ప్రధాన వార్తలు
మేలో స్టార్ట్
‘దేవర 2’ సినిమా ఈ ఏడాది సెట్స్పైకి వెళ్లనుంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘దేవర’. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి దేవర, కొడుకు వర పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్రాజ్, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో నటించారు.నందమూరి కల్యాణ్రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 2024 సెప్టెంబరులో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా ఎండింగ్లో ‘దేవర 2’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ను వెల్లడించారు నిర్మాత మిక్కిలినేని సుధాకర్. ‘‘దేవర’ సీక్వెల్ పనులు ఈ ఏడాది మేలోప్రారంభం అవుతాయి. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అంటూ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
మోహన్బాబుకి అరుదైన గౌరవం
ప్రముఖ నటుడు, నిర్మాత డా. మంచు మోహన్ బాబు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గవర్నర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్కత్తాలోని లోక్ భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సీవీ ఆనంద బోస్ చేతులమీదుగా ఈ అవార్డును తీసుకున్నారాయన. ‘‘మోహన్ బాబుగారు 50 సంవత్సరాల సినీ జీవితంలో కళామతల్లికి చేసిన సేవ, అట్టడుగు స్థాయి నుండి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదగడం, విద్య, దాతృత్వంలో సమాజంపై చెరగని ముద్ర వేశారు.ఆయన సినీ, వ్యక్తిగత జీవితం, క్రమశిక్షణ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ప్రత్యేకమైన చరిత్రను సృష్టించినట్టుగా నిలిచింది. కళకు, కళాకారులకు హద్దులు, భాషా సరిహద్దులు ఉండవని మరోసారి నిరూపించారు’’ అని మోహన్ బాబు తనయుడు, ‘మా’ అధ్యక్షుడు, హీరో విష్ణు మంచు తెలిపారు.
'కెజియఫ్' రేంజ్ కలలలో కుర్ర హీరో
టాలీవుడ్లో కొత్తగా అడుగుపెడుతున్న యంగ్ హీరోలలో చాలామంది "కెజియఫ్ రేంజ్"లో సినిమాలు చేయాలని కలలు కంటున్నారు. మేకప్ వేసుకున్న వెంటనే తమ రేంజ్ వేరే లెవల్ అని భావించే ఈ తరం హీరోలు తమ వ్యక్తిత్వం ఏమిటి? తమ వాయిస్, నటనకు ఏం సూటవుతాయి? ఎలాంటి పాత్రలు చేయాలనే విషయాలపై మాత్రం పెద్దగా ఆలోచించరు. అలా కొంతమంది హీరోలకు చేతిలో సినిమాలు లేకపోయినా "పాన్ ఇండియా" సినిమానే చేస్తానని, మాస్ సినిమానే చేస్తానని గట్టిగా చెప్పేస్తున్నారు. ఇక వారసత్వం ఉన్నవారైతే మరింత ధైర్యం చేస్తున్నారు. ఇటీవల ఓ నిర్మాత ఒక కథకు సరిపోతాడని భావించి ఓ చిన్న హీరోను కలిశాడు. కాగా సదరు హీరో నిర్మాతకు ఫోన్లో ఓ వీడియో చూపించాడు. తీరా చూస్తే అది అతనిపై తానే తయారు చేయించుకున్న గ్లింప్స్. అది కెజియఫ్ లెవెల్లో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి సినిమా చేద్దామని హీరో ప్లాన్ చెప్పాడట. అయితే దానికి సదరు నిర్మాత మాత్రం 'గ్లింప్స్ బాగుంది కానీ మీకు అంతగా సూట్ కాలేదు" అని చెప్పి వెళ్లిపోయాడని సమాచారం.కెజియఫ్ లాంటి చిత్రాలు అందరికీ సెట్ కావు. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే చేస్తానని కలలతో కాలక్షేపం చేస్తున్న కుర్ర హీరోలు, ఏజ్ బార్ అయ్యాకే వాస్తవం గ్రహిస్తారు. కానీ అప్పటికే తన తండ్రి ఇచ్చిన ఆస్తి కూడా ఖర్చయిపోయి, కెరీర్లో స్థిరపడే అవకాశాలు తగ్గిపోతాయి. టాలీవుడ్లో కొత్తగా వస్తున్న హీరోలు తమకు సూటయ్యే పాత్రలు, కథలు ఎంచుకుంటేనే నిలబడగలరనే వాస్తవాన్ని గ్రహించాలి. లేకపోతే "కెజియఫ్ రేంజ్" కలలతోనే వారి కెరీర్ ముగిసే ప్రమాదం ఉంది.
