Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Bigg Boss 9 Telugu: Buzz, Pawan Kalyan Padala Won Ticket to Finale1
భరణికి అన్యాయం! కనిపెట్టేసిన తనూజ

టికెట్‌ టు ఫినాలే రేస్‌లో ఒక్కొక్కరూ అవుట్‌ అవుతూ రాగా చివరకు భరణి, సుమన్‌, పవన్‌ కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, రీతూ మిగిలారు. మరి వీరిలో ఎవరు గేమ్స్‌లో పాల్గొన్నారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది గురువారం (డిసెంబర్‌ 4వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..కల్యాణ్‌ విన్నర్‌మొదటగా కలర్‌ గేమ్‌ ఛాలెంజ్‌లో భరణి, రీతూ, కల్యాణ్‌ ఆడారు. ఈ ఆటలో రీతూ గెలిచింది. అయితే రీతూ పూసిన పసుపు కలర్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ తనూజ.. రెడ్‌ కలర్‌ ఎక్కువగా ఉదంటూ కల్యాణ్‌ను విన్నర్‌గా ప్రకటించింది. అతడు తన ప్రత్యర్థిగా సుమన్‌ను ఎంచుకున్నాడు. వీరికి వస్తువులు పగలగొట్టే గేమ్‌ ఇచ్చారు. త్రాసులో ఎవరి వస్తువులు ఎక్కువ బరువుంటే వారే గెలిచినట్లు! టార్గెట్‌ భరణిఈ ఆటలో కల్యాణ్‌ గెలవడంతో సుమన్‌ రేసు నుంచి అవుట్‌ అయ్యాడు. ఇమ్మూ, రీతూ, కల్యాణ్‌.. కలిసి భరణిని టార్గెట్‌ చేశారు. ఇమ్మూ, కల్యాణ్‌.. రీతూను గెలిపించి.. ఆమె భరణితో పోటీపడేలా ప్లాన్‌ చేశారు. వీళ్ల ప్లాన్‌ తిప్పికొట్టేందుకు బిగ్‌బాస్‌ బ్యాలెన్స్‌ గేమ్‌ ఇచ్చాడు. అయినా బిగ్‌బాస్‌నే బురిడీ కొట్టించారిద్దరూ. ఈ గేమ్‌లో కల్యాణ్‌, ఇమ్మూ, రీతూ స్టిక్స్‌ పట్టుకుంటే దానిపై హౌస్‌మేట్స్‌ కాయిన్స్‌ పెట్టాల్సి ఉంటుంది.ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అతడేనా?ఇమ్మూ, కల్యాణ్‌ ముందుగా అనుకున్నట్లుగానే ఓడిపోవడంతో రీతూ గెలిచింది. రీతూ.. భరణిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. వీరికి ట్రయాంగిల్‌- స్క్వేర్‌ అంటూ ఓ గేమ్‌ పెట్టారు. సంజనా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రీతూ గెలిచింది. అయితే తనూజ మాత్రం.. రీతూ పెట్టిన ఓ ట్రయాంగిల్‌ సరిగా లేదని చెప్తుండగా ఎపిసోడ్‌ ముగిసింది. అదే నిజమైతే భరణికి అన్యాయం జరిగినట్లే!

Director Shankar, Suriya Team up for Next Movie2
శంకర్‌ సినిమాలో హీరో సూర్య!

ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటీరెడు అపజయాలతో సినీ ప్రముఖుల పేరు తగ్గిపోదు. దర్శకుడు శంకర్‌ తొలి చిత్రం జెంటిల్‌మెన్‌తోనే ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్‌, బాయ్స్‌, ఇండియన్‌, రోబో, నన్బన్‌ (స్నేహితులు), అన్నియన్‌ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు. బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్స్‌అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఇండియన్‌ 2, గేమ్‌ ఛేంజర్‌ నిరాశపర్చాయి. ఇకపోతే ఈసారి శంకర్‌ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య గ్రీన్‌ సిగ్నల్‌?ఈ సినిమాలో హీరో సూర్య (Suriya) నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్‌ టాక్‌. ఈమేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇంతవరకు శంకర్‌ దర్శకత్వంలో నటించనేలేదు. దీంతో వేల్చారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్‌ రావడం ఖాయం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్‌ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tollywood Celebrities daily social Media updates In Instagram3
శారీలో అనసూయ అందాలు.. అబుదాబిలో బన్నీ ఫ్యామిలీ చిల్..!

