Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Mana Shankara Vara Prasad Garu Collection First Week1
ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం! తొలివారం కలెక్షన్ ఎంతంటే?

ప్రభాస్ 'రాజాసాబ్' తప్పితే సంక్రాంతి రిలీజైన మిగతా సినిమాలన్నీ పాజిటివ్ టాక్ అందుకున్నాయి. కానీ చిరంజీవి చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి థియేటర్లు ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తొలివారం పూర్తయ్యేసరికి కళ్లు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా నంబర్స్ ప్రకటించారు. అలానే ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్లు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి తొలివారం పూర్తయ్యేసరికి రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిచోటా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లు తెలుస్తోంది. రిలీజైన తర్వాత ఏడురోజు అంటే నిన్న కూడా చాలాచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. దీంతో ఏడో రోజు వసూళ్లలో 'అల వైకుంఠపురములో'ని చిరు చిత్రం అధిగమించినట్లు సమాచారం.మరోవైపు తొలివారంలోనే ఈ రేంజు వసూళ్లు అందుకున్న ప్రాంతీయ చిత్రం ఇదేనని నిర్మాతలు ఘనంగా ప్రకటించుకున్నారు. అంటే చిరంజీవి సరసన కొత్త రికార్డ్ చేరినట్లే. ఇకపోతే ఇవాళ్టి నుంచి అందరూ నార్మల్ లైఫ్‌కి వచ్చేస్తారు కాబట్టి వసూళ్లు కాస్త తగ్గొచ్చు. కాకపోతే లాంగ్ రన్‪‌లో ఎంత వసూళ్లు వస్తాయనేది చూడాలి? ఫిబ్రవరి తొలివారం వరకు పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడం 'మన శంకరవరప్రసాద్'కి కలిసొచ్చేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)Every theatre, every centre..Every region and every heart…THE SWAG KA BAAP has conquered everything 😎₹292+ crores Gross in the FIRST WEEK for #ManaShankaraVaraPrasadGaru ❤️‍🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 💥💥💥#MegaSankranthiBlockbusterMSG enters into BLOCKBUSTER… pic.twitter.com/AaBGtzHDQh— Shine Screens (@Shine_Screens) January 19, 2026

Upcoming OTT Movies Telugu January Third Week 20262
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు

మరోవారం వచ్చేసింది. సంక్రాంతి రిలీజైన తెలుగు సినిమాల్లో చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ చిత్రాలు.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో ఎప్పటిలానే ఈ వారం కొత్త రిలీజులు ఏం లేవు. 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే తెలుగు మూవీని 23వ తేదీన రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు గానీ ప్రమోషన్స్ చేయట్లేదు. దీంతో వాయిదా కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరోవైపు 'బోర్డర్ 2' అనే హిందీ చిత్రం ఇదే వీకెండ్ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)ఓటీటీల్లో అయితే 28 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. శోభిత ధూళిపాళ్ల 'చీకటిలో' మూవీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. దీంతో పాటు తేరే ఇష్క్ మైన్, మార్క్ అనే డబ్బింగ్ చిత్రాలు.. 45, సిరాయ్ అనే పరభాష సినిమాలు ఉన్నంతలో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 19 నుంచి 25 వరకు)అమెజాన్ ప్రైమ్ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 19స్టీల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25నెట్‌ఫ్లిక్స్సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20రిజోలి & ఐల్స్ సీజన్ 1-7 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20సింగిల్స్ ఇన్‌ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్) - జనవరి 20స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20కిడ్నాపెడ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 21క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ సినిమా) - జనవరి 22ఫైండింగ్ హెర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22ఫ్రీ బెర్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23హాట్‌స్టార్ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్‌డమ్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 19హిమ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23ఆహాసల్లియర్గళ్ (తమిళ మూవీ) - జనవరి 20జీ545 (కన్నడ సినిమా) - జనవరి 23మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23ఆపిల్ టీవీ ప్లస్డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21ముబీలా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్‌ రెహమాన్‌)

Actress Anasuya Bharadwaj Sad about Indian System, Women Abuse3
మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం: అనసూయ ఆవేదన

