Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Kollywood Director Parthiban comments about Divorce with actress seetha1
నటితో విడాకులు.. నాకేలాంటి బాధ లేదు..: డైరెక్టర్ కామెంట్స్

కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత లైఫ్ గురించి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నటి సీతను పెళ్లాడిన ఆయన.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, విడాకుల గురించి చెప్పుకొచ్చారు. సీతతో విడిపోయినందుకు తానెప్పుడు బాధపడలేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే తనతో ఉన్న 12 సంవత్సరాల నా జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండటాన్నే ఇష్టపడతారని పార్థీబన్‌ అన్నారు. ఏ స్త్రీ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారని ఆర్ పార్థీబన్‌ పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ఆర్ పార్తీబన్‌ కెరీర్‌..కాగా.. ఆర్ పార్తీ బన్‌ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్‌- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులు తీసుకుంది. ఇక ఆర్ పార్తీబన్ సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌ 1, పొన్నియన్‌ సెల్వన్‌ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాకుండా సుడల్‌ 1 వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేశాడు. I have never worried about separation with my ex wife Seetha, to be honest I'm very happy about it. The 12 years with her is the Sweetest memory of my life.These days men & women prefer independence over Marriage. No woman wants a restricted life in the name of Marriage.… pic.twitter.com/LfgirOi8Eh— Kolly Censor (@KollyCensor) February 10, 2026

Ranbir Kapoor: I Want to be Raaha friend2
నాకు జరిగినట్లు నా కూతురికి జరగనివ్వను!

నాలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వనంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. నా తండ్రి (నటుడు రణ్‌బీర్‌ కపూర్‌)కి, నాకు మధ్య కొంచెం గ్యాప్‌ ఉండేది. మేమిద్దరం అంత స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం కాదు. ఎందుకంటే ఆ జనరేషన్‌లో తండ్రీకొడుకుల మధ్య అలాంటి సీరియస్‌నెస్సే ఉండేది. ఇద్దరి మధ్య ఒక గోడ ఉండేది. నా కూతురి విషయానికి వచ్చేసరికి ఆ గోడను నేను కూల్చాలనుకుంటున్నాను. తనతో ఒక ఫ్రెండ్‌లా ఉండాలనుకుంటున్నాను. తను నచ్చినవన్నీ చేసేందుకు సపోర్ట్‌గా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్‌బీర్‌ కపూర్‌- ఆలియా భట్‌.. 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఈ దంపతులకు కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం రణ్‌బీర్‌- ఆలియా.. లవ్‌ అండ్‌ వార్‌ సినిమా చేస్తున్నారు. అలాగే రణ్‌బీర్‌.. రామాయణ మూవీలో రాముడిగా కనిపించనున్నాడు. నితేశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి సీతగా కనిపించనుంది. యష్‌ రావణుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశా: నిఖిల్‌

SreeLeela Has Officially Graduated And Completed Her Medical Degree3
యాక్టర్‌ కమ్‌ డాక్టర్‌.. వైద్య పట్టా అందుకున్న శ్రీలీల

