Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

96 Fame Adithya Bhaskar, Gouri Kishan Reunite for Another film1
96 మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా!

96 చిత్రం ద్వారా ఆదిత్య భాస్కర్‌, గౌరీకిషన్‌ వెండితెరకు పరిచయమయ్యారు. 96 చిత్రంలో హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో నటించారు. ఆ మూవీ విజయంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆదిత్య భాస్కర్‌ ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకున్న ఎంఎస్‌.భాస్కర్‌ వారసుడు అన్నది గమనార్హం. తాజాగా ఆదిత్య భాస్కర్‌, గౌరికిషన్‌ హీరో హీరోయిన్లుగా జత కట్టారు. ఈ చిత్రాన్ని ఆర్జిన్‌ స్టూడియోస్‌ పతాకంపై కన్నదాసన్‌ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తిఈ మూవీ ద్వారా రాజ్‌కుమార్‌ రంగసామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సరస్వతి మీనన్‌, దర్శకుడు కె.భాగ్యరాజ్‌, రెడిన్‌ కింగ్‌స్లీ, డీఎస్‌ఆర్‌ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. 96 మ్యాజిక్‌ రిపీట్‌!జనరంజకమైన అంశాలతో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఈ మూవీ కథ ఉంటుందన్నారు. 96 చిత్రం ఫేమ్‌ ఆదిత్య భాస్కర్‌, గౌరీకిషన్‌ల మ్యాజిక్‌ ఈ చిత్రంతో మరోసారి వర్కౌట్‌ అవుతుందని అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర టైటిల్‌ను ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎస్‌.రామచంద్రన్‌ చాయాగ్రహణం, ఎంఎస్‌.జోన్స్‌ రాబర్ట్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Bigg Boss 9 Telugu: Thanuja Puttaswamy Rejected Second Finale2
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్‌ అవడం ఖాయం!

ప్రతి సీజన్‌లో ఒకే ఒక్క టికెట్‌ టు ఫినాలే ఉంటుంది. కానీ తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో మాత్రం రెండో టికెట్‌ టు ఫినాలే ప్రవేశపెట్టడం.. దానికోసమే ఈ వారమంతా టాస్కులు ఆడించడం జరిగింది. తీరా ఫైనలిస్ట్‌ అయ్యే అవకాశం చేతిదాకా వస్తే తనకు అక్కర్లేదని తిరస్కరించింది తనూజ. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్‌ 12వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..బుర్ర ఉపయోగించిన భరణిలీడర్‌ బోర్డులో చివర్లో ఉన్న భరణి.. తన సగం పాయింట్స్‌ ఒకరికి ఇచ్చేయాలన్నాడు బిగ్‌బాస్‌. సంజనాకు పాయింట్స్‌ ఇచ్చేస్తే తనకు ఫినాలేకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని భావించి బుర్ర ఉపయోగించిన భరణి.. తనూజకు ఇచ్చాడు. కానీ, ఆ పాయింట్స్‌ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇమ్మూ గెలుపుతర్వాత మిగిలిన ముగ్గురు సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్‌.. కీ టూ సక్సెస్‌ అనే గేమ్‌ ఆడారు. ఇందులో ముగ్గురూ కష్టపడ్డారు. సంజనా మాటలు జారడంతో ఇమ్మూ ఎమోషనలయ్యాడు. ఈ గేమ్‌లో ఇమ్మూ గెలవగా, సంజనా రెండో స్థానంలో, తనూజ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత గేమ్‌లో అందరూ కలిసి సంజనాను ఆడకుండా సైడ్‌ చేశారు. చివరి గేమ్‌లో తనూజ విజయంఅలా ఇమ్మూ, తనూజకు బాల్‌ గేమ్‌ ఇచ్చారు. ఈ గేమ్‌లో ఇమ్మూ కాలు బెణకడంతో మెడికల్‌ రూమ్‌కు వెళ్లొచ్చాడు. నొప్పితో ఆడి మరీ ఇమ్మూ ఈ గేమ్‌ గెలిచాడు. అనంతరం తనూజ, సంజనా, ఇమ్మూకి చిట్టచివరి టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో గెలిచినవారికి ఏకంగా 300 పాయింట్లు వస్తాయని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు బిగ్‌బాస్‌. ఈ గేమ్‌లో తనూజకు దెబ్బ తగిలిగినప్పటికీ పట్టించుకోకుండా ఆడి గెలిచింది. తనూజతో డీల్‌చివరి గేమ్‌లో ఎక్కువ పాయింట్స్‌ రావడంతో తనూజ ఏకంగా విజేతగా నిలిచింది. అన్ని గేమ్స్‌ గెలుచుకుంటూ వచ్చి చివర్లో ఓడిపోయానని ఇమ్మూ కంటతడి పెట్టుకున్నాడు. ఫైనల్‌గా లీడర్‌బోర్డులో 750 పాయింట్స్‌తో తనూజ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా.. ఇమ్మూ 520, సంజనా 320 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అనంతరం తనూజను బిగ్‌బాస్‌ కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచాడు.టికెట్‌ టు ఫినాలే అక్కర్లేదన్న తనూజమీ దగ్గరున్న రూ.3 లక్షలతో ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్‌ ఫైనలిస్ట్‌ అవొచ్చన్నాడు. ఆ డబ్బంతా విన్నర్‌ ప్రైజ్‌మనీ నుంచి కట్‌ చేస్తానన్నాడు. ఈ ఆఫర్‌ను తనూజ రిజెక్ట్‌ చేసింది. ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. అలా ఈ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది తనూజ విన్నింగ్‌ ఛాన్స్‌ను మరింత రెట్టింపు చేసే ఎపిసోడ్‌ అనే చెప్పవచ్చు.

