Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Netflix announced our acquisition of Warner Bros to buy the studios1
నెట్‌ఫ్లిక్స్ బిగ్ డీల్.. వార్నర్‌ బ్రదర్స్‌ కోసం బిడ్‌!

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో బిగ్‌ డీల్‌ ఖరారు కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ఒప్పందం కోసం బిడ్‌ వేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌కు చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్‌ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 72 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)గా ఉంది.ఈ లెక్కన ఒక్కో వార్నర్‌ బ్రదర్స్‌ షేరుకు 27.75 డాలర్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) బిడ్‌ వేసినట్లు తెలిసింది. సీఎన్‌ఎన్‌, టీబీఎస్‌, టీఎన్‌టీ వంటి కేబుల్‌ ఛానళ్లలో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను వార్నర్‌ బ్రదర్స్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. హాలివుడ్‌లో అత్యంత విలువైన కెంపెనీగా ఎదిగిన నెట్‌ఫ్లిక్స్‌ ఇలాంటి బిగ్ డీల్ చేపట్టడం ఇదే తొలిసారి.ఈ బిగ్‌ డీల్‌ కొనుగోలుతో హెచ్‌బీఓ నెట్‌వర్క్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం కానుంది. అలాగే ది సొప్రానోస్‌, ‘ది వైట్‌ లోటస్‌ వంటి హిట్‌ షోల లైబ్రరీలతో పాటు హ్యారీ పోటర్‌, ఫ్రెండ్స్‌ వంటి సినిమా, టీవీ ఆర్కైవ్స్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌ చేతుల్లోకి వెళ్లనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అసాధారణమైన వినోదాన్ని అందిస్తామమని తెలిపింది. Today, Netflix announced our acquisition of Warner Bros. Together, we’ll define the next century of storytelling, creating an extraordinary entertainment offering for audiences everywhere. https://t.co/rXPFMNIs1A pic.twitter.com/0pdsMUEob8— Netflix (@netflix) December 5, 2025

JD Chakravarthy is now officially present on social media2
'నేను వచ్చేస్తున్నా'.. జేడీ చక్రవర్తి గ్రాండ్ ఎంట్రీ

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఖాతా లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? అని ‍అడిగితే టక్కున లేరనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ డిజిటల్ యుగం అంతా సామాజిక మాధ్యమాల మీదనే నడుస్తోంది. ఇప్పుడంతా అరచేతిలోనే ప్రపంచం కనిపిస్తోంది. సోషల్ మీడియాతో ఒక్క రోజులోనే వరల్డ్ ‍వైడ్ ఫేమస్‌ అవుతున్న రోజులివి. మరి ఇంతలా ప్రపంచాన్ని శాసిస్తోన్న సోషల్ మీడియాలో స్టార్‌ నటుడు ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదంటే నమ్ముతారా? ‍మీరు అవునన్నా.. కాదన్నా ఇది నమ్మి తీరాల్సిందే. తాజాగా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఆ నటుడు ఎవరో మీరు చదివేయండి. నాగార్జున శివ మూవీలో తన విలనిజం, నటనతో మెప్పించిన జేడీ చక్రవర్తి. ఆయనకు ఇప్పటి వరకు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా లేదు. తాజాగా జేడీ చక్రవర్తి సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. జేడీ మ్యాక్స్ మోడ్‌ పేరుతో ఈ సోషల్ మీడియా అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఇందులో జేడీకి సంబంధించిన ఓ వీడియోను కూడా చేశారు. నేను దేవున్ని నమ్మను.. నువ్వు విన్నది కరెక్టే.. నేను దేవుళ్లను నమ్ముతాను.. అందరి దేవుళ్లను నమ్ముతాను.. జై ఆంజనేయ.. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నా అంటూ వీడియోలో జేడీ చక్రవర్తి మాట్లాడారు. కాగా.. జేడీ చక్రవర్తి శివ, గాయం, సత్య లాంటి చిత్రాల్లో మెప్పించారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. సోషల్ మీడియాతో అభిమానులతో టచ్‌లోకి వచ్చేస్తున్నారు. కాగా.. జేడీ చివరిసారిగా దయా అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌ 2023లో జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. View this post on Instagram A post shared by JD chekravarthy (@jdmaxmode)

Megastar chiranjeevi couples attends naming ceremony of Manager3
నామకరణ వేడుకలో చిరంజీవి దంపతులు.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి తన మేనేజర్ కుమార్తె నామకరణ వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజర్ స్వామినాథ్ కుమార్తెకు మెగాస్టార్ పేరు పెట్టారు. చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్‌ ప్రస్తుతం అనిల్ రావిపూడితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్‌గారు వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇ‍ప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ సైతం కీలక పాత్రలో నటించారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025

Nanna Malli Raava Movie OTT Streaming Now4
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

