెప్తారు, అలా నేను బలవ్వాల్సి వస్తుంది అని మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. దీంతో భరణి, సుమన్‌, తనూజ.. ఇమ్మూ అనుకున్నారు. కానీ సంజనా ఒక్కరే డిమాన్‌ పవన్‌ పేరు చెప్పింది. పవన్‌, కల్యాణ్‌.. సంజనా పేరు చెప్పారు. దీంతో ఇమ్మూ.. తనను కాపాడుకోవడం కోసం సంజనా పేరు చెప్పక తప్పదన్నాడు. అలాగైతే తాను డేంజర్‌లో పడతానని అర్థమైన సంజనా.. వెంటనే తన నిర్ణయం మార్చుకుంది. తనూజ వర్సెస్‌ సంజనాపవన్‌కు బదులుగా ఇమ్మూని తీసేస్తానంది. అందుకు తనూజ ఒప్పుకోలేదు. అలాగైతే నేనూ నా నిర్ణయం మార్చుకుంటా.. అంటూ సంజనా పేరు చెప్పింది. ఇక్కడ వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. చివరకు ఇమ్మాన్యుయేల్‌.. సంజనా పేరు చెప్పాడు. అలా సంజనాకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె నెక్స్ట్‌ గేమ్‌ ఆడటానికి వీల్లేదని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ప్రస్తుతానికి లీడర్‌ బోర్డులో టాప్‌ 2లో ఉన్న ఇమ్మూ, పవన్‌.. గార్డెన్‌ ఏరియాలోకి వచ్చారు.ఇమ్మూ ఓట్‌ అప్పీల్‌వీరి కోసం కొందరు ప్రేక్షకులు బిగ్‌బాస్‌ హౌస్‌కి వచ్చారు. మెజారిటీ జనం ఇమ్మూ (Emmanuel) ఓట్‌ అప్పీల్‌ గెల్చుకోవాలని కోరారు. అలా ఇమ్మాన్యుయేల్‌ మాట్లాడుతూ.. ఫస్ట్‌ వీక్‌ నుంచి ఇప్పటివరకు నాకు ఓటేస్తూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. మూడుసార్లు కెప్టెన్‌ అయ్యాను. ఇంట్లోని పరిస్థితులను తట్టుకుని అందర్నీ నవ్విస్తున్నాను. వీలైనన్ని గేమ్స్‌ గెల్చుకుంటూ వచ్చాను. ఓట్‌ అప్పీల్‌ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క. దయచేసి నాకు ఓటేయండి. ఒక్క ఎంటర్‌టైనర్‌ అయినా కప్పు గెలవాలని ఆడుకుంటూ వచ్చాను. నాకు ఓటేసి టాప్‌ 5లో ఉంచుతారని అనుకుంటున్నాను అని ఓట్‌ అప్పీల్‌ అడిగాడు. తర్వాత ప్రేక్షకులతో కాసేపు చిట్‌చాట్‌ చేశాడు. కప్పు గెలవగానే ఫస్ట్‌ అమ్మ చేతికి ఇస్తానని, తర్వాత ప్రేయసి చేతిలో పెడతానని చెప్పాడు.చదవండి: షూటింగ్‌కు ఫారెస్ట్‌ పోదాం చలోచలో

Tamannaah Bhatia AI Photos Goes Viral7
హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ

సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇందులో నిలదొక్కుకునేందుకు తారలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. అదృష్టం తోడైనవారే తమ కలలను సాకారం చేసుకుంటారు. భాషాభేదం లేకుండా తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందుకు తగిన గుర్తింపు వస్తే ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) అనే ఆధునిక టెక్నాలజీ.ఏఐ దుర్వినియోగంసాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఓపక్క ప్రయోజనాలు చేకూరుతుంటే మరికొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలను ఇష్టారీతిన ఎడిట్‌ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్‌ చేసి అశ్లీల ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇలా తప్పుగా చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్నా, కీర్తి సురేశ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా తమన్నా ఫోటోలను ఏఐ టెక్నాలజీతో బికినీ దుస్తుల్లో చిత్రీకరించి వైరల్‌ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే హీరోయిన్లకు తలనొప్పి తప్పేలా లేదు!

Balakrishna Akhanda 2 release date announced8
అఫీషియల్‌.. అఖండ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కొన్ని గంటల్లో రిలీజ్‌ కావాల్సిన అఖండ 2.. గత గురువారం అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఖండ 2 నిర్మాతలకు ఈరోస్‌ సంస్థతో ఉన్న ఫైనాన్స్‌ వివాదం కోర్టుకు వెళ్లడంతో చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది. దీంతో కొత్త రిలీజ్‌ డేట్‌పై రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో తాజాగా నిర్మాత సంస్థ సినిమా విడుదల తేదిని ప్రకటించింది. అభిమానులు కోరుకున్నట్లుగానే ఈ చిత్రం డిసెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్‌ 11న ప్రీమియర్స్‌ కూడా పడనున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. All set for the Divine Destruction at the box office 🔥Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱BOOKINGS OPEN SOON!#Akhanda2Thaandavam‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/LVmTNIObEr— 14 Reels Plus (@14ReelsPlus) December 9, 2025

Tollywood actresses social media Updates in Instagram 9
శ్రీలంకలో ధనశ్రీ వర్మ చిల్.. ప్రియా ప్రకాశ్ వారియర్ బోల్డ్ లుక్..!

బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ బోల్డ్ లుక్స్..శ్రీలంకలో చిల్ ‍అవుతోన్న ధనశ్రీ వర్మ..మరింత బోల్డ్‌గా ప్రియా ప్రకాశ్ వారియల్‌..శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి హాట్ పోజులు..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్‌ పిక్స్.. View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by AaradhyaDevi🦋 (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran)

Bigg Boss 9 fame Roopal Tyagi marries Nomish Bhardwaj10
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!

ప్రముఖ బుల్లితెర భామ, బిగ్‌బాస్‌ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి ‍‍అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్‌ వెడ్డింగ్‌ డిసెంబర్‌ 5న జరిగింది.కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్‌పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.రూపల్ త్యాగి కెరీర్..హమారీ బేటియూన్ కా వివాహ్‌ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్‌ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్‌ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది. View this post on Instagram A post shared by Roopal Tyagi (@roopaltyagi06)

Advertisement
Advertisement