Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement

బిగ్‌బాస్

Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Jr Ntr Visits US Consulate at Hyderabad For His Next Film Shooting1
ఎన్టీఆర్- ప్రశాంత్‌ నీల్‌ మూవీ.. ఇంటర్నేషనల్‌ షూట్‌కు అంతా రెడీ!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లోకేషన్స్‌ వెతుకుతున్నారని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేలా ఈ మూవీని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్‌ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది నిజమేనని ఇవాల్టితో నిజమైంది.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌కు వెళ్లారు. ప్రశాంత్ నీల్‌తో సినిమా షూటింగ్ కోసం వీసా అనుమతుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌ ట్విటర్‌లో షేర్ చేసింది. యంగ్ టైగర్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది.అమెరికా కాన్సులేట్‌కు విచ్చేసిన ఎన్టీఆర్‌ను స్వాగతించడం అనందంగా ఉందని లారా విలియమ్స్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరణ.. రాబోయే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్- నీల్ చిత్రం మూవీ షెడ్యూల్‌ త్వరలోనే అమెరికాకు షిఫ్ట్ కానుంది.కాగా... ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌లాగే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌, సలార్‌లా ఖాన్సార్‌ ప్రాంతాలు ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని టాక్. అందుకే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్ టీ–సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 25న విడుదల కానుంది.Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025

Actor VK Naresh Talk About Beauty Movie2
‘బ్యూటీ’ చూసి అమ్మాయిలకు నాన్న గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయి : వీకే నరేశ్‌

అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషించిన సీనియర్ నటుడు వీకే నరేశ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఈ సినిమా సోల్, ఈ సినిమా థీమ్ మాత్రమే ఈ సినిమాకు బ్యూటీ. సుబ్బు రాసిన కథని దర్శకుడు వర్ధన్ అందంగా మలిచాడు. సింఫనీ ఆఫ్ క్రాఫ్ట్ ఈ సినిమా. అన్ని కుదిరాయి దీనికి. ఇటీవల ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమాలు తగ్గాయి. ఇందులో ఆ రెండూ ఉన్నాయి. ఇప్పుడు ప్రేక్షకులకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే నచ్చట్లేదు. ఆర్గానిక్ గా ఉండాలి. అలా ఉంటేనే నచ్చుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్గానిక్ గా లేదు అని మీకు అనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను అని ఛాలెంజ్ చేశాను నేను.⇢ ఇవాళ మంచి సినిమా, చెడ్డ సినిమా అని కాదు వాళ్ళు పెట్టే డబ్బులకు సంతృప్తి చెందుతున్నారా లేదా చూస్తున్నారు ఆడియన్స్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా చూడొచ్చు. ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న సమస్య ఉండొచ్చు. కానీ దీంట్లో ఏమి లేకుండా అంతగా వర్కౌట్ చేసారు. ఈ సినిమాలో ప్రస్తుత జనరేషన్ తమను తాము చూసుకుంటారు. ఈ రోజుల్లో మ్యారేజ్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అది ఒక కమిట్మెంట్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్, కలిసి ఎంజాయ్ చేసి విడిపోవడం అంతే. ఇప్పటి పిల్లలకు మనం ఏమి చెప్పలేము. ఫ్రెండ్ గా ఉండటమే చేయాలి. ఒక రియలిస్టిక్ కంటెంట్ ని అందంగా చూపించారు.⇢ నాకు కూతురు లేదు అనే లోటు ఎప్పుడూ ఉండేది. ఆ లోటు కాదు కానీ కూతురు ఉంటే ఇంత పెయిన్ పడేవాడినా అని ఈ సినిమాలో అనుభవించాను. ఇవాళ్టి పిల్లలు ఏదో చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సినిమాలో ఆ అమ్మాయిని చూసి నేను ఆ పెయిన్ అనుభవించాను. ⇢ ఈ కథ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయ్యాను. నేను కథ విన్నాక మారుతీని ఈ సినిమా నేను చేయగలనా లేదా అని అడిగితే మీరు వంద శాతం పండిస్తారు అన్నారు. చిన్న అపార్ట్మెంట్ లో చాలా కష్టపడి షూట్ చేసాము. ఓల్డ్ సిరీస్ లో మట్టిలో తిరిగే సీన్స్ చేశాను. ఈ సినిమాలో కథ ఆడియన్స్ పాయింట్ నుంచి తీసుకెళ్లారు. అది కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఏమన్నా తప్పులు ఉంటే నేను మీ ముందుకు వచ్చి నిలబడతాను.⇢ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. చిన్న చిన్న లొకేషన్స్ లో కూడా అమేజింగ్ విజువల్స్ ఇచ్చాడు కెమెరామెన్. ఆర్ట్ డైరెక్టర్ ని కూడా మెచ్చుకోవాలి. ఈ కథని జర్నలిస్ట్ రాసాడు అంటే ఎంత రియాలిటీ ఉంటుందో చూడండి.⇢ చాలా సినిమాల్లో అమ్మ - కొడుకుల రిలేషన్ చూపించారు కానీ తండ్రి కూతుళ్ళ రిలేషన్ చాలా తక్కువ సినిమాల్లో చూపించారు. ఈ సినిమా చూసి అమ్మాయిలకు వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి కంట్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి. ఇంట్లో అన్ని అమ్మ అయితే ఇంటికి కాంపౌండ్ వాల్ లాంటివాడు నాన్న. ఆ ఎమోషనే బ్యూటీ

