Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Vishwak Sen Funky Movie OTT Streaming Details1
ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది

టాలీవుడ్‌ నటుడు విశ్వక్‌ సేన్‌ నటించిన కొత్త సినిమా ఫంకీ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్‌లో మెప్పించలేదు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ సినిమా వాలెంటైన్ వీక్ స్పెషల్‌గా విడుదలైంది. ఇందులో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ నిర్మాణంలో ఎస్‌.నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఫంకీ చిత్రాన్ని నిర్మించారు. నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, జై కృష్ణ, వీటీవీ గణేశ్‌ తదితరలు నటించారు.ఫంకీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదల కానుంది. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని అప్‌కమింగ్‌ సినిమాల జాబితాలో ఆ సంస్థ ఫంకీని చేర్చింది. ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘జాతి రత్నాలు’తో ఊహించని విజయాన్ని అందుకున్న దర్శకుడు కేవీ అనుదీప్‌ ఈ మూవీని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 10 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. కోమల్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్‌’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్‌లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్‌(నరేశ్‌) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్‌ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్‌తో నిర్మాత సుదర్శన్‌ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్‌) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్‌ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్‌లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్‌ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్‌ రాజ్‌) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Vijay Devarakonda Invite a little fan for lunch2
బుజ్జి అభిమానిని సర్‌ప్రైజ్‌ చేసిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల పెళ్లి కొద్దిరోజుల క్రితం జరిగింది. వారి పెళ్లిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్వీట్స్‌ పంచడంతో పాటు పలు దేవాలయాల్లో అన్నదానం చేసి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకున్నారు. ప్యాన్స్‌ కోసం ఒక స్టార్‌ హోటల్‌లో విందు ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఒక చిన్నారి విరోష్‌ జోడీపై అలిగి వీడియో చేసింది. తాను కూడా విజయ్‌కు పెద్ద అభిమానినే కదా పెళ్లికి పిలవచ్చు కదా.. ఎందుకు పిలువలేదు. లడ్డూలు ఇవ్వచ్చు కదా అంటూ ఎంతో క్యూట్‌గా వీడియోతో రిక్వెస్ట్‌ చేసింది. విజయ్‌ నుంచి పిలుపువిజయ్‌ దేవరకొండపై అభిమానంతో ఆ చిన్నారి చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. ఏకంగా పది మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా రౌడీబాయ్‌ విజయ్‌ రియాక్ట్‌ అయ్యారు. తన వీడియో కింద కామెంట్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశారు. 'బుజ్జి తల్లి మా ఇంటికి రండి. మీకు నచ్చిన ఫుడ్‌, స్వీట్స్‌ ఎంటో నాకు చెప్పు. నీ కోసం ప్రత్యేకంగా ఇంట్లోనే చేపిస్తాను. ఇద్దరం కలిసి ఇక్కడే లంచ్‌ చేద్దాం.' అంటూ విజయ్‌ రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli)

Meenakshi Chaudhary Expect to her dream husband3
100 ఎకరాలు ఉంటే చెప్పండి: మీనాక్షి

మన నటీమణీల ఆశలు, కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి విషయంలో ఒక్కొక్కరి కోరికలు ఒక్కోలా ఉంటాయి. కొందరు మంచి మనిషై ఉంటే చాలంటారు. మరికొందరు నా మనసెరిగి నడుచుకోవాలంటారు. ఇంకొందరు తమను గౌరవించే వారై ఉండాలంటారు. కాగా మీనాక్షి చౌదరి ఎలాంటి భర్త కావాలంటున్నారో తెలుసా? తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన బ్యూటీ ఈ అమ్మడు. తెలుగులో హిట్‌ చిత్రం ద్వారా కథానాయిక కాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మీనాక్షిచౌదరి. ఇదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమలోకి విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన కొలై చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆర్‌ జే.బాలాజి సరసన సింగపూర్‌ సెలూన్‌ చిత్రంలో నటించినా, రాని గుర్తింపు విజయ్‌కి జంటగా నటించిన గోట్‌ చిత్రంతో వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో ఈమె పాత్ర పరిమితమే.గోట్‌ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు . హీరో విజయ్‌ అన్న ఒక్క పేరు వల్లే నటి మీనాక్షిచౌదరి పేరు పాపులర్‌ అయింది. ఆ తరువాత దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా నటించిన లక్కీ భాస్కర్‌ మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత తెలుగులో మహేష్‌బాబుతో కలసి గుంటూరు కారం, వెంకటేశ్‌తో సంక్రాంతికి వస్తున్నాం, తాజాగా అనగనగా ఒక రాజు వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న విషయం గురించి ఆమె పెద్ద లిస్టే చెప్పారు. అవి ఏమిటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి కనీసం 100 ఎకరాల ఆస్తి పరుడై ఉండాలి. వంట తెలిసినవాడై ఉండాలి. బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం తెలిసినవారై ఉండాలి. మొత్తం మీద ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.

