Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Eesha Rebba Police Complaint over Abusive Comment1
అసభ్య కామెంట్స్‌.. పోలీసులకు హీరోయిన్‌ ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్‌ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈషా రెబ్బ పెట్టిన పోస్ట్‌కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్‌ పెట్టాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఈషా.. అతడి ఐడీతో పాటు కామెంట్‌ను చూపించింది.కేసు నమోదుఆమె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి ఇలా చెండాలంగా కామెంట్స్‌ పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు. కాగా ఈషా రెబ్బ.. ఇటీవల 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాలో నటించింది.చదవండి: చిన్నతనంలో నేను పడ్డ బాధ.. అందుకే పిల్లలు వద్దు: నటి

Bigg Boss fame Vada Pav girl Chandrika Dixit Accuses her Husband of cheating2
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్‌ గర్ల్‌'.. వీడియో రిలీజ్‌

ఢిల్లీ వీధుల్లో వడాపావ్‌ అమ్ముతూ ఫేమస్‌ అయింది చంద్రికా దీక్షిత్‌. సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ అమ్మాయి హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌లోనూ పాల్గొంది. తాజాగా.. భర్త యుగం గేరాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కింది. భర్త మోసం చేస్తున్నాడంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో చంద్రిక మాట్లాడుతూ.. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలేనా అని అడుగుతున్నారు. రెండు నెలలుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? నావల్ల కావట్లే..అన్నింటినీ మౌనంగా భరిస్తున్నాను. నా బాధేంటో మీకు చెప్పనా? అటు పిల్లాడిని, ఇటు ఇంటిని.. అన్నింటినీ మ్యానేజ్‌ చేసుకుంటున్నాను. అన్ని బాధ్యతలు నేనే నిర్వర్తిస్తున్నాను. ​అయినా అతడు (భర్త) ఇలా చేస్తుంటే నేనేం చేయాలి? (ఫోన్‌లో చాటింగ్‌ స్క్రీన్‌షాట్‌, భర్తతో క్లోజ్‌గా ఉన్న ఓ అమ్మాయి ఫోటోలు చూపిస్తూ) ఈ అమ్మాయి ఎప్పుడూ నా భర్త చుట్టూనే తిరుగుతోంది. నా భర్త, నా ఇల్లు అని ఏదేదో అంటోంది. ఈ ఫోటోలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నా మెదడును పని చేయనివ్వడం లేదు. నావల్ల కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.గుర్తుపెట్టుకో..దీనిపై ఆమె భర్త యుగం గేరా స్పందించాడు. నీకు అవసరమైంది నువ్వు చూపించావు. నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ, అదేమంత పెద్ద తప్పు కాదు. సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నావ్‌.. అలాంటివి నాదగ్గర చాలా ఉన్నాయి. నేను అనుకుంటే చాలా చేయగలను. కానీ నేనేమీ చేయను. ఇంకోటి.. నీ రెస్టారెంట్‌ నావల్లే నడుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకో అని కౌంటరిచ్చాడు. కాగా చంద్రికా.. ఆర్టిస్ట్‌ యుగం గేరాను పెళ్లి చేసుకుంది. యుగం గేరా.. చంద్రిక కంటే రెండుమూడేళ్లు చిన్నవాడు. ఈ దంపతులకు కుమారుడు రుద్ర సంతానం. View this post on Instagram A post shared by Chandrika Gera (@chandrika.dixit) చదవండి: అందుకే పిల్లల్ని కనలేదు: ప్రముఖ నటి

Telugu Movies Postponed Fear Of Dhurandhar 23
'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?

కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్‌కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్‪‌లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్‌లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్‌ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్‌గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?)

