Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Kareena Kapoor reveals if it was she or Saif Ali Khan who said I love you First1
ఫస్ట్‌ ఎవరు ప్రపోజ్‌ చేశారో చెప్పిన కరీనా కపూర్‌

ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 అయినప్పటికీ వారం రోజుల ముందే సందడి మొదలవుతుంది. రోజ్‌డే, ప్రపోజ్‌ డే, చాక్లెట్‌ డే, టెడ్డీ డే.. అంటూ ఫిబ్రవరి 7 నుంచే రోజుకో రకమైన సెలబ్రేషన్స్‌ జరుపుకుంటారు. అలా ఫిబ్రవరి 8న ప్రపోజ్‌ డే. ఈ క్రమంలో బాలీవుడ్‌ జంట కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌ తమలో ఎవరు ముందుకుగా ప్రపోజ్‌ చేశారో వెల్లడించారు.నగలు బహుమతివీరిద్దరూ జంటగా వోగ్‌ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కరీనా కపూర్‌ మాట్లాడుతూ నా బర్త్‌డే, పెళ్లిరోజుకు సైఫ్‌ జ్యువెలరీ గిఫ్ట్‌గా ఇస్తుంటాడు అంది. ఇంతలో సైఫ్‌ కలగజేసుకుంటూ ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు కూడా తనకు బహుమతులిస్తుంటాను అని చెప్పాడు.నాకైతే గుర్తు లేదుఐ లవ్యూ ఎవరు ముందుగా చెప్పారన్న ప్రశ్నకు.. కరీనా అది నేనే అయ్యుంటుంది. అతడు నన్ను ఇబ్బంది పెట్టకూడదనే చూస్తాడు. కాబట్టి నేనే సాహసం చేసి చెప్పుంటాను అంది. అందుకు సైఫ్‌.. ఇది నిజంగా బాగుంది, నాకైతే ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారన్న విషయం అసలు గుర్తేలేదు అన్నాడు.పెళ్లిసైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ 2008లో వచ్చిన తషాన్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారులు తైమూర్‌, జే సంతానం. కాగా సైఫ్‌ అలీ ఖాన్‌కు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. గతంలో సైఫ్‌.. అమృత సింగ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి సారా అలీ ఖాన్‌, ఇబ్రహీం అలీ ఖాన్‌ జన్మించారు. ఈ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2004లో విడిపోయారు.చదవండి: అజిత్‌ను కలిసేందుకు క్యూ కడుతున్న హీరోలు

Mahesh Babu Fans Request Varanasi Release In IMAX Screening2
మహాతెరపై... మహేష్‌ వారణాసి, చూడగలమా?

