Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Chiranjeevi Bobby Movie Updates Krithi Shetty Role Details1
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!

హిట్ కొట్టడం ఈజీనే. కానీ దాన్ని కొనసాగిస్తూ సినిమాలు చేయడం, అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. చాలా కొద్దిమంది హీరోహీరోయిన్లకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అవును ఇదంతా హీరోయిన్ కృతిశెట్టి గురించే. 'ఉప్పెన'తో హీరోయిన్‌గా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. తర్వాత చాలానే మూవీస్ చేసింది గానీ సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇప్పుడు మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు!)ప్రస్తుతం 'మన శంకరవరప్రసాద్' చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి.. త్వరలో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నారు. ఇదివరకే దర్శకుడు బాబీతో చిరు మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ కానుందని, మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలోనే కృతిశెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. చాలామంది హీరోయినా అని అనుకుంటున్నారు. కానీ చిరు కుమార్తె పాత్రలో కృతి కనిపించనుందని టాక్.గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో తొలి హిట్ అందుకున్న చిరు-బాబీ.. ఇప్పుడు బెంగాల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కూతురు సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో మూవీ చేయనున్నారని టాక్. మలయాళ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారని టాక్. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా పలువురు పేర్లు అనుకుంటున్నప్పటికీ ప్రియమణిని ఫైనల్ చేశారని అంటున్నారు. అలానే ఏఆర్ రెహమాన్‌ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. మరి ఈ విషయాల్లో ఎంత నిజముందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్సుంది.(ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?)

Teena Sravya Donate Jaggery Medaram Jathara 20262
మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు!

'కమిటీ కుర్రోళ్లు', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాల్లో హీరోయిన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి టీనా శ్రావ్యపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మేడారం జాతరకి వెళ్లిన ఈమె.. మొక్కు చెల్లించుకోవడమే దీనికి కారణం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర.. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు అంటే నాలుగు రోజుల పాటు భారీ ఎత్తున జాతర జరగనుంది. దీనికి లక్షలాది మంది భక్తులు రానే వస్తారు. అయితే జాతరకు రెండు వారాల ముందు నుంచే మేడారంలో ఆచార వ్యవహారాలు మొదలవుతాయి. చాలామంది తమ బరువంతా బెల్లం(బంగారాన్ని)ని దేవతలకు మొక్కుగా చెల్లిస్తారు.టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య కూడా ఇలానే తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి.. సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియోపై సోషల్ మీడియలో డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఈమె చేసిన పనికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. భక్తులు, ఆదివాసీ దేవతలను అవమానించడమేనని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీనా తల్లి మాత్రం మొక్కులో భాగంగానే ఇలా చేశామని సమర్థించుకున్నారు.(ఇదీ చదవండి: 14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్) View this post on Instagram A post shared by Teena sravya.kundoju (@teena_sravya_mom)

Nidhi Agarwal Drunk Alcohol at age 143
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల వెల్లడించింది. చిన్న వయసులోనే మద్యం సేవించడం ప్రారంభించినప్పటికీ, ఆ అలవాటును పూర్తిగా విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను 14 ఏళ్ల వయసులోనే తొలిసారి మద్యం సేవించాను. ఆ సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి తాగడం సరదాగా అనిపించేది. అప్పట్లో అది ఫన్‌గా అనిపించింది. కానీ కాలక్రమేణా మద్యం నాకు సరిపడదని అర్థమైంది. తాగిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా కూడా అనిపించేది.ఆ అనుభవాలే నన్ను ఆలోచనలో పడేశాయి. చివరకు మద్యం పూర్తిగా మానేయాలనే నిర్ణయం తీసుకున్నాను. నేను చివరిసారి మద్యం తాగి దాదాపు ఆరేళ్లు పూర్తయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆలస్యంగా అయినా గ్రహించాను. నా శరీరం కూడా ఆల్కహాల్‌ను అంగీకరించడం లేదని అర్థమైంది. అందుకే వెంటనే మానేశాను.ప్రస్తుతం పార్టీలకు వెళ్లినప్పటికీ మద్యం జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే దాని బదులు గ్రీన్ టీతో ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఆల్కహాల్‌ తాగుతారు. కానీ నేను మాత్రం తాగను. మద్యం లేకుండానే పార్టీల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చని నిధి స్పష్టం చేసింది.

Comedy Movies Trend: Is the Tollywood Trend changing4
టాలీవుడ్‌లో ట్రెండ్ మారుతోందా?

