ప్రధాన వార్తలు
బయోపిక్లో తమన్నా.. ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా తమన్నా భాటియా సత్తా చాటుతుంది. తాజాగా ఆమె ఒక బయోపిక్లో హీరోయిన్గా ఎంపికైంది. ఈమేరకు ఒక పోస్టర్ను షేర్ చేశారు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్ వి.శాంతా రామ్ జీవితం వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే. ‘వి.శాంతారామ్: ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా’ టైటిల్తో ఈ బయోపిక్ రానుంది. సిద్ధాంత్ చతుర్వేది ఆయన పాత్రలో నటించనున్నారు. ఈ బయోపిక్లో తమన్నా భాగమైంది.అభిజీత్ శిరీష్ దేశ్పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరితా అశ్విన్ వర్దే నిర్మించనున్నారు. వి.శాంతారామ్ సతీమణి జయశ్రీ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన శాంతారామ్ మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించగా.. సుమారు 90 సినిమాలు నిర్మించారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించారు.The star of an era ✨The strength behind a legacy 🎞️A chapter returning to history. 🌟@SiddyChats #SubhashKale @unbollywood @rajkamalent @SaritaTanwar #VShantaram #TheRebelOfIndianCinema pic.twitter.com/YtEdBiSAGr— Tamannaah Bhatia (@tamannaahspeaks) December 9, 2025
నాకు 33 ఏళ్లు.. అందుకే ఎగ్ ఫ్రీజింగ్: రియా చక్రవర్తి
2020లో హిందీ చిత్రపరిశ్రమ ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. వారిలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి సెలబ్రిటీలున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మాత్రం వార్తల్లో సంచలనమైంది. అతడి ఆత్మహత్యకు ప్రేయసి రియా చక్రవర్తి కారణమంటూ నెట్టింట సదరుహీరోయిన్పై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. జైలుకుఅలాగే సుశాంత్ మృతి కేసులో ఆమె అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయితే అతడి మరణానికి రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదంటూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రియాకు ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ఆమె పాడ్కాస్ట్తో పాటు చాప్టర్ 2 డ్రిప్ పేరిట బట్టల బిజినెస్ మొదలుపెట్టింది. ఈరోజు ఆ బ్రాండ్ విలువ రూ.40 కోట్లుగా ఉంది.ఎగ్ ఫ్రీజింగ్తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు 33 ఏళ్లు. ఈ మధ్యే గైనకాలజిస్ట్ను కలిశా.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే ఓపక్క కెరీర్లో సెట్ అవ్వాలి. మరోపక్క సామాజిక ఒత్తిడి. మన శరీరం ఓ వయసు రాగానే పిల్లల గురించి ఆలోచించమని చెప్తుంది. కానీ మనసు మాత్రం.. నీ బిజినెస్, బ్రాండ్, కెరీర్.. అవే పిల్లలని, వాటి ఎదుగుదల గురించి ఫోకస్ చేయమని చెప్తుంది. నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. సినిమాఅందుకే ఇప్పుడే పెళ్లి, ఫ్యామిలీ అని ఆలోచించదల్చుకోలేదు. కాకపోతే ఎగ్ ఫ్రీజింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. రియా చక్రవర్తి (Rhea Chakraborty).. తూనీగ తూనీగ అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్ కీ మారుతి, సోనాలి కేబుల్, జిలేబి, చెహరె సినిమాలు చేసింది. దొబారా, హాఫ్ గర్ల్ఫ్రెండ్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది.చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్... రజనీకాంత్ ఏమన్నారంటే?
జపాన్లో భారీ భూకంపం.. ప్రభాస్ గురించి మారుతి ట్వీట్
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. అమోరి, ఇవాటే, హొక్కైడో ద్వీపానికి సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. రిక్టర్ స్కేల్పై 7.5 నుండి 7.6 వరకు నమోదైంది. దీంతో సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రభాస్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. జపాన్లో భూకంపం సంభవించినట్లు వార్తలు రావడంతో ప్రభాస్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి సోషల్మీడియాలో ఫ్యాన్స్కు చల్లని వార్త ఇచ్చారు.దర్శకుడు మారుతి తన ఎక్స్ పేజీలో ప్రభాస్ ఫ్యాన్స్కు భరోసా ఇచ్చారు. "డార్లింగ్ (ప్రభాస్)తో మాట్లాడాను. అతను టోక్యోలో లేడు. ఎవరూ ఆందోళన చెందవద్దు. చాలా సురక్షితంగా ఉన్నాడు. చింతించకండి" అని ఆయన రాశారు. ఆయన సందేశం అందరికీ భరోసా ఇచ్చింది. అయితే, ప్రభాస్ త్వరగా ఇండియా తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు.ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం బాహుబలి: ది ఎపిక్ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనల కోసం జపాన్లో ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయింది. అక్కడి అభిమానులతో సరదాగా సంభాషించారు. భూకంపం గురించిన నివేదికలు వైరల్ అయిన తర్వాత వారు అందరూ అలెర్ట్ అయ్యారని సమాచారం.
నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్.. సీక్వెల్కు ప్లానింగ్
రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాల్లో నరసింహ (తమిళంలో పడయప్ప) ఒకటి. 1999లో విడుదలైన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. థియేటర్లు కిక్కిరిసిపోయాయి. భారీ కలెక్షన్స్తో బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఈ మూవీలో నరసింహ పాత్రతో పాటు నీలాంబరి పాత్ర కూడా అంతే ఫేమస్ అయింది.25 ఏళ్ల తర్వాత రిలీజ్ఈ సినిమా 25 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోంది. రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో రజనీ తన సినిమాకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు. రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆడవాళ్లు గేట్లు బద్దలు కొట్టుకుని మరీ థియేటర్ వచ్చి నరసింహ చూశారు. ఇలాంటి సంఘటన నా 50 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ చూడలేదు. నరసింహ సీక్వెల్జైలర్, రోబో వంటి ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ చూస్తున్నాం.. అలాంటప్పుడు నరసింహకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు అనిపించింది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. దానికి నీలాంబరి అని టైటిల్ పెట్టాలనుకుంటున్నాం. నరసింహకథ నేనే రాశాను. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవలలో నందిని పాత్ర ఆధారంగా నీలాంబరి పాత్ర రాసుకున్నాను. నా స్నేహితుల పేర్లతో నిర్మించాను. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు. కేవలం ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలనేదే నా ఉద్దేశం. ఐశ్వర్యరాయ్ ఫస్ట్ ఛాయిస్ఈ మూవీలో నీలాంబరి పాత్ర కోసం ముందుగా ఐశ్వర్యరాయ్ను అనుకున్నాం. తనకోసం రెండుమూడేళ్లైనా ఎదురుచూడాలనుకున్నాం. కానీ ఆమెకు ఆసక్తి లేదని తెలిసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్.. ఇలా చాలా పేర్లు అనుకున్నాం. అప్పుడు దర్శకుడు రవికుమార్ రమ్యకృష్ణ పేరు సూచించాడు. మొదట్లో తను చేయగలదా? అనుకున్నాను. కానీ చివరకు తను అద్భుతంగా నటించింది. క్లైమాక్స్లో మైసూర్ వేలాది మందితో సీన్ షూట్ చేశాం.ఆమె కూడా..జయలలితను ఆదర్శంగా తీసుకుని నీలాంబరి పాత్ర డిజైన్ చేసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో ఆమె సినిమా చూడాలని ఆశపడింది. అలా తనకోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా.. ఆమెకు సినిమా చాలా బాగా నచ్చింది. అప్పటి సీఎం కలైంగర్ కరుణానిధి కూడా సినిమా చూశాడు అని రజనీకాంత్ (Rajinikanth) చెప్పుకొచ్చాడు.చదవండి: నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా
బిగ్బాస్
పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా..
తల్లయిన బిగ్బాస్ సోనియా.. పోస్ట్ వైరల్
కొత్త కెప్టెన్గా భరణి.. ఆమె జైలుకు!
రీతూ ఎలిమినేషన్కు కారణాలివే! అదే ప్లస్సు, మైనస్!
ఓడిపోయానంటూ ఏడ్చిన రీతూ.. టాప్ 5 వీళ్లేనంటూ..
బిగ్బాస్ నుంచి 'రీతూ' ఎలిమినేట్.. విన్నర్ రేంజ్లో రెమ్యునరేషన్
టార్గెట్ 'తనూజ'.. బిగ్బాస్ ఇదేం 'ట్రై యాంగిల్'
పెళ్లి చేసుకున్న తనూజ చెల్లి.. ఫోటో వైరల్
తనూజకు క్లాస్ పీకిన నాగ్.. వాళ్లు ట్రోఫీకి అనర్హులు!
A to Z
'బెడ్రూమ్ వీడియో ల్యాప్టాప్లో బంధిస్తే'.. నునాకుజి మూవీ చూడాల్సిందే!
ఓటీటీలు వచ్చాక సినిమాల పరంగా కంటెంట్కు కొదువే లేద...
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
చాలా సినిమాలు థియేటర్లలో రిలీజై ఆపై ఓటీటీలోకి వస్త...
