ప్రధాన వార్తలు
సీరియల్ బ్యూటీ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. టీజర్ రిలీజ్
స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన జ్యోతిరాయ్.. 'గుప్పెడంత మనసు' సీరియల్లో జగతి మేడమ్గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల క్రితం ఉన్నట్లుండి పూర్తిగా సీరియల్స్ చేయడం తగ్గించేసిన ఈమె, సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 'కిల్లర్' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్)సీరియల్లో పద్ధతి అయిన పాత్రల్లో కనిపించిన జ్యోతిరాయ్.. ఈ సినిమాలో సూపర్ ఉమన్ తరహా పాత్ర చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. టెరర్రిస్ట్(ఉగ్రవాది), వ్యాంపైర్(రక్త పిశాచి), స్పై(గూఢచారి) అనే కన్ఫ్యూజన్.. జ్యోతి పోషించిన పాత్రలో చూపించారు. ఓవైపు ఫుల్ రొమాన్స్ చూపిస్తూనే మరోవైపు ఈమె పాత్రతో యాక్షన్ కూడా చేయించారు. ఈమె భర్త పూర్వజ్.. ఇదే మూవీలో పోలీస్గా నటించాడు. టీజర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)
రుక్మిణి వసంత్ స్టైల్.. కాజల్ అగర్వాల్ అదే గ్లామర్
ముద్దుగా మెరిసిపోతున్న రుక్మిణి వసంత్వయసు పెరుగుతున్నా అదే గ్లామర్తో కాజల్పార్టీలో చిల్ అయిపోతున్న 'ధురంధర్' ఆయేషాచీరలో అందంగా మాయ చేస్తున్న శ్రీలీలజపాన్ ట్రిప్ వేసిన హీరోయిన్ నివేదా పేతురాజ్అల్లు వారి పార్టీలో మిహీక-శ్రీలీల చిల్ మోడ్ View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier)
'ది కేరళ స్టోరీ-2' డబ్బు కోసం చిచ్చు పెడుతున్నారు: ప్రముఖ దర్శకుడు
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ది కేరళ స్టోరీ-2 చిత్రంపై మండిపడ్డారు. రెండేళ్ల క్రితం విడుదలైన ది కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ను నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ వివాదస్పదంగా మారింది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై దర్వకుడు అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అయ్యారు.ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో కనిపించిన అనురాగ్ కశ్యప్ను కేరళ స్టోరీ-2పై మాట్లాడమని మీడియా ప్రతినిధులు కోరడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ మూవీ కేవలం డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని శక్తులు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా కల్పితంగా తెరకెక్కించి కొందరు లాభపడాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్పారు. అందులో చూపినట్లు ఎవరైనా బీఫ్ తినిపిస్తారా.. కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు కదా అంటూ భగ్గున్నారు. ఈ సినిమా మేకర్స్ అత్యాశపరులుగా కనిపిస్తున్నారు. వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలాంటి కథలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్లర్స్ ఉంటాయిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్ స్టోరీలతో తీసిన మూవీస్ కూడా వస్తుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్లోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్స్పాట్ 2 మచ్'. 2024లో వచ్చిన తొలి పార్ట్ అందరికీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్ కూడా అదే రేంజులో ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కార్తిక్ దర్శకుడు కాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. లెస్బియన్ పాత్ర చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ సినిమా.. 'చథా పచ్చ' తెలుగు రివ్యూ)కథేంటి?తొలి భాగంలో ఓ నిర్మాతకు స్టోరీ చెప్పడానికి వచ్చిన మహమ్మద్ షరీఫ్(విఘ్నేశ్ రాజా).. స్టోరీలన్నీ చెప్పి చివరకు నిర్మాత కుమార్తెనే(బ్రిగిడ సాగా) పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ కోసం వస్తుంది. ఓ మూడు కథలు చెబుతుంది. వీటిలో ఒకటి హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప, ఈ నిర్మాతకే స్టోరీ చెప్పడం వెనక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ అదేంటి? శిల్ప ఎవరు? షరీఫ్తో ఈమెకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇలానే తీయాలి అని కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే 'హాట్స్పాట్'. 