Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Sreeleela And Neha Shetty Latest News1
లుక్ మార్చేసిన శ్రీలీల.. బ్లాక్ & వైట్‌లో నేహా శెట్టి

ఇటలీలో డిఫరెంట్ లుక్‌తో హీరోయిన్ శ్రీలీలవింటేజ్ కెమెరాతో ఫొటోలు తీస్తున్న సంయుక్తగ్లామర్‌తో హడల్ పుట్టించేస్తున్న నేహా శెట్టిఫిబ్రవరి జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్ప్రెట్టీగా యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్అందాలు చూపించేస్తున్న బ్యూటీ లక్ష‍్మిరాయ్ View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_)

Allu Sirish Pellikoduku Celebrations And Pics2
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్

రీసెంట్‌గానే టాలీవుడ్‌కి చెందిన విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ వివాహం.. ఈ శుక్రవారం హైదరాబాద్‪‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. నయనిక అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా బ్యాచిలర్ పార్టీ, కాక్‌టెయిల్ పార్టీలంటూ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు శిరీష్‌ని పెళ్లి కొడుకుగా తయారు చేసిన వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఈ పెళ్లి వేడుకలో అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. అలానే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పెళ్లయిన విజయ్ దేవరకొండ-రష్మిక కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఈ శుభకార్యంలో కనిపించారు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)

Vijay Devarakonda and Rashmika Wedding Reception request statement3
విజయ్‌, రష్మికల రిసెప్షన్‌.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి

విజయ్‌ దేవరకొండ , రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో కొద్దిమంది సమక్షంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా కొద్దిమంది మాత్రమే పాల్గొననున్నారు. తాజాగా విరోష్‌ జోడి తమ ఫ్యాన్స్‌కు, ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 4న సాయంత్రం జరిగే రిసెప్షన్‌ వేడుకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహ్వానం అందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా ఇతరులు ఈ వేడకకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.విజయ్‌, రష్మిక రిసెప్షన్‌ కోసం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్‌ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కోరింది. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది.

Rakasa Movie Teaser Update Latest4
నిహారిక నిర్మాతగా హారర్ కామెడీ సినిమా.. టీజర్ రిలీజ్

'మ్యాడ్' రెండు సినిమాలతో నటుడిగా ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక ఈ చిత్రాన్ని నిర్మించింది. మానస శర్మ అనే దర్శకురాలు ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)టీజర్ బట్టి చూస్తే హీరో అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా ఓ ఊరికి వెళ్తాడు. అయితే ఆ ఊరిని ఏళ్లుగా ఓ శాపం ఉంటుంది. పాడుబడ్డ భవంతి కూడా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఊరివాళ్ల సమస్యలోకి హీరో ఎంటర్ అవుతాడు. హీరోయిన్, మరో వ్యక్తి కూడా ఇతడికి తోడవుతారు. మరి బూత్ బంగ్లా నుంచి హీరో అండ్ గ్యాంగ్ బయటపడ్డారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తోంది.టీజర్ బట్టి చూస్తుంటే రెగ్యులర్ హారర్ కామెడీ టెంప్లేట్ స్టోరీలానే అనిపిస్తుంది కానీ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయిపోవచ్చు. ఈ సంక్రాంతికి ప్రభాస్ నుంచి 'రాజాసాబ్' అనే హారర్ కామెడీ వచ్చింది. కంటెంట్ సరిగా లేకపోవడంతో ఫ్లాప్ అయింది. మరి 'రాకాస' టీమ్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)

Rashmika Invites CM Revanth Reddy Family Her Wedding Reception5
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్‌కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)

Ram Charan Peddi Movie Dubbing Begins6
'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్

