Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Travis Scott Concert Lost Mobiles And Gold Chains Worth1
పాటలు వినేందుకు వెళ్తే రూ.18 లక్షలు స్వాహా

రీసెంట్ టైంలో మ్యూజికల్ కన్సర్ట్స్ అనేది ట్రెండ్ అవుతుంది. ప్రముఖ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ర్యాపర్స్ పలు నగరాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అలానే ఇంటర్నేషనల్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ కన్సర్ట్.. ముంబైలో శుక్రవారం రాత్రి జరిగింది. కానీ చాలామందికి ఇదో పీడకలలా మిగిలింది. ఎందుకంటే లక్షలు విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ముంబైలోని మహాలక్ష‍్మీ రేస్ కోర్సులో ఈ కన్సర్ట్ జరిగింది. వేలాదిమంది హాజరయ్యారు. స్టేజీకి దగ్గరలో చాలామంది గుమిగూడారు. ఇదే అదనుగా తీసుకున్న దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 24 ఖరీదైన మొబైల్ ఫోన్స్, 12 గోల్డ్ చెయిన్స్ దొంగతనానికి గురయ్యాయి. వీటి విలువ రూ.18 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు కన్సర్ట్‌కి వచ్చిన చాలామంది.. సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. గోల్డ్ చెయిన్స్, ఫోన్స్‌కి సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నారు. వీటిని పోగొట్టుకున్న వాళ్లలో ముంబై, సూరత్, బెంగళూరు, కేరళకు చెందిన పలువురు ఉన్నారు. ఏదేమైనా కన్సర్ట్‌కి వెళ్దామనుకునే చాలామందికి ఈ సంఘటన మేలుకొలుపు లాంటిదని చెప్పొచ్చు. చూడాలి మరి పోలీసులు ఈ కేసులో తర్వాత ఏం చేస్తారో?

November 21st Movie Releases Telugu And Result2
21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్?

'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు'.. టాలీవుడ్ నిర్మాతలు పదేపదే చెప్పే మాట. ప్రతిదానికి ప్రేక్షకుడినే నిందిస్తుంటారు తప్పితే తప్పు ఎక్కడ జరుగుతుందో చూసుకోరు. ఎందుకంటే ప్రేక్షకుడు అంటే అంత అలుసు. ఈ వారమే తీసుకుందాం. ఏకంగా 21 సినిమాలు థియేటర్లలో రిలీజైతే వీటిలో తెలుగు చిత్రాలు 16 ఉన్నాయి. పోనీ వీటిలో ఏమైనా బాగున్నాయా అంటే లేదు! ఉన్నంతలో ఒక్కదానికే పాజిటివ్ టాక్ వచ్చింది. మరి మిగతా వాటి సంగతేంటి? వాటి గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పడే కష్టం ఒకటే. ఎందుకంటే ఒక మూవీ తీయాలంటే వందలాది మంది కష్టపడాలి. కష్టపడితే సరిపోదు దాన్ని ప్రేక్షకుడి వరకు చేరేలా చూడాలి. కానీ టాలీవుడ్‌లో కొందరి తీరు చూస్తుంటే జాలేస్తుంది. ఈ వారమే తీసుకోండి. 20కి పైగా మూవీస్ థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో తెలుగువి కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు రెండు మూడింటివి తప్పితే మిగతా వాటి పేర్లు కూడా తెలీదు. కనీసం తెలిసేలా చేయనప్పుడు రిలీజ్ చేయడం ఎందుకనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న.ఈ వారం వచ్చిన వాటిలో కాస్తోకూస్తో పబ్లిసిటీతో వచ్చినవి మూడో నాలుగు సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 'రాజు వెడ్స్ రాంబాయి'కి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. ఉన్నంతలో దీన్ని చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా వాటి విషయానికొస్తే అల్లరి నరేశ్ హీరోగా చేసిన '12ఏ రైల్వే కాలనీ' మూవీని థ్రిల్లర్ జానర్‌లో తీశారు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయేలా కనిపిస్తుంది. ప్రియదర్శి 'ప్రేమంటే' కూడా రిలీజ్‌కి ముందు ఇదో ప్రేమకథ అన్నట్లు ప్రచారం చేశారు. తీరాచూస్తే ఇదో దొంగలైన భార్యభర్త కథ. దీని కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇది కూడా నిలబడటం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)ఈ మూడు కాకుండా రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ఓ కామెడీ మూవీ. అసలు ఇదొకటి వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. వీటితో పాటు కలివనం, శ్రీమతి 21 ఎఫ్, జనతా బార్, ఇట్లు మీ ఎదవ, క్షమాపణ గాధ, మఫ్టీ పోలీస్, హ్యాపీ జర్నీ, ఫేస్ టూ ఫియర్ లెస్, ప్రేమలో రెండోసారి, డ్యూయల్, కొదమ సింహం రీ రిలీజ్, ఆవారా రీ రిలీజ్.. ఇలా బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. వీటిలో ఒక్కటైనా హిట్ అయిందా అంటే లేదు. అసలు ఇవి రిలీజ్ అయ్యాయనే సంగతి కూడా ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయారు.చిన్నదా పెద్దదా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతా కష్టపడి ఓ సినిమా తీసి, దాన్ని పోటీలో రిలీజ్ చేయడం అవసరమా? లేదంటే ఖాళీగా ఉండే వారంలో విడుదల చేయడం మంచిదా అనేది నిర్మాతలే ఆలోచించుకోవాలి. అలా చేస్తే ఒకరో ఇద్దరో ప్రేక్షకులైనా మీ చిత్రాలకు వస్తారు. చిన్న చిత్రాలు తీసే నిర్మాతలందరూ ఈ విషయంలో కాస్త దృష్టి పెట్టాలి. ఏదో తీశామా, థియేటర్లలో రిలీజ్ చేశామా అని వదిలేయకుండా కాస్త కంటెంట్‌పై కూడా దృష్టి పెడితే మంచిది. అలానే సరైన తేదీన రిలీజ్ కూడా ముఖ్యమే. ఇలాంటివేం చేయకుండా ప్రేక్షకుల్ని నిందించడం మాత్రం సరికాదు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!)

