Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Mammootty on Sensory Loss that Paused his Career in 20251
లేనప్పుడే విలువ తెలుస్తుంది.. అనారోగ్యంపై తొలిసారి స్పందన

మలయాళ స్టార్‌ మమ్ముట్టి గతేడాది జూన్‌లో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించాడు. ఆరోగ్యం కుదుటపడ్డాకే తిరిగి సినిమాల్లో యాక్టివ్‌ అయ్యాడు. తాజాగా ఆయన తొలిసారి తన అనారోగ్యం గురించి మాట్లాడాడు. మనిషికి కంటిచూపు, వినికిడి చాలా ముఖ్యమైనవి. అయితే శ్వాస తీసుకునేటప్పుడు ఏ వాసన రాకపోతే కొంత ఆందోళన కలుగుతుంది. నేను కూడా కొంతకాలం అలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నాను. లేనప్పుడే విలువ తెలుస్తుందిచాలాకాలం రుచి, వాసన కోల్పోయాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తిరిగి పొందుతున్నాను. అయితే ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు అర్థమవుతుంది. వినడం, వాసన గ్రహించడం, రుచి చూడటం వంటి సామర్థ్యాల ప్రాధాన్యత చాలామంది పట్టించుకోరు. వాటి శక్తి నెమ్మదించినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే చిన్నగా మాట్లాడమని చెప్తాం. ఎందుకంటే మనం వినగలుగుతున్నాం. కానీ వినికిడి శక్తి లేనివారు ఏదీ అనకుండా సైలెంట్‌గా ఉంటారు. ఎవరెలా మాట్లాడినా వారికి తేడా ఉండదు. వినగలగడం కూడా ఒక వరం అని చెప్పుకొచ్చాడు.కెరీర్‌మమ్ముట్టి 1951 సెప్టెంబర్‌ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్‌లో జన్మించాడు. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ చదివిన ఆయన రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశాడు. 1971లో అనుభవంగళ్‌ పాలిచకల్‌ మూవీలో ఓ చిన్నపాత్రతో నటన ప్రారంభించాడు. విల్కన్‌ ఉండూ స్వప్నంగళ్‌ సినిమాతో హీరోగా మారాడు. ఏడాదికి ఇరవైకి పైగా సినిమాలు చేశాడు. అలా దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలకుగానూ మమ్ముట్టికి పద్మభూషణ్‌ అవార్డు వరించింది. ప్రస్తుతం ఈయన పాత్ర, పేట్రియాట్‌ సినిమాల్లో నటిస్తున్నాడు.చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానం: సుహాస్‌

Nithya Menen Turns Producer With Keyura Production2
హీరోయిన్ నిత్యా మేనన్ మరో ముందడుగు

హీరోయిన్ నిత్యా మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నాని, నితిన్ తదితర హీరోలతో పలు సినిమాలు చేసింది. హిట్స్ కొట్టింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో నటించిన ఈమె.. ప్రస్తుతం ఇతర దక్షిణాది భాషలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది ఈమె నుంచి మూడు తమిళ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతానికి నిత్య చేతిలో కొత్త ప్రాజెక్టులు అయితే ఏం లేనట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతగా ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)'కేయూరి ప్రొడక్షన్ (Keyuri Productions)' పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడించిన నిత్యా మేనన్.. ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. వ్యాపార లాభాల కంటే కథాబలం, లోతైన పాత్రలు, సమాజంపై ప్రభావం చూపే సినిమాలకే తన ప్రాధాన్యం అని పేర్కొంది. ప్రస్తుతానికి కొత్తగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ప్రాజెక్టులేం ప్రకటించలేదు. చూస్తుంటే తనకున్న యాక్టింగ్ కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత నటి, నిర్మాత కొనసాగనుంది. 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా మేనన్.. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ తదితర చిత్రాల్లో కనిపించింది.(ఇదీ చదవండి: ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత) View this post on Instagram A post shared by Keyuri (@keyuriproductions)

Neena Gupta Says India Has Not Changed, Men Still Want A Virgin Wife3
మగాళ్లకి వర్జిన్ భార్యలే కావాలి : నటి సంచలన కామెంట్స్

