Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Bigg Boss 9 Telugu: Rithu, Emmanuel, Pawan Kalyan In Race for TTF1
టికెట్‌ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!

టికెట్‌ టు ఫినాలే ఎవరికి అవసరం? ఆడగలిగే సత్తా ఉండి ఓట్‌ బ్యాంక్‌ లేనివారికి ఉపయోగకరం. తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో టికెట్‌ టు ఫినాలే.. సుమన్‌, భరణి, సంజనా, రీతూ, పవన్‌.. వీరిలో ఎవరికి వచ్చినా ప్రయోజనం ఉండేది. వీరికి కాదని తనూజ, ఇమ్మాన్యుయేల్‌, పవన్‌ కల్యాణ్‌కు వస్తే పెద్ద యూజ్‌ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్లకు భారీ ఓటింగ్‌ ఉంది. టికెట్‌ టు ఫినాలేవీళ్లు టికెట్‌ టు ఫినాలే కొట్టినా, కొట్టకపోయినా.. ప్రతివారం నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్‌ అయి మరీ ఫైనల్‌లో చోటు దక్కించుకోగలరు. పైగా ఈ ముగ్గురూ టాప్‌ 3 అని ఈపాటికే అందరూ ఫిక్స్‌ అయిపోయారు. ఇప్పటికే టికెట్‌ టు ఫినాలే రేసు నుంచి సంజనా, తనూజ, పవన్‌ సైడైపోయారు. తాజా ప్రోమో ప్రకారం సుమన్‌ కూడా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురి మధ్యే పోటీఅలాగే భరణి కూడా ఔట్‌ అయ్యారట. ఈ లెక్కన రీతూ, ఇమ్మాన్యుయేల్‌, పవన్‌ కల్యాణ్‌ ఈ టికెట్‌ టు ఫినాలే కోసం పోటీపడుతున్నారు. వీరిలో కల్యాణ్‌, ఇమ్మూ ఇది గెలిచినా, గెలవకపోయినా వారు టాప్‌ 3లో ఉండటం ఖాయం. కానీ రీతూ గెలిచిందంటే మిగతా హౌస్‌మేట్స్‌ (సంజన, భరణి, సుమన్‌, పవన్‌)కి టాప్‌ 5లో ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. మరి ఈ టికెట్‌ టు ఫినాలే ఎవరు గెలుస్తారు? టాప్‌ 5లో ఎవరు మొదట అడుగుపెట్టబోతున్నారో చూడాలి!

Rakul Preet Singh Response On Rumours About Her Husband Jackky Bhagnani2
భర్తపై ఫేక్‌ న్యూస్‌.. రకుల్‌ ప్రీత్‌ ఏమన్నారంటే..

