Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Movie Actress Rati Agnihotri Current Situation1
సౌత్‌ టు నార్త్‌.. స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడేం చేస్తోంది?

రతి అగ్నిహోత్రి.. ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌. కమల్‌ హాసన్‌, చిరంజీవి వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చీకటి రోజుల్ని చూసింది. ఇటీవలే ఆమె (డిసెంబర్‌ 10) 65వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గురించి నేటి ప్రత్యేక కథనం.స్టార్‌ హీరోయిన్‌భారతీరాజా పుతియ వార్పుగల్‌ (1979) మూవీతో రతి అగ్నిహోత్రిని బిగ్‌ స్క్రీన్‌కు పరిచయం చేశాడు. ఫస్ట్‌ సినిమాకే విజయం కైవసం చేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఏడాదికి 8 నుంచి 10 సినిమాలు చేసుకుంటూ పోయింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీలో ఏక్‌ దుజే కే లియే, కూలీ వంటి సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది.తెలుగులో సినిమాలుతెలుగులో చిరంజీవి పున్నమినాగు, శోభన్‌బాబు జీవిత రథం, ఎన్టీఆర్‌తో తిరుగులేని మనిషి, కలియుగ రాముడు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.. ఇలా అనేక సినిమాలు చేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ డిక్టేటర్‌ మూవీలో యాక్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.వైవాహిక బంధంలో సమస్యలుబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రతి అగ్నిహోత్రికి పెళ్లిపై ప్రగాఢ విశ్వాసం. అందుకే వైవాహిక బంధంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చాలవరకు భరించింది. ఓపిక నశించిన సమయంలో పోలీసు స్టేషన్‌ మెట్లెక్కింది. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈమె 1985లో ఆర్కిటెక్ట్‌ విర్వానీని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కుమారుడు తనూజ్‌ సంతానం. ఇతడు ప్రస్తుతం బాలీవుడ్‌లో, హిందీ సిరియల్స్‌లో నటుడిగా కొనసాగుతున్నాడు.30 ఏళ్లు నరకంఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెప్తూ ఎమోషనలైంది రతి అగ్నిహోత్రి. ఆమె ఏమందో తన మాటల్లోనే చూద్దాం.. పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తాను. అందుకే ఇంట్లో ఏం జరిగినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. 30 ఏళ్లు నరకం అనుభవించినా ఏనాడూ దాన్ని పైకి కనబడనివ్వలేదు. కొడుకు పుట్టాక వాడే నా మొదటి ప్రాదాన్యత. ఏదో ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూశాను. భరించడం నా వల్ల కాక..ఎవరికీ చెప్పుకోలేని చోట కొట్టేవాడు. ఆ గాయాలు ఎవరికీ కనబడేవి కావు. 54 ఏళ్ల వయసులో కూడా నాపై దాడి జరిగింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నాకు వయసు మీదపడుతోంది, నేను ఇంకా బలహీనమవుతున్నాను. ఇలాగే భరిస్తూ పోతే ఏదో ఒకరోజు నా చావు తథ్యం అనిపించింది. అప్పుడు ధైర్యం కూడదీసుకుని 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. గృహ హింసను భరించాల్సిన అవసరం లేదని ఆలస్యంగా తెలుసుకున్నాను అంది. ఏం చేస్తోందంటే?ఈ విషయంలో కుమారుడు తల్లి పక్షానే నిలబడ్డాడు. కాకపోతే కొన్నాళ్లకు తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేశాడు. విడాకులైతే అవలేదు, కానీ ఇద్దరూ కలిసి మాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం రతి ఎక్కువగా పోలాండ్‌లోనే ఉంటుంది. అక్కడ తన సోదరి అనితతో కలిసి రెస్టారెంట్‌ నడుపుతోంది. యాక్టింగ్‌ కన్నా వంట చేయడం బాగా వచ్చంటోంది.

