Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood actresses Social Media Latets Updates In Instagram1
మేఘా ఆకాశ్ బర్త్‌ డే పార్టీ.. వేకేషన్‌లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే..!

బర్త్‌ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన మేఘా ఆకాశ్..వైట్ డ్రెస్‌లో దియా మీర్జా బ్యూటీఫుల్ లుక్స్..బహమాస్‌లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ లయ..వేకేషన్‌లో చిల్ అవుతోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే..శ్రీలంకలో చిల్ అవుతోన్న సాహితి దాసరి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7)

Draupathi 2 Movie Song Director Mohan Responds On Chinmayi tweet2
ద్రౌపది-2 సాంగ్.. చిన్మయికి డైరెక్టర్‌ స్ట్రాంగ్ కౌంటర్..!

రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి నెలరాజె ‍అంటూ సాగే పాటను విడుదల చేశారు.అయితే ఈ పాటను తమిళంలో ఏం కోనే అంటూ సాగే ఈ పాటను చిన్మయి ఆలపించారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఈ పాటను పాడినందుకు క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేప‌థ్యం గురించి తనకు తెలియకపోవ‌టం వ‌ల్ల పాడానని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుంచే నేను ఇందులో భాగం అయ్యేదాన్ని కాద‌ని వెల్లడించారు. దీనికి కారణం డైరెక్టర్ మోహన్ అంటూ పోస్ట్ చేసింది.డైరెక్టర్ రియాక్షన్..చిన్మ‌యి క్ష‌మాప‌ణ చెబుతూ ట్వీట్ చేయడంపై చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్‌ జి స్పందించారు. ఈ పాట‌ను పాడ‌టానికి తాను ప‌ర్స‌న‌ల్‌గా చిన్మ‌యి అయితేనే బాగుంటుందని పాడించాన‌ని పేర్నొన్నారు. రికార్డింగ్ స‌మ‌యంలో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్‌ అందుబాటులో లేక‌పోవ‌టంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విష‌యాల‌ను మాత్ర‌మే వివ‌రించాన‌ని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. త‌న‌తో కానీ, సంగీత ద‌ర్శ‌కుడితో కానీ మాట్లాడ‌కుండా, ఎలాంటి వివ‌ర‌ణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించిద‌న్నారు. దీనిపై చిన్న‌యి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని లేదంటే ట్వీట్‌ను తొల‌గించాల‌ని కోరారు.ఈ సంద‌ర్భంగా ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేయాల‌నుకుంటే చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను కాకుండా త‌న‌ను విమ‌ర్శించాల‌ని డైరెక్టర్ అన్నారు. ఈ సినిమా మేకింగ్‌లో భాగ‌మైన ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌టం పిరికిత‌నమ‌ని ద‌ర్శ‌కుడు మోహ‌న్ పేర్కొన్నారు. చిన్మ‌యి త‌న మెసేజ్‌లో పేర్కొన్న వ్య‌తిరేక భావ‌జాలం గురించి ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ చిన్మ‌యి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియ‌జేస్తోందన్నారు. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో తనకు స్పష్టంగా అర్థం కాలేదని ఆయ‌న వెల్లడించారు. At the outset, my heartfelt apologies for Emkoney.Ghibran is a composer I have known for 18 years since my jingle singing days. When his office called for this song, I just went & sang as I usually do. If I remember right, Ghibran wasn't present during this session - I was…— Chinmayi Sripaada (@Chinmayi) December 1, 2025 Don't target any Technicians, Actors, actresses and who ever work with me in #Draupathi2.. Whatever my movie speaks it's my own creation and idealogy. Your target is me.. Don't target those associated Directly or indirectly with me and my projects.. It's a kind of cowardness..— Mohan G Kshatriyan (@mohandreamer) December 1, 2025

The Family Man web Series Creates Crazy record On Ott 3
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3.. ఓటీటీలో క్రేజీ రికార్డ్..!

బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయ్ కీలక పాత్రలో వచ్చిన సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్‌ సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో తాజాగా మూడో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ సిరీస్‌ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అత్యధికమంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. ఈ క్రమంలో గత రెండు సీజన్ల వ్యూస్‌ను అధిగమించింది. అంతే కాకుండా భారత్‌ సహా 35 దేశాల్లో టాప్‌-5లో ట్రెండింగ్‌లో ఉంది. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్‌, మలేషియా దేశాల్లోనూ ఆదరణ దక్కించుకుంది.రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందించిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నవంబర్ 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో జైదీప్‌ అహ్లావత్‌, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.