సినిమావాళ్లపై గాసిప్స్‌ కామన్‌. కెరీర్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌పై కూడా రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. చాలామంది నటీనటులు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆ లిస్ట్‌లోకి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా వస్తుంది. క్లిక్స్‌ కోసం రాసే వార్తలపై స్పదించాల్సిన అవసరం లేదంటోంది ఈ టాలీవుడ్‌ బ్యూటీ. ఇటీవల రకుల్‌(Rakul Preet Singh) భర్త జాకీ భగ్నానీ(Jackky Bhagnani) సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఆయన నిర్మించిన ‘బ‌డే మియా.. ఛోటే మియా’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడడంతో ఆర్థికంగా చాలా నష్టపోయాడనని.. కంపెనీ మూసేశారనే వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రకుల్‌ స్పందించింది. ‘ఆర్థికంగా నష్టపోయిన సంగతి నిజమే కానీ..కంపెనీ మూసేశారనడం పచ్చి అబద్ధం అన్నారు. క్లిక్స్‌ కోసం కొందరు తప్పుడు వార్తలు రాస్తుంటారని.. వాటిని పట్టించుకోబోమని చెప్పారు. ‘క్లిక్స్‌ కోసం ఏమైనా రాసేవాళ్లు ఉన్నారు. ఆ వార్తల్లో ఒక్కశాతం కూడా నిజం ఉండదు. అసలు నిజమేంటో నాకు తెలుసు కాబట్టి..అలాంటి వార్తలను పట్టించుకోను. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల మౌనంగా ఉండడమే బెటర్‌. సమయం వచ్చినప్పుడు నిజానిజాలు ఏంటో ప్రేక్షకులకు తెలుస్తాయి. జాకీ భగ్నానీపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు.. ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో నేను దగ్గర నుంచి చూశాను. కంపెనీ మూసేశారని రాశారు. అతడు నిర్మాతగా వ్యవహరించిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆర్థికంగా చాలా నష్టం కలిగింది. కానీ, కంపెనీ మూసివేయలేదు. ఇండస్ట్రీలోని ప్రతి నిర్మాతకు అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఒకనొక సమయంలో అమితాబ్‌బచ్చన్‌కు కూడా ఇలానే జరిగింది. ఎదిగేక్రమంలో ఇలాంటి ఒడుదొడుకులు సహజం. వాటిని తట్టుకొని నిలబడితేనే విజయం వరిస్తుంది’ అని రకుల్‌ చెప్పుకొచ్చింది.కాగా, రూ. 400 భారీ బడ్జెట్‌తో జాకీ భగ్నానీ నిర్మించిన ‘బ‌డే మియా.. ఛోటే మియా’ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి..డిజాస్టర్‌గా నిలిచింది. అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ లాంటి స్టార్స్‌ నటించిన చిత్రం అయినప్పటికీ.. కనీస ఓపెనింగ్స్‌ రాబట్టలేకపోయింది.

Impossible The Final Reckoning Movie free streaming Now OTT3
ఓటీటీలో 'మిషన్‌ ఇంపాజిబుల్‌'.. ఉచితంగానే స్ట్రీమింగ్‌

హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ మూవీ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ (Mission Impossible) ఉచితంగానే చూసేయండి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఇప్పటి వరకు రెంటల్‌ విధానంలో ఈ మూవీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా దానిని తొలగించారు. హాలీవుడ్‌ ఫ్రాంఛైజీల్లో మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆ సిరీస్‌లో భాగంగా 8వ సినిమాగా వచ్చిన ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టామ్‌ క్రూజ్‌ చేసిన సాహసాలు అత్యంత ప్రమాధకరంగా ఉన్నాయని హాలీవుడ్‌ మీడియా కూడా కథనాలు రాసింది. అతని నటన, యాక్షన్‌ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఆగష్టు 19న అమెజాన్‌ ప్రైమ్‌లో మిషన్‌ ఇంపాజిబుల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఇప్పటి వరకు రెంటల్‌ విధానంలో అందుబాటులో ఉంది. తాజాగా దానిని తొలగించేశారు. ఉచితంగానే ఈ మూవీని చూసేయవచ్చు. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 6వేల కోట్ల వరకు ఈ చిత్రం కలెక్షన్స్‌ రాబట్టింది. సుమారు రూ. 3400 కోట్ల వరకు ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చు చేశారు. క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.సిరీస్‌ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్‌ ఇంపాజిబుల్‌. సిరీస్‌ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్‌ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్‌ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌–ది ఫైనల్‌ రికనింగ్‌’ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్‌ ఫీస్ట్‌ అనే చెప్పాలి.