ప్రముఖ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ రిటైర్మెంట్ ప్రకటన
ప్రముఖ బాలీవుడ్ సింగర్ తన కెరీర్కు గుడ్ బై చెప్పేశాడు. ప్లే బ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకొనని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఇన్ని రోజులుగా నాపై ప్రేమ, అభిమానం చూపిన వారందరికీ థాంక్స్ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేయనని వెల్లడించారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందన్నారు. అయితే తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించలేదు. సినిమాలకు గుడ్బై చెప్పిన అర్జిత్ ఇండిపెండెంట్ సింగర్గా కొనసాగుతారని సమాచారం. View this post on Instagram A post shared by Arijit Singh (@arijitsingh)
బిగ్బాస్
బిగ్బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
అటు మోడ్రన్గా.. ఇటు అమ్మవారి వేషంలో..
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
నా క్యారెక్టర్పై నింద.. వాష్రూమ్లో ఏడ్చేదాన్ని: రీతూ
వైల్డ్కార్డ్స్గా రీతూ-పవన్.. నయని విమర్శలు
కూతురి ఫస్ట్ బర్త్డే.. బిగ్బాస్ జంట ఎమోషనల్
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్
A to Z
ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చాన్నాళ్లుగా టాలీవుడ్లో ఉంటూ సహాయ నటుడిగా గుర్తిం...
సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ
ప్రేమ గుడ్డిది. రంగు, ఆస్తి, కులమతాలు దానికి కనిపి...
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవ...
ఓటీటీలోకి 'ఛాంపియన్'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
యంగ్ హీరో రోషన్ నటించిన 'ఛాంపియన్' సినిమా ఓటీటీ...
ఆర్జేతో బ్రేకప్.. 'బిగ్బాస్' బ్యూటీతో ప్రేమలో పడ్డ చాహల్?
యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతానికి టీమిండియా తరఫున పెద్...
ఇంట్లో అందరూ హీరోయిన్సే.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ బాలీవుడ్ హీరోయిన్....
ఆ పాటలు పాడినందుకు పైసా ఇవ్వలేదు: సింగర్
యాక్టర్సే కాదు సింగర్స్ కూడా లక్షల్లో ఏకంగా కోట్ల...
నడుముపై చేయి వేసి.. అవమానంతో చచ్చిపోయా!
యాక్టర్స్ సినిమాలు, సీరియల్స్, యాడ్స్, షోలతో పా...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
ఏడేళ్ల తర్వాత 'తుంబాడ్' దర్శకుడి కొత్త సినిమా.. గూస్ బంప్స్ ట్రైలర్
'తుంబాడ్' సినిమాతో దర్శకుడు రాహి అనిల్ బార్వే దేశ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట...
హీరోయిన్ ఈషాతో రూమర్స్.. తరుణ్ భాస్కర్ రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగ...
హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నారా? తమిళలోనూ అదే తంతు
గత కొన్నాళ్లలో ప్రెస్మీట్స్ అంటే తెలుగు సినిమా హీ...
ఇక్కడికి వస్తానని కలలో కూడా ఊహించుకోలేదు: సమంత
రిపబ్లిక్ డే వేడుకల్లో హీరోయిన్ సమంత కనిపించింది. ...
20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన 20 ఏళ్ల నాటి మూవీ...
ఫొటోలు
కొంచెం నాటీ కొంచెం స్వీట్.. లంగా ఓణీలో మీనాక్షి (ఫొటోలు)
ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
యంగ్ లుక్లో హీరోయిన్ సదా పోజులు (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
తెలుగమ్మాయి ఈషా రెబ్బా కొత్త ఫోటోలు అదుర్స్
‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
బ్లాక్ డ్రస్లో భాగ్యశ్రీ డిఫరెంట్ లుక్స్ (ఫొటోలు)
'ఇరుముడి' సెట్లో రవితేజ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'బిగ్బాస్' సోనియా కుమార్తె బారసాల వేడుక (ఫొటోలు)
‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ బ్లాక్బస్టర్ సక్సెస్మీట్ (ఫొటోలు)
గాసిప్స్
View all
మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!