ఎన్ఆర్ఐల కోసం మరో ఓటీటీలో 'డీయస్ ఈరే' స్ట్రీమింగ్
మలాయళ సూపర్స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ నటి...
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
తెలుగులో పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్స్.. విడుదలకు మ...
రాత్రిపూట మనోజ్ ఫోన్ కాల్.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్ నటుడు
సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్గా చూస...
బాక్సాఫీస్ వద్ద దురంధర్ దూకుడు.. మూడు రోజుల్లోనే సెంచరీ!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్...
హిందీ ‘బిగ్బాస్ 19’ విజేత గౌరవ్.. ప్రైజ్ మనీ ఎంతంటే..
హిందీ ‘బిగ్బాస్ 19’ ముగిసింది. ఈ సీజన్లో గౌరవ్...
స్టార్ డైరెక్టర్తో సినిమా.. రూమర్స్పై స్పందించిన అమిర్ ఖాన్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూలీ మూవీ...
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్.. వేదికలు ఇవే..!
హైదరాబాద్ గ్రాండ్ ఈవెంట్కు వేదికగా నిలవనుంది. ప్...
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ...
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంక...
ప్రియాంక పీఆర్ స్టంట్? వాళ్లు నిజమైన ఫ్యాన్స్ కాదా?
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ ప్లీజ్ అని జనాల...
మరింత గ్లామరస్గా ఆదితిరావు హైదరీ.. బ్లాక్ బ్యూటీలా మృణాల్ ఠాకూర్..!
క్రిస్మస్ మూడ్లో హీరోయిన్ శృతిహాసన్..మరింత బ్యూ...
చిన్నారికి మెగా దంపతుల ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్ చైన్తో పాటు..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గ...
'ప్రభాస్ ఇప్పటికీ సిగ్గుపడతాడు'.. మంగళవారం బ్యూటీ క్యూట్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్కు టాలీవుడ్లోనూ ఫ...
దుబాయి యూట్యూబర్తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి
హీరోయిన్ సమంత.. గతవారం పెళ్లి చేసుకుంది. దర్శకుడు ...
ఫొటోలు
Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)
యూత్ను గ్లామర్తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)
తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ 'ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
ముంబైలో లైఫ్ స్టైల్ ఆసియా అవార్డ్స్ 2025.. సందడిగా సినీ తారలు (ఫోటోలు)
‘గుర్రం పాపిరెడ్డి’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)
సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్గా నజ్రియా (ఫొటోలు)
Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)
నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)
మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)
గాసిప్స్
View all
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు.. ‘స్పిరిట్’ కోసం అన్ని కోట్లా?
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి
నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్కు ముందే సంచలనం!
రివ్యూలు
View all
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
2
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
3
‘కాంత’ మూవీ రివ్యూ
సినీ ప్రపంచం
కూలీగా మారిన హీరో.. నెట్టింట వీడియో వైరల్
