Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Actress Shivani Nagaram About Tirumala Temple Visit1
తిరుమల గుడిలో అలాంటి అనుభవం: శివానీ నగరం

హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమల. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడినుంచో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. రెండు సెకన్ల దర్శనభాగ్యం కోసం కొన్ని గంటల తరబడి లైన్‌లో నిలబడి వేచి చూస్తారు. అయితే తాను మాత్రం 15 నిమిషాలు వెంకటేశ్వరస్వామివారిని తనివితీరా దర్శించుకున్నానంటోంది హీరోయిన్‌ శివానీ నగరం. 15 నిమిషాల దర్శనం కాకపోతే అక్కడ తనను చూసిన కొందరు భక్తులు దేవుడితో పాటు తననూ కీర్తించారని కామెంట్లు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివానీ నగరం మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్లాను. దాదాపు 13 ఏళ్ల తర్వాత.. లిటిల్‌ హార్ట్స్‌ సక్సెస్‌ అనంతరం మళ్లీ తిరుమలకు వెళ్లాను. నన్ను కాసేపు ద్వారం దగ్గర నిల్చోబెడతామని చెప్పారు. ఏకంగా 15 నిమిషాలు గర్భగుడి ఎదుట నిల్చోబెట్టి దర్శనం చేయించారు. దేవుని గుడిలో నాగురించి..ఎవరూ నన్ను వెళ్లిపోమని తొందరపెట్టలేదు. ఒకవైపు నుంచేమో భక్తులు గోవిందా.. గోవిందా అంటూ కీర్తిస్తున్నారు. మరోవైపు నుంచి కాత్యాయని, భోం చేశావా? అంటున్నారు. అది వినగానే నేను షాకయ్యాను. ఇంక నాకేం వద్దు అనిపించింది. అదే సమయంలో అమ్మ కూడా.. 'నీవల్ల 15 నిమిషాల దర్శనం దొరికింది. థాంక్యూ బేటా.. నీకు తల్లినయినందుకు గర్వంగా ఉంది' అని కామెంట్‌ చేసింది. ఆ మాట వినగానే నాకింకేం వద్దు, జీవితానికి ఇది చాలు అని ఉప్పొంగిపోయానంది. హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత దేనికి?ఇది చూసిన నెటిజన్లు.. ఒకటీరెండు సినిమాలు చేసిన హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత, అదే సామాన్య భక్తులను మాత్రం తోసేస్తారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివానీ నగరం.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. లిటిల్‌ హార్ట్స్‌ చిత్రంతో క్రేజ్‌ అందుకుంది. తాజాగా మరోసారి సుహాస్‌తో జతకట్టింది. అతడికి జంటగా నటించిన హే బలవంత్‌ మూవీ నేడే (ఫిబ్రవరి 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: ఎందుకిలా బాధపెడుతున్నారు? కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా

Mrunal Thakur Reveals Why Dhanush Attended Her Movie2
ధనుష్ ఆ రోజు నా కోసం.. ఓ కారణముంది: మృణాల్