Dy CM Bhatti Vikramarka Visit to Annapurna College3
‘తెలంగాణ రైజింగ్ 2047’లో చిత్ర పరిశ్రమది కీలకపాత్ర : భట్టి విక్రమార్క

‘1970లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను స్థాపించడం ఒక అద్భుతం’ అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జున ఆహ్వానం మేరకు శనివారం ఆయన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుని గుర్తుచేసుకున్నారు. ఏఎన్నార్‌ అన్నపూర్ణ స్టూడియోని ప్రారంభించిన నాటి నుంచే సాంస్కృతిక, సినిమాటిక్‌ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎదిగింది. అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన ‘రోల్‌ నం.52’ను నేను చూశాను. ఎంతో అర్థవంతమైన కథతో రూపొందిన ఆ సినిమా అందరి హృదయాలను హత్తుకుంది’’ అంటూ ప్రశంసలు కురిపించారు.ఇక తెలంగాణ ఆర్థిక వృద్ధికి ప్రభుత్వ దార్శనికతను ఆయన హైలైట్ చేస్తూ, “2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ సినీ దిగ్గజాల మద్దతును మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. అన్నపూర్ణ కళాశాల నుండి వెలువడుతున్న అసాధారణ ప్రతిభ గురించి అక్కినేని నాగార్జున స్వయంగా మాట్లాడారని, అది తన సందర్శనకు ప్రేరణనిచ్చిందని ఆయన అన్నారు. ‘సినిమా రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే మేటిగా అభివృద్ధి చేయడంలో తనతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌ మద్దతు ఎప్పటికీ ఉంటుంది’ అని నాగార్జున అన్నారు.

Rakul Preet And Kalyani Priyadarshan Latest News4
కవర్ సాంగ్‌లో కల్యాణి.. రకుల్ ఓ రేంజ్ గ్లామర్!

