Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Amitabh Bachchan Reacts On film festival exprerience in another country1
నన్ను అలా అన్నందుకు బాధలేదు.. కానీ..: అమితాబ్ బచ్చన్‌

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశాన్ని ఓ విదేశీ జర్నలిస్ట్ ‍అలా అని పిలవడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఒక దేశంలో ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనప్పుడు అక్కడి స్థానిక అభిమానుల నుండి తనకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. విమానంలో ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తనను జాగ్రత్తగా హోటల్‌కు తీసుకెళ్లారని వెల్లడించారు. ఇటీవల టీమ్‌ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.అమితాబ్ మాట్లాడుతూ.. "ఒక దేశం నన్ను ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించింది(ఆ దేశం పేరు వెల్లడించను). దీనికి నేను వెళ్లడానికి అంగీకరించా. ఆ దేశానికి వెళ్లినప్పుడు విమానంలో ఓ వార్తాపత్రికను చూశా. అందులో నా సినిమాలలో ఒక చిత్రం ఉంది. ఆ దేశ భాష అర్థం కాక అందులో ఏమి రాశారని నేను ఎయిర్ హోస్టెస్‌ను అడిగా. అది ఒక భారతీయ సినిమా పోస్టర్ అని.. ఆ దేశానికి చెందిన నటుడు ఇక్కడికి వస్తున్నాడని పత్రికలో రాశారని ఆమె చెప్పింది" అని అన్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ తనను అభిమానుల గుంపు చుట్టుముట్టడంతో ఆశ్చర్యపోయానని వెల్లడించారు.ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఈ దేశంలో మన సినిమాల పట్ల ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. విమానం దిగిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ వరకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డా. పరిస్థితి ఎంత గందరగోళంగా మారిందంటే పోలీసులు వచ్చి నన్ను కారులో ఎక్కించి నా హోటల్‌కు తీసుకుని వెళ్లారు. నా జీవితంలో మొదటిసారిగా నా ఇమ్మిగ్రేషన్ హోటల్లో జరిగిందని' అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు.విదేశీ జర్నలిస్ట్ కామెంట్స్‌..అయితే తనకు ఆత్మీయ స్వాగతం లభించినప్పటికీ.. ఓ విదేశీ జర్నలిస్ట్‌ తనపై రాసిన కథనం చూసి బాధపడ్డానని తెలిపారు. మూడవ ప్రపంచ దేశానికి చెందిన ఈ మూడో రకం నటుడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారని కథనంలో రాసుకొచ్చాడని వెల్లడించారు. అయితే తనను మూడో రకం నటుడు అన్నందుకు బాధలేదని.. నా భారతదేశాన్ని మూడవ ప్రపంచ దేశం అని పిలవడం బాధ కలిగించిందని తెలిపారు.అందుకే తాజాగా తనకెదురైన అనుభవాన్ని క్రికెట్‌తో ముడిపెట్టి ట్వీట్ చేశారు. అండర్-19 క్రికెట్ ఇండియా.. ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలిచారు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లుగా వరల్డ్‌లోనే మొదటి స్థానంలో ఉన్నాం.. మనం మూడో ప్రపంచం కాదు.. మనం మొదటి ప్రపంచం.. భారత్‌ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు. అంధులు, స్త్రీలు, పురుషులు, ఇప్పుడు 19ఏళ్ల వయస్సు క్రికెటర్స్ కూడా ఈ విషయాన్ని నిరూపించారని ట్విటర్‌లో పంచుకున్నారు. కాగా.. ఇటీవల జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. T 5649 - U19 Cricket INDIA .. WORLD CHAMPIONS !ठोक दिया दुश्मन को !!Blind , Women's , Mens Cricket ALL world Champions .. we are NUMBER 1 .. ONE .. on top , FIRST in World ..We are NOT 3rd World .. we are FIRST World !!BHARAT MATA KI JAI 🇮🇳 🇮🇳🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) February 7, 2026

Kollywood stars at  Saranya Ponvannan Daughter Wedding Function2
అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్