సీతారామం, హాయ్ నాన్న తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మృణాల్ ఠాకుర్.. అంతకు ముందు హిందీ సీరియల్స్‌తో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె గ్లామర్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అలాంటిది గత కొన్నిరోజుల నుంచి మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఈమె బంధం గురించి తెగ రూమర్స్ వచ్చాయి. ఏకంగా పెళ్లి చేసుకుంటారని కూడా మాట్లాడుకున్నారు. అంతకు ముందు మృణాల్ చేసిన ఓ ప్రీమియర్‌లో ధనుష్ కనిపించడమే దీనికి కారణం. అయితే ఆ రోజు ధనుష్ ఎందుకు వచ్చాడనేది ఇప్పుడు మృణాల్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: లెస్బియన్ పాత్రలో రష్మిక?)'నేను ధనుష్ సర్‌కి పెద్ద అభిమానిని. ఆయన చేసిన రాయన్, మారి, రాంఝానా, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చూశాను. ముఖ్యంగా 'అసురన్' అయితే ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. ఆయన నటన అద్భుతం. మిగతా యాక్టర్స్ నుంచి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ రాబట్ట గల సత్తా కూడా ఆయన సొంతం. నటుడిగానే కాకుండా గీత రచయిత, సింగర్, డ్యాన్సర్, డైరెక్టర్ కూడా. 'తేరే ఇష్క్ మే' షూటింగ్ జరుగుతున్న టైంలో సర్.. మా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కి వస్తారా? అని అడిగాను. ఆయన వస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగానే ఆయన రావడం చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్‌లో ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను' అని ఓ ఎఫ్ఎమ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో పెళ్లి రూమర్స్ గురించి మాట్లాడిన మృణాల్.. అసలు ఇదంతా ఎవరు మొదలుపెట్టారో కూడా నాకు తెలియదు. ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోయినా నా పేరు మీద ఏవేవో రాశారు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను అని చెప్పింది. ఇష్టమైతే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని, కాకపోతే అంతలోపు తాను నేర్చుకోవాల్సినవి, చేయాల్సినవి కొన్ని ఉన్నాయని పేర్కొంది. ఈమె హీరోయిన్‌గా చేసిన హిందీ మూవీ 'దో దివానే షెహర్ మే' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్‌ భాయ్‌ఫ్రెండ్‌ భయపడ్డాడు: మృణాల్‌)Actress #MrunalThakur on #Dhanush! "He is a genius! He is a multi-talented. I would like to work with him definitely. After watching his movie, I became a huge fan of his works."pic.twitter.com/s7B65LPvil— Star Talkies (@startalkies_ofl) February 20, 2026

Nawab Cafe Movie Review And Rating In Telugu3
‘నవాబ్‌ కేఫ్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