హిందీ కవర్ సాంగ్ కోసం గ్లామరస్‌గా కల్యాణిపెళ్లి తర్వాత కూడా రకుల్ అందాల విందువింటేజ్ కెమెరాతో యాంకర్ రష్మీ పోజులుకెన్యా టూర్ వీడియో పోస్ట్ చేసిన అనసూయసొట్టబుగ్గతో అందంగా 'రాంబాయి' తేజస్వీటామ్ బాయ్‌లా మారిపోయిన షాలినీ పాండే View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Tejaswi. (@tej_aswiii) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan)

Bigg Boss 9 Telugu 11th Week Divya Eliminated5
బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!

ప్రతివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. గతవారం గౌరవ్, నిఖిల్ బయటకొచ్చేశారు. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయినట్లు అయింది. మరి ఈ వారం ఎవరు ఔట్ అవుతారా అందరూ ఎదురుచూశారు. అందుకు తగ్గట్లే ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లోకి రాగా.. ఈమెనే ఎలిమినేట్ అవుతుందని చాలామంది ఊహించారు. ఇప్పుడు అలానే జరిగినట్లు తెలుస్తోంది.ఈ వారం నామినేషన్స్‌లోకి కళ్యాణ్‌, పవన్‌, ఇమ్మాన్యుయేల్‌, భరణి, సంజన, దివ్య వచ్చారు. ఇన్నివారాల పాటు మిస్ అవుతూ వచ్చిన ఇమ్ము.. తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఇదేమైనా ఇతడికి మైనస్ అవుతుందా అని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. అభిమానులు గట్టిగానే ఓట్లు వేశారట. తద్వారా ఓటింగ్‌లో తొలిస్థానం కల్యాణ్ దక్కించుకోగా.. రెండో స్థానంలో ఇమ్ము నిలిచాడట.(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)తర్వాత స్థానాల్లో పవన్, భరణి నిలిచారు. డేంజర్ జోన్‌లో సంజన, దివ్య ఉన్నారు. సంజనతో పోలిస్తే దివ్యపై గత కొన్నివారాల నుంచి నెగిటివిటీ పెరుగుతూనే వచ్చింది. దీనికి కారణం తనూజ. ప్రతిసారి తనూజతో దివ్య గొడవ పడుతూ వచ్చింది. శుక్రవారం ఎపిసోడ్‌లోనూ కెప్టెన్సీ విషయమై వీళ్లిద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇప్పటికే కెప్టెన్సీ, ఇమ్మ్యూనిటీ ఉన్న కారణంగా తనూజని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించేందుకు తాను ఓటు వేస్తున్నానని దివ్య చెప్పింది.ఇలా పలు కారణాలతో పాటు నామినేషన్స్‌లో ఉన్న మిగతా వాళ్లతో పోలిస్తే దివ్యకు ఓటు బ్యాంక్ తక్కువగా ఉండటంతో 11వ వారం ఈమెనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈమె బయటకొచ్చేస్తే.. హౌస్‌లో ఉన్న కామనర్స్ కల్యాణ్, పవన్ మాత్రమే అవుతారు. చూడాలి మరి ఈసారి ఊహించినట్లే దివ్య ఎలిమినేట్ అవుతుందా లేదంటే మరెవరైనా బయటకొచ్చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)

Hrithik Roshan Trolls Him And War 2 Movie Failure Publicly6
'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్