Malayalam Actress Lena about not having Kids, Reason is4
అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి

ఓ వయసుకు రాగానే పెళ్లి చేసుకోవం, పిల్లల్ని కనడం అనేది ఒక రూల్‌లా అయిపోయింది. కానీ, పెళ్లయ్యాక తప్పకుండా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదంటోంది మలయాళ నటి లీనా. బాధ్యతగా ఉంటామనుకుంటే తప్ప పిల్లల జోలికి వెళ్లకూడదని చెప్తోంది. లీనా మాట్లాడుతూ.. సంతానం వద్దని నేను బలంగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని కనడానికి ముందు వాళ్లను ఎలా చూసుకోవాలి? ఎలా పెంచాలి? అన్న ప్లానింగ్‌ ఉండాలి. బాధ్యత అవసరంతల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచాలి. పెళ్లవగానే పిల్లల్ని కనాలంటారు. దానికి నేను వ్యతిరేకం. చిన్న వయసులోనే పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కిడ్న్‌ను హ్యాండిల్‌ చేసే మెచ్యూరిటీ కూడా ఆ వయసులో ఉండదు. నా చిన్నప్పుడు పేరెంట్స్‌ నన్ను సరిగా పెంచలేదని అనుకుంటూ ఉండేదాన్ని. నాపై ఇంకాస్త ఫోకస్‌ చేయాల్సిందని ఫీలయ్యేదాన్ని. కొన్నిసార్లు స్వేచ్ఛ కోసం పోరాడేదాన్ని. సంతానం వద్దనుకున్నా..మరికొన్నిసార్లు నా పనులన్నీ నన్నే చేసుకోమంటున్నారని కోప్పడేదాన్ని. ఒక్కోసారేమో నాకు ఎవరూ సపోర్ట్‌ చేయలేడం లేదు, ప్రతిసారి ఒంటరిగా వదిలేస్తున్నారని బాధపడేదాన్ని. ఇలా ఎప్పుడూ ఏదో ఒకరకమైన విచారంలో బతికేదాన్ని. నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే పిల్లల్ని కనాలన్న ఆలోచన కూడా రానివ్వడం లేదు. పైగా నేను ఎంచుకుంది యాక్టింగ్‌ కెరీర్‌. కెరీర్‌ఇక్కడ కుటుంబం, కెరీర్‌.. రెండూ చూసుకోవడం అంటే కష్టం. తల్లిదండ్రులిద్దరూ కెరీర్‌ అని పరుగులు పెడితే పిల్లల్నెవరు చూసుకుంటారు. అందుకే పిల్లల్ని ప్లాన్‌ చేయలేదు అని చెప్తోంది. మలయాళంలో అనేక సినిమాలు చేసిన లీనా తెలుగులో డాక్టర్‌ చక్రవర్తి మూవీలో కనిపించింది. షైతాన్‌ అనే తెలుగు వెబ్‌ సిరీస్‌లోనూ అలరించింది. కాగా లీనా 2004లో అభిలాష్‌ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. తర్వాత గగన్‌యాన్‌ వ్యోమగామి ప్రశాంత్‌ నాయర్‌ను వివాహం చేసుకుంది.చదవండి: అందువల్లే 4 ఏళ్లు సినిమాలకు బ్రేక్‌: మాధవన్‌

Sara Arjun As Chiranjeevi Daughter Role5
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?

ఈ మధ్య కాలంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. గత డిసెంబరులో రిలీజైనప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇందులో నటించిన రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్.. ఇలా అందరికీ మంచి పేరు వచ్చింది. హీరోయిన్‌గా చేసిన సారా అర్జున్ కూడా ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె.. చిరంజీవి కూతురిగా నటించే బంపరాఫర్ కొట్టేసిందట.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి.. త్వరలో 'విశ్వంభర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు బాబీతో మరోసారి కలిసి పనిచేయనున్నాడు. గతేడాదే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా సినిమాలో ఎవరెవరు నటిస్తారనే వివరాలు బయటకొస్తున్నాయి.ఇందులో చిరుకి జోడీ ప్రియమణిని ఎంపిక చేశారని.. మోహన్ లాల్ కీలక పాత్ర కోసం తీసుకున్నారని.. విలన్‌గా బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కనిపించబోతున్నారని అంటున్నారు. అలానే కీలకమైన హీరో కూతురి పాత్ర కోసం 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్‌ని ఫైనల్ చేశారని మాట్లాడుకుంటున్నారు. తొలుత ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది కానీ సారా ఫైనల్ అయినట్లు ఉంది. సారా నటించిన తొలి తెలుగు మూవీ 'యుఫోరియా'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఠాకుర్)

