Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Karnataka AAP Party Women Leaders Complain On Toxic movie unit1
'టాక్సిక్' సినిమా దర్శకురాలిపై ఫిర్యాదు

కన్నడ స్టార్‌ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’.. వారం క్రితం టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఒక ఇంటిమేట్‌ సీన్‌ కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది. తాజాగా చిత్ర నిర్మాత, దర్శకురాలిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టీజర్‌ బాగుందని అందులో యశ్‌ లుక్‌ అదిరిపోయిందని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ, బయట కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా.., కారులో యశ్‌తో పాటు మరో యువతిల మధ్య ఒక ఇంటిమేట్‌ సీన్‌ ఉంటుంది. ఈ సన్నివేశంపై పలు అభ్యంతరాలు వస్తున్నాయి.కర్ణాటకలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా విభాగం ఈ టీజర్‌పై భగ్గుమంది. దీంతో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీజర్‌లోని కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని మహిళలు, పిల్లలతో పాటు సాంస్కృతిక విలువలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్ర నిర్మాతతో పాటు దర్శకురాలిపై చర్యలు తీసుకోవాలన్నారు.విమర్శలరు రావడంతో టీజర్‌పై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ స్పందించారు. అయితే, ఆమె చాలా వ్యంగ్య ధోరణిలో కామెంట్‌ చేశారు. నేటి సమాజం ఇప్పటికీ మహిళల ఆనందం, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చల దశలోనే ఉందని పేర్కొన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నా అన్నారు. ఆ సీన్‌ను శృంగార దృశ్యంగా చూడకిండి అంటూ హితవు పలికారు. మహిళల అనుభవాలతో పాటు వారి ఎంపికలను ప్రతిబింబించే కోణంలో చూడాలని గీతూ మోహన్‌దాస్ చెప్పారు. టాక్సిక్‌ సినిమా మార్చి 19న విడుదల కానుంది.

Film Director Sudha Kongara will be movie with Dhruv Vikram2
'పరాశక్తి' తర్వాత యంగ్‌ హీరోతో సుధ కొంగర చిత్రం

ఆమె చేసిందే తక్కువ చిత్రాలు.., కానీ, దర్శకురాలు సుధా కొంగర మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కెరీర్‌ ప్రారంభించింది తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఉన్నత స్థాయికి చేరింది తమిళ పరిశ్రమలో.. ఆంధ్ర అందగాడు చిత్రం ద్వారా 2008లో దర్శకురాలిగా పరిచయం అయిన ఈమె తరువాత ద్రోహి, ఇరుదు చుట్రు, తెలుగులో గురు , సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం పరాశక్తి. నటుడు రవి మోహన్‌ ప్రతి నాయకుడిగా అధర్వ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా నటి శ్రీ లీల కథానాయకిగా కోలీవుడ్‌ కు పరిచయం అయ్యారు. సంక్రాంతి సందర్భంగా గత 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. దీంతో దసరాలో సుధా కొంగర తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకు బదులు కూడా సమాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతోంది. యువ నటుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా నటించనున్న చిత్రానికి సుధాకర్‌ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారంలో సారాంశం. ఈమె ఇంతకుముందే నటుడు ధృవ్‌ విక్రమ్‌కు కథను చెప్పినట్లు, అది ఆయనకు నచ్చినట్లు సమాచారం. అయితే చిత్రాల విషయంలో నిదానమే ప్రధానం అని భావించే మహిళా దర్శకురాలు సుధా కొంగర తన నూతన చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల బైసన్‌ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు విక్రమ్‌ తదుపరి నటించే చిత్రం పైన ఆసక్తి నెలకొంది.

Prabhas facing severe criticism on social media for Raja Saab Body double3
రాజాసాబ్ 'బాడీ డబుల్‌' ఎఫెక్ట్‌.. ప్రభాస్‌పై ట్రోలింగ్

‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్‌ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్‌మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్‌తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్‌లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్‌మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే.

