Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Mohanlal Vrusshabha Movie Emotional Song Out Movie1
తండ్రీ కొడుకుల ఎమోషనల్‌ సాంగ్‌

మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌, తెలుగు యంగ్‌ హీరో రోషన్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న చిత్రం 'వృషభ'.. తాజాగా ఈ మూవీ నుంచి ఎమోషనల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఇందులో రాగిణి ద్వివేది, నేహా సక్సెనా తదితరులు నటించారు. దర్శకుడు నంద కిశోర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్‌. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా నిర్మించారు. మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించిని ఈ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న తమిళ్‌, కన్నడ, హిందీలో విడుదల కానుంది. కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్‌, ఏవీఎస్‌ స్టూడియోస్‌ పతాకంపై రానున్న ఈ మూవీని మూన్‌లైట్‌, థ్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ వంటి హాలీవుడ్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నిక్‌ తుర్లో ఈ చిత్రం కోసం ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం విశేషం. ఆయన చిత్రాలకు గతంలో ఆస్కార్‌ కూడా దక్కింది.

 Roshan Kanakala movie Mowgli Fight making video2
'మోగ్లీ' కోసం రోషన్‌ కష్టం.. మేకింగ్‌ వీడియో రిలీజ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రోషన్‌ కనకాల, సాక్షి మడోల్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’... డిసెంబర్‌ 13న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు, నటుడు బండి సరోజ్‌కుమార్‌ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నటం విశేషం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై కలర్‌ ఫోటో దర్శకుడు సందీప్‌ రాజ్‌ తెరకెక్కించారు. కొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్స్‌లోకి రానున్న సందర్భంలో తాజాగా మోగ్లీ ఫైట్‌ సీన్‌ మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేశారు. బండి సరోజ్‌కుమార్‌, బండి సరోజ్‌, హర్ష చెముడు వంటి వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కాలభైరవ సంగీతం అందించారు.

Nidhi Agerwal And Priyanka Chopra Latest News3
గ్లామరస్ నిధి అగర్వాల్.. స్టన్నింగ్ ప్రియాంక చోప్రా

రెడ్ డ్రస్‌లో బోలెడంత గ్లామర్‌గా నిధి అగర్వాల్ప్రియాంక చోప్రా సన్నింగ్ లుక్.. చూస్తే అంతే'త్రీ రోజెస్' ప్రీ రిలీజ్ వేడుకలో రాశీ హొయలునల్ల చీరలో నాజుగ్గా మెరిసిపోతున్న ఈషా రెబ్బామాయ చేస్తున్న పొడుగు కాళ్ల సుందరి రకుల్చీరలో వయ్యారంగా అనుపమ పరమేశ్వరన్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana)

Akhanda 2 movie producer ram achanta comments on reviews4
అఖండ-2పై నెగెటివిటీ నిజమే: రామ్‌ ఆచంట

వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్‌లోకి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిని ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్‌ విన్సెంట్‌, అచ్యుత్‌కుమార్‌ తదితరులు నటించారు. ఎం తేజస్విని సమర్పణలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, తాజాగా ఈ మూవీ రివ్యూలు, ఫలితంపై వారు రియాక్ట్‌ అయ్యారు.అఖండ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తుందని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట పేర్కొన్నారు. బుక్‌మైషోలో కూడా గంటకు 25వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయన్నారు. హిందీ బెల్ట్‌లో సుమారు 800 థియేటర్స్‌లలో విడుదల చేశామన్నారు. అక్కడ కూడా మంచి టాక్‌ వచ్చిందన్నారు. అయితే, టాలీవుడ్‌లో వచ్చే రివ్యూలను తాము తప్పు పట్టడం లేదన్నారు. ఒక సినిమా రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్‌ వారికి ఉండటంలో తప్పులేదన్నారు. కానీ, గ్రౌండ్‌ రియాలిటీ వేరుగా ఉందన్నారు. రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాకు మంచి టాక్‌ వచ్చిందన్నారు. ఒక సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం అంటూ ప్రేక్షకుల ద్వారా మంచి టాక్‌ దక్కిందని తెలిపారు. ‘అఖండ 2’ మూవీకి ప్రేక్షకాదరణ దక్కినప్పటికీ.. ఇండస్ట్రీలో కాస్త నెగెటివిటీతో పాటు మిక్స్‌డ్‌ రిపోర్ట్ ఉందని రామ్‌ ఆచంట తెలిపారు.