మాల్దీవుస్‌ ఫోటోలు షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్..అబుదాబిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ చిల్..వేకేషన్‌లో బిజీగా హీరోయిన్ రీతూ వర్మ..నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్..ఎల్లో శారీలో అనసూయ హోయలు.. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Dil Raju Clarity On Helping To sritej Mediacal Support and family4
రెండు కోట్లు డిపాజిట్ చేశాం.. ఇంకా సాయం కావాలన్నారు: దిల్ రాజు

పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్‌ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. భాస్కర్‌ కుటుంబానికి సాయం, శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించారు. భాస్కర్‌, ఆయన సోదరుడితో కలిసి మాట్లాడారు.దిల్ రాజు మాట్లాడుతూ..'గతేడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో భాస్కర్‌ కుమారుడు శ్రీతేజ్‌ ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్‌ ముందుకు వచ్చి శ్రీతేజ్ పేరుపై రూ.2కోట్లు డిపాజిట్‌ చేశారు. ఆ డబ్బుపై వచ్చే వడ్డీతో నెలకు రూ.75వేలు భాస్కర్‌ కుటుంబ ఖర్చులు, శ్రీతేజ్‌ ఆస్పత్రి బిల్లులకు వినియోగిస్తున్నాం. మిగిలిన మొత్తాన్ని అసలులో కలిపి ఆపై వచ్చే వడ్డీని ఏటా పెంచి అందించేలా ఏర్పాటు చేశాం. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ రూ.75 లక్షలు ఇప్పటికే చెల్లించారు. ఇంకా అదనపు సహకారం కావాలని భాస్కర్‌ అడుగుతున్నారు. ఈ విషయాన్ని బన్నీకి తెలిపా' అని దిల్‌ రాజు అన్నారు. శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ మాట్లాడుతూ.. 'ఆ రోజు నుంచి ఇప్పటివరకూ అల్లు అర్జున్‌, బన్నివాస్‌ల సపోర్ట్‌ ఉంది. ఇంకా అదనపు సాయం కావాలని దిల్ రాజు సార్‌కు చెప్పా. బాబుకు ఆర్నెల్ల పాటు రిహాబిలిటేషన్‌ కొనసాగాల్సి ఉంది. ఇదే విషయాన్ని దిల్‌రాజు దృష్టికి తీసుకొచ్చాం. అందుకు అవసరమైన వైద్య ఖర్చులు గురించి కూడా చెప్పా. అల్లు అర్జున్‌ సార్‌తో మాట్లాడినందుకు దిల్‌ రాజుకు ధన్యవాదాలు' అని అన్నారు.Facts r facts Icon star @AlluArjun has already extended his support to Sritej, contributing a total of ₹3.20 Crores so far, including a fixed deposit of ₹1.5 Crores for the boy’s future. When Sritej’s father recently reached out again for additional financial help, #DilRaju… pic.twitter.com/0mHSu4NXCP— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 4, 2025

This Friday Ott Release Movies list Goes Viral 5
ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్!

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద హడావుడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంటాయి. ఈ వారం టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ నటించిన అఖండ-2 బాక్సాఫీస్ సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌ రిలీజవుతోంది. రెండు కూడా అగ్ర హీరోలు కావడంతో సినీ ప్రియుల్లోనూ అదేస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు.. థియేటర్‌ మూవీస్‌తో పాటు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంటాయి. అలా ఈ శుక్రవారం పలు సూపర్ హిట్ మూవీస్ రెడీ అయిపోయాయి. వీటిలో రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వీటితో పాటు ధూల్ పేట్‌ పోలీస్ స్టేషన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్‌, డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05 జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05 స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05 ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05 ది నైట్ మై డాడ్ సేవ్‌డ్ క్రిస్ట్‌మస్‌-2-డిసెంబరు 05ది బ్యాడ్ గాయ్స్- బ్రేకింగ్ ఇన్- (యానిమేషన్ సిరీస్)- డిసెంబర్ 06ఆహా ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05జియో హాట్‌స్టార్ డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05జీ5 ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05 ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05 బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05 పరియా(బెంగాలీ యాక్షన్‌ థ్రిల్లర్)- డిసెంబరు 05సోనీ లివ్ కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05సన్ నెక్స్ట్ అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05ఆపిల్ టీవీ ప్లస్ ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05

