ప్రధాన వార్తలు
అఖండ-2 రిలీజ్.. బన్నీ వాసు కామెంట్స్పై నెటిజన్స్ ఫైర్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా .. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్దఎత్తున చర్చ జరిగింది. మూవీ మేకర్స్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఈ చిత్రాన్ని వేశారు. ఈనెల 5న విడుదల కావాల్సిన అఖండ-2.. చివరి నిమిషంలో అభిమానులకు షాకిచ్చింది.అయితే తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్. అఖండ-2ను డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈనెల 12న దాదాపు ఐదారు చిన్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. సందీప్ రాజ్ మౌగ్లీ, హెబ్బా పటేల్ ఈషా, సైక్ సిద్ధార్థ్ లాంటి చిత్రాలు ముందుగానే డేట్ ప్రకటించారు.కానీ ఊహించని విధంగా బాలయ్య అఖండ-2 ఇదే రోజున రిలీజ్ చేస్తున్నారు. దీంతో సందీప్ రాజ్ మూవీ మౌగ్లీ ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య సినిమా వాయిదా ఎఫెక్ట్ చిన్న సినిమాల రిలీజ్కు అడ్డంకిగా మారింది. ఈ విషయంపై డైరెక్టర్ సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా ఇవాళ హెబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్లో అఖండ-2 సినిమా వల్ల బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు తప్పుకోవాల్సిన పరిస్థితిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న సినిమాలు తప్పుకుంటున్నాయా? అన్న ప్రశ్నకు నిర్మాత బన్నీ వాసు స్పందించారు.ఈ ప్రశ్నకు బన్నీ వాసు స్పందిస్తూ.. అఖండ-2ను పెద్దలారీతో పోల్చారు. చిన్న సినిమాలను చిన్న కారుగా అభివర్ణించారు. 'హైవేపై మనం చిన్నకారులో వెళ్తున్నాం.. మన వెనకాల పెద్ద లారీ వస్తోంది.. వాడు హారన్ కొడితే.. మన కారు పక్కకు తప్పుకోవాల్సిందే' అన్నారు. అలా కాదంటే.. మనం ఎక్కడికో వెళ్లిపోతాం అంటూ బన్నీ వాసు కామెంట్స్ చేశారు.అయితే చిన్న సినిమాలను ఉద్దేశించి బన్నీ వాసు కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. చిన్న చిత్రాలను కించపరిచేలా బన్నీ వాసు వ్యాఖ్యలు ఉన్నాయంటూ సినీ ప్రియులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్పై రావాల్సిన ఈ చిత్రం.. అఖండ-2 దెబ్బకు క్రిస్మస్కు తరలిపోయింది.ఇండస్ట్రీ లో అందరు తప్పక "Jai Balayya" అని తప్పుకుంటున్నారా ?"Highway మీద పెద్ద vehicles కి దారి ఇవ్వకపోతే మనకే risk" - #BunnyVas#Akhanda2 #Balakrishna pic.twitter.com/p0ujehI0kR— Daily Culture (@DailyCultureYT) December 10, 2025
వెంకీమామ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ మూవీ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 13న వెంకీ మామ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్కు అదే రోజు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రేమంటే ఇదేరా 4కె ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా వెంకీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 13న రీ రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. కొత్త రిలీడ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో బర్త్డే రోజు ఈ సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న వెంకీమామ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అఖండ-2 వాయిదా పడడం, చిన్న సినిమాలు రిలీజ్ ఉండడం వల్లే ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.కాగా.. 1998లో వచ్చిన ఈ మూవీకి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ ప్రేమకథా చిత్రంలో వెంకటేష్, ప్రీతి జింటా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్కుమార్ సంయుక్తంగా నిర్మించారు.#PremanteIdera re-release postponed!Stay tuned for new release date! #PremanteIderaReRelease #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/qrXeoDrRAl— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2025
టాలీవుడ్లో మిస్ అవుతున్న 'నవ్వు'