ఛోళీకే పీఛే క్యాహై అనే ఖల్‌నాయక్‌లో పాట గుర్తున్నవాళ్లకి మాధురీ దీక్షిత్, సంజయ్‌ దత్‌లతో సమానంగా గుర్తుండే మహిళ నీనాగుప్తా. సినిమాల్లో నటనకు మాత్రమే కాదు అత్యంత స్వేఛ్చాయుత వ్యక్తిగత జీవితం ద్వారా బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ కన్నా మిన్నగా ఆమె గుర్తొస్తారు. మహిళల వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రంపై ఆమె తరచుగా వెల్లడించే అభిప్రాయాల సందర్భంలో నీనా వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఆమె 30 సంవత్సరాల వయసులో పెళ్లికాకుండానే ఒంటరి తల్లి అయ్యింది. ఆమె కుమార్తె మసాబా రాకను సంతోషంగా స్వాగతించింది. వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌ తన బిడ్డకు తండ్రి అని ఆ తర్వాత వెల్లడించింది. ఆ తర్వాత కూడా ఆమె అంతే స్వేఛ్చగా తన జీవితం గడుపుతూ వస్తోంది. అయితే తన నిర్ణయాలతో తనకు బాగుండవచ్చునని, అందరినీ అదే దారి ఎంచుకోవాలనే సలహా తాను ఇవ్వబోనని తరచుగా ఆమె స్పష్టం చేస్తుంటారు. ఈ నేపధ్యంలో...మన దేశంలో మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న వివక్షాపూరిత వాస్తవాల గురించి ప్రముఖ నటి నీనా గుప్తా మరోసారి కుండ బద్ధలు కొట్టారు. ఆధునిక సమాజపు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందనీ, విశాల థృక్పధం గణనీయంగా అభివృద్ధి చెందిందనే ఆమె నిర్ధ్వందంగా తిప్పికొట్టారు. ఇటీవల ఓ మీడియాతో జరిపిన సంభాషణలో, ఈ సీనియర్‌ నటి పితృస్వామ్యం, పురుషాధిక్యత ఇప్పటికీ వివాహం తర్వాత మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆమె ఎత్తి చూపారు. ఈ సంభాషణ సందర్భంగా భారతీయ సంప్రదాయ సమాజంలో వధువు కన్యత్వం పట్ల ఇంకా కొనసాగుతున్న వ్యామోహాన్ని నీనా ప్రస్తావించారు. నేటికీ కన్యత్వం అంత ముఖ్యమైన అంశంగా ఉందా అని అడిగినప్పుడు, భారతదేశం గురించి మాట్లాడుతున్నావా? ఇక్కడ ఇప్పుడు ఏం మారింది? అంటూ ఎదురు ప్రశ్నించారు. ‘మగ వారు భార్యను కన్యగానే కోరుకుంటున్నారు‘ అని ఆమె అన్నారు. కొంత వరకూ నగరాల్లో, ఇంగ్లీష్‌ మాట్లాడే మగ వారు చూడడానికి చాలా విశాల మనస్తత్వం ఉన్నట్టు కనిపిస్తారని అయితే అది నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ’వారు కూడా కన్యనే భార్యగా కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారామె.పరిస్థితులు మారిపోయాయనే ఊహను నీనా ప్రశ్నించింది. ‘మన దగ్గర జనం ఓపెన్‌గా ఉంటారని ఎలా అంటున్నారు? అదొక్కటే కాదు మన దేశంలో చాలా విషయాలు ఇప్పటికీ మారలేదు. మహిళలు ఇప్పటికీ తలపై కొంగు కప్పుకుని ఆ తర్వాత మామగారి పాదాలను తాకుతారు. ఇక్కడ నువ్వూ నేనూ మైనారిటీలం, మనం నిజమైన భారతదేశం కాదు. చక్కగా దుస్తులు ధరించి, చక్కగా మాట్లాడే మనలాంటి వారు భారతదేశం కాదు.‘ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారామె. తన అభిప్రాయాన్ని బలపరిచేలా నీనా తన సొంత కుటుంబంలోని కొన్ని సంఘటనలను పంచుకున్నారు.‘నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా తండ్రి వైపు ఉన్న ఒక బంధువుల అమ్మాయి ముంబైలో ఒక పెద్ద సంస్థలో పనిచేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఒకసారి నా తండ్రి ఆ అబ్బాయి, అమ్మాయి ఆమె కుటుంబాన్ని తన ఇంటికి మాట్లాడటానికి పిలిచాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ముంబైలో ఆ అబ్బాయి, అతని కుటుంబంతో ఇకపై నివసించడానికి నిరాకరించింది. ఆ అమ్మాయి అలాంటి వివక్ష ఎదుర్కుంది మరి. కనీసం తనకు నచ్చిన దేవుడ్ని పూజించడానికి కూడా ఆ అమ్మాయిని అనుమతించలేదట. ఆ అమ్మాయి సాయి బాబా అంటే ఇష్టం కాబట్టి బాబా ఫొటోను తన గదిలో ఉంచితే ఆమె అత్తగారు దానికి కూడా అనుమతించలేదు. తాము పూజించే ఓ గురువు ఫొటోనే పెట్టాలని ఆదేశించింది‘ అని ఆమె గుర్తు చేసుకున్నారు.తర్వాత ఆమె మరొక సంఘటనను ఉదహరించారు. ‘నేను మీకు మరో ఉదాహరణ ఇస్తాను. ఇది నా మేనకోడలికి సంబందించింది. ఆమెను ఆమె అత్తగారు తన కుటుంబ ఫోటోను తన పడక టేబుల్‌పై పెట్టుకోవద్దని అడ్డుకున్నారు’’ అంటూ పంచుకున్నారామె. ఏదేమైనా దేశంలోని మహిళల స్థితిని మార్చే విషయంలో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు.