Rishab Shetty Collabarate With Tollywood Producer For Next Movie4
కాంతార చాప్టర్-1 సూపర్ హిట్.. రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

ఈ ఏడాది కాంతార చాప్టర్-1తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని గతంలో రిలీజై సూపర్ హిట్‌గా కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌లో నిర్మించారు.అయితే ఈ మూవీ తర్వాత రిషబ్ శెట్టి నెక్ట్స్‌ ప్లాన్ ఏంటనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. కాంతార-3 ప్లాన్‌లో ఉన్నారా? లేదంటే మరో కొత్త మూవీ తెరకెక్కిస్తున్నారా? అనే సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటివరకు కొత్త మూవీకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కానీ రిషబ్ శెట్టి తన నెక్స్ట్‌ సినిమా టాలీవుడ్‌లో చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో రిషబ్ శెట్టి జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఓ యోధుడి క‌థ‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో మరుగున పడిపోయిన ఓ వీరుడి గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. బంకించంద్ర‌ ఛట‌ర్జీ ర‌చించిన 'ఆనంద్ మ‌ఠ్‌' అనే పుస్త‌కం స్ఫూర్తిగా తీసుకొని ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు అశ్విన్ అశ్విన్ గంగ‌రాజు తెరకెక్కించనున్నట్లు స‌మాచారం. వచ్చే ఏడాది 2026 వేస‌విలో షూటింగ్ ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Nagabandham Movie Latest Update5
యంగ్‌ హీరో సినిమా.. క్లైమాక్స్‌ కోసమే రూ. 20 కోట్లతో భారీ సెట్‌!

యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా మైథలాజికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యాసీవ్ సినిమాటిక్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీం నానక్‌రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్‌ పుట్టించే క్లైమాక్స్‌ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు.అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్‌గా మైండ్ బ్లోయింగ్‌ ఉండబోతుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Venkatesh Completes His Shoot with Megastar and anil ravipudi Movie6
'మనశంకర వరప్రసాద్‌గారు.. నా రోల్ ముగిసింది..' వెంకటేశ్ ట్వీట్

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ టాలీవుడ్‌ ఆడియన్స్‌ను అలరించింది. అయితే సంక్రాంతి వస్తున్నాం హిట్ తర్వాత వెంకీ మామ ఇటీవలే మరో మూవీని ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్నారు.మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌లోనూ వెంకీ మామ సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో వెంకీమామ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు హీరో వెంకటేశ్. మనశంకర వరప్రసాద్ చిత్రంలో నా పాత్ర షూటింగ్ ముగిసిందని ట్వీట్ చేశారు.వెంకటేశ్ తన ట్వీట్‌లో రాస్తూ..'మనశంకరవరప్రసాద్ మూవీ కోసం ఈరోజు నా పాత్రను ముగించా. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. నాకు ఇష్టమైన మెగాస్టార్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ఎన్నో రోజులుగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలనే కోరిక ఉండేది. చివరికీ ఈ ప్రత్యేక చిత్రం కోసం అనిల్ రావిపూడి మమ్మల్ని ఒకచోట చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.Wrapped up my part today for #ManaShankaraVaraPrasadGaru, and what an incredible experience it has been! Working with my favourite @KChiruTweets was an absolute joy and this film has left me with so many lovely memories. It was long overdue to share the screen with ‘Megastar… pic.twitter.com/KAzWcXGBeK— Venkatesh Daggubati (@VenkyMama) December 3, 2025

Dil Raju Denies Rumors Of Bollywood Films7
అరడజను సినిమాలు.. క్లారిటీ ఇచ్చిన దిల్‌ రాజు

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టాడని, అక్కడ వరుసగా ఆరు సినిమాలు నిర్మించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై దిల్‌ రాజు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు ముడిపెడుతూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని దిల్‌ రాజు(Dil Raju) కోరారు.‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకూ ఈ రూమర్స్‌ను నమ్మొద్దు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నాను’ అని దిల్‌ రాజు విజ్ఞప్తి చేశారు. కాగా, అక్షయ్‌ కుమార్‌తో దిల్‌ రాజు నిర్మించే సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్‌ అని ప్రచారం జరుగుతుంది.

IMDB Releases Top craze stars in the year 2025 in indian cinema8
ఈ ఏడాది క్రేజీ స్టార్స్‌.. టాప్‌ టెన్‌లో రష్మిక, రుక్మిణి.. ఫుల్ లిస్ట్ ఇదే!

