Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Dhurandhar 2 Teaser Release date locked1
'ధురంధర్‌-2' టీజర్‌ ప్రకటన వచ్చేసింది

బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, థియేటర్‌ వర్షన్‌ ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 1100 కోట్ల మేరకు రాబట్టింది. సినిమాకు మంచి ఆదరణ రావడంతో పార్ట్‌-2పై దర్శకుడు ఆదిత్యధర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 3)న టీజర్‌ను విడుదల చేయనున్నారు. ధురంధర్‌ సీక్వెల్ కోసం పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్‌ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధురంధర్ 2 మూవీ మ్యూజిక్‌ సంగీత హక్కులను సారెగామా నుండి టి-సిరీస్‌కు మార్చారు. ఇది ఈ మూవీ ఫ్రాంచైజీకి గణనీయమైన క్రేజ్‌ను తెచ్చింది. ఈ మూవీ ఆడియో హక్కుల కోసం భూషణ్ కుమార్ భారీ ఆఫర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సమాచారం. ధురంధర్‌-2 టీజర్ ప్రకటన కూడా టి-సిరీస్ నుండి రావడం విశేషం. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తిరిగి రానున్నారు. మార్చి 19, 2026న ఒకేసారి పాన్-ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదల కానుంది.

The Paradise movie Budget will limit cross2
'నాని'తో భారీ రిస్క్‌ చేస్తున్న నిర్మాత.. బెడిసి కొడితే కష్టమే

టాలీవుడ్‌లో నాని నటించిన ‘దసరా’ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. నాని కెరీర్‌లోనే మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఇదే మూవీ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల నానితో రెండో చిత్రం ‘ది ప్యారడైజ్‌’ పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. నిర్మాత సుధాకర్‌ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో మోహన్‌బాబు, కయాదు లోహర్, రాఘవ్‌ జుయల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ ముందుగా అనుకున్నదాని కంటే బడ్జెట్‌ భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.ఇండస్ట్రీలో ప్రతి నటుడికి ఒక మార్కెట్‌ ఉంటుంది. దానిని బట్టే వారికి రెమ్యునరేషన్‌ ఉంటుందని తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద నాని సినిమాల మార్కెట్‌ రూ. 100 కోట్లకు పైగానే ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఓటీటీ, టెలివిజన్ మార్కెట్‌లో నానికి మంచి డిమాండ్ ఉండటంతో ‘ది ప్యారడైజ్‌’ చిత్రానికి రూ. 75 కోట్ల వరకు ఢీల్‌ సెట్‌ అయినట్లు టాక్‌ ఉంది. ఎటుచూసినా సరే నాని సినిమాలకు ఫైనల్‌ మార్కెట్‌ విలువ రూ. 200 కోట్ల మేరకు ఉంటుంది. అది కూడా సినిమా భారీ హిట్‌ అందుకుంటేనే.. ఒకవేళ​ సినిమాపై ఏమాత్రం టాక్‌ మారిందా ఈ నంబర్స్‌ అన్నీ తారుమారు అయిపోతాయి.టైర్‌- 2 హీరోల్లో చాలా ఎక్కువది ప్యారడైజ్‌ సినిమాకు మొదట బడ్జెట్ రూ.150 కోట్లు అనుకుంటే.. ఇప్పుడు రూ.200 కోట్లు దాటేసిందట. టైర్‌- 2 హీరోల్లో ఈ బడ్జెట్ చాలా ఎక్కువని ఇండస్ట్రీ సూచిస్తుంది. నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌ సినిమా దసరా భారీ హిట్‌ కావడంతో ది ప్యారడైజ్‌పై నిర్మాత ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారట. ఆపై సినిమా కూడా చాలా బలంగా ఉండటంతో ఖర్చ ఎంతైనా సరే అనేంత రేంజ్‌లో ఆయన ఫ్రీడమ్‌ ఇచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ గురించి వచ్చిన పుకార్లు నిజమైతే.., ఈ సినిమా సురక్షితమైన స్థానంలో ఉండాలంటే అనూహ్యమైన భారీ విజయాన్ని అందుకోవాల్సిందే.. ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవని ముందే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే, నాని తన కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 40 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉంది, కానీ నిర్మాణ జాప్యాల కారణంగా వాయిదా పడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో జడల్‌ అనే పవర్‌ఫుల్‌ రా రస్టిక్‌ పాత్రలో నాని కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు.నిర్మాత చెరుకూరి సుధాకర్‌ గురించిచెరుకూరి సుధాకర్‌ సినిమాల పట్ల ఆసక్తితో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి 2016లో రన్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాతగా పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, విరాట పర్వం, వంటి సినిమాలను నిర్మించారు. 2023లో విడుదలైన దసరా సినిమాతో తొలి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకున్న ఆయన రీసెంట్‌గా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మంచి లాభాలు అందుకున్నారు. అయితే, నిర్మాతగా రంగబలి, రామారావు ఆన్‌డ్యూటీ వంటి డిజాస్టర్స్‌ కూడా తన ఖాతాలో ఉన్నాయి. ది ప్యారడైజ్ మూవీ తరవ​ఆ మెగాస్టార్‌ 157వ సినిమాను ఆయన నిర్మించనున్నారు. అయితే, ది ప్యారడైజ్ మూవీ విషయంలో నిర్మాత చెరుకూరి సుధాకర్‌ భారీ రిస్క్‌ చేస్తున్నారని