Vijayendra Prasad Apology And Latest Speech4
మా పూర్వీకులు భయంకరమైన దారుణాలు చేశారు.. రాజమౌళి తండ్రి

దర్శకుడిగా రాజమౌళి ఎంత ఫేమస్సో.. ఈయన సినిమాలన్నింటికీ కథలు రాసే తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా అంతే ఫేమస్. మహేశ్ బాబు 'వారణాసి'కి స్టోరీ రాసిన ఈయన.. ప్రస్తుతం పలు చిత్రాలకు కథలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. అలాంటిది మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన మాతా రాంబాయి అంబ్కేడర్ మెమొరియల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా అనిపించాయి.(ఇదీ చదవండి: మానస వారణాసి 'ఫ్రెండ్లీ' హిట్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)'మాది సంపన్న కుటుంబం. నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు. మా పూర్వీకులు మాత్రం అంటరానితనం పేరుతో, నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశారు. అ‍ప్పటి పరిస్థితులు తలుచుకున్నప్పుడు మనసు సిగ్గుతో, అవమానంతో కుంగిపోతుంది. మీ అందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. క్షమించండి. క్షమించండి.. క్షమించండి' అని విజయేంద్ర ప్రసాద్ వేడుకున్నారు.ఇప్పటికీ తన ఆఫీస్‌లో అంబేడ్కర్ ఫొటో మాత్రమే ఉంటుందని, ప్రస్తుతం ఆయనపై ఓ సినిమా కథ రాస్తున్నానని ఈ మేరకు పరిశోధన చేస్తున్నానని కూడా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత)

Couple Friendly Fame Manasa Varanasi Full Details5
తెలుగమ్మాయి 'ఫ్రెండ్లీ' హిట్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

టాలీవుడ్‌లో హీరోయిన్లుగా చేసిన తెలుగమ్మాయిలు రీసెంట్ టైంలో బాగానే కనిపిస్తున్నారు. అలాంటి వాళ్లలో మానస వారణాసి ఒకరు. గత వీకెండ్ రిలీజైన 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో తొలి సక్సెస్ అందుకున్న ఈమె.. సంతోషంలో మునిగితేలుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దు: మంచు లక్ష్మీ)మాసన పక్కా హైదరాబాదీ. చిన్నప్పుడు ఇక్కడే చదువుకుంది గానీ తండ్రి ఉద్యోగరీత్యా మలేసియా వెళ్లింది. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చిన తర్వాత హైదరాబాద్‪‌లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో చదివింది. ఆ టైంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 2020లో మిస్ తెలంగాణగా నిలిచింది. అదే ఏడాది.. ఫెమినా మిస్ ఇండియా, మిస్ ఇండియా వరల్డ్ కిరీటాలు కూడా సొంతం చేసుకుంది.పలు మోడలింగ్ పోటీల్లో గెలిచిన ఈమెకు సహజంగా సినిమాలపై ఆసక్తి కలిగింది. కానీ ఇంట్లో వాళ్లు తొలుత వద్దని చెప్పడంతో హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్సియల్ ఇన్ఫర్మేషన్ ఎక్సేంజ్ అనలిస్టుగా కొన్నాళ్ల పాటు పనిచేసింది. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాత ఇంట్లో వాళ్లని ఒప్పించి ఇండస్ట్రీలోకి ఎంటరైంది. తొలుత మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. లుక్స్ బాగున్నప్పటికీ హిట్ అయితే దక్కలేదు.2024లో తొలి సినిమా రిలీజైతే.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో వచ్చింది. ఇందులో మిత్ర అనే పాత్రలో అదరగొట్టేసింది. సంతోష్ శోభన్ హీరోగా చేసిన ఈ చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న మానస.. టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. సంతోష్ శోభన్‌తోనే మరో సినిమా చేయనున్న మానసకు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. శ్రీలీల, భాగ్యశ్రీ లాంటి వాళ్లు ఉన్నప‍్పటికీ.. స్టార్ హీరోలకు సరైన జోడీగా మానస నిలిచే ఛాన్స్ ఉంది. మరి కెరీర్‌ని ఈమె ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు: హీరో సుహాస్) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi)

