Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood actresses Social Media posts in instagram 1
బ్లాక్ శారీలో బిగ్‌బాస్ దివి పోజులు.. సాహితి స్టన్నింగ్ గ్లామరస్ పిక్స్!

బ్లాక్ శారీలో బిగ్‌బాస్ దివి అందాలు..టాలీవుడ్ నటి సాహితి దాసరి స్టన్నింగ్ గ్లామర్ పిక్స్..డిఫరెంట్ డ్రెస్‌ల్లో రెజీనా కసాండ్రా లుక్స్..సముద్రపు ఒడ్డున చిల్ అవుతోన్న ఆండ్రియా జెరెమా..పింక్ శారీలో బాలీవుడ్ భామ నైరా బెనర్జీ అదిరిపోయే గ్లామర్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nyrraa M Banerji (@nyra_banerjee) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7)

Tourist Family Director Abishan Jeevinth about ss rajamouli sir2
రాజమౌళి సార్ అలా చేస్తారని ఊహించలేదు: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్

టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్‌ జీవింత్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ చిత్రంలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇ‍ప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అభిషన్ జీవింత్ మాట్లాడారు.టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి అభిషన్ జీవింత్ కామెంట్స్ చేశారు. నా సినిమాకు రాజమౌళి సార్ ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నారు. ఆయన వల్లే నా సినిమా తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైందని అన్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం గురించి ట్వీట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటూ మాట్లాడారు. మీ వల్లే ఆ సినిమా నాకు ప్రత్యేకంగా గుర్తుండి పోతుందని అభిషన్ ఆనందం వ్యక్తం చేశారు.కాగా.. అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్‌ లవ్‌. ఈ మూవీకి మదన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.రాజమౌళి గారు టూరిస్ట్ ఫ్యామిలీ గురించి ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదు..ఆయన ట్వీట్ తర్వాత నా సినిమా తెలుగు ఆడియన్స్ కి చేరువైంది#AbishanJeevinth #AnaswaraRajan #SoundaryaRajinikanth #Madhan #WithLove pic.twitter.com/JaWNxhAI2o— Filmy Focus (@FilmyFocus) January 30, 2026

Who is Keerthi Bhat, Break up with Vijay Karthik, Participated in Telugu Bigg Boss 63
యాక్సిడెంట్‌తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్‌.. కీర్తి నేపథ్యం