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవారి పరిస్థితి కూడా అంతే! ఎప్పుడు? ఎలా? ఉంటుందో వారికే తెలియదు. కన్నడ హీరో అభిషేక్ హెచ్.ఎన్. పరిస్థితి కూడా అంతే.. కథానాయకుడిగా బిగ్స్క్రీన్పై మెప్పించిన ఆయన ఇప్పుడు రోజువాలీ కూలీగా మారాడు. దీని గురించే నేటి ప్రత్యేక కథనం..తిథిరామ్ రెడ్డి అనే యువకుడు 'తిథి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 101 ఏళ్ల వృద్ధుడు సెంచరీ గౌడ చనిపోయాక 11 రోజులకు కర్మ (తిథి) చేయాలి. తిథి చేసే క్రమంలో ఎదురైన ఇబ్బందులేంటి? అసలు సెంచరీ గౌడ మూడు తరాల వారు ఏం చేస్తున్నారు? ఏంటి? అనేదే కథ.జాతీయ అవార్డుపల్లె వాతావరణంలో ఎంతో సహజంగా తెరకెక్కించిన ఈ సినిమాకు కర్ణాటక రాష్ట్ర అవార్డులతో పాటు పలు ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై పురస్కారాలు అందుకుంది. అలాగే జాతీయ అవార్డు సాధించడం విశేషం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ డైరెక్టర్ ద ఫేబుల్ (జుగ్నుమా) సినిమా తెరకెక్కించగా ఆ చిత్రానికి సైతం మంచి ప్రశంసలు దక్కాయి.కూలీగా మారిన హీరోఇకపోతే తిథి మూవీలో హీరోగా నటించిన కన్నడ నటుడు అభిషేక్ (Abhishek H. N.) జీవితం మాత్రం ఏమీ మారకపోగా మరింత అద్వాణ్నంగా మారినట్లు తెలుస్తోంది. సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన అభిషేక్ ప్రస్తుతం దుంగలు మోసే కూలీగా మారాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో అతడు మాసిన చొక్కాతో ఎడ్లబండిపై దుంగల పక్కన నిలబడ్డాడు. పొట్టకూటి కోసం..ఇతడు తిథితో పాటు తర్లె విలేజ్ (2016), హల్లి పంచాయితీ(2017) అనే సినిమాలు చేశాడు. మూడు సినిమాల్లో హీరోగా చేసినా అతడికి అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలేశాడు. పొట్టకూటి కోసం కూలీ అవతారమెత్తాడు. ఇది చూసిన జనాలు... టాలెంట్ ఉన్నవారిని ఎందుకు ఆదరించరు? అని కామెంట్లు చేస్తున్నారు. Heartbreaking: Abhi, the unforgettable lead from the National Award-winning Kannada masterpiece “Thithi”, is now working as a daily wage labourer to make ends meet.From stealing the screen to struggling for survival this is the reality for many of our brilliant artists. 💔… pic.twitter.com/xSz78ZqCsU— ಸನಾತನ (@sanatan_kannada) December 7, 2025 చదవండి: నేనే దురదృష్టవంతుడిని.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
పాకిస్తాన్లో అలాంటివేవి లేవు.. ‘దురంధర్’పై హిలేరియస్ రివ్యూ
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మించిన సినిమా ‘దురంధర్’ విడుదలై రోజులు గడుస్తోంది. పాకిస్థాన్లో ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ఓ భారతీయ ఐబీ అధికారి చేసిన ప్రయత్నమే ఈ దురంధర్(Dhurandhar Movie) కథ. సినిమాపై పబ్లిక్ టాక్ భిన్నంగా ఉన్నప్పటికీ అదేదో బలూచిస్తాన్ పాటకు అక్షయ్ ఖన్నా చేసిన డ్యాన్స్పై మాత్రం ఇంటర్నెట్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్పై రకరకాల రీళ్లూ ప్రత్యక్షమవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ రివ్యూ చేశాడు. దురంధర్ సినిమా చూసిన పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఈ రివ్యూ సారాంశం... ఇంతకీ అతగాడు ఏమంటాడంటే...‘‘అయ్యా... దురంధర్ సినిమా ఇప్పుడే చూశా. బాబులూ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా.. సినిమాలో మీరు చూపించినవి ఏవీ పాకిస్థాన్లో లేవు. ఒకొక్కటి.. ప్రతి ఒక్కటీ అబద్ధం. అందులో రణ్వీర్ సింగ్ ఓ మోటర్ సైకిల్ నడుపుతూంటాడు. అలాంటిది పాకిస్థాన్ మొత్తమ్మీద లేదంటే నమ్మండి. నాయనలారా! ఇంత అత్యాచారాలకు పాల్పడకండి సారూ. స్పె్లండర్ బైక్నే సూపర్ బైక్ అనుకునే రకాలం మేము. అట్లాంటిది.. మీరు ఆ సినిమాలో ఏమేమో చూపించేశారు. కరాచీలో అండర్పాస్ ఉన్నట్లు చూపారు. ఊహూ... ఎక్కడా అలాంటిది లేదయ్యా.. మాకున్న అండర్పాస్లు అన్నీ భారత్ సరిహద్దుల్లోనే.. అది కూడా ఉగ్రవాదులను ఇటు నుంచి అటుకు పంపేందుకు మాత్రమే. అయ్యో... స్క్రిప్ట్లో లేని విషయమూ చెప్పేశానే. కొంచెం మరచిపోండేం! మిగిలిన విషయాలంటారా?... మేజర్ ఇక్బాల్, రెహ్మాన్ డెకాయిట్, 26/11... వంటివేవీ మేము చేయలేదు. ఒట్టు. ఏంటి అవన్నీ నిజమే అంటావా? లేదు సారు.. అవన్నీ పచ్చి అబద్ధాలు.’’కోనసీమ వెటకారానికి మించిన హిలేరియస్ రివ్యూ ఇది. మీరూ ఒకసారి చూసేయండి మరి. View this post on Instagram A post shared by Sanchit Pulani (@sanchitpulani)