Raj Nidimoru ex wife Shhyamali coments after his marriage to Samantha4
సమంత, రాజ్‌ పెళ్లి .. బ్రేకింగ్‌ న్యూస్‌ కోసం ఎదురుచూడొద్దు: శ్యామాలి

నటి సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు వివాహం తర్వాత నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్‌ మాజీ భార్య శ్యామాలి (Shhyamali) పట్ల చాలామంది సానుభూతి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో తాజాగా ఆమె ఒక పోస్ట్‌ చేశారు. తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. చాలామంది తన ఇంటర్వ్యూల కోసం అడుతున్నారని చెప్పారు. అయితే, తాను ఈ అవకాశం ఎవరికీ ఇవ్వనని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిలో తన నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌లతో పాటు ఇంటర్వ్యూలు ఎవరూ ఆశించవద్దని కోరారు. సమంత - రాజ్‌ నిడిమోరు వివాహ గురించి తాను పట్టించుకోవడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.సమంత- రాజ్‌ల వివాహం తర్వాత తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని శ్యామాలి ఇప్పటికే ఒక పోస్ట్‌ చేశారు. చాలా మంది నాపై అభిమానం చూపారు. వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఎవరి గురించి మాట్లాడే పరిస్థితిలో లేను. మా గురువు గారు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. నా సోషల్‌మీడియా ఖాతాను కూడా నేనే మెయిన్‌టెన్‌ చేస్తాను. అందుకోసం నేను పీఆర్‌ను పెట్టుకోలేదు. మా గురువు గారి ఆరోగ్యం పట్ల ఇప్పటికే చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా అలసిపోయాను. కాబట్టి ఎవరూ కూడా నా నుంచి బ్రేకింగ్‌లు ఆశించకండి. ఆపై ఇంటర్వ్యూల కోసం ఎదురుచూడకండి.' అని శ్యామాలి కోరారు.

Shilpa Reddy About Samantha Raj Wedding5
ఇటువంటి పెళ్లి నేను చూడలేదు, రాజ్‌ ఎలాంటివాడంటే?

హీరోయిన్‌ సమంత, ఫ్యాషన్‌ డిజైనర్‌, మోడల్‌ శిల్పారెడ్డి క్లోజ్‌ఫ్రెండ్స్‌ అని అందరికీ తెలుసు. శిల్పా లేకుండా సమంత ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. సామ్‌-రాజ్‌ పెళ్లిలోనూ శిల్పా స్నేహితురాలికి తోడుగా నిలబడింది. తాజాగా ఆ విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.ఈ మధ్యకాలంలో చూడలేదుశిల్పా రెడ్డి మాట్లాడుతూ.. సమంత-రాజ్‌ల పెళ్లి ఎంత బాగా జరిగిందంటే ఈ మధ్యకాలంలో అటువంటి వివాహ వేడుకను నేను చూడనేలేదు. ఎంతో పవిత్రతతో ఈ తంతు సాగింది. సమంత-రాజ్‌ పూర్తిగా భిన్నస్వభావాలు కలిగినవారు. సామ్‌ చాలా ఎనర్జిటిక్‌, కొంటె అమ్మాయి, ఎక్కువ నవ్వుతూ ఉంటుంది. కానీ, రాజ్‌.. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతడితో ఫోన్‌లో మాట్లాడా.. అయితే, పెళ్లిలోనే ఫస్ట్‌ టైమ్‌ కలిశాను. ఏడ్చేశారుఈ ఇద్దరి వ్యక్తిత్వాలు పెళ్లి ద్వారా ఒక్కటవడం చూస్తున్నప్పుడు చాలా మంచి అనుభూతి కలిగింది. ఈ పెళ్లికి ప్రతి కుటుంబం నుంచి పది మంది మాత్రమే హాజరయ్యారు. అది కూడా సామ్‌, రాజ్‌కు బాగా దగ్గరైన వ్యక్తులు మాత్రమే వచ్చారు. ఇండస్ట్రీ నుంచి దర్శకురాలు నందినీరెడ్డి మాత్రమే వచ్చారు. ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా, అందంగా ఈ వేడుక జరిగింది. అగ్ని ముందు పెళ్లి సూత్రాన్ని వధువు వేలికి, వరుడు వేలికి తగిలించే విధానాన్ని చూసినప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఏదో శక్తి ఉద్భవించినట్లు అనిపించింది. ఆ ఎనర్జీని ఫీలై ఏడుగురు మంది మహిళలు ఏడ్చేశారు. అంత పవిత్రంగా ఆ వేడుక జరిగింది.సమంతతో నా అనుబంధంసమంత (Samantha) నేను కలిశామంటే నవ్వుతూనే ఉంటాం. మాపై మేమే జోకులు వేసుకుంటాం. ఒకరినొకరు ఏడిపించుకుంటాం. నాదేదైనా తప్పుంటే నన్ను చాలా ర్యాగింగ్‌ చేస్తుంది. మా మధ్య ఎటువంటి హద్దులు ఉండవు. ఒకరినొరు టీజ్‌ చేసుకుంటాం, తిట్టుకుంటాం, అలుగుతాం కూడా! సమంత అనారోగ్యం బారినపడటం, విడాకులు, ట్రోలింగ్‌.. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగింది. తను గొప్ప ఫైటర్‌. అందుకే తనంటే చాలామందికి ఇష్టం అని శిల్పా రెడ్డి (Shilpa Reddy) చెప్పుకొచ్చింది.చదవండి: రేణూ దేశాయ్‌కు పుట్టుకతోనే ఆ సమస్య