ప్రముఖ నటి శరణ్య కూతురు రిసెప్షన్‌ గ్రాండ్‌గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో కోలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. హీరో కార్తీ, ధనుశ్‌తో పాటు పలువురు నటులు రిసెప్షన్‌ వేడుకలో సందడి చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా.. శరణ్య పొన్నవన్.. ధనుశ్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంలో నటించారు. ఈ మూవీలో ధనుశ్‌కు అమ్మగా కనిపించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా శరణ్య రఘువరన్‌ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్‌ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 .@dhanushkraja sir at Saranya Ponvannan Daughter Wedding Function! @theSreyas pic.twitter.com/Z3egrQzMTI— Chowdrey (@Chowdrey_Pro) February 7, 2026

producer Nava Vamsi Comments On Hero Vishwak Sen3
మైక్‌ తీసుకోగానే బూతులు.. కానీ ఇప్పుడు: హీరోపై నాగవంశీ కామెంట్స్

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్‌ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్‌ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది చూసిన విశ్వక్ సేన్‌.. ఇప్పడున్న విశ్వక్‌ సేన్ ‍వేరని అన్నారు. మైక్ తీసుకోగానే బూతులు తిట్టే విశ్వక్ కాదన్నారు. ఇప్పుడున్న విశ్వక్ సేన్ ‍చాలా మారిపోయాడని తెలిపారు. ప్రస్తుతమున్న విశ్వక్ సేన్‌ను చూస్తుంటే అనుదీప్‌ను చూసినట్లు ఉందని ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. సంవత్సరం క్రితం చూసిన Vishwaksen కి ఇప్పటికి మారిపోయినట్టు లేడు. Mic ఇస్తే ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టేసి, arrogant బిహేవ్ చేసే Vishwak ను కాకుండా anudeep ను చూసినట్టు లేదు. - @vamsi84 pic.twitter.com/63cBPhgh15— Rajesh Manne (@rajeshmanne1) February 7, 2026

Director Maruthi Trolls After Rajasaab OTT Streaming4
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్

ప్రభాస్ 'రాజాసాబ్' ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో చూసినప్పుడే ఈ సినిమాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్‌గా రిలీజైన మరింత ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా దర్శకుడు మారుతిని అయితే నెటిజన్లు వదలట్లేదు. పూర్తిగా ఆడేసుకుంటున్నారు. మూవీలో ఎన్నెన్ని తప్పులున్నాయో ఎత్తిచూపుతూ మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ మూవీ 'రాజాసాబ్'. గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు సినిమా గురించి చాలా విషయాలు చెప్పిన మారుతి.. ఏకంగా తన ఇంటి అ‍డ్రస్ కూడా ఇచ్చాడు. అయితే అదే అతడికి బూమ్‌రాంగ్ అయింది. మూవీ సరిగా తీయలేదనే కోపంతో ప్రభాస్ అభిమానులు.. వందలాది క్యాష్ ఆన్‌ డెలివరీ ఆర్డర్స్ పెట్టి మారుతిని ఇబ్బంది పెట్టినట్లు అప్పుడు వార్తలొచ్చాయి. ఇప్పుడైతే ట్విటర్‌లో ట్యాగ్ చేసి మరీ మారుతిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.'రాజాసాబ్' విషయంలో చాలామంది చేస్తున్న కంప్లైంట్ డూప్. స్టార్ హీరోలు చాలామందికి డూప్ ఉపయోగిస్తుంటారు. ఈ చిత్రంలో డూప్ అనే సంగతి చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. ప్రభాస్ ఫేస్ మార్పింగ్ గురించి స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అలానే సినిమాలో ప్రభాస్ బస్ జర్నీ చేసే సీన్‌లో.. తొలుత గడ్డం ఉండటం, బస్ దిగేసరికి గడ్డం ట్రిమ్ అయిపోవడం, బస్సే మారిపోవడం గురించి సెటైర్లు వేస్తున్నారు.మహారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా సంజయ్ దత్ పాత్ర సొంతమవుతుంది కదా? మరి పారిపోవడంలో లాజిక్ ఏంటని నెటిజన్లు అడుగుతున్నారు. ప్రభాస్ నానమ్మ మహారాణి అయితే ఇప్పటివరకు ఎలా బతికి ఉంది? ఇంతకీ ఆమె వయసెంత? లాంటి లాజిక్స్ కూడా వేస్తున్నారు. అలానే కోట్ల రూపాయలతో పాటు మహాల్ ఉన్న సంజయ్ దత్ పాత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర దగ్గర రూ.3 లక్షలు కొట్టేయడం ఏంటని అంటున్నారు. ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో లాజిక్స్ లేని సీన్లపై మారుతిని విమర్శిస్తున్నారు.