సాధారణంగా హీరోలు తమ సినిమా ఫ్లాప్ అయితే జీర్ణించుకోలేరు. ఒకవేళ ఇదే జరిగితే వీలైనంత వరకు దానిగురించి మాట్లాడరు. కచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తప్పించుకుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కొందరు నిజాయితీగా ఒప్పేసుకుంటారు. ఇప్పుడు కూడా అలానే జరిగింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. అందరిముందు తన మూవీ ఫ్లాప్ అని చెప్పాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.ఈ ఏడాది రిలీజైన పాన్ ఇండియా సినిమాల్లో 'వార్ 2' ఒకటి. ఇందులో హృతిక్ రోషన్‌తో పాటు తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటించాడు. విడుదలకు ముందు చాలా హంగామా చేశారు. అభిమానులు కాలర్ ఎత్తుకుంటారని తారక్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. కట్ చేస్తే థియేటర్లలో మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు. కొత్త ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. కానీ హృతిక్ మాత్రం ఈ ఫలితాన్ని మర్చిపోలేకపోతున్నాడు.(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)కొన్నిరోజుల క్రితం 'వార్ 2' గురించి హృతిక్ ఓ ట్వీట్ చేశాడు. తన పని తాను చేశానని, కానీ అనుకున్న ఫలితం రాలేదన‍్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా దుబాయిలో జరిగిన ఓ లాంచ్ ఈవెంట్‌లో మాత్రం పబ్లిక్‌గా ఫ్లాప్ అని ఒప్పుకొన్నాడు. చెప్పాలంటే తనపై తానే ట్రోలింగ్ చేసుకున్నాడు.ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేసిన యాంకర్.. హృతిక్‌ని పొగుడుతూ సూపర్‌స్టార్‌ని చప్పట్లతో వెల్కమ్ చెప్పాలని అన్నాడు. స్టేజీ మీదకు వచ్చిన హృతిక్.. 'మీ అందరికీ ధన్యవాదాలు. నా లేటెస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్ అయింది. అయినా సరే మీరు ఇంత ప్రేమ, అభిమానం చూపుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా' అని హృతిక్ చెప్పాడు. మూవీ వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతున్నా హీరో.. మూవీ రిజల్ట్‌ని మర్చిపోలేకపోతున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్)My film just bombed at box office so this just feels good to get all the love 😭😭#HrithikRoshan and his way to troll the haters 🤣🤣pic.twitter.com/9PTWvu9XO6— Pan India Review (@PanIndiaReview) November 21, 2025

Dude Director Keerthiswaran Trolled for Cheap Response to Criticism7
చెత్త రీల్స్‌ ఒక్కచోట చేర్చితే డ్యూడ్‌.. దర్శకుడి రిప్లై ఇదే!

దీపావళికి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన సినిమా డ్యూడ్‌ (Dude Movie). ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంతోనే కీర్తిశ్వరన్‌ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.అది నార్మల్‌ కాదుదీంతో ఓటీటీలో సినిమా చూసిన జనాలు సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా సినిమా గురించి నేరుగా దర్శకుడికే మెసేజ్‌ చేసింది. బ్రో.. మీ ఇంటర్వ్యూ క్లిక్‌ కూడా చూశాను. మమిత మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్‌ చేసే సన్నివేశాన్ని నార్మలైజ్‌ చేశారు. అలాంటివి చాలా మామూలు విషయం అన్నట్లు చూపించకండి.చెత్త రీల్స్‌నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. సినిమా మొత్తం అర్థంపర్థం లేకుండా ఉంది. సన్నివేశాల మధ్య కనెక్షన్‌ మిస్‌ అయింది. చెత్త రీల్స్‌ను ఒకచోట చేర్చినట్లుగా ఉంది. ఇకనుంచైనా కాస్త మంచి సినిమాలు తీయు అని సలహాచ్చింది. దీనికి కీర్తిశ్వరన్‌ స్పందిస్తూ... నాకు మెసేజ్‌లు చేసే బదులు నీ బతుకేదో నువ్వు చూసుకో.. అని వెటకారంగా బదులిచ్చాడు. విమర్శించే హక్కుఈ చాటింగ్‌ను స్క్రీన్‌షాట్‌ తీసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. డ్యూడ్‌ సినిమాతో పాటు దర్శకుడి ఇంటర్వ్యూ క్లిప్‌ చూశాను. నా జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా చూసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు నాకుంది. నా అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకున్నాను. కొత్త డైరెక్టర్‌.. నా విమర్శను స్వీకరిస్తాడనుకున్నాను.. కానీ, ఇదిగో ఇలా రిప్లై ఇచ్చాడు. దమ్ము లేదుఇక్కడే అతడి మైండ్‌సెట్‌ ఏంటో తెలిసిపోతుంది. ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునే దమ్ము లేదని రుజువవుతోంది అని రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. డ్యూడ్‌ సినిమా ప్రదీప్‌తో కాకుండా వేరే హీరోతో చేసుంటే కచ్చితంగా ఫ్లాప్‌ అయ్యేది.. విమర్శలు తీసుకోవడం కూడా రావాలని దర్శకుడిని మందలిస్తున్నారు. మెజారిటీ జనాలు మాత్రం.. ఇది సినిమానా? చెత్త రీల్స్‌ అన్ని కలగలిసినట్లుగా ఉందని నానామాటలు అంటే ఇలాగే స్పందిస్తారని దర్శకుడిని వెనకేసుకొస్తున్నారు. Dude Director “ Keerthishwaran “ reply to a influencer question about the worst scene in movie. It’s just a Audacity way of response :( pic.twitter.com/EdQKaI50eI— Kolly Censor (@KollyCensor) November 21, 2025 చదవండి: చెల్లి పెళ్లయిన మూడున్నరేండ్లకు.. బుల్లితెర నటి ఎంగేజ్‌మెంట్‌