ప్రముఖ తెలుగు నటి శ్రీలీల తన వైద్య విద్యను పూర్తి చేశారు. ఎంబీబీఎస్‌ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా డాక్టర్‌గా అర్హత సాధించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తల్లి గైనకాలజిస్ట్‌గా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి కలిగిన శ్రీలీల, సినిమా షూటింగ్‌ల మధ్యలోనూ చదువుపై దృష్టి పెట్టి ఈ గొప్ప విజయాన్ని సాధించింది. 2023లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌ను పూర్తి చేసుకొని.. తాజాగా కాన్వోకేష‌న్ వేడుక‌లో డిగ్రీ ప‌ట్టాను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #SreeLeela has officially graduated, completing her medical degree ❤️Acting + academics - win win! pic.twitter.com/sisosEPRTZ— Siddarth Srinivas (@sidhuwrites) February 11, 2026‘డాక్టర్‌’ శ్రీలీల వెనుక పెద్ద కథే ఉందిశ్రీలీల వైద్య విద్యను అభ్యసించడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకుంది. అమ్మమ్మ విషయంలో జరిగిన ఓ సంఘటననే తనను మెడిసిన్‌ చదివేలా చేసిందని చెప్పారు. ‘నేను డాక్టర్‌ అవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి వెనక ఓ స్టోరీ ఉంది. మా ఇంట్లో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టరే. ఓ సారి నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాను. అది మారుమూల గ్రామం. ఓ రోజు అమ్మమ్మ సడెన్‌గా కిందపడిపోయింది. ఏం చేయాలో తెలియదు. అందరితో పాటు నేను కూడా అక్కడే నిల్చోని చూస్తున్నా. కానీ అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మను పైకిఎత్తి వీపు భాగాన్ని పుష్‌ చేశాడు.దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. అన్నయ్య మెడిసిన్‌ చదవుతున్నాడు కాబట్టి.. ఆ సమయంలో ఏం చేయాలో అది చేశాడు. కానీ నాకు సహాయం చేయాలని అనిపించినప్పటికీ ఎలా చేయాలో తెలియదు. ఆ రోజే ఫిక్సయ్యా.. నేను ఎప్పటికైనా డాక్టర్‌ అవ్వాలని. అందుకే మెడిసిన్‌ కోర్సు తీసుకున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. Actress #SreeLeela has officially graduated and completed her medical degree ❤️Balancing academics and cinema at such a young age 👏🏻👏🏻 pic.twitter.com/hGrMKv7iir— Ayyappan (@Ayyappan_1504) February 11, 2026

Uday Kiran niece comments about manasantha movie re release4
'అప్పుడు నాకు రెండు నెలలే'.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎమోషనల్ వీడియో

టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ మనసంతా నువ్వే. ఈ ‍ప్రేమకథా చిత్రం మరోసారి ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది. ఈ ఏడాది వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రీమా సేన్, తనూ రాయ్‌ హీరోయిన్లుగా నటించారు. 2001లో విడుదలైన ఈ సినిమాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్‌ రెడ్డి, రవికాంత్‌ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఓ వీడియోను రిలీజ్ చేసింది. నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు అని.. ఈ సినిమా రిలీజైనప్పుడు నాకు రెండు నెలల వయస్సు ఉంటుందని తెలిపింది. ఈ ఫిబ్రవరి 14 మీకు చాలా స్పెషల్‌గా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. మనసంతా నువ్వే మిమ్మల్ని మరోసారి థియేటర్లలో ‍అలరించనుందని పేర్కొంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాను మీ అందరితో కలిసి చూడడానికి చాలా ఆసక్తిగా ఉందంటూ మహతి వీడియోలో మాట్లాడింది. ఉదయ్‌కిరణ్‌ మేనల్లుడు తేజ కూడా..‘అంతకుముందే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ కూడా మాట్లాడారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్‌ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్‌కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్‌కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.#UdayKiran మేనకోడలు #Mahathi వీడియో బైట్‌లో సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ❤️#ManasanthaNuvve4K రీ రిలీజ్ థియేటర్స్‌లో ఫిబ్రవరి 14న 🎬🍿#ManasanthaNuvve pic.twitter.com/4PydDi1T4K— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 11, 2026

Supritha Say One Person Spent RS 20000 For My Mobile Number5
అతను నా నెంబర్‌ కోసం రూ.20 వేలు ఖర్చు చేశాడు: సురేఖ వాణి కూతురు