టైటిల్‌: నవాబ్‌ కేఫ్‌నటీనటులు: శివ కందుకూరి, రాజీవ్‌ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, చైతన్య కృష్ణ తదితరులునిర్మాణ సంస్థ: హర్షిక ప్రొడక్షన్స్‌దర్శకుడు : ప్రమోద్‌ హర్షనిర్మాత: రాధా వి పపుడిప్పుసంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారివిడుదల తేది: ఫిబ్రవరి 20, 2026టాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్‌ అయిన మరో చిన్న సినిమా ‘నవాబ్‌ కేఫ్‌’. మొదటి ఈ సినిమాకు చాయ్‌ వాలా అని టైటిల్‌ పెట్టారు. కానీ సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం తెలపడంతో ‘నవాబ్‌ కేఫ్‌’గా మార్చారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ని క్రియేట్‌ చేశాయి. పాతబస్తీ ఇరానీ చాయ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రంగనాథ్ (రాజీవ్ కనకాల) వారసత్వంగా వచ్చిన ‘నవాబ్ కేఫ్’ని రన్‌ చేస్తూ ఉంటాడు. అది కేవలం టీ కొట్టుగా కాకుండా కుటుంబ లెగసీగా ఫీలవుతాడు. తాత, తండ్రి లాగే రంగనాథ్‌ ‘టీ’కి కూడా అభిమానులు ఉంటారు. అయితే ఆయన కొడుకు రాజా(శివ కందుకూరి)కి మాత్రం ఆ కేఫ్‌లో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అమెరికాకు వెళ్లి భారీగా డబ్బులు సంపాదించాలని కలలు కంటాడు. పెదనాన్న కొడుకు కుమార్‌(చైతన్య కృష్ణ) సలహాతో కేఫ్‌ని అమ్మేయాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో తండ్రి, కొడుకు మధ్య ఘర్షణ జరుగుతుంది. అదేరోజు రాత్రి రంగనాథ్‌ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత రాజాలో వచ్చిన మార్పు ఏంటి? తన కలలను నెరవేర్చుకోవడం కోసం ‘నవాబ్ కేఫ్’ అమ్మేశాడా? లేదా తండ్రి విలువ తెలుసుకొని కేఫ్‌ని రన్‌ చేశాడా? ‘నవాబ్ కేఫ్’ కోసం కుమార్‌ చేసిన కుట్ర ఏంటి? రాజా తీసుకున్న నిర్ణయానికి ప్రియురాలు సఖీ( తేజు అశ్విని) ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరో మొదట్లో అల్లరి చిల్లరగా తిరగడం.. ఓ విషాద ఘటన తర్వాత పూర్తిగా మారిపోయి..తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం.. ఆ బిజినెస్‌ని దెబ్బతీసేందుకు విలన్‌ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టి.. చివరిలో ఆ రంగంలో రికార్డు సృష్టించడం..ఈ లైన్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘నవాబ్ కేఫ్’ కూడా ఇలాంటి కథే. కథ-కథనం రెండూ.. ఇటీవల ధనుష్‌ నటించిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమాను గుర్తు చేస్తాయి. అక్కడ ఇడ్లీ దుకాణం.. ఇక్కడ టీ కొట్టు.. అంతే తేడా. తండ్రి-కొడుకు ఎమోషన్‌ చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఉంటుంది. ప్రమోద్‌ హర్ష ఎంచుకున్న పాయింటే రొటీన్‌ అంటే.. స్క్రీన్‌ప్లే కూడా అలానే ఉంది. కథనం ఎక్కడ ఆసక్తికరంగా అనిపించదు. ఇంటర్వెల్‌ సీన్‌ ఒక్కటి కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. మిగతా కథంతా ఊహకందేలా.. నిదానంగా సా..గుతూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. నవాబ్‌ కేఫ్‌ హిస్టరీని తెలియజేస్తూ కథను ప్రారంభించారు దర్శకుడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ.. హీరోయిన్‌తో పరిచయం.. వారిద్దరి మధ్య సాగే లవ్‌ట్రాక్‌.. ఏ ఒక్కటి కూడా ఆసక్తికరంగా అనిపించదు. సినిమాలో హీరోయిన్‌ ఉండాలి కాబట్టి.. సఖీ పాత్రను క్రియేట్‌ చేశారు కానీ..కథతో ఆమెకు ఎలాంటి సంబంధమే ఉండదు. హీరో అమెరికాకు వెళ్లాలని ఫిక్స్‌ అయినప్పుడే..తర్వాత కథనం ఎలా సాగుతుందనేది అర్థమైపోతుంది. ముందుగా చెప్పినట్లుగా ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఎమోషనల్‌ సీన్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం కథనం మరింత సాగదీతగా సాగుతూ.. ఇడ్లీ కొట్టు, కీర్తి సురేశ్‌ మిస్‌ ఇండియా తో పాటు పలు సినిమాలను గుర్తుకు చేస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. రాజా పాత్రకు శివ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. హీరో తండ్రిగా రాజీవ్‌ కనకాల రొటీన్‌ పాత్రే చేసినా.. ఎమోషనల్‌ సీన్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ తెజు అశ్విని పాత్రకు కథలో ప్రాధాన్యత లేదు. తెరపై కనిపించేది కూడా తక్కువే. రాజ్‌కుమార్‌ కసిరెడ్డి తనదైన కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా కూడా సినిమా యావరేజ్‌గానే ఉంది. సినిమా మొత్తం ఏదైనా పాజిటివ్‌ పాయింట్‌ ఉందంటే..అది ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అని చెప్పాలి. ఆయన అందించిన పాటలతో పాటు బీజీఎం కూడా సినిమా స్థాయిని పెంచేలా చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమా మొత్తంలో చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని సీన్లను కట్‌ చేసినా.. కథకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Meena Angry on Second Marriage Rumors, Karma Hits Back Them4
మీవల్లే ఈ వేదన.. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అజిత్‌, చిరంజీవి, వెంకటేశ్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి.. ఇలా అందరు హీరోలతోనూ యాక్ట్‌ చేసింది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త విద్యాసాగర్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో ఆమె కొంతకాలంపాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.రెండో పెళ్లంటూ ప్రచారంతీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే సోషల్‌ మీడియాలో మాత్రం మీనాకు రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. దయచేసి ఇటువంటి రూమర్స్‌ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్‌ పత్తా లేకుండా పోయాయి. కానీ తర్వాత మళ్లీ అదే తంతు. ఏదో ఒక హీరోతో మీనాకు లింక్‌ పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లంటూ ప్రచారానికి తెర తీయడం సర్వసాధారణమైపోయింది.ఒంటరి ఆడదాన్ని అనేకదా!ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకుని, కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే! నేనొక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్స్‌ సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. పైగా నాకు ఓ కూతురుంది. మంచివాటిపై ఫోకస్‌ చేస్తా..తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది? ఇదంతా నాకెంతో అసౌకర్యంగా ఉంది, చాలా చిరాకు తెప్పిస్తోంది. దీన్ని భరించడం నావల్ల కావడం లేదు. కానీ కర్మ అనేది ఒకటుంది. అదెవర్నీ వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేదు. నేను చాలా పాజిటివ్‌ వ్యక్తిని. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాను. మంచివిషయాలపైనే ఫోకస్‌ చేస్తాను అని మీనా చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మ ఉగ్రరూపం.. గొంతు పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది: ప్రియాంక

