ప్రధాన వార్తలు
'ది రాజాసాబ్' నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్
ఈ సంక్రాంతి రేసులో మొదటి విడుదలైన మూవీ ‘ది రాజాసాబ్’.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కవ బడ్జెట్తో తెరకెక్కించారు. మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ అవసరం లేకున్నా హీరోయిన్స్ను ముగ్గురుని తీసుకోవడం.. ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ లేకపోవడంతో మైనస్ అయింది. అయితే, ఫ్యాన్స్ సూచన మేరకు సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తగ్గించి మరికొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇంతలో మూవీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.‘ది రాజాసాబ్’ చిత్రాన్ని సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే. ఇప్పటి వరకు రూ. 250 కోట్ల మేరకు మాత్రమే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. రాజాసాబ్ మూవీపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా ఆశలు పెట్టుకుంది. ఎన్నో డిజాస్టర్ సినిమాలతో దెబ్బతిన్న ఆ సంస్థ ఈ మూవీతో గట్టెక్కుతుందని భావించారు. కానీ, రాజాసాబ్ తెచ్చిన నష్టాలు నిర్మాతను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. దీంతో ఆ సంస్థను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో సినిమా ప్లాన్ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నదే.. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నిర్మాత విశ్వప్రసాద్కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్లో ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట. 'స్పిరిట్' హక్కులుఇదే సమయంలో స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రీ మూవీస్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. అలా రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్ను కూడా తీసుకోలేదని టాక్ ఉంది. కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషకం గురించి నిర్మాతతో చర్చించలేదట.
'మన శంకరవరప్రసాద్ గారు' రూ. 350 కోట్ల జర్నీ
చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ నమ్మలేదు. విశ్వంభర వంటి సినిమా ఉండగా అనిల్తో ప్రాజెక్ట్ ఏంటి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, సెడెన్గా అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. సినిమా షూటింగ్తో పాటు విడుదల వరకు పనులు అన్నీ వేగంగా పూర్తి అయ్యాయి. దీంతో జనవరి 12న ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్లోకి వచ్చేశాడు. మొదటి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్స్ సాధించాడు.‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సినిమా ప్రకటన నుంచి థియేటర్స్లో సక్సెస్ సెలబ్రేసన్స్ వరకు ఉన్న ప్రధాన అంశాలను ఒక వీడియోలో చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మెమోరీస్ మీరూ చూసేయండి.
రజినీకాంత్ క్రేజీ సినిమాలో సాయిపల్లవి
నటుడు రజనీకాంత్ హీరోగా నటించనున్న నూతన చిత్రంలో నటి సాయిపల్లవి నటించనున్నారా..? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉంది అంటూ కోలీవుడ్ వర్గాల నుంచి సమాధానం వస్తుంది. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ –2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కమలహాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో నటుడు రజనీకాంత్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శిబి చక్రవర్తి తెరకెక్కించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించే ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా ఇందులో నటించే ఇతర తారాగణం గురించిన వివరాలు ఇంకా వెలువడకున్నా, ముఖ్య పాత్రలో నటి సాయిపల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య నటుడు కమలహాసన్ నిర్మించిన అమరన్ చిత్రంలో సాయిపల్లవి కథానాయకిగా నటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె హిందీలో ఏక్ ధిన్, రామాయణ 1,2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించనున్న 173వ చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా నటుడెవరైనా, దర్శకుడెవరైనా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరిస్తారన్నది తెలిసిందే. దీంతో ఈమె రజనీకాంత్ చిత్రంలో నటించడానికి సై అంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రంలో నటి శృతీహాసన్ ముఖ్య పాత్రలో నటించడం గమనార్హం. రజనీ సినిమాలో సాయిపల్లవి పాత్ర బలంగా ఉంటే తప్పకుండా చేస్తుందని ఆమె అభిమానులు చెబుతున్నారు. గతంలో తనకు చిరంజీవి సినిమా ఛాన్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
పోరాట యోధుడు
1897 నుంచి 1920 మధ్య సాగిన బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా రూపొందుతోంది. బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరా డిన యోధుడు డేవిడ్ రెడ్డి పాత్రను మంచు మనోజ్ పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు.హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. ‘‘మనోజ్ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్, పర్ఫార్మెన్స్తో డేవిడ్ రెడ్డి పాత్రలో ఒదిగిపోతున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: ఆచార్య వేణు.