హాయిగా ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్‌ చేయాల్సిన సమయంలో కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. నటిగా జర్నీ మొదలుపెట్టినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే చేయి లేకున్నా స్వయంకృషితో ఎదిగింది. కాళ్లలోని ఐరన్‌ రాడ్స్‌ తన ముందడుగును ఆపలేకపోయాయి. నా అనేవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కెమెరా ముందు మాత్రం బలవంతంగా నవ్వు పులుముకునేది. తనే కీర్తి భట్‌. ప్రియుడితో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న కారణంగా వార్తల్లో ఉన్న కీర్తి గురించే ప్రత్యేక కథనం.యాక్సిడెంట్‌తో జీవితం తలకిందులుకీర్తి భట్‌ కన్నడ అమ్మాయి. 2017లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని కోల్పోయింది. తల్లిదండ్రులు, అన్నవదిన అందరూ దూరమయ్యారు. తీవ్ర గాయాలపాలైన కీర్తి కొన ప్రాణంతో బయటపడింది. కొంతకాలం కోమాలో ఉండి కోలుకుంది. అయితే యాక్సిడెంట్‌ వల్ల తను తల్లయే అదృష్టాన్ని కోల్పోయింది. ఎవరూ లేని అనాథగా బతుకు వెల్లదీస్తూనే తన కెరీర్‌ను తనే నిర్మించుకుంది. ఫస్ట్‌ లవ్‌అలాంటి సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమ పేరుతో వెంబడించాడు. అతడి ప్రేమ నిజమేననుకుంది, కరిగిపోయింది. ఇకపై తాను అనాథ కాదనుకుని పొంగిపోయింది. అతడి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించింది. కానీ అదంతా కపట ప్రేమ అని కొంతకాలానికే అర్థమైపోయింది. తన డబ్బును వాడుకుంటున్నారని ఆల్యంగా తెలుసుకుంది. తాను నటించే సీరియల్‌ హీరోతో షోకి వెళ్లినా ప్రియుడు, అతడి తల్లి అనుమానించేవారు. ఆఖరికి కీర్తి దత్తత తీసుకున్న పాప కూడా కన్నకూతురేనేమో అని డీఎన్‌ఏ టెస్టుకూ సిద్ధపడ్డారు.బిగ్‌బాస్‌ షోఇక భరించలేకపోయింది. అతడి ప్రేమకు దండం పెట్టేసి ఆ రిలేషన్‌ నుంచి బయటకు వచ్చింది. ఇంతలో తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ నుంచి ఆఫర్‌ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు దత్తత తీసుకున్న పాప కూడా చనిపోయేసరికి ఆమె గుండె ముక్కలయింది. ఆ బాధను దిగమింగుకుని బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. ఆరో సీజన్‌లో ఫస్ట్‌ లేడీ కెప్టెన్‌గా నిలిచింది. ఫినాలేలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఎంగేజ్‌మెంట్‌బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక హీరో, దర్శకుడు విజయ్‌ కార్తీక్‌ రూపంలో తనకు తోడు దొరికింది. తను ఎప్పటికీ తల్లి కాలేదని తెలిసినా.. కీర్తియే తనకు చిన్నపాప అంటూ అతడి కుటుంబం అంతా ప్రేమగా చూసుకుంది. ఈ సంతోషం జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంది. 2023లో కీర్తి- విజయ్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో బ్రేకప్‌ చెప్పుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయామని కీర్తి అంటుంటే.. నా దగ్గర డబ్బుల్లేవని మరొకర్ని చూసుకుంటుందని విజయ్‌ కార్తీక్‌ ఆరోపించాడు.బ్రేకప్‌అతడి ఆరోపణలకు తోడు సోషల్‌ మీడియాలో తనపై వదంతులు సృష్టిస్తుండటంతో కీర్తి మనస్తాపానికి గురైంది. తనకేదైనా జరిగితే అసత్య ప్రచారం చేస్తున్నవారే బాధ్యులు అని మండిపడింది. ఏదేమైనా ఈ బాధలో నుంచి కీర్తి బయటకు వచ్చి మళ్లీ మామూలు జీవితం గడపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కీర్తి.. మనసిచ్చి చూడు, మధురానగరిలో, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: అదే నన్ను కుంగదీస్తోంది.. నాకేదైనా జరిగితే..: కీర్తి భట్‌

Soundarya Rajinikanth responds on rajinikanth politcal entry 4
రజినీకాంత్ పొలిటికల్ నిర్ణయం.. కుమార్తె ఏమన్నారంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్ పాలిటిక్స్‌లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్పందించారు. విత్ లవ్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తన తండ్రి నిర్ణయం పట్ల తమకెలాంటి బాధ లేదన్నారు. ఆయనకు ఏది నచ్చితే కుటుంబమంతా మద్దతుగా ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా రజనీ- కమల్‌హాసన్‌ సినిమాపై జరుగుతున్న ప్రచారంపై కూడా స్పందించారు. ఈ కాంబినేషన్‌ మూవీకి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అవీ ఓకే అయితే త్వరలోనే వివరాలను ప్రకటిస్తామన్నారు. కాగా.. అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్‌ లవ్‌. ఈ మూవీకి మదన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.నాన్నగారి రాజకీయ ప్రస్థానం విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు - సౌందర్య రజనీకాంత్#AbishanJeevinth #AnaswaraRajan #Madhan #WithLove #SoundaryaRajinikanth pic.twitter.com/BXkhJE02Z4— Filmy Focus (@FilmyFocus) January 30, 2026

Why Dhurandhar is shorter on Netflix than in theatres5
ఓటీటీలో తగ్గిన దురంధర్ రన్‌టైమ్.. అసలు కారణలేంటి?

