Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Prabhas injured In Fauzi Movie shooting1
'ఫౌజీ' షూటింగ్‌లో ప్రమాదం.. ప్రభాస్‌కు గాయం!

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ మూవీ షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూవీలో భాగంగా కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్‌ కిందపడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన చేతికి గాయమైందని సోషల్‌మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే, అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదని గాయం చిన్నదేనని తెలుపుతున్నారు. ఈ విషయంపై సినిమా యూనిట్‌ నుంచి అధికారికంగా ప్రకటన ఇవ్వాలని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోరుతున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, భానుచందర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్‌ గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.‘‘పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూస్‌ షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేశారు. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్‌ పాత్రలో చూపించబోతున్నారు హను రాఘవపూడి. ఇప్పటికే విడుదలై ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలో విడుదల కానుంది.

Patang Movie Now Streaming Three OTT Platform2
మూడు ఓటీటీలలో యూత్‌ఫుల్ సినిమా స్ట్రీమింగ్‌

యూత్‌ను బాగా ఆకట్టుకున్న చిత్రం పతంగ్‌.. ఇప్పుడు ఏకంగా 3 ఓటీటీలలో స్ట్రీమింగ్‌ అవుతుంది. వంశీ పూజిత్‌. ప్రణవ్‌ కౌశిక్‌, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది క్రిస్మస్‌ కానుకగా విడుదలైంది. దర్శకుడు ప్రణీత్‌ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ మూవీని డి.సురేశ్‌బాబు సమర్పణలో సురేశ్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఇందులో గౌతమ్‌ మేనన్, ఎస్పీ చరణ్‌ కీలక పాత్రలు పోషించారు.ట్రయాంగిల్ ప్రేమకథ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, 'పతంగ్' మూవీని దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగుంటుంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జనవరి 30న సన్ నెక్స్ట్ (SUN NXT)ఓటీటీలో విడుదలైన పతంగ్‌.. ప్రస్తుతం అమెజాన్‌(Amazon Prime), ఆహా(Aha) తెలుగు ఓటీటీలలో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది.కథేంటి..?హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్‌ కృష్ణ అలియాస్‌ విస్కీ(వంశీ పూజిత్‌), అదే ప్రాంతంలో ఉండే అరుణ్‌(ప్రణవ్‌ కౌశిక్‌) అనే డబ్బున్న కుర్రాడితో ఫ్రెండ్‌షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఈమె ఏ విషయంలోనూ సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యని దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీ. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ.

Sanjay Leela Bhansali announced A movie on JAY SOMNATH3
వెయ్యేళ్ల క్రితం మన ఆలయంపై దండయాత్ర.. సంజయ్‌ లీలా భన్సాలీ కొత్త సినిమా

సోమనాథ్‌ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. అయితే, వెయ్యేళ్ల క్రితం సోమనాథ్‌పై జరిపిన గజనీ దండయాత్రను వెండితెరపై చూపించేందుకు బాలీవుడ్‌ దర్శకనిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ సిద్ధమయ్యారు. ఆయన సమర్పణలో ‘జై సోమనాథ్‌’ (JAI SOMNATH)అనే సినిమా రాబోతుంది. దర్శకుడు కేతన్‌ మెహతాతో కలిసి భన్సాలీ(Sanjay Leela BhansaliSanjay Leela BhansaliSanjay Leela Bhansali) తెరకెక్కిస్తున్నారు. ఆలయం కూలిపోవచ్చు.. విశ్వాసం కాదు అంటూ ఒక పోస్టర్‌తో పాటు వీడియోను విడుదల చేశారు. 2027లో ఈ మూవీ విడుదల చేస్తామని తెలిపారు. ఈ మూవీలో నటించబోయే వారి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.గజనీ మహమ్మద్‌ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. సోమనాథ్‌పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది.పర్షియా, మధ్య ఆసియా, అఫ్గానిస్థాన్‌లను కలిపి సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని గజనీ మహమ్మద్‌ అనుకున్నాడు. అందుకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం భారత్‌పైకి దాడి చేసేందుకు దిగాడు. కీ.శ.1000-1027 సమయంలో 17 సార్లు దండయాత్ర చేసి ఎంతో సంపదను భారత్‌ నుంచి దోచుకున్నాడు. అయితే, 15వ దండయాత్ర ఐశ్వర్యవంతమైన సోమనాథ దేవాలయంపై కొనసాగింది. సోలంకి రాజు భీమదేవుడిని ఓడించి సోమనాథ్‌ ఆలయాన్ని గజనీ మహమ్మద్‌ కొల్లగొట్టడమే కాకుండా ధ్వంసం చేశాడు. సోమనాథ్‌ ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేక వ్యాసం రాసిన సంగతి తెలిసిందే.. (వ్యాసం కోసం క్లిక్‌ చేయండి)ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్‌ ప్రముఖులు. సోమ్‌నాథ్‌లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం.

Vijay Jana nayagan will be released by this month4
జన నాయగన్‌కు మరో షాక్‌.. ఆ రోజు వరకు వచ్చే ఛాన్సే లేదు

