Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Valentines Day 2026 Tollywood Celebrities Latest Posts1
వాలంటైన్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీల లవ్‌లీ ఫొటోలు

గులాబీలతో రొమాంటిక్ పోజులిచ్చిన నేహా శెట్టిసెల్ఫ్ లవ్ అంటూ స్వీట్ స్టిల్స్‌తో కృతిశెట్టిభర్తపై ప్రేమ చూపించేసిన మెగా కోడలు లావణ్యగోవాలో భర్తతో ప్రేమక్షణాల్లో గుర్తుచేసుకున్న అమలా పాల్అందంగా కనిపిస్తూ నభా నటేశ్ ప్రేమ విషెస్గులాబీతో క్యూట్‌గా మాయ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Jagat Desai (@jagat_desaii) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)

Tamilnadu BJP Chief Nainar Nagendran Comments On Vijay Trisha2
విజయ్-త్రిష బంధంపై బీజేపీ చీఫ్ దారుణమైన కామెంట్స్

చివరి సినిమా చేసేసిన తమిళనాడు స్టార్ హీరో విజయ్.. అధికారం సాధించడమే లక్ష‍్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నాడు. అలాంటి ఇతడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషతో బంధాన్ని ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా)చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో భాగంగా బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రకు విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. 'విజయ్ చాలా అమాయకుడు. ఇప్పటికీ రాజకీయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొదటగా అతడు గూడు నుంచి బయటకు రావాలి. మరీ ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది' అని నాగేంద్రన్ ఆరోపించారు.నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్నాయి. విజయ్‌ని అభిమానించే వాళ్లతో అధికార డీఎంకే నాయకులు కూడా నాగేంద్రన్ కామెంట్స్‌ని ఖండిస్తున్నారు. విజయ్, త్రిష రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాన్ని.. నేతలు బహిరంగ వేదికలపై ప్రస్తావించడం అవమానకరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్‌గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్)

Funky Movie Day 1 Collection Worldwide3
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?

'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన లేటెస్ట్ సినిమా 'ఫంకీ'. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించారు. మూవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి థియేటర్లలో అనుకున్నంత స్పందన రాలేదు. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అక్కడక్కడ కామెడీ బాగున్నప్పటికీ ఓవరాల్‌గా మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి ఇలాంటి రెస్పాన్స్‌తో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి?ఫంకీ చిత్రానికి తొలిరోజు నెట్ వసూళ్లు రూ.2.25 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలానే ఓవర్సీస్‌లో మొదటిరోజు పూర్తయ్యేసరికి లక్షా 85 వేల డాలర్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మనవరకు మాత్రం ఇంకా పోస్టర్ లాంటిది రిలీజ్ చేయలేదు. వస్తున్న టాక్ బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యాక ఏమైనా పోస్టర్ వదిలితే వదలొచ్చు. లేదంటే లేకపోవచ్చు.(ఇదీ చదవండి: 'ఫంకీ' సినిమా.. మేం కావాలనే అలా తీశాం: నిర్మాత నాగవంశీ)'ఫంకీ'తో పాటు రిలీజైన మరో తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి ఈ రెండింటిలో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారనేది సోమవారానికి తేలుతుంది.'ఫంకీ' విషయానికొస్తే.. కోమల్ (విశ్వక్ సేన్) కొత్త దర్శకుడు. ఓ నిర్మాణ సంస్థలో సినిమా కోసం అవకాశం దక్కించుకుంటాడు. రూ.4 కోట్లతో పూర్తి చేస్తానని రూ.40 కోట్ల బడ్జెట్ చేస్తాడు. అయినా సరే మూవీని పూర్తి చేయడు. దీంతో నిర్మాత కూతురు చిత్ర(కాయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. రూ.కోటితో మిగిలిన చిత్రమంతా పూర్తిచేయాలనే షరతు పెడుతుంది. మరి అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తయిందా? ఈ క్రమంలో కోమల్-చిత్ర మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Chatha Pacha Movie OTT Telugu Details4
థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా

ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కొన్నిరోజులకే చాలా సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలానే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టైల్‌లో ఉండే ఓ యాక్షన్ మూవీ.. డిజిటల్‌గా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా తేదీని ప్రకటించేశారు. కాకపోతే మరీ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఆరు రోజులకే స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు ముద్దుపేరు.. అల్లు శిరీష్ వాలంటైన్స్ డే వీడియో)మలయాళంలో గత నెల 22న రిలీజైన సినిమా 'చథా పచ్చ'. రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. అద్వైత్ నాయర్ దర్శకుడు. తొలుత తెలుగులోనే జనవరిలోనే విడుదల చేయాలనుకున్నారు గానీ వాయిదా వేశారు. నిన్ననే అంటే ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇంతలోనే ఇప్పుడు ఓటీటీ డేట్ ప్రకటించారు. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 19) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'చథా పచ్చ' విషయానికొస్తే.. ముగ్గురు అన్నదమ్ములు సవి(అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ షౌకత్), వెట్రి(రోషన్) తమ చిన్నప్పటి నుంచి టీవీల్లో రెజ్లింగ్, కుస్తీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంటివి చూస్తూ పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల వీళ్లు విడిపోతారు. లిటిల్, సవి.. కొచ్చిలో కాస్ట్యూమ్ రెజ్లింగ్ ప్రారంభించే పనిలో ఉంటారు. వీళ్లకు వెట్రి ఎందుకు దూరంగా ఉ‍న్నాడు. లిటిల్, సవి మొదలుపెట్టిన రెజ్లింగ్ పోటీ సక్సెస్ అయిందా? ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్‌గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్)

Yamini Er Queen Movie Glimpse 5
తెలుగు హీరోయిన్‌గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్

సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న యామినీ ఈఆర్.. టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'క్వీన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు.తను ప్రేమించిన వ్యక్తి కలని నిజం చేస్తూ, అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే మూవీలో కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్. ఈ మూవీలో కీలకమైన తండ్రి పాత్ర కోసం 90స్ హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.

Tusshar Kapoor Recalls becoming Single Dad through IVF, Surrogacy Journey6
పెళ్లి చేసుకోకుండానే తండ్రినయ్యా.. ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా!

యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోయినా సరే.. కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోనని మొండిగా కూర్చున్నాడు ప్రముఖ నటుడు జితేంద్ర కుమారుడు, నటుడు తుషార్‌ కపూర్‌. అయితే పెళ్లికి విరుద్ధమే కానీ, తండ్రవడానికి కాదని సింగిల్‌ పేరెంట్‌ అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా తండ్రయిన తొలి బాలీవుడ్‌ సెలబ్రిటీగా గుర్తింపు పొందాడు. తాజాగా ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.అక్కడే నేర్చుకున్నా..తుషార్‌ కపూర్‌ మాట్లాడుతూ.. మా నాన్నలాగే నేను కూడా పాతకాలం మనిషిని. కాకపోతే ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు కాస్త భిన్నంగా ఉండేవి. ఐదేళ్లు అమెరికాలో ఉండటం వల్ల ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నాను. పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఓ బిడ్డకు తండ్రయ్యాను. మా నాన్న అలా కాదు. తను పెళ్లిని గౌరవిస్తాడు. కుటుంబ బంధాలను నమ్ముతాడు.40 ఏళ్లకు తండ్రినయ్యా..నేను కాస్త మొహమాటస్తుడినే. ఎక్కువగా బయట కూడా తిరగను. అయితే ఒక పిల్లవాడిని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. 40 ఏళ్ల వయసులో తండ్రయ్యాను. తండ్రవడానికి అదే సరైన సమయం అని భావిస్తాను. మన సమాజం మాత్రం 25 ఏళ్లకే పెళ్లి, పిల్లలు అని గోల మొదలుపెడుతుంది. నేను కూడా పెళ్లిని గౌరవిస్తాను, నమ్ముతాను. కానీ ఎందుకో అది నాకు సూటవదనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు.ఆ జర్నీ వల్లే..39 ఏళ్ల వయసులో ఓసారి తిరుపతికి వెళ్లాను. అప్పుడే నటుడు, నిర్మాత ప్రకాశ్‌ జాను కలిశాను. తిరుపతి నుంచి తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు మా విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇద్దరం కాసేపు కూర్చుని కాలక్షేపం చేశాం. అప్పుడే అతడో మాటన్నాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ సింగిల్‌ పేరెంట్‌ అవొచ్చుగా.. అదొకసారి ఆలోచించు అన్నాడు. అతడి కుటుంబంలో ఒక అమ్మాయి ఇలాగే సింగిల్‌ పేరెంట్‌ అయిందని తెలిపాడు.సినిమావెంటనే నాక్కూడా ఓ బిడ్డ కావాలనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పటికప్పుడు అన్నీ తెలుసుకుని, ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు. చివరకు ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా తండ్రినయ్యాను అని తుషార్‌ చెప్పుకొచ్చాడు. తుషార్‌ కపూర్‌.. ముజే కుచ్‌ కెహ్నా హై, గాయబ్‌, గోల్‌మాల్‌, గోల్‌మాల్‌ రిటర్న్స్‌, షోర్‌ ఇన్‌ ద సిటీ, ద డర్టీ పిక్చర్‌, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'వెల్‌కమ్‌ టు ద జంగిల్‌' మూవీ చేస్తున్నాడు.చదవండి: సూర్య-జ్యోతిక ప్రేమను ఒప్పుకోని హీరో తండ్రి

