ప్రధాన వార్తలు
నాజూగ్గా కల్యాణి ప్రియదర్శన్.. లంగా ఓణీలో శ్రీదేవి!
లంగా ఓణీలో మరింత అందంగా 'కోర్ట్' శ్రీదేవినాజూగ్గా మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్మోడ్రన్ డ్రస్లో నభా నటేశ్ హొయలుకొంటె చూపులతో మాయ చేస్తున్న అనసూయఏడాది జ్ఞాపకాల్ని వీడియోగా పోస్ట్ చేసిన కాయదు View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)
ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా తమిళ, కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్కి చెందిన నందిని.. సొంత భాషలో కాకుండా కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. రీసెంట్గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చింది.అలాంటిది సడన్గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్.. నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. తోటినటుడు సతీష్ మాట్లాడుతూ.. నందినికి ఇంకా పెళ్లి కాలేదు. అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.🕊️ Rest in Peace, Actress Nandini🙏😢Your performance as Durga in Gauri serial will always be remembered Gone too soon. 💔#KalaignarTV #Nandini #Gauri #Durga #RestInPeace pic.twitter.com/UZR3P9Rf6x— Kalaignar TV (@kalaignartv_off) December 29, 2025
దళపతి విజయ్ 'వీడ్కోలు'.. ఆ హీరోల్లా చేయడుగా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. నటనకు వీడ్కోలు పలికేశాడు. ఇతడి చివరి సినిమా 'జన నాయగణ్'.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా మలేసియాలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే విజయ్ మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మరి మాటపై కచ్చితంగా నిలబడతాడా? అసలు విజయ్ ప్లాన్ ఏంటి?నటీనటులకు రాజకీయాలు కొత్తేం కాదు. టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. చిరంజీవి పూర్తిగా రాజకీయాలు అని అన్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మేకప్ వేసుకున్నారు. పవన్ కూడా మధ్యలో పాలిటిక్స్ అని కొన్నాళ్లు నటనకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ఈయనకు లేదు. పలు సందర్భాల్లో ఆయన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయాలు అన్నారు గానీ తర్వాత వచ్చి మళ్లీ సినిమాలు చేసుకున్నారు. అయితే తమిళంలో ఎమ్జీఆర్, జయలలిత మాత్రం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి మరీ రాజకీయాల్లోకి వెళ్లారు. సక్సెస్ అయ్యారు కూడా. మరి దళపతి విజయ్ తన మాట మీద నిలబడి పూర్తిగా సినిమాలకు దూరమైపోతాడా లేదా అనేది చూడాలి?ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ 'టీవీకే' పార్టీ కూడా బరిలో ఉంది. ఇందులో గెలిచేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ హీరోకి కూడా అంత పెద్ద కోరికలేం లేవు. ఒకవేళ సీఎం అయితే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టేయొచ్చు. కొన్ని స్థానాలు గెలుచుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు బట్టి విజయ్ ఆలోచన మారే అవకాశముంటుంది.విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో కచ్చితంగా మాటమీద నిలబడతానని బల్లగుద్ది చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తిరిగి సినిమాలు చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోల్లో విజయ్ టాప్లో ఉంటాడు. రజనీ, కమల్ దాదాపు రిటైర్మెంట్ దశకు వచ్చేశారు. అజిత్ కూడా చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విక్రమ్ లాంటి హీరోలున్నా వాళ్లు హిట్స్ అందుకోలేకపోతున్నారు. శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు స్టార్ రేంజ్కి చేరుకోవడానికి ఇంకా టైముంది. మరి విజయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ తమిళ హీరో ఎవరో?
ప్రేమలేఖలన్నీ చిత్తు కాగితాలు! 38 ఏళ్లుగా అతడే ఊపిరిగా..