Akhanda 2 Ticket Hike Issue With High Court Latest Update2
కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. హైకోర్ట్ ఆగ్రహం

బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2' సినిమాకు ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు ఇచ్చింది. ఈ మేరకు బుకింగ్స్ ప్రారంభించారు. కానీ గురువారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ రేట్లు తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో పెంచిన ధరలతోనే టికెట్స్ అమ్మారు. షోలు పడ్డాయి. దీంతో ఇప్పుడు మరో న్యాయవాది ఈ విషయమై పిటిషన్ వేశారు. న్యాయస్థానం చెప్పినా సరే ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో హైకోర్ట్.. చిత్రబృందంపై, బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్క లేదా ? ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని బుక్ మై షోని హైకోర్టు ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో సమాధానమివ్వగా.. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారా లేదా? అని ప్రశ్నించింది. ఎందుకు మీపై కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని సీరియస్ అయింది. మధ్యాహ్నం మళ్లీ విచారణ జరగనుంది.మరోవైపు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో 'అఖండ 2' నిర్మాణ సంస్థ 14 రీల్స్.. లంచ్ మోషన్‌ దాఖలు చేసింది. అఖండ-2పై సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను, డివిజన్‌ బెంచ్‌లో 14 రీల్స్ సంస్థ అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరగనుంది.

Allu Arjun Praises ranveer Singh Dhurandher Movie making3
రణ్‌వీర్ సింగ్ దురంధర్.. ఐకాన్ స్టార్‌ రివ్యూ..!

రణ్‌వీర్ సింగ్ దురంధర్‌పై ఐకాన్ స్టార్ అల్లు ‍అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ‍‍అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. అత్యుత్తమ సాంకేతిక విలువలు, అద్భుతమైన సౌండ్‌ ట్రాక్‌తో నిర్మించారని బన్నీ కొనియాడారు. మై బ్రదర్ రణ్‌వీర్ సింగ్‌ తన టాలెంట్‌తో మరోసారి అభిమానులను ఊపేశారని అన్నారు. దురంధర్‌ మూవీని ఇప్పుడే చూశానని.. ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించిందని బన్నీ ట్వీట్ చేశారు.బన్నీ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. 'దురంధర్ మూవీ ఇప్పుడే చూశా. అద్భుతమైన ప్రదర్శనలు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు, సౌండ్‌ట్రాక్‌లతో నిర్మించిన చిత్రమిది. మై బ్రదర్ రణ్‌వీర్ సింగ్ అదరగొట్టేశాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ‍అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో మెప్పించారు. మొత్తంగా దురంధర్ టెక్నికల్ టీమ్‌, చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ మూవీ కెప్టెన్‌ ఆదిత్య ధార్ అద్భుతంగా తీర్చిద్దారు. నాకు ఇది చాలా నచ్చింది. దీన్ని కూడా చూసి దురంధర్‌ను ఆస్వాదించండి గాయ్స్' అంటూ పోస్ట్ చేశారు.రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్‌ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీని పాకిస్తాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్ యాక్షన్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల దిశగా ముందుకెళ్తోంది. Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025

Pawan Kalyan Went Delhi High Court His Personality Rights4
ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్ కల్యాణ్

రీసెంట్ టైంలో సినీ ప్రముఖులు వ్యక్తిగత హక్కుల్ని పరిరక్షించుకోవడంలో భాగంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున ఇలా చేయగా.. ఈ మధ్యే ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టుకి వెళ్లారు. ఇప్పుడు వీళ్ల దారిలోనే పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు.సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హక్కులని ఉల్లంఘించే విధంగా పోస్టులు పెడుతున్నారని పవన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. పవన్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ వేశారు. వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈయన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ.. వచ్చే ఏడాది విడుదల కానుంది.

Bigg Boss 9 Telugu: Thanuja Puttaswamy Became Second Finalist, but There is a Twist5
సెకండ్‌ ఫైనలిస్ట్‌గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్‌!