Rayudi Gari Thaluka Movie Trailer7
'రాయుడు గారి తాలూకా' ట్రైలర్

'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ దర్శకుడు కల్యాణకృష్ణ చేతులు మీదుగా 'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ విడుదలైంది. హీరో కమ్ నిర్మాతగా ఉలిశెట్టి శ్రీనివాస్ చేశారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం, కుటుంబ విలువలు తెలిపే సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కానుందని అన్నారు.

Vikram Bhatt owes lakhs to 1920, make up artist alleges she was asked to work for free8
అడుక్కుంటున్నా పట్టించుకోవట్లే.. హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత విక్రమ్‌ భట్‌ ఆర్థిక మోసం కేసులో చిక్కుకున్నాడు. దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రమ్‌ దంపతులను పోలీసులు ఇటీవలే అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో విక్రమ్‌, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ ఏమందంటే?ఇదే సమయంలో పలువురు ఆర్టిస్టులు విక్రమ్‌ తమకు సరిగా జీతాలివ్వలేదని ముందుకొస్తున్నారు. 2023లో వచ్చిన 1920: హారర్స్‌ ఆఫ్‌ ద హార్ట్‌, ఖిలోనా (ఇది మధ్యలోనే ఆగిపోయింది) సినిమాలకు టెక్నీషియన్లకు డబ్బు చెల్లించలేదని పలువురు మీడియా ముందుకొచ్చారు. తాజాగా హీరోయిన్‌ అవికాగోర్‌కు మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసిన స్నేహ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.స్పందన లేదుమిడ్‌డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ శర్మ మాట్లాడుతూ.. 1920: హారర్స్‌ ఆఫ్‌ ద హార్ట్‌ సినిమాకు పని చేసిన చాలామందికి పూర్తి వేతనాలు చెల్లించలేదు. మా జీతాలు మాకు చెల్లించమని అడుక్కుంటున్నాం.. కానీ విక్రమ్‌ భట్‌ టీమ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఒక హెయిర్‌స్టైలిస్ట్‌కి అయితే ఇంటి అద్దె కట్టకపోవడంతో అతడిని ఇంటినుంచి గెంటేసే పరిస్థితి వచ్చింది. మొదట్లో మాకు సమయానికి డబ్బు చెల్లించారు.సగమే ఇచ్చి..కానీ రెండో షెడ్యూల్‌కు వచ్చేసరికి నిధులు లేవన్నారు. ఓపక్క డబ్బు లేదంటూనే మరో పక్క కొత్త సినిమాను కూడా మొదలుపెట్టారు. 1920 మూవీ కోసం నాకు రోజుకు రూ.18 వేల లెక్కన డీల్‌ మాట్లాడుకున్నాను. అయితే అందులో నాకు సగమే ఇచ్చారు. విక్రమ్‌ భట్‌ కూతురు కృష్ణ భట్‌ను అడిగితే ఆ లెక్కలేవీ తనకు తెలియదంది. పైగా మరికొన్ని రోజులు ఉచితంగా పని చేయమని కోరింది.పైసా ఇవ్వడుడబ్బు ఇవ్వకపోతే నేనెందుకు పని చేస్తానని కరాఖండిగా రానని చెప్పేశాను. దాంతో మరో మేకప్‌ ఆర్టిస్ట్‌తో ఉచితంగా పని చేయించుకున్నారు అని చెప్పుకొచ్చింది. విక్రమ్‌ భట్‌ మనమంతా ఒకే కుటుంబం అని సెంటిమెంట్‌ డైలాగ్‌ చెప్పి అందరితో ఇలాగే పని చేయించుకుంటాడని, డబ్బు మాత్రం సరిగా ఇవ్వడని పలువురు సిబ్బంది వాపోయారు. కొందరికైతే లక్షలు ముట్టాల్సింది ఉందని, అవేవీ ఇవ్వకుండా మోసం చేశాడంటున్నారు.చదవండి: సూర్య -జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు: హీరో తండ్రి