Kanya Kumari Movie OTT Streaming Date Out3
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా

విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ‘కన్యా కుమారి’ ఓటీటీలోకి రాబోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన వినాయక చవితి కానుకగా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. రేపటి నుంచి(సెప్టెంబర్‌ 17)ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ ఫేం సృజన్‌ దర్శకత్వం వహించారు. నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 Garikipati Narasimha Rao Comments About Tollywood Movie4
'నిజమైన ప్రేమికులు అయితే ఆ తెలుగు సినిమా చూడండి'.. గరికపాటి కామెంట్స్

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు టాలీవుడ్ సినిమాను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే తెలుగు సినిమాను చూడాలని గరికపాటి సూచించారు. ఇటీవల విడుదలైన 8 వసంతాలు చూస్తే చాలు.. నిజమైన ప్రేమ అంటే మీకు తెలుస్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని తాను చూశానని వెల్లడించారు. నిజమైన ప్రేమ అనేది మనసులో ఉంటుంది.. కలిసి ఉన్నా, విడిపోయినా వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.తెలుగులో ఇటీవల విడుదలైన ప్రేమకథా చిత్రం 8 వసంతాలు. అందమైన ప్రేమకథగా ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఈ ఏడాది జూన్‌ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో మలయాళ అమ్మాయి అనంతిక సానీల్‌కుమార్(Ananthika Sanilkumar) కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)8 వసంతాలు కథేంటంటే?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ. Thank you Padma Shri #GarikipatiNarasimhaRao Garu for your great words about #8Vasantalu ✨An eminent personality like you talking about our film is an honour.Movie streaming on Netflix ❤‍🔥▶️ https://t.co/EmPxSwgx8mDirected by #PhanindraNarsettiProduced by… pic.twitter.com/F0P3pykwvV— Mythri Movie Makers (@MythriOfficial) September 16, 2025

Bigg Boss Contestants Ramu Rathod Parents Reveals about Famous Song5
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?

ఒక్క పాటతో ఫేమస్ అయిన యువకుడు రాము రాథోడ్. ఆ ఒక్క సాంగ్‌ అతని జీవితాన్నే కాదు.. కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన రాము రాథోడ్‌.. రాను బొంబాయి రాను అంటూ ఫోక్ సాంగ్‌ ప్రియులను ఓ ఊపు ఊపేశాడు. ఈ పాటతో డబ్బులు సంపాదించడమే కాదు.. ఏకంగా బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చేలా చేసింది. ఈ ఏడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-9లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు రాము రాథోడ్. ఈ సందర్భంగా తమ కుమారుడికి దక్కిన ఘనతపై రాము రాథోడ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రాము రాథోడ్‌ బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత రాము రాథోడ్ పేరేంట్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా కష్టాలు చూసిన రాము.. ఇప్పుడు మమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. రాను బొంబాయికి రాను.. అనే పాట రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. పుణె, ముంబయిలో మేము పడిన కష్టాలను చూసిన రాము రాథోడ్‌కు.. ఈ పాట రాయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.మేము పెంకుటిల్లులో ఉండేవాళ్లమని.. చాలా పేదరికంలో బతికామని వెల్లడించారు. సెలవుల్లో పుణె, ముంబయికి వచ్చి మాతో పాటు రాము కూడా పనులు చేశాడని తల్లిదండ్రులు తెలిపారు. ముంబయిలో కూడా హిందీ పాటకు డ్యాన్స్ చేస్తే కప్పు కూడా వచ్చిందన్నారు. అప్పటి నుంచి రాముకు మేమే టీవీ, టేప్ రికార్డర్, సౌండ్ బాక్స్ కొనిచ్చి ఇంటివద్దనే విడిచి ముంబయికి వెళ్లామని అన్నారు.లాక్‌ డౌన్‌లో రాము ఈ పాటలను రాయడం మొదలు పెట్టాడని పేరేంట్స్ తెలిపారు. నువ్వు వేరే పనిచేయలేవు.. నీకు నచ్చింది పని చేస్కో అన్నామని అతని తల్లి తెలిపింది. ఫస్ట్‌ సొమ్మసిల్లి అనే సాంగ్‌ రాశాడని వెల్లడించింది. ఆ తర్వాత చాలా పాటలు రాశాడని పేర్కొంది. అలా తన పాటలు మొదలెట్టిన రాము రాను బొంబాయికి రాను.. అంటూ సాంగ్‌తో ఫేమ్ తెచ్చుకోవడమే కాదు.. తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపాడు. కాగా.. 'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్‌ను కూడా రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా.. 2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్‌ (29 కోట్లకుపైగా) వ్యూస్‌ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్‌.. అందుకే ఇదే సాంగ్‌ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్‌ చేశారు.