టాలీవుడ్‌లో ప్రతి సీజన్‌కి ఒక ప్రత్యేకమైన ట్రెండ్‌ ఉంటుంది. ఒకప్పుడు హారర్ కామెడీ చిత్రాలు వరుసగా వచ్చాయి. అంతకంటే ముందు ప్రేమకథలు హవాను కొనసాగించాయి. ఇటీవల వరకూ యాక్షన్ సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ కథలు సిల్వర్ స్క్రీన్‌పై ఆధిపత్యం చెలాయించాయి.అయితే ఇప్పుడు పరిస్థితి మరోసారి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలను గమనిస్తే ప్రేక్షకుల అభిరుచి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘రాజాసాబ్’ మినహా మిగతా అన్ని సినిమాల్లో ప్రధాన ఎలిమెంట్ కామెడీనే. మన శంకరవరప్రసాద్,అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఈ సినిమాలన్నింటిలోనూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నా థియేటర్లలో ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసినవి కామెడీ పోర్షన్లే. ఇది కేవలం సంక్రాంతి సినిమాల వరకే పరిమితమా? లేక టాలీవుడ్ ట్రెండ్ నిజంగానే మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరో 2-3 కామెడీ సినిమాలు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ పూర్తిగా కామెడీ వైపు మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ప్రేక్షకులు కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతార, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తారనే భావన ఉండేది. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని అనుకునేవారు. ఆ విషయాన్ని పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా బహిరంగంగానే అంగీకరించారు. ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా భారీ యాక్షన్ కథలనే ఎంచుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకు ఏడాది పైగా సమయం పడుతోంది. కానీ కామెడీ ట్రెండ్ బలపడితే మాత్రం ఇది శుభపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల స్టార్ హీరోల సినిమాల సంఖ్య పెరుగుతుంది. పాన్ ఇండియా హంగులు తగ్గుతాయి. నిర్మాతలకు భారీ బడ్జెట్‌ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. టాలీవుడ్‌లో కామెడీ చిత్రాల ట్రెండ్‌ మొదలైనట్లు సంక్రాంతి సినిమాలు సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్ బలపడితే, ఇండస్ట్రీలో కొత్త మార్పులు తప్పవు.

Akkineni Naga chaitanya at  shobitha latest Movie Promotions5
శోభిత లేటేస్ట్‌ మూవీ.. సతీమణితో కలిసి చైతూ ప్రమోషన్స్..!

అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా చీకటిలో. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ కానుంది. ఇటీవలే ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో శోభిత క్రైమ్‌ యాంకర్‌ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్‌గా పనిచేసినా.. తర్వాత జాబ్‌ నచ్చలేదని మానేసి పాడ్‌కాస్ట్‌ ప్రారంభించింది. ఆ పాడ్‌కాస్ట్‌కు చీకటిలో అన్న టైటిల్‌ ఖరారు చేసింది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీ అయిపోయింది శోభిత. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఈ ప్రమోషన్ ఈవెంట్‌కు ఆమె భర్త నాగ చైతన్య కూడా వచ్చారు. తన సతీమణితో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఈ మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్‌ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా.. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. #TFNExclusive: The beautiful couple Yuvasamrat #NagaChaitanya & #SobhitaDhulipala snapped together at a movie event 📸✨#SoChay #TeluguFilmNagar pic.twitter.com/pojTTChD9l— Telugu FilmNagar (@telugufilmnagar) January 20, 2026

Kollywood Star Hero Sivakarthikeyan Adopted elephant for six months 6
ఏనుగు దత్తత తీసుకున్న స్టార్‌ హీరో

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్‌ జూ పార్క్‌లోని ఏనుగును దత్తత తీసుకున్నారు. ఆరునెలల పాటు ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను హీరోనే చూసుకోనున్నారు. ప్రకృతి అనే పేరు గల ఏనుగు సంరక్షణను శివ కార్తికేయన్‌ పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇది చూసిన హీరో ఫ్యాన్స్.. అన్న గ్రేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. శివ కార్తికేయన్ ఇటీవలే పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పొంగల్ ‍కానుకగా ఈ మూవీ రిలీజైంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీపై కొందరు విమర్శలు చేశారు. ఈ సినిమాను పాలిటిక్స్‌తో లింక్ చేయడంతో వివాదానికి దారితీసింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించింది. Actor Thiru.D.Sivakarthikeyan has adopted an elephant named Prakruthi in #AAZP for a period of six months. #ArignarAnnaZoologicalPark #AAZPChennai #VandalurZoo #AnimalAdoption #ZoologicalPark@Siva_Kartikeyan pic.twitter.com/5v33XghiDM— Vandalur Zoo @Arignar Anna Zoological Park Chennai (@VandalurZoo) January 20, 2026