Tollywood actresses Social Media Updates goes Viral in instagram4
పార్టీలో జాన్వీ కపూర్ చిల్... గోల్డెన్ గ్లోబ్‌లో ప్రియాంక చోప్రా లుక్..!

మలేసియాలో టాలీవుడ్ నటి రోహిణి..పార్టీలో చిల్ అవుతోన్న జాన్వీ కపూర్..బికినీ పోజుల్లో బాలీవుడ్ బ్యూటీ నికితా శర్మ..గోల్డెన్ గ్లోబ్స్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా..బీచ్‌లో ఫ్యామిలీతో బిపాసా బసు చిల్..సముద్రంలో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta)

Upasana Konidela Congratulates To Her Mamayya For Movie Hit5
కంగ్రాట్స్ మామయ్య.. చిరుకు మెగా కోడలు స్పెషల్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్‌ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచి హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. పలువురు టాలీవుడ్‌ సినీతారలు మూవీ టీమ్‌ను అభినందిస్తున్నారు.తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల సైతం మనశంకర వరప్రసాద్‌కు అభినందనలు తెలిపింగి. 'ఇది మెగా సంక్రాంతి.. హృదయపూర్వక అభినందనలు మామయ్య' అంటూ ఈ సినిమాలోని ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేసింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ‍అవుతున్నారు. కాగా.. ఈ చిత్రానికి మొదటి షో నుంచే సూపర్ హిట్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఈ సినిమాను ఏఎంబీ సినిమాస్‌లో రామ్ చరణ్ వీక్షించారు. It’s a MEGA SANKRANTHI hearty congratulations Mamaya @KChiruTweets @NayantharaU @sushkonidela ❤️❤️❤️❤️❤️🧿🙌 pic.twitter.com/xFhxbcV8Sc— Upasana Konidela (@upasanakonidela) January 12, 2026

Anaganaga Oka Raju Movie: Andhra To Telangana Song Released6
'ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా!' సాంగ్‌ రిలీజ్‌

సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాలు దిగాయి. మరో రెండు రోజుల్లో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రిలీజవుతోంది. మీనాక్షి చౌదని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమవరం బాల్మా.. పాటకైతే నవీన్‌ పొలిశెట్టి చాలాసార్లు స్టెప్పులేశాడు. మూడో సాంగ్‌ రిలీజ్‌తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. అదే ఆంధ్రా టు తెలంగాణ సాంగ్‌. 'నాలోన సోకులున్నయ్‌, సొంపులున్నయ్‌ సానా.. నీతానా సొమ్ములుంటే ఎల్దాం ఎక్కడికైనా.. ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం సమకూర్చాడు. ధనుంజయ్‌ సీపన, సమీరా భరద్వాజ్‌ కలిసి ఆలపించారు. ఈ స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌ శాన్వి మేఘన నవీన్‌ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: బాస్‌ చింపేశాడు.. మెగాస్టార్‌పై అల్లు అరవింద్‌ ప్రశంసలు

Celebrity Cricket League Matches Schedule Announced7
ఓవర్ టూ గ్రౌండ్‌.. సినీతారల క్రికెట్ లీగ్‌ వచ్చేస్తోంది

ప్రతి ఏటా సినిమాలతో మాత్రమే కాదు.. క్రీడలతోనూ అలరించేందుకు హీరోలు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు తెరపై అలరించిన స్టార్స్ గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు. సినీ హీరోస్ అంతా అలరించే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మళ్లీ వచ్చేస్తోంది. ఈ ఏడాది సీజన్‌తో అభిమానులను అలరించనున్నారు.ఈ ఏడాది సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌) జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. వైజాగ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో తెలుగు వారియర్స్‌ తన తొలి మ్యాచ్‌ భోజ్‌పురి దబాంగ్స్‌తో తలపడనుంది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌ వేదికగా జరగనున్నాయి. C-C-L- 2-0-2-6 @ccl @TeluguWarriors1 It’s time for Some Cricket 🏏 VIZAG - 16th JAN 6.30 PM VIZAG - 17th JAN 6.30 PM #Vizag #cricket #thaman #Teluguwarriors #Ccl2026 pic.twitter.com/2doMxidzFD— thaman S (@MusicThaman) January 10, 2026 The countdown begins as the Celebrity Cricket League 2026 takes centre stage from January 16th 🔥🏏Eight teams. Big rivalries. Unmatched Sportainment.🎟️ Book your tickets now and be there from ball one!https://t.co/zCQUwXWpBvhttps://t.co/CnNrNFcwm9@Karbulldozers… pic.twitter.com/r1IQFbK4LO— CCL (@ccl) January 12, 2026

