Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Buzz: Shraddha Kapoor Star Alongside with Vijay Sethupathi1
విజయ్‌ సేతుపతికి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!

చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్‌ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్‌ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్‌ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.బాలీవుడ్‌ బ్యూటీవిడాముయుర్చి ఫేమ్‌ మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్‌ సేతుపతికి జంటగా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!

Ram charan Peddi Movie Song Rai Rai Raa Raa Song out now2
రామ్ చరణ్ పెద్ది మూవీ.. 24 గంటల్లోనే రికార్డ్

రామ్‌ చరణ్‌ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్‌ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. వ్యూస్ పరంగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లింది.తాజాగా రిలీజైన రైరై రారా అంటూ సాగే సాంగ్ సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 31 మిలియన్ల వ్యూస్‌, 5లక్షల 30వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ లిరిక్స్ అందించగా.. ఏఆర్‌ రెహమాన్‌ పాడారు. ఈ మోటివేషనల్‌ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.

Sree Vishnu Revelead Mrithyunjay movie story line3
మృత్యుంజయ్ సినిమా స్టోరీ లైన్ ఇదే: శ్రీ విష్ణు

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్‌ ఏంటో విష్ణు రివీల్ చేశారు. ఓ పాప కోసమే ఈ సినిమా అంతా కొనసాగుతుందని అన్నారు. ఆ పాప ఫాదర్ ప్లేస్‌లో నన్ను తీసుకుని జస్టిస్ కావాలనుకుందో.. ఆ ప్లేస్‌లో నేను పాపకు హీరో అని తెలిపారు. చైల్డ్ సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. గతంలో ఇదే సెంటిమెంట్‌లో డాడీ, బింబిసార, హాయ్‌నాన్న సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. #Daddy, #Bimbisara, #HiNanna సినిమాలు చైల్డ్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.ఇప్పుడు అదే ఎమోషనల్ టచ్‌తో #Mrithyunjay కూడా వస్తోంది. - #VenkyAtluri - #SreeVishnu pic.twitter.com/05Ygjzrcva— CHITRAMBHALARE (@chitrambhalareI) March 4, 2026

Tollywood actress Social Media Updates goes Viral4
ఖుషీ కపూర్ బోల్డ్ లుక్.. మాల్దీవుస్‌లో బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్..!

బోల్డ్ లుక్‌లో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్..బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ పిక్స్..మాల్దీవుస్‌లో ఎంజాయ్ చేస్తోన్న బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్..గిటార్ వాయిస్తోన్న స్వయంభు బ్యూటీ సంయుక్త మీనన్..శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ రంభ.. View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Ramya moksha kancharla (@ramya_moksha) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor)

Allu Arjun tweet On Allu Sirish Pre wedding Celebrations5
'ప్రతి ఒక్కరికీ అల్లు కుటుంబం తరఫున కృతజ్ఞతలు'

ఐకాన్ స్టార్ అల్లు ‍అర్జున్ తమ్ముడు శిరీష్‌ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌పై ట్వీట్ చేశారు. తన తమ్ముడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందమైన జంటకు తమ ఆశీస్సులు కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు రావడం మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక వెడ్డింగ్‌ ఈ నెల 6న జరగనుంది. అంతకుముందే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఈనెల 2న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అల్లు స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. We would like to thank everyone who attended the pre-wedding reception and showered their blessings on the lovely couple. To all those sending their wishes from across the world, our hearts are filled with gratitude.Thank you for all the love and warmth. ALLU FAMILY. pic.twitter.com/0AtL6oCYIu— Allu Arjun (@alluarjun) March 4, 2026

Puri Jagannadh Next Movie with Suriya finalized6
క్రేజీ కాంబో ఫిక్స్‌.. సూర్యతో పూరి జగన్నాధ్..!

తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు పూరి జగన్నాధ్ కొత్త సినిమా ఫైనల్ అయింది. ప్రస్తుతం సూర్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. అసలు ముందుగా వెంకీ అట్లూరి సినిమా తరువాత సూర్య మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దాంతో ఆ స్థానంలో పూరి జగన్నాధ్‌కు అవకాశం దక్కింది. అయితే సూర్యతో సినిమా చేయడానికి దర్శకుడు చందు మొండేటి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తండేల్ సినిమా ముందు నుంచే ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన కార్తికేయ 3 ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. హీరోల డేట్స్ సంపాదించడం పూరి జగన్నాధ్ కు పెద్ద సమస్య కాదు. పూరి-విజయ్ సేతుపతితో చేసిన సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్‌టైనర్ వస్తుందో చూడాలి.

VIROSH: This Actress was First Choice for Geetha Govindam Movie7
బ్లాక్‌బస్టర్‌ 'గీత గోవిందం'ను మిస్‌ చేసుకున్నా: హీరోయిన్‌