JD Chakravarthy Angry On Chandrahas Singing Song6
యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ

ఈ మధ్యన తెలుగు సినిమాల్లోని పాటల్లో బూతు సాహిత్యం ఎక్కువవుతోంది. సోషల్ మీడియాలో ఉపయోగించే కొన్ని పదాల్ని.. రచయితల ట్రెండింగ్ పేరిట యదేచ్ఛగా వాడేస్తున్నారు. తాజాగా యాటిట్యూడ్ స్టార్ అనబడే హీరో చంద్రహాస్.. అందరూ చూస్తుండగా ఏకంగా స్టేజీపైనే బూతు పాట పాడాడు. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ పాట విని జేడీ చక్రవర్తి చప్పట్లు కొట్టాడని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే విషయమై జేడీ స్పందించాడు. చంద్రహాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.'చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడు షాక్‌లో ఉన్నా. ఏం పాడుతున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. కానీ తన పాటని నేను ఎంజాయ్ చేస్తున్నట్లు, చప్పట్లు కొడుతున్నట్లు కొందరు ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. అసలు నేనా పని చేయలేదు. కావాలంటే పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈవెంట్లలో గెస్టులు.. స్టేజీపై ఎవరేం మాట్లాడుతున్నారో సరిగా పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్లే అతడి పాటని సరిగా పట్టించుకోలేదు. నా పక్కనున్న అమ్మాయికి తెలుగు అర్థంకాక పాప చప్పట్లు కొట్టింది. అది చూసిన చాలామంది నేను కూడా చప్పట్లు కొట్టాననుకున్నారు. నేను బూతులు మాట్లాడను. నా ముందు ఎవరు మాట్లాడినా సహించను'(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత)'ఓసారి సెట్‍‌లో బూతులు మాట్లాడాడని ఓ దర్శకుడిని కొట్టా. నా పక్కన అమ్మాయికి అతడు బూతులు పాడుతున్నాడని చెబితే చప్పట్లు కొట్టడం ఆపేసి షాకైంది. పాట టైంలో జయంత్, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. అప్పుడే లేచి వెళిపోదామనుకున్నాను. కానీ పూజా బేడీ.. అలా చేయొద్దని నన్ను వారించింది. అందుకే సైలెంట్‌గా ఉండాల్సి వచ్చింది. చంద్రహాస్ అలా చేయడాన్ని సమర్థించను. ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకుంటే అది వాళ్ల భ్రమ మాత్రమే' అని జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చాడు.టీవీ నటుడు ప్రభాకర్ కొడుకే చంద్రహాస్. గతంలో వచ్చిన 'రామ్‌నగర్ బన్నీ' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రమోషన్ల టైంలోనే యాటిట్యూడ్ చూపించడం, చిత్రమైన హావభావాలతో యాటిట్యూడ్ స్టార్‌గా అందరూ ట్రోల్ చేశారు. ఆ పదాన్నే తన పేరుకి ముందు తగిలించుకున్నాడు. తొలి మూవీ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా' చిత్రంతో వస్తున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్‌కి 6 నెలలు ట్రైనింగ్)

R Madhavan about 4 Year Break from Movies7
అతడి వల్లే 4 ఏళ్లు సినిమాలకు దూరమయ్యా: మాధవన్‌

