Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Harish Shankar Reacts Theri Remake Rumours Latest1
నా సినిమాని పట్టుకుని 'తెరి' చేశారు.. హరీశ్ శంకర్ కామెంట్స్

మార్చి నెలాఖరులో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఒకేఒక్క పెద్ద సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటివరకు అనుకున్నంతగా బజ్ లేదు. ఎందుకో రావట్లేదు కూడా. దానికి చాలానే కారణాలు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే ఇది రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ మూవీకి రైటర్‌గా పనిచేసిన ఒకప్పటి దర్శకుడు దశరథ్.. ఇది 'తెరి' రీమేక్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇదంతా మొదలైంది. ఇప్పటికే అదే నిజమని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు.మూవీ టీమ్ గానీ దర్శకుడు హరీశ్ శంకర్ గానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేనికి రీమేక్ కాదని గతంలో చెప్పారు. తాజాగా పలువురు జర్నలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలోనూ హరీశ్ శంకర్.. మరోసారి రీమేక్ గురించి స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా అనిపించాయి.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)'తెరి మూవీలో ట్వింకిల్ ట్వింకిల్ అంటూ పాడే ఓ సీన్ ఉంటుంది. అది నా 'గబ్బర్ సింగ్' మూవీలోని అంత్యాక్షరి ఎపిసోడ్‌ని స్పూర్తిగా తీసుకుని తీశారు. నా సినిమాని పట్టుకుని తెరి చేస్తే.. నువ్వు 'తెరి' రీమేక్ చేస్తున్నావంటే నేను ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కావట్లేదు' అని హరీశ్ శంకర్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాని దిగువన కామెంట్స్ చాలావరకు ఈ దర్శకుడికి వ్యతిరేకంగానే వస్తుండటం విచిత్రం.కెరీర్‌లో చాలా సినిమాలు చేసిన హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి ఒక్కటీ సరైన సినిమా తీయలేకపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేశ్ లాంటి ఒకటి రెండు మూవీస్ ఆకట్టుకున్నప్పటికీ మరీ సూపర్ హిట్ కాలేకపోయాయి. హరీశ్ శంకర్ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. చూడాలి మరి హరీశ్ శంకర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Sreeja Konidela Stay In Dubai and Share Social Media post2
దుబాయ్‌లో మెగా డాటర్‌ శ్రీజ.. సోషల్‌మీడియాలో పోస్ట్‌

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేయడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు ఉన్న భారతీయులు ఆందోళనలో ఉన్నారు. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్నందున చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఉన్న చిరంజీవి కూతురు శ్రీజ తాజాగా ఒక పోస్ట్‌ చేశారు.దుబాయ్‌లో తాను పిల్లలతో క్షేమంగా ఉన్నానంటూ శ్రీజ పోస్ట్‌ చేసింది. అక్కడి పరిస్థితిని తెలుసుకొని చాలామంది ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ తమ క్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలామంది తమ పట్ల ప్రేమను చూపించడం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. దుబాయ్‌లో ప్రస్తుతం శాంతియుతంగానే ఉందన్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఫోటోని షేర్ చేస్తూ.. మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము. కాబట్టి, ఈ దేశానికే కట్టుబడి ఉంటాం అని ఆమె పోస్ట్‌ చేశారు. శ్రీజ ఈ పోస్ట్ చేయడంతో ఆమె తన తన పిల్లలతో కలిసి దుబాయ్‌లో స్థిరపడినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela)

Rashmika And Vijay Devarakonda Cute Video Latest3
భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక.. గతవారం పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన కొత్త జంట.. తెలంగాణలోని తుమ్మనపేట అనే గ్రామానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ సొంతూరు ఇది. సోమవారం ఉదయం అక్కడే సత్యనారాయణ వ‍్రతం చేశారు. అలానే ఊరి వాళ్లందరికీ భోజనాలు కూడా పెట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)అయితే ఈ మొత్తం వాటిలో ఒక్క వీడియో మాత్రం విరోష్ (ViRosh) అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో రష్మిక.. తన భర్త విజయ్‌ని చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. విజయ్ తనని చూసేసరికి రష్మిక ముఖాన్ని పక్కకు తిప్పుకొని మురిసిపోయింది. పూజ చేస్తున్న టైంలో ఈ క్యూట్ మూమెంట్ కనిపించింది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరికి వచ్చాడు. తన ఫామ్ హౌస్‌లోనే సత్యనారాయణ వ్రతం జరిపించాడు. అలానే ఆదివారం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశాడు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)#VijayDeverakonda & #RashmikaMandanna ❤️pic.twitter.com/9S7AW5b0Zw— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026

Manchu Lakshmi Post about Vishnu Family over Stuck in Dubai4
మనసుకు కష్టంగా ఉంది.. మంచు విష్ణు కోసం లక్ష్మి పోస్ట్‌