కేరళ నటి అభిరామి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక సినిమాలు చేసింది. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చార్మినార్, చెప్పవే చిరుగాలి, లెవన్, 12ఎ రైల్వే కాలనీ, సరిపోదా శనివారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇటీవలే ఈ నటి పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.ఇప్పటికీ.. ఎప్పటికీ..'హ్యాపీ యానివర్సరీ మై లవ్.. 14వ ఏట నుంచి ఇప్పటి (42వ ఏట) వరకు నా సుఖదుఃఖాల్ని, జయాపజయాలను, భయాలను, ఆశనిరాశలను అన్నింటినీ నీతోనే పంచుకున్నాను, ఇకమీదట కూడా పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఆప్తమిత్రుడిగా నిలబడ్డందుకు థాంక్యూ.. నీ ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని నటి రాసుకొచ్చింది.ప్రేమ ఎలా మొదలైందంటే?కేరళ తిరువనంతపురానికి చెందిన అభిరామి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. వారికి అభిరామి ఒక్కరే సంతానం. స్కూల్ పక్కనే వీరి ఇల్లు ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చాలామంది అభిరామికి ప్రేమలేఖలు రాసి పంపేవారు. కొందరైతే నేరుగా ఇంటికొచ్చేవారు. కానీ ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు నటి. అయితే తనకు స్కూల్లో ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడే రాహుల్. ప్రముఖ రచయిత పవన్ మనవడే రాహుల్.అలా మళ్లీ కలిశారువీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి మిత్రులు. తర్వాత పై చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోయింది. కొంతకాలానికి రాహుల్ కూడా యూఎస్ వెళ్లాడు. అలా మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. ఆ ప్రేమను జీవితాంతం పదిలంగా కాపాడుకునేందుకు పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. 2023లో ఈ జంట ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు కల్కి అని నామకరణం చేసి పెంచుకుంటున్నారు.చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. సరిగ్గా ఆ హీరోకి ప్రత్యేకమైన రోజే..
బిగ్బాస్
రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్లో మధుర జ్ఞాపకం: తనూజ
గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
ప్రమోషన్ పొందిన వితికా షెరు
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్బాస్' రివ్యూవర్స్.. ?
టాప్ 2లో నా పక్కన ఇమ్మూ... తనూజతో ఆ బాండ్ లేదు!
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్బాస్ బజ్: కల్యాణ్ పడాల నెక్స్ట్ టార్గెట్ అదే!
A to Z
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి క్రిస్మస్ కలిసి రావడ...
ఓటీటీలో మలయాళ హిట్ థ్రిల్లర్.. ఎక్కడంటే?
మలయాళంలో ఈ ఏడాది (క్రిస్మస్ ముందువరకు) 184 సినిమా...
మరో ఓటీటీలోకి క్రేజీ హారర్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
హారర్ సినిమాలు తీయాలంటే హాలీవుడ్ దర్శకుల తర్వాత ఎవ...
వెబ్ సిరీస్ ప్రపంచంలో మరో నటుడు.. అప్పుడే స్ట్రీమింగ్
కథానాయకుడిగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్...
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప...
కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నిరోజుల...
మరో అమ్మాయితో నా భర్త డేటింగ్.. వదిలిపెట్టను : స్టార్ హీరో భార్య
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య...
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖ...
ఆస్కార్ అవార్డ్స్.. 50ఏళ్ల బంధానికి బ్రేక్ వేసిన యూట్యూబ్
ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగ...
'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ
'అవతార్' సినిమాలో మీకు నచ్చిన విషయం ఏంటంటే చాలామంద...
ప్రపంచంలో అందమైన టాప్ టెన్ హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆమె ఒక్కరే..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ...
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీ వచ్చేసి...
చీరకట్టుకున్నా భద్రత లేదు.. వీడియో షేర్ చేసిన 'చిన్మయి'
మహిళల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల ...
మళ్లీ మాతృగడ్డపై ప్రియాంక మోహన్
బహుభాషా నటీనటులకు అడ్వాంటేజ్ ఏమిటంటే ఏదో ఓ భాషలో ...
హీరోగా శంకర్ కుమారుడి ఎంట్రీ.. హీరోయిన్గా బేబమ్మ!
సాధారణంగా ఏ హీరోకైనా, హీరోయిన్కైనా ఓ మంచి హిట్ ప...
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్కు చేదు అనుభవం ఎదురైంది. త...
ఫొటోలు
ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)
అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)
థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)
‘ఓ అందాల రాక్షసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)
సల్మాన్ ఖాన్ 60వ బర్త్డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)
'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
గాసిప్స్
View all
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?
దృశ్యం 3 నుంచి 'ధురంధర్' నటుడు అవుట్?
రేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!
'ధురంధర్'కి భారీ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
జైలర్ 2లో ఐటం సాంగ్!
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
దిగ్గజ గాయని బయోపిక్లో సాయిపల్లవి?
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
రివ్యూలు
View all
3
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
2.75
'దండోరా' సినిమా రివ్యూ
3
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
సినీ ప్రపంచం
'విశ్వంభర' విడుదల ఎప్పుడంటే..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర'.. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ కోసం చిరు వాయిదా వేసుకున్నారు. అపై టీజర్ విషయంలో ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ చెందడంతో వాయిదానే బెటర్ అనుకున్నారు. అందులో గ్రాఫిక్స్ వర్క్ చాలా పేలవంగా ఉందని విమర్శలు రావడంతో మార్పులు చేయాలనుకున్నారు. అయితే, ఎప్పుడు రిలీజ్ అనేది ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇంతలో 'మన శంకర వరప్రసాద్ గారు' లైన్లోకి వచ్చేశాడు. మరో పదిరోజుల్లో విడుదల కూడా కానుంది. కానీ, విశ్వంభర గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.'విశ్వంభర' టీజర్ విషయంలో విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠ పక్కా ప్లాన్తో ఈ ఏడాది మొత్తం విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కోసం కేటాయించి బలమైన ఔట్పుట్ను ఇచ్చారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్పై విస్తృతంగా పరిశీలించి అనేక మార్పులు చేశారట. అయితే, తాజా నివేదికల ప్రకారం 'విశ్వంభర' జూన్ 2026 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 2026లో వస్తున్నందున, రెండు విడుదలల మధ్య ఆరోగ్యకరమైన అంతరాన్ని కొనసాగించాలని మేకర్స్ ఉన్నారట. విశ్వంభర తుది అవుట్పుట్ను మెగాస్టార్ ఆమోదించిన తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ప్రపంచంలోనే టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు విశ్వంభర కోసం పనిచేస్తున్నాయి. ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించాలని వశిష్ఠ తన ప్లాన్ మార్చుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
విశాల్కు జతగా కయాదు లోహర్?
హిట్ కాంబోకు శ్రీకారం పడనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది కోలీవుడ్ వర్గాల నుంచి. నటుడు విశాల్, దర్శకుడు సుందర్.సిలది హింట్ కాంబో అనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు ఆంబళ అనే చిత్రం తెరకెక్కించి మంచి కమర్షియల్ హిట్ సాధించింది. అదే విధంగా అంతకు ముందు రూపొందిన మదగజరాజా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 12 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ హిట్ కాంబో హ్యాట్రిక్కు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మకుటం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విశాల్ తదుపరి సుందర్.సి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సుందర్.సీ తదిపరి రజనీకాంత్ హీరోగా కమలహాసన్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది.అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రం నుంచి సుందర్.సీ వైదొలిగారు. దీంతో తదిపరి ఆయన విశాల్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని సుందర్.సీ సొంత నిర్మాణ సంస్థ అవనీ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి సుందర్.సీ ఆస్థాన సంగీతదర్శకుడు హిప్హాప్ ఆది సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. ఇకపోతే సుందర్.సీ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. అదే సమయంలో గ్లామర్ సన్నివేశాలకు కొదవ ఉండదు. ఇంతకు ముందు ఆంబళ చిత్రంలో విశాల్కు జంటగా హన్సిక నటించారు. మదగజరాజా చిత్రంలో అంజలి, వరలక్ష్మీ శరత్కుమార్ నటించారు. ఈ సారి నటి కయాదు లోహర్ను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డ్రాగన్ చిత్రంతో ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులోనూ నటిస్తున్నారు. అదే సమయంలో తమిళంలోనూ అవకాశాలను అందుకుంటున్నారు. జీవీ ప్రకాశ్కుమార్కు జంటగా ఇమ్మోర్టల్ చిత్రం చేస్తున్న కయాదు లోహర్ ఇప్పుడు విశాల్తో జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రానుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. థియేటర్లలో అదరగొట్టేసింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. లేటు వయసులో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈయన.. గతేడాది ఓ మూవీలో స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించారు. ఇప్పుడు 'కలం కవల్' చిత్రంలో సైకో తరహా పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చారు. డిసెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. జనవరి అని చెప్పారు గానీ ప్రస్తుతానికి తేదీ ఏం వెల్లడించలేదు.