దర్శక థీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ల కాంబోలో వస్తున్న వారణాసి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఎప్పటి నుంచో తమ హీరోని గ్లోబల్‌ స్టార్‌గా చూడాలని ఆశిస్తున్న ప్రిన్స్‌ అభిమానుల అంచనాలకైతే ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో మరో ఏడాదిలో రానున్న వారణాసి గురించిన ప్రతీ వార్తా సంచలనమే అవుతోంది. అదే క్రమంలో ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారణాసిని ఐమ్యాక్స్‌ తెరపై చూపాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కథా వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, వారణాసి చిత్రంలో హిందూ దేవుడైన శ్రీరాముని పునర్జన్మ గా రుద్ర పాత్రలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్నట్టు సమాచారం. ’ది వ్రాప్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఐమాక్స్‌ కోసం చిత్రీకరించిన రెండవ భారతీయ చిత్రంగా నిలవనున్న తమ వారణాసి గురించి రాజమౌళి మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. వచ్చే 2027లో సినిమా విడుదల నాటికి స్క్రీన్‌ సిద్ధంగా లేకపోతే లాస్‌ ఏంజిల్స్‌లోని ఐమాక్స్‌ కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతానని రాజమౌళి చమత్కరించారు. అయితే తెలుగు చలనచిత్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఇంకా నిజమైన ఐమాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రాలేదు. ఇదే అక్కడ సమస్య. అత్యంత వ్యయ ప్రయాసలతో వారణాసి చిత్రాన్ని పూర్తిగా 1.43:1 ఐమాక్స్‌ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. దీంతో అభిమానులు కూడా దానిని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకోవడం సహజమే.మరోవైపు ఐమాక్స్‌ విస్తరణకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాల కోసం హైదరాబాద్‌ ఇంకా వేచి చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గత 2020 నుంచి ఐమాక్స్‌ తన ఉనికిని 60% వరకూ పెంచుకుంది, అదే క్రమంలో భారతదేశంలో కూడా విస్తరించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఐమాక్స్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ జియోవన్నీ డోల్సీ చెబుతున్నారు. మన దేశం కనీసం 150 ఐమాక్స్‌ స్క్రీన్స్ ఏర్పాటు చేయవచ్చునని వారు నమ్ముతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం గుజరాత్‌లోని సైన్స్ సిటీలో కేవలం ఒకే ఒక నిజమైన 1.43:1 స్క్రీన్‌ ఉంది, అది కూడా వాణిజ్య ఉపయోగం కోసం అందుబాటులో లేదు. తెలుగు రాష్ట్రాలలో భారీ సినిమాలతో పాటు పెద్ద తెర అనుభవాలకు డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ మల్టీఫ్లెక్స్‌లను నెలకొల్పడంలో క్యూ కడుతున్న ఏ ఎగ్జిబిటర్‌ లేదా సెలబ్రిటీ కూడా నగరంలో ఐమాక్స్‌ స్క్రీన్ ప్రణాళికలను ఇప్పటి దాకా థృవీకరించలేదు.’వారణాసి’ చిత్రాన్ని ఐమాక్స్‌ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు హైదరాబాద్‌లో ఐమాక్స్‌ స్క్రీన్‌ లేకపోవడంపై మహేష్‌ బాబు అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీనికోసం సోషల్‌ మీడియా వేదికగా ఐమ్యాక్స్‌ సాకారం దిశగా చర్యలు తీసుకోవాలని మహేష్‌ బాబును ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అయితే హైదరాబాద్‌లో నిజమైన ఐమాక్స్‌ స్క్రీన్ ను ఏర్పాటు చేయడంలో ప్రధాన సమస్య అధిక వ్యయం. అటువంటి స్క్రీన్ ఏర్పాటు చేయడానికి నిర్వహించడానికి భారీ పెట్టుబడి అవసరం. టిక్కెట్‌ ధరలపై పరిమితులు అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా, ప్రదర్శనదారులు ఈ రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మరిన్ని స్క్రీన్‌లను అందించడానికి ఐమాక్స్‌ సిద్ధంగా ఉంది, కానీ స్థానిక ప్రదర్శనదారులే ఒక చొరవ తీసుకోవాలి. మహేష్‌ బాబు అభిమానులతో సహా సినీ ప్రియులు, ఐమాక్స్‌ స్క్రీన్‌ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

Uday Kiran Nephew Teja Comments On Manasantha Nuvve movie3
అప్పుడు నాకు 7ఏళ్లు.. 'ఉదయ్ కిరణ్' మేనల్లుడు వీడియో విడుదల

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘మనసంతా నువ్వే’ సినిమా రీ రిలీజ్‌ కానుంది. 25ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి ఈ హిట్‌ మూవీ రానుంది. ఉదయ్‌కిరణ్, రీమా సేన్, తనూ రాయ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని దర్శకుడు వీఎన్‌ ఆదిత్య తెరకెక్కించగా ఎమ్‌.ఎస్‌. రాజు నిర్మించారు. అయితే, రీ-రిలీజ్‌ సందర్భంగా ఉదయ్‌కిరణ్‌ మేనల్లుడు తేజ ఒక వీడియో విడుదల చేశారు.‘మనసంతా నువ్వే’ సినిమా గురించి ఉదయ్‌కిరణ్‌ మేనల్లుడు ఇలా అన్నారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్‌ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్‌కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్‌కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.2001లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా మనసంతా నువ్వే నిలిచింది. అప్పటికే చిత్రం, నువ్వు నేను సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఉదయ్‍కిరణ్‌కు ఇది హ్యాట్రిక్ విజయంగా నిలిచింది. ఈమూవీకి సంగీతం ఆర్.పి.పట్నాయక్ వ్యవహరించగా, పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్‌ రెడ్డి, రవికాంత్‌ రెడ్డి రీ రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా ఈ తరం యువతను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు#ManasanthaNuvve 25 ఇయర్స్ & రి రిలీజ్ సందర్భంగా #UdayKiran మేనల్లుడు #Teja వీడియో బైట్ 👇🏽ఫిబ్రవరి 14న మళ్ళీ థియేటర్స్ లో ❤️#ManasanthaNuvve4K pic.twitter.com/NZxuDaNUk4— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 9, 2026

