Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Naga chaitanya and sai pallavi Love story Re Release on February 14th1
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి నాగచైతన్య- సాయిపల్లవి లవ్ స్టోరీ

నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2021లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో చైతూ, సాయిపల్లవి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా చైతూ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి బిగ్‌ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది వాలైంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నా హృదయానికి హత్తుకున్న సినిమా లవ్ స్టోరీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరోసారి థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లవ్ స్టోరీ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇది చూసిన అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లవర్స్ డే రోజున థియేటర్లలో మరోసారి లవ్ స్టోరీ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. A film very close to my heart #LoveStory is Re-releasing on February 14th. Excited for this , looking forward to celebrating in theaters with you all again . #MagicalBlockBusterLovestory@sekharkammula @Sai_Pallavi92 @SVCLLP @AsianSuniel #PusukurRamMohanRao#BharatNarang… pic.twitter.com/20uv8KrXiH— chaitanya akkineni (@chay_akkineni) January 22, 2026

Sayani Gupta Says Her Mother Threatened to Slit her Wrist if she Want to be Actress2
'యాక్టర్స్‌ అందరూ వేశ్యలు.. నువ్వూ అదే చేస్తానంటే చస్తా!'

సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీలోకి వెళ్తామనగానే పేరెంట్స్‌ అంత ఈజీగా అస్సలు ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే అనుమతించరు. తన ఇంట్లో అయితే అమ్మ చచ్చిపోతానని బెదిరించిందంటోంది బాలీవుడ్‌ నటి సయాని గుప్తా.మంచి జీతంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా చదువైపోగా ఓ ఉద్యోగం సంపాదించాను. మంచి సంపాదన.. సీజన్‌లో కనిపించింది. బాగానే డబ్బులు వచ్చేవి. ఏడాదిన్నరపాటు జాబ్‌ చేశాను, కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి రావాలన్నది నా కల. అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. చేతి మణికట్టు కోసుకుని చస్తానని బెదిరించింది. తను యాక్టర్స్‌ను వేశ్యలు అని పిలిచేది. అమ్మ సపోర్ట్‌ లేదునేను కూడా నటిగా మారతానన్న ఆలోచన తట్టుకోలేకపోయింది. చిన్నప్పటినుంచి నేను ఎక్కడా ఎలాంటి రిహార్సల్స్‌ చేయకుండా ఇంట్లోనే బంధించేది. యాక్టర్స్‌ అందరూ వేశ్యలూ.. అటువైపే వెళ్లొద్దు అనేది. నాన్న మాత్రం నేనేం చేసినా సపోర్ట్‌ చేసేవాడు. అలా ఆయన అంగీకారంతో ఎఫ్‌టీఐఐ (ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా)లో చేరాను. సినిమాఅప్పుడు నెలరోజులపాటు అమ్మ నాతో మాట్లాడటమే మానేసింది. ఆ తర్వాత ఓసారి క్యాంపస్‌కు వచ్చాక తన ఆలోచనా విధానం మారిపోయింది. సయానీ గుప్తా.. జాలీ ఎల్‌ఎల్‌బీ 2, ఆక్సన్‌, పాగలైట్‌, ఆర్టికల్‌ 15, జ్విగాటో వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ వెబ్‌ సిరీస్‌ నాలుగో సీజన్‌లో కనిపించింది.చదవండి: పదో సినిమా ఫిక్స్‌.. టైటిల్‌ విచిత్రంగా ఉంటుంది: అనిల్‌ రావిపూడి

Vijay Sethupathi and Aditi Rao Hydari Gandhi Talks Melody Song Out Now3
'పదే పదే కంగారుగుంటది'.. అదితి-విజయ్ సేతుపతి మెలోడి సాంగ్..!

విజయ్‌ సేతుపతి, అదితి రావు హైదరీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం గాంధీ టాక్స్. ఈ సినిమాకు కిశోర్‌ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే క్రేజీ మెలోడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.పదే పదే కంగారుగుంటది.. అంటూ సాగే ఈ మెలోడి లవ్ సాంగ్‌ విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. నయన్సీ శర్మ, శిబి శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 30న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

Ee Nagaraniki Emaindi actor Sai Sushanth exit from its Sequel4
ఈ సుశాంత్‌కు ఏమైంది?.. సీక్వెల్ నుంచి ఔట్..!

తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఈ నగారానికి ఏమైంది. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభివన్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్‌ కీలక పాత్రల్లో మెప్పించారు. ఇందులో సాయి సుశాంత్‌.. కార్తీక్ పాత్రలో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు.అయితే ఈ మూవీ సీక్వెల్‌ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఈ సీక్వెల్‌ నుంచి సాయి సుశాంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు సుశాంత్‌ను మిస్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ విషయం దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. సుశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నానని పెట్టిన పోస్ట్ చూసి తన గుండె పగిలినంత పనైందని అన్నారు. అయితే కథ సహజంగా సరైన సమయంలో వచ్చిందని.. సుశాంత్ లేకపోయినా కార్తీక్ పాత్ర ఇప్పటికీ కథలో ఉంటుందని సోషల్ మీడియా ద్వారా దర్శకుడు పంచుకున్నారు.తరుణ్ భాస్తర్‌ పోస్ట్‌ను ప్రొడ్యూసర్ సృజన్ యరబోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే కార్తీక్‌గా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అలరించిన సుశాంత్‌పై తనకు ఎప్పటికీ ప్రేమాభిమానాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ టాలీవుడ్‌ చర్చనీయాంశంగా మారింది.

Anil Ravipudi about his 10th Film, Says Title will Surprise You5
పదో సినిమా ఫిక్స్‌.. టైటిల్‌ విచిత్రంగా ఉండబోతోంది: అనిల్‌

దర్శకుడిగా వరుస బ్లాక్‌బస్టర్లు కొడుతున్న అనిల్‌ రావిపూడి.. 10వ సినిమా ఎవరితో? అని ఇప్పటికే చర్చ మొదలైంది. కొంతకాలంగా మన శంకర వరప్రసాద్‌ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తాజాగా తన నెక్స్ట్‌ సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చాడు. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ తాజాగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. సరైన నిర్ణయం తీసుకోకపోతేఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ఇది నాకు కాస్త కష్టమైన సమయం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్‌ తర్వాత నేను చేసిన సినిమా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రెండు భారీ హిట్స్‌ తర్వాత సినిమా అంటే కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే దారి తప్పిపోతాం. అందుకే పదిరోజులు గ్యాప్‌ ఇచ్చాను.టైటిలే విచిత్రంగా ఉండబోతోందితాజాగా వైజాగ్‌ టూర్‌లో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి టైటిల్‌ ప్రకటన నుంచే ఒక విచిత్రమైన జర్నీ మొదలుకాబోతోంది. ఇది చూసి చాలామంది వామ్మో, ఇదేంట్రా బాబూ అనుకుంటారు. మరికొందరు హమ్మయ్య, ఇంకో సినిమాతో వస్తున్నాడు అనుకుంటారు. కచ్చితంగా ఒక మ్యాజిక్‌ అయితే జరగబోతోంది. టైటిల్‌ మాత్రం విచిత్రంగా ఉంటుంది. త్వరలోనే ఆ టైటిల్‌ ప్రకటిస్తాను.పవన్‌ కల్యాణ్‌తో కాదు!ఈ సినిమాలో నటీనటులను ఎవర్నీ అనుకోలేదు. కథ లైన్‌ మాత్రమే ఫిక్స్‌ అయ్యాను. అందులో ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరి డేట్స్‌ దొరుకుతాయి? అన్నది చూడాలి. అన్నింటికంటే ముఖ్యం డేట్స్‌ దరకడం కదా! జూన్‌, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. పవన్‌ కల్యాణ్‌ను నేను కలవలేదు, ప్రస్తుతానికైతే ఆయన్ను అయితే అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు.చదవండి: పెళ్లి ప్రపోజల్‌.. ముందు కెరీర్‌పై ఫోకస్‌ చేయ్‌: హీరోయిన్‌