బిగ్‌బాస్‌ హౌస్‌లో సెకండ్‌ ఫైనలిస్ట్‌ కోసం పోటీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కల్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యాడు. సెకండ్‌ ఫైనలిస్ట్‌ పోటీలో భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్‌, సంజనా మిగిలారు. తాజా ప్రోమోలో తక్కువ పాయింట్లతో చివర్లో ఉన్న భరణి ఆటలో నుంచి అవుట్‌ అయిపోయాడు.భరణి కంటతడిదీంతో కన్నీళ్లు పెట్టుకున్న భరణి.. తన దగ్గరున్న పాయింట్స్‌ సగం తనూజకు ఇచ్చేశాడు. చివరకు ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరికి పెట్టిన పలు గేమ్స్‌లో చివరకు తనూజ గెలిచి సెకండ్‌ ఫైనలిస్ట్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే తనూజ తాను డైరెక్ట్‌గా ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.తనూజ గొప్ప నిర్ణయంప్రేక్షకుల ఓట్ల ప్రకారమే తాను ముందుకు సాగుతానంది. ఈ వారం జనాలు తనను సేవ్‌ చేస్తేనే ఫైనల్స్‌కు వెళ్తానని, ఇమ్యూనిటీ వద్దని తిరస్కరించిందని సమాచారం. ఇదే నిజమైతే తనూజకు నేటి ఎపిసోడ్‌ మరింత ప్లస్‌ అవడం ఖాయం. కాకపోతే ఈ సెకండ్‌ ఫైనలిస్ట్‌ అనే అవకాశం భరణి, సంజనాలలో ఒకరికి వచ్చుంటే వారికి ఎంతో ఉపయోగపడేది. చదవండి: నీ ఏడుపు ఫేక్‌.. ప్రేక్షకుల కామెంట్స్‌తో తనూజ షాక్‌

Ranveer Singh Dhurandhar Movie Banned In Gulf Countries6
రణ్‌వీర్‌ సింగ్ దురంధర్.. ఆ దేశాల్లో బ్యాన్..!

రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాకిస్తాన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ కావడంతో ఒక్కసారిగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి అంతర్జాతీయంగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇందులో పాకిస్తాన్‌ను నెగెటివ్‌గా చూపించారంటూ అరబ్ దేశాలు దురంధర్‌పై నిషేధం విధించాయి. ఈ మూవీని బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ, యూఏఈ బ్యాన్ చేశాయి. దీంతో ఆయా దేశాల్లో దురంధర్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రంలో పాక్‌కు వ్యతిరేకంగా ప్రస్తావనలు ఉన్నాయనే అరబ్ దేశాలు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్‌ దేశాల్లోని థియేటర్లలో దురంధర్ విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ కొన్నిచోట్ల అసలు అనుమతులు కూడా రాలేదు. దీంతో చివరికీ కొన్ని థియేటర్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. రూ.200 కోట్ల దిశగా దురంధర్ దూసుకెళ్తోంది.

Tollywood actor Thiruveer Shares Good News with Fans7
తండ్రైన టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో అభిమానులను మెప్పించాడు. అంతేకాకుండా జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇటీవలే రిలీజైన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిత్రంతో అభిమానులను అలరించారు. టాలీవుడ్‌లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా తిరువీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రైనట్లు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. నాయినొచ్చిండు అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తిరువీర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్. తెలంగాణకు చెందిన తిరువీర్ 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతను.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, పరేషాన్, మోక్షపటం చిత్రాల్లో నటించారు.గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తిరువీర్. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఆగస్టులో తన తిరువీర్ భార్య కల్పన సీమంతం వేడుక చేశారు. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది. నాయినొచ్చిండు ❤️ pic.twitter.com/7IzM5OAE03— Thiruveer (@iamThiruveeR) December 12, 2025

Vidhu Lead Role in Dhanush Rejected 29 Movie8
ధనుష్‌ రిజెక్ట్‌ చేసిన మూవీ.. హీరోగా రెట్రో నటుడు