Psychological Thriller Series Roslin Locks Streaming Date4
'మీనా' నటించిన థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌ సరికొత్త వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నట్లు గతేడాదిలో ప్రకటించింది. ‘సౌత్‌ అన్‌బాండ్‌’ (jio hotstar south unbound) పేరుతో దాదాపు 18 ప్రాజెక్ట్‌ల వివరాలను తెలుపుతూ వాటి వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా రోస్లిన్‌ అనే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను దర్శకుడు సుమేష్ నందకుమార్ తెరకెక్కించారు. ‘దృశ్యం’ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్ దీనికి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.రోస్లిన్(Roslin) వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 27 విడుదల కానుందని జియోహాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ప్రమోషనల్ ఈవెంట్‌ల సమయంలో తేదీని వెల్లడించారు. త్వరలో ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తామని పేర్కొన్నారు. ఈ సిరీస్‌ తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‌కు రానుంది. రోస్లిన్ టైటిల్‌ పాత్రలో సంజన దిపు అనే అ‍మ్మాయి నటించింది. మలయాళ హిట్‌ సినిమా మూథోన్‌తో మెప్పించిన సంజన.. మలయాళ పరిశ్రమలో గుర్తింపు పొందింది. దర్శకుడు జీతూ జోసెఫ్ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సుమేష్‌ ఇప్పుడు రోస్టిన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Actor Fahadh Faasil Confirms Aavesham 2 also released details announced5
మలయాళ బ్లాక్‌బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌ రెడీ

మలయాళ బ్లాక్‌బస్టర్‌ సినిమా 'ఆవేశం' సీక్వెల్‌ రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇండస్ట్రీలో వైవిధ్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘ఆవేశం’ మూవీ సంచలన విజయం అందుకుంది. కేవలం మలయాళంలోనే రూ.150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం అనేక రికార్డ్స్‌ను తిరగరాసింది. ఇందులో రౌడీ షీటర్‌గా ఫహద్‌ నటన బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు. 2024లో దర్శకుడు జీతూ మాధవన్‌ తెరకెక్కించిన ఈ మూవీ సీక్వెల్‌ గురించి తాజాగా ప్రకటన వచ్చేసింది.ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఫహద్ మాట్లాడుతూ.. ఆవేశం 2 పనులు జరగుతున్నాయని ధృవీకరించారు. ఈ సీక్వెల్ 2027 లేదా 2028లో విడుదల అయ్యే అవకాశం ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు జితు మాధవన్ ప్రస్తుతం సూర్యతో తన మొదటి తమిళ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అతను ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, ఫహద్‌ ఫాజిల్‌తో ఆవేశం సీక్వెల్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఆవేశం మూవీలో ఫహద్‌ ఫాజిల్‌తో పాటు హిప్‌స్టర్‌, మిథున్‌ జై శంకర్‌, రోషన్‌ షానవాస్‌, షాజిన్‌ గోపు, మన్సూర్‌ అలీఖాన్‌ తదితరులు నటించారు. ఇదే మూవీని తెలుగులో రీమేక్‌ చేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. అయితే అధికారికంగా ప్రకటన రాలేదు.

Vishwak Sen Funky Movie tickets price WILL hike in AP6
ఏపీలో 'ఫంకీ' టికెట్‌ ధరలు పెరగనున్నాయా..?