బిగ్బాస్
బిగ్బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
అటు మోడ్రన్గా.. ఇటు అమ్మవారి వేషంలో..
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
నా క్యారెక్టర్పై నింద.. వాష్రూమ్లో ఏడ్చేదాన్ని: రీతూ
వైల్డ్కార్డ్స్గా రీతూ-పవన్.. నయని విమర్శలు
కూతురి ఫస్ట్ బర్త్డే.. బిగ్బాస్ జంట ఎమోషనల్
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్
A to Z
ఓటీటీలోకి 'ఛాంపియన్'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
యంగ్ హీరో రోషన్ నటించిన 'ఛాంపియన్' సినిమా ఓటీటీ...
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెలుగులోనూ కాస్తంత ఫా...
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
శోభిత తెలుగమ్మాయే. కానీ దాదాపు పదేళ్ల కెరీర్లో రె...
ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక సంక్రాంత...
ఆ పాటలు పాడినందుకు పైసా ఇవ్వలేదు: సింగర్
యాక్టర్సే కాదు సింగర్స్ కూడా లక్షల్లో ఏకంగా కోట్ల...
నడుముపై చేయి వేసి.. అవమానంతో చచ్చిపోయా!
యాక్టర్స్ సినిమాలు, సీరియల్స్, యాడ్స్, షోలతో పా...
సల్మాన్ దేశభక్తి సినిమా.. మాతృభూమి సాంగ్ రిలీజ్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్స...
‘బోర్డర్ 2’ ఫస్ట్డే కలెక్షన్స్.. ‘ధురంధర్’ కంటే ఎక్కువే!
బాలీవుడ్ నుంచి వచ్చిన మరో దేశభక్తి చిత్రం బోర్డర్...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
ఏడేళ్ల తర్వాత 'తుంబాడ్' దర్శకుడి కొత్త సినిమా.. గూస్ బంప్స్ ట్రైలర్
'తుంబాడ్' సినిమాతో దర్శకుడు రాహి అనిల్ బార్వే దేశ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట...
#AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్
'పుష్ప 2' తర్వాత ఆచితూచి సినిమాలు ప్లాన్ చేస్తున్న...
నా కంటే ముందు చాలామందితో డేటింగ్ చేశాడు.. కాకపోతే: హీరోయిన్
సాధారణంగా హీరోయిన్లు ప్రేమలో ఉన్నాసరే దాన్ని బయటపె...
స్టార్ హీరోకు తల్లిగా.. నో చెప్పా కానీ..: మీనా
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెల...
మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ప్ర...
ఫొటోలు
తెలుగమ్మాయి ఈషా రెబ్బా కొత్త ఫోటోలు అదుర్స్
‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
బ్లాక్ డ్రస్లో భాగ్యశ్రీ డిఫరెంట్ లుక్స్ (ఫొటోలు)
'ఇరుముడి' సెట్లో రవితేజ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'బిగ్బాస్' సోనియా కుమార్తె బారసాల వేడుక (ఫొటోలు)
‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ బ్లాక్బస్టర్ సక్సెస్మీట్ (ఫొటోలు)
అనిల్ రావిపూడికి ఒక రేంజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)
తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)
కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్ ఫోటోలు
మ్యాడ్ నటి 'రెబా జాన్' ట్రెండింగ్ ఫోటోలు
గాసిప్స్
View all
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
ప్రభాస్ ‘స్పిరిట్’పై క్రేజీ గాసిప్.. గోపీచంద్ కీలక పాత్ర?
మెగా హీరో సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
తర్వాతి రెండు నెలలు డ్రై?
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్
టాలీవుడ్లో ట్రెండ్ మారుతోందా?
మెగా హీరోతో మారుతి కొత్త సినిమా!
రివ్యూలు
View all
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్..