(ఇదీ చదవండి: ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్)ఈ వీకెండ్ అంటే జనవరి 2న లేదంటే జనవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ 'కలం కవల్' చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు పోస్టర్, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.'కలం కవల్' విషయానికొస్తే.. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)The legend returns, darker and deadlier. Mammootty in a performance that will leave you breathless. Biggest blockbuster of the season, #Kalamkaval streaming this January only on Sony LIV!#Mammootty @mammukka #Vinayakan #MammoottyKampany #JithinKJose @rajisha_vijayan pic.twitter.com/3ggagRwcAe— Sony LIV (@SonyLIV) December 29, 2025
ఐ బొమ్మ నాదే అనడానికి ప్రూఫ్స్ ఏవి?.. ఇమంది రవి
సినిమాలని పైరసీ చేసి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దాదాపు 12 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పలు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ దొంగిలించి వాడుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా కస్టడీ పూర్తవడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'బెట్టింగ్ యాప్స్తో నాకు సంబంధాలు ఉన్నాయని, వాటిని ప్రమోట్ చేస్తున్నానని అంటున్నారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదు. నా పేరు ఐ బొమ్మ రవి కాదు ఇమంది రవి. ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఏవి? నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా? నేను ఎక్కడికీ పారిపోలేదు. వేరే దేశంలో పౌరసత్వం మాత్రమే తీసుకున్నాను. నేను కూకట్పల్లిలో ఉంటున్నాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను. నాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవి. సరైన టైంలో నిజాలు బయటపెడతా' అని మీడియాతో రవి అన్నాడు.మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడీల సమాచారం సేకరించాం. ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే రవి ఫేక్ ఐడీలు సృష్టించాడు. ఇతడికి చెందిన రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. బెట్టింగ్ యాప్స్తో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర పైరసీ వెబ్సైట్స్తో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాపై ఆరా తీస్తున్నాం. విచారణలో రవితో సంబంధాలు లేవని ప్రహ్లాద్ చెప్పాడు. త్వరలోనే మిగతా ఇద్దరి స్నేహితులను విచారిస్తాం. ఇకపై పైరసీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారు.
నాజూగ్గా కల్యాణి ప్రియదర్శన్.. లంగా ఓణీలో శ్రీదేవి!
లంగా ఓణీలో మరింత అందంగా 'కోర్ట్' శ్రీదేవినాజూగ్గా మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్మోడ్రన్ డ్రస్లో నభా నటేశ్ హొయలుకొంటె చూపులతో మాయ చేస్తున్న అనసూయఏడాది జ్ఞాపకాల్ని వీడియోగా పోస్ట్ చేసిన కాయదు View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)
ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా తమిళ, కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్కి చెందిన నందిని.. సొంత భాషలో కాకుండా కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. రీసెంట్గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చింది.అలాంటిది సడన్గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్.. నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. తోటినటుడు సతీష్ మాట్లాడుతూ.. నందినికి ఇంకా పెళ్లి కాలేదు. అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.🕊️ Rest in Peace, Actress Nandini🙏😢Your performance as Durga in Gauri serial will always be remembered Gone too soon. 💔#KalaignarTV #Nandini #Gauri #Durga #RestInPeace pic.twitter.com/UZR3P9Rf6x— Kalaignar TV (@kalaignartv_off) December 29, 2025
దళపతి విజయ్ 'వీడ్కోలు'.. ఆ హీరోల్లా చేయడుగా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. నటనకు వీడ్కోలు పలికేశాడు. ఇతడి చివరి సినిమా 'జన నాయగణ్'.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా మలేసియాలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే విజయ్ మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మరి మాటపై కచ్చితంగా నిలబడతాడా? అసలు విజయ్ ప్లాన్ ఏంటి?