Shakira Musical concert in mumbai and delhi5
19ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న 'షకీరా'

సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్‌ గాయని షకీరా భారత్‌కు రానుంది. సుమారు 19 సంవత్సరాల తర్వాత షకీరా మళ్లీ భారత్‌కి రానున్నడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. కొలంబియన్ సింగర్‌ షకీరా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. భారత్‌లో తొలిసారి ముంబైలో(2007) ఒక అద్భుతమైన కచేరీ చేసింది. ఇక్కడ అదే ఆమెకు తొలి ప్రదర్శన కావడం విశేషం. ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్, "లాస్ ముజెరెస్ యా నో లోరన్ వరల్డ్ టూర్" (Las Mujeres Ya No Lloran World Tour) తో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇస్తోంది.ఏప్రిల్ 10న ముంబై మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో షకీరా సంగీత కచేరి ఉండనుంది. ఆపై ఏప్రిల్‌ 15న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరిగే కార్యక్రమంలో షకీరా పాల్గొననుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్‌ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ ప్రారంభ సమయంలో తప్పకుండా గుర్తొచ్చేది థీమ్‌ సాంగ్‌ 'వాక్కా వాక్కా దిస్‌ టైమ్‌ ఫర్‌ ఆఫ్రికా'.. 2010లో ఈ సాంగ్‌ను షకీరా పాడింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారీ ఈ సాంగ్‌ వినపడుతూనే ఉంది.

Priyanka Chopra recalls mom Madhu held a cab driver Neck in Delhi6
అమ్మ ఉగ్రరూపం.. పీక పట్టుకుని చెంప పగలగొట్టింది!

గ్లోబల్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా "ద బ్లఫ్‌" సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నేటి (ఫిబ్రవరి 20) నుంచే అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రియాంక తన తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.పక్కదారి పట్టడంతో..ప్రియాంక మాట్లాడుతూ.. అప్పుడు నాకు 11 ఏళ్లు ఉంటాయనుకుంటాను. ఒకసారి ఢిల్లీలో ఉండగా రాత్రిపూట అమ్మ, నేను బయటకు వెళ్లాం. క్యాబ్‌ బుక్‌ చేసుకుని కొంత దూరం వెళ్లగానే సడన్‌గా అమ్మ ముఖం ఎర్రబడింది. డ్రైవర్‌ పీక పట్టుకుని తిట్టడం మొదలుపెట్టింది. అతడు నెమ్మదిగా కారును మెయిన్‌ రోడ్‌ నుంచి మరోవైపు దారి తిప్పాడు. అది షార్ట్‌కట్‌ అని చెప్పాడు. 4 నెలలు కిక్కుమనకుండా..కారులో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. అమ్మ అతడి కాలర్‌ పట్టుకుని మెయిన్‌రోడ్‌ మీదుగానే కారును తీసుకెళ్లమని హెచ్చరించింది. అతడి చెంప కూడా పగలగొట్టింది. అమ్మను అలా ఉగ్రరూపంలో ఎన్నడూ చూడలేదు. ఆ సంఘటన తర్వాత దాదాపు నాలుగు నెలలవరకు ఎన్నడూ అమ్మతో గొడవపడలేదు. ఆరోజు నేను లేకపోయుంటే అమ్మ అంత సీరియస్‌ అయ్యేదో? లేదో? కానీ, హోటల్‌కు తిరిగి రాగానే అమ్మ నిలువెల్లా వణికిపోయింది అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.చదవండి: మలయాళ మూవీ చథా పచ్చ రివ్యూ