ఒకతను చేసిన చిన్న పని వల్ల నాలుగేళ్లు సినిమాలకే దూరంగా ఉన్నానంటున్నాడు ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌. సాలా ఖడూస్‌ (2016) సినిమాకు ముందు బ్రేక్‌ తీసుకున్నానని, అది తనకెంతో పనికొచ్చిందంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్‌ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో ఓ తమిళ పాట చిత్రీకరణ కోసం ఆరెంజ్‌ ప్యాంట్‌, గ్రీన్‌ షర్ట్‌ ధరించి రోడ్డు మధ్యలో నిల్చున్నాను. నేనెవరో చూపిస్తా అన్నంత కోపంఅక్కడే కూర్చున్న ఓ రైతు నన్ను నిర్లక్ష్యంగా ఓ చూపు చూశాడు. అది నాకసలు నచ్చలేదు. చెన్నైకి రా.. నేనెవరో నీకు చూపిస్తా అని మనసులో అనుకున్నాను. కానీ ఎందుకో ఆ చూపు నన్ను వెంటాడింది. నన్ను ఆలోచింపజేసేలా చేసింది. నిజంగానే అసలు నేనేం చేస్తున్నాను అని అంతర్మథనానికి లోనయ్యాను. అందుకే బ్రేక్‌ తీసుకున్నాను. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. అదిప్పటికీ పనికొస్తోందిసినిమాలు మానేసి ప్రదేశాలు తిరగడం మొదలుపెట్టాను. రిక్షా తొక్కేవారి దగ్గరి నుంచి చాలామందితో మాట్లాడాను. వారి జీవనశైలి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఇలా అన్నింటినీ పరిశీలించాను. ఆ పర్యటన నాకెన్నో పాఠాలు నేర్పింది. ఎలాంటి పాత్రలు చేయాలి? ఎలాంటి సినిమాల్లో కనిపించాలన్నదానిపై స్పష్టత వచ్చింది. ఆ నాలుగేళ్లలో నేర్చుకున్నదాని ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మాధవన్‌ చివరగా ధురంధర్‌ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ధురంధర్‌ 2తో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాడు.చదవండి: నాకు స్టార్‌డమ్‌ తెచ్చిన మూవీ అదే.. : మహేశ్‌బాబు

Suma Adda Fame Bobby No More8
ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత

యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్‌టైన్‌మెంట్ షో, 'జబర్దస్త్' కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ అలియాస్ లక్ష‍్మినారాయణ.. రెండు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ క్రమంలోనే 'జబర్దస్త్' కమెడియన్స్ నవీన్, బాబీ తదితరులు ఇతడి మృతిపై మిస్ యూ పోస్టులు పెడుతున్నారు. యాంకర్ సుమ కూడా బాబీ ఇంటికి వెళ్లి, అతడి మృతదేహానికి నివాళులు అర్పించింది. ఇంతకీ అసలేమైంది? ఎప్పుడీ ప్రమాదం జరిగింది?(ఇదీ చదవండి: కొడుకు చనిపోయిన నెలకే టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత)సోమవారం రాత్రి కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్స్.. ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సీఐ విశ్వం చెప్పిన ప్రకారం.. కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తున్నారు. మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్‌కు చెందిన ఆనపు లక్ష్మీనారాయణ మోటార్‌ సైకిల్‌ ఎదురుగా వచ్చేసరికి రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఆనపు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి ఒకటి రెండు రోజుల క్రితమే ఇతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇంతలోనే విషాదం జరిగిపోయింది.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)

Mahesh Babu about his Role in Varanasi Movie9
నాకు స్టార్‌డమ్‌ తెచ్చిన సినిమా అదే! రాముడి పాత్రకోసం..