Raju Weds Rambai Movie Day 1 Collection Worldwide8
'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?

ప్రతి శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వీటిలో ప్రేక్షకులకు నచ్చేవి, కలెక్షన్స్ తెచ్చుకునే చిత్రాలు కొన్ని ఉంటాయి. పెద్దగా స్టార్స్ లేకపోయినా సరే కొన్ని మూవీస్ అద్భుతాలు చేస్తుంటాయి. నిన్న (నవంబరు 21) విడుదలైన వాటిలో అలా 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమా మిగిలిన వాటితో పోలిస్తే మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో తొలిరోజు షాకింగ్ వసూళ్లు వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తీశాడు. టీజర్, ట్రైలర్, పాటలతోనే కాస్త ఆసక్తి రేపింది. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి టాక్ వచ్చింది. దీనితో పాటు అల్లరి నరేశ్ '12 ఏ రైల్వే కాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే' రిలీజైనప్పటికీ.. ఇవి అంతంత మాత్రంగానే ఉన్నాయని టాక్ వచ్చింది. దీంతో మూవీ లవర్స్.. 'రాజు వెడ్స్ రాంబాయి'కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అలా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.1.47 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ రివ్యూ)ఏ మాత్రం స్టార్స్ హీరోహీరోయిన్లు గానీ డైరెక్టర్ గానీ లేని ఈ సినిమాకు ఈ మాత్రం వసూళ్లు రావడం అంటే నిజంగా ఆశ్చర్యమే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మిగతా చిత్రాలతో పోలిస్తే ఇదే కాస్త లీడ్‌లో ఉంది. ఈ వీకెండ్‌తో పాటు వచ్చే వారం రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ అయ్యేవరకు ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో చూడాలి?'రాజు వెడ్స్ రాంబాయి' విషయానికొస్తే.. 2010లో ఖమ్మం దగ్గర ఓ పల్లెటూరిలో జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ కొడుతుంటాడు. అదే ఊరిలో ఉండే రాంబాయిని(తేజస్వి రావు)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు ప్రేమలో పడిపోతుంది. కానీ తనకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనేది రాంబాయి తండ్రి వెంకన్న(చెతన్య జొన్నలగడ్డ) పట్టుదల. ఇంతలోనే రాజు-రాంబాయి ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో వీళ్లిద్దరూ ఊరి వదిలి పారిపోవాలనుకుంటారు. తర్వాత ఏమైంది? చివరకు ప్రేమలో విజయం సాధించారా లేదా అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాంబాయి'గా తేజస్వీ.. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

3 Roses Web Series Season 2 Teaser9
ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్

కరోనా టైంలో పలు తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు నేరుగా ఓటీటీల్లో రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో 'త్రీ రోజెస్' ఒకటి. 2021లో ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అయింది. బోల్డ్ కంటెంట్, దానికి తోడు రొమాంటిక్ కామెడీతో దీన్ని తీశారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత రెండో సీజన్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)వచ్చే నెల 12 నుంచి ఆహా ఓటీటీలో '3 రోజెస్' రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ లాంచ్ చేశారు. ఈసారి కూడా ఈషా రెబ్బా ఉండగా.. పాయల్, పూర్ణకి బదులు రాశి సింగ్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కుషిత కొత్తగా వచ్చి చేరారు. టీజర్‌లో అయితే అడల్ట్ టచ్ ఉన్న జోక్స్, సీన్స్ కనిపించాయి. సిరీస్‌లోనూ వీటితో పాటు రొమాంటిక్ కామెడీ ఉండనుంది. (ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

Girija Oak Interesting Comments Kiss Scene Shooting10
తెరపై ముద్దు.. ఎలా ఉంటుందో చెప్పిన నటి!