NAVEEN CHANDRA Latest Movie HONEY TEASER out now7
నవీన్ చంద్ర సైకలాజికల్ థ్రిల్లర్‌.. భయపెడుతోన్న టీజర్

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా వస్తోన్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ హనీ. ఈ చిత్రంలో దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.హనీ టీజర్ చూస్తుంటే క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అనే ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందించారు. Silence carries the loudest fear.Some secrets demand silence.Some demand sacrifice.This Year’s Most Devastating Ritual Starts From NOW 🔥Watch Teaser Now 👇https://t.co/rvG68XlA3GHoney Movie - Worldwide Grand Release In Theaters From Feb 6th 🐈‍⬛ 🔴 @Naveenc212… pic.twitter.com/o9toWlbEqq— Actor Naveen Chandra (@Naveenc212) January 20, 2026

Anil Ravipudi shares Megastar Movie song singer Name goes viral8
మనశంకర వరప్రసాద్‌గారు..ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలే..!

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.300 కోట్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమాలో 'ఫ్లై.. హై' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా అలరించింది. అయితే ఈ సాంగ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పాట పాడింది స్వయానా చిరంజీవి మేనకోడలు నైరా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. మెగాస్టార్ సోదరి మాధవి గారి కుమార్తె అని వెల్లడించారు. మనశంకర వరప్రసాద్‌గారు సినిమాలోని ఈ పాటను అద్భుతంగా పాడిందని కొనియాడారు. ఇది కేవలం నైరాకు ప్రారంభం మాత్రమేనని.. తనకు సుదీర్ఘమైన కెరీర్‌ ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #Naira is the niece of our Megastar @KChiruTweets garu ( Daughter of his Sister Madhavi garu )🤗She has wonderfully sung the #FlyingHigh song from #ManaShankaraVaraPrasadGaru 👏🏻👏🏻👏🏻With a long journey ahead of her, this is just a beautiful beginning… https://t.co/PZEPN1t3ox— Anil Ravipudi (@AnilRavipudi) January 20, 2026

Malavika Mohanan And Samyuktha Latest News9
మాళవిక మోహనన్ సింగారం.. సంయుక్త వయ్యారం

చీరలో మాళవిక మోహనన్ సింగారంపట్టుచీరలో సిగ్గుపడిపోతున్న సంయుక్తజిమ్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన నభావియాత్నాం ట్రిప్‌లో హీరోయిన్ మేఘా ఆకాశ్టెంపుల్ మార్నింగ్స్ వీడియోతో కావ్య కల్యాణ్ రామ్విదేశాల్లో చక్కర్లు కొట్టేస్తున్న ప్రియాంక జవాల్కర్ View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Priyanka Jawalkar ★ (@jawalkar) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__)

Venu Yeldandi Devi Sri Prasad Yellamma Movie Discussionn goes viral10
బలగం వేణు ఎల్లమ్మ మూవీ.. దేవీశ్రీతో సుదీర్ఘ చర్చ.!

బలగం మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తన రెండో సినిమా టైటిల్‌ను ప్రకటించిన వేణు.. హీరోను కూడా పరిచయం చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌ను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే ఎల్లమ్మ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా టాలీవుడ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు డీఎస్పీ హీరోగా అరంగేట్రం చేయనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో వేణు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు హీరోగా మొదటి సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథపై ఏకంగా 8 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.తాజాగా డైరెక్టర్ వేణు యెల్దండి తన ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. డీఎస్పీతో ఫస్ట్ మీటింగ్‌.. ఇది 8 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అంటూ పోస్ట్ చేశారు. ఎల్లమ్మ కథపై వీరిద్దరి మధ్య ఏకంగా 8 గంటల పాటు చర్చ సాగిందని దర్శకుడే స్వయంగా వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమాపై వీరిద్దరు ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో డీఎస్పీ పర్శీ అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తన సినిమాకు డీఎస్పీనే సంగీతం అందిస్తున్నారు. The first meeting with @ThisIsDSP Sir….it was 8hours long discussion👌🤗🥰🙏🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼#YellammaGlimpse #Yellamma pic.twitter.com/K7S1VH5g2W— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) January 19, 2026

Advertisement
Advertisement