Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement

సినిమా పోల్

Advertisement

A to Z

Advertisement

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Actress Laya Says She Gain Weight for Thammudu Movie1
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్‌ హోటల్స్‌లో వసతి అక్కర్లేదు: లయ

‘‘మా కథకి ‘తమ్ముడు’ సరైన టైటిల్‌. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమాలో నితిన్‌కి అక్క పాత్ర చేశాను. నటన పరంగా చూస్తే నితిన్‌ మెచ్యూర్డ్‌గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చేశారు’’ అని నటి లయ (Actress Laya) తెలిపారు. నితిన్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో నితిన్‌ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించిన లయ పంచుకున్న విశేషాలు.2023లో ఇండియాకు..వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. అప్పుడు కొన్ని యూట్యూబ్‌ చానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలు చూసిన ‘తమ్ముడు’ మూవీ టీమ్‌ నుంచి జూన్‌లో నాకు ఫోన్‌ వచ్చింది. నటిస్తారా? అని అడిగితే ఓకే అన్నాను. ‘తమ్ముడు’ కథ ఓ లైన్‌గా చెప్పారు. ఝాన్సీ కిరణ్మయి పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పడంతో స్వీట్స్‌ బాగా తిని, 7 కిలోలు బరువు పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్‌కి వచ్చాక పూర్తి కథ విన్నాను. నా రీ ఎంట్రీకి ‘తమ్ముడు’ సరైన సినిమా అని బలంగా అనిపించి, నటించాను.ఉద్యోగం మానేశా‘తమ్ముడు’ సినిమా కోసం హైదరాబాద్‌ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు... అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఈ సినిమాలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌ భిన్నంగా ఉంటుంది. ఝాన్సీ కిరణ్మయి స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది. నా క్యారెక్టర్‌లో స్ట్రిక్ట్‌నెస్‌తో పాటు ఎమోషన్, అఫెక్షన్‌ కూడా ఉంటాయి. అమెరికాలోనే కాదు హైదరాబాద్‌లోనూ..కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించాలని అనుకుంటున్నాను. నేను అమెరికా నటిని కాదు... పక్కా హైదరాబాద్‌ నటినే. నాకు అమెరికాలో ఇల్లు ఉంది. హైదరాబాద్‌లోనూ ఉంది. నాకోసం ఫ్లైట్స్‌లో బిజినెస్‌ క్లాస్‌ టికెట్స్, స్టార్‌ హోటల్స్‌లో వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని నా ఇంట్లో ఉంటాను. ప్రస్తుతం శివాజీగారితో చేస్తున్న ఓ సినిమా తుది దశకు వచ్చింది. కొన్ని కథలు వింటున్నాను.చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Jr NTR Preparing For Trivikram Movie by Reading Muruga Book2
మురుగ పుస్తకంతో జూనియర్‌ ఎన్టీఆర్‌

వెండితెరపై కార్తికేయుడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మైథాలజీ సినిమాలోనే కార్తికేయుడిగా ఎన్టీఆర్‌ కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ వార్త నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ‘వార్‌ 2’ సినిమా వర్క్స్‌లో భాగంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఎన్టీఆర్‌ చేతిలో ‘మురుగ’ (కార్తికేయుడు) పుస్తకం కనిపించింది.అందుకోసమే ఈ ప్రిపరేషన్‌దీంతో త్రివిక్రమ్‌తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, ఇందులో భాగంగానే మురుగ పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతున్నారు. ఈ సినిమాను కల్యాణ్‌రామ్, సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో ‘డ్రాగన్‌’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌. కొరటాల శివతో ‘దేవర 2’ కమిట్‌ అయ్యారు. తమిళ దర్శకుడు నెల్సన్‌తో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేస్తారని టాక్‌. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్‌ గురించి కూడా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: బిగ్‌బాస్‌ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్‌.. మరి బజ్‌ హోస్ట్‌?

Singer KS Chitra Reveals Details About Her Injury3
స్టార్‌ సింగర్‌ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే?