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ వారణాసి. మహేశ్‌బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. 2025 చివర్లో వారణాసి గ్లింప్స్‌ రిలీజ్‌ చేయగా మూవీకి భారీ హైప్‌ వచ్చింది. ఈ మధ్యే సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించారు. 2027 ఏప్రిల్‌ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా చిత్రయూనిట్‌ హాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను రిలీజ్‌ చేసింది.స్టార్‌గా మారిందే ఆ సినిమాతోఅందులో మహేశ్‌బాబు తనకు స్టార్‌డమ్‌ తెచ్చిన సినిమా ఏదో వెల్లడించాడు. అలాగే వారణాసిలో తన క్యారెక్టర్‌ గురించి మాట్లాడాడు. 'పోకిరి సినిమా నన్ను స్టార్‌గా నిలబెట్టింది. ఆ మూవీ చాలా పెద్ద విజయం సాధించింది. వారణాసి విషయానికి వస్తే.. రాజమౌళి నాకు ఈ కథ చెప్పగానే ఆశ్చర్యపోయాను. తర్వాత ఓసారి.. మీ దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. మీరు హీరోలను చాలా బాగా చూపిస్తారు, మీకు హీరోలంటే చాలా ప్రేమ అని రాజమౌళికి మెసేజ్‌ పెట్టాను. అందుకాయన థాంక్యూ, కానీ నా సినిమాల్లో నాకు విలన్లంటేనే ఎక్కువ ఇష్టం అని రిప్లై ఇచ్చాడు.మొదట్లో భయపడ్డా..రాజమౌళి అభిమానిగా నేను కూడా వారణాసి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇందులో హీరోగా చేయడానికి నేను మొదట్లో భయపడ్డాను. కానీ ఆయన కథను వివరించి చెప్పాక ఆ భయం పోయింది. ఇందులో రాముడి పాత్ర పోషించాను. రాముడు అంటేనే హుందాతనం. నిలబడే దగ్గరనుంచి పాత్రలో నటించేవరకు ఎన్నో రిహార్సల్స్‌ చేశాం అని చెప్పాడు. తనకు ఇష్టమైన వంటకం ఏంటని అడగ్గా హైదరాబాదీ చికెన్‌ బిర్యానీ ఇష్టమని మహేశ్‌బాబు తెలిపాడు.చదవండి: చిరంజీవిపై ట్రోల్స్‌.. ఇచ్చిపడేసిన మెగా కోడలు

Mahesh Babu Told Change His Running For Varanasi Movie10
రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్‌కి 6 నెలలు ట్రైనింగ్

మహేశ్ బాబు పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి రన్నింగ్. ఇతడు చేసిన ఏ సినిమా చూసినా మిగతా వాళ్లతో పోలిస్తే మహేశ్ కాస్త డిఫరెంట్‌గా పరుగెత్తుతాడు. అయినా సరే ఇది అభిమానులకు బాగానే నచ్చేసింది. ఎవరైనా మహేశ్ గెటప్ వేయాలన్నా సరే అతడి రన్నింగ్ స్టైల్‌నే ఫాలో అయిపోతుంటారు. అలాంటిది కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్ల తర్వాత మహేశ్.. ఈ విషయంలో కొత్తగా కనిపించనున్నాడు. లేదు రాజమౌళి ఏకంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ మార్చేశాడు. దీని గురించి స్వయంగా మహేశ్ బాబే చెప్పాడు.మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వారణాసి'. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. గతేడాది నవంబరులో టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మూవీ ఎలా ఉండబోతుందనేది మూడు నిమిషాల వీడియోతో రివీల్ చేశారు. ప్రస్తుతం, గతం, భవిష్యత్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మహేశ్.. శ్రీ రాముడి పాత్రలోనూ కాసేపు కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కోసమే తన రన్నింగ్ స్టైల్ కూడా మార్చుకున్నానని మహేశ్ చెప్పాడు.(ఇదీ చదవండి: మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ)రాముడి పాత్ర కోసం ఆహార్యం మెంటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు ఏడాది ప్రిపరేషన్ చేశాం. 2-3 నెలలు కలరీ యుద్ధవిద్య కూడా నేర్చుకున్నాను. అలానే రాజమౌళి.. నా రన్నింగ్ టెక్నిక్ మార్చాలని అన్నాడు. దీనికోసం ఏకంగా 6 నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నాం. కాకపోతే 2 సీన్లు మాత్రమే తీశారు. అలాంటి నిబద్ధత 'వారణాసి' కోసం నేను చూపించాను అని మహేశ్ బాబు.. తాజాగా రిలీజ్ చేసిన 'వారణాసి' ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్నికొన్నిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయ.. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ఇప్పటివరకు పాన్ ఇండియా వరకే తమ మూవీస్ రిలీజ్ చేసిన జక్కన్న.. 'వారణాసి'తో గ్లోబల్ వైడ్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)

Advertisement
Advertisement