టాలీవుడ్‌ నటుడు విశ్వక్‌సేన్‌కు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే.. ఆయన హీరోగా నటించిన ఫంకీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఇందులో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జాతిరత్నాలు ఫేమ్‌ దర్శకుడు కేవీ అనుదీప్‌ ఈ మూవీని తెరకెక్కించడంతో మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మించారు. అయితే, ఏపీలో ఈ మూవీ టికెట్‌ రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటకే ఏపీ ప్రభుత్వాన్ని ఫంకీ నిర్మాతలు కోరినట్లు సమాచారం.నిర్మాత నాగవంశీ నిర్మించిన ఫంకీ సినిమా టికెట్ ధరపై ఏపీలో రూ. 50 పెంచబోతున్నారా..? అంటే నిజమేననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్‌ ధరలు పెంపుకోసం అనుమతి ఇచ్చే వారు. కానీ, ఇప్పుడు ఫంకీ వంటి చిన్న బడ్జెట్‌ చిత్రానికి కూడా ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో సింగిల్‌ థియేటర్‌లో ఇకనుంచి రూ. 50 టికెట్‌ ధర పెరగనుందని కొద్దిరోజుల క్రితమే నాగవంశీ అన్నారు. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం టికెట్‌ ధరలు ఎలా ఉన్నాయో వంశీ ఇలా చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 టికెట్‌ ధర ఉంది. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ. 175 వరకు ఉంది. కానీ, ఏపీలో కొన్ని సింగిల్‌ థియేటర్స్‌లలో టికెట్‌ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నామని ఆయన గతంలో అన్నారు. అయితే, ఫంకీ సినిమాకు సంబంధించిన జీఓ వస్తే అసలు విషయం క్లారిటీగా తెలుస్తోంది.

Kollywood Actors Meet With Ajith Kumar7
అజిత్‌ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు

హీరో అజిత్‌.. వివాదాలకు చోటు ఇవ్వని అరుదైన నటుడు. అందుకే ఆయనంటే తోటి నటీనటులందరికీ ఇష్టం. ఇకపోతే అభిమానం పేరుతో వెర్రితలలు వేయకుండా కుటుంబం కోసం శ్రమించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిమానులకు పదేపదే హితవు చెబుతుంటారు. కాగా ఈయన ఇటీవల నటనతో పాటూ కార్‌ రేస్‌ పోటీలపైనా అధిక మక్కువ చూపుతున్న విషయం తెలిసిందే. అజిత్‌ అంతర్జాతీయ కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొంటూ పథకాలను గెలుస్తున్నారు. అలా దుబాయ్, బెల్జియం మొదలగు పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొన్నారు. కాగా ప్రస్తుతం దుబాయిలోని అబిదబిలో జరగనున్న కార్‌రేస్‌ పోటీల్లో పాల్గొనడానికి సిద్దం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్‌ను అబిదబిలో కలవడానికి మన సినీ స్టార్స్‌ క్యూ కడుతున్నారు. ఇప్పటికే నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్, జీవి.ప్రకాశ్‌కుమార్, దర్శకుడు వెంకట్‌ప్రభు, మాదవన్, నటి నయనతార, శ్రీలీల వంటి పలువురు అజిత్‌ను కలిసి తమ అనందాన్ని వ్యక్తం చేయడంతో పాటూ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా నటుడు శివకార్తీకేయన్‌ ప్రత్యేకంగా దుబాయ్‌కి వెళ్లి అజిత్‌ను కలిశారు. అక్కడ వారు దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఇటీవల నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆ చిత్ర దర్శకుడు ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలోనే మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఈ చిత్రం త్కరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈచిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

Telugu Senior Actors Aim 2027 Sankranti With Their Movies8
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?