స్టార్‌ సింగర్‌ కేఎస్‌ చిత్ర (KS Chitra)ను ఇష్టపడని వాళ్లుండరు. అద్భుత గాత్రంతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తోంది. ఇటీవల చిత్రకు ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. చేతికి కట్టుతో కనిపించడంతో ఇది నిజమేనని తేలిపోయింది. తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి వివరాలు బయటపెట్టింది చిత్ర. మలయాళంలో వచ్చే స్టార్‌ సింగర్‌ (10వ సీజన్‌) షోలో చిత్ర మాట్లాడుతూ.. చెన్నై ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది.కింద పడిపోయా..హైదరాబాద్‌ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగడం అయిపోయాక నేను వెనక్కు తిరిగి ఓ అడుగు వేశాను. అంతే.. నా కాలు ట్రేకు తగలడంతో బ్యాలెన్స్‌ తప్పి కింద పడిపోయాను.విశ్రాంతిఅప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడువారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చిత్ర.. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది. ఇప్పటివరకు 25 వేలకుపైగా పాటలు పాడినట్లు తెలుస్తోంది. ఈమెను మెలోడీ క్వీన్‌ అని పిలుస్తారు. View this post on Instagram A post shared by Asianet (@asianet) చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Nagarjuna Akkineni Launched Bigg Boss 9 Telugu Logo, Watch Promo4
బిగ్‌బాస్‌ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్‌.. మరి బజ్‌ హోస్ట్‌?

బిగ్‌బాస్‌ 9 (Bigg Boss Season 9).. ఆగమనానికి సర్వం సిద్ధమవుతోంది. తాజాగా బిగ్‌బాస్‌ 9 లోగోనూ లాంచ్‌ చేస్తూ ప్రోమో రిలీజైంది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటున్నాడు కింగ్‌ నాగార్జున. ఈసారి కూడా హోస్ట్‌ నాగార్జునే అన్న విషయం ప్రోమోతో స్పష్టమైపోయింది.బజ్‌ హోస్ట్‌గా..కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. కిర్రాక్‌ బాయ్స్‌ కిలాడీ గర్ల్స్‌ సీజన్‌ 2లో ఉన్నవారిలో చాలామంది ఈ షోలో భాగం కానున్నారు. అలాగే ఈ వారం మొదలవుతున్న కూకు విత్‌ జాతిరత్నాలు కామెడీ షోలోని కంటెస్టెంట్లు కూడా బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్‌ చేయనున్నారు. అటు బిగ్‌బాస్‌ బజ్‌ హోస్ట్‌గా ప్రేరణ కంభాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్‌ మొదటివారంలో బిగ్‌బాస్‌ 9 షురూ కానుంది. చదవండి: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Kannappa Movie Twitter Review5
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్‌ రివ్యూ