త్వరలోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. చూస్తుండగానే రోజులు అలా గడిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే అందరూ కొత్త ఏడాది స్వాగతం పలకడానికి సమయం ఆసన్నమైంది. మరి సినీ ఇండస్ట్రీలో 2025లో కలిసొచ్చిందా? ఎంతమందికి స్టార్స్‌ హోదాను దక్కించుకున్నారు. ఇండియా సినీ చరిత్రలో ఈ ఏడాది అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న నటీమణులు, హీరోలు ఎవరు? 2025లో ఎంట్రీ స్టార్‌డమ్‌ను దక్కించుకున్న యంగ్ హీరోయిన్స్, హీరోలు ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2025లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న స్టార్స్ లిస్ట్‌ను ప్రముఖ సినీ రేటింగ్‌ సంస్థ ఐఎండీబీ రిలీజ్ చేసింది. ఈ ఏడాది టాప్-10లో నిలిచిన హీరోయిన్స్, హీరోల జాబితాను వెల్లడించింది. ఈ సారి ‍అత్యధికంగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాది తారలు సైతం సత్తా చాటారు. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్‌-2025 లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రుక్మిణి వసంత్‌, కల్యాణి ప్రియదర్శన్‌ నిలిచారు. కాగా.. 2025లో ఆమె ఛావా, సికందర్‌, థామా, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్‌ లాంటి చిత్రాలతో మెప్పించింది. రుక్మిణి వసంత్.. కాంతార చాప్టర్‌-1తో ఆడియన్స్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కల్యాణి ప్రియదర్శన్‌ కొత్తలోక: చాప్టర్‌- 1 మూవీతో సూపర్ హిట్‌ కొట్టేసింది.బాలీవుడ్ మూవీ సయారాతో సూపర్ హిట్ కొట్టిన అహాన్ పాండే, అనీత్ పడ్డా తొలి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. కేవలం ఒక్క సినిమాతోనే వీరిద్దరు టాప్‌లో నిలవడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మోహిత్‌ సూరి డైరెక్టర్ల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్ దక్కించుకున్నారు. కేవలం రూ.45 కోట్లతో నిర్మించిన సయారా బాక్సాఫీస్‌ వద్ద రూ.570 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఐఎండీబీ- 2025 లిస్ట్..టాప్-10 సినీ స్టార్స్ వీళ్లే...అహాన్ పాండే (సయారా)అనీత్ పడ్డా (సయారా)ఆమిర్ ఖాన్ (సితారే జమీన్‌ పర్‌)ఇషాన్ ఖట్టర్ (హోమ్ బౌండ్‌)లక్ష్య (ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌)రష్మిక మందన్నా (ఛావా, సికిందర్‌, థామా, కుబేర)కల్యాణి ప్రియదర్శన్ ( కొత్త లోకా చాప్టర్‌1)త్రిప్తి డిమ్రి (ధడక్‌2)రుక్మిణి వసంత్ (కాంతార: చాప్టర్‌1)రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్‌1) టాప్-10 ఇండియన్ డైరెక్టర్స్ వీళ్లే..మోహిత్ సూరి (సయారా)ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌)లోకేశ్ కనగరాజ్ (కూలీ)అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్‌)పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్‌2: ఎంపురాన్‌)ఆర్.ఎస్. ప్రసన్న (సితారే జమీన్‌ పర్‌)అనురాగ్ బసు (మోట్రో ఇన్‌ దినో)డోమినిక్ అరుణ్ (కొత్త లోకా చాప్టర్‌1)లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా)నీరజ్ ఘేవాన్ (హోమ్ బౌండ్‌)

Interesting Facts About Sholay Iconic Bike9
ఆ ఇద్దరు హీరోల స్నేహ చిహ్నం ఈ పురాతన బైక్‌.. స్పెషల్‌ ఏంటంటే..?