ధనుష్‌ నటించాల్సిన చిత్రం వర్దమాన నటుడు విదూను వరించింది. ఎస్‌.కార్తికేయన్‌కు చెందిన స్టోన్‌ బెంచ్‌ స్టూడియోస్‌, దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌కు చెందిన స్క్వాడ్‌ స్టూడియో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 29 అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రానికి రత్నకుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు పేట, జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విదూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా ప్రీతీ అస్రాణి నటిస్తున్నారు. ఏడేళ్ల తర్వాతశ్యాన్‌ రోల్డణ్‌ సంగీతాన్ని, మహేశ్‌ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత కార్తికేయన్‌ మాట్లాడారు. తమ చిత్ర నిర్మాణ సంస్థను 2017 ప్రారంభించి తొలి ప్రయత్నంగా మేయాదమాన్‌ చిత్రాన్ని నిర్మించామన్నారు. ఆ తరువాత 17 చిత్రాలు చేశామని చెప్పారు. దర్శకుడు రత్నకుమార్‌తో సుమారు 7 ఏళ్ల తరువాత ఇప్పుడు 29 చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. 30లోకి అడుగుపెడితే..కొంత కాలం క్రితం ఆయన ఈ కథ చెప్పగా దయచేసి ఈ చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలని కోరానన్నారు. చిత్ర షూటింగ్‌ 85 శాతం పూర్తి అయ్యిందనీ, మరో నాలుగు రోజులు షూటింగ్‌ నిర్వహిస్తే పూర్తి అవుతుందన్నారు. చిత్ర దర్శకుడు రత్నకుమర్‌ మాట్లాడుతూ.. మనిషి వయసు 29 పూర్తి అయ్యి 30లోకి అడుగు పెడితే జాతకం మారిపోతుందన్నారు. అలాంటి ఒక యువకుడి ఇతివృత్తంతో తెరెకెక్కిస్తున్న చిత్రం 29 అని చెప్పారు. ధనుష్‌ రిజెక్ట్‌దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ.. ఈ కథను మేయాదమాన్‌ చిత్రం పూర్తి అయిన తరువాత దర్శకుడు రత్నకుమార్‌ తనకు చెప్పారన్నారు. దీన్ని నటుడు ధనుష్‌కు చెప్పగా ఆయని చాలా బాగుందన్నారు, కాకపోతే తాను ఇప్పుడు యాక్షన్‌ కథా చిత్రాల్లో నటించడం వల్ల ఇందులో నటించలేనన్నారు. యువ నటుడు నటిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారన్నారు. హీరోగాఅలా ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రత్నకుమార్‌.. విదూతో ఆడిషన్‌ నిర్వహించారన్నారు. జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ చిత్రానికి ముందయితే ఈ మూవీలో విదూని హీరోగా తాను అంగీకరించేవాడిని కాదన్నారు. జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌, రెట్రో చిత్రంలో నటించి అతను తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారని చెప్పారు.

Bigg Boss 9 Telugu: Thanuja Puttaswamy Got Second time Vote Appeal9
మీ ఏడుపు ఫేక్‌.. ప్రేక్షకుల కామెంట్స్‌తో తనూజ షాక్‌!