Aamir Khan Comments about relation with girlfriend Gauri Spratt6
అమెను ఇప్పటికే పెళ్లి చేసుకున్నా.. కానీ..: అమిర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ గతేడాది అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఆరు పదుల వయస్సులోనూ తనకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందంటూ బర్త్ డే రోజే పెద్ద షాకిచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లిపై నెట్టింట చర్చ నడుస్తోంది. అమిర్ ఖాన్‌- గౌరీ వివాహ బంధంతో ఒక్కటవుతున్నారా? అనే టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. గౌరీని వెంటనే పెళ్లి చేసుకోవాలనే ప్రణాళిక ఏదీ లేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నేను, గౌరీ ఒకరి పట్ల ఒకరం చాలా చాలా నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. మీ అందరికీ తెలుసు.. ప్రస్తుతం మేము భాగస్వాములం.. మేమిద్దరం కలిసే ఉన్నామని వెల్లడించారు. ఇక పెళ్లి విషయానికొస్తే ఆమెను నా మనసుతో ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతానికి పెళ్లిని అధికారికంగా చేసుకోకపోయినా.. అలా చేసుకోవాలా? వద్దా? అనేది భవిష్యత్తులో ఇద్దరం నిర్ణయించుకుంటామని అమిర్ ఖాన్ అన్నారు.కాగా.. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. గతేడాది పుట్టినరోజు ఆమిర్ తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. తాము ముంబైలో ఒక విలాసవంతమైన కొత్త ఇంటికి మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే తెలిపారు. కాగా.. మొదట ఆమిర్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ జన్మించారు. దాదాపు 16 సంవత్సరాల వివాహం తర్వాత 2002లో వారు విడిపోయారు. ఆ తర్వాత అమిర్ 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు సరోగసీ ద్వారా ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. ఆమిర్ కిరణ్‌ రావుతో 2021లో విడిపోయారు. ఇద్దరితో విడాకులు తీసుకున్నప్పటికీ కుటుంబంలో జరిగే ఈవెంట్లకు అమిర్ ఖాన్ హాజరవుతున్నారు. విడిపోయిన ఇద్దరు భార్యలతో స్నేహపూర్వక రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు.

Actress Avantika Mohan about Marriage Proposals7
హీరోయిన్‌కు పెళ్లి ప్రపోజల్‌.. ముందు కెరీర్‌పై ఫోకస్‌ చేయ్‌!

సెలబ్రిటీకు ప్రపోజల్స్‌ రావడం అనేది చాలా కామన్‌. అయితే చిన్నపిల్లలు కూడా ప్రపోజ్‌ చేస్తున్నారని, అదే కాస్త ఆశ్చర్యంగా ఉందంటోంది హీరోయిన్‌ అవంతిక మోహన్‌. టీనేజ్‌ పిల్లలు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని చెప్తోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌షాట్స్‌ షేర్‌ చేసింది. అందులో ఓ అబ్బాయి.. కేరళలో చాలామంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వారిలో నేనూ ఒకడిని అన్నాడు. చిన్న వయసులో ఎంత ధైర్యమో..ఆ మెసేజ్‌కు అవంతిక స్పందిస్తూ.. ఈ పిల్లాడిని చూడండి.. అంత చిన్నవయసులోనే ఎంత ధైర్యమో! చిన్నోడా.. నేను చెప్పేదేంటంటే నాకు ఆల్‌రెడీ పెళ్లయిపోయింది. కాబట్టి నా గురించి ఆలోచించకుండా వెళ్లి నీ హోమ్‌వర్క్‌ చేసుకో.. నా జీవితంలో కొత్త హీరో ఎంట్రీకి ఛాన్స్‌ లేదు. నీ కెరీర్‌ మీద ఫోకస్‌ చేయు అని చెప్పుకొచ్చింది.నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? మరో స్క్రీన్‌షాట్‌లో ఓ యువకుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? అని అడిగాడు. అది చూసిన అవంతికకు కోపం రాలేదు, నవ్వొచ్చింది. నీ మెసేజ్‌ చూడగానే నాకు నిజంగా నవ్వొచ్చింది. నీకు దాదాపు 20 ఏళ్లు ఉంటాయనుకుంటా.. చాలా రాంగ్‌ టైమ్‌ ఇది! అయినా సరే నీ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!సినిమాసరైన సమయం వచ్చినప్పుడు కరెక్ట్‌ పర్సన్‌ నీ జీవితంలోకి వస్తారు.. అప్పటివరకు జీవితాన్ని ఆస్వాదించు అని రిప్లై ఇచ్చింది. అవంతికకు ఇలాంటి ప్రపోజల్స్‌ గతంలోనూ వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే.. అవంతిక యక్షి: ఫేత్‌ఫుల్లీ యువర్స్‌, నీలాకాశం పచ్చకాదల్‌ చువన్న భూమి, క్రొకొడైల్‌ లవ్‌ స్టోరీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఉందిలే మంచి కాలం ముందు ముందున సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది.చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు: శర్వానంద్‌