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసినవారికి మరణశిక్ష విధిస్తేనే ఇటువంటి నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నది చాలామంది వాదన. మరి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదన్న దానిపై ఓ పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది. ఇదే మన భారతదేశంప్రస్తుతం దేశంలో దాదాపు 40 మంది ఎంపీలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందువల్లే అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయాలన్న బిల్లు ముందుకు కదలడం లేదని సదరు పోస్ట్‌లో ఉంది. ఆ పోస్ట్‌ను సింగర్‌ చిన్మయి శ్రీపాద షేర్‌ చేస్తూ మన వ్యవస్థకు దండం పెట్టింది. దీన్ని యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ రీపోస్ట్‌ చేసింది. ఇదే మన భారతదేశం.. మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతదేశం. చాలా దూరం కదా దారి.. మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం అని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్‌లో ఎలా ఉందంటే?అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులకు సౌదీ అరేబియా, ఇరాన్‌, బంగ్లాదేశ్‌ వంటి అనేక దేశాల్లో ఉరిశిక్ష విదిస్తారు. కానీ భారత్‌లో మాత్రం అంతటి కఠిన శిక్షలు లేవు. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు అయితే మరణశిక్ష లేదా చనిపోయేవరకు శిక్ష విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆసిఫా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. దీనికి అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం మహిళపై అత్యాచారం కేసులో కనీస జైలు శిక్ష పదేళ్లకు పెరిగింది. 16 ఏళ్ల లోపు అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడితే 20 ఏళ్ల వరకు శిక్ష పెంచారు. 🙏🙏🙏 pic.twitter.com/TdNN9aJgud— Chinmayi Sripaada (@Chinmayi) January 17, 2026 చదవండి: ఒకేసారి రిలీజవుతున్న స్టార్‌ హీరోల సినిమాలు

Varun Tej Korean Kanakaraju Movie Glimpse4
హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కాస్త డిఫరెంట్ సినిమాలతో హిట్స్ అందుకున్న హీరో వరుణ్ తేజ్.. గత మూడు చిత్రాలతో దారుణంగా నిరాశపరిచాడు. చివరగా 2024లో 'మట్కా' మూవీతో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా కనిపించడమే మానేశాడు. అయితే హారర్ సినిమాలో నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర గ్లింప్స్, టైటిల్ అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్‌ రెహమాన్‌)వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి 'కొరియన్ కనకరాజు' అనే పేరు ఖరారు చేశారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా తదితర కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రితికా నాయక్ హీరోయిన్ కాగా సత్య కీలక పాత్ర చేశారు. గ్లింప్స్ సింపుల్‌గా కామెడీగా బాగుంది.కొరియన్ పోలీస్ స్టేషన్‌లో సత్యని కట్టేసి ఉంటే.. కత్తితో వచ్చిన వరుణ్ తేజ్, పోలీసుల్ని చంపేస్తాడు. కట్ చేస్తే అతడిని ఓ దెయ్యం ఆవహించి ఉంటుంది. మరి ఆ దెయ్యం ఎవరు? అసలు కొరియాలో వీళ్లు ఏం చేస్తున్నారనేది మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది వేసవిలో థియేటర్లలోకి సినిమాని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: దర్శకుడు ఒత్తిడి చేసినా రిజెక్ట్‌ చేశా.. అందరిముందే అరిచాడు!)

Vijay Theri, Ajith Mankatha Movies Box Office Clash Once Again5
మరోసారి స్టార్‌ హీరోల మధ్య బాక్సాఫీస్‌ వార్‌..