Disha Patani Sister Khushboo Teach Self Defence Tips6
కేబుల్‌ వైర్‌ చాలు ముఖం పచ్చడే... ఖుష్బూ స్ట్రాంగ్‌ రిప్లై

బరేలీలోని తన కుటుంబ నివాసం వెలుపల జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న, రిటైర్డ్‌ ఇండియన్‌ ఆర్మీ మేజర్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి దిశా పటానీ(Disha Patani) సోదరి ఖుష్బూ పటానీ వీటికి తనదైన శైలిలో బలంగా బదులిచ్చారు. తన ఇన్‌ స్ట్రాగామ్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేసిన వీడియోలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి కేవలం ఒక డేటా కేబుల్‌ వంటి సాధారణ రోజువారీ వస్తువు కూడా సరిపోతుందంటూ తనను చంపుతామని బెదిరిస్తూన్న వర్గాలకు ఆమె పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు ప్రమాద క్షణాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లోని సాధారణ వస్తువులనే ఎలా సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో ఖుష్బూ ఈ వీడియోలో వివరంగా ప్రదర్శించింది. బెదిరింపు పరిస్థితులలో ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ ఆయుధాలు లేదా యుద్ధ కళల్లో శిక్షణ వంటివి అవసరం లేదని ఈ వీడియోలో ఆమె హైలైట్‌ చేస్తుంది. బదులుగా, కొంత సమయస్ఫూర్తి, తెగింపు, చురుకుగా ప్రతిస్పందించడం వంటివి సరిపోతాయంటూ ఆమె సాటి మహిళలకు సందేశాన్ని అందించింది. ఒక డేటా కేబుల్‌ వైర్‌ను దానిలో పొదిగిన కొన్ని ఇనుప వస్తువులను ఆమె ఒక బలమైన ఆయుధంగా మార్చింది. ఆ వైర్‌ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మరక్షణ సమయంలో ఎదుటి వ్యక్తి ముఖం పగలగొట్టడానికి సరిగ్గా సరిపోతుందని ఆమె స్పష్టం చేసింది. కాల్పుల అనంతరం ధైర్యంగా స్పందిస్తూ, ఖుష్బూ చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, తెగువను ప్రశంసించారు. ఆమె ఫాలోయర్స్‌ ఆమెను ఒక ఆధునిక యోథురాలుగా కొనియాడారు. ‘‘మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం మేడమ్‌’’ అంటూ మరికొందరు ప్రోత్సహించారు. ‘‘మేడమ్, మీరు అద్భుతంగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో ఇలా బలంగా ఉండటానికి ధైర్యంతో పాటు సంకల్ప శక్తి అవసరం’’ అంటూ కొందరు ఆమెను పొగిడారు. ‘‘నిజంగా మేడమ్, మీరు మాకు చాలా స్ఫూర్తినిస్తున్నారు’’అంటూ మరికొందరు యువతులు ఆమెను కొనియాడారు. కొందరు ఆమె క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సహజంగానే కొందరు మాత్రం ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ట్రోల్‌ చేశారు.మొత్తం మీద ఈ ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియని ఒక ప్రముఖ నటి సోదరిగా మాత్రమే గుర్తింపు పొందిన ఒక సాధారణ యువతిని సెలబ్రిటీగామార్చేసింది.బాలీవుడ్‌ని కుదిపేసిన ఈ కలకలానికి మూలం శుక్రవారం ఉదయం, బరేలీలోని సివిల్‌ లైన్‌లోని విల్లా నంబర్‌ 40 వెలుపల మోటారుబైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులుతో మొదలైంది, అక్కడ పఠానీ కుటుంబం నివసిస్తుంది. ఈ కాల్పులకు కారణం తామేనని ఓ అతివాద వర్గం ప్రకటించుకోవడంతో పాటు ఇకపై తమ మనోభావాలు దెబ్బతీస్తే పఠానీ కుటుంబంతో పాటు ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరికలు జారీ చేసింది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani)