ఆ కల నెరవేరదేమో! దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
ఫస్ట్ సినిమాకే జాతీయ అవార్డు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. కలర్ ఫోటో చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు సందీప్ రాజ్. తర్వాత గుడ్ లక్ సఖి, ముఖచిత్రం వంటి మూవీస్కు రచయితగా పని చేశాడు. అలాగే కొన్ని చిత్రాల్లో నటుడిగానూ మెప్పించాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా రెండో సినిమా చేస్తున్నాడు సందీప్. అదే "మోగ్లీ".మోగ్లీ వాయిదా?యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా, సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కానుంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 12న అఖండ విడుదల చేస్తే మోగ్లీకి పెద్ద దెబ్బ పడటం ఖాయం! దీంతో ఈ మూవీని పోస్ట్పోన్ చేసుకోక తప్పేలా లేదు.మరో దర్శకుడు తీయాల్సిందిఈ క్రమంలో దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలు నేను కాకుండా మరో డైరెక్టర్ తీయాల్సింది. సినిమా అంటే పడిచచ్చేవాళ్లు, వృత్తిపై నిబద్ధత ఉన్నవారే ఈ రెండు సినిమాల్లో భాగమయ్యారు. ఈ రెండు చిత్రాల్లోని కామన్ పాయింట్స్ ఏంటో తెలుసా?దురదృష్టవంతుడిని1. అంతా బాగా జరుగుతుందనుకునే సమయంలో వాటి రిలీజ్ విషయంలో దురదృష్టాన్ని ఎదుర్కోవడం.. 2. ఆ దురదృష్టం నేనేనేమో! నాక్కూడా అలాగే అనిపిస్తోంది. దర్శకత్వం- సందీప్ రాజ్ అన్న టైటిల్ను థియేటర్లో చూసుకోవాలన్న నా కల రోజురోజుకీ మరింత కష్టమవుతోంది. వెండితెరకు నేనంటే ఇష్టం లేదేమో! ఎంతో చెమటోడ్చి, రక్తం చిందించి, ప్యాషన్తో మోగ్లీ సినిమా చేశాం. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డీఓపీ మారుతి, భైరవ.. ఇలా అందరూ ఎంతగానో కష్టపడ్డాం. కనీసం వారికోసమైనా మోగ్లీకి మంచి జరగాలని ఆశిద్దాం అని సందీప్ రాజ్ రాసుకొచ్చాడు. Maybe Colour Photo and Mowgli deserved another DIRECTOR instead of me. These movies were made by a group of passionate people who can do anything for their profession.The common points between both films are:1. Facing bad luck with their release, just when everything seemed to…— Sandeep Raj (@SandeepRaaaj) December 9, 2025చదవండి: ప్రియుడితో బ్రేకప్.. పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది హీరోయిన్ నివేదా పేతురాజ్. మధురైలో పుట్టి దుబాయ్లో పెరిగిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఆగస్టులో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్తో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామని గుడ్న్యూస్ చెప్పింది.బ్రేకప్కానీ ఈ పెళ్లి పట్టాలెక్కేట్లు కనిపించడం లేదు. వీరిద్దరూ జంటగా కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేకాదు, నివేదా, రజిత్ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు. దీంతో క్రికెటర్ స్మృతి మంధానలాగే వీరి పెళ్లి కూడా రద్దయినట్లే అని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నివేదా పేతురాజ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమానివేదా పేతురాజ్.. ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మెంటల్ మదిలో మూవీతో తెలుగులో రంగప్రవేశం చేసింది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, పాగల్, దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాల్లో నటించింది. ఓటీటీలో పరువు, కాలా అనే వెబ్ సిరీస్లలో యాక్ట్ చేసింది. ఒకానొక సమయంలో కాల్షీట్స్ సమస్య కారణంగా జూనియర్ ఎన్టీఆర్తో నటించే ఛాన్స్ చేజార్చుకుంది.చదవండి: పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఢీల్.. మనకు 'సినిమా'నేనా..?
