Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Actor Sapthagiri Reacts The Rajasaab Movie Collection1
రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి

సెలబ్రిటీలు స్టేజీ ఎ‍క్కితే చాలా మాట్లాడేస్తుంటారు. కొన్నిసార్లు రాబోయే సినిమాల గురించి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటారు. మూవీ హిట్ అయిందా సరేసరి లేదంటే మాత్రం ఈ వ్యాఖ్యలు రివర్స్ కొడుతుంటాయి. రీసెంట్ టైంలో శివాజీ, స్టేజీపై మాట్లాడుతూ మహిళలపై ఎలాంటి కామెం‍ట్స్ చేశాడో చూశాం. ఇప్పుడు కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ 'రాజాసాబ్' గురించి ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.'మంచి మనసున్న మారాజు మారుతి. మకుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి తీసిన ఈ 'రాజాసాబ్' సినిమా.. ఈ సంక్రాంతికి గులాబ్ జామ్‌లు గలగలాడించకపోతే.. అలాగే కోడి గుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్లు అవుతాయి జాగ్రత్త. రాసిపెట్టుకోండి. 'ద రాజాసాబ్'.. రూ.2000 కోట్లు కొల్లగొట్టకపోతే నేను ఇస్తా నా డబ్బులు, ఆ డబ్బులు మనందరం కలిసి ఇద్దాం' అని సప్తగిరి కామెంట్స్ చేశాడు. కచ్చితంగా వీటిపై మీమ్స్ గానీ ట్రోల్స్ గానీ రావడం గ్యారంటీ.'రాజాసాబ్' సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతమందించాడు. మారుతి దర్శకుడు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన పూర్తిస్థాయి కమర్షియల్ మూవీ ఇది. జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. చూడాలి మరి ఈ మూవీ సప్తగిరి చెప్పినట్లు రూ.2 వేల కోట్లు సాధిస్తుందో లేదో?#TheRajaSaab రెండు వేల రూపాయలు కొల్ల కొట్టే సినిమాఅలా అవ్వకపోతే నేను మీరు కలిపి ఇద్దాం..!#Prabhas pic.twitter.com/UlRXWfji7f— Telugu70mm (@Telugu70mmweb) December 27, 2025

Ashika Ranganath And Kriti Shetty Latest News2
ఆషికా అందాల జాతర.. దుబాయి ట్రిప్‌లో హెబ్బా

రెడ్ డ్రస్‌లో అందాల ఆరబోస్తున్న ఆషికాదుబాయి ట్రిప్ జ్ఞాపకాల్లో హెబ్బా పటేల్ఈ ఏడాది మెమొరీస్ షేర్ చేసిన పూజా కన్నన్చీరలో రాశీ సింగ్ నాభి గ్లామర్ డోస్పొట్టి స్కర్ట్‌తో స్టెప్పులేస్తున్న దివ్యభారతి View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)

Bad Girlz Movie Shows Increase3
'బ్యాడ్ గాళ్స్' షోలు పెంచుతున్నాం: దర్శకనిర్మాతలు

రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్యాడ్ గాళ్స్'. ఫణి ప్రదీప్ దర్శకత్వం వహించాడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిస్మస్ పండగకు థియేటర్లలోకి వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసింది.దర్శకుడు ఫణి ప్రదీప్(మున్నా) మాట్లాడుతూ .. 'బ్యాడ్ గాళ్స్' నిడివి విషయంలో చిన్నది కానీ కంటెంట్ విషయంలో చాలా పెద్దది. ఆడియెన్స్ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పోటీలో వచ్చినా హిట్ కొడతామని మా నిర్మాతలు నమ్మారు. ఇప్పుడే అదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో వాళ్లు ఉన్నారు. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. జాతిరత్నాలు మూవీని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది అని చెప్పాడు.

Prakash Raj Reacts On Tollywood Ticket Rate Hikes4
టికెట్ రేట్లు ఎ‍క్కువ ఉంటే సినిమాలు చూడకండి: ప్రకాశ్ రాజ్

