Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Nari Nari Naduma Murari Movie Ticket Offers for Sankranthi Festival1
సంక్రాంతి సినిమాకు బంపరాఫర్.. ఎమ్మార్పీకే టికెట్స్..!

ఈ సంక్రాంతి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్‌గారు రిలీజై థియేటర్లలో అలరిస్తున్నాయి. వీటితో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు చిత్రాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. ఈ నెల 14న శర్వానంద్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఆడియన్స్‌కు బంపరాఫర్ ప్రకటించింది. నారీ నారీ నడుమ మురారి మూవీ టికెట్ ధరలపై క్రేజీ ఆఫర్ అనౌన్స్ చేసింది. కేవలం ఎమ్మార్పీ ధరలకే ఈ మూవీ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా.. శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్! 🔥 MRP ధరలకే టికెట్లు 🎟️Catch #NariNariNadumaMurari at no extra charges! 🙌𝐎𝐧𝐥𝐲 𝐄𝐱𝐭𝐫𝐚 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭! 😎🤩💥Watch Trailer here 🔗 https://t.co/iZRE43vZzlLets Celebrate in theatres from Jan 14 | 5:49 PM onwards… pic.twitter.com/cDfrEBhL8e— AK Entertainments (@AKentsOfficial) January 12, 2026

Director Karan Johar Says He One Fainted in college while Dieting2
బండోడా అని అమ్మ తిట్లు.. కళ్లు తిరిగి పడిపోయా!

బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్‌ పాటించి, వర్కవుట్స్‌ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.సరైన సమయం దొరక్క..కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. కానీ నా వృత్తిలో సరైన టైమింగ్స్‌ అంటూ ఉండవు, సెలవులు ఉండవు, పండగ హాలీడేస్‌ ఉండవు. అర్జంట్‌ అంటూ తరచూ ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి నేను డైటింగ్‌ను తు.చ తప్పకుండా పాటించడం కాస్త కష్టమైంది. అయితే మా నాన్న.. నేను లావుగా ఉన్నప్పటికీ హ్యాండ్సమ్‌గానే ఉన్నాననేవారు. అమ్మ తిట్టేదిఅమ్మ మాత్రం ఒప్పుకోకపోయేది. ఏం మాట్లాడుతున్నావ్‌? వాడు చాలా లావుగా, బండలా ఉన్నాడనేది. నేను హీరో కావాలని మా నాన్న కోరుకుంటే అమ్మ మాత్రం.. నన్ను ఎగాదిగా చూసి అది జరగదని తేల్చిపడేసేది. ఆమె ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది. కాలేజీకి మంచి డ్రెస్‌ వేసుకుని వెళ్లినప్పుడు అందరూ నాకంటే సన్నగా కనిపించేవారు. కళ్లు తిరిగి పడిపోయా..అప్పుడు తొలిసారి బరువు తగ్గాలనుకున్నాను. ఎన్నో డైట్స్‌ ప్రయత్నించాను, కానీ ఏదీ వర్కవుట్‌ కాలేదు. ఒక నెలపాటు డైటింగ్‌ చేయగానే అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఒకసారి కాలేజీలో నా క్లాస్‌రూమ్‌లో కళ్లు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే మా అమ్మ నన్ను తిట్టి డైట్‌ మాన్పించింది. నేను చికిత్స ద్వారా బరువు తగ్గానని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వాటి వల్లే బరువు తగ్గా..కాకపోతే బరువుకు కారణమేంటి పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్‌ ఉన్నట్లు తేలింది. శరీరంలో గ్లూటెన్‌ ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అందుకు బాదం పాలు తోడ్పడ్డాయి. చక్కెర తగ్గించేశాను. వర్కవుట్స్‌ చేశాను. గేమ్స్‌ ఆడాను, ఈత కొట్టాను. బరువు తగ్గాను అని కరణ్‌ జోహార్‌ చెప్పుకచ్చాడు.చదవండి: ఓటీటీ మూవీ చీకటిలో.. ట్రైలర్‌ చూశారా?