2.5
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
సినీ ప్రపంచం
విజయ్ సేతుపతి మూకీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
పేరుకే తమిళ నటుడు అయినప్పటికీ పాన్ ఇండియా లెవల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి నుంచి ఇప్పుడు ఓ మూకీ సినిమా రాబోతుంది. అదే 'గాంధీ టాక్స్'. నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టారు గానీ ఇన్నాళ్లకు థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారమే (జనవరి 30) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు 'దేవర' నిర్మాత గుడ్న్యూస్)ఇందులో విజయ్ సేతుపతి సరసన అదితీ రావు హైదరీ హీరోయిన్. అరవింద స్వామి కీలక పాత్రధారి. కిశోర్ పి బెలేకర్ దర్శకత్వం వహించారు. ప్రతి స్టోరీకి మాటలు అవసరం లేదు. కొన్ని చూడటంతోనే మనసుని హత్తుకుంటాయి. ఈసారి స్క్రీన్ పై మాటలుండవు. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది అని ట్రైలర్తో చెప్పుకొచ్చారు. డబ్బు అనేది నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు కారణమైంది అనేది ఇందులో చూపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్గా స్ట్రీమింగ్)
అలా అయితేనే పెళ్లి.. వింత కండిషన్ పెట్టిన నటి
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి, నటుడు అర్బాజ్ పటేల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై తాజాగా నిక్కీ తంబోలి స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తమ పెళ్లికి ఓ వింత కండీషన్ కూడా పెట్టుకున్నారట. అదేంటే.. నిక్కీ లేదా అర్బాజ్.. ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రియాల్టీ షోలో విన్నర్గా గెలిస్తే పెళ్లి చేసుకుంటారట. గెలుపు అనేది పాజిటివ్ ఎనర్జీ అని.. విజయం తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెడతామని నిక్కీ చెప్పుకొచ్చింది.కాగా, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న 'ది ఫిఫ్టీ' రియాలిటీ షోలో ఈ జంట కలిసి పాల్గొంటోంది. ఇందులో మొత్తం 50 మంది సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. ఈ షోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.
ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్గా స్ట్రీమింగ్
కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' డైరెక్ట్గా ఓటీటీలోకి రానుంది . ఇప్పటికే తమిళ్ వర్షన్లో ‘వా వాత్తియార్’ పేరుతో సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. అయితే, తెలుగులో థియేటర్స్ దొరకకపోవడంతో టాలీవుడ్లో విడుదల కాలేదు. దీంతో తెలుగు వర్షన్ను ఓటీటీలోనే డైరెక్ట్గా విడుదల చేస్తున్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించి ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా తమిళనాట ఎంట్రీ ఇచ్చింది. మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా అన్నగారు వస్తారు (అన్నగారు వస్తారు) మూవీ విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
'జన నాయగన్' విడుదలపై హైకోర్టు కీలక తీర్పు
విజయ్-హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జన నాయగన్’ విడుదల మరింత ఆలస్యం కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఇప్పట్లో జన నాయగన్ విడుల లేనట్లేనని తెలుస్తోంది.విజయ్ సినిమా జన నాయగన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. దీనితో విడుదల మరింత ఆలస్యం అయింది. సినిమా సెన్సార్ విషయంలో బోర్డుకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని సింగిల్ బెంచ్ జడ్జిని హైకోర్టు సూచించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి జన నాయగన్కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనని హైకోర్టు తెలిపింది. కొత్తగా మళ్లీ విచారణకు ఆదేశించి సినిమాను రీవైజ్ కమిటీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. దీంతో విడుదల మరింత ఆలస్యం కానుంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు 'దేవర' నిర్మాత గుడ్న్యూస్
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు శుభవార్త.. దేవర-2 ఉంటుందని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఆపై సినిమా విడుదల గురించి కూడా తెలిపారు. సీక్వెల్ గురించి చాలా కాలంగా తారక్ అభిమానుల్లో ఉన్న సందేహం ఎట్టకేలకు తీరింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర (2024)లో విడుదలైంది. భాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్లోనే దర్శకుడు ప్రకటించినా అధికారికంగా స్పష్టత రాలేదు. అయితే, తాజాగా ‘దేవర’ నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని ఒక క్లారిటీ ఇచ్చేశారు.నందిగామలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సుధాకర్కు దేవర-2 ఉంటుందా, లేదా? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన సమాధానం ఇచ్చారు. ‘దేవర- 2′ తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది మే నెల నుంచే షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. 2027లో సినిమా విడుదల చేస్తామని అభిమానుల సాక్షిగా ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్లో తారక్ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత అంటే మే నుంచి దేవర-2కు డేట్లు కేటాయించే ఛాన్స్ ఉంది.దేవర-1 విడుదల తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ మళ్లీ కలవలేదు. దీంతో సీక్వెల్ లేదని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొరటాల కూడా వేరే హీరోలతో సినిమాలు చేసేందుకు కొన్ని కథలు రెడీ చేసుకున్నారు. ఇంతలో మళ్లీ తారక్ నుంచి పిలుపు రావడం జరిగింది. వారిద్దరి మధ్య కథ ఫైనల్ కావడంతోనే ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చేసిందని సమాచారం. #DEVARA 2 Update 🚨🚨• Shoot begins from May 2026• Release planned for 2027:- Producer #SudhakarMikkilineni#NTRpic.twitter.com/IDmpz5bVWD— Milagro Movies (@MilagroMovies) January 27, 2026