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేవాలపై ఇరాన్‌ క్షిపణులు ప్రయోగిస్తోంది. అటు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడులతో పలుచోట్ల ఎయిర్‌పోర్టులను మూసివేశారు. దాంతో ఎంతోమంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు.దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీవారిలో అజిత్‌, ఈషా గుప్తా, సోనాల్‌ చౌహాన్‌, మంచు విష్ణు వంటి పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. విష్ణు అయితే ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో నిలబడి ఉండగా తనపై నుంచే క్షిపణులు వెళ్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది చూసి తన చిన్నకూతురు భయపడిపోయిందని పేర్కొన్నాడు. ఈ వీడియో కింద అభిమానులు విష్ణు కుటుంబంతో సహా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.మనసుకి కష్టంఈ క్రమంలో మంచు విష్ణు సోదరి, నటి లక్ష్మీ మంచు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. దుబాయ్‌లో ఉన్న విష్ణు, అతడి కుటుంబం క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మనకు బాగా కావాల్సిన వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తట్టుకోవడం చాలా కష్టం. మీ అందర్నీ నా హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాను. ఆ దేవుడి దయ మీకు రక్షణగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమే గెలుస్తుంది అని రాసుకొచ్చింది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల జాబితా

Rashmi Gautam Reacts Khamenei Followers India5
వాళ్లందరినీ ఇరాన్ పంపించేయండి.. యాంకర్ రష్మి ట్వీట్

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆ రెండు దేశాలతో పాటు యుద్ధ ప్రభావం.. యూఏఈ, దుబాయి, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాలపై కూడా పడింది. దీంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. మరోవైపు తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ చేసిన పలు ట్వీట్స్ ఇప్పుడు షాక్‌కి గురిచేస్తున్నాయి.'మన దేశం.. ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలని గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేం సహించం. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వం' అని రష్మి తన ట్విటర్‌లో రాసుకొచ్చింది. రాడికల్ (అతివాద) ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్లని దయచేసి ఇరాన్‌కి పంపాలని ఏకంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాళ్లు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చని పేర్కొంది. మన దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల సమస్యలు తదితర అంతర్గత సమస్యలు ఉన్నాయని, వీటికి తోడుగా ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్నవాళ్ల మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాల్లో ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లిళ్లు చేస్తున్నారని, కానీ తాను ఒక స్వతంత దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే పలువురు రష్మి.. వైవాహిక జీవితం గురించి ప్రశ్నించగా వాటికి కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. 'నేను పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉన్నాసరే నా దేశంలో పూర్తి గౌరవంతో వ్యక్తిత్వంతో బతుకుతున్నాను' అని రష్మి చెప్పుకొచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. .

Upcoming OTT Movies Telugu March First Week 20266
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

2026లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింది. అలానే కొత్తవారం కూడా మొదలైంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 13కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఓం శాంతి శాంతి శాంతిః లాంటి తెలుగు చిత్రంతో పాటు విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ ఇదే వీకెండ్ అందుబాటులోకి వస్తాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రాలేదు. బహుశా ఈ వారం రావొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 02 నుంచి 08 వరకు)నెట్‌ఫ్లిక్స్విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06అమెజాన్ ప్రైమ్తన్వి ద గ్రేట్ (హిందీ మూవీ) - మార్చి 03యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04సుబేదార్ (హిందీ సినిమా) - మార్చి 05హాట్‌స్టార్విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06ఆహాఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు సినిమా) - మార్చి 04సోనీ లివ్లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)

Allu Sirish Debut in Bollywood: his Role in Aamir Khan Ghajini7
బాలీవుడ్‌తోనే మొదలైన కెరీర్‌.. ఫైనలియర్‌లో ఉన్నప్పుడు!