2024లో వచ్చిన ఈ సినిమాలో చిత్రవిచిత్రమైన అంశాల్ని చూపించగా.. ఈసారి సీక్వెల్లో మాత్రం సమాజంలోని హాట్ టాపిక్ లాంటి మూడు అంశాలని తీసుకుని వాటిని కన్విన్సింగ్గా చెప్పగలిగాడు. మెప్పించాడు కూడా.తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని అభిమానించడం అనేది చాలా సాధారణమైన విషయం. అలా విపరీతమైన ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడు అనేది తొలి స్టోరీగా చూపించారు. ఇందులో చెప్పిన పాయింట్స్ గానీ, చూపించిన అంశాలు గానీ పచ్చి నిజాలే. యువత తమ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా హీరోలకు ఎలా బానిసత్వం చేస్తున్నారు? వాళ్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలా కొట్టుకుచస్తున్నారనేది చూపించారు. చివరలో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆలోచన రేకెత్తించడంతో పాటు ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించేలా చేస్తుంది.రీసెంట్ టైంలో డ్రస్సింగ్ సెన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం నటుడు శివాజీ.. స్టేజీపై హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో చాలామంది శివాజీని తప్పుపట్టారు. మరికొందరు ఇతడిని సమర్థించారు. అసలు డ్రస్సింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు కూడా పొట్టిబట్టలేసుకుని కౌంటర్స్ వేసే ఓ కూతురికి.. వయసైన తండ్రి లాగిపెట్టి కొట్టేలా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది పాయింట్ స్ట్రెయిట్గా చెప్పారు. ఇది చూస్తే కచ్చితంగా చాలామంది అమ్మాయిల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంటుంది.ఇక మూడోది టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ. 2026లోనూ స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకునే ఓ కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఓ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. రోజూ ఫోన్లో మాట్లాడుతూ తెలియకుండానే ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఇతడికి ఓ షాకింగ్ కనెక్షన్ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్టుకి తొలుత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చి స్టోరీని సుఖాంతం చేశారు. ఏదేమైనా ఈ మూడు స్టోరీలు ప్రస్తుతం సమాజంలో చాలామంది చూస్తున్న చేదు నిజాలే. కానీ కామెడీగా బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పడం బాగుంది.పైన చెప్పిన మూడు కథలతో పాటు ప్రియా భవానీ శంకర్ చేసిన శిల్ప పాత్రకు ఓ స్టోరీ ఉంటుంది. అదేంటనేది ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. త్వరలో వచ్చే మూడో భాగంలో పూర్తిస్థాయిలో చూపిస్తారేమో?నటీనటుల విషయానికొస్తే.. ప్రియాభవానీ శంకర్, భవానీ శ్రీ, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, బ్రిగిడ సాగా.. ఇలా ఎవరికి వాళ్లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్గానూ బాగుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే బోల్డ్ సినిమా గానీ అసభ్యకర సన్నివేశాల్లాంటివి లేవు. వీలైతే ఒంటరిగానే చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్)
బిగ్బాస్
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
A to Z
లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
హీరోయిన్ రష్మిక.. రాబోయే ఓ కొత్త సినిమాలో స్వలింగ ...
ఓటీటీ 'మహాశయులకు విజ్ఞప్తి'.. ఆలస్యానికి కారణం ఇదేనా?
ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా ఇప...
ఓటీటీలో డార్క్ థ్రిల్లర్ మూవీ.. 20రోజుల్లోనే స్ట్రీమింగ్
పలాసా, శ్రీదేవి సోడా సెంటర్, మట్కా తర్వాత కరుణ కు...
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ప్రతివారం త...