After six years again movie plan with Rakesh Om Prakash3
ఆరేళ్ల తర్వాత బిగ్‌ ప్రాజెక్ట్‌ లోడింగ్‌.. కర్ణుడిగా సూర్య

నటుడు సూర్య ఒక్కసారి కథను నమ్మితే, ఆ చిత్రం కోసం ప్రాణం పెడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అలా ఆయన ప్రతి చిత్రానికి తన వంతు కృషి చేస్తారు. ఇక జయాపజయాలు అన్నది ఎవరి చేతిలోనూ ఉండవు. కంగువా చిత్రం విషయంలో కూడా జరిగింది ఇదే. భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన చిత్రం అది. ఆ చిత్రంలో నటుడు సూర్య నటనను ఎవరూ విమర్శించలేదు సరికదా విమర్శకులు సైతం ప్రశంసించారు. అనివార్య కారణాల వల్ల కంగువా చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే ఆ తరువాత సూర్య నటించిన రెట్రో చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్నే అందుకుంది. కాగా సూర్య ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు చిత్రాన్ని పూర్తి చేశారు. ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో టాలీవుడ్‌ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా మాలీవుడ్‌ దర్శకుడు జీతు మాదవన్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 47వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన మరోసారి తనకు బాగా కలిసొచ్చిన పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నారు. కర్ణుడిగా సూర్యహిందీ చిత్రంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మహాభారతం ఇతిహాసంలోని కర్ణుడి ఇతి వృత్తంతో పాన్‌ ఇండియా స్థాయిలో కర్ణ పేరుతో భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు,అందులో కర్ణుడి పాత్రలో నటుడు సూర్య, నటి జాన్వీకపూర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు 2024లో ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.దీంతో కర్ణ చిత్రం అనివార్య కారణాల వల్ల డ్రాప్‌ అయ్యిందనే ప్రచారం వైరల్‌ అయ్యింది. అలాంటిది ఇటీవల దర్శకుడు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ ఒక భేటీలో పేర్కొంటూ కర్ణ చిత్రం డ్రాప్‌ కాలేదనీ, దీని కోసం ఆరేళ్ల క్రితమే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనికి స్క్రీన్‌ప్లేను పూర్తిగా రాసినట్లు ఇక షూటింగ్‌ను ప్రారంభించడమే తరువాయి అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది కానీ, డ్రాప్‌ కాలేదని స్పష్టం చేశారు.ఈ చిత్రం కోసం ఏఆర్‌.రెహామాన్‌ ఆరు పాటలను రెడీ చేశారని దర్శకుడు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ తెలిపారు. మొత్తం మీద సూర్యను ఆయన అభిమానులు కర్ణుడిగా చూడబోతున్నారన్నమాట.

Paradise Movie Release Date Clarity Ram Charan Peddi Date in Suspence4
"ది ప్యారడైజ్" రిలీజ్‌పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్‌లోనే!

నాని, రామ్‌ చరణ్‌ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్‌లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్‌నే తీసుకుంటున్నారు. మరోవైపు రామ్‌ చరణ్‌ "పెద్ది" సినిమా రిలీజ్‌ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్‌తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్‌ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Vithika Sheru Movie Dear Astronaut Birthday Glimpse out now5
వ్యోమగామిగా వితికా శేరు.. ఆసక్తికరంగా గ్లింప్స్

వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం డియర్‌ ఆస్ట్రోనాట్‌. ఈ మూవీకి కార్తిక్‌ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వితికా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో వితికా శేరు భర్త వరుణ్‌ సందేశ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ వితికా శేరు బర్త్‌ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా వితికా షేరు కనిపించనున్నారు. అంజలి అనే వ్యోమగామి పాత్రలో మెప్పించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన గ్లింప్ల్ విజువల్స్‌ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీని యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైత్ర పెద్ది, గీతా భాస్కర్, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల సంగీతమందిస్తున్నారు.