'కెజియఫ్' రేంజ్ కలలలో కుర్ర హీరో
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
ప్రభాస్ ‘స్పిరిట్’పై క్రేజీ గాసిప్.. గోపీచంద్ కీలక పాత్ర?
మెగా హీరో సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
తర్వాతి రెండు నెలలు డ్రై?
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్
రివ్యూలు
View all
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్..
2.5
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
సినీ ప్రపంచం
మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!
మెగా ఫ్యామిలీలో సంబరాలకు టైమ్ దగ్గరపడినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్-ఉపాసన దంపతులు ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు గతేడాది దీపావళి టైంలో రివీల్ చేశారు. అప్పుడే సీమంతం కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఉపాసన డెలివరీ డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(ఇదీ చదవండి: హైకోర్టులో 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ)జనవరి 31నే మెగాకోడలు ఉపాసన.. కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని మాట్లాడుకుంటున్నారు. 2012లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకోగా.. దాదాపు పదకొండేళ్ల తర్వాత అంటే 2023 జూన్లో వీళ్లకు పాప పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పుడు క్లీంకారకు తమ్ముళ్లు లేదా చెల్లెళ్లు రాబోతున్నారనమాట.ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మార్చి చివరలో విడుదల ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ చెప్పిన తేదీకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉన్న దృష్ట్యా వేసవి తర్వాతే అంటే జూన్ నెలలో ఈ మూవీ రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఉపాసన డెలివరీ తర్వాత చరణ్.. షూటింగ్కి బ్రేక్ ఇస్తే గనక 'పెద్ది' రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)
ఆ కారణాల వల్లే సినిమాలకు అర్జిత్ సింగ్ గుడ్బై
తన గాత్రంతో ప్రేమ పల్లకిలో ఊరేగిస్తాడు.. అంతలోనే అలక తెప్పిస్తాడు. సడన్గా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అలా అర్జిత్ సింగ్ గొంతు పలికించే భావాలకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో వందలాది పాటలు పాడాడు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ ప్రతిభ చూపిన ఆయన సడన్గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశాడు.సడన్గా ఎందుకిలా?అయితే ఉన్నపళంగా సినిమా పాటలకు విరామం ప్రకటించడం వెనక కారణాలేమై ఉంటాయని అభిమానులు చర్చ మొదలుపెట్టారు. ఇంతలో అతడే తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. ఇప్పటివరకు సినిమా పాటల రూపంలో అలరించిన అర్జిత్ సింగ్ మరో రూపంలో ముందుకు రానున్నట్లు ప్రకటించాడు.సంగీతంలో కొత్త అంశాలు నేర్చుకోవాలని..ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్కు ఒక్క కారణమంటూ లేదు. చాలా అంశాలు భాగమై ఉన్నాయి. చాలారోజులుగా ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ధైర్యం కూడదీసుకుని మీతో పంచుకున్నాను. నాకు పాటల్ని ఒకేలా పాడటం ఇష్టముండదు. అందుకే వేదికలపై దాన్ని కాస్త మార్చి పాడుతుంటాను. నేను ఇండస్ట్రీలో చాలా త్వరగా ఎదిగాను. ఇక్కడే ఆగిపోకుండా ఇంకా డిఫరెంట్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను. ఇండిపెండెంట్ సంగీతంపై దృష్టి సారిస్తాను.పూర్తి చేస్తా..మరో విషయం ఏంటంటే.. కొత్త గాయకుల పాటలు వినాలనుంది. వాళ్లు తమ టాలెంట్తో నాకు స్ఫూరిస్తున్నారు. కాబట్టి వారిని ప్రోత్సహించాలన్నది కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే ఒప్పుకున్న పాటల్ని మధ్యలో వదిలేయనని.. వాటిని పూర్తి చేసి తీరతానని వెల్లడించాడు.సినిమాఅర్జిత్ సింగ్.. హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ.. ఇతర భాషల్లోనూ పాటలు పాడాడు. కనులను తాకే ఓ కల.. (మనం), అదేంటి ఒక్కసారి.. (స్వామి రారా), దేవ.. దేవ.. (బ్రహ్మాస్త్ర) ఇలా ఎన్నో సాంగ్స్ ఆయన పాడినవే! సంగీతరంగంలో అతడు అందించిన సేవలకు గానూ అర్జిత్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. సినిమా పాటలు ఇకపై పాడనన్న అర్జిత్.. ఇండిపెండెంట్ సింగర్గా ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడన్నమాట!చదవండి: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్
హైకోర్టులో 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ
ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం.. సినిమా విడుదలకు 90 రోజుల ముందే వెల్లడించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెరిట్స్ ఉంటే సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని చెబుతూ అప్పీల్లో విచారణ ముగించారు.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)రీసెంట్గా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజులు ముందే ఉండాలని మధ్యంతర ఉత్తర్వులివ్వడంతోపాటు షైన్ స్క్రీన్ ఇండియా ఎల్ఎల్పీకి నోటీసులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాత షైన్ స్క్రీన్ ఇండియా ఎల్ఎల్పీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.ఈ అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం.. మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. ఆ పిటిషన్పై ఇంకా విచారణ కొనసాగుతున్నందున అక్కడే వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ ఎదురైంది.(ఇదీ చదవండి: అనుకోని అవకాశం.. ఊహించిందే జరగబోతోంది!సాయిపల్లవితో ప్రభాస్)
అనుకోని అవకాశం.. ఊహించిందే జరగబోతోంది!