Actor Sidharth Malhotra Father No More6
ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత

ఇండస్ట్రీలో విషాదం. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఇది జరిగినప్పటికీ.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే హిందీ సెలబ్రిటీలు అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నివాళి అర్పిస్తున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు)స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, షేర్ షా తదితర సినిమాలతో హీరోగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా.. ఫిబ్రవరి 14న ఢిల్లీ తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భార్య కియారా అడ్వానీతో కలిసి ఢిల్లీ వెళ్లిన సిద్ధార్థ్.. అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కష్టకాలంలో కుటుంబంతో కలిసి ఉ‍న్నారు. నాన్న చనిపోయిన విషయాన్ని మర్చిపోలేకపోతున్న సిద్ధార్థ్.. మంగళవారం రాత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోలెడన్ని ఫొటోలని పంచుకున్నాడు.'ఆయన నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎప్పుడూ తలవంచలేదు. జీవితం ఆయన్ని పరీక్షించినప్పుడు కూడా బలంగా నిలబడ్డారు. మర్చంట్ నేవీ కెప్టెన్‌గా సముద్రాన్ని శాసించడం దగ్గర నుంచి అనారోగ్యాన్ని ఎదుర్కోవడం వరకు ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. స్ట్రోక్ వల్ల ఆయన వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ బలంగా నిలబడ్డారు. మీ పాజిటివిటీ ఇప్పటికీ ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతోంది. నిద్రలోనే మమ్మల్ని మీరు వదిలి వెళ్లారు. మీరు లేని లోటు తీరనిది. మీ వల్లే నేను ఇలా ఉన్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను నాన్న' అని సిద్ధార్థ్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

Suhas Reveals Bad Experience With Telugu Movie Latest7
హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు

టాలీవుడ్‌లో లెక్కలేనంత మంది హీరోలున్నారు. స్టార్స్ పెద్దగా కష్టాల్లాంటివి ఉండవు గానీ చిన్న హీరోలు మాత్రం చాలా కష్టపడి పైకొచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో సుహాస్ ఒకడు. షార్ట్ ఫిల్మ్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ఇప్పుడు తెలుగు హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. అడపాదడపా మూవీస్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తనకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ ఘోర అవమానాన్ని గుర్తుచేసుకున్నాడు. దానితో లింక్ చేస్తూ తను ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యాననే విషయాన్ని కూడా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్)'ఓ సినిమాకు యాక్టర్‌గా వెళ్లినప్పుడు పెద్ద హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర దక్కింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత.. ఇతడిని ఎందుకు పిలిచారని అక్కడే నన్ను అవమానించారు. ఆమె పక్కన నిలబడే అర్హత కూడా లేదన్నారు. కట్ ఇప్పుడు కీర్తి సురేశ్‌తో 'ఉప్పు కప్పురంబు' అనే మూవీ చేశాను. నా విషయంలో ఇది సక్సెస్. పెద్ద హీరోయిన్ పక్కన నేను పనికిరాను అని అన్నోళ్లు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతెందుకు కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. నేను కనిపిస్తే హగ్ కూడా ఇస్తున్నారు' అని సుహాస్ చెప్పుకొచ్చాడు.ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'హే బల్వంత్'. శివానీ నాగారం హీరోయిన్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ బిజినెస్ అనే కాన్సెప్ట్‌తో తీసినట్లు ట్రైలర్ బట్టి అర్థమైంది. (ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన)