నవ్వడం ఓ భోగం. నవ్వించడం యోగం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బోలెడంత మంది కమెడియన్స్. ఇలాంటి మూవీస్ తీసే జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ లాంటి చాలామంది దర్శకులు. కానీ ఇప్పుడు కమెడియన్స్ తగ్గిపోయారు. ఆ తరహా చిత్రాలు తీసే డైరెక్టర్స్ కనిపించట్లేదు. ఇంటిల్లిపాదీ చూసే హాస్య భరిత సినిమాలూ తగ్గిపోయాయి. చెప్పాలంటే టాలీవుడ్లో 'నవ్వు' సరిగా వినిపించట్లేదు. ఇంతకీ దీనికి కారణమేంటి?ఒకప్పుడు కామెడీ సినిమాలకు తెలుగు చిత్ర పరిశ్రమ కేరాఫ్ అడ్రస్. దేశంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర పదుల సంఖ్యలో కమెడియన్స్ ఉండేవాళ్లు. వీరిని ప్రధానంగా పెట్టి 'ఎవడి గోల వాడిది', 'జంబలకిడి పంబ' లాంటి సినిమాలు తీసేవారు. అలాంటి వాటికి ప్రేక్షకుల నుంచి కూడా విశేషాదరణ ఉండేది. కాల క్రమేణా కమెడియన్స్ చేసే కామెడీ.. హీరోలు చేయడం మొదలుపెట్టారు. పదేళ్ల ముందు ఈ ట్రెండ్ బాగా కనిపించింది. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ తాము కామెడీ పండించడంలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు.గత కొన్నాళ్ల నుంచి మాత్రం తెలుగులో కామెడీ సినిమాల శాతం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల వల్ల చాలావరకు హాస్యం అనేదే సరిగా కనిపించట్లేదు. స్టార్ దర్శకులు.. పాన్ ఇండియా మోజులో పడ్డారంటే ఓ అర్థముంది. ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త దర్శకులు కూడా సింపుల్ బడ్జెట్లో కామెడీ, ఎంటర్టైనర్ కాన్సెప్టులు అస్సలు ఆలోచించడం లేదు. పదుల కోట్లు ఖర్చయ్యే భారీ యాక్షన్ స్టోరీలని సిద్ధం చేసుకుంటున్నారు. పోనీ బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొడుతున్నారా అంటే లేదు. పది చిత్రాలు తీస్తే అందులో ఒకటో రెండు మాత్రం ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాయి. మిగిలినవి సోషల్ మీడియాలో మాత్రం హిట్ అనిపించుకుంటున్నాయి.చెప్పాలంటే పదిహేను ఇరవైళ్ల క్రితం తెలుగు చిత్రసీమకు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా ఇలానే ఉండేది. ఎందుకంటే దర్శకనిర్మాతలు అందరూ ఇంటిల్లిపాదీ చూసే కథల్ని సినిమాలుగా తీసేవాళ్లు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్.. ప్రతివారం థియేటర్లకు క్యూ కట్టేవారు. హిట్ టాక్తో పాటు కలెక్షన్స్ అలానే వచ్చేవి. కానీ గత కొన్నేళ్లు నుంచి మాత్రం టార్గెట్ ఆడియెన్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.అయితే యూత్ కోసం బోల్డ్ కాన్సెప్ట్ మూవీస్ తీస్తున్నారు. లేదంటే యాక్షన్ సినిమాలు అంటున్నారు. ఇవి కాదంటే పీరియాడిక్ మూవీస్ అని హడావుడి చేస్తున్నారు. తప్పితే తక్కువ బడ్జెట్లో మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ మూవీస్ చేద్దామని యువ దర్శకులు గానీ సీనియర్ డైరెక్టర్స్ గానీ ఆలోచించట్లేదా అనిపిస్తుంది. ఈ ఏడాదినే తీసుకోండి.. సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఏకంగా రూ.200-300 కోట్ల వసూళ్లు అందుకుంది. దీనిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. తెలుగు ఆడియెన్స్ కామెడీ మూవీస్ కోసం ఎంతలా తహతహలాడుతున్నారో.'సంక్రాంతికి వస్తున్నాం' రేంజులో కానప్పటికీ.. ఈ ఏడాది 'మ్యాడ్ స్క్వేర్', 'సింగిల్', 'లిటిల్ హార్ట్స్', 'కె ర్యాంప్', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాయి. కాకపోతే వీటిలో స్టార్స్ ఎవరూ లేరు. కాబట్టి వీటికి పెద్దగా రీచ్, గుర్తింపు దక్కలేదు. అయితే మిడ్ రేంజు హీరోలు, చిన్న హీరోలతో కామెడీ సినిమాలు తీయడం కంటే స్టార్ హీరోలతో కామెడీ చిత్రాలు తీస్తే వాటికి ఉండే రేంజ్ వేరని చెప్పొచ్చు. సరైన కామెడీ కాన్సెప్ట్, స్టార్ హీరోలతో మూవీస్ చేస్తే ఆడియెన్స్ కచ్చితంగా థియేటర్లకు వచ్చే అవకాశముంటుంది. ఎంతసేపు పైరసీ, మరేదో అని బాధపడతారు తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చే కామెడీ చిత్రాల్ని తీద్దామనే విషయాన్ని మాత్రం సరిగా ఆలోచించట్లేదా అనిపిస్తుంది. అందుకే టాలీవుడ్లో మనస్ఫూర్తిగా నవ్వుకోవడం అనేది చాన్నాళ్ల మిస్ అవుతూనే ఉంది.
బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ.. లుక్ అదిరింది!
బిగ్ బాస్ గేమ్ షోతో బాగా పాపులర్ అయింది దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్ సీజన్ 4 తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. బిగ్బాస్ షో పుణ్యమా అని చిరంజీవి కంటపడింది. గాడ్ ఫాదర్లో ఓ చిన్న రోల్ చేసి మెప్పించింది. ఆ తర్వా త ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇక ‘లంబసింగి’తో హీరోయిన్గా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు కానీ.. దివి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివి. ఆమె ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్ను పోస్టర్లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
బిగ్బాస్
'బిగ్బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
కల్యాణ్ డ్యూటీ చేసేది మాతోనే.. తనను తొలగించలేదు!
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి
బిగ్బాస్ హౌస్లో ఆడియన్స్.. టాప్ 5కి చేర్చండి అన్న ఇమ్మూ
పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా..
తల్లయిన బిగ్బాస్ సోనియా.. పోస్ట్ వైరల్
కొత్త కెప్టెన్గా భరణి.. ఆమె జైలుకు!
రీతూ ఎలిమినేషన్కు కారణాలివే! అదే ప్లస్సు, మైనస్!
ఓడిపోయానంటూ ఏడ్చిన రీతూ.. టాప్ 5 వీళ్లేనంటూ..
A to Z
ఓటీటీలో 'కాంత'.. ప్రకటన వచ్చేసింది
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగ...
మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వైద్య రంగంలో చాలా అవకతవకలు జరుగుతుంటాయి. వాటిపై ఇప...
నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అంతం...
'బెడ్రూమ్ వీడియో ల్యాప్టాప్లో బంధిస్తే'.. నునాకుజి మూవీ చూడాల్సిందే!
ఓటీటీలు వచ్చాక సినిమాల పరంగా కంటెంట్కు కొదువే లేద...
ఇడియట్స్ మళ్లీ కలిస్తే?
ఆమిర్ఖాన్ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్’ మూవీ సీక్...
ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం భాజాపా తరఫున...
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తి...
రాత్రిపూట మనోజ్ ఫోన్ కాల్.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్ నటుడు
సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్గా చూస...
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్.. వేదికలు ఇవే..!
హైదరాబాద్ గ్రాండ్ ఈవెంట్కు వేదికగా నిలవనుంది. ప్...
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ...
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంక...
ప్రియాంక పీఆర్ స్టంట్? వాళ్లు నిజమైన ఫ్యాన్స్ కాదా?
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ ప్లీజ్ అని జనాల...
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. హీరోయిన్గా ఏకంగా మిస్ యూనివర్స్..!
తన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా...
టాలీవుడ్ హీరోయిన్స్ రీ ఎంట్రీ.. ఆమెకు మాత్రమే కలిసొచ్చింది..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం సులభమే....
రేణుకా స్వామి సమాధి ధ్వంసం.. ఇది ఎవరి పని?
అభిమానిని హత్య చేసిన కేసులో జైల్లో ఉన్న కన్నడ స్టా...
సినిమాల్లో అవకాశాలు లేవ్.. చాలా బాధపడ్డా!
49 ఏళ్ల వయసులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు స...
ఫొటోలు
Karthika Nair : నాలో ఓ భాగం కోల్పోయా.. నటి రాధ కూతురు కార్తీక ఎమోషనల్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ (ఫొటోలు)
'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)
ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)
‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘నయనం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్ బ్యూటీ లుక్ (ఫొటోలు)
ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)
Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)
యూత్ను గ్లామర్తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)
గాసిప్స్
View all
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు.. ‘స్పిరిట్’ కోసం అన్ని కోట్లా?