Actor Prabhas Want to Fall in Love7
నాకూ ప్రేమించాలని ఉంది: ప్రభాస్‌

ఇండియాలోనే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ప్రభాస్‌. ఎంతసేపు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడే తప్ప పర్సనల్‌ లైఫ్‌ను పట్టించుకోవడమే మానేశాడు. 46 ఏళ్లు వచ్చినా ఇంతవరకు పెళ్లి ముచ్చటే లేదు. ఆ ప్రస్తావన వచ్చినా కూడా ఓ చిన్న నవ్వు నవ్వి దాటవేస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం తనకు ప్రేమలో పడాలని ఉందంటున్నాడు.స్పెషల్‌ ఇంటర్వ్యూటాలీవుడ్‌లో ఇటీవల విడుదలై హిట్‌ కొట్టిన మూవీ కపుల్‌ ఫ్రెండ్లీ. సంతోశ్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ క్రమంలోనే చిత్రనిర్మాణ సంస్థ అయిన యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రభాస్‌తో స్పెషల్‌ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది.ప్రేమలో పడాలనుందిఈ సందర్భంగా కపుల్‌ ఫ్రెండ్లీ హీరోయిన్‌ మానస.. ప్రభాస్‌ను ప్రేమ గురించి అభిప్రాయం అడిగింది. అందుకు సమాధానంగా ప్రభాస్‌.. ఇది నీ పర్సనల్‌ క్వశ్చన్‌ కదా అని నవ్వేశాడు. అలాగే తనకు ప్రేమించాలనుందని, ప్రేమలో పడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు. ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రభాస్‌ ప్రేమలో పడితే చూడాలనుందని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.చదవండి: చిరంజీవి, మోహన్‌లాల్‌.. బెస్ట్‌ యాక్టర్‌ ఎవరంటే?

Is Rashmika Play Lesbian Role In Cocktail 2 Movie8
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?

ఇండస్ట్రీలో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు చాలా మారిపోయాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే జనాలు తగ్గిపోయారు. హీరోహీరోయిన్లు ఎవరైనా సరే కాస్త వైవిధ్యమైన పాత్రలు చేస్తే చూసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే అలాంటివి చేసే వాళ్లు మాత్రం ఇప్పటికే కాస్త తక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ రష్మిక మాత్రం ఇప్పుడు పెద్ద సాహసమే చేసినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు.. కనీసం కలలో కూడా ఊహించని పాత్రలో కనిపించనుందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. తొలుత సొంత భాషలో గుర్తింపు తెచ్చుకుని తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ అయిపోయింది. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్‌లోనూ వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అలా ఈమె చేసిన హిందీ సినిమాల్లో 'కాక్‌టెయిల్ 2' కూడా ఒకటి.(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్‌ భాయ్‌ఫ్రెండ్‌ భయపడ్డాడు: మృణాల్‌)ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్‌, రష్మిక నటించారు. అయితే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, కాకపోతే కృతి సనన్, రష్మిక.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. అంటే లెస్బియన్ పాత్రలు అనమాట. బాలీవుడ్ సినిమాల్లో ఈ పాయింట్ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటారు గానీ దక్షిణాదిలో ఇలాంటి పాత్రలు రావడం దాదాపు అసాధ్యం. అందున స్టార్ హీరో లేదా హీరోయిన్లు ఇలాంటి చేయరు. మరి రష్మిక ఈ తరహా పాత్ర చేసిందని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే గనక తెలుగు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి?ఇకపోతే రష్మిక వచ్చే వారమే పెళ్లి చేసుకోనుంది. ప్రియుడు విజయ్ దేవరకొండతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. రాజస్తాన్ వేదికగా ఈ నెల 26న డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ శుభకార్యానికి ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ)

Actor Brahmanandam Meet YS Jagan Mohan Reddy At Gannavaram airport9
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బ్రహ్మానందాన్ని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. కొంత సమయం పాటు సరదాగా మాట్లాడుకున్న వారిద్దరూ కలిసి ఫోటో దిగారు. View this post on Instagram A post shared by Ysrcpchief (@ysrcpchief)

Chatha Pacha Movie Review Telugu10
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ

ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ప్రతివారం తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తూనే ఉంటారు. అందుకు తగ్గట్లే ఆయా భాషల మూవీస్.. డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ యాక్షన్ కామెడీ సినిమా కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 90స్ కిడ్స్‌కి ఎంతో ఇష్టమైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈకి లోకల్ టచ్ ఇచ్చిన తీసిన చిత్రమే 'చథా పచ్చ'. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సావియో (అర్జున్ అశోకన్), వెట్రి(రోషన్ మ్యాథ్యూ), థామస్ (ఇషాన్ సౌకత్).. కొచ్చిలో పెరిగిన అన్నదమ్ములు. ఒకే తల్లి కడుపున పుట్టనప్పటికీ కలిసిమెలసి ఉంటారు. వీళ్లు ముగ్గురు.. చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ షో చూస్తూ పెరుగుతారు. వాల్టర్ దగ్గర కుస్తీ కూడా నేర్చుకుంటారు. కానీ థామస్ అలియాస్ లిటిల్.. తల్లితో కలిసి ఢిల్లీ వెళ్లిపోవాల్సి వస్తుంది. సావియో, వెట్రి మాత్రం కొచ్చిలోనే ఉండిపోతారు. కొన్నేళ్ల తర్వాత సోదరులని వెతుక్కుంటూ లిటిల్, సొంతూరికి వస్తాడు. కుస్తీ క్లబ్ మొదలుపెడదామని సావియోకు చెబుతాడు. దీంతో కొంతమందితో కలిసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైల్ ఫైటింగ్ క్లబ్ ప్రారంభిస్తారు. తర్వాత ఏమైంది? జైలు నుంచి వెట్రి బయటకొచ్చాడా? అసలు వాల్టర్ ఎవరు? చెరియన్(వైశాఖ్ నాయర్)‌తో సావియోకి శత్రుత్వం ఏంటనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ(WWE) షోకి ఇప్పుడు పెద్దగా క్రేజ్ లేదు గానీ 90స్ కిడ్స్‌ని అడిగితే దాని గురించి కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు.. స్కూల్‌కి వెళ్లేముందు, వచ్చిన తర్వాత ఈ షోని తెగ చూసేవారు. ఇందులో చూపించిన స్టంట్స్‌ని నిజజీవితంలోనూ చేసి గాయాలపాలయ్యేవారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకుని తీసిన సినిమానే 'చథా పచ్చ'. ఈ టైటిల్‌కి తెలుగులో చావోరేవో(డూ ఆర్ డై) అని అర్థం.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు మలయాళంలో కావొచ్చు తెలుగులో కావొచ్చు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో తీసుకున్న నేపథ్యం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కథ పరంగా చూస్తే మాత్రం చాలా సింపుల్. ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ల మధ్య పొరపొచ్చలు. చివరకు కలిసిపోవడం ఇంతే. కానీ దీనికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ టచ్ ఇవ్వడం ఆసక్తికరంగా అనిపించింది. దాదాపు రెండు గంటల పాటు బాగానే ఎంటర్‌టైన్ చేసింది.డబ్బింగ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ప్రధాన పాత్రల పేర్లు.. తెలుగు ప్రేక్షకులకు సరిగా అర్థం కావు. దీన్ని వదిలిస్తే సినిమా మాత్రం వేరే లెవల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ టచ్ అని మొత్తం ఫైట్స్ పెట్టేయకుండా ఎమోషన్ కూడా ఎంత కావాలో అంత పెట్టారు. స్టోరీ కూడా చాలా ఆర్గానిక్‌గా వెళ్తుంది. ఎక్కడా కూడా కృత్రిమంగా అనిపించదు. కాకపోతే డబ్బింగ్ పాటలు అస్సలు సెట్ కాలేదు. వాటిని లైట్ తీసుకుని మూవీ చూస్తే మాత్రం బాగుంది.ఎవరెలా చేశారంటే?అన్నదమ్ములుగా చేసిన అర్జున్ అశోకన్, ఇషాన్ సౌకత్, రోషన్ మ్యాథ్యూ అద్భుతంగా చేశారు. కలర్‌ఫుల్ డ్రస్‌ల్లో భలే సెట్ అయ్యారు. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన వైశాఖ్ నాయర్ కూడా తనదైన కామెడీ, సీరియస్ యాక్టింగ్‌తో మెప్పించాడు. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ కూడా తమ వంతు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అద్వైత్ నాయర్ డైరెక్షన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. యాక్షన్ టచ్ ఉన్న కామెడీ మూవీ చూద్దామనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై లుక్కేయండి. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. మీరు 90స్ కిడ్స్ అయితే ఫైట్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.- చందు డొంకాన

Advertisement
Advertisement