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప(Kannappa ) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో మోహన్‌ బాబు, ప్రభాస్‌, మోహన్‌ లాన్‌, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 27) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కన్నప్ప కథేంటి? ఎలా ఉంది? ప్రభాస్‌ ఈ సినిమాకు ఎంత వరకు ప్లస్‌ అయ్యాడు? తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.కన్నప్ప చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా చాలా బాగుందని కొంతమంది, యావరేజ్‌గా ఉందని మరికొంతమంది ట్వీట్‌ చేశారు. మంచు విష్ణు నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ ఫెర్పార్మెన్స్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. #KannappaReview ✅🔥Vishnu Manchu delivers his career-best performance 👑Prabhas cameo = Goosebumps overload 💥Mohanlal’s character is a big surprise 👀BGM & elevations are top-class 💯Climax is pure emotion – will leave you in tears 😢BLOCKBUSTER LOADING 📿✨ 3.5/5 pic.twitter.com/NhfoLlh9an— POWER Talkies (@PowerTalkies1) June 26, 2025 మంచు విష్ణు కెరీర్‌లోనే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ప్రభాస్‌ క్యామియో రోల్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. మోహన్‌ లాల్‌ క్యారెక్టర్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌, నేపథ్య సంగీతం, ఎలివేషన్స్‌ టాప్‌ క్లాస్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్‌ బయటకు వస్తారంటూ ఓ నెటిజన్‌ ఈ సినిమాకు 3.5 రేటింగ్‌ ఇచ్చాడు. Prabhas kosam cinema ki vellipovachuPrabhas scenes chala baagunnayi His cameo is worth the ticket price🙏🏽🙏🏽🙏🏽#Kannappa #Prabhas‌ #KannappaMovie #KannappaOnJune27th— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025 ప్రభాస్‌ కోసమే ఈ సినిమాకు వెళ్లిపోవచ్చు. ప్రభాస్‌ సీన్స్‌ చాలా బాగున్నాయి. మనం కొన్న టికెట్‌కు ప్రభాస్‌ అతిథి పాత్ర న్యాయం చేస్తుంది అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.#Kannappa is an Mythology drama that bores from start to finish due to its outdated and bland screenplay. The storyline idea may have been emotional on paper. However, it feels lifeless and somewhat silly when translated on screen. Rating: 2/5 #Kannappa#Prabhas‌ #Prabhas‌— AbhishekSharma Sena (@KapuIndrasen) June 27, 2025 కన్నప్ప బోర్‌గా సాగే ఓ మైథాలజీ డ్రామా. స్క్రీన్‌ప్లే చప్పగా ఉండడంతో స్టార్టింగ్‌ నుంచి ఎండ్‌ వరకు బోరింగ్‌గా సాగుతుంది. ఈ స్టోరీ లైప్‌ పేపర్‌పై రాసుకున్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించొచ్చు కానీ తెరపై చూస్తే మాత్రం నిర్జీవంగా, కొన్ని సీన్లు సిల్లీగా అనిపించాయి అంటూ ఓ నెటిజన్‌ కేవలం 2 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు.#Kannappa #KannappaMovieIf same cameo of Rudra was offered to any contemporary stars they would have said no because of risk and insecurity#Prabhas gambles pay off in hugeThen Baahubali now the list ever goes onHe is the choosen one of all the stars and he's the super star pic.twitter.com/YCHHckCoB1— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025 ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రను ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే రిస్క్‌ ఎందుకని సున్నితంగా తప్పుకునే వారు. కానీ ప్రభాస్‌ మాత్రం ఆ రిస్క్‌ చేశాడు. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం పోసింది. బాహుబలి తర్వాత ఆయన మరో మంచి పాత్రని ఎంచుకున్నాడు. అందుకే ప్రభాస్‌ సూపర్‌స్టార్‌ అయ్యాడంటూ ఇంకో నెటిజన్‌ రాసుకొచ్చాడు.#KannappaReview Rating: ⭐️⭐️½ #VishnuManchu gives a heartfelt performance, #AkshayKumar brings divine intensity as Lord Shiva,But the film suffers from a slow pace, flat BGM & a dull and disengaged cameo by #Prabhas that adds no real value.Review 👇https://t.co/YOC4dI82lU— CineMarvel🇮🇳 (@cinemarvelindia) June 27, 2025Mahashivratri Episode starring Prabhas worked very big time🛐🔥🔥🔥🔥🔥Adhi Biggest plus point ani mention chestunaru andharu🥵🔥🔥 And vishnu last 20 mins ichi padesadu anta🔥🔥#KannappaReview pic.twitter.com/b45nW48OH1— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 27, 2025

Manchu Vishnu Release Advance Ticket Booking Details Of Kannappa6
24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్‌.. మంచు విష్ణు ఎమోషనల్‌ ట్వీట్‌