Actress Keerthy Suresh Wedding Video5
తొలి వార్షికోత్సవం.. హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి వీడియో

సెలబ్రిటీలు పెళ్లి అంటే కొన్నిరోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. సంగీత్, హల్దీ, పెళ్లి అంటూ సెలబ్రేషన్ ఉండనే ఉంటాయి. ఆ టైంలో సోషల్ మీడియాలోనూ ఫొటోలు బాగానే వైరల్ అవుతుంటాయి. కానీ రీసెంట్ టైంలో చూస్తే ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?)ఈ నెల ప్రారంభంలో నాగచైతన్య-శోభిత తమ తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి వీడియోని సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసింది. వివాహం జరిగినప్పుడు కేవలం ఫొటోలని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వీడియోని పోస్ట్ చేసి అభిమానులకు క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేశ్ వంతు వచ్చింది. ఈమె కూడా పెళ్లి టైంలో కేవలం ఫొటోలని మాత్రమే పంచుకుంది. తమ బంధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వివాహ వీడియోని షేర్ చేసింది. ఇందులో హల్దీ, సంగీత్, హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన పెళ్లికి సంబంధించిన విజువల్స్ అన్నీ చూడొచ్చు. కీర్తి, ఆమె భర్త ఆంటోనీతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఆనందంగా కనిపించారు.(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Why Telugu Actors Choose Delhi High Court For Personal Rights6
తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?

రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కనిపిస్తుంది. ఎంతలా అంటే తెలుగు హీరోలు ఎవరినీ వదట్లేదు. అసభ్యకర కామెంట్స్ కావొచ్చు, దారుణమైన ట్రోల్స్ చేయడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తదితరులు తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆంధ్ర, తెలంగాణలోనూ హైకోర్టులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? కారణమేంటి?అయితే వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని సెలబ్రిటీలు ప్రధానంగా ఎంపిక చేసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. ఈ విషయంలో ఇక్కడైతే వీలైనంత త్వరగా ఆదేశాలు వస్తాయి. ఇలాంటి చాలా పిటిషన్లని గతంలో ఇక్కడ విచారించడం కూడా కారణమని చెప్పొచ్చు. అలానే అక్కడ తీర్పు వస్తే దేశవ్యాప్తంగా అందరికీ తెలియడానికి అవకాశముంది.(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్ కల్యాణ్)సోషల్ మీడియాలో ప్రధానంగా ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్స్, కంపెనీలు హెడ్ ఆఫీస్‌లు దాదాపుగా ఢిల్లీలోనే ఉ‍న్నాయి. ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత సమాచారం వాళ్లకు తెలియడం కూడా సులభం అవుతుంది. అలానే వ్యక్తిగత హక్కుల్ని డీల్ చేసే చాలా ఏజెన్సీలు అక్కడే ఉండటం కూడా దీనికి ఓ కారణం. ఇందువల్లే సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టుని ఎంచుకుంటున్నారు.గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్.. హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా పేరున్న నటీనటులు కూడా ఇలానే వ్యక్తిగత హక్కుల రక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి యువత.. ఇకపై సోషల్ మీడియాలో ఏ నటుడు లేదా నటి గురించి ఏదైనా కామెంట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి. లేదంటే కోర్ట్ ఆర్డర్స్ వల్ల కటకటాలపాలయ్యే అవకాశముంది. కాబట్టి బీ కేర్ ఫుల్!(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)

Jinn Movie Release Date Out7
హారర్ థ్రిల్లర్ ‘జిన్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ఈ రోజుల్లో వైవిధ్యభరితమైన కథలు ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. కథలో స్టఫ్ ఉండాలే గానీ, కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాను తీసుకొని ఓ డిఫరెంట్ జానర్ లో "జిన్" అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ చిన్మయ్ రామ్. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తుండగా.. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడమే గాక అంచనాలు నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మంచి హైప్ నడుమ ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు జిన్ అనే టైటిల్ ప్లస్ పాయింట్. కథనే కాదు టైటిల్ లో కూడా వైవిద్యం ఉండటంతో ఈ సినిమా సులువుగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా కథకు యాప్ట్ అయ్యే పలు లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఖర్చుకు నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదట. స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందని, ఈ మూవీ థియేటర్స్ సూపర్ సక్సెస్ కావడం పక్కా అని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం కానీ ఇది అన్నింటిలో డిఫరెంట్ అవుతుందని అంటున్నారు.

Big director asked Dhurandhar's Ayesha Khan to fix her teeth8
నన్ను సర్జరీ చేయించుకోమన్నారు: ధురంధర్‌ నటి