Mana Shankara Vara Prasad Garu USA Collections Crossed Akhanda-2 Movie3
ప్రీమియర్స్‌తోనే అఖండ-2ను దాటేసిన 'మన శంకరవరప్రసాద్‌ గారు'

తెలుగు రాష్ట్రాల్లో 'మన శంకరవరప్రసాద్‌ గారు' థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. మూవీకి పాజిటీవ్‌ టాక్‌ రావడంతో థియేటర్స్‌ కూడా పెరగనున్నాయి. అయితే, ఉత్తర అమెరికాలో కూడా చిరంజీవి సత్తా చాటుతున్నారు. ఓవర్సీస్‌లో బాలకృష్ణ అఖండ-2 సినిమాకు వచ్చిన ఫైనల్‌ కలెక్షన్స్‌ను‌ కేవలం ప్రీమియర్స్‌తోనే మన శంకరవరప్రసాద్‌ గారు దాటేశారు. సినిమాకు పాజిటీవ్‌ టాక్‌ రావడంతో అక్కడ బుకింగ్స్‌ జోరు కనిపిస్తుంది.బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. ఉత్తర అమెరికాలో ఈ మూవీ ఫైనల్‌ కలెక్షన్స్‌ 1 మిలియన్‌ డాలర్స్‌ (రూ. 9కోట్లు) రాబట్టింది. అయితే, 'మన శంకరవరప్రసాద్‌ గారు' కేవలం ప్రీమియర్స్‌ ద్వారానే 1.2 మిలియన్‌ డాలర్స్‌( రూ.11కోట్లు) రాబట్టాడు. దీంతో ఇండస్ట్రీ కూడా ఆశ్యర్యపోతుంది. భారీ సినిమాలు పోటీ ఉండగా ఇంతటి రేంజ్‌లో కలెక్షన్స్‌ రావడంతో ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషోలో కేవలం 24గంటల్లో 5లక్షలకు పైగా టికెట్లు కొనుగోలు చేశారు.ప్రీమియర్స్‌ పూర్తికాగానే చిత్ర యూనిట్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంది. చిరంజీవి, అనిల్‌ రావిపూడితో పాటు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆపై కేక్‌ కట్‌ చేసి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema)

OTT: Sobhita Dhulipala Starrer Cheekatilo Movie Trailer Released4
క్రైమ్‌ యాంకర్‌గా శోభిత.. చీకటిలో ట్రైలర్‌ చూశారా?

అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ చీకటిలో. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజవుతోంది. సోమవారం (జనవరి 12న) ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో శోభిత క్రైమ్‌ యాంకర్‌ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్‌గా పనిచేసినా.. తర్వాత జాబ్‌ నచ్చలేదని మానేసి పాడ్‌కాస్ట్‌ ప్రారంభించింది. ఆ పాడ్‌కాస్ట్‌కు చీకటిలో అన్న టైటిల్‌ ఖరారు చేసింది.క్రైమ్‌ యాంకర్‌గా శోభితసమాజంలో జరుగుతున్న నేరాల గురించి అందులో మాట్లాడింది. ఎంత పెద్ద క్రిమినల్‌ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు అంటూ ఓ సీరియల్‌ కిల్లర్‌ గురించి ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టింది. దీంతో సదరు సీరియల్‌ కిల్లర్‌.. చిమ్మ చీకటిలో ఇంకో ప్రాణం గాల్లో కలిసిపోతుందని ముందుగానే వార్నింగ్‌ ఇస్తాడు. మరి అతడిని హీరోయిన్‌ పట్టుకుంటుందా? అదే సమయంలో అతడి బారి నుంచి తనను తాను రక్షించుకుంటుందా? అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!సినిమాచీకటిలో మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్‌ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానుంది. చదవండి: పీరియడ్స్‌.. నీళ్లలో తడిచా.. బట్టలు మార్చుకుంటానంటే..: హీరోయిన్‌

Parvathy Thiruvothu Says She Shoot Romantic Scene in Maryan During Periods5
పీరియడ్స్‌.. ఒక్కరూ నా బాధ అర్థం చేసుకోలే: హీరోయిన్‌