ఆచితూచి సినిమాలు చేసే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. గ్లామర్ రోల్స్ చేయొచ్చు. కోట్లకు కోట్ల రుపాయల రెమ్యునరేషన్ సంపాదించొచ్చు. కానీ తను అనుకున్న దారిలోనే వెళ్తూ, నచ్చి మూవీస్ చేస్తూ అద్భుతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'రామాయణ్' మూవీలో సీత పాత్ర చేస్తోంది. ఓ హిందీ చిత్రం రిలీజ్కి రెడీగా ఉంది. మరోవైపు దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్లోనూ టైటిల్ రోల్ చేయనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు అనుకోని అవకాశం ఈమెని వరించినట్లు తెలుస్తోంది.ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్ 'కల్కి 2898 AD' సినిమా విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ తీసేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతుందో.. దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. గతేడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే దీపిక వద్దనుకున్న ఈ పాత్ర ఎవరు చేస్తారా అనే డిస్కషన్ అప్పుడు నడిచింది. ఇప్పుడు అది సాయిపల్లవిని వరించినట్లు సమాచారం. దాదాపు ఇది ఖరారైపోయిందని, త్వరలోనే ప్రకటన రావొచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్)ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే గనుక ప్రభాస్, సాయిపల్లవి జోడీ సెట్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాడని.. ఈ వేసవి నుంచి షూటింగ్ మొదలవుతుందని అనుకుంటున్నారు. మరి వినిపిస్తున్న పుకార్లు ఎంతవరకు నిజమనేది మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.మూవీ టీమ్ ముందు సాయిపల్లవి కాకుండా వేరే ఆప్షన్స్ పెద్దగా లేనట్లే అనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగులో ప్రస్తుతం 'సుమతి' పాత్రని పోషించిగల హీరోయిన్లు లేరని చెప్పొచ్చు. బాలీవుడ్, దక్షిణాదిలోని మిగతా భాషల్లో అయినా సరే ఆలియా భట్ లాంటి ఒకరిద్దరి పేర్లు పరిశీలించొచ్చు కానీ 'కల్కి' టీమ్, సాయిపల్లవి వైపు మొగ్గుచూపినట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)
'కెజియఫ్' రేంజ్ కలలలో కుర్ర హీరో
టాలీవుడ్లో కొత్తగా అడుగుపెడుతున్న యంగ్ హీరోలలో చాలామంది "కెజియఫ్ రేంజ్"లో సినిమాలు చేయాలని కలలు కంటున్నారు. మేకప్ వేసుకున్న వెంటనే తమ రేంజ్ వేరే లెవల్ అని భావించే ఈ తరం హీరోలు తమ వ్యక్తిత్వం ఏమిటి? తమ వాయిస్, నటనకు ఏం సూటవుతాయి? ఎలాంటి పాత్రలు చేయాలనే విషయాలపై మాత్రం పెద్దగా ఆలోచించరు. అలా కొంతమంది హీరోలకు చేతిలో సినిమాలు లేకపోయినా "పాన్ ఇండియా" సినిమానే చేస్తానని, మాస్ సినిమానే చేస్తానని గట్టిగా చెప్పేస్తున్నారు. ఇక వారసత్వం ఉన్నవారైతే మరింత ధైర్యం చేస్తున్నారు. ఇటీవల ఓ నిర్మాత ఒక కథకు సరిపోతాడని భావించి ఓ చిన్న హీరోను కలిశాడు. కాగా సదరు హీరో నిర్మాతకు ఫోన్లో ఓ వీడియో చూపించాడు. తీరా చూస్తే అది అతనిపై తానే తయారు చేయించుకున్న గ్లింప్స్. అది కెజియఫ్ లెవెల్లో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి సినిమా చేద్దామని హీరో ప్లాన్ చెప్పాడట. అయితే దానికి సదరు నిర్మాత మాత్రం 'గ్లింప్స్ బాగుంది కానీ మీకు అంతగా సూట్ కాలేదు" అని చెప్పి వెళ్లిపోయాడని సమాచారం.