మరికొన్న గంటల్లో(జూన్‌ 27) మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు ఫ్యామిలీ, ముఖ్యంగా విష్ణు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్‌ (దాదాపు రూ. 250 కోట్లు) పెట్టి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అదే రేంజ్‌లో ప్రమోషన్స్‌ కూడా భారీగానే చేశారు. దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లోనూ సినిమా ఈవెంట్స్‌ నిర్వహించారు. విష్ణు పడిన కష్టానికి ఫలితం తగ్గింది. ఈ సినిమాకు కావాల్సినంత రీచ్‌ అయితే వచ్చినట్లు ఉంది. అందుకే రిలీజ్‌కి ముందే భారీగా టికెట్స్‌ అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమా టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే 1,15,000 టికెట్స్‌ సేల్‌ చేసి కన్నప్ప రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు.‘24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్ అయిపోయాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత గొప్ప ప్రేమను పొందడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ప్రేమ చూపుతున్న ప్రతీ మూవీ లవర్‌కు థాంక్స్. ఇది సినిమా కాదు మహా శివుడి మహిమ.. కన్నప్పకు అంకితం’ అంటూ విష్ణు ట్వీట్‌ చేశాడు. కన్నప్ప విషయానికొస్తే.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌తో పాటు శరత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్‌ కీలక పాత్రలు పోషించారు.115,000 tickets sold in just 24 hours.My heart is racing! 🙏🏽To witness this kind of pre-release love and anticipation is truly humbling.I’m deeply grateful to every movie lover for the unwavering support.This is not just a film, This is all glory to Lord Shiva and #Kannappa…— Vishnu Manchu (@iVishnuManchu) June 26, 2025

Ganguly To Dhoni List of Biopic Movies Of Indian Cricketers7
ధోనీని గంగూలీ బీట్‌ చేయగలడా? క్రికెటర్లలో ఎవరి బయోపిక్‌ రేంజ్‌ ఏంటి?

ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది గంగూలీ బయోపిక్‌. ఎప్పటి నుంచో ప్లాన్స్‌ వేసినప్పటికీ తాజాగా ఈ సినిమా పట్టాలక్కనుంది వచ్చే జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. తాజా సెన్సేషన్‌ మాలిక్‌ చిత్రంలో హీరోగా చేసిన రాజ్‌కుమార్‌ రావ్‌ గంగూలీ పాత్ర పోషించనున్నాడు. అది తప్ప ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు విశేషాలు ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో... గత కొంత కాలంగా ఊపందుకున్న క్రికెటర్ల బయోపిక్స్‌..వాటికి దక్కిన ప్రేక్షకాదరణను ఒక్కసారి పరిశీలిస్తే...సచిన్‌..విన్‌సచిన్‌ ఎ బిలియన్‌ డ్రీమ్స్‌ ఫిల్మ్‌ 2017లో విడుదల అయింది. ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌గా అభిమానులు పిలుచుకునే సచిన్‌ జీవితం ఆధారంగా ఇది పూర్తి స్థాయి డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా తయారైంది. కధ విషయానికి వస్తే సచిన్‌ బాల్య దశ నుంచి 2011 వరల్డ్‌ కప్‌ గెలుపు వరకు ఈ చిత్రంలో చూపించారు. ఇందులో సచిన్‌ స్వయంగా తన పాత్ర పోషించడం విశేషం. ఈ డాక్యుమెంట్రీ రూ.76 కోట్ల వరకూ వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు, ఫ్యాన్స్‌ ఆదరణ దక్కించుకుంది.థోనీ...ధనాధన్‌ మాజీ కెప్టెన్‌ ఎమ్‌.ఎస్‌. ధోనీ ద అన్‌టోల్డ్‌ స్టోరీ 2016లో విడుదలైంది. ఇందులో థోనీ పాత్రను దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పోషించాడు. ఇందులో కథ ధోనీ క్రికెటర్‌గా మారడం నుంచి భారత కెప్టెన్‌గా ఎదగడం దాకా కొనసాగుతుంది. ఈ సినిమా రూ.216 కోట్లు వసూలు బాక్స్‌ ఆఫీస్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమాలో సుశాంత్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా ధోనీ అభిమానుల ఆదరణ పొందింది. అజహర్‌...యావరేజ్‌ సర్‌..మహ్మద్‌ అజారుద్దీన్‌ జీవిత కధ ఆధారంగా రూపొందిన అజహర్‌ చిత్రం కూడా 2016లోనే విడుదలైంది. దీనిలో అజహర్‌ పాత్రను బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి పోషించాడు. క్రికెటర్‌గా అజార్‌ కెరీర్‌ కొనసాగిన విధం, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం వరకు సినిమా సాగుతుంది. మొత్తంగా రూ.50 కోట్లు వసూలు చేసి యావరేజ్‌ చిత్రంగా నిలిచింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే దక్కించుకుంది.మిథాలీ...సారీ...మహిళల క్రికెట్‌కు భారత్‌లో చక్కని బాట వేసిన మిథాలి రాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిన శభాష్‌ మిథు..2022లో విడుదలైంది.ఇందులో మిథాలి పాత్రను బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను పోషించింది. భారత మహిళా క్రికెట్‌ తో పాటుగా ఎదిగిన మిథాలీ జీవితాన్ని చూపించిన ఈ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. కనీసం రూ.2 కోట్లు కూడా వసూలు చేయలేక కమర్షియల్‌గా ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా కథన శైలి, స్క్రీప్లేపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే, మిథాలి పాత్రను తాప్సీ సమర్ధంగా పోషించిందని ప్రశంసలు రావడం ఒక్కటే ఈ సినిమాకు దక్కిన ఊరట.కపిల్‌...కప్‌ ఫుల్‌...కపిల్‌దేవ్‌ 83 పేరిట రూపొందిన చిత్రం భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ జీవితంలో ముఖ్య ఘట్టమైన ప్రపంచ కప్‌ విజయం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కపిల్‌ పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ రణవీర్‌ సింగ్‌ పోషించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం రూ.193 కోట్లతో మంచి వసూళ్లే రాబట్టినా, చిత్రం బడ్జెట్‌ ప్రకారం కమర్షియల్‌ సక్సెస్‌ అనిపించుకోలేకపోయింది. అయితే విమర్శలు ప్రశంసలు బాగానే అందుకుంది.మొత్తం గా చూస్తే ధోనీ బయోపిక్ మాత్రమే అన్ని రకాలుగా విజయం సాధించింది అని చెప్పొచ్చు మరి గంగూలీ ఈ విషయం లో ధోని ని బీట్ చేయగలడా...