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో అందరికి తెలిసిందే. ఆమె ఇన్‌స్టాలో ఏదైనా పోస్ట్‌ పెడితే క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. ఆమె అందాన్ని పొగుడుతూ పలువురు నెటిజన్లు కామెంట్‌ కూడా చేస్తుంటారు. మరికొంతమంది అయితే సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు ప్రపోజ్‌ కూడా చేస్తుంటారు. అలా తనకు వెరైటీగా వచ్చిన ఒక ప్రపోజల్‌ గురించి మీడియాతో పంచుకుంటి అందాల తార సుప్రీత. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకొచ్చిన ఓ వెరైటీ ప్రపోజల్‌ గురించి చెప్పుకొచ్చింది.‘నాకు రెగ్యులర్‌గా ప్రపోజల్స్‌ వస్తూనే ఉంటాయి. అయితే వాటిని నేను లైట్‌ తీసుకుంటా. కొన్ని మెసేజ్‌లు చూసి నవ్వుకుంటాను. ఈ మధ్య ఒకతను నా మొబైల్‌ నెంబర్‌ కోసం రూ. 20 వేలు ఖర్చు చేశాడట. నా నెంబర్‌ కనుకొన్ని ఆయన మెసేజ్‌ చేశాడు. ‘మీ నెంబర్‌ కోసమే నేను రూ. 20 వేలు ఖర్చు చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి. నన్ను పెళ్లి చేసుకో.. చాలా బాగా చూసుకుంటాను. మీ నెంబర్‌ కోసమే అంత డబ్బు ఖర్చు చేశానంటే.. నిన్ను ఎలా చూసుకుంటానే అర్థం చేసుకో’ అని స్మార్ట్‌గా ప్రపోజ్‌ చేశాడు. ఆ మెసేజ్‌ చూసి నవ్వుకొని అతన్ని బ్లాక్‌ చేశా’ అని సుప్రీత చెప్పుకొచ్చింది.ఇక తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెబుతూ.. ‘నన్ను భరించేవాడు దొరికితే చాలు. ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. అలా అని ఖాలీగా ఉండకూడదు. ఏదో ఒక బిజినెస్‌ చేస్తూ..ఫ్రీ టైం మొత్తం నాతోనే గడపాలి. కలిసి బయటకు వెళ్లాలి. నేనే ఎక్కువ కేరింగ్‌ చేస్తా. నేను వండి పెట్టింది తింటూ నాతో ఉంటే చాలు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

Nikhil Siddhartha Comments at Swayambhu Teaser Launch Event6
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ మూవీ చేశా.. హీరో నిఖిల్‌

'కార్తికేయ 2' సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకున్న హీరో నిఖిల్‌ మరో భారీ బడ్జెట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్వయంభు'. బుధవారం (ఫిబ్రవరి 11న) ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. హ్యాపీ డేస్‌ వచ్చి 19 ఏళ్లవుతోంది. ఇది నా 22వ సినిమా.ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశా..ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అన్ని సమయాల్లో మీరంతా తోడున్నారు. గత రెండేళ్లుగా నేను కనిపించలేదు. కార్తికేయ 2 తర్వాత మంచి సినిమాతో మీ ముందుకు రావాలనుకున్నాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని, భయపడుతూ, జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభు. నిఖిల్‌ మావాడు అని గర్వంగా చెప్పుకునేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతోమంది పోరాట యోధుల వల్లే మన దేశం ఈరోజు ఇలా ఉంది. కొన్నిసార్లు వారి గురించి మన పుస్తకాల్లో కూడా ఉండదు. వెయ్యేండ్ల కిందట జరిగిన కథ ఇది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం అని చెప్పుకొచ్చాడు.సినిమాస్వయంభు విషయానికి వస్తే.. నిఖిల్‌ హీరోగా నటించగా, నభా నటేశ్‌, సంయుక్త, సునీల్‌ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించగా భువన్‌, శ్రీకర్‌ నిర్మించారు. రవి బస్రూర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది.చదవండి: స్వయంభు టీజర్‌ రిలీజ్‌

Swayambhu Epic Teaser Out Now7
'స్వయంభు' పవర్‌ఫుల్‌ టీజర్‌ చూశారా?