హాలీవుడ్కు పునాది లాంటి వార్నర్ బ్రదర్స్తో నెట్ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్ను కొనుగోలుకు నెట్ఫ్లిక్స్ భారీ ధరనే కోట్ చేసింది. ఏకంగా రూ. 6.50లక్షల కోట్లకు డీల్ సెట్ చేసుకుంది. హాలివుడ్లో ఎంతో విలువైన కంపెనీగా కొనసాగుతున్న నెట్ఫ్లిక్స్ ఈ రేంజ్లో కొనుగోలు చేపట్టడం ఇదే తొలిసారి.ఇండియన్ సినిమాలో పెను మార్పులుఈ డీల్ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియన్ సినిమా పరిశ్రమలో పెను మార్పులు తెస్తుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్కు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇకనుంచి నెట్ఫ్లిక్స్ ( Netflix) దీర్ఘకాలిక థియేట్రికల్ రన్స్కి ప్రాధాన్యం ఇవ్వదు. అంటే ఎంతపెద్ద సినిమా అయినా సరే కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురానుంది. 6–8 వారాల థియేట్రికల్ రన్స్ అనే రూల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఉండకపోవచ్చు. అయితే, థియేటర్లలో విడుదలలు కొనసాగుతాయని నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. కానీ, విడుదల అయ్యే థియేటర్స్ సంఖ్య తప్పకుంగా తగ్గుతుంది. కేవలం మల్టీఫ్లెక్స్లలో మాత్రమే సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. దీంతో చిన్న సినిమాలకు మరింత గడ్డుపరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.వార్నర్ బ్రదర్స్ స్ట్రీమింగ్ జెయింట్స్ స్టూడియోలను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేస్తే.., థియేటర్లకు నిరంతర సినిమాల సరఫరా తగ్గిపోతుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) హెచ్చరించింది. నెట్ఫ్లిక్స్కు ఇండియన్ సినిమా నుంచి మంచి మార్కెట్ ఉంది కాబట్టి వారి వ్యాపార దృష్టి ఇక్కడ తప్పకుండా పడుతుందని పేర్కొంది. అదే జరిగితే భారత్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్కు మరింత ప్రమాదమని తెలిపింది. ఇక నుంచి పెద్ద స్టూడియో సినిమాలను నెట్ఫ్లిక్స్ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో మల్టీఫ్లెక్స్ (PVR, INOX) వంటి వాటితో తమ స్టూడియోలతో డీల్ చేసుకోవచ్చు. కానీ, చిన్న థియేటర్స్కి ఆ అవకాశాలు తక్కువ. నెట్ఫ్లిక్స్కు అలవాటు పడినప్పుడు రానురాను పెనుమార్పులు వస్తాయి. థియేటర్స్ ఎక్సిపీరియన్స్ తగ్గిపోవడం వంటి జరుగుతాయి. దీంతో మల్టీఫ్లెక్స్లు ఎదోలా కొనసాగినప్పటికీ చిన్న థియేటర్స్ మూతపడే ప్రమాదం ఉంది. పెద్ద స్టూడియో సినిమాలు లేకపోతే సింగిల్ థియేటర్స్ నడవడం కష్టం అవుతుంది. ఆపై OTTలో త్వరగా సినిమాలు వస్తే.., థియేటర్కి వెళ్లే ఉత్సాహం కూడా ప్రేక్షకులలో తగ్గుతుంది.థియేటర్స్ రిలీజ్ అవసరమేనెట్ఫ్లిక్స్ ఎంత స్ట్రాంగ్ పుంజుకున్నా సరే థియేటర్ ఇండస్ట్రీని నాశనం చేయలేదు. అవెంజర్స్, బ్యాట్మెన్ గాడ్జిల్లా డ్యూన్ వంటి సినిమాలు ఇంట్లో కూర్చొని చూడలేం. ఇలాంటివి పెద్ద స్క్రీన్లోనే చూసేందుకు ఇష్టపడుతారు. నెట్ఫ్లిక్స్కు కూడా థియేటర్స్ రిలీజ్ ఉంటేనే మేలు అనుకుంటుంది. పెద్ద స్క్రీన్లో సినిమా విడుదలైతేనే తన మార్కెట్కు మరంతి బలం చేకూరుతుంది. సులువుగా ఆ చిత్రానికి ప్రమోషన్ దొరుకుతుంది. అందుకే నెట్ఫ్లిక్స్ కూడా థియేటర్లలో విడుదలలు కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.