చిరంజీవి కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై 'చిన్మయి' కౌంటర్
‘మనశంకర వరప్రసాద్’ మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ సింగర్ చిన్మయి విభేదించారు. అయితే, చిరంజీవి పట్ల గౌరంవంగానే ఆమె స్పందించారు. కానీ, ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మరోసారి బలంగానే రియాక్ట్ అయ్యారు.చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి ఇలా స్పందించారు. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనేది పూర్తిగా అపద్దం. ఇంగ్లీష్లో ‘కమిట్మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అర్థం వస్తుంది.. కానీ, ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు ఉంటుంది. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే ఇండస్ట్రీలో ఛాన్సులు రావు. ఇక్కడ చాలామంది మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం సర్వసాధారణం. లెజెండరీ చిరంజీవి గారి తరం వేరు.. ఇప్పుడు జరుగుతున్నది వేరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు… ప్రస్తుతం పరిశ్రమలో అలాంటి వాతావరణం లేదు. చిరు తరంలో మహిళా కళాకారులతో స్నేహితులుగా తమ కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు. లెజెండ్లతో పనిచేసిన వారందరూ లెజెండ్లే. చిరు నాటి రోజులు ఇప్పుడు లేవు ' అని చిన్మయి పేర్కొంది. ఇదే సందర్భంలో తనకు జరిగిన అన్యాయాన్ని కూడా చిన్మయి లేవనెత్తారు. లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించిన సమయంలో తన తల్లి అక్కడే ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తల్లి పక్కనే ఉన్నా సరే మగవారి బుద్ధి చూపించాడని వైరాముత్తు గురించి విరుచుకుపడింది. తనపై లైంగిక దాడి చేయమని కోరుకోలేదని, సినిమా ఛాన్సుల కోసమే తనతో కలిసి పనిచేశానంది. అతన్ని ఒక గురువుగా, పురాణ గీత రచయితగా గౌరవించానని ఆమె గుర్తుచేసుకుంది. సీనియర్ నటి షావుకారు జానకి వంటి వారు కూడా మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోలేదని చిన్మయి వాపోయింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బాధితులను అవమానించారని గుర్తుచేసుకుంది. ఇండస్ట్రీ ఎప్పటికీ అద్దం లాంటిది కాదని, ఇక్కడ పని కావాలంటే శరీరం ఇవ్వాల్సిందేనని దానిని కోరుకునే పురుషులే ఎక్కువ ఉన్నారని ఆమె తెలిపింది.Casting couch is rampant, women are refused roles if they don’t offer ‘full commitment’ - a word that means completely different in the film industry.If you come from an English educated background and believe ‘commitment’ means ‘professionalism’, showing up to work and being…— Chinmayi Sripaada (@Chinmayi) January 26, 2026
'ది రాజాసాబ్' నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్
ఈ సంక్రాంతి రేసులో మొదటి విడుదలైన మూవీ ‘ది రాజాసాబ్’.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కవ బడ్జెట్తో తెరకెక్కించారు. మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ అవసరం లేకున్నా హీరోయిన్స్ను ముగ్గురుని తీసుకోవడం.. ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ లేకపోవడంతో మైనస్ అయింది. అయితే, ఫ్యాన్స్ సూచన మేరకు సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తగ్గించి మరికొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇంతలో మూవీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.‘ది రాజాసాబ్’ చిత్రాన్ని సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే. ఇప్పటి వరకు రూ. 250 కోట్ల మేరకు మాత్రమే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. రాజాసాబ్ మూవీపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా ఆశలు పెట్టుకుంది. ఎన్నో డిజాస్టర్ సినిమాలతో దెబ్బతిన్న ఆ సంస్థ ఈ మూవీతో గట్టెక్కుతుందని భావించారు. కానీ, రాజాసాబ్ తెచ్చిన నష్టాలు నిర్మాతను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. దీంతో ఆ సంస్థను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో సినిమా ప్లాన్ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నదే.. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నిర్మాత విశ్వప్రసాద్కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్లో ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట. 'స్పిరిట్' హక్కులుఇదే సమయంలో స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రీ మూవీస్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. అలా రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్ను కూడా తీసుకోలేదని టాక్ ఉంది. కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషకం గురించి నిర్మాతతో చర్చించలేదట.