Ravi Teja Movie Team Visit Kanipakam Vinayaka Temple8
కాణిపాకం వినాయకుడి సేవలో రవితేజ మూవీ టీమ్

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టీమ్ కాణిపాకం వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారిలో హీరోయిన్స్ ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి, డైరెక్టర్ కిశోర్ తిరుమల కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రవితేజ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రవితేజ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళే భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీమియర్స్‌ కూడా ప్రదర్శించనున్నారు. Blessed to seek the divine blessings of Lord Kanipakam Vinayaka alongside the talented @AshikaRanganath and our amazing #BMW movie team! Starting this new journey with positivity, laughter, and Ganapati Bappa's grace ahead of our Sankranthi release on 13th Jan! Here's a… pic.twitter.com/L45cM9g1NQ— Dimple parody (@hayathidimple) January 12, 2026

Allu Aravind Review on Chiranjeevi Mana Shankara Vara Prasad Movie9
బాస్‌ చింపేశాడు.. చిరంజీవిపై అల్లు అరవింద్‌ ప్రశంసలు

మెగాస్టార్‌ చిరంజీవి మన శంకరవరప్రసాద్‌ గారు మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్టు అందుకోబోతున్నాడు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్‌ టాకే వినిపిస్తోంది. వింటేజ్‌ చిరును చూశామని అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాడు.బాస్‌ ఈజ్‌ బాస్‌అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. సినిమా చూసి చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. బాస్‌ చింపేశాడు. బాస్‌ ఈజ్‌ బాస్‌. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం మళ్లీ ఇన్నాళ్లకు కలిగింది. పాత చిరంజీవిని చూసే అవకాశం దొరికింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. వింటేజ్‌ చిరును తీసుకొచ్చారు. చిరంజీవి- వెంకటేశ్‌ కాంబినేషన్‌ అదిరిపోయింది. జనాలకు ఇది పైసా వసూల్‌ మూవీ అని ప్రశంసలు కురిపించాడు. మన శంకరవరప్రసాద్‌ గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Megastar Chiranjeevi Congratulates direcrtor anil Ravipudi10
కాంబో సూపర్ హిట్‌.. డైరెక్టర్‌కు మెగాస్టార్ అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగానే పాజిటివ్‌ టాక్ వస్తోంది. తొలి షో నుంచే ఆడియన్స్‌ నుంచి సూపర్ హిట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది.మనశంకర వరప్రసాద్‌ గారు మూవీకి హిట్ టాక్ రావడంతో ‍అనిల్ రావిపూడిని మెగాస్టార్‌ అభినందించారు. చిరు హత్తుకున్న వీడియోను డైరెక్టర్‌ అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ స్వీట్స్‌ తినిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ హిట్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెరిశారు. Cherishing moments with Megastar @KChiruTweets garu for team #ManaShankaraVaraPrasadGaru ❤️‍🔥✨Experience the BIGGEST FAMILY ENTERTAINER of Sankranthi 2026 in cinemas 💥#MegaBlockbusterMSG IN CINEMAS NOW ❤️ pic.twitter.com/dhcbC4L7pL— Shine Screens (@Shine_Screens) January 12, 2026 Sometimes, words aren’t needed at all ❤️🤗#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wWZ77wGUIH— Anil Ravipudi (@AnilRavipudi) January 12, 2026

Advertisement
Advertisement