Afghanistan Cricketer Rashid Khan Intersting post On Border 2 Movie8
‘బోర్డర్‌ 2’ సినిమాపై అఫ్గాన్‌ క్రికెటర్‌ ఆసక్తికర పోస్ట్‌

సన్నీ డియోల్ హీరోగా నటించిన బోర్డర్‌ 2 చిత్రం ఈ నెల 23న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం డియోల్ ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డర్‌ 2పై అప్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్(Rashid Khan) ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు. దుబాయ్‌లో హైవే పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న వీడియో ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘బోర్డర్‌ 2 సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా.ఇప్పుడు నేను ఈ రీల్‌ పోస్ట్‌ చేస్తున్నా కదా.. చూద్దాం ఏమవుతుందో చూద్దాం’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బోర్డర్‌ 2లోని పాట ప్లే చేయడం గమనార్హం. రషీద్‌ పోస్ట్‌పై బాలీవుడ్‌ ప్రముఖులు సరదాగా స్పందించారు. ‘హా భాయ్‌’ అని వరుణ్‌ ధావన్‌ కామెంట్‌ పెట్టగా.. ‘అదే మార్గం’( ఆ హైవే నుంచే సినిమాకు రావాలి అనే అర్థం వచ్చేలా..) సునీల్‌ శెట్టి కామెంట్‌ చేశాడు.బోర్డర్‌ 2 విషయానికొస్తే.. 1997లో వచ్చిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ 'బోర్డర్'కి సీక్వెల్ ఇది. జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. సన్నీ డియోల్‌ తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి ప్రముఖులు నటించారు. మన దేశంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సోమవారం ప్రారంభం అయ్యింది. విదేశాల్లో ఆదివారం సాయంత్రం ప్రారంభం అయ్యింది. అయితే పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఈ సినిమా కథ ఉందంటూ.. కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి గల్ఫ్‌ దేశాలు బ్యాన్‌ చేసినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Rashid Khan (@rashid.khan19)

Actor Sharwanand about Dispute with Producers9
నన్ను వాడుకుని వదిలేశారు.. ఒక్కడూ..!: శర్వానంద్‌