TV Actress Rajeshwari Commits Self Eviction3
భర్తతో గొడవ.. నిద్రమాత్రలు మింగిన బుల్లితెర నటి

బుల్లితెర నటి రాజేశ్వరి (39) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. స్థానిక సైదాపేటకు చెందిన రాజేశ్వరి ప్రస్తుతం ఒక టీవీ ఛానల్‌లో ప్రసారం అవుతున్న సిరకడిక్క ఆశై సీరియల్‌లో తల్లి పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు భాగ్యలక్ష్మి, పనివిళుమ్‌ మలర్‌వనమ్‌.. ఇతర సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించారు.నిద్రమాత్రలు మింగి పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి స్థానిక ముత్తియల్‌పేటలో నివసిస్తూ వచ్చారు. అయితే ఈమెకు, భర్తకు మధ్య చాలాకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో రాజేశ్వరి ఇటీవల సైదాపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి అక్కడి నుంచే షూటింగ్‌లకు వెళ్తుండేవారు. ఇటీవల భర్తతో మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నటి గురువారం రాత్రి అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని స్పృహ కోల్పోయారు. చికిత్స పొందుతూ మృతితొలుత ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి స్థానిక కీల్‌పాక్కమ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే సైదాపేట పోలీసులు కీల్‌పాక్కమ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Sasivadane Movie Now another ott streaming now4
మరో ఓటీటీలో 'శశివదనే' స్ట్రీమింగ్‌

‘పలాస 1978’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్‌ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శశివదనే’. అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మించారు. ఇప్పటికే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా తాజాగా విడుదలైంది.'శశివదనే' విషయానికొస్తే.. గోదావరి లంకల్లోని ఓ పల్లెటూరి కుర్రాడు రాఘవ(రక్షిత్‌ అట్లూరి). పీజీలో కెమిస్ట్రీ చేసేందుకు రెడీ అవుతుంటాడు. తల్లి లేకపోవడంతో తండ్రి (శ్రీమాన్‌) ఇతడిని పెంచి పెద్ద చేస్తాడు. తన తండ్రిలానే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని రాఘవ అనుకుంటూ ఉంటాడు. ఓరోజు అనుకోకుండా శశి(కోమలి ప్రసాద్‌)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందేందుకు తెగ ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? ఈ ప్రేమకథలో తలెత్తిన సమస్యలేంటి? ప్రేమికుడైన రాఘవ జైలు పాలవ్వడానికి కారణమేంటి? అనేదే మిగతా స్టోరీ.