'అందుకే బాలీవుడ్ వదిలేయాల్సి వచ్చింది.. కానీ'.. వారణాసి బ్యూటీ
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ బి...
నానికి హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ?
టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్...
అదే చివరి సినిమా అనుకున్నా.. రూ.1 కోటి పారితోషికం!
కొన్ని సినిమాలు కెరీర్నే మలుపు తిప్పుతాయి. బాలీవు...
11 ఏళ్ల వయసు, అర్థరాత్రి క్యాబ్లో వెళ్తుంటే.. : ప్రియాంక చోప్రా
తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించ...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
అంజనాద్రి బెట్టలో 'జై హనుమాన్' ప్రారంభం.. అక్కడే ఎందుకో తెలుసా?
హనుమాన్ మూవీ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రారంభమైంది...
ఈ అవార్డ్ వారికే అంకితమిస్తున్నా: అల్లు అర్జున్
పుష్ప-2 మూవీకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ర...
డ్రాగన్ సీక్వెల్? హింట్ ఇచ్చిన డైరెక్టర్
దర్శకుడిగా, హీరోగా హిట్టయినవారిలో ప్రదీప్ రంగనాథన...
చిరంజీవితో సమానంగా అల్లు అర్జున్.. రికార్డ్ క్రియేట్
కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుకలో...
ఫొటోలు
లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)
లక్కీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్-1 లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
సరస్వతి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
విశ్వక్ సేన్ కల్ట్ మూవీ టీజర్ లాంఛ్ (ఫొటోలు)
హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో బ్రిటీషర్ని పెళ్లాడిన నటి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
పళని మురుగన్ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)
నరేశ్కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)
రాధిక, శివకార్తికేయన్ కోసం వచ్చిన కమల్ హాసన్ (ఫోటోలు)
గ్రాండ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్లో హీరోయిన్స్ (ఫోటోలు)
గాసిప్స్
View all
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు”
నానికి హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ?
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
మారుతి కొత్త ప్రాజెక్ట్పై ఆసక్తికర చర్చ
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
రివ్యూలు
View all
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.75
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
సినీ ప్రపంచం
ధోతీ-స్టైల్లో స్టార్ హీరోయిన్.. డ్రెస్ ధర ఎన్ని లక్షలో తెలుసా?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫ్యాషన్ మారథాన్లో సందడిగా కనిపించింది. ఆపై తన కొత్త సినిమా ది బ్లఫ్ ప్రెస్ టూర్లో పాల్గొని అందరి చూపు తనవైపు తిప్పుకుంది. హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ది బ్లప్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్తోపాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా ఒక సముద్రపు దొంగ పాత్రలో నటించింది. క్రూరమైన హింసాత్మక గతాన్ని వదిలేసి తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే ఒక మహిళ చేసే పోరాటమే ఈ సినిమా అసలు కథ.ది బ్లఫ్ మూవీ ప్రెస్ టూర్లో సరికొత్త డ్రెస్లో ప్రియాంక చోప్రా పాల్గొంది. ఖరీదైన ధోతీ-స్టైల్ దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ దుస్తులను జిమ్మెర్మాన్ బ్రాండ్ నుండి తయారు చేశారు. లూనా డ్రేప్డ్ హరేమ్ ప్యాంట్స్ ధర రూ. 1.43 లక్షలు, కోఆర్డినేటింగ్ సిల్క్ శాటిన్ షిఫాన్ టాప్ ధర రూ.77వేలు. మొత్తం ధర సుమారు రూ. 2.20 లక్షలు అని తెలుస్తోంది. లో-బ్యాక్ డిజైన్తో చేసిన ఈ ధోతీ డ్రెస్ చాలామందిని ఆకట్టుకుంది.రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని అనే ప్రధాన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. వారణాసి మూవీతో హాలీవుడ్ నుంచి ఆమె తిరిగి ఇండియన్ సినిమాకు వస్తుంది. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రియాంక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)