కెజియఫ్ లాంటి చిత్రాలు అందరికీ సెట్ కావు. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే చేస్తానని కలలతో కాలక్షేపం చేస్తున్న కుర్ర హీరోలు, ఏజ్ బార్ అయ్యాకే వాస్తవం గ్రహిస్తారు. కానీ అప్పటికే తన తండ్రి ఇచ్చిన ఆస్తి కూడా ఖర్చయిపోయి, కెరీర్లో స్థిరపడే అవకాశాలు తగ్గిపోతాయి. టాలీవుడ్లో కొత్తగా వస్తున్న హీరోలు తమకు సూటయ్యే పాత్రలు, కథలు ఎంచుకుంటేనే నిలబడగలరనే వాస్తవాన్ని గ్రహించాలి. లేకపోతే "కెజియఫ్ రేంజ్" కలలతోనే వారి కెరీర్ ముగిసే ప్రమాదం ఉంది.
ప్రముఖ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ రిటైర్మెంట్ ప్రకటన
ప్రముఖ బాలీవుడ్ సింగర్ తన కెరీర్కు గుడ్ బై చెప్పేశాడు. ప్లే బ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకొనని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఇన్ని రోజులుగా నాపై ప్రేమ, అభిమానం చూపిన వారందరికీ థాంక్స్ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేయనని వెల్లడించారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందన్నారు. అయితే తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించలేదు. సినిమాలకు గుడ్బై చెప్పిన అర్జిత్ ఇండిపెండెంట్ సింగర్గా కొనసాగుతారని సమాచారం. View this post on Instagram A post shared by Arijit Singh (@arijitsingh)
మరో ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం డ్రైవ్. గతేడాది డిసెంబర్ 12న అఖండ-2తో పాటు ఈ మూవీ విడుదలైంది. చాలా కాలం తర్వాత తెలుగులో ఆది పినిశెట్టి నటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై ఆనంద్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమా థియేటర్స్లో ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం జనవరి 30 నుంచి ఆహాలో అందుబాటులో ఉంటుందని ట్వీట్ చేసింది. సైబర్ క్రైమ్స్, హ్యాకింగ్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. Every secret has a price.And someone is always watching👀@AadhiOfficial @MadonnaSebast14 @RajaChembolu @kamalkamaraju @anishkuruvilla @jenusemohamed @AbinandhanR @osho_venkat @PrawinPudi #AnandaPrasad @BhavyaCreations pic.twitter.com/GFARaOuO0S— ahavideoin (@ahavideoIN) January 27, 2026
ఎవరో కూడా తెలియని టైమ్లో నా కోసం నిలబడ్డాడు: విశ్వక్ సేన్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్పై ప్రశంసల వర్షం కురిపించారు. నేను ఎవరో కూడా తెలియని సమయంలో తరుణ్ నా కోసం నిలబడ్డాడని కొనియాడారు. తరుణ్ భాస్కర్ నటించిన ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ ఈ కామెంట్స్ చేశారు.తరుణ్ నాకు పరిచయం లేకపోయినా కూడా నాకోసం నిలబడ్డారని విశ్వక్ సేన్ అన్నారు. నాకు ఫోన్ చేయగానే ఈవెంట్కు వచ్చానని తెలిపారు. ఈరోజు నన్ను గెస్ట్ అని అంటున్నారని.. ఎందుకంటే ఇది నా కుటుంబ ఫంక్షన్ అని అన్నారు. కాగా.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. మలయాళంలో తెరకెక్కించిన జయ జయ జయహే మూవీకి రీమేక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
దేశభక్తి టచ్ చేస్తే చాలు.. కాసుల పంట పండాల్సిందే!
