Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood Actresses Social Media Updates in instagram goes viral1
పచ్చని పొలాల్లో బిగ్‌బాస్ దివి.. శారీలో ఫుల్‌ గ్లామరస్‌గా నివేదా..!

సంక్రాంతి సినిమా పోజుల్లో ఆషిక రంగనాథ్..వైట్ శారీలో మరింత అందంగా నివేదా థామస్..హల్దీ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ భామ నుపుర్ సనన్..పచ్చని పొలాల్లో బిగ్‌బాస్ దివి హోయలు..వైట్ డ్రెస్‌లో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)

Mrunal Thakur cryptic post amid wedding rumours with Dhanush2
ధనుశ్‌తో పెళ్లి రూమర్స్.. మృణాల్ ఠాకూర్ పోస్ట్ వైరల్..!

ఇటీవల కొద్దికాలంగా మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్ తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలా సార్లు వీరిద్దరు ఈవెంట్స్‌లో కనిపించడంతో త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వార్తలొచ్చాయి. వచ్చేనెల ఫిబ్రవరిలోనే వీరి పెళ్లి అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటిపై ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.అయితే తనపై పెళ్లి రూమర్స్ వస్తున్న వేళ సీతారామం బ్యూటీ ఫుల్‌గా చిల్ అవుతోంది. వీటిని అస్సలు పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె సన్నిహితుల్లో ప్రస్తుతం ఆమైపై వస్తున్న పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇలాంటి సమయంలో ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మృణాల్‌ సముద్రంలో విహరిస్తూ చిల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. గతేడాది మృణాల్, ధనుశ్‌లపై ఆగస్టు 2025లో మొదటిసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ సమయంలో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో వారిద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడం.. అంతకు ముందు, మృణాల్ ధనుశ్ ప్రాజెక్ట్ 'తేరే ఇష్క్ మే' ముగింపు పార్టీలో కనిపించడంతో వీరిద్దరి రిలేషన్‌పై ఊహగానాలు మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur)

Guess the Actress: Bigg Boss Beauty Shares 2016 Photos3
అటు మోడ్రన్‌గా.. ఇటు అమ్మవారి వేషంలో..

గడిచిన కాలం మళ్లీ రాదంటారు. కుదిరితే గడిచిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకుని ఏదో కాస్త సంతోషపడటమే! అందుకు 2016 ట్రెండ్‌ బాగా ఉపయోగపడుతోంది. సడన్‌గా అందరూ పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016లో జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ అప్పటి వేడుకలను, జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్‌ చేస్తున్నారు. అలా బిగ్‌బాస్‌ బ్యూటీ పై ఫోటో షేర్‌ చేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?2016 నాటి మెమొరీస్‌బుల్లితెర నటి ప్రియాంక జైన్‌.. ఓవైపు మోడ్రన్‌ డ్రెస్‌లో సెల్ఫీలు, మరోవైపు అమ్మవారి వేషధారణ. ఇంకో ఫోటోలో అయితే రెండు జడలు వేసుకుని పిండి రుబ్బుతోంది. ఈ ఫోటోల్లో ప్రియాంక మరీ చిన్నపిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే.. మౌనరాగం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది ప్రియాంక జైన్‌. జానకి కలగనలేదు సీరియల్‌తో మరింత పాపులరైంది.ప్రియుడితో..తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొనగా టాప్‌ 5గా నిలిచింది. మౌనరాగం సీరియల్‌ సహనటుడు శివకుమార్‌తో ప్రేమలో పడగా.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. 2024 ఏప్రిల్‌లో వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ చోట భూమి కొన్నారు. గతేడాది మంచి ముహూర్తం చేసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఈ లెక్కన ఈ ఏడాది కొత్తింట్లోకి వీరు జంటగా గృహప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)

tollywood actress tamanna shares Bahubali 2 day memories4
హార్స్ రైడింగ్‌.. బాహుబలి-2 జ్ఞాపకాల్లో మిల్కీ బ్యూటీ.. .!

టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్‌తోనూ అభిమానులను అలరిస్తోంది. తెలుగులో పలు బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా బాహుబలి-2 మూవీ రోజులను గుర్తు చేసుకుంది.బాహుబలి-2 కోసం గుర్రపు స్వారీ తరగతులను మరోసారి గుర్తు చేసుకుంది. ఈ మూవీ కోసం తాను చేసిన సాధనతో పాటు తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తన హెయిర్ కట్ ఆ రోజుల్లో చాలా బాగుండేదని తెలిపింది. అంతేకాకుండా చివర్లో బాహుబలి ప్రమోషన్ల సమయంలో దిగిన ఫోటోషూట్ అంటూ బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించింది.కాగా.. గతేడాది ఓదెల -2తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తమన్నా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. హిందీలో రోమియో, రేంజర్‌ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Karthika Deepam Remix Song Released from Bhartha Mahasayulaku Wignyapthi Movie5
'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్‌.. రవితేజ మాస్‌ డ్యాన్స్‌

ఈ సంక్రాంతి థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు.. కామెడీ నుంచి హారర్‌ వరకు ఇలా అన్నీ కలగలిపిన సినిమాలు రావడంతో ప్రేక్షకులు పోలోమని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు దాదాపు హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఉంది. ఆరనీకుమా ఈ దీపం సాంగ్‌ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్‌ను వాడేశారు. కానీ సినిమా రిలీజయ్యేవరకు కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. తీరా థియేటర్లలో ఈ పాట రాగానే జనాలు సర్‌ప్రైజ్‌ అయ్యారు. స్క్రీన్‌పై రవితేజ మాస్‌ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అలా సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్‌ సాంగ్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. పబ్‌లో హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌తో మాస్‌ మహారాజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి..సినిమాసినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా నటించగా ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్‌వీఎల్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. చదవండి: అప్పుడు దేవుడిపైనే నమ్మకం పోయింది.. అరుణాచలం వెళ్లాక: రీతూ

MSVP To BMW, Sankranthi Movies Big Lesson To Tollywood6
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?

‘సినీ ప్రేక్షకులు మారిపోయారు. కేజీయఫ్‌, బాహుబలి, పుష్ప లాంటి భారీ యాక్షన్‌, ఎలివేషన్‌ ఉన్న సినిమాలకు తప్ప.. మిగతావాటిని చూసేందుకు థియేటర్స్‌కు రావడం లేదు’ అని మొన్నటిదాకా మన దర్శకనిర్మాతలు చెప్పిన మాటలివి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఈ సంకాంత్రికి తెలుగు ఆడియన్స్‌ తేల్చేశారు.కొట్టడాలు.. నరకడాలు లేకున్నా.. స్వచ్ఛమైన వినోదాన్ని అందించేలా సినిమా తీస్తే.. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వస్తామని మరోసారి నిరూపించారు. ఈ సంక్రాంతికి తెలుగులో వరుసగా ఐదు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో మూడు సినిమాలకు హిట్‌ టాక్‌ వచ్చింది. మిగతా రెండు సినిమాలకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా .. మంచి వసూళ్లను రాబడుతున్నాయి.ముందుగా హిట్‌ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ప్రీమియర్‌ షోతోనే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న చిత్రం ‘మనశంకర వరప్రసాద్‌’. ఈ నెల 12న విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన అనగనగ ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా విజయాల బాట పడ్డాయి.ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే..ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పుకోవడానికి ఈ మూడింట్లోనూ గొప్ప కథేలేం లేవు. నిజం చెప్పాలంటే.. అసలు కథే లేదు. అయినా కూడా ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. కారణం ఏంటంటే.. ఈ సినిమాల్లో కథ లేకున్నా..రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చునేలా చేసే స్వచ్ఛమైన వినోదం ఉంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్స్‌కి తరలి వెళ్తున్నారు.చిరంజీవి కాబట్టి మన శంకరవరప్రసాద్‌ హిట్‌ అయిందని అనుకుంటే.. మిగతా రెండు సినిమాల్లోని హీరోలకు అంతపెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగే లేదు. సినిమాలోని వినోదమే వారిని కాపాడింది. ఇక స్టార్‌ హీరో ఉంటేనే థియేటర్స్‌కి జనాలు వస్తారు అనుకుంటే ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్‌’ అతిపెద్ద విజయం సాధించాలి. కానీ అది జరగలేదు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో వినోదం ఉన్నా..ప్రేక్షకులను ఆ డోస్‌ సరిపోలేదు. అందుకే బాక్సాఫీస్‌ రేసులో కాస్త వెనకబడింది. సంక్రాంతి కాబట్టే ఈ సినిమాలు ఆడుతున్నాయని చెప్పడం కూడా కరెక్ట్‌ కాదు. కామెడీ చిత్రాలు ఏ సీజన్‌లో వచ్చినా చూస్తారు. పండగక్కి వస్తే.. ఇంకాస్త ఎక్కువ మంది చూస్తారు. అయితే ప్రతిసారి యాక్షన్‌ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఫ్యామిలీ డ్రామాలు కూడా వస్తే.. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సంక్రాంతి సినిమాలతో అర్థమైంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించే దమ్ము ఫ్యామిలీ డ్రామాల్లోనే ఉంది. అందుకే ఇక నుంచి మనవాళ్లు యాక్షన్‌తో పాటు వినోదాత్మక కథలపై కూడా దృష్టిపెడితే మంచిది.