టాలీవుడ్‌లో ఈ ఏడాది ఏదైనా ఓ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే అది టికెట్ రేట్ల గురించే. పెద్ద సినిమాల రిలీజయ్యే ప్రతిసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. కొన్నిసార్లు అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా అభిప్రాయాలు వినిపించాయి. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం టికెట్ ధరలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్)సీఐటీయూ మహాసభల కోసం వైజాగ్ వచ్చిన ఈ నటుడు.. మీడియాతో మాట్లాడారు. మహిళలపై శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యల గురించి ఘాటుగా స్పందించారు. పురుషుల వల్ల మహిళలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోంది, ఓ వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయంలో అనసూయకే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశాడని, అది ముమ్మాటికీ తప్పే అని చెప్పుకొచ్చాడు.ఇలా మాట్లాడుతున్న టైంలోనే.. సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయి? దీనిపై మీ స్పందన ఏంటని ప్రకాశ్ రాజ్‌ని అడగ్గా.. అయితే సినిమాలు చూడకండి. ఎవరి వ్యాపారం వాళ్లది అని కుండబద్దలు కొట్టేశాడు. చూస్తుంటే ఈ వ్యాఖ్యలు కచ్చితంగా వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడిని థియేటర్‌కి ఎలా తీసుకురావాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటే.. ఈ నటుడు మాత్రం ఇలా ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా)"Don't watch Films if you think they're Expensive. Cinema is a Business."- #PrakashRaj pic.twitter.com/zYYgejLF96— Movies4u Official (@Movies4u_Officl) December 27, 2025

Mohanlal Big Budget Cinemas Flop in December5
మోహన్‌లాల్‌కు కలిసిరాని డిసెంబర్‌.. డిజాస్టర్‌ తప్పదా!

యంగ్‌ హీరోలను సైతం అబ్బురపరిచేలా వరుస విజయాలు అందుకున్నాడు సీనియర్‌ హీరో మోహన్‌లాల్‌. ఒకటా రెండా.. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ హిట్లే! కానీ చివరగా ఓ డిజాస్టర్‌ సినిమాతో 2025కి ముగింపు పలుకుతున్నాడు. అదే విషాదకరం! మరో విషయమేంటంటే.. డిసెంబర్‌లో రిలీజైన సినిమాలు ఆయనకు అస్సలు అచ్చిరావడం లేదు! అదెలాగో ఓసారి చూసేద్దాం...అన్నీ హిట్లే..తెలుగులో హీరోలు ఏడాదికో, రెండేళ్లకోసారో సినిమా చేస్తారు. కానీ, మలయాళంలో అలా కాదు.. వాళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలైనా ఫటాఫట్‌ షూట్‌ చేస్తుంటారు, ఆ వెంటనే రిలీజ్‌ చేస్తారు. అలా 2025లో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఎల్‌ 2: ఎంపురాన్‌, తుడరుమ్‌, హృదయపూర్వం.. బాక్సాపీస్‌ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టి హిట్లుగా నిలిచాయి. కానీ రూ.70 కోట్లు పెట్టి తీసిన వృషభ మూవీ మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా చతికిలపడింది. మొదటిరోజు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.లుక్‌పై విమర్శలుఅదేంటో కానీ డిసెంబర్‌ నెల మోహన్‌లాల్‌కు ఇటీవలి కాలంలో పెద్దగా కలిసిరావడం లేదు. 2018 డిసెంబర్‌ ఓడియన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్‌లాల్‌. కలెక్షన్స్‌పరంగా సినిమా మంచి హిట్టయినప్పటికీ మోహన్‌లాల్‌ లుక్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. 2021 డిసెంబర్‌లో రూ.100 కోట్ల బడ్జెట్‌ మూవీ మరక్కర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్‌లాల్‌. సగం కూడా రాలే!ఈ సినిమా రిలీజ్‌కు ముందే మూడు జాతీయ అవార్డులు అందుకుంది. భారీ ఓటీటీ డీల్స్‌ వచ్చినా కూడా థియేటర్‌లోనే ముందుగా రిలీజ్‌ చేయాలని సినిమాటీమ్‌ పట్టుబట్టింది. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మరక్కర్‌ బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్‌లో సగం కూడా తిరిగి రాలేదు.దర్శకుడిగా డిజాస్టర్‌వందలాది సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించిన మోహన్‌లాల్‌ బరోజ్‌ చిత్రంతో దర్శకుడిగా మారాడు. 2024 డిసెంబర్‌ 25న విడుదలైన ఈ మూవీ ఘోరంగా చతికిలపడింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కలెక్షన్స్‌ రాబట్టింది.ఈసారి కూడా పరాజయమే!సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీ (డిసెంబర్‌ 25న) వృషభతో పలకరించాడు ఈ స్టార్‌ హీరో. కలెక్షన్స్‌ అంతంతమాత్రంగానే ఉన్నాయి. బుకింగ్స్‌ పేలవంగా ఉన్నాయి. దీంతో ఈసారి కూడా మళ్లీ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మరి మోహన్‌లాల్‌ ఈ డిసెంబర్‌ సెంటిమెంట్‌ ఎప్పుడు బ్రేక్‌ చేస్తాడో చూడాలి!