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ్టటిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ల వర్షన్ కంటే ఓటీటీలో 9 నిమిషాల నిడివి తగ్గడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఓటీటీకి వచ్చే సినిమాలు దాదాపు ఇంకా సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దురంధర్‌ మూవీని కట్‌ చేయడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకు ఆ తొమ్మిది నిమిషాలు ఎందుకు తొలగించారన్న దానిపై ఆడియన్స్‌లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.రన్‌టైమ్ అసలు వెర్షన్ కంటే ఎందుకు తక్కువగా ఉందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభంలో 3 గంటల 34 నిమిషాలు ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, బూతులను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ కోసం అనవసరమైన సీన్స్‌ తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంజయ్ దత్ సీన్స్‌పై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలను సవరించాలని చిత్రనిర్మాతను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఆ తర్వాత కొత్త వర్షన్ జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 4, జనవరి 5 నాటి సెన్సార్ సర్టిఫికేట్ల ప్రకారం సవరించిన రన్‌టైమ్ సుమారు 209 నిమిషాలు(సుమారు 3 గంటల 29 నిమిషాలు). అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌లోని వర్షన్ సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. అంతేకాకుండా యాడ్స్‌ కూడా ఓటీటీలో కనిపించకపోవచ్చని.. ఇది కూడా రన్‌టైమ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏదైనా సీన్స్‌ తొలగించారో లేదో అధికారికంగా ప్రకటించలేదు.నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌కు ఒక సినిమాను కత్తిరించడానికి హక్కు లేదు. అయితే మేకర్స్ అనవసర సీన్స్‌ తొలగించినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలు అందించిన వర్షన్‌ మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓటీటీలు ప్రాథమికంగా కేవలం పంపిణీదారులుగా మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప సినిమాలో ఏవైనా మార్పులు జరిగితే అవి కేవలం నిర్మాత వైపు నుంచే జరగాలి. లేదంటే కొన్నిసార్లు ప్లాట్‌ఫారమ్ అభ్యర్థన మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా.. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 'ధురందర్' సీక్వెల్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.

Hrithik Roshan Sister Sunaina Opens about her Battle with Alcoholism6
ఒకప్పుడు తాగుడుకు బానిసనయ్యా..: హృతిక్‌ రోషన్‌ సోదరి

అలవాట్లకు బానిసవడం ఈజీయేమో కానీ దాన్ని వదిలించుకుని బయటకు రావడం కష్టం. కానీ, ఆ కష్టాన్ని తను జయించానంటోంది బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ సోదరి సునయన రోషన్‌. మద్యపానం అనే వ్యసనం నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాలను తాజాగా గుర్తు చేసుకుంది.అదే పెద్ద విషయంసునయన మాట్లాడుతూ.. సమస్యను అంగీకరించడం అన్నింటికంటే పెద్ద విషయం. ఒక్కసారి మనం తప్పు చేస్తున్నామని గుర్తించామంటే అక్కడే మార్పు మొదలవుతుంది. తిండి, మద్యపానం.. ఇతరత్రా ఎన్నో అలవాట్లు వ్యసనంగా మారుతుంటాయి. మనం అందులో పూర్తిగా మునిపోతున్నామన్నది మనకే అర్థం కాదు. నేను తాగుడుకు బానిసయ్యాను. తర్వాత ఒకానొక సమయంలో స్వీట్లు, జంక్‌ ఫుడ్‌ ఎక్కువ లాగించడం మదలుపెట్టాను. ఒక్క అడుగువాటన్నింటినీ వదిలించుకోవడం, దూరం పెట్టడం అంత ఈజీ కాదు. ధృడ సంకల్పం, మనచుట్టూ ఉండేవారి సపోర్ట్‌తోనే వ్యసనాల నుంచి బయటకు రాగలం. ఒక్క అడుగు ముందుకేసి వాటిని జయించొచ్చు. భయపడకుండా ముందడుగు వేయండి. ఓపెన్‌గా మాట్లాడండి అని ఓ వీడియో షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌కు హృతిక్‌ రోషన్‌ స్పందిస్తూ లవ్యూ దీదీ అని కామెంట్‌ పెట్టాడు. తండ్రి రాకేశ్‌ రోశన్‌ సైతం నువ్వొక ఇన్‌స్పిరేషన్‌ అని కామెంట్‌ చేశాడు.వ్యసనంగా..గతంలోనూ సునయన తన తాగుడు వ్యసనం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. కొద్దిగా మొదలైన తాగుడు తర్వాత తీవ్రంగా మారిందని తెలిపింది. పొద్దున్నుంచి రాత్రి వరకు తాగడం ఒకటే పనిగా పెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే మద్యపానం సేవించడం వల్ల తాను ఏం చేస్తున్నాననే విషయాలను కూడా మర్చిపోతున్నట్లు తెలిపింది. డీ అడిక్షన్‌ సెంటర్‌కు కూడా వెళ్లానని, చివరకు ఈ వ్యసనంపై విజయం సాధించానంది.చదవండి: ఫలక్‌నుమాదాస్‌.. విశ్వక్‌తో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న హీరో ఎవరంటే?