Telugu Reality Show Bigg Boss Latest Promo Fight Between Contestants7
నేను గుండంకుల్ అంటే.. మీరన్నది ఏంటి?.. మాస్క్‌ మ్యాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్

తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. అప్పుడే హౌస్‌లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు కాస్తా సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌ నామినేషన్స్ అనగానే ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. అగ్రెసివ్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌లో హౌస్‌లో మాస్క్‌ మ్యాన్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనొక్కడే అందరిపై నోరు పారేసుకుంటున్నారని ఆడియన్స్ కూడా భావిస్తున్నారు.అయితే రెండో వారంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్‌ను మిగిలిన కంటెస్టెంట్స్‌ సైతం ఓ ఆటాడేసుకుంటున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో మాస్క్‌ మ్యాన్‌కు కమెడియన్ ఇమ్మాన్యూయేల్ గట్టిగానే కౌంటరిచ్చాడు. నామినేషన్స్‌లో భాగంగా హరీశ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గుండంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం ఏంటని హరీశ్‌ను ఇమ్మాన్యుయేల్ నిలదీశాడు. ఇది విన్న మాస్క్‌ మ్యాన్‌ నేను మిమ్మల్ని అనలేదంటూ మాట్లాడారు. దీనికి ఇమ్మాన్యూయేల్ సైతం రెచ్చిపోయి ముందుకు దూసుకెళ్లారు. నేను కూడా అన్నది మిమ్మల్ని కాదని..నన్ను నేనే అనుకున్నానని అన్నారు.దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. మీరన్నదానికి ప్రూఫ్ ఉందని ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. లిమిట్స్‌లో ఉండాలంటూ మాస్క్ మ్యాన్ హరీశ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా గట్టిగా కేకలు వేస్తూ ఇమ్మాన్యుయేల్ వైపు దూసుకెళ్లాడు హరీశ్. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హాట్‌హాట్‌గా సాగినట్లు అర్థమవుతోంది. ఇంకేందుకు ఆలస్యం లేటేస్ట్ ప్రోమో చూసేయండి.High voltage nominations! 🔥Real opinions revealed, #SumanShetty breaks his silence! 👁️💣Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/hzGJhuRkjL— JioHotstar Telugu (@JioHotstarTel_) September 16, 2025

Pawan Kalyan Og Movie Premiere Show Details8
'ఓజీ' అభిమానులకు బ్యాడ్ న్యూస్?

ఈ నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ 'ఓజీ'. పవన్ కల్యాణ్-సుజీత్ కాంబోలో తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే గ్లింప్స్, తొలి పాటతో హై తీసుకొచ్చారు గానీ తర్వాత వచ్చిన సాంగ్స్ మాత్రం ఓ మాదిరిగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పవన్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్)రీసెంట్ టైంలో పెద్ద సినిమాలకు ప్రీమియర్లు వేస్తున్నారు. అంతెందుకు పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు'కి కూడా రిలీజ్ ముందురోజు రాత్రి షోలు వేశారు. కానీ కంటెంట్ తీసికట్టుగా ఉండటంతో మూవీ ఫలితం బెడిసికొట్టింది. దీంతో పోలిస్తే 'ఓజీ'పై హైప్ ఉంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు కూడా ముందు రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్లు ఉండొచ్చని కొన్నిరోజుల క్రితం టాక్ వినిపించింది. కానీ ఇప్పుడవి లేవని అంటున్నారు. అర్థరాత్రి ఒంటి గంటకు లేదంటే వేకువజామున 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడ్చొచని టాక్. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్‌లో నడిచే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 'ఓజీ'ని తెరకెక్కించారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాత. (ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!)

This Actress Life Story Is HeartBreaking, Four Relationships, Three Divorces, Still Lives Alone9
నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్‌గానే స్టార్‌ హీరోయిన్‌!