బాలీవుడ్ ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. కానీ ఇప్పుడు 'నేషనలిజం' ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వెండితెరపై త్రివర్ణ పతాకం కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. 'ఉరి', 'గదర్ 2' నుంచి మొదలైన ఈ ఊపు, ఇప్పుడు 'ధురంధర్', 'బోర్డర్ 2' వరకు కొనసాగుతోంది. సామాన్యుడిలో ఉండే దేశభక్తిని భావోద్వేగంతో కలిపి వెండితెరపై చూపించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన దేశభక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.450 కోట్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక వీరగాథలకు దేశభక్తి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది.రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఒక స్పై థ్రిల్లర్గా వచ్చి, దేశభక్తిని అద్భుతంగా పండించిన ఈ చిత్రం కేవలం ఏడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,285 కోట్లకు పైగా వసూలు చేసి 'ఆల్ టైమ్ బ్లాక్బస్టర్'గా నిలిచింది.ఇక గతవారం (జనవరి 23) రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' ప్రస్తుతం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. 1971 ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్కును చేరుకుంది. నిన్న ఒక్క రోజులోనే ఇండియాలో ఈ చిత్రం రూ.59 కోట్లు రాబట్టిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇలానే కొనసాగితే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. .సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్(1997) చిత్రానికి సీక్వెల్ ఇది.
సంగీత విద్వాంసుడు శ్రీ ఓరుగంటి ఆనంద్ మోహన్ కన్నుమూత
ప్రముఖ సంగీతజ్ఞులు, 'సంగీత క్షీరసాగరం' వ్యవస్థాపకులు విద్వాన్ శ్రీ ఓరుగంటి ఆనంద్ మోహన్ (90) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు సంతానం ఉన్నారు. సంగీతమే శ్వాసగా..1956 నుంచి 1977 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో లలిత సంగీత కళాకారుడిగా సేవలందించిన ఆనంద్ మోహన్.. వృత్తిరీత్యా ఢిల్లీలోని కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ కార్యాలయం లోనూ కాగ్ (CAG) కార్యాలయంలో పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని సంగీతానికే అంకితం చేశారు. తన గురువు ఉప్పలపాటి అంకయ్య స్మరణార్థం 2002లో 'సంగీత క్షీరసాగరం' సభను స్థాపించి, సప్తపర్ణి సహకారంతో ఇప్పటివరకు 699 కచేరీలను నిర్వహించారు. ఎవరి వద్ద ధనసహాయం ఆశించకుండా తన పెన్షన్ డబ్బులే ఖర్చు చేస్తూ నిస్వార్థంగా ఈ కచేరీలు నిర్వహించడం విశేషం.అందుకున్న పురస్కారాలు..శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన కృషికి గాను 2012లో కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా గౌరవం పొందారు. 2013లో చెన్నైలో జ్ఞాన సరస్వతీ పీఠ పురస్కారాన్ని అందుకున్నారు. 1966-67 మధ్య కాలంలో శ్రీ త్యాగరాయ గాన సభ వ్యవస్థాపక కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. యువ కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆయన మృతి పట్ల పలువురు సంగీత విద్వాంసులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.
సినిమా
2030 వరకు సందీప్ వంగా వైల్డ్ ఫైర్
జపాన్ అభిమాని దెబ్బకు బిత్తరపోయిన పుష్ప..
పిచ్చి పిచ్చిగా ప్రేమించా కానీ..బ్రేకప్ పై దివ్య భారతి షాకింగ్ కామెంట్స్
విజయ్ సినిమాకు హైకోర్టు షాక్ జననాయగన్ విడుదల డౌటే..!
చిరంజీవి చెప్పింది తప్పు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్
థ్రిల్లింగ్ ట్విస్ట్ కు వెంకీ రెడీ!
ధనుష్, మృణాల్ పెళ్లి..! ఇదిగో క్లారిటీ
అనిల్ రావిపూడికి చిరు కార్ గిఫ్ట్.. ధర ఎంతో తెలుసా..!
ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!
సూర్య వర్సెస్ ధనుష్.. కోలీవుడ్ లో బిగ్ క్లాష్..
