ప్రధాన వార్తలు
అదో చెత్త మూవీ.. ఇంత అపహాస్యం చేస్తారా?: నటుడు
ప్రముఖ మలయాళ స్టార్ జయరామ్ కుమారుడు, నటుడు కాళిదాస్ జయరామ్ ఓ బాలీవుడ్ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. కేరళ సాంప్రదాయాన్ని ఖూనీ చేశారంటూ 'పరమ్ సుందరి'ని చెత్త సినిమాగా అభివర్ణించాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఆశాకల్ ఆయిరం అనే మలయాళ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.చెత్త మూవీఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నేను చూసిన చెత్త సినిమా పరమ్ సుందరి. ఈ మాట చెప్పడానికి కూడా నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఈ మూవీలో కేరళను చాలా చెత్తగా చిత్రీకరించారు. మన సంస్కృతిని అపహాస్యం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సినిమా చూసి చాలా అసంతృప్తికి లోనయ్యాను. పరమ్ సుందరి ఒక చెడ్డ అనుభవాన్ని ఇచ్చింది అని పేర్కొన్నాడు.సినిమాపరమ్ సుందరి విషయానికి వస్తే.. సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ కేరళ కుట్టిగా యాక్ట్ చేసింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 ఆగస్టు 29న విడుదలైంది. రిలీజైన నాటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇది చూడటం నా అదృష్టం: కల్యాణి
రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటో..
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో అతికొద్దిమంది సమక్షంలో ఒక్కటయ్యారు. విరోష్ పేరుతో తమ ఫ్యాన్స్ కోసం వారు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే, తమ అభిమానులు ఈ జంటపై ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్మీడియాలో సంచలనంగా మారాయి. మిలియన్ల కొద్ది లైక్స్తో రికార్డ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్లో వీరి పెళ్లి ఫోటోకు అత్యధికంగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా గతంలో వారు కూడా ఫోటోలు పంచుకున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ తమ పెళ్లి సమయంలో ఫోటోలు షేర్ చేస్తే 15.8 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డ్. కానీ, తాజాగా విరోష్ జోడీ 18.5 మిలియన్ల లైక్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ కూడా అవే ఫోటోలను షేర్ చేశారు. అక్కడ కూడా 15.2 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. మరోసారి విజయ్- రష్మిక జోడీ తమ ఇమేజ్ను చిత్రపరిశ్రమకు చూపారని ఫ్యాన్స్ అంటున్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత మరోసారి విజయ్తో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది సెప్టెంబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్పూర్లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే?
పెళ్లి తర్వాత మోదీ, అమిత్ షాలను కలిసిన 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే ‘విరోష్’ జోడీ పేరుతో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న ఉదయపూర్లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలసిందే. అయితే, మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాక్షలు చెబుతూ మోదీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను విజయ్, రష్మిక ఆహ్వానించారు.‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు.
బిగ్బాస్
ప్రేయసితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
A to Z
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. అధికారిక ప్రకటన
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భా...
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
2026 మొన్నే వచ్చినట్లుంది. కానీ అప్పుడే ఫిబ్రవరి చ...
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్ల...
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ
మంజుమ్మల్ బాయ్స్, కూలీ సినిమాలతో టాలీవుడ్లోనూ గ...
అలియా భట్ 'ఆల్ఫా'.. రూ. 215 కోట్ల ఢీల్ వద్దంటూ..
అలియా భట్. శార్వరీ వాఘ్ నటించిన స్పై థ్రిల్లర్...
రోడ్డుపై అందరూ కలిసి చితకబాదారు: అక్షయ్ కుమార్
కాలేజీ డేస్లో చాలామంది ప్రేమలో పడతారు. కొందరిది వ...
'అతన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు'.. డైరెక్టర్కు స్ట్రాంగ్ కౌంటర్
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్...
జీవితంలో ఎవర్నీ నమ్మననుకున్నా.. అలాంటిది రాజ్ వచ్చాక!
'ఏమాయ చేసావె' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట...
19ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న 'షకీరా'
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీర...
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. క...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
కలర్పుల్ డ్రెస్సుల్లో మృణాల్ ఠాకూర్.. ట్రెండీ లుక్లో దుషారా విజయన్!
డిఫరెంట్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్న మృణాల్ ఠా...
అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్.. వెంకీతో పాటు ఎవరంటే?
ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన డై...
అల్లు వారి పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- ...
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ ...
ఫొటోలు
బ్లాక్ చీరలో నటి నివేథా థామస్.. గ్లామ్ లుక్స్ (ఫోటోలు)
నాని 'ది ప్యారడైజ్' HD మూవీ స్టిల్స్
ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫొటోలు)
ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఇదిగో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)
థాయ్ల్యాండ్ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
‘హే బల్వంత్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)
గాసిప్స్
View all
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
దర్శకుడు మారుతి 'హ్యాపీ పొంగల్'?
నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’.. యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్?
హిట్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకొన్న వెంకటేశ్?
విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు”
నానికి హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ?
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
రివ్యూలు
View all
2.75
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.75
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
‘D/o ప్రసాదరావు కనుబడుటలేదు’ వెబ్ సిరీస్ రివ్యూ
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. తల్లిదండ్రులు, పిల్లలపై తాము పెంచుకునేది, పంచుకునేది ప్రేమ మాత్రమే. కాని పరిగెడుతున్న కాలంతో పోటీ పడతూ మారుతున్న ఈ సమాజంలో అదే ప్రేమ కాస్త తడబడుతూ తమ పిల్లలపై భయాన్ని కలుగజేస్తోంది. కన్న పిల్లల పై బాధ్యత తో కూడా ఆప్యాయత ఉండాలి కాని అనుమానంతో కూడిన భయం ఉండకూడదు అని చెప్పే సిరీస్ ఈ D/o ప్రసాదరావు కనుబడుటలేదు. నిజానికి పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాల్సిన సిరీస్ ఇది. వాస్తవ ఘటనలపై అల్లుకుని అత్యంత వాస్తవికంగా తీసిన ఈ సిరీస్ టీనేజ్ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లితండ్రులకు ఈ సిరీస్ ఓ కనువిప్పులాంటిది అని చెప్పవచ్చు. అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓ సారి చూద్దాం. ఊళ్ళో కిరాణ కొట్టు నడుపుకుంటున్నప్రసాదరావు కూతురు స్వాతి పట్టణంలోని ఉద్యోగం చేయడం కోసం భవాని హాస్టల్ లో చేరుతుంది. ప్రసాదరావుకి కూతురంటే వల్లమాలిన ప్రేమ. అందుకే 20ఏళ్ళ నుండి ఎక్కడకూ పంపని కూతురుని మొట్టమొదటిసారిగా కూతురు కోసం పట్టణంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడం కోసం కష్టంగా ఒప్పుకుంటాడు. అకస్మాత్తుగా స్వాతి కనిపించకుండా పోతుంది. కూతురుని వెతుక్కుంటూ ప్రసాదరావు హైదరాబాద్ కు వస్తాడు. కాని అనూహ్యంగా పోలీస్ విచారణలో స్వాతి చావుకు తన తండ్రి ప్రసాదరావే కారణమని తెలుస్తుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న స్వాతి తండ్రి ప్రసాదరావు స్వాతి చావుకు కారణమెలా అయ్యాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే జీ5లో స్ట్రీమ్ అవుతున్న D/o ప్రసాదరావు కనుబడుటలేదు చూడాల్సిందే.వాస్తవ ఘటనలను ప్రతిబింబించేలా, పదునైన సంభాషణలతో లోతైన భావాలతో చాలా హృద్యంగా చిత్రీకరించాడు దర్శకుడు. అంతేకాదు సిరీస్ ఆఖర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకందనిది. జీ5 ఓటిటి వేదికగా D/o ప్రసాదరావు కనుబడుటలేదు సిరీస్ మొత్తం 6 భాగాలలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ మొత్తం చూశాక ఆడపిల్లలున్న తండ్రులు మాత్రం తమ ఆడబిడ్డపై అనుమానం కాదు అనుబంధం ముఖ్యమని ఖచ్చితంగా భావిస్తారు. వర్త్ టు వాచ్ ఫర్ ది ఫాదర్స్ హూ హ్యావ్ డాటర్స్.