Devagudi Movie has success with the appreciation of audiences6
దేవగుడి సక్సెస్‌.. ఆనందంగా ఉందన్న డైరెక్టర్‌

అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం దేవగుడి. ఈ మూవీని బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్‌గా వచ్చాయి. అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనతో కూడా అందరిని ఆకట్టుకున్నారు. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారని' అన్నారు.హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ..' కొన్నేళ్లుగా హీరో కావాలనే కలను ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్‌లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డికే చెందుతుంది. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. 'ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా మీ ముందుకు వచ్చా. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి అని పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు' అని అన్నారు.

Music director koti Comments about SS Thaman BGM Style7
తన అనుభవం అంతవరకే.. అది మారదు: తమన్‌పై కోటి కామెంట్స్

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (సాలూరి కోటేశ్వరరావు) పేరు పరిచయం ‍అక్కర్లేదు. తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా తెలుగు సినిమాపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సంగీత దర్శకుల గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఏఆర్‌ రెహమాన్‌తో పాటు ఎస్ఎస్ తమన్ గురించి వ్యాఖ్యానించారు.టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ గుర్తిస్తుందని కోటి అన్నారు. తమన్ కూడా మంచి మ్యూజిక్ అందించారని.. నేషనల్ ‍అవార్డ్ కూడా అందుకున్నాడని.. వరల్డ్ మ్యూజిక్‌కు దగ్గరగా ఉంటుందని తెలిపారు. బీజీఎం పరంగా తమన్ స్టైల్ చాలా బాగుంటుందని అన్నారు. తమన్ రిపీటెడ్‌గా చేయడంపై చేస్తారన్న ప్రశ్నకు కోటి స్పందించారు.ఇక్కడ అతనికి ఒక ప్రొగ్రెషన్ అనేది రిపీట్ అవుతుందని కోటి అన్నారు. తన అనుభవం అంతవరకే.. అది మారదని తెలిపారు. ఎవరికైనా ఒక టైమ్ ఉంటుందని.. అంతవరకే చేయగలరని వెల్లడించారు. కొత్త నీరు వస్తూనే ఉంటోంది.. దాన్ని మనం అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరి స్టాండర్స్ వాళ్లవని సంగీత దర్శకుడు కోటి అన్నారు. మార్కెట్‌ ప్రకారమే మనం ముందుకు వెళ్లాలని సూచించారు. మ్యూజిక్‌లో ‍ప్రజంటేషన్‌ అనేది చాలా ముఖ్యమని తెలిపారు. ఇప్పుడున్న జనరేషన్‌లో నాకు మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని అన్నారు.

Brahmanandam comments on birthday celebrations8
ఆ ముగ్గురి వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నా: బ్రహ్మనందం

టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం తన 70వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనదైన కామెడీతో సినీ ప్రియులను దశాబ్దాలుగా అలరించిన బ్రహ్మనందం 42 ఏళ్లుగా వెండితెరపై అలరిస్తున్నారు. తాజాగా తన 70వ బర్త్ డే వేడుకలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.ఇన్నేళ్లుగా తాను నటుడిగా కొనసాగుతున్నానంటే అదంతా ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలే కారణమని అన్నారు. నా సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నందుకు తెలుగు కళామతల్లికి శిరస్సు వంచి పాదాభినందనాలు చేస్తున్నానన్నారు. ఇన్ని సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు గొప్పతనం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని బ్రహ్మనందం తెలిపారు.నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కీర్తిశేషులు జంధ్యాల గారు, చిరంజీవి, రామానాయుడే కారణమని బ్రహ్మనందం అన్నారు. నాలో టాలెంట్‌ను గుర్తించి చంటబ్బాయి సినిమాలో నన్ను చిరంజీవి పరిచయం చేశారు. ఆ తర్వాత జంధ్యాల నాకు ఆహా నా పెళ్లంట మూవీలో అవకాశమిచ్చారని తెలిపారు. ఇన్ని వందల సినిమాలు చేయడంలో నా గొప్పతనం ఏమీ లేదన్నారు. మీ అందరి ఆదరణ, ప్రేమ వల్లే ఈ బ్రహ్మనందం ఇక్కడ ఉన్నారని అన్నారు.