నిఖిల్‌ హీరోగా సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీ ‘స్వయంభు’.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ విడుదల చేశారు. పోరాట యోధుడిగా నిఖిల్‌ దుమ్మురేపాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ మూవీని ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మించారు. పవర్‌ఫుల్‌ పాన్‌ ఇండియా విజన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Why Kaveri Baruva Strategy Comments On Allu Arjun8
పావలా విలువ లేని ట్రోల్స్‌.. 'అల్లు అర్జున్‌'పై విమర్శల దాడి

అల్లు అర్జున్.. తన కెరీర్‌‌ ప్రారంభం నుంచే వందల ట్రోల్స్‌ను దాటుకుంటూ స్టార్‌ హీరోగా ఎదిగాడు. గంగోత్రి సినిమా నాటికి తన వయసు 20 ఏళ్లు. హీరో లక్షణాలే లేవని నానా రకాలుగా విమర్శించారు. ట్రోలింగ్‌ అంటే ఏంటో కూడా తెలియని టైమ్‌లోనే తట్టుకుని నిలబడ్డాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే తనలోంచి తన్నుకొచ్చే ఆత్మవిశ్వాసాన్ని కళ్లల్లోనూ, నవ్వులోనూ, ముఖంలోనూ చూపుతూ తనను తాను మేకోవర్ చేసుకున్నాడు. అలా తెలుగు చిత్రసీమ సగర్వంగా భావించే నటుడిగా అల్లు అర్జున్ ఎదిగాడు. తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తికెక్కాడు. అయినప్పటికీ తనపై తీవ్రమైన ట్రోలింగ్‌ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పావలా విలువ కూడా చేయని వాళ్లే సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతారని తెలిసిందే.3వేల మంది ఫాలోవర్స్‌ఈ క్రమంలో తాజాగా కావేరీ బారువా అనే బ్రాండింగ్ వ్యూహకర్త చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్‌తో ప్రకటనల్ని చిత్రీకరించేటప్పుడు 42 రకాల నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్‌ ఒక వ్యూహకర్తగా తన వృత్తికి పనికొచ్చేలా ఉన్నాయి. తనను తాను వైరల్‌ చేసుకునేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవర్స్‌ కేవలం 3వేలు మాత్రమే.. దీంతో తను ఒక వ్యూహకర్త కాబట్టి ఇలాగైనా తను పాపులర్‌ కావచ్చని పక్కా ప్లాన్‌తోనే బన్నీపై పేలవమైన విమర్శలు చేసిందని ఫ్యాన్స్‌ అంటున్నారు.ఆధారాలు లేకుండానే..ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా అల్లు అర్జున్‌పై చేసిన విమర్శలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. వారి ఒత్తిడితో ఆ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూను యూట్యూబ్‌లో తొలగించారు. అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు ఉంటాయని ఆమె చెప్పింది. కానీ, అవేంటి అనేది చెప్పలేదు. తనకు ఎవరో చెప్పారు అంటుంది. పైగా అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ దగ్గర బంధువులు అంటుంది. అసలు బన్నీ ఎవరు.. ఆయన బంధువులు ఎవరు అనేది కూడా తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్‌ కౌంటర్‌​ ఇస్తున్నారు. సంధ్య థియేటర్‌ గొడవ, ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్‌ తీయాలంటూ వీడియో వైరల్‌, ఇప్పుడు స్ట్రాటజిస్ట్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా కొందరు అల్లు అర్జున్‌కు వ్యతిరేఖంగా నడుపుతున్న యాంటీ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌బన్నీపై ఆమె చేసిన కామెంట్లతో.. అల్లు అర్జున్‌ యాంటీ ఫ్యాన్స్‌ రంగంలోకి దిగిపోయారు. 42 పాయింట్లతో ఒక పత్రాన్ని రెడీ చేసి సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్‌ టీమ్‌ కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. బన్నీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరింది. బన్నీ ఇలాంటి రూల్స్‌ పెడుతారని ఎవరు చెప్పారో వివరాలు ఇవ్వాలని కోరింది. కానీ, వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ వీడియోను తొలగించి సైలెంట్‌ అయిపోయారు.ఒకవేళ ఆమె చెప్పిన వ్యాఖ్యల్లో నిజం ఉంటే బన్నీ గురించి చెప్పిన ఆ వ్యక్తి వివరాలు తెలపవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కూడా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కావేరీ బారువాతో పాటు హోస్ట్‌పై బూతులతో విరుచుకుపడుతున్నారు. వాటి వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం వారి అకౌంట్లు కూడా తొలగించేశారు. కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు నమ్మేలా లేవని బన్నీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఆయనతో పనిచేసిన వారందరూ బన్నీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. అవన్నీ కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. (అల్లు అర్జున్‌ గురించి ఆయన అభిమానులు విడుదల చేసిన వీడియో) Ilanti person mida edustaru 🙏 pic.twitter.com/IxBpgnHN3b— 𝒞𝒽𝒾𝓀𝒾𝓉𝒽𝒶 (@chikithaaaaaaa) February 10, 2026