Mohanlal Vrusshabha Movie Emotional Song Out Movie5
తండ్రీ కొడుకుల ఎమోషనల్‌ సాంగ్‌

మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌, తెలుగు యంగ్‌ హీరో రోషన్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న చిత్రం 'వృషభ'.. తాజాగా ఈ మూవీ నుంచి ఎమోషనల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఇందులో రాగిణి ద్వివేది, నేహా సక్సెనా తదితరులు నటించారు. దర్శకుడు నంద కిశోర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్‌. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా నిర్మించారు. మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించిని ఈ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న తమిళ్‌, కన్నడ, హిందీలో విడుదల కానుంది. కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్‌, ఏవీఎస్‌ స్టూడియోస్‌ పతాకంపై రానున్న ఈ మూవీని మూన్‌లైట్‌, థ్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ వంటి హాలీవుడ్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నిక్‌ తుర్లో ఈ చిత్రం కోసం ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం విశేషం. ఆయన చిత్రాలకు గతంలో ఆస్కార్‌ కూడా దక్కింది.

 Roshan Kanakala movie Mowgli Fight making video6
'మోగ్లీ' కోసం రోషన్‌ కష్టం.. మేకింగ్‌ వీడియో రిలీజ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రోషన్‌ కనకాల, సాక్షి మడోల్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’... డిసెంబర్‌ 13న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు, నటుడు బండి సరోజ్‌కుమార్‌ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నటం విశేషం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై కలర్‌ ఫోటో దర్శకుడు సందీప్‌ రాజ్‌ తెరకెక్కించారు. కొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్స్‌లోకి రానున్న సందర్భంలో తాజాగా మోగ్లీ ఫైట్‌ సీన్‌ మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేశారు. బండి సరోజ్‌కుమార్‌, బండి సరోజ్‌, హర్ష చెముడు వంటి వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కాలభైరవ సంగీతం అందించారు.

Nidhi Agerwal And Priyanka Chopra Latest News7
గ్లామరస్ నిధి అగర్వాల్.. స్టన్నింగ్ ప్రియాంక చోప్రా

రెడ్ డ్రస్‌లో బోలెడంత గ్లామర్‌గా నిధి అగర్వాల్ప్రియాంక చోప్రా సన్నింగ్ లుక్.. చూస్తే అంతే'త్రీ రోజెస్' ప్రీ రిలీజ్ వేడుకలో రాశీ హొయలునల్ల చీరలో నాజుగ్గా మెరిసిపోతున్న ఈషా రెబ్బామాయ చేస్తున్న పొడుగు కాళ్ల సుందరి రకుల్చీరలో వయ్యారంగా అనుపమ పరమేశ్వరన్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana)

Akhanda 2 movie producer ram achanta comments on reviews8
అఖండ-2పై నెగెటివిటీ నిజమే: రామ్‌ ఆచంట

వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్‌లోకి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిని ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్‌ విన్సెంట్‌, అచ్యుత్‌కుమార్‌ తదితరులు నటించారు. ఎం తేజస్విని సమర్పణలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, తాజాగా ఈ మూవీ రివ్యూలు, ఫలితంపై వారు రియాక్ట్‌ అయ్యారు.అఖండ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తుందని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట పేర్కొన్నారు. బుక్‌మైషోలో కూడా గంటకు 25వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయన్నారు. హిందీ బెల్ట్‌లో సుమారు 800 థియేటర్స్‌లలో విడుదల చేశామన్నారు. అక్కడ కూడా మంచి టాక్‌ వచ్చిందన్నారు. అయితే, టాలీవుడ్‌లో వచ్చే రివ్యూలను తాము తప్పు పట్టడం లేదన్నారు. ఒక సినిమా రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్‌ వారికి ఉండటంలో తప్పులేదన్నారు. కానీ, గ్రౌండ్‌ రియాలిటీ వేరుగా ఉందన్నారు. రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాకు మంచి టాక్‌ వచ్చిందన్నారు. ఒక సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం అంటూ ప్రేక్షకుల ద్వారా మంచి టాక్‌ దక్కిందని తెలిపారు. ‘అఖండ 2’ మూవీకి ప్రేక్షకాదరణ దక్కినప్పటికీ.. ఇండస్ట్రీలో కాస్త నెగెటివిటీతో పాటు మిక్స్‌డ్‌ రిపోర్ట్ ఉందని రామ్‌ ఆచంట తెలిపారు.