Allu Sirish Wife Nayanika Valentines Day Video9
కాబోయే భార్యకు ముద్దుపేరు.. వాలంటైన్స్ డే వీడియో

అల్లు వారి కుటుంబంలో పెళ్లి హడావుడి మొదలైపోయింది. బన్నీ సోదరుడు శిరీష్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనికతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. రెండు రోజుల క్రితమే పసుపు దంచుడు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని శిరీష్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమకథ గురించి, కాబోయే భార్యతో క్యూట్ మూమెంట్స్ ఉన్న వీడియోని షేర్ చేశాడు.శిరీష్.. తనకు కాబోయే భార్య నయనికకు 'క్యూటేష్' అనే ముద్దుపేరు పెట్టుకున్నాడు. వీడియోలో అదే విషయాన్ని చూపించాడు. ప్రపంచం తమని కలిపిందని చెప్పుకొచ్చాడు. పారిస్ వీధుల్లో కొన్ని రొమాంటిక్ క్షణాల్ని చూపించడంతో పాటు నిశ్చితార్థానికి సంబంధించిన విజువల్స్‌ని చూపించాడు. ఇకపోతే మార్చి 6న శిరీష్-నయనిక పెళ్లి జరగనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)

Is Bollywood Uncomfortable With Allu Arjun Growth10
బన్నీని చూసి బాలీవుడ్‌ రగిలిపోతోందా?

‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత, దక్షిణాది నటుల్లో ఎవరికీ రానంత దేశవ్యాప్త క్రేజ్‌ అల్లు అర్జున్‌కి రావడం, జవాన్‌ సినిమా తీసిన అట్లీ తన రెండో సినిమాకి ఎంచుకోవడం...అలాగే బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొణే వంటి స్టార్స్‌తో బన్నీ కలిసి నటించనుండడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ బాలీవుడ్‌లో కొందరికి ముప్పుగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్నకు కొందరు సినీ పెద్దలు అవుననే సమాధానమే చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం అటు టాలీవుడ్‌ ఇటు బాలీవుడ్‌లో సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్‌ సంఘటన తర్వాత అల్లు అర్జున్‌ ఎదుర్కున్న పరిణామాలు తను కొందరు ప్రముఖులకు టార్గెట్‌గా మారాడనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాయి. తాజా పరిణామాల నేపధ్యంలో బన్నీ ని ఈ సారి వేరే రకంగా టార్గెట్‌ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివాదమా? బాలీవుడ్‌ వ్యూహమా?ఇండియన్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఓ బ్రాండ్‌ స్ట్రాటజిస్ట్‌ అల్లు అర్జున్ ను కలవాలంటే ఏకంగా 42 కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందులో కళ్లలోకి చూడకూడదు, చేతులు కలపకూడదు వంటి ఆంక్షలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ కావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫలితంగా అల్లు అర్జున్‌ పేరు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, నిజంగానే ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అని కొందరిలో సందేహాలు వ్యక్తమవడం సహజమే.అయితే అదే సమయంలో కొందరు ఇది అల్లు అర్జున్‌ పెరుగుతున్న పాన్ ఇండియా క్రేజ్‌ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలను కావాలనే పెద్దవిగా చేసి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ఇలా టాలీవుడ్‌ స్టార్స్‌పై వ్యతిరేక ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల భారీ విజయం తర్వాత ప్రభాస్‌ కూడా ఇలాంటి విమర్శలు, నెగెటివ్‌ ప్రచారం చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ ఆదరణ పొందిన దక్షిణాది నటులు ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందన..తమపై పడిన వివాదంపై అల్లు అర్జున్‌ టీమ్‌ వెంటనే స్పందించి వైరల్‌ అవుతున్న ఆరోపణలు అసత్యమని, ఆధారంలేనివని స్పష్టం చేసింది. అల్లు అర్జున్‌ ఎప్పుడూ గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నదని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. ఈ ఉదంతంపై తగినంత కూపీ లాగి కుట్రలపై ఆధారం దొరికిన తర్వాతే అల్లు టీమ్‌ ఇలా చెప్పి ఉంటుందనేది నిస్సందేహం. అంతేకాదు అల్లు అర్జున్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. తద్వారా ఇకపై కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అల్లు అండ్‌ కో భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో కలిసి రెండు భాగాలుగా రూపొందనున్న ఓ భారీ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. , అల్లు అర్జున్‌ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కుట్రలలో ఆరితేరిన చరిత్ర ఉన్న కొన్ని బాలీవుడ్‌ మీడియా సంస్థల విషయంలో అల్లు అర్జున్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

Advertisement
Advertisement