ఒక్కసారి డేట్స్‌ ఇచ్చాక చెప్పిన సమయానికి సెట్‌లో ఉండాల్సిందే! అది హీరోలైనా, హీరోయిన్లయినా! అయితే కొన్నిసార్లు పీరియడ్స్‌ వల్ల నటీమణులు ఇబ్బందిపడుతుంటారు. దాన్ని బయటకు చెప్పుకోలేక, చెప్పినా అర్థం చేసుకోరేమోనన్న భయంతో లోలోపలే మథనపడుతుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది మలయాళ హీరోయిన్‌ పార్వతి తిరువోతు. ధనుష్‌ హీరోగా నటించిన 'మార్యన్‌' అనే తమిళ మూవీలో పార్వతి కథానాయికగా యాక్ట్‌ చేసింది. రొమాంటిక్‌ సీన్‌ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటనను పార్వతి తాజాగా గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. మార్యన్‌ సినిమాలో ఓ రొమాంటిక్‌ సన్నివేశాన్ని బీచ్‌లో షూట్‌ చేశారు. నన్ను పూర్తిగా నీళ్లలో ముంచి తడిపారు. నేను అదనపు డ్రెస్‌ తీసుకెళ్లలేదు. షూటింగ్‌ కొనసాగిస్తూనే ఉన్నారు. నాకేమో చాలా అసౌకర్యంగా ఉంది. అదెవరూ గమనించట్లేదు.ఒప్పుకోలేదుఓ పక్క పీరియడ్స్‌.. మరోపక్క నీళ్లలో తడవడంతో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. ఒకసారి హోటల్‌కు వెళ్లి బట్టలు మార్చుకుని వస్తానని చెప్పాను. వాళ్లు కుదరదన్నారు. అంతే, నా కోపం నషాళానికి అంటింది. నేను పీరియడ్స్‌లో ఉన్నాను.. కచ్చితంగా వెళ్లి తీరాలి అని గట్టిగా అరిచి చెప్పాను. వెంటనే సెట్‌లో ఉన్నవారంతా షాకై అలా చూస్తున్నారు. వాళ్లు ఎలా రియాక్ట్‌ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఆరోజు సెట్‌లో నాతో కలిపి ముగ్గురు ఆడవాళ్లే ఉన్నారు.ఒంటరిగా ఫీలయ్యాచాలాసేపటివరకు నా ఇబ్బందిని చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆ సమయంలో నేను ఒంటరిగా ఫీలయ్యాను. నాలో ఓపిక కూడా నశించింది అని చెప్పుకొచ్చింది. పార్వతి తిరువోతు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో రెండు మూవీస్‌లో యాక్ట్‌ చేస్తోంది.చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Upcoming OTT Movies Telugu January Second Week 20266
సంక్రాంతి స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 12 సినిమాలు

మరోవారం వచ్చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి హడావుడే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లు థియేటర్లలోకి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా వచ్చేసింది. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. వీటితో పాటు పలు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దండోరా, కాలంకావల్, గుర్రం పాపిరెడ్డి, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష‍్మి చిత్రాలు ఉ‍న్నంతలో ఆసక్తి రేపుతుండగా.. స్ట్రేంజర్ థింగ్స్ 5 మేకింగ్ వీడియో, తస్కరీ సిరీస్‌లు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ అందుబాటులోకి రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 12 నుంచి 18వ వరకు)అమెజాన్ ప్రైమ్బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష‍్మి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 12దండోరా (తెలుగు మూవీ) - జనవరి 14నెట్‌ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ 5 (మేకింగ్ వీడియో) - జనవరి 12తస్కరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 14సెవెన్ డయల్స్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 15ద రిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16హాట్‌స్టార్ఇండస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12డౌన్ టౌన్ అబ్బే: ద గ్రాండ్ ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12సోనీ లివ్కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16జీ5గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16ఆపిల్ టీవీ ప్లస్హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16

Mana Shankara Vara Prasad Garu Movie Success Celebrations7
బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌.. సంతోషంలో చిరంజీవి, అనిల్‌ రావిపూడి