Bigg Boss Rithu Chowdary About Life After Arunachalam Visit7
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!

బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టింది. రీతూ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా చాలా జరిగాయి. అటు హౌస్‌లో ఫైర్‌ స్ట్రామ్స్‌ (వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లు) వచ్చి రీతూ బ్యాడ్‌ అనేవారు. పవన్‌ను వాడుకుంటోంది అన్నట్లుగా కామెంట్స్‌ చేశారు. ఎందుకిలా అంటున్నారని నాకు చాలా బాధసింది. మరోపక్క బయట (హీరో ధర్మ మహేశ్‌తో సంబంధం అంటగడుతూ) నన్ను మరింత దారుణంగా చిత్రీకరించారు. అదొక్కటే సంతృప్తిఇవన్నీ చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఎలిమినేట్‌ అయి నేను బయటకు వచ్చేస్తే బాగుండనుకుంది. నేను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా తోటి ఆర్టిస్టులెవరూ నాకు సపోర్ట్‌ చేయలేదు. నాకు ఓటు వేయమని అమ్మ ఫోన్‌ చేసి అడిగితే కూడా మీడియాలో రీతూ క్యారెక్టర్‌ బ్యాడ్‌ అని వస్తోందని కామెంట్‌ చేశారంట. నన్ను ఇంత చెడ్డదానిలా చిత్రీకరించినా, నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేసినా ప్రేక్షకులు నన్ను నమ్మి ఓట్లేశారు. నన్ను నన్నుగా ప్రేమించారు. ఆ విషయంలో సంతోషంగా అనిపించింది.డబ్బు లేకపోయినా పర్లేదునాకు కాబోయేవాడి విషయానికి వస్తే.. అందం గురించి పట్టించుకోను. అర్థం చేసుకుంటే చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు కానీ ఉన్నదాంట్లో మంచిగా చూసుకోవాలి. నేను హైపర్‌ యాక్టివ్‌ కాబట్టి తనకు ఓపిక, సహనం ఎక్కువుండాలి. ప్రతి అమ్మాయిని గౌరవించాలి. పెళ్లయ్యాక ఎవరూ పని మానేయకూడదు. ఇద్దరం కలిసి పని చేసుకోవాలి. అలాగే మా అమ్మ, అన్నను బాగా చూసుకోవాలి అని చెప్పింది.దేవుడిపై నమ్మకంచిన్నప్పుడు నేను సాయిబాబాను ఎక్కువ నమ్మేదాన్ని. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఒక బిజినెస్‌ కోసం నాన్న ఉన్న డబ్బంతా ఒకతడి చేతిలో పెట్టాడు. అంతా సవ్యంగా జరిగేలా చూడమని బాబాకు మొక్కాను. ఉపవాసాలున్నాను. అయినా ఆ డబ్బు తిరిగి రాలేదు. నాన్న ఏం చేసుకుంటాడో అని భయమేసింది. బాబాకు మొక్కినా ఫలితం లేకపోయేసరికి ఆయనపై నమ్మకం పోయింది. నాన్న చనిపోయాక అసలు భగవంతుడిని నమ్మడమే మానేశాను. అదేంటో కానీ కొంతకాలం క్రితం సడన్‌గా నా నోటి నుంచి ఓం నమఃశివాయ అనే మంత్రాలు వచ్చేవి. దాంతో జీవితంలో మొదటిసారి అరుణాచలం వెళ్లాను. నావల్ల కాదుఅక్కడి వెళ్లాక నా ఆలోచన విధానమే మారిపోయింది. జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. నేను, మా అమ్మ, అన్న ఎప్పుడూ కలిసే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఏదైనా చెడు జరిగితే నాకే జరగాలి కానీ, వాళ్లకేదీ జరగకూడదు. ఎందుకంటే నాన్నను కోల్పోవడమే నాకు తీరని లోటు.. మళ్లీ ఉన్నవాళ్లను దూరం చేసుకుని ఒక్కదాన్ని బతకడం నా వల్ల కాదు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం, ఇల్లు కొనడం, సక్సెస్‌ అవడం, కారులో తిరగడం.. ఇవన్నీ నాన్న కోరికలు. అవన్నీ నెరవేరే సమయంలో నాన్న లేడన్న బాధ ఉంది అని చెప్పుకొచ్చింది.