కోలీవుడ్‌లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి కథానాయకులుగా రాణిస్తున్న నటులు విజయ్‌, అజిత్‌. వీరిద్దరి మధ్య మంచి మిత్రభావం ఉంది. అయితే వీరి అభిమానులు మధ్య మాత్రం ఎప్పటినుంచో పోటీ తత్వం నెలకొంది. ముఖ్యంగా అజిత్‌, విజయ్‌ నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే ఆ సమయాల్లో వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.30 ఏళ్లుగా..రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా మరో హీరోపై విమర్శల దాడి జరుగుతుంటుంది. అలా గత 30 ఏళ్లకు పైగా విజయ్‌, అజిత్‌ మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటూ వస్తోంది. ఇకపోతే విజయ్‌ నటించిన చివరి మూవీ జననాయకన్‌ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇతర చిత్రాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. రీరిలీజ్‌అదేవిధంగా గతంలో విడుదలైన కొన్ని చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్‌ అవుతున్నాయి. అలాంటి వాటిలో నటుడు విజయ్‌ నటించిన తెరి, అజిత్‌ నటించిన మంగాత్తా చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. గతంలో మంచి విజయాలను సాధించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 23వ తేదీన రీరిలీజ్‌ కావడం మరో విశేషం. దీంతో ఈ చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.1996 సంక్రాంతికి మొదలుఇకపోతే విజయ్‌, అజిత్‌ గతంలో నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలను పరిశీలిస్తే 1996 సంక్రాంతి సమయంలో విజయ్‌ నటించిన కోయంబత్తూర్‌ మాప్పిళై, అజిత్‌ నటించిన వాన్మతి చిత్రాలు రిలీజయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరిలో విజయ్‌ నటించిన పూవే ఉనకాగా, అజిత్‌ నటించిన కల్లూరి వాసన్‌ చిత్రాలు మూడు రోజుల గ్యాప్‌తో విడుదలయ్యాయి. 1997లో విజయ్‌ నటించిన కాలమేల్లామ్‌ కార్తిరుప్పేన్‌ , అజిత్‌ నటించిన నేశం చిత్రాలు, అదే ఏడాది విజయ్‌ నటించిన కాదలుక్కు మర్యాదై, అజిత్‌ నటించిన రైట్టె జెండాపై వయసు చిత్రాలు వచ్చాయి.స్టార్‌ హీరోల సినిమాలు రిలీజ్‌1999లో విజయ్‌ నటించిన తుల్లాద మనం తుళ్ళుమ్‌ ,అజిత్‌ నటించిన ఉన్నైతేడి చిత్రాలు, 2000వ సంవత్సరంలో అజిత్‌ నటించిన ఉన్నై కొడు ఎన్నై తరువేన్‌ విజయ్‌ నటించిన ఖుషి చిత్రాలు, 2001లో విజయ్‌ నటించిన ఫ్రెండ్స్‌, అజిత్‌ నటించిన దీనా చిత్రాలు, 2002లో విజయ్‌ నటించిన భగవతి, అజిత్‌ నటించిన విలన్‌ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇప్పుడు మరోసారి..2003లో విజయ్‌ నటించిన తిరుమలై , అజిత్‌ నటించిన ఆంజనేయ చిత్రాలు, 2006లో విజయ్‌ నటించిన ఆది ,అజిత్‌ నటించిన పరమశివం.., 2007లో విజయ్‌ నటించిన పోకిరి , అజిత్‌ నటించిన ఆల్వార్‌ .., 2014లో విజయం నటించిన జిల్లా, అజిత్‌ నటించిన వీరం చిత్రాలు, 2023లో అజిత్‌ నటించిన తుణివు, విజయ్‌ నటించిన వారిసు చిత్రాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ స్టార్‌ హీరోల తేరి, మంగాత్తా సినిమాలు ఒకేసారి రీ రిలీజ్‌ అవుతున్నాయి.

Rashmika Mandanna Says Sikandar Movie Script Changed midway6
సికందర్‌ విషయంలో అదే జరిగింది: రష్మిక

గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాలతో సూపర్‌ హిట్లు, బ్లాక్‌బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్‌ వద​ డిజాస్టర్‌గా నిలిచింది. అదే సికందర్‌. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించాడు.గతేడాది ఒక్కటే ఫ్లాప్‌ తమిళ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్‌ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్‌కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్‌ సల్మాన్‌ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్‌ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్‌ మూవీ గురించి రష్మిక స్పందించింది.నాకు చెప్పిన కథ వేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్‌ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్‌, రిలీజ్‌ డేట్‌, ఎడిటింగ్‌.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్‌ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.చదవండి: ఆ ఇద్దరే బిగ్‌బాస్‌ విజేతలు.. మరో సర్‌ప్రైజ్‌ ఏంటంటే?