సంక్రాంతి బరిలో మన శంకర వరప్రసాద్‌గారు దిగేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన మొదటి రోజే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ అందుకుంటోంది. ప్రీమియర్స్‌ నుంచే సినిమాకు హిట్‌ టాక్‌ మొదలైంది. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈ సంక్రాంతి బాస్‌దే..' అంటూ సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. సెలబ్రేషన్స్‌ఇది చూసిన చిత్రయూనిట్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకుంది. హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సినిమా విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.సంక్రాంతి హిట్‌ బొమ్మఅనిల్‌ రావిపూడి ముందుగా చెప్పినట్లుగానే సినిమాలో వింటేజ్‌ చిరును చూపించాడు. అద్భుతమైన యాక్టింగ్‌, గ్రేస్‌, డ్యాన్స్‌తో మెగాస్టార్‌ అభిమానులను ఎంతగానో అలరించాడు. మొత్తానికి ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు అసలైన పండగను తీసుకొచ్చింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! A beautiful moment celebrating a MEGA BLOCKBUSTER RESPONSE 😀❤️‍🔥Hit Machine, director @AnilRavipudi, producers @sahugarapati7 & @sushkonidela met Megastar @KChiruTweets to share the happiness after the blockbuster response from the premieres of #ManaShankaraVaraPrasadGaru 🔥… pic.twitter.com/ZL8Tsch547— Gold Box Entertainments (@GoldBoxEnt) January 11, 2026 (మన శంకర వరప్రసాద్‌గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Pawan Kalyan Receives Tiger Of Martial Arts Honour Behind Story8
తిరుమల మెట్లు ఎక్కలేని పవన్‌కు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'.. అసలు కథ ఇదే

ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీని గురించి పూర్తిగా వివరాలు తెలియకపోవడంతో చివరకు పవన్‌ ఫ్యాన్స్‌ కూడా ఓవర్‌ థింకింగ్‌ చేస్తున్నారు. వాళ్లకు విషయం తెలియకపోవడంతో 'పవన్‌ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్' అంటూ పుష్ప డైలాగ్స్‌ కొడుతున్నారు. కొందరైతే ఇదీ అరుదైన ఘనత.. అంతర్జాతీయ గౌరవం అంటూ పవన్‌ ఫొటోలతో షేర్‌ చేస్తున్నారు. వాస్తవం తెలిసిన వారు మాత్రం నోరెళ్లబెడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఆగాపురాలో ఉండే 'గోల్డెన్ డ్రాగన్స్' కరాటే ట్రైనింగ్ సంస్థ నుంచి పవన్ కల్యాణ్‌కు "టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే బిరుదును ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో సుమారు నలభై ఏళ్లకు పైగా డాక్టర్ సయ్యద్ మహమ్మద్ సిద్దిఖ్ మొహమూదీ వేల మందికి కరాటేలో కోచింగ్ ఇచ్చారు. ఆయన చేతుల మీదుగానే పవన్‌కు ఈ గౌరవం దక్కింది. అందరూ అనుకున్నట్లు జపాన్‌లోని ఏ మార్షల్‌ ఆర్ట్స్‌ సంస్థ పవన్‌కు ఈ బిరుదు ఇవ్వలేదు.పవన్‌కు 'ఫిఫ్త్‌ డాన్‌' పురస్కారం కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్ మొహమూదీనే ఇచ్చారు. జపాన్‌లో సంప్రదాయ యుద్ధకళలకు శిక్షణ ఇచ్చే సంస్థల్లో ఒకటైన ‘సాగో బుడో కన్‌’ నుంచి బ్లాక్‌బెల్ట్‌లో ఫిఫ్త్‌ డాన్‌ పురస్కారం ఇస్తున్నట్లు ఒక పత్రాన్ని పవన్‌ చేతికి ఇచ్చాడు. అయితే, ఇక్కడ ఫైనల్‌గా ఇంకో విషయం ఉంది. ప్రాచీన జపనీస్‌ కత్తిసాము కళ (కెంజుట్సు)లో పవన్‌కు ఎంట్రీ దొరికింది అని చెప్పారు. బహుషా కత్తిసాము నేర్చుకునేందుకు ఆయన జపాన్‌ వెళ్తారేమో చూడాల్సి ఉంది.