మెగాహీరో రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు. లెక్క ప్రకారం మార్చి 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండేసరికి వాయిదా వేశారు. ఏప్రిల్ 30న థియేటర్లలో తమ మూవీ విడుదల కానుందని కొన్నిరోజుల క్రితం పోస్టర్ వదిలారు. తాజాగా ఓ వైపు చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. తాజాగా ఆ వీడియోని చరణ్.. తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)'ఏమది' అనే డైలాగ్ చెబుతున్న వీడియోని పోస్‌ చేసిన చరణ్.. ఇందులో దర్శకుడు బుచ్చిబాబుని కూడా ఓ రేంజులో ఆటాడుకున్నట్లు కనిపించాడు. 'చికిరి చికిరి పాటలో మోహిత్ చౌహన్ వాయిస్‌కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే ఆయనే పాడాడా అని డౌట్ వచ్చిందయ్యా. నా డబ్బింగ్‌లో అలా యాక్ట్ చేయకు' అని చరణ్ తెగ ఏడిపించేశాడు. ఈ వీడియో ఫన్నీగా అనిపిస్తూ అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేస్తోంది.'పెద్ది' నుంచి వచ్చిన తొలి పాట 'చికిరి చికిరి' అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సోమవారం(మార్చి 02) ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్ కానుంది. ఇకపోతే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)

Actress Hariteja Reacts Acting With Allu Arjun DJ Movie7
అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా

సాధారణంగా యాంకర్స్, సీరియల్ నటులు.. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. వీళ్లలో కొందరికి అప్పుడప్పుడు ఊహించని అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వాళ్లలో హరితేజ ఒకరు. 20కి పైగా సీరియల్స్‌లో నటించిన యాంకర్‌గానూ పలు ఈవెంట్స్ హోస్టింగ్ చేసింది. బిగ్‌బాస్ తొలి సీజన్‌లో పాల్గొని ఫినాలే వరకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరసగా పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించింది. కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ రావడంతో తను ఎలాంటి సాహసం చేశానో బయటపెట్టింది.(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)'అల్లు అర్జున్ పక్కన స్లిమ్, ఫెర్ఫెక్ట్‌గా కనిపించాలని పెద్ద నిర్ణయం తీసుకున్నాను. 'డీజే'(దువ్వాడ జగన్నాథం)లో అవకాశం వచ్చిన తర్వాత స్లిమ్‌గా కనిపించాలని వరసగా 15 రోజులు ఆహారం తినడం మానేశాను. కేవలం లిక్వ్‌డ్ డైటే తీసుకున్నాను. దాంతో కొంత సన్నబడి సినిమాలో బాగానే కనిపించాను. షూటింగ్ రేపు ఉందనగా ముందురోజు ఉత్సాహంతో నిద్ర కూడా పట్టలేదు. ఇక సెట్‌లో జరిగిన సంఘటన అయితే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. సెట్‌కి వెళ్లగానే అల్లు అర్జున్,నా దగ్గరకు వచ్చి 'బిగ్‌బాస్'లో నీ ఫెర్ఫార్మెన్స్ చూశాను. నీ వర్క్ చాలా నచ్చింది' అని అన్నారు. ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను' అని హరితేజ.. బన్నీతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చింది.బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అఆ, రాజా ది గ్రేట్ తదితర సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు హరితేజ చేసింది. తర్వాత పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే కూతురు పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. బిగ్‌బాస్ 8వ సీజన్‪‌లో వైల్డ్ కార్ట్ ఎంట్రీగా మళ్లీ వచ్చింది గానీ పెద్దగా మెప్పించకలేకపోయింది. ఏదేమైనా బన్నీ గురించి చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్)#HariTeja: I actually did a 15-day liquid diet just to look slim for #AlluArjun Garu on the ‘DJ’ I was so excited that I couldn't even sleep the day before the shoot he walked up & told me he loved my work in Bigg Boss I was over the moon!"#AA22 #AALoki #AA25 pic.twitter.com/bX2UGTH03g— 𝒱𝒜 𝒸𝓊𝓁𝓉 ᵏʰᵃᵈʰᵃʳ ˢᵗʸˡⁱˢʰ (@khadharkhan1982) February 27, 2026

 February 2026 Telugu Movie And Result8
చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్