Is Prakash Raj Replacing Akshaye Khanna in Drishyam 3 Movie?9
దృశ్యం 3లో ప్రకాశ్‌ రాజ్‌.. కానీ!

ఈ మధ్య ప్రకాశ్‌ రాజ్‌ గురించి అనేక రూమర్స్‌ వస్తున్నాయి. మొన్నటివరకు ఆయన ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్‌' సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. దీంతో అదంతా ఫేక్‌ న్యూస్‌ అని అతడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో మరో రూమర్‌ నెట్టింట వైరలవుతోంది. హిందీ 'దృశ్యం 3' సినిమాలో అక్షయ్‌ ఖన్నా తప్పుకున్న విషయం తెలిసిందే! ప్రకాశ్‌రాజ్‌ క్లారిటీఆ స్థానంలో ప్రకాశ్‌ రాజ్‌ నటించనున్నాడన్నది లేటెస్ట్‌ టాక్‌. ఈ ఊహాగానాలపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించాడు. తాను దృశ్యం 3లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదన్నాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశాడు. హిందీ మూవీ 'దృశ్యం 3'లో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. షూటింగ్‌ కూడా మొదలైంది. కాకపోతే నేను ఎవరినీ రీప్లేస్‌ చేయడంలేదు అని వెల్లడించాడు.సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీదృశ్యం విషయానికి వస్తే.. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా పలు భాషల్లో రీమేకై అక్కడా విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం మరింత సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దృశ్యం ఫ్రాంచైజీలో మూడో భాగం రాబోతోంది. మలయాళంలో ఇప్పటికే షూటింగ్‌ పూర్తవగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వంలో 'దృశ్యం 3' తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది.దృశ్యం 3 నుంచి అక్షయ్‌ అవుట్‌'దృశ్యం 2'లో పోలీస్‌ అధికారి పాత్రలో యాక్ట్‌ చేశాడు అక్షయ్‌ ఖన్నా. ఈ లెక్కన మూడో భాగంలోనూ అతడు ఉండాల్సిన వ్యక్తి! కానీ 'ధురంధర్‌' సక్సెస్‌ తర్వాత గర్వం అతడి తలకెక్కిందని, గొంతెమ్మ కోర్కెలు కోరాడని ప్రచారం జరిగింది. నిర్మాత కుమార్‌ మంగట్‌ పాఠక్‌ కూడా అదే నిజమన్నాడు.గొంతెమ్మ కోర్కెలు'అడిగినంత రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ, విగ్‌ కావాలని డిమాండ్‌ చేశాడు. దృశ్యం 2లో బట్టతలతో కనిపించి ఇప్పుడు జుట్టుతో కనిపిస్తే బాగోదని నచ్చజెప్పాం. అప్పటికే అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్‌ ఉందనగా సినిమా నుంచి తప్పుకోవడంతో నోటీసులు ఇచ్చాం' అని పేర్కొన్నాడు. దీంతో అతడి స్థానంలో జైదీప్‌ అహ్లావత్‌ను తీసుకున్నట్లు కూడా తెలిపాడు. ఇంతలోనే ప్రకాశ్‌ రాజ్‌ తెరమీదకు రావడం, ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. Started shooting for this engaging franchise #Drishyam3 in hindi. With a wonderful team and a scintillating role to play . Im sure you will love it . ❤️❤️❤️( and yes im not replacing anyone..) 😛😛😛— Prakash Raj (@prakashraaj) February 10, 2026 చదవండి: ఏదైనా జరగరానిది జరిగితే.. శ్రీహాన్‌ మంచి మనసు

