Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Interesting discussion on Allu Cinemas ticket rates1
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ

హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్‌ ఒక సినిమా హాల్‌ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ మరో లెవెల్లో ఉండనుంది.ఈ మల్టీప్లెక్స్‌లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్‌లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది. పూణేలోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్‌లో రూ. 900 వరకు ఉంటాయి. ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్‌కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం. తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్‌లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్‌కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు ప్రదర్శించబడుతాయి.

Alekhya First Interview About Taraka Ratna Last Days Latest2
తార‍కరత్న చివరి గుండె చప్పుడు విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో

టాలీవుడ్ హీరో తారకరత్న.. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. 2023 ఓ పాదయాత్రలో పాల్గొన్న ఈయన.. డీహైడ్రేషన్‌కి గురై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తే.. దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడినప్పటికీ ఫలితం లేదు. ఈయన మరణం తర్వాత భార్య అలేఖ్య పెద్దగా బయట కనిపించలేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు భర్తని తలుచుకుని పోస్టులు పెట్టేవారు. అయితే ఆస్పత్రిల్లో ఉన్న తారకరత్న చివరి రోజులు ఎలా గడిచాయి? అప్పుడు ఏమేం జరిగిందనేది అనే విషయాల్ని తొలిసారి ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)‍'పాదయాత్రలో పాల్గొనేందుకు జనవరి 25నే వెళ్లాలి. కానీ అనుకోకుండా రెండు రోజుల తర్వాత వెళ్లారు. ఆ రోజు ఉదయమే ఫోన్ చేశారు. సాయంత్రానిక‍ల్లా వచ్చేసి పిల్లలతో కలిసి సినిమా చూస్తానని కూడా చెప్పారు. కానీ కాసేపటికే తారక్‌కి డీహైడ్రేషన్ అయిందని చెప్పి ఫోన్ వచ్చింది. మా అమ్మ కాల్ చేసి బాల బాబాయ్‌కి ఫోన్ చేయమంటే చేశా. ఆయన కూడా అదే చెప్పారు. తర్వాత విజయ్ సాయిరెడ్డి బాబాయ్ కాల్ చేసి.. నిష్క(తారకరత్న పెద్ద కూతురు)ని తీసుకుని కుప్పం వెళ్లమన్నారు. అప్పుడు చంద్రబాబు ఫోన్ చేశారు. అంతా బిజీగా ఉండే ఆయన కూడా ఫోన్ చేసేసరికి ఏదో సీరియస్ అని అర్థమైంది. దీంతో కుప్పం వెళ్లాను. అక్కడ తారకరత్నని బెడ్‌పై చూసి కుప్పకూలిపోయాను''బాల బాబాయ్ నా దగ్గరుండి అన్ని చూసుకున్నారు. మా అన్నయ్య బెస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అంటే బెంగళూరు తీసుకెళ్లాం. అలా 23 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. చాలా పోరాడారు. నా కోసమే నాకు సమయం ఇచ్చేందుకే అన్ని రోజులు పోరాడారా అనిపించింది. నా కోసం అందరూ ఆస్పత్రిలోనే ఉన్నారు. నేను అందరినీ వెళ్లిపోమని చెప్పా. డాక్టర్స్ వచ్చి అంతా అయిపోయింది అని చెప్పగానే మొదట బాల బాబాయ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తర్వాత అందరికీ చెప్పాను. తారకరత్నతో చివరి నిమిషం వరకు ఉన్నాను. ఆయనతో పాటు బెడ్‌పై పక్కనే పడుకుని చివరి గుండె చప్పుడు కూడా విన్నాను. చాలా నెలల వరకు ఆయన లేరని నిజాన్ని అంగీకరించలేకపోయాను' అని అలేఖ్య అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకుంది. తారకరత్న విషయానికొస్తే.. 2002లో హీరోగా కెరీర్ ప్రారంభించారు.2023 వరకు అడపాదడపా మూవీస్ చేశారు గానీ సక్సెస్ కాలేకపోయారు. అయితే అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్యని ప్రేమించి 2012లో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు అంగీకరించకపోయినా సరే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లకు 2013లో ఓ పాప పుట్టగా.. తర్వాత ట్విన్స్ అయిన బాబు, పాప పుట్టారు.(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)