సాధారణంగా ఫిబ్రవరి నెలలో టాలీవుడ్‌ పెద్ద సినిమాలేం రిలీజ్ పెట్టుకోవు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల ముందే సంక్రాంతి ఉంటుంది. ఆ టైంలో స్టార్ హీరో తమ మూవీస్ విడుదల చేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటారు. దీంతో ఫిబ్రవరిలో దాదాపుగా మిడ్ రేంజ్ లేదా చిన్న చిత్రాలే విడుదల అవుతుంటాయి. ఈసారి కూడా అలానే వచ్చాయి కానీ ఓ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్‌ కామెంట్స్‌ వైరల్‌)ఫిబ్రవరి తొలివారంలో చిన్న సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో కాస్తోకూస్తో చెప్పుకదగ్గది అంటే గుణశేఖర్ తీసిన 'యుఫోరియా'నే. చాన్నాళ్ల తర్వాత తన స్టైల్ మార్చి, ట్రెండీ యూత్ సబ్జెక్ట్‌తో మూవీ తీసినప్పటికీ ఫ్లాప్ అయింది. కమ్ బ్యాక్ ఇద్దామనుకున్నా సీనియర్ దర్శకుడికి నిరాశే ఎదురైంది. ఇవి కాకుండా విత్ లవ్, బరాబర్ ప్రేమిస్తా, ఆపరేషన్ పద్మ, బ్లడ్ రోజెస్, లగ్గం టైమ్, ఎర్రచీర తదితర మూవీస్ రిలీజయ్యాయి కానీ ఇవన్నీ కూడా డిజాస్టర్స్ అయ్యాయి.రెండోవారం విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' రిలీజ్ కాగా.. వీటిలో హిట్ అవుతుందనుకున్న ఫంకీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఏ మాత్రం అంచనాల్లేని 'కపుల్ ఫ్రెండ్లీ' సక్సెస్ అందుకుంది. హిట్ అనిపించుకుని ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగాగనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు అర్జున్ దర్శకుడిగా మారి, కూతురినే హీరోయిన్‌గా పెట్టి తీసిన 'సీతా పయనం' కూడా ఫ్లాప్ అయింది. వీటితో పాటు అమరావతికి ఆహ్వానం, స్కై, నిలవే కూడా ఏ మాత్రం నిలబడలేకపోయాయి.(ఇదీ చదవండి: హీరో విజయ్‌ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు!)మూడోవారంలో సుహాస్ 'హే బలవంత్', నవాబ్ కేఫ్ మూవీస్ వచ్చాయి. వీటిలో సుహాస్ సినిమా బాగుందని అన్నారు గానీ జనాలు ఎందుకో దీన్ని లైట్ తీసుకున్నారు. ఇక నవాబ్ కేఫ్ అయితే తొలిరోజుకే ఫ్లాప్ టాక్ ముద్ర వేయించుకుంది. చివరి వారం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' అనే కామెడీ మూవీ రిలీజైంది. సోలో విడుదల కావడంతో ఏమైనా కలిసొస్తుందేమో అనుకున్నారు. ఇందులో కామెడీ ఏ మాత్రం నవ్వేలా లేకపోవడంతో జనాలు దీన్ని కూడా రిజెక్ట్ చేసినట్లే కనిపిస్తున్నారు. రేపటికల్లా దీని అసలు రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.ఓవరాల్‌గా ఫిబ్రవరి నెలలో 20 సినిమాలు, థియేటర్లలోకి వస్తే ఒక్క 'కపుల్ ఫ్రెండ్లీ' మాత్రమే ఆకట్టుకుంది. కానీ ఇది మరీ అంత సూపర్ హిట్ అయితే కాలేకపోయింది. గత కొన్నాళ్ల నుంచి తీసుకుంటే 2020లో భీష్మ, 2021లో ఉప్పెన, 2022లో డీజే టిల్లు, 2023లో సర్, 2024లో ఊరిపేరు భైరవకోన, 2025లో తండేల్.. సక్సెస్ కావడంతో పాటు మంచి వసూళ్లు కూడా అందుకున్నాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ ఏ సినిమా విషయంలోనూ జరగలేదు. తద్వారా కొన్నేళ్ల పాటు సాగిన సెంటిమెంట్ బ్రేక్ అయింది!(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)

hurandhar movie runtime will be bigg hour9
ఆశ్చర్యపరుస్తున్న'ధురంధర్ 2' రన్‌టైమ్‌..!