స్టార్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌, మాధవన్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ధురంధర్‌. ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయేషా ఖాన్‌ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. శరారత్‌ అనే పాటలో స్టెప్పులేసింది. ఈ సినిమాలో భాగమవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతోంది.సర్జరీ చేయించుకోమని సలహాఅయితే కెరీర్‌ తొలినాళ్లలో తన లుక్‌పై చాలా నెగెటివ్‌ కామెంట్లు వచ్చాయంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ.. ఓ వ్యక్తి నా ముక్కును సరిచేయించుకోమన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. దాన్ని సర్జరీ చేయించుకోమని చెప్పడానికి అతడెవరు? ఇలాంటి వాళ్లు లైఫ్‌లో ముందుకెళ్లరు.. కానీ పక్కవాళ్ల మీద పడి ఏడుస్తారు!ఫేమస్‌ డైరెక్టర్‌ మూవీఒకసారి ఓ హారర్‌ సినిమా ఆడిషన్‌కు వెళ్లాను. ఆయన ఫేమస్‌ డైరెక్టర్‌. ఆడిషన్‌ పూర్తయింది. అది వాళ్లకు నచ్చింది. కచ్చితంగా నన్నే సెలక్ట్‌ చేస్తారని అక్కడున్నవాళ్లు చెప్పారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే.. ఇది హారర్‌ సినిమా కాబట్టి సరిపోయింది. తెలుగులో సినిమాలుకానీ ఇలాంటి అవకాశాలు రావాలంటే నీ పళ్లవరస మార్చుకోవాలి అన్నారు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది అని ఆయేషా ఖాన్‌ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్‌ బుష్‌ సినిమాలు చేసింది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీలో ఐటం సాంగ్‌ చేసింది. జాట్‌లో కానిస్టేబుల్‌ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కిస్‌ కిస్కో ప్యార్‌ కరూ 2 మూవీ చేస్తోంది. హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేసింది. View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official)

Kajal Aggarwal Starred Arya Series Remake9
థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్

కొన్నేళ్ల క్రితం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వరస సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు కొత్తగా సినిమాలేం చేయట్లేదు. ఈ ఏడాది 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ ఈమెకు ఇదేం కలిసి రాలేదు. చేతిలో పలు చిత్రాలు ఉన్నప్పటికీ అందులో ఈమె లీడ్ రోల్స్ చేయట్లేదు. అలాంటిది ఇప్పుడు కాజల్.. ఓటీటీలోకి రీఎంట్రీకి ఇచ్చేందుకు సిద్ధమైపోయింది.గతంలో 'లైవ్ టెలికాస్ట్' ఓ సిరీస్ చేసినప్పటికీ కాజల్‌కి ఇది పెద్దగా కలిసి రాలేదు. దీంతో సినిమా అవకాశాలు వస్తుండటంతో ఓటీటీలకు పెద్దగా ఆసక్తి చూపించినట్లు లేదు. ఇప్పుడు చేతిలో మూవీస్ లేకపోవడంతో వెబ్ సిరీస్ రీమేక్‌కి సై అన్నట్లు ఉంది. 'ఆర్య' పేరుతో హిందీలో ఓ వెబ్ సిరీస్ ఉంది. సుస్మితా సేన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పటివరకు మూడు సీజన్లు వచ్చాయి. థ్రిల్లింగ్ అంశాలతో ఇది మెప్పించింది.(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)ఇప్పుడు ఈ సిరీస్ తెలుగు రీమేక్‌లోనే లీడ్ రోల్ కోసం కాజల్‌ని తీసుకున్నారట. తమిళంలో కూడా ఈమె తెలుసు. కాబట్టి దక్షిణాది వరకు ఈమెతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారట. ఇది ఖరారైనప్పటికీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశముంది.రీసెంట్‌గానే హాట్‌స్టార్ 'సౌత్ బౌండ్' పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహించింది. ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇచ్చింది. ఇందులో భాగంగానే కాజల్‌కి కూడా సిరీస్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్‌లో ప్రధాన పాత్రకు ముగ్గురు పిల్లలు ఉంటారు. మరి ఇందులోనూ అలానే చూపిస్తారా లేదంటే ఏమైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మమ్ముట్టి డిటెక్టివ్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదే..)

Bigg Boss 9 Telugu: Emmanuel Injured in Second Ticket To Finale Final Game10
గేమ్‌లో సడన్‌గా కిందపడ్డ ఇమ్మూ.. మెడికల్‌ రూమ్‌కు!

టాస్కులు గెలవాలంటే కండబలం ఉండాలంటారు. కానీ, అదేం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని నిరూపించాడు ఇమ్మాన్యుయేల్‌. తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడాడు. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్‌ అతడే గెలిచాడు. అందుకే ఇప్పుడు సెకండ్‌ టికెట్‌ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు.నేనూ మనిషినే..కానీ శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో సంజనాతో గొడవపడ్డాడు. గేమ్‌లో మీరు ఫస్ట్‌ వచ్చి నాది లాగారు... ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు అని ఆవేదన చెందాడు. అటు గేమ్‌లో ఓడిపోయినందుకో ఏమో కానీ సంజనా బాధ తట్టుకోలేక ఏడ్చేసింది. నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్‌ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్‌ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు.నొప్పితో విలవిలతర్వాత లీడర్‌ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది. అలా ఫైనల్‌గా ఇమ్మూ, తనూజ బాల్స్‌ గేమ్‌ ఆడారు. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గేమ్‌ కాసేపు ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లోనే తనూజ గెలిచి సెకండ్‌ ఫైనలిస్ట్‌ అయింది. కాకపోతే తను ప్రేక్షకు ఓట్లతోనే కొనసాగాలనుకుంటున్నానంటూ ఇమ్యూనిటీని తిరస్కరించింది.

Advertisement
Advertisement