జవాన్లపై పాట అభినందనీయం
‘‘దేశం కోసం దేనికైనా సిద్ధమైన జవాన్లపై ‘దీక్ష’ చిత్రంలో ఒక పాట పెట్టడం అభినందనీయం. మనం క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం దేశ జవాన్లే. నిర్మాతలు తమ సినిమాల్లో జవాన్లను సపోర్ట్ చేస్తూ చూపించాలి’’ అని నటుడు సుమన్ తెలిపారు. కిరణ్ హీరోగా, అలేఖ్య రెడ్డి, ఆక్సా ఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దీక్ష’. డీఎస్ రెడ్డి సమర్పణలో ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో పి.అశోక్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ–‘‘దేశం కోసం ్ర΄ాణాలర్పించిన మురళి నాయక్కు ఒక ΄ాటని మా సినిమా ద్వారా అంకితం చేశాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు తుమ్మల ప్రసన్నకుమార్, డీఎస్ రెడ్డి, సి. కల్యాణ్, నటీనటులు ఆక్సా ఖాన్, మౌనిక రెడ్డి, కిరణ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వైస్ చైర్మన్ ఎత్తరి గురురాజ్, జనరల్ సెక్రటరీ స్నిగ్ధ రెడ్డి ΄ాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
ఏంటో.. బిగ్బాస్ షోలో ఒక్క సీజన్లో ఒక్కో కార్డు వాడుతున్నారు. ఏడో సీన్లో రైతు బిడ్డ.. జై కిసాన్ అంటూ పల్లవి ప్రశాంత్ను పైకి లేపారు. ఈ సీజన్లో పవన్ కల్యాణ్ను ఆర్మీ జవాను.. జై జవాన్ అంటూ బోలెడంత హైప్ ఇస్తున్నారు. ఆఖరికి నాగార్జున సైతం రెండుసార్లు కల్యాణ్కు ఆర్మీ సెల్యూట్ చేశాడు. అతడు కూడా హోస్ట్కు రివర్స్లో సెల్యూట్ చేశాడు.డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారుఅయితే కల్యాణ్ ఆర్మీ జవానే కాదంటున్నాడో సైనికుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎస్జే సుందర్ అనే జవాన్ మాట్లాడుతూ.. 89 రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడు. వారిని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. కల్యాణ్ బిగ్బాస్కు వచ్చి 90 రోజులవుతోంది. అంటే అతడిని డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారు. ఈరోజుతో అతడు సోల్జర్ ఐడెంటిటీని కోల్పోయాడు. ఇప్పుడతడు కామన్ మ్యాన్ మాత్రమే!సెల్యూట్ కొట్టరు మరో ముఖ్య విషయం.. అతడు ఇండియన్ ఆర్మీ కాదు, సీఆర్పీఎఫ్ అని పేర్కొన్నారు. దీనిపై కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆయన లీవ్ పెట్టుకునే వచ్చాడు, మీరు కావాలనే నెగెటివ్ చేస్తున్నారని ఆగ్రహించారు. దీనికి సుందర్ స్పందిస్తూ.. నిజమైన ఆర్మీ జవాన్ ఎప్పుడూ బిగ్బాస్ లాంటి షోలో సెల్యూట్ కొట్టరు అని క్లారిటీ ఇచ్చారు. పెళ్లికే లీవ్ ఇవ్వరుమరో వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సైనికుడికి లీవ్ దొరకడం చాలా కష్టం. తన పెళ్లి కోసం లీవ్ అడిగితే కూడా.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమంత అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అని చెప్తుంటారు. మరో విషయం.. కల్యాణ్ ముందే రిజైన్ చేసి ఉండాలి, లేదంటే ఇప్పుడైనా తనన డిస్మిస్ చేసుండాలి. ఎవరికి పడితే వారికి సెల్యూటా?ఆయన మూడు సంవత్సరాలు సేవలందించానని చెప్పాడు. కానీ, అది నిజం కాదు.. తొమ్మిది నెలలు ట్రైనింగ్, ఆరు నెలలపాటు డ్యూటీ చేసి వచ్చేశాడు. సోల్జర్ భారతీయ జెండాకు లేదా కమాండర్కు మాత్రమే సెల్యూట్ కొడతాడు. ఎవరికి పడితే వారికి కాదు అన్నారు. మరి కల్యాణ్ బయటకు వచ్చాక ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by jadde sundara Rao (@sj_______sundar) చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్.. రజనీకాంత్ చెప్పిన విశేషాలు
బయోపిక్లో తమన్నా.. ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా తమన్నా భాటియా సత్తా చాటుతుంది. తాజాగా ఆమె ఒక బయోపిక్లో హీరోయిన్గా ఎంపికైంది. ఈమేరకు ఒక పోస్టర్ను షేర్ చేశారు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్ వి.శాంతా రామ్ జీవితం వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే. ‘వి.శాంతారామ్: ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా’ టైటిల్తో ఈ బయోపిక్ రానుంది. సిద్ధాంత్ చతుర్వేది ఆయన పాత్రలో నటించనున్నారు. ఈ బయోపిక్లో తమన్నా భాగమైంది.అభిజీత్ శిరీష్ దేశ్పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరితా అశ్విన్ వర్దే నిర్మించనున్నారు. వి.శాంతారామ్ సతీమణి జయశ్రీ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన శాంతారామ్ మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించగా.. సుమారు 90 సినిమాలు నిర్మించారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించారు.The star of an era ✨The strength behind a legacy 🎞️A chapter returning to history. 🌟@SiddyChats #SubhashKale @unbollywood @rajkamalent @SaritaTanwar #VShantaram #TheRebelOfIndianCinema pic.twitter.com/YtEdBiSAGr— Tamannaah Bhatia (@tamannaahspeaks) December 9, 2025