తెలుగులో పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్స్.. విడుదలకు ముందే పూర్తయిపోతాయి. చిన్నచిత్రాలకు మాత్రం కొన్నిసార్లు రిలీజ్ తర్వాత లేదంటే ఎప్పటికో అవుతాయి. అలా కొన్నిసార్లు థియేటర్లలోకి వచ్చిన నెలల తర్వాత కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా ఓ తెలుగు చిత్రం దాదాపు 8 నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది.అప్పట్లో పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా చేసిన సత్యప్రకాశ్‌.. ప్రస్తుతం ఒకటి అరా చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'నాన్నా మళ్లీ రావా!'. ప్రభావతి, రిత్విక్, హారిక, శిరీష ఇతర పాత్రలు పోషించారు. నిర్దేశ్‌ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)రిలీజ్ టైంలో ఈ సినిమా గురించి మాట్లాడిన సత్యప్రకాశ్.. నన్నెంతగానో కదిలించిన కథ ఇది. చిత్రీకరణలో ప్రతిరోజూ గ్లిజరిన్‌ అవసరం లేకుండానే కన్నీళ్లు వచ్చేవి. కథలోని ప్రతి సందర్భం వాస్తవంలా అనిపించేది అని చెప్పుకొచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ 'నాన్న చుట్టూ తిరిగే కథ ఇది. భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది' అని అన్నారు.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ విడుదలయ్యాయి. రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా జీ5లో, స్టీఫెన్ అనే డబ్బింగ్ బొమ్మ నెట్‌ఫ్లిక్స్‌లో, సుధీర్ బాబు 'జటాధర'తో పాటు రష్మిక 'థామా' చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 'డీయస్ ఈరే' అనే హారర్ డబ్బింగ్ సినిమా.. హాట్‌స్టార్‌లోకి వచ్చాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్.. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చాయి.(ఇదీ చదవండి: నాగార్జున గోవాకు పిలిచి మరీ వార్నింగ్‌..: దర్శకుడు)

Divya Khossla described Bollywood filled with crocodiles5
'బాలీవుడ్‌ అంతా మొసళ్లతో నిండిపోయింది'.. నటి సంచలన కామెంట్స్..!

ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మొసళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్య ఖోస్లా ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడింది. తాను విలువలతో రాజీ పడకుండా నిజాయితీగా ఉంటానని తెలిపింది. అవకాశాల కోసం తానెప్పుడు ఆత్మ గౌరవాన్ని అమ్ముకోనని దివ్య ఖోస్లా పేర్కొంది. ఆస్క్ మీ ఎనిథింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.దివ్య ఖోస్లా మాట్లాడుతూ..'బాలీవుడ్‌లో చాలా మొసళ్లు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ నువ్వు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. పని కోసం నా ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడూ అమ్ముకోను. యూకేలో ఓ సినిమా కోసం సున్నా డిగ్రీల టెంపరేచర్‌లో దాదాపు 42 రోజుల పని చేశా. అది నా కెరీర్‌లో అత్యంత అద్భుతమైన షూట్. దాదాపు మైనస్ 10 డిగ్రీలు.. అయినా కూడా నాన్-స్టాప్‌గా చిత్రీకరించాం. ఇతర సినిమాలతో పోల్చడానికి నాకు ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది.' అని తెలిపింది.అంతేకాకుండా భూషణ్‌కుమార్‌తో విడాకులపై కూడా దివ్య ఖోస్లా స్పందించింది. మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. కానీ మీడియా అది నిజం కావాలని కోరుకుంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా.. ఆమె 2005లో టీ-సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే దివ్య ఖోస్లా చివరిసారిగా నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి నటించిన థ్రిల్లర్-కామెడీ ఏక్ చతుర్ నార్‌లో కనిపించింది.

Prabhas Rajasaab Movie OTT Deal And Details6
ఎట్టకేలకు 'రాజాసాబ్' ఓటీటీ డీల్ క్లోజ్

ప్రభాస్ ప్రస్తుతం 'స్పిరిట్' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి నుంచి 'రాజాసాబ్' మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం తొలుత ట్రైలర్, తర్వాత ఓ పాటని రిలీజ్ చేశారు. అలానే ఓవర్సీస్‌లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఓటీటీ డీల్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఇ‍ప్పుడు అది ఎట్టకేలకు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్)ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తీసిన హారర్ ఫాంటసీ మూవీ ఇది. కొన్నాళ్ల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌తో కంటెంట్ ఏంటనేది చూచాయిగా క్లారిటీ వచ్చేసింది. హారర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టింది. సదరు ముంబై కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని తిరిగిచ్చే విషయంలో కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీ డీల్ పెండింగ్‌లో ఉండిపోయింది.ఇప్పుడన్నీ సమస్యలన్నీ క్లియర్ కావడంతో 'రాజాసాబ్' డిజిటల్ హక్కుల్ని జియో హాట్‌స్టార్ ఓటీటీ.. భారీ ధరకు సొంతం చేసుకుంది. మరి 6 వారాలకు ఒప్పందం కుదుర్చుకున్నారా లేదంటే 8 వారాలకు కుదుర్చుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Ananya Nagalla And Rakul Preet Singh Latest7
షార్ట్ డ్రస్‌లో అనన్య.. పెళ్లికూతురిలా దివ్య భారతి!

