ప్రధాన వార్తలు
బట్టతలపై జుట్టుండాలట.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలా!
దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.సడన్గా విగ్ కావాలట!పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు. పక్కనున్న చెంచాల వల్లే..దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. అప్పుడేమో ఎగిరి గంతేసి..కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.గుర్తింపు లేని సమయంలో ఛాన్స్అక్షయ్కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్లో కూడా ఓవర్గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.అక్షయ్ కంటే మంచి నటుడుదృశ్యం.. అజయ్ దేవ్గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ
'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్
'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను, ఏ-11గా అల్లు అర్జున్(Allu Arjun)ని చేర్చుతూ.. ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు. గత డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో 'పుష్ప 2' బెనిఫిట్ షో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. థియేటర్లో తగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ ఏర్పాట్లు లేకపోవడం, అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు. అయితే, అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్టు చేయగా.. బెయిల్పై బయటకు వచ్చారు.
డబ్బుల కోసం అలాంటి పని చేశా.. పేరు మార్చుకున్నా : అరియానా
అరియానా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆర్జీవీని ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఎంపికైంది. బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొని..తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చన తర్వాత పలు వెబ్ సిరీస్లు, సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బీజీ అయిపోయింది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్తో పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.అందుకే పేరు మార్చుకున్నానా అసలు పేరు అరియానా(Ariyana Glory) కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కష్టాలు ఎక్కువ అవ్వడంతో నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.అనుకోకుండా అవకాశం.. మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను అనుకోకుండా యాంకర్ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్ కావలెనన్న ప్రకటన వచ్చింది. అది చూసి నేను ఆడిషన్స్కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను.ఒకేసారి ఐదారు జాబులు చేశాడబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశా. లైన్లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం రూ. 1800 మాత్రమే. రూమ్ రెంట్ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు జమ చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డా. డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేశా. ఇప్పుడు నేను బెటర్ పొషిషన్లో ఉన్నాను.ఈ క్షణమైనా చనిపోవడానికి రెడీఇక నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు ఓకే’ అని అరియానా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది.
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
'ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు' ఈ సామెత శివాజీకి సరిగ్గా సెట్టవుతుంది. పురుషాహంకారంతో విర్రవీగే శివాజీ బిగ్బాస్ హౌస్లోనూ లేడీ కంటెస్టెంట్లపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా.. అంటూ దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు దండోరా ఈవెంట్లోనూ హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెబుతూ రాయడానికి వీల్లేని బూతు పదాలు ఉపయోగించాడు.ఎండగట్టిన అనసూయఆయన వైఖరిని ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. యాంకర్ అనసూయ అయితే.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం.. మీరెవరు చెప్పడానికి అని తిరిగి ప్రశ్నించింది. అసలే మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తున్న శివాజీ అందరినీ వదిలేసి అనసూయను మాత్రం టార్గెట్ చేశాడు. కొందరు ఈ విషయంలో శివాజీకి వకాల్తా పుచ్చుకుని అనసూయపై మండిపడుతున్నారు.ట్రోలర్స్పై ఫైర్అలాంటివారికోసం తాజాగా అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. కొందరు పనిగట్టుకుని నా మాటలను కావాలనే వక్రీకరించి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వెస్ట్రన్ దుస్తులు వేసుకోమని సూచించలేదు. నేను వేసుకునేలాంటి దుస్తులే ధరించాలని చెప్పలేదు. నా ఇష్టాయిష్టాలను ఎవరిపైనా రుద్దలేదు. నేను చెప్పిందల్లా ఒక్కటే.. ప్రతి మహిళకు తనకు నచ్చిన డ్రెస్లు వేసుకునే స్వేచ్ఛ ఉందన్నాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను.నా భర్తను ఎందుకు లాగుతున్నారు?నా మాటల్ని వక్రీకరించి నాపై విషప్రచారం చేస్తున్నారు. నా భర్తను, పిల్లల్ని ఇందులోకి లాగుతున్నారు. మగవాళ్లే కాదు, కొందరు ఆడవాళ్లు కూడా ఒక మహిళగా, తల్లిగా నా క్యారెక్టర్ను ప్రశ్నిస్తున్నారు. కేవలం నేను వేసుకునే బట్టల్ని బట్టి నన్ను తప్పుపడుతున్నారు. మీరెంత విమర్శించినా నేను మరింత బలంగా నిలబడతాను. ఇప్పటికైనా మేల్కొనండి.. ఇకనైనా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. హేటర్స్.. మీరు కూడా నా ఫ్యాన్సే!ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారకుండా సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. మీ మైండ్లోకి ఎలాంటివి ఎక్కిస్తున్నారో చెక్ చేసుకోండి. ఇది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను కంట్రోల్ చేయాలనుకుంటున్న పితృస్వామ్య భావజాలం గురించి! చివరగా.. నేను నచ్చకపోయినా నిరంతరం నన్ను గమనిస్తూ ఉన్నారంటే మీరు నా అభిమానుల కిందే లెక్క అని ట్రోలర్స్కు చురకలంటించింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: కూలీ మూవీపై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: దర్శకుడు
బిగ్బాస్
గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
ప్రమోషన్ పొందిన వితికా షెరు
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్బాస్' రివ్యూవర్స్.. ?