మార్షల్ ఆర్ట్స్‌తో పాటు 'చేతబడి' కూడా..పవన్‌ కల్యాణ్‌కు అవార్డ్‌ ప్రదానం చేసిన డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో మంచి నైపుణ్యం ఉంది. నాలుగు దశబ్దాలుగా ఆయన చాలామందికి శిక్షణ ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్‌, ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, చిరోప్రాక్టర్, మాగ్నెటో థెరపీ, అరోమా థెరపీలలో నైపుణ్యంతో పాటుగా 'చేతబడి, మంత్రాలకు విరుగుడు' చేయడంలో కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్ ఎంతో సిద్ధహస్తుడని ఆయన ప్రొఫైల్‌లో పేర్కొనడం విశేషం. ఆయన చేతుల మీదుగా పవన్ కల్యాణ్‌కు ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్‌ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.కెంజుట్సు అంటే ఏమిటి? పవన్‌కు సాధ్యమేనా?ఇది జపాన్‌లోని సమురాయ్ యోధులు యుద్ధంలో ఉపయోగించే ఖడ్గ యుద్ధకళ. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలో ఇందులో నేర్పిస్తారు. కత్తితో ప్రత్యక్ష యుద్ధరంగంలోకి దిగితే ఎలాంటి కదలికలు ఉండాలో చూపుతారు. గురువు పర్యవేక్షణలో మాత్రమే సాధ్యమయ్యే అత్యంత కఠిణమైన శిక్షణగా జపాన్‌ యోధులు తెలుపుతారు. ఇందులో రాణించాలంటే శరీర శక్తి మాత్రమే కాకుండా మనసు స్థిరత్వం, క్రమశిక్షణ అతి ముఖ్యమైనవి. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ ఉన్న పరిస్థితిల్లో జపాన్‌ వెళ్లి కెంజుట్సు నేర్చుకునేందుకు సాధ్యమయ్యే పనేనా అని సందేహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.తిరుమల మెట్లు ఎక్కలేని పవన్‌కు సాధ్యమయ్యేనా..?సుమారు ఏడాది క్రితం ప్రాయశ్చిత దీక్ష పేరుతో పవన్ కల్యాణ్ తిరుమల బయలుదేరారు. ఆ సమయంలో అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. అయితే, ఆ మెట్లు ఎక్కేందుకు పవన్‌ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో పలుమార్లు ఆగుతూ.. ఆపసోపాలు పడుతూ మెట్లు ఎక్కారు. ఈ క్రమంలో మోకాళ్ల నొప్పి రావడంతో స్విమ్స్‌కు చెందిన ఫిజియోథెరఫిస్ట్ రావాల్సి వచ్చింది. ఆపై హరిహర వీరమల్లు సినిమాలో​ పవన్‌ కంటే డూప్‌ ఎక్కువ భాగం కనిపించారు. గ్రాఫిక్స్‌తోనే పని పూర్తిచేశారు. ఇంత హిస్టరీ ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు కెంజుట్సు(ఖడ్గ యుద్ధకళ) నేర్చుకునే చాన్స్‌ ఉందా..? అంటే సందేహమే..!పవన్‌ కల్యాణ్‌ సినీ రంగంలోకి రాకముందు చెన్నైలో కరాటేలో శిక్షణ పొందారు. ఆయన గురువు 'షిహాన్ హుస్సేని' చివరి రోజుల్లో బ్లడ్‌ క్యాన్సర్‌తో.. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని మరణించారు. సాయం చేయాలని బహిరంగంగానే పవన్‌ను కోరారు. కానీ, ఆయన కష్టాల కేకలు పవన్‌ వరకు వినిపించలేదేమో.. చివరకు అనారోగ్యంతో ఆయన గత ఏడాది మరణించారు. కరాటే అంటే ఆయనకు చాలా ఇష్టం కావడంతో జానీ, తమ్ముడు, ఖుషి, ఓజీ వంటి సినిమాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత చూపించారు. View this post on Instagram A post shared by DrSiddiq Mahmoodi (@drsiddiq) View this post on Instagram A post shared by GOLDEN DRAGONS (@goldendragonsindia)