Rashmika Mandanna React On Marriage With Vijay Deverakonda6
పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించిన 'రష్మిక'

పెళ్లి వార్తల గురించి నటి రష్మిక స్పందించారు. విజయ్‌ దేవరకొండతో ఇప్పటికే నిశ్చతార్థం కూడా చేసుకున్నట్లు బలంగానే వార్తలు కూడా వచ్చాయి. కానీ, వారిద్దరూ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రష్మిక స్పందించారు. తన పెల్లి గురించి వస్తున్న రూమర్స్‌ను ఖండించలేనని అంటూనే ఆ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేనని అన్నారు. అయితే, పెళ్లి గురించి తప్పకుండా సరైన సమయం, ప్రదేశంలో మాట్లాడుతానని క్లారిటీ ఇచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నారు. ఇంతకు మించి పెళ్లి గురించి చెప్పలేనని రష్మిక పేర్కొన్నారు.తన వ్యక్తిగత విషయాలను బయటి ప్రపంచానికి చెప్పేందుకు పెద్దగా ఇష్టపడనని రష్మిక అన్నారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకోనన్నారు. అదే విధంగా బయటకు వచ్చినప్పుడు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడనన్నారు. ఈ ఏడాది తన జీవితంలో చాలా ఎంతో ప్రత్యేకమైనదని ఆమె అన్నారు. 2025లో తాను నటించిన ఐదు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి మంది ఆదరణ పొందడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రష్మిక అన్నారు.

Renu Desai Turns 44: She Have an Health Issue from Birth7
రేణూ దేశాయ్‌కు పుట్టుకతోనే ఆ సమస్య!