Tollywood Movie Zamana Review and Rating In Telugu7
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

సూర్య శ్రీనివాస్, సంజీవ్, స్వాతి కశ్యప్ నటించిన తాజా చిత్రం జమానా. భాస్కర్ జక్కుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల అయింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మ్యూజియంలో దొంగతనంతో సినిమా ప్రారంభమవుతుంది. హీరో సూర్య ఒక దొంగ.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. ఒక పెద్ద స్కాం చేసి సెట్ అవుదాం అనుకుంటాడు. అదే సమయంలో స్వాతితో ప్రేమలో పడతాడు. ఇంతలో ఇంకో గ్యాంగ్ సంజీవ్.. ఒక లోకల్ రౌడీ షీటర్, ఒక రాజకీయ నాయకుడు , ఒక మాఫియా లీడర్. ఇలా ఒక పెద్ద టీం ఉంటుంది.. ఈ అన్ని టీం లకు ఒకరికి తెలీకుండా ఒకరు డీలింగ్స్‌ ఉంటాయి. అసలు గ్యాంగ్స్‌ చేసే స్కామ్స్‌ ఏంటో తెలియాలంటే జమానా సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫస్ట్ హాఫ్‌లో హీరో చేసే స్కాం ల చుట్టే తిరుగుతుంది. సంజీవ్ ఎపిసోడ్ .. పది లక్షలు ఎపిసోడ్ ప్రథమార్థంలో ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. ఇంకా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అసలు ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ బ్యాంగ్ పడుతుంది. డైరెక్టర్ భాస్కర్ జక్కుల తాను తీసుకున్న లైన్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్‌లో కథ పరిగెడుతుంది . మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. అతను రాసుకున్న కథ, కథనం చాలా బాగుంది. ఈ కథను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు. దర్శకుడి మేకింగ్ కూడా అద్భుతంగా అనిపించింది. ఓవరాల్‌గా చూస్తే ఆడియన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా క్లైమాక్స్‌ సూపర్బ్‌ అనేలా ఉంది. డైరెక్టర్ సినిమా మొదటి నుంచి చివరి వరకు.. ప్రేక్షకుల్లో థ్రిల్లింగ్‌ కలిగించాడు. థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వారికి జమానా ఓకే.ఎవరెలా చేశారంటే..హీరో సూర్య చాలా అద్భుతంగా చేశాడు. హీరోయిన్ స్వాతి కశ్యప్ తన గుడ్ లుక్‍తో అదరగొట్టేసింది. సాంకేతికత విషయానికొస్తే విజువల్ పరంగా కూడా గ్రాండ్‌గా ఉంది. కేశవ కిరణ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. వర్మ ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిస్పీగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ నిర్మాణ సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.