Ayesha Khan Reacts Compare With Tamannaah Bhatia5
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ

రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలోనే 'షరారత్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఆయేషా ఖాన్‌పైనా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. కానీ కొందరు ఈమెని.. బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన తమన్నా, నోరా ఫతేహితో పోలుస్తున్నారు. తనని వాళ్లతో పోల్చడం నచ్చలేదని ఆయేషా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'తమన్నా, నోరా ఫతేహితో నన్ను పోలుస్తున్నా రీల్స్.. సోషల్ మీడియాలో నేను కూడా చూశాను. కానీ అది నాకు నచ్చట్లేదు. వాళ్లిద్దరూ అద్భుతమైన మహిళలు. నోరా స్టేజీ ఫెర్ఫార్మెన్స్, ఎనర్జీ చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. తను చేసిది నేను ఎప్పటికీ చేయలేను' అని నోరా గురించి మాట్లాడింది. తమన్నా గురించి కూడా మాట్లాడిన ఆయేషా ఖాన్.. 'తమన్నా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. 'ఆజ్ కీ రాత్' పాటలో ఆమెని చూసి నేను ఫిదా అయిపోయా. ఇండస్ట్రీకి నేను కొత్త. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పుకొచ్చింది.'ధురంధర్'లో ఐటమ్ సాంగ్‌లో కలిసి చేసిన క్రిస్టల్‌తో మనస్పర్థలు అని వస్తున్న పుకార్లపైనా ఆయేషా స్పందించింది. అవన్నీ కేవలం రూమర్సే. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా.. తెలుగులోనూ ముఖచిత్రం, ఓం బీమ్ బుష్, మనమే తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ 'ధురంధర్' మూవీ ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.

Prashanth Neel new approach to make Jr Dragon Movie6
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్

ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాల్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ ప్రత్యేకతగా నిలిచింది. వరుసగా మూడు సినిమాలు అదే స్టైల్‌లో రావడంతో ఆయన మరోలా తీయరా అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ ఇప్పుడు ఆ అనుమానాలు తీరిపోయే సమయం వచ్చినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఫుల్ కలర్ ఫుల్‌గా ఉండబోతోందట. ఈసారి గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదని ఓ టాక్‌ నడుస్తోంది. అంటే ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్‌ను ఎంచుకున్నారని చెప్పొచ్చు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నబడ్డ విషయం తెలిసిందే. బయట ఒకటి రెండు సార్లు ఆయనను చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ సినిమాలో మాత్రం ఆయన గెటప్ ఓ లెవెల్‌లో ఉందని అంటున్నారు. చూసిన వాళ్లు అదిరిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూట్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్‌ మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర 2 కూడా లైన్‌లో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కెజిఎఫ్, సలార్ సినిమాల విజయాలతో ప్రశాంత్ నీల్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. డ్రాగన్‌ను గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ కాకుండా కొత్త స్టైల్‌లో తీస్తున్నందుకు అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Manchu Lakshmi Bad Experience Chennai Green Park Hotel7
చెన్నైలో మంచు లక్ష‍్మికి చేదు అనుభవం

టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష‍్మికి చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన ఈమె.. గ్రీన్ పార్క్ అనే హోటల్‌కి వెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది తనతో రూడ్‌గా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.చెన్నైలోని ఈ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్న మంచు లక్ష‍్మి.. తనతో పాటు సిబ్బందిని కూడా తీసుకెళ్లింది. కానీ కెమెరామ్యాన్‌ని మాత్రం లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చింది. చిన్న కెమెరాకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని చెప్పుకొచ్చింది. దీని వల్ల చాలా అసంతృప్తికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు హాస్పిటాలిటీ ఇలా ఉండనేకూడదంటూ పేర్కొంది.గత కొన్నాళ్లుగా యాక్టింగ్ బాగా తగ్గించేసిన మంచు లక్ష‍్మి.. అడపాదడపా మాత్రమే ఒకటి రెండు మూవీస్ చేస్తోంది. గతేడాది 'దక్ష' అనే చిత్రంతో వచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. అలానే ఓటీటీ రియాలటీ షో 'ద ట్రైటర్స్ ఇండియా'లోనూ పాల్గొంది కానీ విజేత కాలేకపోయింది. కాకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.Extremely disappointed with the experience at Green Park Hotels Chennai.No rule was shown to me in writing, and no solution was offered, not even allowing a small camera with one person. This is not what hospitality should look like. pic.twitter.com/TeZRsFkyTu— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 7, 2026

Fact Check: Did Ranveer Singh Ask 3 vanity vans on Dhurandhar set?8
'ధురంధర్‌' సినిమా కోసం 3 కేరవాన్స్‌ అడిగిన హీరో?

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించిన ధురంధర్‌ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్‌ కూడా వచ్చేస్తోంది. ధురంధర్‌: ద రివేంజ్‌ మూవీ మార్చి 19న విడుదల కానుంది.మూడు కేరవాన్స్‌ఇదిలా ఉంటే ధురంధర్‌ సినిమా సెట్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ ఏకంగా మూడు కేరవాన్స్‌ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్‌, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్‌ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు నిజమిదే!ధురంధర్‌ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో షూట్‌ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్‌ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్‌ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్‌ డిమాండ్‌ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్‌ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు. Hamza VanHamza's staff VanHamza's Normal Van 😭😭🙏🏻#RanveerSingh what you actually do with so many vans? #Dhurandhar pic.twitter.com/yQ7oiDKvTY— Bunny (@cinephilesonly) February 1, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్‌

Suriya, Karthi Attend Actress Saranya Daughter Reception9
శరణ్య కూతురి రిసెప్షన్‌.. హాజరైన స్టార్‌ హీరోలు

ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ్య- దర్శకనటుడు పొన్వన్నన్‌ దంపతుల చిన్న కూతురు చాందిని పెళ్లి పీటలెక్కింది. ఫిబ్రవరి 2న వివాహం జరగ్గా శుక్రవారం చెన్నైలో ఎంతో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌కు తమిళ స్టార్‌ హీరోలు ధనుష్‌, కార్తీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇద్దరూ డాక్టర్సే..చాందిని డాక్టర్‌ కాగా, అతడి భర్త ఫిలిప్‌ కూడా డాక్టర్‌ అని తెలుస్తోంది. 2025 డిసెంబర్‌లోనే వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇకపోతే నటి శరణ్య.. తల్లి, అత్తమ్మ పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్‌ హీరోలకు వెండితెరపై అమ్మగా కనిపించింది. గ్యాంగ్‌ లీడర్‌, రఘువరన్‌ బీటెక్‌, 24.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఈవిడ దర్శకుడు పొన్వన్నన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ప్రియదర్శిని, చాందిని సంతానం. కూతుర్లిద్దరూ డాక్టర్స్‌గా స్థిరపడ్డారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026Dhanush at Saranya Ponvannan’s Daughter Wedding Reception💥pic.twitter.com/Ox0Yn0hpgt— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్‌

Actor Prabhakar about Trolling on Chandrahas Gunji Gunji Song10
నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్‌