Pravina Deshpande Passes Away at 608
తీవ్ర విషాదం.. 'రెడీ' న‌టి కన్నుమూత

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ న‌టి ప్రవీణ దేశ్‌పాండే (60) క‌న్నుమూశారు. గత ఐదేళ్లుగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆమె.. మంగ‌ళ‌వారం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ప్రవీణ కుటుంబ స‌భ్యులు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.ప్రవీణ దేశ్‌పాండే 2019లో మల్టిపుల్ మైలోమా (బ్లడ్ క్యాన్సర్ రకం) బారిన ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికి ఓ వైపు చికిత్స పొందుతూనే తన నటనను కొనసాగించారు. 2023లో కొంత కాలం విరామం తర్వాత ఆమె మ‌ళ్లీ మేక‌ప్ వేసుకున్నారు. ఆమె చివరిగా ఇటీవ‌ల విడుదలైన‌ 'తస్కరీ' (Taskaree) వెబ్ సిరీస్‌లో ఆతిది పాత్ర‌లో క‌న్పించారు. తన హుందాతనమైన నటనతో ఈ సిరీస్‌లోనూ ఆకట్టుకున్నారు. అయితే ఇటీవ‌ల ఆమె ఆరోగ్య ప‌రిస్ధితి మ‌రింత క్షీణించింది. ఈ క్ర‌మంలోనే దేశ్‌పాండే ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటించిన 'రెడీ' చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆమె కేవలం వెండితెరపైనే కాకుండా, అనేక సూపర్ హిట్ హిందీ, మరాఠీ సీరియల్స్‌లో నటించి ఇంటింటికీ సుపరిచితురాలయ్యారు. ఆమె 'పరమాణుస‌, 'జలేబీస, 'ఏక్ విలన్' వంటి చిత్రాలలో ఆమె సహాయ నటిగా అలరించారు. ఆమె మృతి పట్ల సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తంచేసింది.

Interesting discussion on Maruti new project9
మారుతి కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చ

దర్శకుడు మారుతికి ‘రాజాసాబ్’ సినిమా ఫలితం పెద్ద షాక్‌నే ఇచ్చింది. ఆ సినిమా పరాజయానికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ విమర్శల బాణాలు మాత్రం మారుతి వైపే ఎక్కువగా వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన మరో కొత్త స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారు. మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మారుతి కేరళలో ప్రశాంతంగా కూర్చుని తన దగ్గర ఉన్న ఒక పాయింట్‌ను పూర్తి స్క్రిప్ట్‌గా మార్చారు. అయితే ఆ కథకు హీరో ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దృష్టి మాత్రం హీరో రామ్, హీరో వరుణ్ తేజ్‌లపై ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ సినిమా నిర్మాణం మైత్రీ మూవీస్‌తో జరగనుంది. మైత్రీలో మారుతి సినిమా ఎప్పటి నుంచో ప్లాన్‌లో ఉంది. కానీ ఇప్పటివరకు ఫైనల్ మాత్రం కాలేదు. చూస్తుంటే ఇప్పుడు ఆ అవకాశం నిజమయ్యేలానే ఉంది. ప్రస్తుతానికి రామ్ చేతిలో సినిమా లేదు. రెండు స్క్రిప్ట్‌లు వర్క్‌లో ఉన్నాయి. ఒకవేళ అవి కాకపోతే మారుతి స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే యువి క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్నారు. ఒకసారి మారుతి స్క్రిప్ట్ విన్న తర్వాత రామ్ లేదా వరుణ్ తేజ్‌ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో స్పష్టత వస్తుంది.అయితే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మైత్రీ మూవీస్- మారుతి కాంబినేషన్ ఫైనల్ అయితే టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

Tollywood actresses Latest Social Media updates Goes Viral10
బేబీ హీరోయిన్ లేటేస్ట్ లుక్..శారీలో సింగర్ మధు ప్రియ..!

ఈషా ఫౌండేషన్ ఈవెంట్‌ జ్ఞాపకాల్లో తమన్నా..జిమ్‌లో కష్టపడుతోన్న సుకుమార్ సతీమణి తబిత..శారీలో సింగర్ మధు ప్రియ..బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లేటేస్ట్ లుక్..హీరోయిన్ రంభ గ్లామరస్ లుక్.. View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti)

Advertisement
Advertisement