చిరంజీవికి సన్మానం.. గ్రాండ్ పార్టీలో సెలబ్రిటీలు
మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం మన శంకరవరప్రసాద్గారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఘన విజయాన్ని అందుకున్న చిరంజీవి, చిత్ర యూనిట్ను కాకినాడ పోర్ట్ ఛైర్మన్ కె.వి.రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లో జరిగిన ఈ పార్టీలో చిత్ర నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటితోపాటు, దర్శకుడు అనిల్ రావిపూడి, కె.రాఘవేంద్రరావు, సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, డి.సురేష్బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, వి.వి.వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. ఈ ఫోటోలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయడు తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. Blockbuster celebrations continue for #MSG ✨Megastar #Chiranjeevi garu was felicitated at an exclusive gathering hosted by Shri K.V Rao, attended by eminent personalities including K. Raghavendra Rao, Ashwini Dutt, Anil Ravipudi, Bobby Kolli and several distinguished guests. pic.twitter.com/TP4gfApmg3— Ravanam Swami naidu (@swaminaidu_r) February 22, 2026
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. “మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్లోని ఉదయ్పుర్లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత క్రేజీ కపుల్గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'రంగస్థలం' సినిమా.. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా ఇవ్వలేదు
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'రంగస్థలం'. 2018లో రిలీజైంది. అప్పటివరకు చరణ్ యాక్టింగ్పై ట్రోల్స్ లాంటివి వచ్చేవి. ఈ మూవీ దెబ్బకు వాటన్నింటికి చెక్ పడిందనే చెప్పొచ్చు. అంతలా మెప్పించింది. ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా రామకృష్ణ.. తనకు ఎలాంటి అవార్డ్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా రాకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా అన్నారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్)'రంగస్థలం' చిత్రంలో నటనకుగానూ రామ్ చరణ్కి నేషనల్ అవార్డ్ వస్తుందని అందరం అనుకున్నాం. ఆయనకనే కాదు ఈ సినిమాలో చాలామందికి అవార్డ్స్ రావాలి కానీ ఎవరికీ రాలేదు. సౌండ్ డిజైనర్కి మాత్రమే వచ్చింది. లక్కీగా ఆయనకు రావడంతో మేమంతా హ్యాపీగా ఫీలయ్యాం. కనీసం రాష్ట్రస్థాయి అవార్డులు కూడా ఇవ్వలేదు. అయితే నేను పనిచేస్తూ ఎంజాయ్ చేసింది 'రంగస్థలం', 'అంతరిక్షం' సినిమాలకే. 'రంగస్థలం' వెరీ రూరల్, రియలస్టిక్ స్టోరీ. ఇది సెట్ అని అవార్డ్స్ ఇచ్చేవాళ్లకు తెలీదు. ఊరిలో షూటింగ్ చేశామని అనుకున్నారు. రాష్ట్ర అవార్డ్ ఇవ్వలేదు. నేషనల్ అవార్డ్ కూడా రాలేదు. రామ్ చరణ్ కూడా జాతీయ అవార్డ్ గెలుచుకుంటారని నాతో అన్నారు. కానీ జరగలేదు' అని ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.ఈయన చెప్పింది కూడా నిజమేనేమో. ఎందుకంటే 2018కిగానూ తెలుగు ప్రేక్షకులు చాలామంది రామ్ చరణ్కి అవార్డ్ వస్తుందని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అప్పటికి ఇంకా ఈ పాన్ ఇండియా ట్రెండ్ కూడా పెద్దగా లేదు. ఒకవేళ ప్రస్తుత టైంలో 'రంగస్థలం' రిలీజయ్యుంటే కచ్చితంగా చరణ్కి అవార్డ్ వచ్చి ఉండేదేమో? అదే ఉద్దేశాన్ని ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇప్పుడు చెప్పుకొచ్చారు. అవార్డులు రాకపోతేనేం సుకుమార్, చరణ్.. ఎవరికి వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)“I enjoyed working on #Rangasthallam and #Antariksham, both are complete sets, but we didn’t get awards for either.Even #Ramcharan sir said, ‘You will get a National Award for this movie.’”- Art Director #RamaKrishna | #Sukumar pic.twitter.com/VHdVmzscAd— Whynot Cinemas (@whynotcinemass_) February 22, 2026