Music Director AR Rahman Apologises for his Remarks7
నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్‌ రెహమాన్‌

కొన్నిసార్లు మన అభిప్రాయాలు ఇతరులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లుగా పవర్‌ షిఫ్ట్‌ నెలకొందని, సృజనాత్మక లేనివారే క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు మతపరమైన అంశం కూడా కారణం కావొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రెహమాన్‌. అర్థం చేసుకున్నారుఅంతేకాకుండా ఆ ప్రభావం తనపై పడినట్లు తనకు అనిపించలేదు కానీ, పడిందన్నట్లుగా కొందరు గుసగుసలాడుకున్నట్లు తెలిసిందని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు తప్పుపట్టారు. తాజాగా ఈ వివాదంపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. భారతదేశం నా ఇల్లు.. నా గురువు.. నాకు స్ఫూర్తి. కొన్నిసార్లు మన అభిప్రాయాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నాను. బాధ పెట్టాలనుకోలేదుకానీ, నా ఆలోచన మాత్రం ఎప్పుడూ సంగీతం గౌరవించబడటమే.. సంగీతానికి సేవ చేయడమే.. అలాగే నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోవడం లేదు. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో నేను భారతీయుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. కృతజ్ఞతతో ఉంటా..అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేవ్స్‌ సమ్మిట్‌ -2025లో ఝాలా ప్రదర్శన, రూహ్‌- ఎ-నూర్‌, సన్‌ షైన్‌ ఆర్కెస్ట్రాకు మార్గదర్వకత్వం వహించడం, ఇండియాస్‌ ఫస్ట్‌ మల్టీకల్చరల్‌ వర్చ్యువల్‌ బ్యాండ్‌ 'సీక్రెట్‌ మౌంటైన్‌'ను బిల్డ్‌ చేయడం, హన్స్‌ జిమ్మర్‌తో కలిసి రామాయణ సినిమాకు సంగీతం అందిస్తుండటం.. ఇలా ప్రతీది నా జర్నీని బలోపేతం చేస్తుందనుకుంటున్నాను. ఈ దేశానికి కృతజ్ఞతతో ఉంటాను. జై హింద్‌, జయహో.. అంటూ వీడియోలో మాట్లాడారు రెహమాన్‌. మా తుఝే సలామ్‌, వందేమాతరం అంటూ ఓ స్టేడియంలో ఆడియన్స్‌ పాడుతున్న విజువల్స్‌ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. View this post on Instagram A post shared by AR Rahman: Official Updates (@arrofficialupdates) చదవండి: 20 ఏళ్ల వయసులో తమన్నాకు చేదు అనుభవం

Tamil Bigg Boss 9, Kannada Bigg Boss 12 Winner Details8
ఆ ఇద్దరే బిగ్‌బాస్‌ షో విజేతలు! మరో సర్‌ప్రైజ్‌ ఏంటంటే?

బిగ్‌బాస్‌ షోకు ఒకేసారి రెండు భాషల్లో శుభం కార్డు పడింది. ఆదివారం (జనవరి 18న) నాడు అటు తమిళ బిగ్‌బాస్‌ 9, ఇటు కన్నడ బిగ్‌బాస్‌ 12వ సీజన్‌ ముగిసింది. తమిళ బిగ్‌బాస్‌ షోలో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన దివ్య గణేశ్‌ విజేతగా నిలిచింది. తమిళ బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ అక్టోబర్‌ 5న మొదలైంది. విజయ్‌ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించిన ఈ సీజన్‌లో మొత్తం వైల్డ్‌కార్డ్స్‌తో కలిపి 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. రూ.50 లక్షల ప్రైజ్‌మనీదివ్య గణేశ్‌, శబరీనాథన్‌, విక్కాల్స్‌ విక్రమ్‌, అరోరా సిన్‌క్లయర్‌.. నలుగురే ఫైనలిస్టులుగా నిలిచారు. ఉత్కంఠగా జరిగిన ఈ సీజన్‌లో అందర్నీ వెనక్కు నెట్టి దివ్య గణేశ్‌ లేడీ విన్నర్‌గా నిలిచింది. బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. అలాగే ఒక కారును సైతం గెలుపొందింది.కన్నడ బిగ్‌బాస్‌కన్నడ బిగ్‌బాస్‌ 12వ సీజన్‌ విషయానికి వస్తే.. గతేడాది సెప్టెంబర్‌ 28న ప్రారంభమైంది. వరుసగా పన్నెండవ సారి కూడా హీరో కిచ్చా సుదీప్‌ ఈ సీజన్‌కు హోస్టింగ్‌ చేశాడు. ఈ సీజన్‌లో కమెడియన్‌ గిల్లి నాట (నటరాజ్‌), రక్షిత, అశ్విని, కావ్య, రాఘవేంద్ర, ధనుష్‌ టాప్‌ 6గా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు.హోస్ట్‌ సర్‌ప్రైజ్‌వీరిలో అందర్నీ వెనక్కునెడుతూ గిల్లి నాట టైటిల్‌ విజేతగా నిలిచాడు. ఇతడు రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ఒక ఎస్‌యూవీ కారును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, హీరో కిచ్చా సుదీప్‌ అతడికి మరో రూ.10 లక్షలు గిఫ్ట్‌ ఇస్తూ ఆ గెలుపును మరింత స్పెషల్‌గా మార్చేశాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial)