Ustaad Bhagat Singh Movie Censor And Run Time Details3
'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తొలుత ఈ నెల 26న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఓ వారం ముందే వచ్చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఉగాది సందర్భంగా 19వ తేదీన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి.ఈ క్రమంలోనే రన్ టైమ్ ఎంతనేది కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)'ఉస్తాద్..' చిత్రానికి విడుదలకు 9 రోజుల ముందే సెన్సార్ చేసేశారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈమేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సెన్సార్ సభ్యులు.. ఎలాంటి కట్స్ చెప్పలేదట. అలానే 2 గంటల 34 నిమిషాల నిడివితో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రీ మూవీస్ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ పనిచేస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. అయితే ఇది తమిళ సినిమా 'తెరి'కి రీమేక్ అని చాలారోజులుగా ప్రచారం నడిచింది. మూవీ టీమ్ మాత్రం పదే పదే వీటిని ఖండించింది. సెన్సార్ ముగించారు. ట్రైలర్ కూడా వదిలితే సినిమా కంటెంట్ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Mark K Robin Won Gaddar Award Tollywood4
గద్దర్ అవార్డుల్లో సత్తా చాటిన యంగ్ మ్యూజిక్‍ డైరెక్టర్

'అ!' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్.. టాలీవుడ్‌లో మంచి పేరుని సంపాదించుకున్నాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతడు.. తన సంగీతంతో ఆకట్టుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్ ఇతడికి దక్కింది. 'దండోరా' చిత్రానికిగానూ మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ పురస్కారం అందుకున్నాడు. సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి మరీ ముఖ్యంగా "దండోరా" టైటిల్ సాంగ్ ప్రేక్షకులని కదిలించాయి.టాలీవుడ్ లో మల్లేశం, జాంబీ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తదితర సినిమాలకు కూడా ఇతడే సంగీతమందించాడు. ఇప్పటివరకు దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.చిన్నప్పటి నుంచి గద్దర్ పాటలు అంటే ఇష్టమని, ఆయన పాటలు వింటూ పెరిగిన తనకు ఇప్పుడు గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు.

Nabha Natesh And Dimple Hayathi Latest News5
బాక్సర్‌లా నభా నటేశ్.. గ్లామరస్‌గా డస్కీ బ్యూటీ డింపుల్

బాక్సర్ గెటప్ లో హీరోయిన్ నభా నటేశ్డస్కీ బ్యూటీ డింపుల్ గ్లామరస్ పోజులుబ్లాక్ డ్రస్సులో సన్నీ లియోన్ హొయలుమంచు కొండల్లో కావ్య థాపర్ వెకేషన్లంగా ఓణీలో కుందనపు బొమ్మలా కీర్తిభట్ఫిబ్రవరి జ్ఞాపకాలతో బ్యూటీ ఆలియా భట్ View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Aindhri (@aindhribymahitha)

bollywood actor Randeep Hooda Lin Laishram welcome baby girl6
లేటు వయసులో తండ్రైన హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్

బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా 50 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. ఆయన భార్య లిన్ లైస్రామ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు, అభిమానులు అభినందలు చెబుతున్నారు. హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లోనూ మెప్పించిన రణ్‌దీప్‌ గతేడాది వీర్​ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్‌గా అలరించాడు. ఈరోజు నేను తండ్రి అయినందుకు మా నాన్న పట్ల నా కృతజ్ఞత మరింత పెరిగిందని రణ్‌దీప్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా నన్ను తండ్రిని చేసినందుకు.. మన చిన్న అమ్మాయిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు నా భార్య లిన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఈ జంటకు మొదటి బిడ్డగా పాప పుట్టడంతో ఆనందం మరింత రెట్టింపైంది.కాగా.. 2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్‌సూన్‌ వెడ్డింగ్‌'తో నటుడిగా పరిచయమైన రణ్‌దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, రిస్క్‌, కర్మ ఔర్‌ హోలీ, కాక్‌టైల్‌, జిస్మ్‌ 2, బాంబే టాకీస్‌, కిక్‌, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. కాగా.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్‌ని మణిపురి సంప్రదాయంలో రణ్‌దీప్ పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda)

Khushboo Sundar Reacts To Vijay And Trisha Controversy7
విజయ్‌-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు

గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్‌ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్‌ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్‌ స్పందించారు. అది వాళ్ల పర్సనల్‌ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్‌ల రిలేషన్‌)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.త్రిష అంశం విజయ్‌ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్‌ లైఫ్‌ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది.