Abhishan, Jeevinth and Anaswara Rajan Movie With Love Telugu Trailer8
కాలేజీ ప్రేమకథా చిత్రం 'విత్ లవ్'.. ఆసక్తిగా ట్రైలర్

టూరిస్ట్‌ ఫ్యామిలీ మూవీతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్‌ జీవింత్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ మూవీలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కాలేజీ నేపథ్యంలోనే సాగే ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ నిర్మించారు.

Vishwak Sen Says Thiruveer Missed Falaknuma Das Movie9
విశ్వక్‌ 'ఫలక్‌నుమా దాస్‌'.. చేజార్చుకున్న​ హీరో ఎవరంటే?

బొమ్మలరామారం సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు తిరువీర్‌. ఘాజి, ఏ మంత్రం వేసావె, మల్లేశం చిత్రాల్లో నటించాడు. జార్జ్‌ రెడ్డి, పలాస 1978 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మసూదతో హీరోగా మారాడు. ద గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షోతో గతేడాది మంచి హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు అని కొత్త సినిమా చేస్తున్నాడు. నా డైరెక్షన్‌లో చేయాల్సింది!జీజీ విహారి దర్శకత్వం వహించిన ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. శుక్రవారం (జనవరి 30) నాడు భగవంతుడు మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. నా ఫస్ట్‌ సినిమా ఫలక్‌నుమా దాస్‌లో తిరువీర్‌ నాతోపాటు కలిసి నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు అని చెప్పాడు. మరో సినిమాబహుశా ఫలక్‌నుమా దాస్‌లో విలన్‌ పాత్ర కోసం మొదట తిరువీర్‌ను అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ, చివరకు అది జరగలేదు. ఇకపోతే తిరువీర్‌ చేతిలో మరో మూవీ కూడా ఉంది. అదే ఓ సుకుమారి. తిరువీర్‌ హీరోగా, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్‌ దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.​చదవండి: అమ్మానాన్న ఆనంద భాష్పాలు.. ఎన్నటికీ మర్చిపోలేను: సారా అర్జున్‌

Aishwarya Rajesh Shares His horrific experience In recent interview10
నైట్ డ్రెస్‌లో నన్ను చూడాలని అన్నాడు: ఐశ్వర్య రాజేశ్

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టేసిన కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకేటేశ్ హీరోగా నటించారు. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా మెప్పించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే ఈ మూవీతో టాలీవుడ్‌లోనూ ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఐశ్వర్య ఆసక్తికర కామెంట్ల్ చేసింది. ప్రతి ఒక్క అమ్మాయి ఏదొక టైమ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటారని తెలిపింది. నైట్ అమ్మాయిలు కొంచెం సెక్సీగా ఉండే దుస్తులు వేసుకుంటారు కదా.. నువ్వు ‍‍అలాగే వేసుకుంటే 'ఐ వాంట్ సీ యువర్ బాడీ'అని నాతో అన్నారని గుర్తు చేసుకుంది. అది చూసి ఇలా ఎంతమంది అమ్మాయిలని చేసుంటారని నాకు అనిపించిందని ఐశ్వర్య రాజేశ్ వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదు. అంతేకాకుండా మా నాన్న గారు నా చిన్నప్పుడే చనిపోయారంటూ ఎమోషనలైంది. డ్రెస్‌ల విషయంలో మనం సందర్భానికి తగినట్లుగా వేసుకోవడం మంచిదని ఐశ్వర్య రాజేశ్ అన్నారు. ప్రతి ఒక్క అమ్మాయి ఏదొక Time లో ఇలాంటి Situation face చేసే ఉంటారు 🙂 pic.twitter.com/kYQDUEcCLM— Harika (@Harika_1023) January 29, 2026

Advertisement
Advertisement