Bollywood Actress Sara Arjun Reveals her Favourite Hero In Tollywood8
నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ: యంగ్ హీరోయిన్

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అర్జున్‌ ఇటీవలే దురంధర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన యుఫోరియా మూవీతో అలరించేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్‌ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. టాలీవుడ్‌ మీ ఫేవరేట్ హీరో అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్‌ ఆసక్తికరమైన పేరు చెప్పింది. తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.కాగా.. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా చిత్రంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్‌ ప్రధాన పాత్రల్లో నటింటారు. ఈ సినిమాకు నీలిమా గుణశేఖర్‌ నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్‌ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.

Allu Arjun Family Visits Sensoji Temple In Japan's Tokyo9
ప్రముఖ ఆలయంలో బన్నీ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం జపాన్‌ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవల పుష్ప-2 మూవీని జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. అంతకుముందు మూవీ ప్రమోషన్స్‌తో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు కుటుంబంతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా టోక్యోలోని ప్రముఖ సెన్‌సోజి ఆలయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్‌ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి తొలిసారి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీ ఇటీవలే ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇటీవలే బన్నీకి సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్‌ వచ్చేసింది. అల్లు అర్జున్‌ తన నెక్స్ట్‌ మూవీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌తో చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)

Malayalam Actress Ranjini Menon About Her Brain Stroke10
బ్రెయిన్‌ స్ట్రోక్‌.. మూతి వంకర.. అవే చివరి క్షణాలనుకున్నా!

రెండేళ్ల క్రితం చావును దగ్గరి నుంచి చూశానంటోంది మలయాళ నటి, దర్శకురాలు, యాంకర్‌ రంజిని మీనన్‌. లైఫ్‌ సజావుగా సాగుతున్న సమయంలో స్ట్రోక్‌ వచ్చిందంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. 2024 నవంబర్‌ 18.. ఎర్నాకుళంలోని టీడీఎమ్‌ హాల్‌లో నేను మాట్లాడాల్సి ఉంది. అయితే స్పీచ్‌ ఇవ్వడానికి వెళ్లేముందు నా భర్త రాజగోపాల్‌తో కలిసి కాఫీ తాగాలనుకున్నాను. మూతి వంకరకానీ కాఫీ తాగుతుంటే కిందపడుతోంది. నా మాటలు కూడా వంకరపోతున్నాయి. అది చూసి నా కొడుకు ఆటపట్టిస్తుంటే లైట్‌ తీసుకున్నాను. నా భర్త నన్ను గమనించి హాస్పిటల్‌కు వెళ్దామన్నాడు. లేదు, ఈవెంట్‌కు అర్జంట్‌గా వెళ్లాలని చెప్పాను. ఫోన్‌లో టైప్‌ చేయడానికి కూడా నా శరీరం సహకరించలేదు. తీరా హాల్‌కు వెళ్లేసరికి నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు గుండెపోటునా మాట పూర్తిగా మారిపోయింది. అది గమనించి చక్కెర కలిపిన నీళ్లు ఇచ్చారు. అది తాగగానే హఠాత్తుగా కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లగా నాకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు గుండెపోటు వచ్చిందన్నారు. నా మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టింది. దానివల్ల కుడివైపు శరీరం బలహీనంగా మారిపోయింది. కొన్ని జ్ఞాపకాలు చెదిరిపోయాయి. ఇక అవే నా చివరి క్షణాలనుకున్నాను. ఐసీయూలో కొన్నిరోజులపాటు ఉంచారు. ఐసీయూలో ఒక్కరోజు ఉన్నా సరే అది మనకు జీవితమంటే ఏంటో నేర్పిస్తుంది.మళ్లీ నడక నేర్చుకున్నా..నాకు జ్ఞాపకశక్తి ఉందా? కోల్పోయానా? అని తెలుసుకునేందుకు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివేవాన్ని. నాలుగురోజులకు నన్ను డిశ్చార్జ్‌ చేశారు. ఐదో రోజు వీల్‌చైర్‌లోనే టీడీఎమ్‌ హాల్‌కు వెళ్లాను. తర్వాత ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. అక్కడే మళ్లీ నడక నేర్చుకున్నాను. మామూలు మనిషినయ్యాను. మన గురించి మనం పట్టించుకోకుండా పరుగులు పెట్టడం ఎంత తప్పో అప్పుడు నాకర్థమైంది అని రంజిని చెప్పుకొచ్చింది.చదవండి: నన్ను తిడుతూ సినిమా మధ్యలో వెళ్లిపోతారు: గుణశేఖర్‌

Advertisement
Advertisement