Golden Globes 2026 Winners Details9
గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్‌'.. విన్నర్స్‌ ప్రకటన

ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుక ‘గోల్డెన్‌ గ్లోబ్స్‌ 2026’ ఘనంగా జరిగింది. 83వ గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్‌' సిరీస్‌ సత్తా చాటింది. ప్రస్థుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ఈ సిరీస్‌కు రెండు అవార్డ్స్‌ దక్కడం విశేషం. ఉత్తమ నటుడు, సహాయనటుడి విభాగాల్లో అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది.'అడాల్‌సెన్స్‌' చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్‌ అందుకుని ఆదరణ పొందింది. అయితే, ఈ మూవీలో నటించిన స్టీఫెన్‌ గ్రాహం ఉత్తమ నటుడిగా తొలిసారి గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆపై సిరీస్‌లో తన నటనతో మెప్పించిన 13 ఏళ్ల ఓవెన్‌ కూపర్‌ ఉత్తమ సహాయనటుడిగా అతి చిన్న వయసులోనే అవార్డ్‌ అందుకున్నాడు. ఈ అవార్డ్‌ కార్యక్రమంలో భారత్‌ నుంచి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు.సినిమా రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో హాలీవుడ్‌ ఫారిన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ (హెచ్‌. ఎఫ్‌. పి. ఎ) వారు ఈ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నాంది పలికారు. 1944 నుంచి ఈ అవార్డు కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ప్రారంభంలో వారు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్‌ సినిమాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను కూడా గుర్తించి వాటికి పురస్కారాలు ఇస్తుంటారు. ప్రస్తుతం హెచ్‌. ఎఫ్‌. పి. ఎ టీమ్‌లో సుమారు 60 దేశాలకు చెందిన 105 మంది సభ్యులున్నారు. వారందరూ ఓకే అనుకున్న తర్వాతే గోల్డెన్‌ గ్లోబ్స్‌ ఖరారు చేస్తారు. సినిమా రంగంతో పాటు టెలివిజన్‌ రంగంలో ప్రతిభ చూపిన వారికీ అవార్డులు ఇస్తుండటం విశేషం. గోల్డెన్‌ గ్లోబ్స్‌- 2026అవార్డ​్‌ విజేతలు (సినిమా) -ఉత్తమ నటుడు : తిమోతీ చలమెట్ (మార్టీ సుప్రీం) - ఉత్తమ నటి : రోజీ బేర్నీ (ఇఫ్‌ ఐ హేడ్‌ లెగ్స్‌ ఐడిడ్‌ కిక్‌ యూ)- ఉత్తమ సహాయ నటుడు: స్టెల్లన్ స్కార్స్‌గార్డ్ (సిన్నర్స్)- ఉత్తమ సహాయ నటి: టెయానా టేలర్ (ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్)గోల్డెన్‌ గ్లోబ్స్‌- 2026అవార్డ్‌ విన్నర్స్‌ ( టెలివిజన్ సిరీస్)- ఉత్తమ టెలివిజన్ సిరీస్ (డ్రామా): ది వైట్ లోటస్- ఉత్తమ నటుడు : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)- ఉత్తమ సహాయ నటి : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)- ఉత్తమ సహాయ నటుడు : స్టీఫెన్‌ గ్రాహం (అడోలెసెన్స్)

Mana Shankara Vara Prasad Garu Movie Fans This One Aspect Is Worrying10
'మన శంకర వర ప్రసాద్ గారు'.. మూవీలో ఇదొక్కటే మైనస్‌

సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' వచ్చేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి పండుగ పరీక్షలో డిస్టింక్షన్ కొట్టేశారు. కామెడీతో పాటు భారీ యాక్షన్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. నిర్మాతలను కమర్షియల్‌గా కూడా గట్టెక్కించే సినిమా అని చెప్పాలి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రీమియర్స్‌లో దుమ్మురేపింది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు. అయితే, ఒక విషయంలో మాత్రం చిరంజీవి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.'మన శంకర వర ప్రసాద్ గారి' గురించి ఎక్కడ చూసిన సానుకూల స్పందన కనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించినప్పటికీ, సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. ఇప్పుడు ఇదే అంశం గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మూవీలో ఈ పాటను చాలాసార్లు ఉపయోగించారు. ప్రధానంగా చిరంజీవి, నయనతార కనిపించిన ప్రధాన సీన్స్‌లలో ఈ సాంగ్‌ ఉంటుంది. ఇళయరాజా అనుమతితోనే ఈ పాటను సినిమాలో చేర్చారా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన రాయల్టీ బాధ్యతలను క్లియర్ చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపీరైట్ విషయాలపై ఇళయరాజా దృఢమైన వైఖరిని తీసుకుంటారని తెలిసిందే. ఇప్పటికే తమిళ హీరోల సినిమాలపై కూడా ఆయన కేసులు వేశారు. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ వియషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. సినిమాకు మంచి టాక్‌ రావడంతో ఈ పాట కారణం వల్ల థియేటర్ల ప్రదర్శనకు అంతరాయం కలిగించడానికి చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో చిరు అభిమానులు స్పష్టతను కోరుకుంటున్నారు. నిర్మాతల నుండి ఏదైనా ఒక ప్రకటన వస్తే ఈ ఊహాగానాలకు చెక్‌ పడుతుంది.

Advertisement
Advertisement