కిరణ్ అబ్బవరం కుమారుడి కేశఖండన వేడుక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందారు. హీరోయిన్ రహస్య గోరఖ్ను పెళ్లాడగా.. వీరిద్దరికి పండంటి బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా ఈ జంట తమ ముద్దుల కుమారుడికి కేశఖండన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. గతేడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గతేడాది క, కె-ర్యాంప్ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్తో మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.కిరణ్ అబ్బవరం తన కుమారుడు హనుఅబ్బవరం పుట్టి వెంట్రుకలు కార్యక్రమంలో తన గ్రామ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, తన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దనే అందమైన సందేశం ఇచ్చారు.👌@Kiran_Abbavaram #chennailovestory ♥️ pic.twitter.com/4rpBfu9d8w— Kakinada Talkies (@Kkdtalkies) February 26, 2026
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: విష్ణు విన్యాసంనటీనటులు: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులునిర్మాత: సుమంత్ నాయుడు జిరచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావుసంగీతం: రధన్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: ఫిబ్రవరి 27, 2026వరస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు శ్రీవిష్ణు. ఆ మధ్య సీరియస్ కంటెంట్ చిత్రాలు చేసినప్పటికీ..అవి బెడిసి కొట్టాయి. దీంతో తనకు అచ్చొచ్చి కామెడీ జానర్లోనే సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. అదే జోష్లో ఇప్పుడు విష్ణు విన్యాసం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. గత సినిమాల మాదిరే విష్ణు విన్యాసం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందా? శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్రూమ్ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తదేమి కాదు. రాజేంద్ర ప్రసాద్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మొదలు మొన్నటి ప్రియదర్శి ‘సారంగపాణి’ వరకు జాతకం కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న హీరోయిన్ సమస్య కూడా పాతదే. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో ఆ పాయింట్ టచ్ చేశారు. ఇలా పాత కాన్సెప్ట్ని ఎంచుకొని.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లుగా సీన్లను రాసుకొని జెంజీ బ్యాచ్ని ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు యధునాథ్ మారుతీ రావు. కథ, కథనం కంటే శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అతనితో పలికించిన వన్ లైన్ పంచులు సినిమాకు ప్లస్ అయ్యాయి. కానీ కథకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఆ కామెడీని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. హీరోయిన్కి ఏదో పెద్ద సమస్య ఉన్నట్లుగా చూపిస్తూ సినిమాను ప్రారంభించారు. ఆ తర్వాత పెళ్లి చూపుల సీన్తో హీరోని పరిచయం చేశారు. హీరోకి జాతకాల పిచ్చి ఉండడం.. ప్రతి పనికి గురువు(శ్రినివాస్ రెడ్డి)గారి అనుమతి తీసుకోవడం..ఇందంతా కొంతవరకు నవ్విస్తుంది. ఇక కాలేజీలో హీరోహీరోయిన్లు కలిసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్ వింతగా ప్రవర్తించడం.. దానికి తోడు శ్రీవిష్ణు వేసే వన్లైనర్ పంచ్లు.. కొంతమేర ఎంటర్టైన్ చేస్తాయి. హీరోయిన్ సమస్య ఏంటనేది ఇంటర్వెల్ వరకు చెప్పకపోవడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆ సమస్య తెలిసిన తర్వాత మాత్రం ఉన్న కాస్త ఆసక్తి కూడా తగ్గిపోతుంది. సోషల్ మీడియాలోని మీమ్స్ వాడుకొని విష్ణు కొంత కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో అది కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్ట్రాక్తో పాటు శ్రీవిష్ణు చేసే కామెడీ అంతా కూడా ఆర్గానిక్గా అనిపిస్తుంది. కథలో నుంచి కామెడీ పుట్టించే ప్రయత్నం చేయకుండా..కేవలం సంభాషణలతోనే నవ్వించే ప్రయత్నం చేశారు. అవి జెంజీ బ్యాచ్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఎవరెలా చేశారంటే..ఎప్పటిమాదిరే శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. ఆయన హవాభావాలు, సంభాషణలు అన్నీ కొంతవరకు నవ్విస్తాయి. మనీషా పాత్రకి నయన సారిక న్యాయం చేసింది. కమెడియన్ సత్య కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ ఆయనను సరిగా వాడుకోలేకపోయారనిపించింది. మురళీ శర్మ, గోపరాజు రమణ రెగ్యులర్ పాత్రల్లో కనిపించారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రధన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ మిగతా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సినిమా నిడివి తక్కువగా ఉండడం(2:07 గంటలు) ప్లస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