Malayalam super Hit Movie Pennum Porattum Streaming On This Ott8
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ ‍అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.ఈ సినిమాకు రాజేశ్‌ మాధవన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్‌ మాధవన్‌, రైనా రాధాకృష్ణన్‌, సుభాష్‌ చంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్‌ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్‌గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026

Malayalam Director Dinjith Ayyathan With Prabhas9
ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్

డార్లింగ్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు స్పిరిట్, ఫౌజీ, కల్కి: పార్ట్ 2 సినిమాలు ఉన్నాయి. వీటన్నింటి షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత సలార్ 2 ఉంది. కానీ ఇదెప్పుడు ఉంటుందనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇవి కాకుండా నెక్స్ట్ ఎవరితో చేస్తారా అనేది తెలియదు. ఇంతలోనే పలువురు దర్శకులు ప్రభాస్‌ని కలుస్తున్నారు. తాజాగా మలయాళ డైరెక్టర్ ఒకరు ప్రభాస్‪‌ని కలిశారు. ఓ సాయంత్రం అద్భుతంగా గడిపానని పోస్ట్ కూడా పెట్టారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)గతేడాది మలయాళంలో వచ్చిన హిట్ సినిమాల్లో 'ఎకో' ఒకటి. ఓటీటీ డబ్బింగ్ రూపంలో తెలుగు ఆడియెన్స్‌ని కూడా పలకరించింది. దీని కంటే ముందు 'కిష్కిందకాండం' అనే మరో మూవీ కూడా తీసిన దర్శకుడు దింజిత్ అయ్యతన్.. సోమవారం సాయంత్రం ప్రభాస్‌ని కలిశాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని, మరీ ముఖ్యంగా డిన్నర్‍‌లో తిన్న రొయ్యల బిర్యానీ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు.ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన హోంబలే నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌కి కూడా దింజిత్.. ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. అయితే దింజిత్, ప్రభాస్‌ని కొత్త ప్రాజెక్ట్ కోసమే కలిశాడా అనిపిస్తుంది. ఎందుకంటే హోంబలే సంస్థలో ప్రభాస్ మూడు మూవీస్ చేయాలి. చాన్నాళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందులో ఒకటి సలార్ సీక్వెల్ కాగా మిగతా రెండు ఏంటనేది క్లారిటీ రాలేదు. బహుశా దింజిత్-ప్రభాస్ కాంబోని ఏమైనా ఫిక్స్ చేశారా లేదా అనేది త్వరలో క్లారిటీ రావొచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం ఊహించని కాంబో అవుతుంది. మరి దింజిత్.. తనకు సూటయ్యే థ్రిల్లర్ తీస్తాడా? లేదా ప్రభాస్‌కి తగ్గ స్టోరీని రెడీ చేస్తాడా చూడాలి.(ఇదీ చదవండి: వడివేలుని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా) View this post on Instagram A post shared by Dinjith Ayyathan (@dinjithayyathan)

Priyadarshi Suyodhana Movie Release Date Fixed10
ప్రియదర్శి ‘సుయోధన’.. రిలీజ్‌ ఎప్పుడంటే..

ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ మంచి కదా కదానాలతో అత్యత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి సాయికుమార్ ద్రిషిక చందర్ , సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ సంగీత దర్శకత్వం వహించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ను అందించారు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో ఈ సినిమా టీజర్ ట్రైలర్ మరియు పాటలను రిలీజ్ చేస్తాము అన్నారు.

Advertisement
Advertisement