మొత్తానికి టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ హిట్టు కొట్టాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో సంక్రాంతి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.నిర్మాతతో విభేదాలు?ఇకపోతే శర్వానంద్‌కు, నిర్మాత అనిల్‌ సుంకర మధ్య విభేదాలంటూ గతంలో కొన్ని రూమర్స్‌ వచ్చాయి. సినిమా రిలీజ్‌ సమయంలో శర్వా.. అనిల్‌ సుంకరను ప్రశంసించిన విధానం చూస్తే అవన్నీ ఉట్టి రూమర్సే అని తేలిపోయాయి. అయినప్పటికీ తాజాగా ఓ చిట్‌చాట్‌లో నిర్మాతతో విభేదాలపై స్పందించాడు.నా పరిస్థితి ఇలా..శర్వానంద్‌ మాట్లాడుతూ.. అనిల్‌గారు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మాకే తెలుసు. మేమంతా ఒకరకమైన బాధలో ఉన్నాం. ఇప్పుడు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు కానీ నాకు హిట్టొచ్చి ఆరేడేళ్లవుతోంది. నా పరిస్థితి ఇలా ఉంటే అనిల్‌ నిర్మాతగా చేసిన గత రెండు సినిమాలు పోయాయి. అలా ఒకరికొకొకరం సహాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు.మోసం చేశారుగతంలో నేను చాలామంది నిర్మాతలకు సాయం చేశాను. అందరూ వాడుకుని వదిలేసినవాళ్లే! నేను సాయం చేసినప్పుడు శర్వా మనవాడు అన్న భావన వారిలో ఉండాలి కదా.. అది ఏమాత్రం లేదు. నన్ను మోసం చేశారు. అలాంటి వాళ్లను నమ్మాలంటే కూడా ఆలోచించాల్సి వస్తోంది. అలా వారి వల్ల నాకు తెలియకుండానే తిక్కలోడిగా మారిపోయాను. కానీ, అనిల్‌గారు నన్ను నమ్మి ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేశారు. ఆయన నాకు అన్నకంటే ఎక్కువ అని చెప్పుకొచ్చాడు. శర్వానంద్‌ ప్రస్తుతం బైకర్‌, భోగి సినిమాలు చేస్తున్నాడు.చదవదండి: నటుడు, ఎమ్మెల్యే రెండో పెళ్లి.. మొదటి భార్య సంచలన ఆరోపణలు

Mana Shankara VaraPrasad Garu Child Artist Khushi Soni Comment About Her Father10
నాకు నాన్న లేరు.. 'చిరు' సార్‌ను చూస్తే ఏడుపొచ్చింది: ఖుషి

చిరంజీవి- అనిల్‌ రావిపూడి మూవీ 'మన శంకరవరప్రసాద్‌గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్లకు పైగానే రాబట్టింది. ఇందులో చిరంజీవి కూతురు నిక్కీ పాత్రలో బాలనటి ఖుషి నటించింది. చిరు కూతురుగా తను చాలా చక్కగా నటించి ప్రశంసలు కూడా అందుకుంటుంది. నయనతార, చిరు వంటి స్టార్స్‌తో ఖుషి కూడా తన స్థాయికి మించి నటించి మెప్పించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుషి మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకుంది.చిరంజీవి కూతురుగా నటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఖుషి పేర్కొంది. అయితే, తనకు నాన్నలేరని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ, తన తండ్రికి సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. రాజస్థాన్‌కు చెందిన తమ కుటుంబం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పింది. ఇక్కడే 7వ తరగతి చదువుతున్నట్లు తెలిపింది. తన మదర్‌ కూడా అదే స్కూల్‌లో పనిచేస్తున్నారని పేర్కొంది.తనకొక బ్రదర్‌ కూడా ఉన్నాడని తమ సంరక్షణ అమ్మ మాత్రమే చూసుకుంటుందని ఖుషి చెప్పుకొచ్చింది. సినిమా సెట్స్‌లో చిరంజీవి గారిని నాన్న అని పిలిచినప్పుడు చాలా ఎమోషనల్‌ అయ్యేదానినని ఒక్కోసారి కన్నీళ్లు కూడా వచ్చేవని గుర్తుచేసుకుంది. తనకు కూడా అలాంటి నాన్న ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయ పడింది. చిరు సార్‌తో చాలా మెమరీస్‌ ఉన్నాయని ఖుషి పంచుకుంది. చిరు సార్‌ను కలిసిన ప్రతిసారి కేక్స్‌, చాక్‌లెట్స్‌ ఇచ్చేవారని తెలిపింది. మెగాస్టార్‌తో గారితో మరో సినిమా ఛాన్స్‌ రావాలని ఆశపడుతున్నానని కోరుకుంది. నయనతారతో కూడా మంచి బాండింగ్‌ ఏర్పడిందని ఖుషి చెప్పింది. అయితే, నయన్‌ను అక్క అని పిలుస్తానని, తను చాలా యంగ్‌గా కనిపిస్తారని తెలిపింది. నయన్‌ గారు దుస్తులు కొనిచ్చారని చెబుతూ.. 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా తనకు చాలా ఇచ్చిందని ఖుషి పేర్కొంది.

Advertisement
Advertisement