టాప్ 2లో నా పక్కన ఇమ్మూ... తనూజతో ఆ బాండ్ లేదు!
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్బాస్ బజ్: కల్యాణ్ పడాల నెక్స్ట్ టార్గెట్ అదే!
బిగ్బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
లేడీ సెలబ్రిటీలు తస్మాత్ జాగ్రత్త.. మీ గతి కూడా ఇంతే!
A to Z
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్'.. క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్
'బాహుబలి: ది ఎపిక్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరక...
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్లకు డిమాండ్ పెరిగిపోయిం...
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి తెలిసే ఉంటుంది....
శ్రీకాంత్ తనయుడి సినిమా.. భారీ ధరకు ఓటీటీ డీల్.!
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్...
మరో అమ్మాయితో నా భర్త డేటింగ్.. వదిలిపెట్టను : స్టార్ హీరో భార్య
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య...
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖ...
దురంధర్ బాక్సాఫీస్.. యానిమల్ రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ ...
కళ్లకు కాటుక పెట్టుకున్నా బాధనే!: బుల్లితెర నటి
సెలబ్రిటీల ముఖంలో కాస్త తేడా కనిపించినా నెటిజన్లు ...
ప్రపంచంలో అందమైన టాప్ టెన్ హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆమె ఒక్కరే..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ...
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీ వచ్చేసి...
'స్ట్రేంజర్ థింగ్స్ 5' వాల్యూమ్ 2 ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సిరీస్ల్లో 'స్ట్ర...
'అవతార్' రెండు పార్ట్స్లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?
ఈ శుక్రవారం(డిసెంబరు 19).. హాలీవుడ్ భారీ బడ్జెట్ మ...
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జ...
హత్యలు చేస్తున్నదెవరు?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి...
కెమికల్ వాటర్లో పడ్డా.. అప్పటినుంచే..: కమెడియన్
కమెడియన్గా, విలన్గా వెండితెరపై రాణిస్తున్నాడు తమ...
'జన నాయగణ్'.. విజయ్ పాడిన మరో పాట రిలీజ్
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సం...
ఫొటోలు
చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)
హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్.. ట్రెండింగ్లో 'అనసూయ' (ఫోటోలు)
హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)
ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)
బిగ్బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
‘డైమండ్ డెకాయిట్’ మూవీ హీరోయిన్ మేఘన (ఫొటోలు)
గాసిప్స్
View all
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?
దృశ్యం 3 నుంచి 'ధురంధర్' నటుడు అవుట్?
రేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!
'ధురంధర్'కి భారీ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
జైలర్ 2లో ఐటం సాంగ్!
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
దిగ్గజ గాయని బయోపిక్లో సాయిపల్లవి?
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
రివ్యూలు
View all
3
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
2.75
'దండోరా' సినిమా రివ్యూ
3
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
సినీ ప్రపంచం
‘బిగ్ బాస్’కి రుణపడి ఉంటా : సంజన
"ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని,కెరీర్ ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్ బాస్ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్ లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్ కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని సంజనా ప్రకటించారు. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె పేర్కొన్నారు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై"లో త్రిష చెల్లెలిగా నటించిన సంజనా.... ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించారు. తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజనా అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన 'విజనరీ వౌస్' కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
2025లో 'వైరల్' వయ్యారి వీళ్లే..
ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్లో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్ అయింది. ఈ సాంగ్లో.. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్ బ్లోయింగు.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్లో పడి వైరల్ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలెవరో చూసేద్దాం..మోనాలిసామోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్. మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. ఒక సాంగ్లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.ఆర్యప్రియ భుయన్కేవలం ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో వైరల్ అయిపోయింది ఆర్యప్రియ భుయన్. ఈ ఏడాది ఏప్రిల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్నైట్ స్టార్ అయింది.గౌరీ స్ప్రాట్బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్. ముంబైలో ఓ సెలూన్ నడుపుతూ ప్రైవేట్ లైఫ్ గడుపుతున్న గౌరీ.. ఆమిర్తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్గా మారింది.అలీషా ఓరీఈమె కూడా ఐపీఎల్ మ్యాచ్ ద్వారా క్లిక్ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) అభిమాని. వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్ చేశారు. అలీషా మోడల్, మేకప్ ఆర్టిస్ట్. తను 2021లో మిసెస్ ఇండియా లీగసీ టైటిల్ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2022 పోటీల్లో మిసెస్ పాపులర్ 2022 టైటిల్ అందుకుంది. Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025 మహికా శర్మక్రికెటర్ హార్దిక్ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్ అయింది.చదవండి: 'విగ్ కావాలా? ధురంధర్ నటుడికి పొగరు తలకెక్కింది'
‘నీలకంఠ’.. చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోలేరు
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ - నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని "నీలకంఠ" ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొన్నాం. షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలు దాటుకుని మీ ముందుకు మా చిత్రాన్ని జనవరి 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా "నీలకంఠ" చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ - నేను చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరిక మా డైరెక్టర్ శ్రీనివాస్, వేణుగోపాల్ వారి వల్ల నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చేందుకు మా టీమ్ అందరు కృషి చేశారు. మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. జనవరి 2న "నీలకంఠ" అనే మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఇతర భాషల చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. అందుకే మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ - నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. ఇందులో మంచి ఫైట్స్, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ "నీలకంఠ" సినిమాతో నాకు ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
చరణ్కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్
గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి అస్సలు కలిసి రావట్లేదు. చేసిన సినిమా చేసినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రెండ్కి తగ్గట్లు దేశభక్తి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' అనే మూవీలో నటిస్తున్నాడు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్)టీజర్లో గాల్వాన్ లోయని.. యుద్ధభూమిలో సల్మాన్ని మాత్రమే చూపించారు. ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకుడు. ఇతడు గతంలో రామ్ చరణ్తో 'తుఫాన్' అనే మూవీ తీశాడు. ఇది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలిసిందే. దీని తర్వాత హసీనా పార్కర్ అనే చిత్రం, క్రాక్ డౌన్, ముమ్ బాయ్ అనే వెబ్ సిరీస్లు చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మూవీతో మళ్లీ దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు సల్మాన్ ఖానే నిర్మాత కూడా. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.అయితే 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' సినిమా.. కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఈయన.. పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేశారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఏడాదిన్నరగా విధులు నిర్వర్తించారు. భారత్-చైనా సైనిక బలగాల ఘర్షణ సందర్భంగా 2020లో అమరులయ్యారు. మూవీ రిలీజైతే ఈయన జీవితం ఆధారంగా సినిమా తీశారా లేదా అనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. సూర్య కొత్త సినిమా స్టోరీ ఇదే)
నీలాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం: చిరంజీవి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు (డిసెంబర్ 27న) 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు ప్రముఖులు పర్సనల్గా, సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడికి ఎక్స్ (ట్విటర్) వేదికగా విషెస్ తెలియజేశారు.హ్యాపీ బర్త్డేనా ప్రియమైన సోదరుడికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న సల్లూభాయ్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంతోషం, ప్రేమ పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు లక్షలాదిమందికి ఒక ఇన్స్పిరేషన్.. నిన్ను స్నేహితుడని పిలవడం మాలాంటివారికి దక్కిన అదృష్టం.ఎంజాయ్ చెయ్నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి, సుఖసంతోషాలతో గడపాలి. ఈ ప్రత్యేకమైన రోజును హ్యాపీగా ఎంజాయ్ చెయ్ అంటూ సల్లూ భాయ్తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాగా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకర వరప్రసాద్గారు' మూవీస్ చేస్తున్నారు. సల్మాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ చేస్తున్నాడు. Happy 60th birthday to my beloved brother @BeingSalmanKhan 🌟Sallu bhai, on this special milestone, I want to share my heartfelt wishes with you. May this year bring you endless joy, good health, and all the love you truly deserve. You have always been an inspiration, not just… pic.twitter.com/4ESoduO2yA— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2025 చదవండి: బట్టతలపై జుట్టు.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలు
అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. ఇద్దరి మధ్య ప్రేమ
పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ సూర్యకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఇతడికి చాలా ఫాలోయింగ్ ఉంది. గతంలో 'రక్తచరిత్ర 2' అనే తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో నటించాడు గానీ పూర్తిస్థాయిలో తెలుగు మూవీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు 'సార్', 'లక్కీ భాస్కర్' దర్శకుడు తీస్తున్న సినిమా చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుందని తెలుసు గానీ కాన్సెప్ట్ ఏంటనేది బయటకు రాలేదు. ఇప్పుడు స్వయానా నిర్మాత నాగవంశీ.. స్టోరీ కాస్త రివీల్ చేశారు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్)ఈ మూవీలో హీరో సూర్య.. 'గజిని'లో సంజయ్ రామస్వామిలా ఓ ధనవంతుడు. అతడి వయసు 45 ఏళ్లు. అలాంటి ఇతడు 20 ఏళ్ల అమ్మాయి(మమిత)తో ప్రేమలో పడతాడు. వీళ్ల మధ్య స్నేహం, ప్రేమ, కోపం.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ల మధ్య ఉన్నది ప్రేమా కాదా అనేది స్టోరీ పాయింట్ అని నాగవంశీ చెప్పుకొచ్చారు. చూస్తుంటే సూర్య.. ఈసారి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.సూర్య గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాల చూస్తే చాలావరకు యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఓ లవ్ స్టోరీ అని తెలిసి తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. వెంకీ అట్లూరి తీస్తున్న ఈ సినిమాలో సూర్య, మమిత బైజుతో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్ర చేస్తోంది. మరో రెండు మూడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వచ్చే వేసవిలో లేదంటే వేసవి చివరలో థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలైతే ఉన్నాయి.(ఇదీ చదవండి: 'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్)
బట్టతలపై జుట్టుండాలట.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలా!
దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.సడన్గా విగ్ కావాలట!పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు. పక్కనున్న చెంచాల వల్లే..దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. అప్పుడేమో ఎగిరి గంతేసి..కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.గుర్తింపు లేని సమయంలో ఛాన్స్అక్షయ్కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్లో కూడా ఓవర్గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.అక్షయ్ కంటే మంచి నటుడుదృశ్యం.. అజయ్ దేవ్గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ
'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్
'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను, ఏ-11గా అల్లు అర్జున్(Allu Arjun)ని చేర్చుతూ.. ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు. గత డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో 'పుష్ప 2' బెనిఫిట్ షో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. థియేటర్లో తగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ ఏర్పాట్లు లేకపోవడం, అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు. అయితే, అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్టు చేయగా.. బెయిల్పై బయటకు వచ్చారు.
డబ్బుల కోసం అలాంటి పని చేశా.. పేరు మార్చుకున్నా : అరియానా
అరియానా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆర్జీవీని ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఎంపికైంది. బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొని..తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చన తర్వాత పలు వెబ్ సిరీస్లు, సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బీజీ అయిపోయింది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్తో పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.అందుకే పేరు మార్చుకున్నానా అసలు పేరు అరియానా(Ariyana Glory) కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కష్టాలు ఎక్కువ అవ్వడంతో నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.అనుకోకుండా అవకాశం.. మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను అనుకోకుండా యాంకర్ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్ కావలెనన్న ప్రకటన వచ్చింది. అది చూసి నేను ఆడిషన్స్కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను.ఒకేసారి ఐదారు జాబులు చేశాడబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశా. లైన్లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం రూ. 1800 మాత్రమే. రూమ్ రెంట్ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు జమ చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డా. డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేశా. ఇప్పుడు నేను బెటర్ పొషిషన్లో ఉన్నాను.ఈ క్షణమైనా చనిపోవడానికి రెడీఇక నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు ఓకే’ అని అరియానా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది.