నాకు 33 ఏళ్లు.. అందుకే ఎగ్ ఫ్రీజింగ్: రియా చక్రవర్తి
2020లో హిందీ చిత్రపరిశ్రమ ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. వారిలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి సెలబ్రిటీలున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మాత్రం వార్తల్లో సంచలనమైంది. అతడి ఆత్మహత్యకు ప్రేయసి రియా చక్రవర్తి కారణమంటూ నెట్టింట సదరుహీరోయిన్పై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. జైలుకుఅలాగే సుశాంత్ మృతి కేసులో ఆమె అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయితే అతడి మరణానికి రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదంటూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రియాకు ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ఆమె పాడ్కాస్ట్తో పాటు చాప్టర్ 2 డ్రిప్ పేరిట బట్టల బిజినెస్ మొదలుపెట్టింది. ఈరోజు ఆ బ్రాండ్ విలువ రూ.40 కోట్లుగా ఉంది.ఎగ్ ఫ్రీజింగ్తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు 33 ఏళ్లు. ఈ మధ్యే గైనకాలజిస్ట్ను కలిశా.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే ఓపక్క కెరీర్లో సెట్ అవ్వాలి. మరోపక్క సామాజిక ఒత్తిడి. మన శరీరం ఓ వయసు రాగానే పిల్లల గురించి ఆలోచించమని చెప్తుంది. కానీ మనసు మాత్రం.. నీ బిజినెస్, బ్రాండ్, కెరీర్.. అవే పిల్లలని, వాటి ఎదుగుదల గురించి ఫోకస్ చేయమని చెప్తుంది. నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. సినిమాఅందుకే ఇప్పుడే పెళ్లి, ఫ్యామిలీ అని ఆలోచించదల్చుకోలేదు. కాకపోతే ఎగ్ ఫ్రీజింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. రియా చక్రవర్తి (Rhea Chakraborty).. తూనీగ తూనీగ అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్ కీ మారుతి, సోనాలి కేబుల్, జిలేబి, చెహరె సినిమాలు చేసింది. దొబారా, హాఫ్ గర్ల్ఫ్రెండ్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది.చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్... రజనీకాంత్ ఏమన్నారంటే?
జపాన్లో భారీ భూకంపం.. ప్రభాస్ గురించి మారుతి ట్వీట్
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. అమోరి, ఇవాటే, హొక్కైడో ద్వీపానికి సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. రిక్టర్ స్కేల్పై 7.5 నుండి 7.6 వరకు నమోదైంది. దీంతో సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రభాస్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. జపాన్లో భూకంపం సంభవించినట్లు వార్తలు రావడంతో ప్రభాస్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి సోషల్మీడియాలో ఫ్యాన్స్కు చల్లని వార్త ఇచ్చారు.దర్శకుడు మారుతి తన ఎక్స్ పేజీలో ప్రభాస్ ఫ్యాన్స్కు భరోసా ఇచ్చారు. "డార్లింగ్ (ప్రభాస్)తో మాట్లాడాను. అతను టోక్యోలో లేడు. ఎవరూ ఆందోళన చెందవద్దు. చాలా సురక్షితంగా ఉన్నాడు. చింతించకండి" అని ఆయన రాశారు. ఆయన సందేశం అందరికీ భరోసా ఇచ్చింది. అయితే, ప్రభాస్ త్వరగా ఇండియా తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు.ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం బాహుబలి: ది ఎపిక్ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనల కోసం జపాన్లో ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయింది. అక్కడి అభిమానులతో సరదాగా సంభాషించారు. భూకంపం గురించిన నివేదికలు వైరల్ అయిన తర్వాత వారు అందరూ అలెర్ట్ అయ్యారని సమాచారం.
సినిమా
పెద్దికి పెద్ద కష్టం..! పాన్ ఇండియా స్టార్స్
AI ఎఫెక్ట్ తో కోర్టులను ఆశ్రయిస్తున్న సినీ తారలు
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్
రామ్ చరణ్ బంగారం.. వైరల్ అవుతోన్న బండ్ల గణేష్ కామెంట్స్
పుష్ప ఏపిక్ తో బాక్సాఫీస్ పీస్ పీస్ చేయడానికి సుకుమార్ రెడీ
సంక్రాంతి మూవీ ఫెస్టివల్.. ఈ సారి మాములుగా ఉండదు
జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్ బేస్.. స్పిరిట్ లుక్ లో అదరగొట్టాడు
చిరంజీవి & శ్రీకాంత్ న్యూ మూవీ..ఫ్యాన్స్ కోసం క్రేజీ అప్డేట్!
పుష్ప 2: ది రూల్'కి ఏడాది... అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!
బన్నీతో కొరటాల స్టోరీ డిస్కషన్స్?