Actress Keerthy Suresh Wedding Video9
తొలి వార్షికోత్సవం.. హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి వీడియో

సెలబ్రిటీలు పెళ్లి అంటే కొన్నిరోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. సంగీత్, హల్దీ, పెళ్లి అంటూ సెలబ్రేషన్ ఉండనే ఉంటాయి. ఆ టైంలో సోషల్ మీడియాలోనూ ఫొటోలు బాగానే వైరల్ అవుతుంటాయి. కానీ రీసెంట్ టైంలో చూస్తే ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?)ఈ నెల ప్రారంభంలో నాగచైతన్య-శోభిత తమ తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి వీడియోని సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసింది. వివాహం జరిగినప్పుడు కేవలం ఫొటోలని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వీడియోని పోస్ట్ చేసి అభిమానులకు క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేశ్ వంతు వచ్చింది. ఈమె కూడా పెళ్లి టైంలో కేవలం ఫొటోలని మాత్రమే పంచుకుంది. తమ బంధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వివాహ వీడియోని షేర్ చేసింది. ఇందులో హల్దీ, సంగీత్, హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన పెళ్లికి సంబంధించిన విజువల్స్ అన్నీ చూడొచ్చు. కీర్తి, ఆమె భర్త ఆంటోనీతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఆనందంగా కనిపించారు.(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Why Telugu Actors Choose Delhi High Court For Personal Rights10
తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?

రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కనిపిస్తుంది. ఎంతలా అంటే తెలుగు హీరోలు ఎవరినీ వదట్లేదు. అసభ్యకర కామెంట్స్ కావొచ్చు, దారుణమైన ట్రోల్స్ చేయడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తదితరులు తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆంధ్ర, తెలంగాణలోనూ హైకోర్టులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? కారణమేంటి?అయితే వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని సెలబ్రిటీలు ప్రధానంగా ఎంపిక చేసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. ఈ విషయంలో ఇక్కడైతే వీలైనంత త్వరగా ఆదేశాలు వస్తాయి. ఇలాంటి చాలా పిటిషన్లని గతంలో ఇక్కడ విచారించడం కూడా కారణమని చెప్పొచ్చు. అలానే అక్కడ తీర్పు వస్తే దేశవ్యాప్తంగా అందరికీ తెలియడానికి అవకాశముంది.(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్ కల్యాణ్)సోషల్ మీడియాలో ప్రధానంగా ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్స్, కంపెనీలు హెడ్ ఆఫీస్‌లు దాదాపుగా ఢిల్లీలోనే ఉ‍న్నాయి. ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత సమాచారం వాళ్లకు తెలియడం కూడా సులభం అవుతుంది. అలానే వ్యక్తిగత హక్కుల్ని డీల్ చేసే చాలా ఏజెన్సీలు అక్కడే ఉండటం కూడా దీనికి ఓ కారణం. ఇందువల్లే సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టుని ఎంచుకుంటున్నారు.గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్.. హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా పేరున్న నటీనటులు కూడా ఇలానే వ్యక్తిగత హక్కుల రక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి యువత.. ఇకపై సోషల్ మీడియాలో ఏ నటుడు లేదా నటి గురించి ఏదైనా కామెంట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి. లేదంటే కోర్ట్ ఆర్డర్స్ వల్ల కటకటాలపాలయ్యే అవకాశముంది. కాబట్టి బీ కేర్ ఫుల్!(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)

Advertisement
Advertisement