Actress Karisma Kapoor Broke Engagement With Abhishek Bachchan8
ఐశ్వర్య రాయ్‌తో పెళ్లికి ముందు ఆ హీరోయిన్‌తో ఎంగేజ్‌మెంట్‌!

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారు అంటుంటారు. అందుకేనేమో.. పీకల్లోతు ప్రేమలో ఉన్న అభిషేక్‌ బచ్చన్‌, కరిష్మా కపూర్‌.. ఎంగేజ్‌మెంట్‌ వరకు వచ్చి ఆగిపోయారు. మనసు నిండా ఒకరినొకరు నింపుకున్నారు కానీ, తలరాతల్లో మాత్రం లేకుండా పోయారు. జంటగా నడవాలనుకుంటే వేర్వేరుగా ప్రయాణించారు. అభిషేక్‌.. ఐశ్వర్యను, కరిష్మా.. సంజయ్‌ను పెళ్లాడారు. అసలు ఆనాడేం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం..అభిషేక్‌- కరిష్మా ప్రేమసినీరంగంలో సత్తా చాటుతున్న కపూర్‌ ఫ్యామిలీలో పుట్టింది కరిష్మా (Karisma Kapoor). 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో కొన్ని వైఫల్యాలు చూసిన కరిష్మా.. రాజా హిందుస్తానీ చిత్రంతో సక్సెస్‌ అందుకుంది. తర్వాత ఈ బ్యూటీ బిగ్‌బీ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan)తో ప్రేమలో పడింది. అభిషేక్‌ సోదరి శ్వేత బచ్చన్‌ పెళ్లిలోనే వీరి చూపులు కలిశాయి. ఐదేళ్లపాటు ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. జయా బచ్చన్‌తో కరిష్మా కపూర్‌నా కోడలు: జయా బచ్చన్‌దీంతో 2002లో అమితాబ్‌ బచ్చన్‌ 60వ పుట్టినరోజు వేడుకల్లో జయా బచ్చన్‌.. అభిషేక్‌, కరిష్మాల ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించింది. కరిష్మాను తన కోడలిగా చేసుకోనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్‌లో పెద్ద పండగే జరగబోతుందనుకున్నవారికి షాకిస్తూ వీరి ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయింది. అమితాబ్‌ తన సంపదలో కొంత భాగం అభిషేక్‌ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కరిష్మా తల్లి బబిత డిమాండ్‌ చేసిందట! ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లిఎంగేజ్‌మెంట్‌ ఆగిపోయిన కొద్ది నెలలకే బబిత.. తన కూతురికి మంచి వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసింది. 2003లో కరిష్మా, సంజయ్‌ కపూర్‌ల పెళ్లి జరిగింది. ఇతడికిది రెండో పెళ్లి కావడం గమనార్హం. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. పిల్లలు పుట్టిన కొంతకాలానికే కరిష్మా- సంజయ్‌ విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2016లో డివోర్స్‌ మంజూరయ్యాయి. కొద్దిరోజుల క్రితమే సంజయ్‌ కపూర్‌ కన్నుమూశాడు. ఇకపోతే అభిషేక్‌ బచ్చన్‌.. 2007లో ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అభిషేక్‌- ఐశ్వర్య అయినా సంతోషంగా ఉన్నారా? అంటే.. అప్పుడే దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు. అంతలోనే జంటగా కనిపిస్తారు. వీరి మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి! #KarismaKapoor and #AbhishekBachchan's #wedding announcement in the early 2000s was a highly anticipated union between two of #Bollywood's most prominent families. However, the engagement was abruptly called off, and the wedding never took place.#bollywood #aishwaryarai pic.twitter.com/U1dRUrmnT2— The Cheshire Cat (@C90284166) November 5, 2024 చదవండి: కాస్టింగ్‌ కౌచ్‌.. ఓ గొప్ప ఫిలింమేకర్‌ కాంప్రమైజ్‌ అడిగాడు: నటుడు

Murali Mohan Talk About Dokka Seethamma Movie9
ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి: మురళీ మోహన్‌

‘‘డొక్కా సీతమ్మగారిలాంటి గొప్పవారిపై సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడంతా కమర్షియల్‌ అయిపోయిన సమయంలో రాంబాబు, రవి నారాయణగారు ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ చిత్రం నిర్మిస్తుండటం అభినందనీయం. ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి’’ అని మురళీమోహన్‌ తెలిపారు. టీవీ రవి నారాయణ్‌ దర్శకత్వంలో మురళీమోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ 24న మురళీమోహన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను, గ్లింప్స్‌ని విడుదల చేశారు. టీవీ రవి నారాయణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఆరంభం నుంచి మురళీమోహన్‌గారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడివరకూ వచ్చింది’’ అన్నారు. అతిథిగా హాజరైన డైరెక్టర్‌ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘డొక్కా సీతమ్మగారి’ కథతో సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కార్తీక్, నిర్మాతలు సాయివెంకట్, రామ సత్యనారాయణ, బెక్కెం వేణుగో΄ాల్, డైరెక్టర్‌ శివ నాగు, దాసన్న తదితరులు మాట్లాడారు.

War 2 First Look Posters: Bet You Haven't Ever Seen A WAR Like This jr NTR Says10
బెట్‌ ఇలాంటి ‘వార్‌’ చూసి ఉండరు: ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్‌. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ నిర్మించిన స్పై యాక్షన్‌ మూవీ ‘వార్‌’ (2019) కొనసాగింపుగా వార్‌ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్‌ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ.. ‘బెట్‌ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్‌’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్‌ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్‌ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్‌ 14న వార్‌ 2 తో పాటు మరో భారీ పాన్‌ ఇండియా చిత్రం కూడా రిలీజ్‌ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్‌ మేనియా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్‌ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్‌ వార్‌లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025

Advertisement
Advertisement