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి
నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్కు ముందే సంచలనం!
రివ్యూలు
View all
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
2
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
3
‘కాంత’ మూవీ రివ్యూ
సినీ ప్రపంచం
డల్లాస్లో హీరోయిన్ శ్రీలీల చిల్.. బ్లాక్ డ్రెస్లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అందాలు..!
డల్లాస్లో హీరోయిన్ శ్రీలీల సందడి..బ్లాక్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ అందాలు..టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ అలాంటి లుక్స్..కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోదావరి టూర్..బ్యూటీఫుల్ డ్రెస్లో ప్రియమణి హోయలు..డిఫరెంట్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ పిక్స్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)
కాంతారపై రణ్వీర్ సింగ్ కాంట్రవర్సీ.. స్పందించిన సీనియర్ హీరో భార్య..!
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇటీవల కాంతార మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో కాంతార సీన్ను ఇమిటేట్ చేశాడు. అదే కాంతార ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించింది. తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.ఈ వివాదం కాస్తా మరింత ముదరడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరాడు. రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశమని వివరణ ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంపై సీనియర్ హీరో గోవిందా సునీతా అహుజా స్పందించారు. ఈ విషయంలో రణ్వీర్ సింగ్కు ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకపోవచ్చని అన్నారు. కానీ దక్షిణాది ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు.. అందుకే వారికి అది నచ్చలేదని సునీతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.అసలేం జరిగిందంటే..ఈవెంట్లో స్టేజీపై రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్వీర్ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.కాంతార మూవీ..రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్బస్టర్గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.
అఖండ-2 రిలీజ్.. మరో టీజర్ వచ్చేసింది
బాలయ్య అఖండ-2 వివాదం తర్వాత ఎట్టకేలకు రిలీజవుతోంది. నాలుగైదు రోజుల చర్చల తర్వాత ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అఖండకు సీక్వెల్గా వస్తోన్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు క్లియర్ కావడంతో ఈ శుక్రవారం అఖండ-2 థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మరో టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ-2 రిలీజ్ టీజర్ పేరుతో విడుదలైంది.తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై జీవో..తెలంగాణలో అఖండ-2 మూవీకి సంబంధించి టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.50, మల్టీ ప్లెక్స్ల్లో రూ.100 వసూలు చేసుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ పెంచిన ధరలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డిసెంబర్ 11 రాత్రి 8 గంటల ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేట్ నిర్ణయించారు. పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెల్లించాలని జీవోలో వెల్లడించారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్పై అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా స్క్రీన్ చేయాలని సూచించారు.
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సినిమాలు చూడం: హీరో కార్తి
‘హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ‘అన్నగారు వస్తారు’ మూవీ ఉంటుంది’ అన్నారు హీరో కార్తి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్ లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్ ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది.⇢ నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.⇢ కథల పరంగా కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను. నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్ లో అక్కడి సినిమాలు ఇక్కడ ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాసోవర్ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్ లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు.⇢ డైరెక్టర్ నలన్ గత సినిమాలు శాడ్ ఎండింగ్ తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్ గా ఉంటుంది. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది.⇢ నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్ తో ఉంటాయి. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడు. సంతోష్ నారాయణన్ ను ఇంట్రడ్యూస్ చేసింది నలన్ కుమారస్వామి. అయితే ఈ సినిమాకు నలన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడు. కానీ సంతోష్ వచ్చి నేనే వర్క్ చేస్తా అని అడిగి మరీ మూవీకి జాయిన్ అయ్యాడు.⇢ హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్ ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.⇢ నేను టీమ్ వర్క్ ను బిలీవ్ చేస్తాను. దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసుకుంటాం. సెట్ లో సీన్ చేసే ముందు కూడా మాట్లాడుకుంటాం. నాకు అనిపించిన సజెషన్స్ చెబుతాను. నేను క్యారెక్టర్ లో ఉండిపోతాను కాబట్టి ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. నావంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేస్తుంటా.⇢ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మూవీకి ఏం కావాలన్నా చేశారు. అన్నగారు వస్తారులో కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం. ఒకవారం రెండు మూడు సినిమాలు వచ్చినా తప్పులేదు. ప్రేక్షకులు ఒక మూవీ తర్వాత మరొక మూవీ చూస్తారు. నేనూ ఒక ఆడియెన్ గా అలాగే చూసేవాడిని. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటారు.⇢ ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని భావోద్వేగాలు, పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలు ఎప్పుడు చూసినా మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి.