kollywood hero suriya tears and tribute to avm Producer saravanan6
నిర్మాత కన్నుమూత.. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రముఖ నిర్మాత శరవణన్ పార్థీవదేహనికి నివాళులర్పించిన ఆయన.. తనలోని బాధను ఆపుకోలేకపోయారు. శరవణన్ మృతిని తలచుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దిగ్గజ నిర్మాతగా శరవణన్.. నిర్మాత శరవణన్ మృతితో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 వందల సినిమాలను నిర్మించారు. ఏవీఎం ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించారు. ఎంజీఆర్‌, శివాజీ, జెమిని గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో వంటి లెజెండరీలు.. విక్రమ్‌, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో నటించారు.ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్‌. ఆయన శరవణన్‌ తండ్రి. మద్రాస్‌(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్‌ తొలినాళ్లలో సరస్వతి సౌండ్‌ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్‌ లిమిటెడ్‌, ప్రగతి స్టూడియోస్‌.. మేయప్పన్‌( ఏవీ మేయ్యప్ప చెట్టియార్‌) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్‌ తర్వాత శరవణన్‌ ఆ ప్రొడక్షన్‌ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. #WATCH | Tamil actor Suriya paid his respects to veteran producer AVM Saravanan at AVM Studio in Vadapalani. Suriya had worked in two of his hit films, Perazhagan and Ayan, under the AVM banner. Saravanan, who shaped generations of Tamil cinema, passed away at the age of 86.… pic.twitter.com/nAvEEnhEnQ— The Federal (@TheFederal_News) December 4, 2025

Akhanda 2: Thandavam Premiere Shows Cancel7
‘అఖండ- 2’ ప్రీమియర్‌ షోలు రద్దు

నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌. అఖండ 2:తాండవం ప్రీమియర్స్‌ షోలు క్యాన్సిల్‌ అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రిమియర్స్‌ పడాల్సింది. కానీ సాంకేతిక కారణంగా ప్రీమియర్స్‌ షోలని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ 2(Akhanda 2) . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతు వచ్చిన ఈ చిత్రం రేపు(డిసెంబర్‌ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే డిసెంబర్‌ 4న ప్రీమియర్స్‌ వేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఏపీలో బుకింగ్స్‌ కూడా ఓపెన్‌ చేశారు. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్స్‌ బాలయ్య బొమ్మ పడుతుందని ఆశించిన అభిమానులకు చివరి నిమిషంలో మేకర్స్‌ షాకిచ్చారు. “ఈరోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్” అంటూ నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ట్వీట్‌ చేసింది. అయితే ఓవర్సీస్‌లో మాత్రం యాథావిధిగా ప్రీమియర్స్‌ షోలు ఉంటాయని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. #Akhanda2 Premieres scheduled for today are canceled due to technical issues. We've tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025

The Hunter Chapter 1 streaming on This ott from Today  8
సడన్‌గా ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే?

వైభవ్ కీలక పాత్రలో నటించిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'రణం అరం తవరేల్'. ఈ సినిమాకు షరీఫ్ దర్శకత్వం వహించారు. గతేడాది ఫిబ్రవరిలో తమిళంలో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ అభిమానులను ఆకట్టుకుంది. తమిళంలో హిట్ కావడంతో తెలుగులో ది హంటర్‌: చాప్టర్‌-1 పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది.తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారు ది హంటర్‌: చాప్టర్‌-1 చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక నగరంలో జరిగిన వరుసగా హత్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఆ వరుస హత్యల వెనకున్న ప్రధానమైన కారణం ఏమిటి? అనేది అసలు కథ.

Aadhi Pinisetty Madonna Sebastian Drive Teaser Movie out now9
టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. టీజర్ వచ్చేసింది..!

ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ జంటగా నటించిన థ్రిల్లర్‌ మూవీ డ్రైవ్. ఈ మూవీకి జెనూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఇవాళ రిలీజైన టీజర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సీన్స్ చూస్తే ఫుల్ గ్రిప్పింగ్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్‌ను తలపించేలా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ యోహాన్ కురువిల్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఓషో వెంక‌ర్ సంగీతమందించారు.

Ilayaraja And Mythri Movie Copy Right Issue Settlement10
ఇళయరాజాతో మైత్రీ మూవీస్‌ సెటిల్మెంట్ చేసుకుందా..?

సంగీత దర్శకుడు ఇళయరాజా, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన డ్యూడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలను ఉపయోగించారు. దీంతో కాపీరైట్స్‌ వివాదం తలెత్తింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఇళయరాజా పాత పాటలను తన అనుమతి లేకుండా ఉపయోగించారని అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఇళయరాజాతో మైత్రీ మూవీస్‌ సయోధ్య కుదుర్చుకున్నట్లు సోషల్‌మీడియాలో కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఆయన పాటలను ఉపయోగించినందుకు గాను రూ.50 లక్షలు చెల్లించడానికి మైత్రీ మూవీస్‌ అంగీకరించినట్లు స‌మాచారం. అందుకోసం ఇళయరాజాకు సంబంధించిన న్యాయవాధిని వారు సంప్రదించారట. అయితే, ఈ అంశంపై అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.

Advertisement
Advertisement