మరో నాలుగు రోజుల్లో అల్లు శిరీష్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పడనుంది. మార్చి 6న నయనిక మెడలో శిరీష్‌ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు, వేడుకలు జోరందుకున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు శిరీష్‌ కెరీర్‌ గురించి ఓ సారి చూసేద్దాం..బాలీవుడ్‌ మూవీతో కెరీర్‌ మొదలుప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్‌ సంస్థాపకుడు అల్లు అరవింద్‌ చిన్న కుమారుడే అల్లు శిరీష్‌. అరవింద్‌ పెద్ద కుమారుడు అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. అయితే శిరీష్‌ మాత్రం కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించేశాడు. శిరీష్‌ మూడేళ్ల వయసులో చిరంజీవి 'ప్రతిబంధ్‌' అనే హిందీ చిత్రంలో బాలనటుడిగా యాక్ట్‌ చేశాడు. ఆ తర్వాత 2013లో వచ్చిన గౌరవం సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా కంటే ముందుకొత్త జంట చిత్రంతో క్రేజ్‌ అందుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ: అమెరికన్‌ బర్న్‌ కన్‌ఫ్యూజ్‌డ్‌ దేశీ, ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేశాడు. 2024లో వచ్చిన బడ్డీ చిత్రంలో చివరిసారి కనిపించాడు. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. అయితే 2013లో హీరోగా తన కెరీర్‌ మొదలవడానికే ముందే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం చాలా తక్కువమందికే తెలుసు! కాకపోతే హీరోగా కాదు, నిర్మాతగా! హిందీ గజిని సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. ఆమిర్‌ ఖాన్‌కు అభిమానిఈ విషయాన్ని అల్లు శిరీష్‌ స్వయంగా వెల్లడించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శిరీష్‌ మాట్లాడుతూ.. లగాన్‌, గులాం సినిమాలు చూశాక ఆమిర్‌ ఖాన్‌కు నేను పెద్ద అభిమాని అయిపోయాను. ఆయనతో కలిసి పని చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అలాంటిది గజిని హిందీ రీమేక్‌ నా చేతుల్లోకి వచ్చేసరికి నమ్మలేకపోయాను. అప్పుడు నేను కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్నాను. నాన్న నిర్మాతగా, నేను సహ నిర్మాతగా గజిని తెరకెక్కించాం.అదే ఎక్కువ ఇష్టంతమిళంలో తెరకెక్కిన గజిని సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాని హిందీ రీమేక్‌ మరింత బాగుండేలా జాగ్రత్తపడ్డాం. ఈ సినిమా కోసం పని చేసిన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. కాబట్టి నాకు హిందీ వర్షన్‌ అంటేన ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. 2008లో వచ్చిన గజిని ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే భారతేశంలో రూ.100 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసిన తొలి హిందీ మూవీగానూ చరిత్ర సృష్టించింది.చదవండి: చదువుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి.. స్పందించిన కమెడియన్‌

Yash and Kiara Advani Tabaahi song out from Toxic8
టాక్సిక్‌ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల.. నిరాశపరిచిన యశ్‌

కన్నడ నటుడు యశ్ హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, తాజాగా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. యశ్‌, కియారా ఆద్వాణిల మధ్య సాగే 'తాబాహీ..' ఈ పాటను విశాల్ మిశ్రా ఆలపించగా రామజోగయ్య శాస్త్రి తెలుగు సాహిత్యం రాశారు. టాక్సిక్‌లో నదియా అనే పాత్రలో కియారా నటిస్తున్న విషయం తెలిసిందే.టాక్సిక్‌ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఈ పాట మొదటిసారి వినగానే బాగుంది. కానీ, మరింత బలంగా ఆకర్షించేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. సినిమా నుండి రొమాంటిక్ సాంగ్‌ను ఆశించిన వారు కొంచెం నిరాశ చెందవచ్చు. ఒకే పోస్టర్‌తో సాంగ్‌ను విడుదల చేశారు. కనీసం వీరిద్దరి స్టిల్స్‌, విజువల్స్‌ చేర్చకుండా పాటను విడుదల చేయడంతో ఇది అభిమానులను మరింత నిరాశపరచవచ్చు. ఈ సినిమా మార్చి 19న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.

Malayalam Actress Complaint To Manjummel Boys director Chidambaram9
హిట్‌ సినిమా దర్శకుడిపై నటి ఫిర్యాదు

మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్‌ దర్శకుడు చిదంబరం వివాదంలో చిక్కుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళం టౌన్ సౌత్ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మలయాళ నటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. 2022లో కొచ్చి నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్ తనతో లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. శ్రీ చిదంబరంపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74, 75 (లైంగిక వేధింపుల నేరాలు) కింద అభియోగాలు మోపారు.2024లో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో దేశవ్యాప్తంగా చిదంబరం విపరీతమైన గుర్తింపు పొందారు. ఈ మూవీతో సినీ రంగంలో ప్రముఖ యువ దర్శకులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. 2021లో ‘జాన్‌.ఈ.మ్యాన్‌’ అనే చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన తక్కువ సమయంలోనే స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

Rajpal Yadav Reaction TO Director Priyadarshan for saying he poorly Educated10
చదువుకోకపోవడం వల్లే ఈ దుస్థితి! స్పందించిన కమెడియన్‌

చెక్‌ బౌన్స్‌ కేసు కారణంగా కమెడియన్‌ రాజ్‌పాల్‌ యాదవ్‌ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్‌ జైలు నుంచి బెయిల్‌ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్‌, కామెడీ, మినీ సిరీస్‌.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు. విద్య కారణం కాదుఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌పాల్‌ యాదవ్‌ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్‌ కాదు.కొన్నిసార్లు తప్పవునేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్‌ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు. నీ కొడుకులాంటివాడినిఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్‌ గోపాల్‌ వర్మ, డేవిడ్‌ ధావన్‌, ప్రియదర్శన్‌.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్‌లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్‌కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.సినిమాకాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్‌పాల్‌ యాదవ్‌ ప్రస్తుతం భూత్‌ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్‌పాల్‌ యాదవ్‌.. వెల్‌కమ్‌ టు ద జంగిల్‌, హైవాన్‌, మరో రెండు సినిమాలు, రెండు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నాడు.చదవండి: వారణాసి అప్‌డేట్‌ ఇచ్చిన ప్రియాంక

Advertisement
Advertisement