షోలే సినిమాను సినీ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఆ సినిమాలోని యే దోస్తీ హమ్‌ నహీ తోడేంగే పాటను కూడా మరిచిపోలేరు. ఆ పాటలో స్నేహితులైన జై–వీరు (అమితాబ్‌–ధర్మేంద్ర) మోటార్‌ సైకిల్‌ బాలీవుడ్‌లో ఉపయోగించిన అత్యంత ప్రసిద్ధ స్క్రీన్‌ వస్తువులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పురాతన మోటార్‌ సైకిల్‌ 1942 బిఎస్‌ఎ డబ్ల్యుడబ్ల్యుయ20 సినిమాలోని ప్రసిద్ధ పాట యే దోస్తీ హమ్‌ నహీ తోడెంగేలో తెరపై కనిపిస్తుంది. «లెజండరీ నటుడు దర్మేంద్ర మృతి తర్వాత ఈ మోటార్‌ సైకిల్‌ తిరిగి వెలుగులోకి వచ్చింది.ఒకప్పుడు కర్ణాటకలోని రామనగర కొండల లో ప్రయాణించిన ఈ పాతకాలపు యంత్రం ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఎఫ్‌ఎఫ్‌ఐ 2025)లో ప్రదర్శనకు నోచుకుని ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. షోలే(Sholay) 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, సినీ అభిమానులను తక్షణమే సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే‘ వస్తువులను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని మరోసారి అందరి ముందుకు తెచ్చినట్టుంది కర్ణాటక ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ’డిఐపిఆర్‌) కమిషనర్‌ ఎడిజిపి హేమంత్‌ నింబాల్కర్‌ అంటున్నారు.ఈ చిత్రంలో వినియోగించిన బైక్‌ను బెంగళూరు మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి బెంగళూరు బిజినెస్‌ కారిడార్‌ చైర్‌పర్సన్‌ ఎల్‌కె అతిక్‌ దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్వంతం చేసుకున్నారని హేమంత్‌ నింబాల్కర్‌ వివరించారు. ఈ బిఎస్‌ఎ మోటార్‌సైకిల్‌ కర్ణాటకలో కుటుంబానికి చెందిన తాత నుంచి మనవడికి అన్నట్టు వారసత్వంగా చేతులు మారుతోంది.ఈ ప్రఖ్యాత జై–వీరు మోటార్‌సైకిల్‌ను బ్రిటిష్‌ సంస్థ బర్మింగ్‌హామ్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ తయారు చేసింది. ఈ బైక్స్‌ను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్‌ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశారు. సైనిక సేవలో ఇది గంటకు 55–60 కి.మీ. వేగంతో సమర్ధవంతంగా పనిచేసింది. 1942లో, బ్రిటిష్‌ సైన్యం ఈ మోడల్‌ను దాదాపు 50 నుంచి 60 పౌండ్లకు కొనుగోలు చేసింది, ఇది ఆ సమయంలో మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండేది.ఇక ఈ చిత్రంలో ఉపయోగించిన బైక్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఎంవైబి 3047 కాగా ఇది ఛాసిస్‌ నంబర్‌ ఎం 20 116283 , ఇంజిన్‌ నంబర్‌ ఎం 20 4299లను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది 12.5 హార్స్‌పవర్‌ను అందించే 500 సిసి సింగిల్‌–సిలిండర్‌ సైడ్‌–వాల్వ్‌ ఇంజిన్ తో శక్తి నిచ్చింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, ఈ బైక్‌ బరువు 170 కిలోగ్రాములు 13–లీటర్‌ ఇంధన ట్యాంక్‌తో వచ్చింది. దీనిలో ముందు భాగంలో గిర్డర్‌ ఫోర్కులు వెనుక పెద్ద క్యారియర్‌ ఉన్నాయి. రెండు చక్రాలకు డ్రమ్‌ బ్రేక్‌లు ఉన్నాయి యుద్ధకాలంలో రబ్బరు కొరత కారణంగా, హ్యాండిల్‌బార్లు ఫుట్‌రెస్ట్‌లను కాన్వాస్‌లో చుట్టబడిన లోహంతో తయారు చేశారు.

Raj Nidimoru Gifts Luxary Villa To Wife Samantha 10
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?

హీరోయిన్ సమంత రీసెంట్‌గానే మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?దర్శకుడు రాజ్‌తో సమంతకు గత నాలుగైదేళ్లుగా పరిచయం. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ చేసే టైంలో ఏర్పడిన పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. ఇన్నాళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వగా.. రాజ్ కూడా తన తొలి భార్య శ్యామోలికి 2022లో విడాకులు ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) ప్రస్తుతం రాజ్.. దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తోంది. ఈ సంస్థలోనే సమంతతో పాటు రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే అక్టోబరులో సమంత.. కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. వాటిలో కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ లగ్జరీ హౌస్‌ని రాజ్.. సమంతకు పెళ్లి గిఫ్ట్‌గా ముందే ఇచ్చాడని అంటున్నారు. పెళ్లిరోజు సామ్ వేలికి ఉన్న రింగ్ కూడా రాజ్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.ప్రస్తుతం సమంత-రాజ్.. గోవాకు హనీమూన్‌కి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీ కానున్నారని తెలుస్తోంది. రాజ్ కూడా 'ద ఫ్యామిలీ మ్యాన్' నాలుగో సీజన్ తీయాల్సి ఉంది.(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్‌.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement
Advertisement