తన ఆశలు వేరు, ఆశయం వేరనుకుంది నటి రేణూ దేశాయ్‌. చిన్నప్పుడు ఆమెకు అంతరిక్ష శాస్త్రవేత్త అవ్వాలని కోరికగా ఉండేదట. ఒకవేళ అది కుదరకపోతే డాక్టర్‌ అవాలని కలలు కంది. కానీ, రెండూ జరగకపోయేసరికి ఊహించనివిధంగా హీరోయిన్‌గా మారింది. నేడు (డిసెంబర్‌ 4) రేణూ దేశాయ్‌ బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..18 ఏళ్లకే హీరోయిన్‌గా..రేణూ దేశాయ్‌.. పవన్‌ కల్యాణ్‌ బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 18 ఏళ్లు. అదే ఏడాది తమిళంలో జేమ్స్‌ పండు మూవీ చేసింది. తర్వాత మరోసారి పవన్‌తో జానీ సినిమా చేసింది. రెండే రెండు సినిమాలకే పవన్‌తో ప్రేమలో పడింది. తొలిచూపులోనే ప్రేమలో పడినా ఫస్ట్‌ ప్రపోజ్‌ చేసింది మాత్రం పవనే అని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బైఅంతేకాదు తనకు 19 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నామని, కాకపోతే అది అధికారికంగా కాదని, ఇంట్లో సింపుల్‌గా వివాహం చేసుకున్నామని పేర్కొంది. అలా పవన్‌తో పెళ్లవగానే యాక్టింగ్‌ పక్కనపెట్టేసింది. ఖుషి, జానీ, గుడుంబా శంకర్‌, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది. నిర్మాతగానూ రెండు సినిమాలు చేసింది.రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీపవన్‌- రేణూ (Renu Desai) జంటకు కొడుకు అకీరా, కూతురు ఆద్య సంతానం. 11 ఏళ్లపాటు కలిసున్న వీరిద్దరూ 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రేణూ ఎంతోకాలం డిప్రెషన్‌కు గురైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. అయితే రేణూ దేశాయ్‌కు ఓ అనారోగ్య సమస్య ఉంది. తనకు పుట్టుకతోనే గుండె సమస్య ఉంది.పుట్టుకతోనే సమస్యఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నాకు హార్ట్‌ రేట్‌ ఎక్కువగానే ఉంటుంది. రెగ్యులర్‌గా మెడిసిన్‌ తీసుకోవాల్సిందే.. రన్నింగ్‌, మెట్లు ఎక్కడం వంటివి నేను చేయకూడదు. మా నానమ్మ 1974లో.. నాన్న పెళ్లికి ముందే చనిపోయారు. నాన్న కూడా చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించారు. నాకు మరీ అంత సీరియస్‌గా లేదు కానీ కొంత సమస్యయితే ఉంది అని పేర్కొంది.చదవండి: ప్రముఖ నిర్మాత కన్నుమూత

Santosh Narayan Mother Sing a Song from Vaa Vaathiyaar Movie8
సింగర్‌ తల్లి నోట పాట.. వీడియో వైరల్‌

హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వా వాద్దియార్‌ (తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరిట రిలీజవుతోంది.). కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఇందులో సత్యరాజ్‌, రాజ్‌కిరణ్‌, జీఎం సుందర్‌, శిల్పామంజునాథ్‌, ఆనంద్‌రాజ్‌, కరుణాకరన్‌, రమేష్‌ తిలక్‌, పీఎల్‌ తేనప్పన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్‌ ప్రతాపంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి నలన్‌ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని, జార్జ్‌ విలియమ్స్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్‌ 12న తెరపైకి రానుంది.ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ తన తల్లితో కలిసి పాడడం విశేషం. ఈ పాట వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఇది గతంలో ఎంజీఆర్‌ చిత్రంలోని 'రాజా విన్‌ పార్‌ర్వై రాణి ఇన్‌ పక్కం..' పాటకు రీమిక్స్‌ అన్నది గమనార్హం. ఈ పాటను పాడిన సంతోష్‌ నారాయణన్‌ తల్లికి కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు పలువురు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృతి శెట్టి వావ్‌ సూపర్‌.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్‌, అతిథిరావ్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, గాయకుడు విజయ్‌ ఏసుదాస్‌ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో కార్తీ ఎంజీఆర్‌ వీరాభిమానిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్‌, ఆడియోలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. View this post on Instagram A post shared by Santhosh Narayanan (@musicsanthosh)

Legendary Producer AVM Saravanan Passed Away9
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ కన్నుమూత