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ చేసిన ఓ పని వల్ల తీవ్ర విమర్శలపాలయ్యాడు. ప్రమోషన్స్‌ కోసం ఓ పాట పాడటం.. అందులో అసభ్య పదాలు ఉండటంతో హీరోను విమర్శించనివాళ్లు లేరు. ఓపక్క ట్రోలింగ్‌ జరుగుతుండగానే అతడి సినిమా బరాబర్‌ ప్రేమిస్తా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.స్పందించిన ప్రభాకర్‌ఈ క్రమంలో ఈ వివాదంపై నటుడు ప్రభాకర్‌ స్పందించాడు. తన కొడుకు చేసింది తప్పేనని అంగీకరించాడు. అందుకు క్షమాపణలు తెలియజేశాడు. ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గత నాలుగురోజులుగా విపరీతంగా వైరలవుతున్న విషయం.. మా బాబు చంద్రహాస్‌ వాడిన బూతు పదాలు- దానిపై విశ్లేషణలు, అభిప్రాయాలు, వాళ్లు తిరిగి బూతులు అనడాలు.తప్పని చెప్పా..నేనైనా, నా కొడుకైనా, ఎవరైనా సరే పబ్లిక్‌గా బూతులు మాట్లాడటమనేది తప్పు. దాన్ని నేను ఎంకరేజ్‌ చేయను. ఆరోజు నేను ఫంక్షన్‌లో సగం పాటయ్యాక అక్కడికి వెళ్లాను. పాట అయిపోగానే బాబును పక్కకు పిలిచి నాన్నా, ఇలాంటి పదాలు పబ్లిక్‌గా వాడకూడదు అని చెప్పాను. వాడు కూడా సరేనని, ఇంకోసారి పునరావృతం చేయనన్నాడు. అయితే ఆ పాట వీడియో క్లిప్పింగ్స్‌ను ముక్కలుగా కట్‌ చేసి వైరల్‌ చేశారు. అది పెద్ద తప్పుతప్పు చేసినవాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు, కానీ, వినకూడని మాటల్ని ఇంకా ఎక్కువమందికి వినిపించి తప్పు చేస్తున్నారు. ఆ వీడియోలో రెండు, మూడు బూతులుంటే నా కుటుంబం మొత్తాన్ని వందల బూతులు తిడుతున్నారు. అది చేయకుండా ఉంటే బాగుండనిపించింది. ఆ ఈవెంట్‌లో నా భార్య, కూతురు లేరు. వాళ్లు చెన్నై షూటింగ్‌లో ఉన్నారు. ఆ విషయం తెలియకుండా చాలా మంది చాలామాటలన్నారు. అది చాలా పెద్ద తప్పు. పెంపకంపై విమర్శలుఏదైనా తెలుసుకుని మాట్లాడండి. నన్ను కూడా నానామాటలన్నారు. పెంచడం రాదా? పద్ధతి తెలీదా? అని విమర్శించారు. నా పెంపకం, నేర్పించిన సంస్కారం.. ఈ ఒక్క పాటతో డిసైడ్‌ చేయకూడదు. నా బిడ్డ టాలెంట్‌ చూడండి. బరాబర్‌ ప్రేమిస్తా సినిమా చూసినవాళ్లు చంద్రహాస్‌ అద్భుతంగా చేశాడంటున్నారు. ఎంతో మెచ్యురిటీ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అంటున్నారు.ఇబ్బందిపపడితే క్షమించండితప్పుని నేను సమర్థించట్లేదు. తప్పుని ఎత్తిచూపే పనిలో పడి మనం ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో! సమాజానికి హాని చేస్తున్నామేమో! నేను ఒకటే చెప్పదల్చుకున్నా.. మా అబ్బాయి ప్రవర్తన, మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపపడితే క్షమించండి. ఆరోజు ఫంక్షన్‌కు నాపై ప్రేమతో వచ్చిన జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్‌, జయంత్‌ సి. పరంజి గారిని మన్నించమని కోరుతున్నా.. నా ఫంక్షన్‌కు వచ్చినందుకు మీరు మాట పడాల్సి వచ్చింది. చివరగా.. నా బిడ్డ తప్పుల్ని ఎంచారు, ఒకసారి వాడి టాలెంట్‌నూ చూడండి అంటూ బరాబర్‌ ప్రేమిస్తా సినిమా చూడమని ప్రభాకర్‌ కోరాడు. View this post on Instagram A post shared by Prabhakar Podakandla (@prabhakarpodakandla) చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా: చంద్రహాస్‌

Advertisement
Advertisement