Daughter Sentiment Workout to Ram Charan, Ranbir Kapoor, Ranveer Singh Movies9
కూతురు తెచ్చిన అదృష్టం.. హీరోల రేంజ్‌ మారిపోయింది!

ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్‌ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్‌ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్‌లోనే హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..పాప తెచ్చిన సంతోషంబాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ 2023లో 'యానిమల్‌' మూవీతో సాలిడ్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్‌బీర్‌ కెరీర్‌లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్‌బీర్‌- ఆలియా భట్‌ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్‌బీర్‌కు బాగా కలిసొచ్చింది. సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా యానిమల్‌ పార్క్‌ రాబోతోంది.అదృష్టంబాలీవుడ్‌లో మరో స్టార్‌ జోడీ రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్‌లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్‌వీర్‌ కెరీర్‌కు కూడా మంచి బూస్ట్‌ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్‌ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాకు కూడా సీక్వెల్‌ వస్తోంది. ఈ ఏప్రిల్‌ 17న ధురంధర్‌ 2 విడుదల కానుంది.పెద్ది కూడా బ్లాక్‌బస్టర్‌!టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రామ్‌చరణ్‌-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్‌కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్‌ నెక్స్ట్‌ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్‌కు మళ్లీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్‌ విన్నర్‌ను గెస్‌ చేస్తే రూ.50 లక్షలు!

Krithika sheru emotional post about her sister Vithija Sheru Birthday occassion10
అక్కా.. నిన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నా: చెల్లి ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు గురించి ప్రత్యేకంగా పరిచయం ‍అక్కర్లేదు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి బిగ్‌బాగ్ 3వ సీజన్‪లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే గతేడాది వరుణ్ సందేశ్ బర్త్‌ డే కానుకగా ఏకంగా సొంతింటినే గిఫ్ట్‌గా ఇచ్చింది వితికా శేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అంతేకాకుండా 2025 నవంబర్‌లో తన చెల్లి సీమంతం వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన చెల్లి సీమంతాన్ని తానే దగ్గరుండి మరీ నడిపించింది. అక్కగా అన్నీ తానై చెల్లి క్రితిక శేరు సీమంతాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.తాజాగా ఇవాళ తన అక్క వితికా శేరు బర్త్‌ డే కావడంతో చెల్లి క్రితిక శేరు విషెస్ తెలిపింది. తన కోసం అక్క చేసిన క్షణాలను గుర్తు చేసుకుంది. తన వెంట ఉంటూ అండగా నిలిచిన అక్కకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చాలా కాలంగా నేను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నువ్వు ఎప్పుడు బిజీగా ఉన్నా.. బాధ్యతలను మోస్తూ.. మన కుటుంబాన్ని చూసుకోవడానికి నీ కెరీర్‌ను నిర్మించుకుంటూనే ఉన్నావంటూ రాసుకొచ్చింది. నా చిన్నప్పుడు ఇతరుల్లో ఉన్నంత అనుబంధం మనలో లేదని నాకు అనిపించింది.. కారణాలు తెలియకుండానే నిన్ను చాలాసార్లు ప్రశ్నించానంటూ భావోద్వేగానికి గురైంది క్రితిక శేరు.క్రితిక శేరు తన ఇన్‌స్టాలో రాస్తూ..' నా పెళ్లి తర్వాత.. ముఖ్యంగా ఈ గర్భధారణ సమయంలో ప్రతిదీ మారిపోయింది. దూరం వల్ల నీ ప్రేమ నాకు చాలా స్పష్టంగా కనిపించింది. నువ్వు చిన్న చిన్న విషయాలను గమనించావు. నన్ను భావోద్వేగంగా.. మానసికంగా ఆదుకున్నావు. ఈ ప్రయాణాన్ని నాకు చాలా సులభతరం చేసి మరింత అందంగా మార్చావ్. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా నా కోసం నువ్వు నిలబడ్డావ్. చివరికీ ఈరోజు నేను నిన్ను అర్థం చేసుకున్నా అక్కా. నీ ప్రేమ నాపై ఎల్లప్పుడూ బలంగా ఉంది. నువ్వు నా కోసం చేసిన ప్రతి చిన్న పనికి ధన్యవాదాలు. ఈ రోజు నా బలం, నా మద్దతు.. నాకు అతిపెద్ద ఆశీర్వాదం నువ్వే అక్కా. నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది తెలుసుకున్న అభిమానులు వితికా శేరుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru)

Advertisement
Advertisement