Telugu Small Budget Movies Hurdles6
ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా

ఓ రాజ్యం ఉంది. అందులో రాజు, రాణి, మంత్రి, సైనికులు, ప్రజలు.. ఇలా అందరూ ఉన్నారు. రాజుకి అందరూ జేజేలు పలుకుతారు. కానీ సైనికులు లేకపోతే ఆయనకు విలువ ఎక్కడిది? ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది? టాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే తయారైనట్లు కనిపిస్తోంది! రాజు లాంటి స్టార్ హీరోల మూవీస్‌ని పట్టించుకుంటున్న ప్రేక్షకుడు.. సైనికుడు లాంటి చిన్న సినిమాని లైట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ దీనికి కారణమేంటి? ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లు సినిమాలు చేసేవారు. కానీ ఎప్పుడూ పెద్దా చిన్నా అని తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటినుంచి రోజురోజుకీ టాలీవుడ్‌లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వచ్చింది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.ఒకప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమా మాత్రమే. దీంతో వీకెండ్ వస్తే చాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. చిన్నపెద్దా మూవీస్ అన్నీ చూసేవారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అనగానే ఎలానూ నెలరోజులకు ఓటీటీల్లోకి వచ్చేస్తాయిగా, ఇంట్లో చూసుకోవచ్చులే అని చాలామంది.. ముందే ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే మీడియం బడ్జెట్ చిత్రాల్ని థియేటర్లలో రిలీజ్ చేసినా సరే వాటికి పెద్దగా ఆదరణ ఉండట్లేదు.గీతా ఆర్ట్స్, సితార, మైత్రీ, ఎస్వీసీ లాంటి పెద్ద సంస్థలు నిర్మించే మీడియం బడ్జెట్ సినిమాలకు కాస్తోకూస్తో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లే వాళ్లు ప్రమోషన్ చేస్తుంటారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడరు. స్టార్స్‌తోనూ ప్రమోషన్స్ చేయిస్తారు. దీంతో ఆయా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చే చిత్రాలకు మాత్రం అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. మిగిలిన వాటి వైపు ఆడియెన్స్ చూడటమే గగనమైపోతోంది.మూవీ టీమ్ చేసే కొన్ని పనులు కూడా చిన్న సినిమాలని ప్రేక్షకులు లైట్ తీసుకునేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడమే లేటు.. మా మూవీ తోపు, బంపర్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే పర్లేదు లేదంటే మాత్రం.. వీటిని చూసి నమ్మి, థియేటర్‌కి వెళ్లిన చాలామంది.. పలుమార్లు మోసపోయారు. ఇలా జరిగిన తర్వాత చిన్న సినిమా అంటే ఇంతే అని ఓ అభిప్రాయం వాళ్లకు కచ్చితంగా ఏర్పడుతుంది.చిన్న చిత్రాలంటే బడ్జెట్ తక్కువే. అందుకు తగ్గట్లే క్వాలిటీ, కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీల్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు.. మన నిర్మాతలు తీసే రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలకు ఎందుకు వెళ్తాడు? ఈ విషయంపై దర్శకనిర్మాతలు కచ్చితంగా దృష్టిపెట్టాలి. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే.. పరుగెత్తుకుని వచ్చి చూసేసే రోజులు కావివి. కామెడీ కావొచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావొచ్చు సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటేనే ఆడియెన్స్, థియేటర్‌కి వచ్చి చూస్తారు. లేదంటే కనీసం ఆ వైపు కూడా చూడరు.చిన్న సినిమాల్లో స్టార్స్ పెద్దగా ఉండరు. సదరు హీరో లేదా హీరోయిన్ కోసం థియేటర్‌కి వెళ్లి చూడాలా? అని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా అనుకుంటాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఇంతింత టికెట్ రేట్లు పెట్టి చూస్తారు. వాటికే మొత్తం ఖర్చు పెట్టేస్తే చిన్న చిత్రాలు వచ్చినప్పుడు చూసేందుకు డబ్బులు ఎక్కడుంటాయి?ఈ వీకెండే తీసుకుందాం. ఒకటి రెండు కాదు అరడజనుకు పైగా చిన్న సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. వీటిలో ఒక్కదానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటికి మిక్స్‌డ్, నెగటివ్ టాక్ వచ్చింది. ఇలా ముకుమ్మడి విడుదల కూడా మీడియం బడ్జెట్ చిత్రాల్ని చంపేస్తోందని చెప్పొచ్చు. ఇలా చాలా చాలా అంశాలు టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు రోజురోజుకీ శాపంగా మారుతున్నాయా అనిపిస్తోంది!