Ten Movies Released But Box office collections are nil in tollywood4
సినిమాల కౌంట్ ఫుల్.. కలెక్షన్ నిల్

వీకెండ్‌కి టాలీవుడ్‌లో ఒకేసారి 10 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లు వెలవెలబోతూ, బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు పెద్దగా జరగట్లేదు. ఇటు చూస్తే ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది. ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు సినిమాల సందడి. ఇనస్టాగ్రామ్ తెరిస్తే చాలు రీల్స్ రీల్స్ తో ప్రచారం హోరెత్తింది.గివ్-ఎవే పేరిట ఉచిత పొందిన వారు మాత్రమే మొహమాటానికి ట్వీట్లు వేస్తున్నారు. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు కనిపించడం లేదు. వచ్చిన సినిమాల్లో శ్రీవిష్ణు సినిమా ప్రయత్నమైతే గట్టిదే. నిలబడుతుందని ఊహించారు, కానీ కలెక్షన్ పరంగా ఏ మేరకు చేస్తుందో చూడాలి. సరస్వతి సినిమా పెద్దగా చప్పుళ్లు చేయలేదు. ప్రచారం గట్టిగా చేసిన సంప్రదాయిని సుప్పిని.. సినిమా అంతగా పరిస్థితి కూడా అంతే. మిగతా సినిమాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమే. వీకెండ్‌ అయినప్పటికీ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. వచ్చే వారం కూడా పెద్దగా మార్పు ఉండదని అంచనా. ఎందుకంటే మరో 11 రోజులు తర్వాత పెద్ద సినిమా విడుదల కానుంది.

Allu Arjun Gifts Benz Car Wife Sneha Reddy5
భార్యకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్

అల్లు అర్జున్.. తన భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. పెళ్లిరోజు సందర్భంగా కారుని గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేశాడు. నిన్ననే ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే బన్నీ.. తన తమ్ముడు శిరీష్‌కి ఈ కారుని పెళ్లి కానుకగా దీన్ని ఇచ్చాడని చాలామంది అనుకున్నారు. కానీ పెళ్లిరోజు సందర్భంగా భార్యకు దీన్ని ఇచ్చినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. 2011లో స్నేహని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అయాన్, అర్హ అని పిల్లలు ఉన్నారు. శుక్రవారం(మార్చి 06) వీళ్ల పెళ్లిరోజు. ఈ క్రమంలోనే భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. ఇదే రోజున అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ కూడా నయనికతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం విశేషం.అయితే పెళ్లిరోజున అల్లు అర్జున్ తన భార్యకు విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మోడల్ కారు ధర రూ.4-5 కోట్ల మధ్యనే ఉంది. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒకటి చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతోంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ మొదలుపెట్టొచ్చు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonliine_)

Actor Vijay Reacts Divorce Issue With Sangeetha6
విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్‌కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.(ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)Recently, there have been a few problems happening. I see that you are getting hurt while fighting for it. I’m getting hurt seeing you guys getting hurt. I’ll take care of the problems. Don’t get hurt. Nothing to worry about..- #ThalapathyVijay's speech pic.twitter.com/8QFSWVjklU— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2026

Raju Weds Rambai Wins Four Major Honors In Gaddar Awards 20257
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ‘రాజు వెడ్స్ రాంబాయి’

కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ సత్తాచాటింది. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ..ఇలా నాలుగు ప్రధాన కేటగిరీల్లో ఈ సినిమా అవార్డ్స్ గెల్చుకుంది. ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటి, ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి, స్పెషల్ జ్యూరీగా చైతన్య జొన్నలగడ్డ గద్దర్ అవార్డ్స్ స్వీకరించనున్నారు."రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.

Tollywood Should Learn From Dhurandhar Movie Team Planning8
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!

'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్‌పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్‌ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్‌పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.(ఇదీ చదవండి: ‘ధురంధర్‌2’కి పెయిడ్‌ ప్రీమియర్స్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?)తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్‌డేట్ అంటారు. తర్వాత సాంగ్‌కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్‌ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్‌కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్‌పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్‌లో చాలామంది పాటించరు.తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్‪‌కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్‌లు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మరింత వైలెంట్‌గా ధురంధర్ 2 ట్రైలర్)

Nick Jonas Recalls Steamy First Date With Priyanka Chopra9
ఆ రోజు రాత్రే ప్రియాంకకు ‘ఫ్రెంచ్ కిస్’.. సీక్రెట్స్ బయటపెట్టిన నిక్ జోనాస్

ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంటకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఏ విషయంలో అయినా వీరిద్దరు చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. పర్సనల్‌ విషయాలను కూడా షేర్‌ చేసుకుంటారు. అందుకే ఈ జంటపై నిత్యం ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా నిక్ జోనాస్ ఒక ఇంటర్వ్యూలో తమ మొదటి డేటింగ్‌కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిక్‌ జోనాస్‌ తన మొదటి డేటింగ్‌ అనుభవం గురించి చెబుతూ.. ‘మా మొదటి డేటింగ్‌ చాలా విచిత్రంగా జరిగింది. అందరిలాగా మేం ఒంటరిగా డేటింగ్‌కి వెళ్లలేదు. ప్రియాంక తన స్నేహితురాలితో వస్తే..నేను మా సోదరుడిని తీసుకొని వెళ్లాను. ఈ డేట్‌ ప్లాన్‌ చేసింది ప్రియాంకనే. మొదట ఓ మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌కి వెళ్లాం. అయితే అది ప్రియాంకకు నచ్చలేదు. దీంతో బయటకు వెళ్లాలనుకున్నాం. మాతో పాటు ఇంకో జంట కూడా వచ్చింది. ఆ రోజు సాయంత్రం చాలా ఆనందంగా గడిపాం. ఇద్దరం కలిసి డ్రింక్‌ చేయడానికి ఎక్కడికో వెళ్లాం. మేము ఎంత దూరంలో ఉన్న సోదరుడు మా కోసం డ్రింక్స్‌ పంపించి.. దూరంగా వెళ్లిపోయాడు. అంతేకాదు ఆ రోజు టైమ్‌ దొరికినప్పుడల్లా ప్రియాంకకు నా గురించి గొప్పగా చెప్పేందుకు ట్రై చేశాడు. అది ఆమెకు అర్థమై ‘మీ బ్రదర్‌ నీకు బాగానే గ్యాస్‌ కొడుతున్నాడు కదా’ అని నవ్వేసింది. ఇలా ఆ ఈవినింగ్‌ చాలా ఎంజాయ్‌ చేశాం. ఇక ఆ రోజు రాత్రి ఎలా గడిపారనే విషయాన్ని చెబుతూ.. ‘ఆ రోజు నైట్‌ మీమిద్దరం 'ఫ్రెంచ్ కిస్' చేసుకున్నామని నిక్‌ చెప్పాడు. ఆ క్షణం తమ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకం అని, అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎంతో నిజాయితీగా పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.కాగా, ప్రియాంక, నిక్‌ల వివాహం 2018లో జరిగింది. ప్రస్తుతం ఈ జంటకి 'మాలతీ మేరీ' అనే కుమార్తె ఉంది. తమ కెరీర్‌లతో బిజీగా ఉంటూనే, కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Jr NTR Dupe Eshwar Clarity about Virosh Reception Incident10
విరోష్‌ రిసెప్షన్‌లో అల్లు అర్జున్‌ బౌన్సర్లు ఎందుకలా చేశారంటే?

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. ఈ లవ్‌బర్డ్స్‌ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరుపుకున్నారు. తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్టేజీపై ఫోటో దిగేందుకు వెళ్తుండగా ఆయన వెనకాల ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకుని ఆపేశారు.ఏం జరిగిందంటే?కొందు ఆయన్ను సైడ్‌ యాంగిల్‌లో చూసి జూనియర్‌ ఎన్టీఆర్‌ అనే భ్రమపడ్డారు. అల్లు అర్జున్‌ బౌన్సర్లు ఎన్టీఆర్‌ను ఆపేశారా? అని ఆశ్చర్యపోయారు. కానీ, అక్కడున్నది తారక్‌ కాదు, ఆయనకు డూప్‌గా నటించే ఈశ్వర్‌. తాజాగా ఈశ్వర్‌ అక్కడేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. అల్లు అ‍ర్జున్‌తో పాటు వీడియోలో ఉన్నది నేనే.. ఆ రోజు ఏం జరిగిందంటే? అల్లు అర్జున్‌ సర్‌ లోపలకు వచ్చే సమయంలో నేను కూడా లోనికి వెళ్తున్నాను. జూమ్‌ చేస్తూ పెద్దగా..స్టేజీపై ఫోటో దిగడం కోసం ఆయన సడన్‌గా ఆగిపోయారు. ఆయన బౌన్సర్లు ఏమనుకున్నారంటే నేను ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తున్నానని భ్రమపడ్డారు. లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించి నన్ను ఆపేశారు. అది చాలా చిన్న విషయం. దాన్ని జూమ్‌ చేస్తూ చాలా పెద్దగా చూపించారు. అలా వీడియో చాలా వైరల్‌ చేశారు. దానివల్ల నాకు కూడా మంచి రీచ్‌ వచ్చింది. థాంక్యూ సోమచ్‌ అని వీడియో షేర్‌ చేశాడు. ఇతడు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్‌కు డూప్‌గా నటించాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwarharris_1) చదవండి: అణిగిమణిగి ఉండాలి.. లేదంటే సైడ్‌ చేస్తారు: అషూ

Advertisement
Advertisement