హైదరాబాద్కు విజయ్– రష్మిక.. తొలిసారి జంటగా (వీడియో)
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్కు రానున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వివాహం చేసుకున్న తర్వాత తొలిసారిగా కలిసి కనిపించారు. తాజాగా ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.పెళ్లికి ముందు కూడా వారిద్దరూ కలిసి ప్రయాణం చేసినప్పటికీ వేర్వేరుగా ప్లాన్ చేసుకునేవారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఒకరిచేయి మరోకరు పట్టుకుని సంతోషంగా ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఇలా వారిద్దరూ కలిసి కనిపించడంతో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)
రొమాంటిక్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి: భాగ్యశ్రీ
కెరీర్ ఎంత స్పీడులో ఉన్నా సరే పెళ్లవగానే సినిమాలు తగ్గించేస్తుంటారు హీరోయిన్స్. కానీ కథానాయిక భాగ్యశ్రీ మాత్రం పెళ్లయ్యాకే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం సహాయక పాత్రలు పోషిస్తోంది.కాలక్షేపం కోసం..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాగ్యశ్రీ మాట్లాడుతూ... సమాజాన్ని ప్రతిబింబించేవే సినిమాలు. 90'sలో జనాలకు వినోదం అంటే సినిమానే గుర్తొచ్చేది. కుటుంబంతో కలిసి సమయం కేటాయించడానికి, కాలక్షేపం చేయడానికి సినిమాకు వెళ్లేవారు. ఇప్పుడన్నీ మారిపోయాయి. చిన్న కుటుంబాలే ఎక్కువయ్యాయి. వినోదం కోసం అనేక మాధ్యమాలు వచ్చాయి. జనాలకు ఆప్షన్స్ ఎక్కువయ్యాయి.బలవంతంగా ఇరికించొద్దుఅదే సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం అసాధ్యంగా మారింది. సినిమాల్లోనూ జానర్స్ వచ్చాయి. వాస్తవికతకు పెద్ద పీట వేశారు. అయితే మోడ్రన్ సినిమాల్లో సహజత్వం కోసం రొమాంటిక్ సన్నివేశాలను బలవంతంగా చొప్పించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు లేదా పిల్లలతో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అలాంటి క్లోజప్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి అని చెప్పుకొచ్చింది.సినిమాఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన భాగ్యశ్రీ.. ప్రభాస్ 'రాధేశ్యామ్'లోనూ కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మూడు, నాలుగు హిందీ సినిమాల్లో నటించి వెండితెరపై చిన్న బ్రేక్ తీసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత రాజా శివాజీ అనే చిత్రం చేస్తోంది. ఈ మూవీ మే1న విడుదల కానుంది.చదవండి: అదో చెత్త సినిమా.. ఇంత వెక్కిరించాలా?: నటుడు
హోంబలే ఫిల్మ్స్ బిగ్ ప్లాన్.. బరిలోకి దిగిన నిర్మాతలు
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భారత్కు పరిమితమైన ఈ బ్యానర్ ఇప్పడు అంతర్జాతీయ మార్కెట్పై కన్నేసింది. 2012లో విజయ్ కిరగందూర్, చలువే గౌడ నేతృత్వంలో మొదలైన ఈ సంస్థ పునీత్ రాజ్కుమార్తో తొలి సినిమా తెరకెక్కించి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టారు. ఆ తర్వాత కేజీఎఫ్తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది.తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఒక పోస్ట్ చేసింది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాస్తవంగా అక్కడ బలమైన మార్కెట్ ఉన్నప్పటికీ సరైన డిస్ట్రిబ్యూషన్ లేదని పరిశ్రమకు చెందిన వారే అంటుంటారు. ఇలాంటి సమయంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నడంతో అంచనాలు పెరిగాయి. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నిర్ణయంతో భారతీయ సినిమాలు ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు ఓవర్సీల్లో భారీ సంఖ్యలో విడుదలయ్యే ఛాన్స్ రానుంది.హోంబాలే ఫిల్మ్స్ సంస్ధ ఇప్పటికే పలు చిత్రాలను భారత్లో పంపిణీ చేసింది. మహావతార నరసింహ, మిరాయ్, L2: ఎంపురాన్ వంటి చిత్రాలను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి విజయం సాధించింది. కాగా ,ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో కాంతార ప్రీక్వెల్తో పాటు సలార్ 2, కేజీఎఫ్-3, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లు ఉన్నాయి. Cinema connects hearts beyond every distance.From India to the world, our stories travel far and wide.With gratitude and quiet excitement, Hombale Films steps into Overseas Distribution carrying the spirit of Indian cinema beyond borders, across industries, and into hearts… pic.twitter.com/zxKE79FdFL— Hombale Films (@hombalefilms) February 27, 2026