చిత్రపరిశ్రమలో ప్రేమ వివాహాలు ఎంత కామనో.. విడాకులు అంతే కామన్‌. జీవితాంతం కలిసి ఉంటామంటూ గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులకు అప్లై చేసిన జంటలు చాలానే ఉన్నాయి. ఇక లవ్‌ బ్రేకప్‌ల గురించి చెప్పనక్కర్లేదు. ఇలా ప్రేమలో పడి..అలా విడిపోయిన వారు పదుల సంఖ్యల్లో ఉన్నారు. ప్రేమ, పెళ్లిళ్లపై విరక్తి కలిగి ఒంటరి జీవితమే బెటర్‌ అనుకొనే‘స్టార్స్‌’ సైతం ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్‌ నటి సల్మా ఆఘా(Salma Agha) ఒకరు. నలుగురితో ప్రేమాయణం నడిపి..ముగ్గురిని పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈ నటి..పర్సనల్‌ లైఫ్‌ ఓ విషాద ప్రేమకథ చిత్రాన్ని గుర్తు చేసేలా ఉంటుంది.1982లో వచ్చిన ‘నికాహ్‌’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సల్మా.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ‘దిల్‌ కే ఆర్మాన్‌’ అనే పాటను కూడా ఆలపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ‘కసమ్‌ పైదా కర్నేవాలేకీ’, ‘బాబీ’, ‘కోబ్రా’, ‘ఫూలన్‌ దేవి’'పతీ పత్నీ ఔర్ తవైఫ్' లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించింది.ఇలా కెరీర్‌ పరంగా వరుస విజయాలతో ‘స్టార్‌’ హీరోయిన్‌గా ఎదిగిన సల్మా..వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస పరాజయాలే అందుకుంది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పడు లండన్‌ వ్యాపారవేత్త అయ్యాజ్‌ సిప్రాతో ఆమె ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నా.. అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత పాకిస్తాన్‌ నటుడు జావేద్‌ షేక్‌ని పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. తర్వాత స్క్వాచ్‌ ప్లేయర్‌ రెహ్మత్‌ ఖాన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. 2011లో దుబాయ్‌ వ్యాపారతవేత్త మంజర్‌ షాని పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చింది. 67 ఏళ్ల వయసు ఉన్న సల్మా ప్రస్తుతం ముంబైలో ఒంటరిగానే ఉంటుంది.

Dulquer Salmaan Reacts Lokah Result10
'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్

సినిమాలు తీయడం అనేది జూదం లాంటిది. వస్తే భారీ లాభాలు. లేదంటే భారీ నష్టాలు. కొన్నిసార్లు మాత్రం ఊహించని సక్సెస్, కోట్ల కొద్దీ కలెక్షన్ వస్తుంటాయి. తాజాగా రిలీజైన సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగులో 'లిటిల్ హార్ట్స్' ఎంతలా సంచలనం సృష్టిస్తుందో చూస్తునే ఉన్నాం. దీని కంటే ముందు రిలీజైన ఓ మలయాళ చిత్రం కూడా ఊహించని వసూళ్లతో రికార్డ్స్ బద్దలుకొడుతుంది. ఈ మూవీ గురించి హీరో కమ్ నిర్మాత దుల్కర్ సల్మాన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: కోర్ట్‌ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?)'నిర్మాతగా 'లోక' కోసం పెట్టిందంతా నష్టపోతానని అనుకున్నాను. స్టోరీ బాగా నచ్చింది. మంచి సినిమా అవుతుందని తెలుసు. కానీ బడ్జెట్ ఎక్కువైపోయింది. మలయాళంలో ఇంత బడ్జెట్ చాలా రిస్క్. కానీ కథని నమ్మి పెట్టాను. థియేటర్లలో రిలీజ్ చేద్దామంటే డిస్ట్రిబ్యూటర్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. లోక ఫ్రాంచైజీ మొదలుపెడితే సీక్వెల్స్‌తో లాభాలొస్తాయని అనుకున్నాను. ఆ నమ్మకంతోనే రిలీజ్ చేశాం. కానీ ఈ సక్సెస్ మాత్రం ఊహించలేదు. మొదటిరోజు నుంచే సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది. మా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది' అని దుల్కర్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మలయాళంలో వచ్చిన తొలి లేడీ సూపర్ హీరో సినిమా ఇది. తెలుగులోనూ దీన్ని 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు గానీ ఇక్కడ ఓ మాదిరిగానే లాభపడింది. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకుడు కాగా.. ఇందులో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, సౌబిన్ షాహిర్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించారు. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో రెస్పాన్స్ వస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!)"As Producer, we thought that we'll lose money on #Lokah😳. we know it's good film, but Budget is high & Buyers are not interested🙁. I thought if this franchise is established, we might do profit🤞. But this success was unimaginable🥶♥️"- #DulquerSalmaanpic.twitter.com/pmy1Bum8a1— AmuthaBharathi (@CinemaWithAB) September 15, 2025

Advertisement
Advertisement