ఎనిమిదేళ్ల క్రితం రష్మిక మెడలో తాళి కడుతుంటే విజయ్‌కు చేతులు వణికాయి. కానీ ఇప్పుడు భయం, బెరుకు ఏదీ లేదు.. మనసంతా గాల్లో తేలుతోంది. చుట్టూ ఉన్న వాతావరణమంతా ప్రేమమయంగా మారింది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన గీతగోవిందం సినిమాలో విజయ్‌- రష్మిక రీల్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. సినిమాలో ఆ సీన్‌ చూసి సగటు ప్రేక్షకుడు మురిసిపోయాడు.ఆ సినిమాతో పునాదిఇప్పుడూ అంతే.. రియల్‌ లైఫ్‌లో విజయ్‌- రష్మిక ఒక్కటైనందుకు ప్రేక్షకలోకం సంతోషంగా శుభాకాంక్షలు చెప్తోంది. కలకాలం కలిసి జీవించమని దీవిస్తోంది. వీరి ప్రయాణానికి పునాది పడింది గీత గోవిందం సినిమాతోనే! పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సినిమా అయిపోయే సరికి మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. డియర్‌ కామ్రేడ్‌ మూవీ చేస్తున్న టైంలోనే స్నేహం ప్రేమగా మారగా.. ఫస్ట్‌ రష్మికనే లవ్‌ ప్రపోజ్‌ చేసింది. గీత గోవిందం ఫస్ట్‌ ఛాయిస్‌ రష్మిక కాదుఅలా ఈ ఏడడుగల బంధానికి తొలి అడుగు పడింది. అయితే గీత గోవిందం సినిమా ఆఫర్‌ రష్మిక కంటే ముందు చాలామంది హీరోయిన్స్‌కు వెళ్లిందట! వారిలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా కూతురు ఐశ్వర్య ఒకరు. ఈమె ఇటీవలే సీతా పయనం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ దీనికంటే ముందు తనకు తెలుగులో గీత గోవిందం ఆఫర్‌ వచ్చిందని తెలిపింది. నేను చేయని ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి.సినిమాతెలుగులో 'గీత గోవిందం' కథ విన్నాను. కానీ, ఎందుకో అది కుదర్లేదు. ఇది చాలామంది హీరోయిన్ల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. ఏదేమైనా చివరకు సినిమా అద్భుతంగా వచ్చింది అని పేర్కొంది. ఐశ్వర్య.. గీత గోవిందం పోగొట్టుకున్నప్పటికీ సీతా పయనం మూవీతో మంచి డెబ్యూ అందుకుంది. అటు రష్మికకు.. గీత గోవిందం కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగానూ బాగా కలిసొచ్చింది.చదవండి: కొత్త కోడలు వచ్చింది.. బాగా చూసుకోండి: విజయ్‌ దేవరకొండ

OTT: Priyanka Mohan Made in Korea Movie Trailer Released8
ఓజీ హీరోయిన్‌ ఓటీటీ మూవీ.. ఎమోషనల్‌గా ట్రైలర్‌

మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్‌ సినిమాలు, సిరీస్‌లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!ఓటీటీ సినిమాదీంతో ఈ కొరియన్‌ కాన్సెప్ట్‌తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్‌ ఇన్‌ కొరియా. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే ట్రైలర్‌లో చూపించారు.మనసు చెప్పేది వినండిమనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్‌ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌ బాగుంది. మేడ్‌ ఇన్‌ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది. చదవండి: ఆస్తుల్లేవ్‌.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి

Rayudu Gari Talukha Pre Release Event Highlights9
అన్ని వర్గాలకు నచ్చేలా 'రాయుడు గారి తాలూకా' : ఉలిశెట్టి శ్రీనివాస్

ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా, రచయితగా పరిచయమవుతున్న తాజా చిత్రం 'రాయుడు గారి తాలూకా'. ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నర్సాపురం, విశాఖపట్నంలో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా హీరో, రైటర్ ఉలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. "ఇదొక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతూ మిమ్మల్ని అలరిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలి" అని కోరారు.ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు కళ్యాణ్ కృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక వీడియో సందేశం (AV) ద్వారా ఆయన మాట్లాడుతూ.. "నేను ఇప్పటికే సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. చిత్ర బృందం కొత్తవారైనప్పటికీ, చాలా పరిణతితో అద్భుతంగా నటించారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమా చూడండి" అని చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదల కానుంది.

Actress Varalakshmi Sarathkumar about Her Properties10
నాకంటూ పెద్దగా ఆస్తుల్లేవ్‌.. అద్దింట్లో ఉంటున్నా: వరలక్ష్మి

ఇప్పటివరకు హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్‌ సరస్వతి చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ హాజరైన వరలక్ష్మి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది.రాజకీయాల్లోకి వస్తా..నాకంటూ పెద్ద ప్రాపర్టీలు ఏం లేవు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉన్నాను. నా సంపాదనతో నాకంటూ ఒక కారు కొనుక్కున్నాను. అలాగే ఒక చిన్న ఇల్లు కొన్నానంతే! భారీగా ఆస్తులుంటే ఇక్కడెందుకు ఉంటాను? ఇకపోతే నాకు రాజకీయాలంటే ఇష్టం. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా భవిష్యత్తులో తమిళనాడులో లేదా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చుసరస్వతి సినిమా విషయానికి వస్తే.. షూటింగ్‌ అయిపోయాక చిత్రయూనిట్‌ అందరికీ ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చాను. కాగా నన్ను తమిళ చిత్రపరిశ్రమ సరిగ్గా వాడుకోలేదు. నాలుగైదు సినిమాలు మినహా తర్వాత అక్కడ ఎవరూ నా టాలెంట్‌ను పట్టించుకోలేదు అని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. తనపై వచ్చిన ఓ ఆసక్తికర రూమర్‌ గురించి చెప్తూ.. నా పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చయిందని సోషల్‌ మీడియాలో రాశారు. అది చూసి బాగా నవ్వుకున్నాను. నా దగ్గర అంత డబ్బుంటే నేనెందుకు ఇక్కడుంటాను? అని వరలక్ష్మి నవ్వేసింది.చదవండి: ఒంటరితనం భరించలేకున్నా.. తోడు కావాలి: నటి

Advertisement
Advertisement