ఇది సోషల్‌ మీడియా యుగం. ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్‌ అవుతారో తెలియదు. అసలు ఎందుకు ట్రెండ్‌ అవుతారనే విషయం చెప్పడం కూడా కష్టమే. గత 15 రోజులుగా ఓ నటి పేరు నెట్టింట మారుమోగుతుంది. ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. ఒకే ఒక ఇంటర్వ్యూతో వచ్చింది. ఆ ట్రెండింగ్‌ బ్యూటీ ఎవరోకాదు మరాఠీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్‌(Girija Oak). ఓ సినిమా కోసం గుల్షన్‌ దేవయ్యతో రొమాంటిక్‌ సీన్‌ చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఫన్నీ ఇన్నిడెంట్‌ని షేర్‌ చేసుకోవడంతో గిరిజా పేరు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంత వైరల్‌ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు. ఆ ఇంటర్వ్యూ తర్వాత గిరిజాకు సంబంధించిన ఓ కిస్‌ సీన్‌ కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ లిప్‌లాక్‌ సీన్‌ గురించి కూడా స్పందించారు గిరిజా. ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆమెకు ముద్దు సన్నివేశాలు ఎలా షూట్‌ చేస్తారు? రొమాంటిక్‌ సీన్ల షూటింగ్‌కి ప్రత్యేకమైన నైపుణ్యం ఏమైనా అవసరం ఉంటుందా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి గిరిజా సమాధానం ఇస్తూ.. అదంతా మెకానికల్‌గా ఉంటుంది తప్ప..నిజమైన భావాలకు ఏమాత్రం చోటు ఉండదని స్పష్టం చేసిది.‘షూటింగ్‌ సమయంలో సౌండ్‌కి ఇబ్బంది అవుతుందని ఏసీలను సైతం ఆఫ్‌ చేస్తారు. చెమటలు కారుతూనే ఉంటాయి. ఒకరు వచ్చి చెమటలు తూడుస్తుంటారు. మరొకరు వచ్చి హెయిర్‌ని సెట్‌ చేస్తుంటారు. ఇంకోవైపు లైట్‌ సరిగా పడడం లేదంటూ థర్మాకోల్‌ తీసుకొస్తారు.. ఇలా ఇన్ని కళ్లు చూస్తున్నప్పుడు రొమాన్స్‌ ఎక్కడ నుంచి వస్తుంది? అదంతా మెకానికల్‌, టెక్నికల్‌ ప్రాసెస్‌ మాత్రమే. ఆ సీన్లు షూట్‌ చేసేటప్పుడు హీరో ముఖం కంటే ఎక్కువగా సౌండ్‌ ఇంజనీరింగ్‌ ముఖమే గుర్తుకు వస్తుంది’ అని నవ్వుతూ చెప్పింది గిరిజా.ఇక ముద్దు సీన్‌ గురించి మాట్లాడుతూ.. తెరపై కిస్‌ అంటే.. కార్ట్‌బోర్డ్‌ని ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుందని చెప్పింది. క్లోజప్‌ సీన్స్‌ తీసేటప్పుడు ఎదుటివాడు అక్కడ ఉండడు కూడా. కెమెరాని చూస్తూనే నటించాల్సి ఉంటుంది. అక్కడ ఏ మాత్రం ఎమోషన్‌ ఉండదు. చాలా సార్లు నేను కెమెరా దగ్గర ఉన్న ఒక స్టాండ్ లేదా థర్మాకోల్ ముక్కను చూస్తూ రొమాంటిక్ డైలాగులు చెప్పాను’ అని గిరిజా చెప్పుకొచ్చింది.ఎవరీ గిరిజా?స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్‌లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి సినిమా. ఆ తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఇన్‌స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది.

Advertisement
Advertisement