ఈసారి సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు వస్తే అందులో మూడు హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'.. ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని నిర్మాతలు ప్రకటించుకున్నారు. తెలుగులో మాత్రమే తీసిన ఓ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో వచ్చే పండగకి ఇప్పటినుంచే కర్చీఫులు వేసేస్తున్నారు. తెలుగు సీనియర్ హీరోలు నలుగురు రాబోతున్నట్లు హింట్స్ ఇచ్చేస్తున్నారు.అధికారికంగా చూసుకుంటే నాగార్జున.. సినిమాతో పాటు డేట్ కూడా ప్రకటించేశారు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు మూడో పార్ట్ వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 15న థియేటర్లలోకి రాబోతుందని అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి భాగం 2016లో రాగా అద్భుతమైన హిట్ అయింది. 2022లో వచ్చిన రెండో పార్ట్ కూడా సక్సెస్ అందుకుంది. 2027 సంక్రాంతికి ఇప్పుడు మూడో భాగం రానుంది.ఈసారి చిరంజీవితో బ్లాక్‌బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో వస్తానని ఇదివరకే చెప్పేశాడు. అయితే అది వెంకటేశ్‌తోనే ఉండబోతోందని టాక్. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తాడని మాట్లాడుకుంటున్నారు. వెంకీ-ఫహాద్ తోడళ్లులుగా కనిపించబోతున్నారని టాక్. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అనిల్-వెంకకి మరో హిట్ పక్కా.ఈసారి పండగకు వచ్చి హిట్ కొట్టిన చిరంజీవి.. వచ్చే సంక్రాంతికి కూడా రావాలని అనుకుంటున్నారట. 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ దర్శకత్వంలో మరోసారి చిరు పనిచేయబోతున్నారు. ఇదివరకే ప్రకటన వచ్చింది. కూతురి సెంటిమెంట్ నేపథ్యంగా సాగే యాక్షన్ స్టోరీ ఇదని తెలుస్తోంది. దీన్ని పండగకే టార్గెట్ చేసుకుని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.మరోవైపు బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తొలుత పీరియాడికల్ స్టోరీ అనుకున్నారు. కానీ బడ్జెట్ సమస్యల వల్ల దాన్ని పక్కనబెట్టేసి ఓ యాక్షన్ మూవీ తీయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుని కూడా వచ్చే సంక్రాంతి బరిలో దింపాలని అనుకుంటున్నారట. ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తోంది.గతంలో చిరు-బాలకృష్ణ, వెంకీ-నాగ్, నాగ్-చిరు.. సంక్రాంతికి పోటీపడిన సందర్భాలు ఉన్నాయి గానీ నలుగురు ఒకేసారి రాలేదు. కానీ వచ్చే సంక్రాంతి మాత్రం ఈ షాకింగ్ పోటీకి వేదిక కానుందని అంటున్నారు.వీళ్లతో పాటు పవన్ కల్యాణ్-సురేందర్ రెడ్డి, శర్వానంద్-శ్రీనువైట్ల, తేజ సజ్జా 'జాంబీ రెడ్డి 2' సినిమాలని కూడా ఈ పండగకే థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి వీళ్ళలో ఫైనల్ అయ్యేది ఎవరో చూడాలి?

Prabhas Kalki 2 Update: shooting will begin soon with Kamal, Amitabh9
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్‌?

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సినిమా మొదటి భాగం సూపర్‌ హిట్‌ అయింది. దాంతో త్వరలో రానున్న రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథలాజికల్ టచ్ ఇవ్వడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి 2లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగింది. ప్రభాస్ ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగాతో 'స్పిరిట్', హనుతో 'ఫౌజీ' సినిమాల పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రం ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలకు రెడీ అవుతున్నాయి. కల్కి 2కు ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతుంది. దాంతో ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ డేట్స్‌ను కేటాయించారు. దీంతో కల్కి 2 షూటింగ్ వర్క్ త్వరలోనే మొదలుకానుంది. హీరో ప్రభాస్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్టుల విడుదలల మధ్య గ్యాప్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని కల్కి 2 విడుదల 2027 దసరా సమయంలో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Prakash Raj Exit Prabhas Spirit Movie10
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'స్పిరిట్'. సందీప్ వంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మొదలైంది. త్వరలో విదేశాలకు కూడా వెళ్లనున్నారు. కొన్నిరోజుల క్రితమే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అంతకు ముందు న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలి అంచనాలని పెంచేశారు. ఇప్పుడీ చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది.ఈ సినిమా నుంచి కొన్నాళ్ల క్రితం ఆడియో గ్లింప్స్ ఒకటి వదిలారు. ఇందులో ప్రభాస్, ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు వాయిస్ ద్వారా అర్థమైంది. హీరోయిన్ తృప్తి దిమ్రి కాగా వివేక్ ఒబెరాయ్ కూడా ఉన్నాడని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ప్రకాశ్ రాజ్.. ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారట. ఈ మేరకు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే ప్రకాశ్ రాజ్ తప్పుకోవడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సులే కారణమని మాట్లాడుకుంటున్నారు. సందీప్ వర్కింగ్ స్టైల్ గానీ సినిమా తీసే విధానం మిగతా దర్శకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మరి ఎక్కడ సమస్య వచ్చిందో గానీ ప్రకాశ్ రాజ్ తప్పుకొన్నారనే విషయం చర్చనీయాంశమవుతోంది. మరి ఇదే నిజమైతే ఇతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి?

Advertisement
Advertisement