అదో చెత్త మూవీ.. ఇంత అపహాస్యం చేస్తారా?: నటుడు
ప్రముఖ మలయాళ స్టార్ జయరామ్ కుమారుడు, నటుడు కాళిదాస్ జయరామ్ ఓ బాలీవుడ్ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. కేరళ సాంప్రదాయాన్ని ఖూనీ చేశారంటూ 'పరమ్ సుందరి'ని చెత్త సినిమాగా అభివర్ణించాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఆశాకల్ ఆయిరం అనే మలయాళ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.చెత్త మూవీఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నేను చూసిన చెత్త సినిమా పరమ్ సుందరి. ఈ మాట చెప్పడానికి కూడా నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఈ మూవీలో కేరళను చాలా చెత్తగా చిత్రీకరించారు. మన సంస్కృతిని అపహాస్యం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సినిమా చూసి చాలా అసంతృప్తికి లోనయ్యాను. పరమ్ సుందరి ఒక చెడ్డ అనుభవాన్ని ఇచ్చింది అని పేర్కొన్నాడు.సినిమాపరమ్ సుందరి విషయానికి వస్తే.. సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ కేరళ కుట్టిగా యాక్ట్ చేసింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 ఆగస్టు 29న విడుదలైంది. రిలీజైన నాటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇది చూడటం నా అదృష్టం: కల్యాణి
రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటో..
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో అతికొద్దిమంది సమక్షంలో ఒక్కటయ్యారు. విరోష్ పేరుతో తమ ఫ్యాన్స్ కోసం వారు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే, తమ అభిమానులు ఈ జంటపై ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్మీడియాలో సంచలనంగా మారాయి. మిలియన్ల కొద్ది లైక్స్తో రికార్డ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్లో వీరి పెళ్లి ఫోటోకు అత్యధికంగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా గతంలో వారు కూడా ఫోటోలు పంచుకున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ తమ పెళ్లి సమయంలో ఫోటోలు షేర్ చేస్తే 15.8 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డ్. కానీ, తాజాగా విరోష్ జోడీ 18.5 మిలియన్ల లైక్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ కూడా అవే ఫోటోలను షేర్ చేశారు. అక్కడ కూడా 15.2 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. మరోసారి విజయ్- రష్మిక జోడీ తమ ఇమేజ్ను చిత్రపరిశ్రమకు చూపారని ఫ్యాన్స్ అంటున్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత మరోసారి విజయ్తో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది సెప్టెంబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్పూర్లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే?
పెళ్లి తర్వాత మోదీ, అమిత్ షాలను కలిసిన 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే ‘విరోష్’ జోడీ పేరుతో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న ఉదయపూర్లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలసిందే. అయితే, మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాక్షలు చెబుతూ మోదీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను విజయ్, రష్మిక ఆహ్వానించారు.‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు.
సినిమా
వారణాసి స్టోరీ లీక్
ప్రధాని మోదీని కలిసిన 'విరోష్' జోడీ
నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు నా వైఫ్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
షణ్ముఖ్ జస్వంత్ మరియు వైష్ణవి చోడిశెట్టి ఎంగేజ్మెంట్ వీడియో
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి... గెస్ట్ లిస్ట్ & గ్రాండ్ ఫుడ్ మెనూ
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్
ఇకపై ఫారిన్ వెళ్లక్కర్లేదు..! వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లోబల్ టెక్నాలజీ
సేతుపతి, సాయి పల్లవితో మణిరత్నం లవ్ స్టోరీ
విజయ్ దేవరకొండకు రష్మిక ఎంత కట్నం ఇస్తుందో తెలుసా?
ట్రెండింగ్లో నాని జడలు ఆయా షేర్ తో అరాచకం