'మన శంకరవరప్రసాద్ గారు' రూ. 350 కోట్ల జర్నీ
చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ నమ్మలేదు. విశ్వంభర వంటి సినిమా ఉండగా అనిల్తో ప్రాజెక్ట్ ఏంటి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, సెడెన్గా అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. సినిమా షూటింగ్తో పాటు విడుదల వరకు పనులు అన్నీ వేగంగా పూర్తి అయ్యాయి. దీంతో జనవరి 12న ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్లోకి వచ్చేశాడు. మొదటి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్స్ సాధించాడు.‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సినిమా ప్రకటన నుంచి థియేటర్స్లో సక్సెస్ సెలబ్రేసన్స్ వరకు ఉన్న ప్రధాన అంశాలను ఒక వీడియోలో చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మెమోరీస్ మీరూ చూసేయండి.
రజినీకాంత్ క్రేజీ సినిమాలో సాయిపల్లవి
నటుడు రజనీకాంత్ హీరోగా నటించనున్న నూతన చిత్రంలో నటి సాయిపల్లవి నటించనున్నారా..? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉంది అంటూ కోలీవుడ్ వర్గాల నుంచి సమాధానం వస్తుంది. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ –2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కమలహాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో నటుడు రజనీకాంత్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శిబి చక్రవర్తి తెరకెక్కించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించే ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా ఇందులో నటించే ఇతర తారాగణం గురించిన వివరాలు ఇంకా వెలువడకున్నా, ముఖ్య పాత్రలో నటి సాయిపల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య నటుడు కమలహాసన్ నిర్మించిన అమరన్ చిత్రంలో సాయిపల్లవి కథానాయకిగా నటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె హిందీలో ఏక్ ధిన్, రామాయణ 1,2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించనున్న 173వ చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా నటుడెవరైనా, దర్శకుడెవరైనా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరిస్తారన్నది తెలిసిందే. దీంతో ఈమె రజనీకాంత్ చిత్రంలో నటించడానికి సై అంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రంలో నటి శృతీహాసన్ ముఖ్య పాత్రలో నటించడం గమనార్హం. రజనీ సినిమాలో సాయిపల్లవి పాత్ర బలంగా ఉంటే తప్పకుండా చేస్తుందని ఆమె అభిమానులు చెబుతున్నారు. గతంలో తనకు చిరంజీవి సినిమా ఛాన్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా
చిరంజీవి చెప్పింది తప్పు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్
థ్రిల్లింగ్ ట్విస్ట్ కు వెంకీ రెడీ!
ధనుష్, మృణాల్ పెళ్లి..! ఇదిగో క్లారిటీ
అనిల్ రావిపూడికి చిరు కార్ గిఫ్ట్.. ధర ఎంతో తెలుసా..!
ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!
సూర్య వర్సెస్ ధనుష్.. కోలీవుడ్ లో బిగ్ క్లాష్..
అనిల్ రావిపూడి 10వ సినిమా టైటిల్ చూస్తే Wow అనాల్సిందే..
మొగుడు టీజర్ అదుర్స్.. రజిని రిజెక్ట్ చేసిన మూవీతో వస్తున్న విశాల్
సంక్రాంతికి వస్తున్నాం..సీక్వెల్ లేనట్టేనా..!
ఊ అంటావా ని మించి..! పెద్దిలో మృణాల్ ఎంట్రీ