షార్ట్ బ్లాక్ డ్రస్‌లో అదరగొట్టేస్తున్న అనన్య నాగళ్లపెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ దివ్య భారతికలర్‌ఫుల్ ఔట్ ఫిట్‌లో మెరిసిపోతున్న రకుల్2025 జ్ఞాపకాలని పంచుకున్న ఆలియా భట్నవంబర్ మెమొరీస్ అంటూ నివేదా థామస్ పోస్ట్దేవాలయంలో పూజా చేస్తూ భాగ్యశ్రీ బోర్సే బిజీ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by R R (@rachita_instaofficial) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath)

khudiram Bose inspiring biopic Movie premieres on OTT8
18 ఏళ్లకే అమరుడు.. ఓటీటీకి వచ్చేసిన వీరుడి బయోపిక్..!

పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఖుదీరామ్‌ బోస్ జీవితం ఎంతోమంది యువతకు ఆదర్శం. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఖుదీరామ్‌ బోస్‌. ఈ చిత్రానికి విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించగా.. విజయ్‌ నిర్మించారు. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని ఇ‍ప్పటికే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో ప్రదర్శించారు.తాజాగా ఈ చిత్రంలో ఓటీటీకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేవ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. డిసెంబర్ 3, 1889న జన్మించిన ఖుదీరామ్ బోస్ కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశం కోసం తన ప్రాణాలర్పించాడు. ఇటీవలే అతని జయంతి సందర్భంగా యావత్ దేశం నివాళులర్పించింది కాగా.. ఈ సినిమాలో రాకేశ్‌ జాగర్లమూడి, వివేక్‌ ఒబెరాయ్‌, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. Khudiram Bose is streaming on the Central Government’s Waves OTT. Wishing the team all the very best. pic.twitter.com/t6CAzvhPto— Rajinikanth (@rajinikanth) December 5, 2025

Samantha Skip Honeymoon After Wedding Raj Nidimoru9
సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్

హీరోయిన్ సమంత.. నాలుగు రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సాధారణంగా వివాహం తర్వాత సెలబ్రిటీలు చాలామంది హనీమూన్ ప్లాన్ చేస్తుంటారు. కానీ సామ్ మాత్రం పనిలో పడిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.చివరగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో సమంత కనిపించింది. తర్వాత తానే నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీ తీసింది. ఈ ఏడాది మే నెలలో చిత్రం రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. తానే నిర్మాత, హీరోయిన్‌గా సమంత.. 'మా ఇంటి బంగారం' అనే చిత్రం చేస్తోంది. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.(ఇదీ చదవండి: సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?)మధ్యలో సమంత పెళ్లి వల్ల కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని సమంత బయటపెట్టింది. సెట్స్‌లో దర్శకురాలు నందినీ రెడ్డితో ఉన్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలా పెళ్లయిన నాలుగు రోజులకే హనీమూన్ లాంటివి ప్లాన్ చేసుకోకుండా పనిలో పడిపోయిందనమాట.'మా ఇంటి బంగారం' సినిమా విషయానికొస్తే.. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. కొన్నాళ్ల ముందే నందినీ రెడ్డి దర్శకత్వంలో మొదలైంది. ఈ సినిమాని సమంత నిర్మిస్తున్నప్పటికీ.. రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

allu arjun Fans fight at vimal Theatre for pushpa 2 special Show10
పుష్ప-2 స్పెషల్ షో.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్..!

ఐకాన్ స్టార్ అ‍ల్లు అర్జున్‌ హీరోగా గతేడాది ఇదే రోజు రిలీజైన చిత్రం పుష్ప-2. ఈ మూవీ డిసెంబర్‌ 2, 2024న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇందుకోసం బాలానగర్‌లో విమల్ థియేటర్‌లో షో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్‌ వద్ద బన్నీ ఫ్యాన్స్‌ గొడవ పడ్డారు.అయితే ఈ షో టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్‌ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్‌ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సంధ్య థియేటర్‌ ఘటన..పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్‌ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్‌ ఇండస్ట్రీ అండగా నిలిచింది. ప్రస్తుతం శ్రీతేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాుడు. Sad to see these things This has happened almost for 3rd time during the Pushpa 2 release, then Arya 2 re-release & now in Pushpa 2 re-release ..Strict ga online trolls lo matrame undandi, OFFLINE lo kaadu 🙏#1YearForIndianIHPushpa2 #Pushpa2TheRule pic.twitter.com/9ix0F9cepz— Sumanth (@SumanthOffl) December 4, 2025

Advertisement
Advertisement