'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్
పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మార్చి 26న థియేటర్లలోకి రానుంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' పేరుతో ఓ పాట రిలీజ్ చేయగా.. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో మరో సాంగ్ విడుదల చేశారు.'మెడపై ముట్టుకుంటే తొడ గొట్టినట్లే..' అంటూ సాగే ఈ పాటలో ఈ ఒక్క లైన్ తప్పితే మిగతా లిరిక్స్ ఏమంత ఆకట్టుకునేలా అయితే లేవు. దానికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే నచ్చేలా ఈ సాంగ్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ట్యూన్ కూడా రెగ్యులర్గానే అనిపించింది. పాటలో చాలావరకు పవన్ మేనరిజమ్నే చూపించారు. సినిమాలో ఓ డైలాగ్తో ఈ పాట పుట్టిందని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాట్యూబ్లో ఓకే ఓకే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?ఇకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. దళపతి విజయ్ చేసిన 'తెరి' రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. టీమ్ ఈ విషయాన్ని ఖండించింది గానీ చాలామంది నెటిజన్లకు ఇంకా ఈ సందేహం అలానే ఉండిపోయింది. దానికి తోడు ఈ మూవీపై ఇప్పటివరకు అయితే పెద్దగా బజ్ కూడా లేదు. అలానే ధురంధర్ 2, టాక్సిక్ చిత్రాలు రిలీజైన తర్వాత వారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి వాటి నుంచి పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందనేది కూడా చూడాలి.
సీరియల్ బ్యూటీ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. టీజర్ రిలీజ్
స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన జ్యోతిరాయ్.. 'గుప్పెడంత మనసు' సీరియల్లో జగతి మేడమ్గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల క్రితం ఉన్నట్లుండి పూర్తిగా సీరియల్స్ చేయడం తగ్గించేసిన ఈమె, సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 'కిల్లర్' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్)సీరియల్లో పద్ధతి అయిన పాత్రల్లో కనిపించిన జ్యోతిరాయ్.. ఈ సినిమాలో సూపర్ ఉమన్ తరహా పాత్ర చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. టెరర్రిస్ట్(ఉగ్రవాది), వ్యాంపైర్(రక్త పిశాచి), స్పై(గూఢచారి) అనే కన్ఫ్యూజన్.. జ్యోతి పోషించిన పాత్రలో చూపించారు. ఓవైపు ఫుల్ రొమాన్స్ చూపిస్తూనే మరోవైపు ఈమె పాత్రతో యాక్షన్ కూడా చేయించారు. ఈమె భర్త పూర్వజ్.. ఇదే మూవీలో పోలీస్గా నటించాడు. టీజర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)
రుక్మిణి వసంత్ స్టైల్.. కాజల్ అగర్వాల్ అదే గ్లామర్
ముద్దుగా మెరిసిపోతున్న రుక్మిణి వసంత్వయసు పెరుగుతున్నా అదే గ్లామర్తో కాజల్పార్టీలో చిల్ అయిపోతున్న 'ధురంధర్' ఆయేషాచీరలో అందంగా మాయ చేస్తున్న శ్రీలీలజపాన్ ట్రిప్ వేసిన హీరోయిన్ నివేదా పేతురాజ్అల్లు వారి పార్టీలో మిహీక-శ్రీలీల చిల్ మోడ్ View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier)
'ది కేరళ స్టోరీ-2' డబ్బు కోసం చిచ్చు పెడుతున్నారు: ప్రముఖ దర్శకుడు