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ధురంధర్‌.. గతేడాది డిసెంబరు 5న విడుదలైన ఈ మూవీకి సీక్వెల్‌ రానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ రన్‌టైమ్‌ గురించి సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతున్నాయి. పార్ట్‌-1కు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చింది. ఆపై దీని రన్‌టైమ్‌ 3.34గంటలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ సీక్వెల్‌ రన్‌టైమ్‌ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందరిని ఆశ్చర్యపరుస్తుంది.'ధురంధర్ 2: ది రివెంజ్' మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్‌లో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ 3.50 గంటలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, మరికొన్ని కథనాల్లో మాత్రం 3.40గంటలకు దగ్గరగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఈ మూవీ నిడివి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్ట్‌-1కు మించే సీక్వెల్‌ రన్‌టైమ్‌ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. సుమారు 17ఏళ్ల తర్వాత ఈ రేంజ్‌ నిడివితో బాలీవుడ్‌లో సినిమా రావడం విశేషం. 2008లో హృతిక్‌ రోషన్ నటించిన ‘జోథా అక్బర్‌’ (3.50గంటలు) రన్‌టైమ్‌తో విడుదలైంది. అయితే, నిర్మాతల నుంచి ధురంధర్‌ తుది రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటన రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ప్రకారం రన్‌టైమ్‌ ఎక్కువగానే ఉందని సమాచారం.ధురంధర్ 2 లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో తిరిగి వస్తున్నారు. యామి గౌతమ్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తారని కూడా సమాచారం ఉంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి.

Radhika Sarathkumar Says Sarathkumar Does Not Like Varalakshmi Enters In Film Industry10
వరలక్ష్మి నటించడం శరత్‌కు ఇష్టం లేదు.. నిర్మాతకు వార్నింగ్‌ ఇచ్చేవాడు: రాధిక

ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్‌. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా..విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి..మెప్పించింది. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా తనదైన నటనతో తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించింది. అయితే కూతురు సినిమాల్లోకి రావడం మొదట్లో శరత్‌కుమార్‌కి ఏమాత్రం నచ్చలేదట. యాక్టింగ్‌ వదంటూ ఆమెపై సీరియస్‌ కూడా అయ్యాడట. ఒకానొక దశలో ఆమెకు చాన్స్‌ ఇచ్చిన నిర్మాతలకు ఫోన్‌ చేసి వార్నింగ్‌ కూడా ఇచ్చాడట. ఈ విషయాలన్నీ శరత్‌ కుమార్‌ సతీమణి రాధికా చెప్పారు. వరలక్ష్మీ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘సరస్వతి’.ఈ నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధికా మాట్లాడుతూ.. ‘వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శరత్‌ వ్యతిరేకించారు. ‘ఎలా నటిస్తావ్‌? నువ్వు యాక్ట్‌ చేయకూడదు’ అంటూ సీరియస్‌ అయ్యేవారు. ‘మా కుమార్తెను నటిగా ఎంపిక చేయొద్దు’ అంటూ నిర్మాతలకూ ముందే చెప్పేవారు. ఈ విషయాలన్నింటినీ తన తల్లితో కలిసి వరలక్ష్మి ఓ రోజు నాతో పంచుకుంది. దీనిపై నిర్ణయం తీసుకోలేనని చెప్పి.. సినిమా సెట్స్‌లో ఉన్న శరత్‌ వద్దకు వారిని తీసుకెళ్లా. అప్పుడు ఆయన.. నమితతో కలిసి ఓ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్నారు. నమితతో సినిమా పాట అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి(నవ్వుతూ..). మమ్మల్ని చూడగానే ఆయన కారవాన్‌లోకి వెళ్లిపోయారు. తర్వాత వరలక్ష్మి నటించేందుకు అంగీకరించారు. వరలక్ష్మి తొలి సినిమా (పోడా పోడి)ని చూడగానే.. తను గొప్ప నటి అవుతుందని చెప్పా. తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని వరలక్ష్మికి సలహా ఇచ్చా. ఆమె అదే ఫాలో అయింది. ఇప్పుడు వరలక్ష్మీని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రాధిక అన్నారు.

Advertisement
Advertisement