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో చిత్రాలు నిర్మించారాయన. ఎంజీఆర్‌, శివాజీ, జెమిని గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో వంటి లెజెండరీలు.. విక్రమ్‌, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో నటించారు. ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్‌. ఆయన శరవణన్‌ తండ్రి. మద్రాస్‌(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్‌ తొలినాళ్లలో సరస్వతి సౌండ్‌ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్‌ లిమిటెడ్‌, ప్రగతి స్టూడియోస్‌.. మేయప్పన్‌( ఏవీ మేయ్యప్ప చెట్టియార్‌) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్‌ తర్వాత శరవణన్‌ ఆ ప్రొడక్షన్‌ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. వివిధ భాషల్లో 176 సినిమాలతో పాటు తెలుగు, తమిళ్‌, మలయాళంలో సీరియల్స్‌ను ఏవీఎం బ్యానర్‌లో నిర్మించారు. భూకైలాస్‌(1940), శివాజీ ది బాస్‌, మెరుపుకలలు, జెమినీ, లీడర్‌, సంసారం ఒక చదరంగం.. ఇలా ఎన్నో మరుపురాని హిట్స్‌ అందించారు. ఏవీఎం బ్యానర్‌లో వచ్చిన చివరి చిత్రం ఇదువుమ్‌ కదాందు పొగుమ్‌(2014). 2022లో అరుణ్‌ విజయ్‌ లీడ్ రోల్‌లో‌‌ తమిళ్‌రాకర్స్ అనే వెబ్‌సిరీస్‌ కూడా నిర్మించారు.‌ ఈయన కుమారుడు ఎమ్‌ఎస్‌ గుహాన్‌ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. శరవణన్‌ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి.

Bigg Boss 9 Telugu: These 5 Members Fighting for Ticket to Finale10
ఛాలెంజ్‌ చేసిన పవన్‌ను ఓడించిన భరణి

టికెట్‌ టు ఫినాలే కోసం హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. తనూజ.. సుమన్‌ను ప్రత్యర్థిగా ఎంచుకోవడంతో మొన్నటి ఎపిసోడ్‌ ముగిసింది. మరి తర్వాతేం జరిగింది? ఎవరు గెలిచారు? మళ్లీ ఎలాంటి గేమ్స్‌ పెట్టారనేది బుధవారం (డిసెంబర్‌ 3వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం...సుమన్‌ చేతిలో ఓటమితనూజ, సుమన్‌కు బిగ్‌బాస్‌ వాటర్‌ ట్యాంక్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో కల్యాణ్‌, రీతూ, ఇమ్మాన్యుయేల్‌.. తనూజకు సపోర్ట్‌ చేశారు. భరణి, పవన్‌.. సుమన్‌కు మద్దతిచ్చారు. ట్యాంకు సగానికి పైగా నిండినా సరే సుమన్‌ కదలకుండా శిలావిగ్రహంలా నిల్చుని గెలిచాడు. టికెట్‌ టు ఫినాలే రేసు నుంచి అవుట్‌ అయిపోవడంతో తనూజ ఏడ్చేసింది.గెలిచిన పవన్‌తర్వాత బిగ్‌బాస్‌ ఇచ్చిన పవర్‌ బాక్స్‌ అనే ఛాలెంజ్‌ను కల్యాణ్‌, పవన్‌, సుమన్‌ ఆడారు. ఈ గేమ్‌లో పవన్‌ గెలిచి భరణిని ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. అలా వీరిద్దరికీ వారధి కట్టు- విజయం పట్టు అనే బ్రిడ్జి టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పవన్‌పై భరణి గెలిచేశాడు. దీంతో పవన్‌ టికెట్‌ టు ఫినాలే రేసులో లేకుండా పోయాడు. మాట నిలబెట్టుకోలేని పవన్‌ఈసారి ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యేది నేనే అని ఛాలెంజ్‌ చేసిన పవన్‌ ఆ మాట నిలబెట్టుకోలేకపోయేసరికి బాధపడ్డాడు. ప్రస్తుతానికి రీతూ, భరణి, కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, సుమన్‌ టికెట్‌ టు ఫినాలే రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అవుతారో చూడాలి!

Advertisement
Advertisement