అఖండ-2 రిలీజ్.. బన్నీ వాసు కామెంట్స్పై నెటిజన్స్ ఫైర్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా .. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్దఎత్తున చర్చ జరిగింది. మూవీ మేకర్స్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఈ చిత్రాన్ని వేశారు. ఈనెల 5న విడుదల కావాల్సిన అఖండ-2.. చివరి నిమిషంలో అభిమానులకు షాకిచ్చింది.అయితే తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్. అఖండ-2ను డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈనెల 12న దాదాపు ఐదారు చిన్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. సందీప్ రాజ్ మౌగ్లీ, హెబ్బా పటేల్ ఈషా, సైక్ సిద్ధార్థ్ లాంటి చిత్రాలు ముందుగానే డేట్ ప్రకటించారు.కానీ ఊహించని విధంగా బాలయ్య అఖండ-2 ఇదే రోజున రిలీజ్ చేస్తున్నారు. దీంతో సందీప్ రాజ్ మూవీ మౌగ్లీ ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య సినిమా వాయిదా ఎఫెక్ట్ చిన్న సినిమాల రిలీజ్కు అడ్డంకిగా మారింది. ఈ విషయంపై డైరెక్టర్ సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా ఇవాళ హెబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్లో అఖండ-2 సినిమా వల్ల బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు తప్పుకోవాల్సిన పరిస్థితిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న సినిమాలు తప్పుకుంటున్నాయా? అన్న ప్రశ్నకు నిర్మాత బన్నీ వాసు స్పందించారు.ఈ ప్రశ్నకు బన్నీ వాసు స్పందిస్తూ.. అఖండ-2ను పెద్దలారీతో పోల్చారు. చిన్న సినిమాలను చిన్న కారుగా అభివర్ణించారు. 'హైవేపై మనం చిన్నకారులో వెళ్తున్నాం.. మన వెనకాల పెద్ద లారీ వస్తోంది.. వాడు హారన్ కొడితే.. మన కారు పక్కకు తప్పుకోవాల్సిందే' అన్నారు. అలా కాదంటే.. మనం ఎక్కడికో వెళ్లిపోతాం అంటూ బన్నీ వాసు కామెంట్స్ చేశారు.అయితే చిన్న సినిమాలను ఉద్దేశించి బన్నీ వాసు కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. చిన్న చిత్రాలను కించపరిచేలా బన్నీ వాసు వ్యాఖ్యలు ఉన్నాయంటూ సినీ ప్రియులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్పై రావాల్సిన ఈ చిత్రం.. అఖండ-2 దెబ్బకు క్రిస్మస్కు తరలిపోయింది.ఇండస్ట్రీ లో అందరు తప్పక "Jai Balayya" అని తప్పుకుంటున్నారా ?"Highway మీద పెద్ద vehicles కి దారి ఇవ్వకపోతే మనకే risk" - #BunnyVas#Akhanda2 #Balakrishna pic.twitter.com/p0ujehI0kR— Daily Culture (@DailyCultureYT) December 10, 2025
వెంకీమామ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ మూవీ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 13న వెంకీ మామ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్కు అదే రోజు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రేమంటే ఇదేరా 4కె ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా వెంకీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 13న రీ రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. కొత్త రిలీడ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో బర్త్డే రోజు ఈ సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న వెంకీమామ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అఖండ-2 వాయిదా పడడం, చిన్న సినిమాలు రిలీజ్ ఉండడం వల్లే ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.కాగా.. 1998లో వచ్చిన ఈ మూవీకి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ ప్రేమకథా చిత్రంలో వెంకటేష్, ప్రీతి జింటా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్కుమార్ సంయుక్తంగా నిర్మించారు.#PremanteIdera re-release postponed!Stay tuned for new release date! #PremanteIderaReRelease #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/qrXeoDrRAl— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2025
టాలీవుడ్లో మిస్ అవుతున్న 'నవ్వు'