లీడర్‌ బోర్డులో చివర్లో ఉన్న సుమన్‌ ఆటలో అవుట్‌ అయ్యాడు. అతడి దగ్గరున్న రూ.1 లక్షలో సగం, తన స్కోర్‌లో సగం ఎవరికైనా పంచొచ్చని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఆయనకు వెంటనే భరణి పేరు తట్టింది.. కానీ, భరణి మాత్రం సంజనాకు ఇవ్వమని సలహా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (డిసెంబర్‌ 11వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..భరణిని సైడ్‌ చేశారుఅలా సుమన్‌ ఇచ్చిన పాయింట్ల దెబ్బకు సంజనా లీడర్‌ బోర్డులో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక తర్వాత గేమ్‌లో మెజారిటీ ఇంటిసభ్యులు కలిసి భరణిని పక్కనపెట్టి గేమ్‌ ఆడారు. అలా జోకర్‌ గేమ్‌లో ఇమ్మూ, సంజనా గెలవగా మిగతావాళ్లు ఒక్క పాయింట్‌ కూడా స్కోర్‌ చేయలేకపోయారు. లీడర్‌ బోర్డులో చివర్లో ఉన్న పవన్‌.. తన దగ్గరున్న రూ.1,50,000 అలాగే 150 పాయింట్లలో సగం ఒకరికి ఇచ్చి ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు బిగ్‌బాస్‌. మళ్లీ భరణి టార్గెట్‌అతడు తన పాయింట్స్‌ అన్నీ తనూజకు ఇవ్వడంతో ఆమె లీడర్‌ బోర్డులో టాప్‌లో నిలిచింది. ఇక నెక్స్ట్‌ గేమ్‌లో ఒకర్ని తీసేయాలని బిగ్‌బాస్‌ చెప్పగానే మెజారిటీ ఇంటిసభ్యులు మళ్లీ భరణిని తీసేశారు. మిగిలిన సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్‌ బ్యాలెన్స్‌ గేమ్‌ ఆడారు. ఈ ఆటలో ఇమ్మూ గెలవగా తనూజ, సంజనా తర్వాతి స్థానాల్లో వచ్చారు.ఓట్‌ అప్పీల్‌అయితే లీడర్‌ బోర్డులో మాత్రం తనూజ ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉండగా.. ఇమ్మూ సెకండ్‌, సంజనా మూడో స్థానంలో ఉన్నారు. దీంతో బిగ్‌బాస్‌ ఓట్‌ అప్పీల్‌ కోసం తనూజతో పాటు ఇంకెవరు ముందుకు రావాలనే నిర్ణయాన్ని తనూజ చేతిలో పెట్టాడు. అలా తనూజ.. సంజనాను ఎంచుకుంది. వీరిద్దరూ గార్డెన్‌ ఏరియాలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ప్రేక్షకులు తనూజకే ఓటేయడంతో ఆమె ఓట్‌ అప్పీల్‌ చేసుకుంది. తెలిసో తెలియక తప్పు చేసుంటే క్షమించమని కోరింది. మీ ఏడుపు ఫేక్‌తర్వాత జనాలడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీ ఏడుపు నిజమనిపించదు, ఫేక్‌ అని ఓ వ్యక్తి అనగా.. నేను కావాలని ఎమోషనల్‌ అవను, అది దానంతటదే వస్తుంది, ఇక్కడ ఏదీ ఫేక్‌గా ఉండదు అని చెప్పింది. భరణి నాన్న.. వైల్డ్‌కార్డ్స్‌ వచ్చాక భరణి సర్‌ ఎందుకయ్యారు? అన్న ప్రశ్నకు తనూజ.. మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. సింపతీకాకపోతే మేము ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతీగా కనిపిస్తోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే నాన్న అనే పిలుపును పక్కనపెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్‌ను ముఖం మీదే ఫ్రెండ్‌ కాదని ఎలా అంటావని నిలదీశాడో వ్యక్తి. దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. వాడికి సపోర్ట్‌ చేయలేదా? అని రివర్స్‌లో అంటే.. మీరెక్కడ చేశారు మేడమ్‌? మీరే అందరి సపోర్ట్‌ తీసుకుంటారు అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు తనూజ ముఖం వాడిపోయింది.

Special Wishes To Super star rajinikanth Birthday occassion10
రజినీకాంత్ బర్త్ డే.. ప్రముఖ నిర్మాణ సంస్థ స్పెషల్ వీడియో!

తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూలీ మూవీతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం రజినీ జైలర్-2 మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో బ్లాక్‍ బస్టర్‌ మూవీ నరసింహాను రీ రిలీజ్ చేస్తున్నారు. తలైవాకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రముఖులు బర్త్‌ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.తాజాగా రజినీకి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. రజనీ సినిమాల్లోని డైలాగులతో మ్యాష్‌అప్‌ వీడియోను రూపొందించి పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపింది. ఒక రేంజ్‌ తర్వాత మాటలు ఉండవు.. అర్థమైందా రాజా.. డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉ‍న్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.సూపర్‌హిట్‌ సినిమాకు సీక్వెల్‌..రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన నరసింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 1999లో విడుదలైన ఈ సినిమా తలైవా కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీ రిలీజై ఇప్పటికి 26 ఏళ్లు అవుతున్నా సోషల్‌ మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోసారి రమ్యకృష్ణ, రజినీకాంత్ అభిమానులను అలరించనుంది. వీరిద్దరు ప్రస్తుతం జైలర్‌ 2లో నటిస్తున్నారు.కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన నరసింహకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని రజినీకాంత్ ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీకి నీలాంబరి అనే టైటిల్‌ అని ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చలు జరుగుతున్నట్లు నరసింహ రీ రిలీజ్‌ ప్రచారంలో భాగంగా రజినీకాంత్ తెలిపారు.

Advertisement
Advertisement