Tamannaah Bhatia Shares Bad Incident about Career Starting9
దర్శకుడు ఒత్తిడి చేసినా రిజెక్ట్‌ చేశా.. అందరిముందే అరిచాడు!

సెలబ్రిటీల జీవితం అద్దాల మేడలాంటిదంటారు. నిజమే, ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వారిది ఆడంబర జీవితమే.. అయితే ఆ స్థాయికి ఎదిగేవరకు ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను చాలామంది నటీమణులు బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలున్నాయి. హీరోయిన్‌ తమన్నా కూడా ఇందుకు అతీతం కాదు.బాలీవుడ్‌లో బిజీఒక్క పాటకు డ్యాన్స్‌ చేయడానికి సుమారు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఈ అందాల రాశి 2 దశాబ్దాలుగా పలు భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ముఖ్యంగా ఐటం సాంగ్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న తమన్నాకు ప్రస్తుతం దక్షిణాదిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది.దర్శకుడు ఒత్తిడిఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ 20 ఏళ్ల వయసులోనే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఒక సినిమాలోని ఓ సీన్‌లో హీరోతో కలిసి చాలా సన్నిహితంగా నటించాలని దర్శకుడు ఒత్తిడి చేశాడంది. అయితే ఆ సీన్‌లో నటించేందుకు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పి నిరాకరించానంది. హీరోయిన్‌ను మార్చండిదీంతో సెట్‌లో అందరూ ఉండగా హీరోయిన్‌ను మార్చండి అని ఆ దర్శకుడు గట్టిగా అరిచాడంది. అలా ఆ సన్నివేశంలో నటించాల్సిందేనని దర్శకుడు పట్టుబట్టడంతో తాను తగ్గకుండా ఏం జరిగినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చానని చెప్పింది. చివరకు ఆ దర్శకుడు క్షమాపణ చెప్పారంది. అయితే అది ఏ సినిమా? ఆ దర్శకుడు ఎవరు? అన్న విషయాలు మాత్రం బయటపెట్టలేదు.

Prabhas Spirit Movie possibility of clash with Salman Khan Raj Dk Movie10
ప్రభాస్ vs సల్మాన్ ఖాన్.. బాక్సాఫీస్ పోటీ?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఒకసారి బాలీవుడ్‌ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో ప్రభాస్ పోటీ పడ్డారు. ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కూడా తలపడే అవకాశం కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీ వీకెండ్‌తో పాటు ఈద్ పండుగ సీజన్‌కి దగ్గరగా ఉండటంతో భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శక ద్వయం రాజ్-డీకేతో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027 రంజాన్ సీజన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ జరుగుతోంది. సల్మాన్ ఖాన్‌కు రంజాన్ సీజన్‌పై ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. గతంలో అనేక సినిమాలను ఆయన ఈ సీజన్‌లో విడుదల చేసి విజయాలు సాధించాడు. అందుకే రాజ్-డీకే సినిమా కూడా అదే టైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఆ సీజన్‌ను లాక్ చేసుకున్నాడు. అదే సమయంలో సల్మాన్ సినిమా కూడా సిద్ధమవుతుందనే ప్రచారం నడుస్తోంది. రాజ్-డీకే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన వెంటనే ఈ రెండు భారీ సినిమాల మధ్య పోటీపై స్పష్టత వస్తుంది. బాలీవుడ్‌లో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం ఆనవాయితీ కావడంతో ఈ పోటీపై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. 2027 రంజాన్ బాక్సాఫీస్‌లో ప్రభాస్ స్పిరిట్ vs సల్మాన్ ఖాన్ – రాజ్-డీకే సినిమా పోటీ ఒకవేళ నిజమైతే ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద క్లాష్‌గా నిలిచే అవకాశం ఉంది.

Advertisement
Advertisement