నటీనటులకు రాజకీయాలు కొత్తేం కాదు. టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. చిరంజీవి పూర్తిగా రాజకీయాలు అని అన్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మేకప్ వేసుకున్నారు. పవన్ కూడా మధ్యలో పాలిటిక్స్ అని కొన్నాళ్లు నటనకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ఈయనకు లేదు. పలు సందర్భాల్లో ఆయన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయాలు అన్నారు గానీ తర్వాత వచ్చి మళ్లీ సినిమాలు చేసుకున్నారు. అయితే తమిళంలో ఎమ్జీఆర్, జయలలిత మాత్రం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి మరీ రాజకీయాల్లోకి వెళ్లారు. సక్సెస్ అయ్యారు కూడా. మరి దళపతి విజయ్ తన మాట మీద నిలబడి పూర్తిగా సినిమాలకు దూరమైపోతాడా లేదా అనేది చూడాలి?ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ 'టీవీకే' పార్టీ కూడా బరిలో ఉంది. ఇందులో గెలిచేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ హీరోకి కూడా అంత పెద్ద కోరికలేం లేవు. ఒకవేళ సీఎం అయితే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టేయొచ్చు. కొన్ని స్థానాలు గెలుచుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు బట్టి విజయ్ ఆలోచన మారే అవకాశముంటుంది.విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో కచ్చితంగా మాటమీద నిలబడతానని బల్లగుద్ది చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తిరిగి సినిమాలు చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోల్లో విజయ్ టాప్లో ఉంటాడు. రజనీ, కమల్ దాదాపు రిటైర్మెంట్ దశకు వచ్చేశారు. అజిత్ కూడా చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విక్రమ్ లాంటి హీరోలున్నా వాళ్లు హిట్స్ అందుకోలేకపోతున్నారు. శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు స్టార్ రేంజ్కి చేరుకోవడానికి ఇంకా టైముంది. మరి విజయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ తమిళ హీరో ఎవరో?
ప్రేమలేఖలన్నీ చిత్తు కాగితాలు! 38 ఏళ్లుగా అతడే ఊపిరిగా..
కేరళ నటి అభిరామి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక సినిమాలు చేసింది. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చార్మినార్, చెప్పవే చిరుగాలి, లెవన్, 12ఎ రైల్వే కాలనీ, సరిపోదా శనివారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇటీవలే ఈ నటి పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.ఇప్పటికీ.. ఎప్పటికీ..'హ్యాపీ యానివర్సరీ మై లవ్.. 14వ ఏట నుంచి ఇప్పటి (42వ ఏట) వరకు నా సుఖదుఃఖాల్ని, జయాపజయాలను, భయాలను, ఆశనిరాశలను అన్నింటినీ నీతోనే పంచుకున్నాను, ఇకమీదట కూడా పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఆప్తమిత్రుడిగా నిలబడ్డందుకు థాంక్యూ.. నీ ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని నటి రాసుకొచ్చింది.ప్రేమ ఎలా మొదలైందంటే?కేరళ తిరువనంతపురానికి చెందిన అభిరామి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. వారికి అభిరామి ఒక్కరే సంతానం. స్కూల్ పక్కనే వీరి ఇల్లు ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చాలామంది అభిరామికి ప్రేమలేఖలు రాసి పంపేవారు. కొందరైతే నేరుగా ఇంటికొచ్చేవారు. కానీ ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు నటి. అయితే తనకు స్కూల్లో ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడే రాహుల్. ప్రముఖ రచయిత పవన్ మనవడే రాహుల్.అలా మళ్లీ కలిశారువీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి మిత్రులు. తర్వాత పై చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోయింది. కొంతకాలానికి రాహుల్ కూడా యూఎస్ వెళ్లాడు. అలా మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. ఆ ప్రేమను జీవితాంతం పదిలంగా కాపాడుకునేందుకు పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. 2023లో ఈ జంట ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు కల్కి అని నామకరణం చేసి పెంచుకుంటున్నారు.చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. సరిగ్గా ఆ హీరోకి ప్రత్యేకమైన రోజే..
దేవుడిపై తప్పుడు ప్రచారం.. నటి మాధవీలతపై కేసు
నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన తెలుగమ్మాయి మాధవీలత ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈమెకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవుడిపై తప్పుడు ప్రచారం చేయడమే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)సోషల్ మీడియాలో సాయిబాబా అసలు దేవుడే కాదని తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసినందుకుగానూ మాధవీలతపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఈమెతో పాటు పలువురు యూట్యాబర్లని ఆదేశించారు.నటి మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్స్ పెట్టిన పోస్టుల వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వీళ్లందరి సోషల్ మీడియా అకౌంట్స్పై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.(ఇదీ చదవండి: ఏపీలో పర్మినెంట్గా పెరగనున్న సినిమా టికెట్ ధరలు)
ఏపీలో పెరగనున్న సినిమా టికెట్ ధరలు.. అది కూడా పర్మినెంట్గా!