Bigg Boss 9: Sanjjanaa Galrani Shares Experience About Bigg Boss Show7
‘బిగ్ బాస్’కి రుణపడి ఉంటా : సంజన

"ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని,కెరీర్ ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్ బాస్ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్ లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్ కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని సంజనా ప్రకటించారు. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె పేర్కొన్నారు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై"లో త్రిష చెల్లెలిగా నటించిన సంజనా.... ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించారు. తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజనా అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన 'విజనరీ వౌస్' కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

2025 Roundup: Who Become Overnight Stars In Social Media8
2025లో 'వైరల్‌' వయ్యారి వీళ్లే..

ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్‌లో వైరల్‌ వయ్యారి ఒకటి. యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్‌.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్‌ అయింది. ఈ సాంగ్‌లో.. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్‌ బ్లోయింగు.. ఫాలోవర్స్‌ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్‌ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్‌ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్‌లో పడి వైరల్‌ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన మహిళలెవరో చూసేద్దాం..మోనాలిసామోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్‌. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్‌ అయిపోయింది. ఒక సాంగ్‌లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది.ఆర్యప్రియ భుయన్‌కేవలం ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో వైరల్‌ అయిపోయింది ఆర్యప్రియ భుయన్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్‌ ధోనీ అవుట్‌ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. కెమెరామన్‌ దాన్ని క్యాప్చర్‌ చేయడం.. అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది.గౌరీ స్ప్రాట్‌బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్‌. ముంబైలో ఓ సెలూన్‌ నడుపుతూ ప్రైవేట్‌ లైఫ్‌ గడుపుతున్న గౌరీ.. ఆమిర్‌తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్‌గా మారింది.అలీషా ఓరీఈమె కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌ ద్వారా క్లిక్‌ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌) అభిమాని. వెస్ట్‌ ఇండీస్‌ క్రికెట్‌ దిగ్గజం డ్వేన్‌ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్‌ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్‌ చేశారు. అలీషా మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌. తను 2021లో మిసెస్‌ ఇండియా లీగసీ టైటిల్‌ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్‌ యూనివర్స్‌ 2022 పోటీల్లో మిసెస్‌ పాపులర్‌ 2022 టైటిల్‌ అందుకుంది. Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025 మహికా శర్మక్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్‌తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్‌తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్‌ అయింది.చదవండి: 'విగ్‌ కావాలా? ధురంధర్‌ నటుడికి పొగరు తలకెక్కింది'

Master Mahendran Nilakanta Movie Teaser Release Highlights9
‘నీలకంఠ’.. చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోలేరు

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ - నాకు సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని "నీలకంఠ" ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొన్నాం. షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలు దాటుకుని మీ ముందుకు మా చిత్రాన్ని జనవరి 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా "నీలకంఠ" చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ - నేను చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరిక మా డైరెక్టర్ శ్రీనివాస్, వేణుగోపాల్ వారి వల్ల నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చేందుకు మా టీమ్ అందరు కృషి చేశారు. మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. జనవరి 2న "నీలకంఠ" అనే మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఇతర భాషల చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. అందుకే మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ - నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. ఇందులో మంచి ఫైట్స్, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ "నీలకంఠ" సినిమాతో నాకు ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

Salman Khan Battle Of Galwan Movie Teaser10
చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్

గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి అస్సలు కలిసి రావట్లేదు. చేసిన సినిమా చేసినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రెండ్‌కి తగ్గట్లు దేశభక్తి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' అనే మూవీలో నటిస్తున్నాడు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్‌' ఇమ్మాన్యుయేల్)టీజర్‌లో గాల్వాన్ లోయని.. యుద్ధభూమిలో సల్మాన్‌ని మాత్రమే చూపించారు. ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకుడు. ఇతడు గతంలో రామ్ చరణ్‌తో 'తుఫాన్' అనే మూవీ తీశాడు. ఇది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలిసిందే. దీని తర్వాత హసీనా పార్కర్ అనే చిత్రం, క్రాక్ డౌన్, ముమ్ బాయ్ అనే వెబ్ సిరీస్‌లు చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మూవీతో మళ్లీ దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు సల్మాన్ ఖానే నిర్మాత కూడా. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.‌అయితే 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' సినిమా.. కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఈయన.. పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేశారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఏడాదిన్నరగా విధులు నిర్వర్తించారు. భారత్-చైనా సైనిక బలగాల ఘర్షణ సందర్భంగా 2020లో అమరులయ్యారు. మూవీ రిలీజైతే ఈయన జీవితం ఆధారంగా సినిమా తీశారా లేదా అనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. సూర్య కొత్త సినిమా స్టోరీ ఇదే)

Advertisement
Advertisement