నవ్వడం ఓ భోగం. నవ్వించడం యోగం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బోలెడంత మంది కమెడియన్స్. ఇలాంటి మూవీస్ తీసే జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ లాంటి చాలామంది దర్శకులు. కానీ ఇప్పుడు కమెడియన్స్ తగ్గిపోయారు. ఆ తరహా చిత్రాలు తీసే డైరెక్టర్స్ కనిపించట్లేదు. ఇంటిల్లిపాదీ చూసే హాస్య భరిత సినిమాలూ తగ్గిపోయాయి. చెప్పాలంటే టాలీవుడ్లో 'నవ్వు' సరిగా వినిపించట్లేదు. ఇంతకీ దీనికి కారణమేంటి?ఒకప్పుడు కామెడీ సినిమాలకు తెలుగు చిత్ర పరిశ్రమ కేరాఫ్ అడ్రస్. దేశంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర పదుల సంఖ్యలో కమెడియన్స్ ఉండేవాళ్లు. వీరిని ప్రధానంగా పెట్టి 'ఎవడి గోల వాడిది', 'జంబలకిడి పంబ' లాంటి సినిమాలు తీసేవారు. అలాంటి వాటికి ప్రేక్షకుల నుంచి కూడా విశేషాదరణ ఉండేది. కాల క్రమేణా కమెడియన్స్ చేసే కామెడీ.. హీరోలు చేయడం మొదలుపెట్టారు. పదేళ్ల ముందు ఈ ట్రెండ్ బాగా కనిపించింది. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ తాము కామెడీ పండించడంలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు.గత కొన్నాళ్ల నుంచి మాత్రం తెలుగులో కామెడీ సినిమాల శాతం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల వల్ల చాలావరకు హాస్యం అనేదే సరిగా కనిపించట్లేదు. స్టార్ దర్శకులు.. పాన్ ఇండియా మోజులో పడ్డారంటే ఓ అర్థముంది. ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త దర్శకులు కూడా సింపుల్ బడ్జెట్లో కామెడీ, ఎంటర్టైనర్ కాన్సెప్టులు అస్సలు ఆలోచించడం లేదు. పదుల కోట్లు ఖర్చయ్యే భారీ యాక్షన్ స్టోరీలని సిద్ధం చేసుకుంటున్నారు. పోనీ బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొడుతున్నారా అంటే లేదు. పది చిత్రాలు తీస్తే అందులో ఒకటో రెండు మాత్రం ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాయి. మిగిలినవి సోషల్ మీడియాలో మాత్రం హిట్ అనిపించుకుంటున్నాయి.చెప్పాలంటే పదిహేను ఇరవైళ్ల క్రితం తెలుగు చిత్రసీమకు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా ఇలానే ఉండేది. ఎందుకంటే దర్శకనిర్మాతలు అందరూ ఇంటిల్లిపాదీ చూసే కథల్ని సినిమాలుగా తీసేవాళ్లు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్.. ప్రతివారం థియేటర్లకు క్యూ కట్టేవారు. హిట్ టాక్తో పాటు కలెక్షన్స్ అలానే వచ్చేవి. కానీ గత కొన్నేళ్లు నుంచి మాత్రం టార్గెట్ ఆడియెన్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.అయితే యూత్ కోసం బోల్డ్ కాన్సెప్ట్ మూవీస్ తీస్తున్నారు. లేదంటే యాక్షన్ సినిమాలు అంటున్నారు. ఇవి కాదంటే పీరియాడిక్ మూవీస్ అని హడావుడి చేస్తున్నారు. తప్పితే తక్కువ బడ్జెట్లో మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ మూవీస్ చేద్దామని యువ దర్శకులు గానీ సీనియర్ డైరెక్టర్స్ గానీ ఆలోచించట్లేదా అనిపిస్తుంది. ఈ ఏడాదినే తీసుకోండి.. సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఏకంగా రూ.200-300 కోట్ల వసూళ్లు అందుకుంది. దీనిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. తెలుగు ఆడియెన్స్ కామెడీ మూవీస్ కోసం ఎంతలా తహతహలాడుతున్నారో.'సంక్రాంతికి వస్తున్నాం' రేంజులో కానప్పటికీ.. ఈ ఏడాది 'మ్యాడ్ స్క్వేర్', 'సింగిల్', 'లిటిల్ హార్ట్స్', 'కె ర్యాంప్', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాయి. కాకపోతే వీటిలో స్టార్స్ ఎవరూ లేరు. కాబట్టి వీటికి పెద్దగా రీచ్, గుర్తింపు దక్కలేదు. అయితే మిడ్ రేంజు హీరోలు, చిన్న హీరోలతో కామెడీ సినిమాలు తీయడం కంటే స్టార్ హీరోలతో కామెడీ చిత్రాలు తీస్తే వాటికి ఉండే రేంజ్ వేరని చెప్పొచ్చు. సరైన కామెడీ కాన్సెప్ట్, స్టార్ హీరోలతో మూవీస్ చేస్తే ఆడియెన్స్ కచ్చితంగా థియేటర్లకు వచ్చే అవకాశముంటుంది. ఎంతసేపు పైరసీ, మరేదో అని బాధపడతారు తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చే కామెడీ చిత్రాల్ని తీద్దామనే విషయాన్ని మాత్రం సరిగా ఆలోచించట్లేదా అనిపిస్తుంది. అందుకే టాలీవుడ్లో మనస్ఫూర్తిగా నవ్వుకోవడం అనేది చాన్నాళ్ల మిస్ అవుతూనే ఉంది.
బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ.. లుక్ అదిరింది!
బిగ్ బాస్ గేమ్ షోతో బాగా పాపులర్ అయింది దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్ సీజన్ 4 తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. బిగ్బాస్ షో పుణ్యమా అని చిరంజీవి కంటపడింది. గాడ్ ఫాదర్లో ఓ చిన్న రోల్ చేసి మెప్పించింది. ఆ తర్వా త ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇక ‘లంబసింగి’తో హీరోయిన్గా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు కానీ.. దివి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివి. ఆమె ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్ను పోస్టర్లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజా సంక్రాంతికి పోటీకి సిద్ధమైపోయాడు. ఇటీవల మాస్ జాతరతో మెప్పించిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీలో డింపుల్ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలిచింది. రిలీజ్కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. అద్దం ముందు అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ రవితేజ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. హీరోయిన్గా ఏకంగా మిస్ యూనివర్స్..!
తన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కమెడియన్ సత్య. బ్రహ్మనందం, అలీ తర్వాత టాలీవుడ్కు దొరికిన ఆణిముత్యం ఆయనే. ప్రస్తుతం కమెడియన్గా ఫుల్ స్వింగ్లో ఉన్న సత్య.. ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సత్య నటిస్తోన్న తాజా చిత్రం జెట్లీ. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఇవాళ రియా సింగా పుట్టినరోజు కావడంతో విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీతోనే రియా టాలీవుడ్కు పరిచయమవుతోంది. రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా-2024 టైటిల్ విన్నర్ కావడం విశేషం. కమెడియన్ సత్య సరసన ఏకంగా మిస్ యూనివర్స్ హీరోయిన్గా కనిపించడంపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.కాగా.. జైపూర్కు చెందిన రియా సింగా గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ను గెలుచుకుంది. అంతేకాకుండా 2024 నవంబర్ 16న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె టాప్ 30 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. మిస్ యూనివర్స్ ఇండియా కంటే ముందు.. ఆమె మిస్ టీన్ ఎర్త్ 2023 టైటిల్ను కూడా గెలుచుకుంది.Miss Universe India in a Universal Telugu cinema 👸❤️🔥 Introducing #RheaSingha, landing from the world of #JETLEE ✈️Wishing the Amazing and Gorgeous Rhea a very Happy Birthday 🥳A @RiteshRana's turbulence 🛫Starring #Satya, #RheaSingha, @vennelakishoreProduced by… pic.twitter.com/1h0pYj6I6T— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2025
సినిమా
Priyanka: 'కల్కి 2' నుంచి షాకింగ్ అప్డేట్.. కామెంట్స్ వైరల్
Nivetha: ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్
చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి
ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!
పెద్దికి పెద్ద కష్టం..! పాన్ ఇండియా స్టార్స్
AI ఎఫెక్ట్ తో కోర్టులను ఆశ్రయిస్తున్న సినీ తారలు
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్
రామ్ చరణ్ బంగారం.. వైరల్ అవుతోన్న బండ్ల గణేష్ కామెంట్స్
పుష్ప ఏపిక్ తో బాక్సాఫీస్ పీస్ పీస్ చేయడానికి సుకుమార్ రెడీ
సంక్రాంతి మూవీ ఫెస్టివల్.. ఈ సారి మాములుగా ఉండదు