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
'ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు' ఈ సామెత శివాజీకి సరిగ్గా సెట్టవుతుంది. పురుషాహంకారంతో విర్రవీగే శివాజీ బిగ్బాస్ హౌస్లోనూ లేడీ కంటెస్టెంట్లపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా.. అంటూ దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు దండోరా ఈవెంట్లోనూ హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెబుతూ రాయడానికి వీల్లేని బూతు పదాలు ఉపయోగించాడు.ఎండగట్టిన అనసూయఆయన వైఖరిని ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. యాంకర్ అనసూయ అయితే.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం.. మీరెవరు చెప్పడానికి అని తిరిగి ప్రశ్నించింది. అసలే మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తున్న శివాజీ అందరినీ వదిలేసి అనసూయను మాత్రం టార్గెట్ చేశాడు. కొందరు ఈ విషయంలో శివాజీకి వకాల్తా పుచ్చుకుని అనసూయపై మండిపడుతున్నారు.ట్రోలర్స్పై ఫైర్అలాంటివారికోసం తాజాగా అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. కొందరు పనిగట్టుకుని నా మాటలను కావాలనే వక్రీకరించి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వెస్ట్రన్ దుస్తులు వేసుకోమని సూచించలేదు. నేను వేసుకునేలాంటి దుస్తులే ధరించాలని చెప్పలేదు. నా ఇష్టాయిష్టాలను ఎవరిపైనా రుద్దలేదు. నేను చెప్పిందల్లా ఒక్కటే.. ప్రతి మహిళకు తనకు నచ్చిన డ్రెస్లు వేసుకునే స్వేచ్ఛ ఉందన్నాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను.నా భర్తను ఎందుకు లాగుతున్నారు?నా మాటల్ని వక్రీకరించి నాపై విషప్రచారం చేస్తున్నారు. నా భర్తను, పిల్లల్ని ఇందులోకి లాగుతున్నారు. మగవాళ్లే కాదు, కొందరు ఆడవాళ్లు కూడా ఒక మహిళగా, తల్లిగా నా క్యారెక్టర్ను ప్రశ్నిస్తున్నారు. కేవలం నేను వేసుకునే బట్టల్ని బట్టి నన్ను తప్పుపడుతున్నారు. మీరెంత విమర్శించినా నేను మరింత బలంగా నిలబడతాను. ఇప్పటికైనా మేల్కొనండి.. ఇకనైనా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. హేటర్స్.. మీరు కూడా నా ఫ్యాన్సే!ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారకుండా సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. మీ మైండ్లోకి ఎలాంటివి ఎక్కిస్తున్నారో చెక్ చేసుకోండి. ఇది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను కంట్రోల్ చేయాలనుకుంటున్న పితృస్వామ్య భావజాలం గురించి! చివరగా.. నేను నచ్చకపోయినా నిరంతరం నన్ను గమనిస్తూ ఉన్నారంటే మీరు నా అభిమానుల కిందే లెక్క అని ట్రోలర్స్కు చురకలంటించింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: కూలీ మూవీపై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: దర్శకుడు
సినిమా
పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్
ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్
మాటలు జాగ్రత్త శివాజీ.. లైవ్ లో మహిళా కమిషన్ వార్నింగ్
బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్
ధురంధర్ కలెక్షన్ల విధ్వంసం
డ్రగ్స్ కేసు.. రకుల్ సోదరుడు పరార్!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!
తగ్గేదేలే.. అనసూయ గారూ.. తొందరలోనే నీ ఋణం తీర్చుకుంటా
X లోకి ప్రభాస్ ఎంట్రీ ఫిక్సయ్యిందా..!
రవితేజ, బింబిసార డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..?