Dhurandhar Singer Jasmine Sandlas Objects To Men Harassing Women At Delhi concert10
పాట పాడలేనన్న ‘ధురంధర్‌’ సింగర్‌.. నెటిజన్లు ప్రశంసలు

అది ప్రముఖ సింగర్‌ కచేరి. వేలాది మంది తరలి వచ్చారు. ఆ సింగర్‌ తన గాత్రంతో సంగీత ప్రియుల్ని మంత్రముగ్థుల్ని చేస్తోంది. అందరూ ఆమె పాటలో లీనమైపోయారు. అంతే.. సడెన్‌గా ఆమె తన పాటను ఆపేసింది.న ఇద్దరు యువకులను చూసిస్తూ.. వాళ్లను పంపించకపోతే పాడేదే లేదంటూ హుకుం జారీ చేసింది. ఇది చూసి అక్కడున్నవారంతా సింగర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ కూడా సదరు గాయని చేసిన పనికి ఫిదా అవుతూ.. మంచి నిర్ణయం తీసుకుందంటూ కొనియాడారు. ఇంతకీ ఆ గాయని ఎవరు? మధ్యలోనే పాటను ఆపడానికి గల కారణం ఏంటి?పంజాబ్‌ సింగర్‌ జాస్మిన్ శాండ్లాస్ గాత్రానికి లక్షలాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పాటలకు మిలియన్ల వ్యూస్‌ వస్తుంటాయి. ‘ధురంధర్‌’ సినిమాలో ఆమె ఆలపించిన ‘తెను షరాత్‌సికా’ పాట ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హచ్‌చల్‌ చేస్తోంది. ఈ పాటకు లక్షలాది మంది రీల్స్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌లో మిలియన్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే జోష్‌లో ఆమె తాజాగా ఢిల్లీలో సంగీత కచేరి నిర్వహించింది. ఈ కచేరీకి వేలాది మంది సంగీత ప్రియులు వచ్చారు.జాస్మిన్‌ పాటలను ఆలపిస్తున్న క్రమంలో.. ఇద్దరు ఆకతాయి కుర్రాళ్లు.. అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆమె గమనించారు. వెంటనే పాటను మధ్యలో ఆపేసి.. ‘సెక్యూరిటీ.. దయచేసి అక్కడున్న ఇద్దరు అబ్బాయిలను బటయకు పంపించండి. వాళ్లు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు. నా కచేరీలో మహిళలు సురక్షితంగా లేకుంటే.. పాడడం ఆపేస్తా’ అని ఆమె హెచ్చరించింది. వాళ్లను బయటకు పంపేవరకు ఆమె ఆలపించలేదు. చివరకు అక్కడి సిబ్బంది ఆ ఇద్దరి యువకులను బయటకు పంపడంతో జాస్మిన్‌ తన కచేరిని కొనసాగించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న యువకుల పట్ల ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తనకోసం వచ్చి మహిళల రక్షణ కోసం ఆమె గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడుతున్నారు. View this post on Instagram A post shared by Gulabi Queen (@lifeofgulabiqueen)

Advertisement
Advertisement