మరో పదిరోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. దీంతో నిర్మాతల కోరికమేరకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఏపీలో సింగిల్ థియేటర్లో ఇకనుంచి రూ. 50 టికెట్ ధర పెరగనుంది. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ ధరల గురించి క్లారిటీ ఇచ్చారు.పవన్ కల్యాణ్తో చర్చలుసినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలని ప్రతిసారి ఏపీలో జీఓ తీసుకొస్తున్నాం అంటూ నిర్మాత నాగ వంశీ ఇలా అన్నారు. 'ఏపీలో ప్రతిసారి గరిష్టంగా టికెట్ ధర రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అనుమతి తెచ్చుకుంటున్నాం. కానీ, అఖండ-2, హరిహర వీరమల్లు వంటి సినిమాలకు మాత్రం రూ. 100 పెంచాం. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్లలో రూ. 295 టికెట్ ధర ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ. 175 వరకు ఉంది. ఏపీలో కూడా ఇదే విధానం ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కోరాం. ఆయన ఈ అంశంపై పరిశీలిస్తున్నారు. తెలంగాణ మాదిరే ఏపీలో పర్మినెంట్ జీఓ వస్తే ప్రతిసారి రూ. 50 పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవసరం ఉండదు. ఏపీలో కొన్ని సింగిల్ థియేటర్స్లలో టికెట్ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా కొన్ని మల్టీఫ్లెక్స్లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నాం. మా ప్రతిపాదన ప్రకారం ఏపీలో కొత్త జీఓ తెస్తే.. ప్రతిసారి టికెట్ల రేట్లు పెంచాలంటూ ఎవరూ కూడా ప్రభుత్వాలను కోరరు.' అని చెప్పాడు.సింగిల్ థియేటర్ టికెట్ ధర రూ. 150కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇదే అంశం గురించి మాట్లాడారు. సినిమా విడుదలైన ప్రతిసారి బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని.., ఇకపై ఈ అంశంలో ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. పాత జీఓ ప్రకారం.. సినిమా బడ్జెట్ ఆధారంగా టికెట్ రేట్లు పెంచుతూ వచ్చామన్నారు. ఇక నుంచి అలా కాకుండా సరికొత్త విధానాన్ని ప్లాన్ చేస్తున్నామన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి సింగిల్ థియేటర్లో టికెట్ ధర రూ. 150 ఉంటుంది. చిన్న సినిమాకైనా సరే ఇదే రేటు ఉంటుంది. సినిమా బడ్జెట్ పెరిగింది అంటూ మళ్లీ ప్రభుత్వాన్ని కోరితే ఆ ధర కాస్త ఆకాశాన్ని అంటనుంది.చిన్న సినిమాలకి AP లో 50 పెంచుతున్నాం GO ద్వారా. దానికి కారణాలు ఇవి.అందుకే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి, ఒక కమిటీ ఫార్మ్ చేసి పర్మినెంట్ GO వచ్చేలా జరుగుతుంది.- Naga Vamsi#AnaganagaOkaRaju Full interview youtube link : https://t.co/2RuecuqHJp@vamsi84 https://t.co/u8yhybkIxm pic.twitter.com/I2hwiXQWO8— idlebrain.com (@idlebraindotcom) December 29, 2025
సినిమా
రూ. 1000 కోట్లకు ప్లాన్ చేసిన.. రజినీకాంత్ జైలర్ 2
ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక
చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!
సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు
అల్లు అర్జున్ పై కక్ష సాధింపు.. చంద్రబాబు చేయిస్తున్నాడా!
స్టేజ్ పైనే ఏడ్చిన దర్శకుడు మారుతి.. ఓదార్చిన ప్రభాస్
అరుపులు.. కేకలు.. ప్రభాస్ స్పీచ్ తో దద్దరిల్లిన ఈవెంట్
పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్
ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్