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ది కేరళ స్టోరీ-2 చిత్రంపై మండిపడ్డారు. రెండేళ్ల క్రితం విడుదలైన ది కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ను నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ వివాదస్పదంగా మారింది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై దర్వకుడు అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అయ్యారు.ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో కనిపించిన అనురాగ్ కశ్యప్ను కేరళ స్టోరీ-2పై మాట్లాడమని మీడియా ప్రతినిధులు కోరడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ మూవీ కేవలం డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని శక్తులు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా కల్పితంగా తెరకెక్కించి కొందరు లాభపడాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్పారు. అందులో చూపినట్లు ఎవరైనా బీఫ్ తినిపిస్తారా.. కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు కదా అంటూ భగ్గున్నారు. ఈ సినిమా మేకర్స్ అత్యాశపరులుగా కనిపిస్తున్నారు. వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలాంటి కథలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్లర్స్ ఉంటాయిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్ స్టోరీలతో తీసిన మూవీస్ కూడా వస్తుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్లోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్స్పాట్ 2 మచ్'. 2024లో వచ్చిన తొలి పార్ట్ అందరికీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్ కూడా అదే రేంజులో ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కార్తిక్ దర్శకుడు కాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. లెస్బియన్ పాత్ర చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ సినిమా.. 'చథా పచ్చ' తెలుగు రివ్యూ)కథేంటి?తొలి భాగంలో ఓ నిర్మాతకు స్టోరీ చెప్పడానికి వచ్చిన మహమ్మద్ షరీఫ్(విఘ్నేశ్ రాజా).. స్టోరీలన్నీ చెప్పి చివరకు నిర్మాత కుమార్తెనే(బ్రిగిడ సాగా) పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ కోసం వస్తుంది. ఓ మూడు కథలు చెబుతుంది. వీటిలో ఒకటి హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప, ఈ నిర్మాతకే స్టోరీ చెప్పడం వెనక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ అదేంటి? శిల్ప ఎవరు? షరీఫ్తో ఈమెకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇలానే తీయాలి అని కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే 'హాట్స్పాట్'. 2024లో వచ్చిన ఈ సినిమాలో చిత్రవిచిత్రమైన అంశాల్ని చూపించగా.. ఈసారి సీక్వెల్లో మాత్రం సమాజంలోని హాట్ టాపిక్ లాంటి మూడు అంశాలని తీసుకుని వాటిని కన్విన్సింగ్గా చెప్పగలిగాడు. మెప్పించాడు కూడా.తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని అభిమానించడం అనేది చాలా సాధారణమైన విషయం. అలా విపరీతమైన ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడు అనేది తొలి స్టోరీగా చూపించారు. ఇందులో చెప్పిన పాయింట్స్ గానీ, చూపించిన అంశాలు గానీ పచ్చి నిజాలే. యువత తమ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా హీరోలకు ఎలా బానిసత్వం చేస్తున్నారు? వాళ్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలా కొట్టుకుచస్తున్నారనేది చూపించారు. చివరలో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆలోచన రేకెత్తించడంతో పాటు ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించేలా చేస్తుంది.రీసెంట్ టైంలో డ్రస్సింగ్ సెన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం నటుడు శివాజీ.. స్టేజీపై హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో చాలామంది శివాజీని తప్పుపట్టారు. మరికొందరు ఇతడిని సమర్థించారు. అసలు డ్రస్సింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు కూడా పొట్టిబట్టలేసుకుని కౌంటర్స్ వేసే ఓ కూతురికి.. వయసైన తండ్రి లాగిపెట్టి కొట్టేలా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది పాయింట్ స్ట్రెయిట్గా చెప్పారు. ఇది చూస్తే కచ్చితంగా చాలామంది అమ్మాయిల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంటుంది.ఇక మూడోది టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ. 2026లోనూ స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకునే ఓ కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఓ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. రోజూ ఫోన్లో మాట్లాడుతూ తెలియకుండానే ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఇతడికి ఓ షాకింగ్ కనెక్షన్ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్టుకి తొలుత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చి స్టోరీని సుఖాంతం చేశారు. ఏదేమైనా ఈ మూడు స్టోరీలు ప్రస్తుతం సమాజంలో చాలామంది చూస్తున్న చేదు నిజాలే. కానీ కామెడీగా బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పడం బాగుంది.పైన చెప్పిన మూడు కథలతో పాటు ప్రియా భవానీ శంకర్ చేసిన శిల్ప పాత్రకు ఓ స్టోరీ ఉంటుంది. అదేంటనేది ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. త్వరలో వచ్చే మూడో భాగంలో పూర్తిస్థాయిలో చూపిస్తారేమో?నటీనటుల విషయానికొస్తే.. ప్రియాభవానీ శంకర్, భవానీ శ్రీ, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, బ్రిగిడ సాగా.. ఇలా ఎవరికి వాళ్లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్గానూ బాగుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే బోల్డ్ సినిమా గానీ అసభ్యకర సన్నివేశాల్లాంటివి లేవు. వీలైతే ఒంటరిగానే చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్)
ట్రోల్స్ లెక్క చేయను.. నా ఇంటివరకు వస్తే మాత్రం!
దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నాక సమంత ముఖం వెలిగిపోతోంది. ఒకప్పుడు విచారంగా కనిపించే తన ముఖం ఇప్పుడు వెయ్యి ఓట్ల బల్బులా ప్రకాశిస్తోంది. ప్రస్తుతం సంతోషకర జీవితం గడుపుతున్న సామ్ మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం! ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏదీ నన్ను కదిలించలేదుఇదిలా ఉంటే తాజాగా తను సోషల్ మీడియాలో అభిమానులతో చిట్చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు? అని ఓ వ్యక్తి అడిగారు. అందుకు సమంత స్పందిస్తూ.. ప్రశంసలు నన్ను కదిలించలేవు. అలాగే విమర్శలు కూడా నన్ను ఎఫెక్ట్ చేయవు. కానీ, నెగెటివిటీని నా ఇంటివరకు తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని బ్లాక్ చేస్తాను.దానర్థం అదే..అలా నా స్పేస్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను. మిమ్మల్ని బ్లాక్ చేశానంటే నేను బాధపడ్డానని కాదు. మీలాంటివారికి నాదగ్గర చోటు లేదని అర్థం అని రిప్లై ఇచ్చింది. మీలోని ఓ ఫన్నీ థింగ్ ఏంటని అడగ్గా.. కిందపడి మరీ నవ్వుతానంది. ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తారని అడగ్గా.. ధ్యానం చేస్తానని బదులిచ్చింది.సినిమామా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఇందులో సమంత పెళ్లయిన అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఆపద వచ్చినప్పుడు కత్తి పట్టేందుకు కూడా వెనుకాడని శివంగిగానూ అలరించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.చదవండి: ఇంకా అదే బాధలో ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్
సినిమా
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి రిసెప్షన్ డేట్ లీక్
హనుమాన్ సీక్వెల్.. “జై హనుమాన్” మొదలైంది.. పూజా కార్యక్రమంలో రిషబ్ శెట్టి
కొచ్చిలో ఘనంగా 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు
కోలీవుడ్ కు షాక్ ఇచ్చిన విక్రమ్
అనుపమ - ధృవ్ మధ్య ప్రేమ నిజమా..? ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు
ప్రభాస్ కల్కి 2.. దీపిక ప్లేస్ లో సాయిపల్లవి
ప్రేమలో ప్రభాస్ వైరల్ అవుతున్న వీడియో
చిరు, మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్ ఎవరు..? రాధిక సమాధానం వైరల్
ధురంధర్-2 కు పోటీగా టాక్సిక్.. అసలు తగ్గేదేలే అంటున్న యష్..