విజయ్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయగన్‌ చిత్రానికి ఎదురౌతున్న అవరోధాలు అన్నీ ఇన్నీ కావు. నటుడు విజయ్‌ చిత్ర షూటింగ్‌కు ముందే తన చిత్ర విడుదల సమయంలో ఆటకాలు ఎదురౌతాయని, వాటిని అధిగమించగలరా? అని ఏ ముహూర్తానా అన్నారో తెలీదు గానీ.. ఇప్పుడు అక్షరాలా అదే జరుగుతోంది. చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం గత డిసెంబర్‌ నెలలో సెన్సార్‌బోర్డుకు పంపారు. అయితే ఇప్పటి వరకూ సర్టిఫికెట్‌ రాలేదు. సెన్సార్‌ బోర్డుకు వ్యతిరేకంగా నిర్మాత చేసిన ప్రయత్రాలన్నీ సఫలం కాలేదు. చివరికి హైకోర్టు నుంచి పిటిషన్‌ను వాపస్‌ తీసుకున్నారు. అయితే సెన్సార్‌ ప్రత్యేక కమిటీకి పంపిన జననాయగన్‌ చిత్రానికి ఆ కమిటీ ఎప్పుడు సర్టిఫికెట్‌ ఇస్తుందో తెలియని పరిస్థితి. జనవరి 9న విడుదల కావలసిన ఈ చిత్రం ఫిబ్రవరి నెల సగభాగం గడిచిపోతున్నా, ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నెల 20న చిత్రం విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జననాయకన్‌ చిత్రం కెనడాలో విడుదలకు హక్కులు పొందిన యార్క్‌ సినిమాస్‌ సంస్థ అధినేత ఈ చిత్రం ఏప్రిల్‌ 30 వరకూ విడుదల అవ్వడానికి అవకాశం లేదని, అందుకే టిక్కెట్‌ బుక్కింగ్‌ డబ్బులను రిఫండ్‌ చేసుకోండి అని పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. ఈ ఏడాది మే నెలలో శాసన సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాంటిది ఆ సమయంలో జననాయగన్‌ చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యం అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ పరిస్ధితులు విజయ్‌ అభిమానులకు జీర్ణయింకుకోవడం కష్టమే అవుతుంది. ఇక జననాయకన్‌ చిత్ర నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Trend of sequels declining in Tollywood Movies5
టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్‌కు బ్రేక్?

ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్‌లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్‌కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు. అసలు సీక్వెల్ ట్రెండ్‌ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్‌బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్‌తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్‌నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది.

Tollywood Actress Deeksha Seth Present Details6
ప్రభాస్, బన్నీతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడేం చేస్తోంది?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నోళ్లు మెల్లమెల్లగా సైడ్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం స్టార్స్ అవుతారనుకుంటే పట్టుమని పది మూవీస్ కూడా చేయకుండా తెరమరుగైపోతుంటారు. అలాంటి బ్యూటీనే ఈమె. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్‌తో చేసినప్పటికీ మాయమైపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీక్షా సేథ్. ఢిల్లీలో పుట్టిన ఈమె.. తండ్రి ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో పెరిగింది. మంచి పొడగరి కావడంతో 2009లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మోడలింగ్ అనుభవం లేనప్పటికీ టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఓ మోడలింగ్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమెని చూసిన దర్శకుడు క్రిష్.. 'వేదం'లో అవకాశమిచ్చాడు. ఇందులో పూజగా అల్లు అర్జున్ సరసన నటించింది. అలా టాలీవుడ్ దృష్టిలో పడింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)తర్వాత రవితేజ 'మిరపకాయ్', నిప్పు, గోపిచంద్ 'వాంటెడ్', మంచు మనోజ్ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ప్రభాస్ 'రెబల్' సినిమాలు చేసింది. వీటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉండేసరికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. అనంతరం హిందీలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.రీసెంట్ టైంలో ఈమె ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో అసలు ఇప్పుడేం చేస్తుందా అని వెతకగా.. స్పెయిన్‌లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా, అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటోందట. అలానే ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయిపోవడంతో జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్, గ్లామర్‌గా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721)

Mrunal Thakur And Anupama Parameswaran Latest News7
మెరుపుతీగలా అనుపమ.. మస్తు క్యూట్‌గా మృణాల్!

మెరుపుతీగలా సన్నని గ్లామర్‌తో అనుపమముద్దుముద్దుగా పోజులిచ్చేసిన మృణాల్అందాల జాతర చేస్తున్న డింపుల్ హయాతిపట్టుచీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్స్టేజీపై పాడుతూ దుమ్ములేపిన నోరా ఫతేహిచుడీదార్‌లో క్యూట్ 'కపుల్ ఫ్రెండ్లీ' వారణాసి View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi)

Sunil Majako Mallika Song and Dance8
డ్యాన్స్‌తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి

లోకేష్‌ కనగరాజ్‌ తీసిన 'కూలీ' చూసినవారెవ్వరూ అందులోని మోనికా పాటని మర్చిపోలేరు. నిజానికి చూడనివారినీ వదలకుండా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కవర్‌ సాంగ్‌గా ఆ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపును ఆ ఒక్క పాటతో దక్కించుకున్నాడు మళయాళ నటుడు సౌబిన్‌ షాహిర్‌. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేడుకల్లో ఆ పాట సందడి చేస్తూనే ఉంది.ఈ నేపధ్యంలో మన టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ ఆ పాట క్రేజ్‌కి చెక్‌ పెట్టేలా ఉన్నాడు. త్వరలో విడుదల కానున్న 'కాటలన్' అనే మళయాళ చిత్రంలో మోనికా పాటని మించేలా డ్యాన్స్ ఊపేశారు. ఈ విషయం తాజాగా ఆ సినిమా టీజర్‌ లాంచ్‌తో వెల్లడైంది. పాల్‌ జార్జ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్‌ పెపే, దుసర విజయన్, కబీర్‌ సింగ్‌లతో పాటు సునీల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్ర నిర్మాతలు తమ చిత్రం మొదటి లిరికల్‌ వీడియోని విడుదల చేశారు. 'మజాకో మల్లికా' అంటూ సాగే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. ముఖ్యంగా సునీల్‌ స్టెప్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)'మజాకో మల్లికా'లో సునీల్‌ డ్యాన్స్‌లో ఈజ్‌ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ పాటను చాలామంది మోనికా పాటతో పోలుస్తున్నారు. ఓ చేత్తో సిగిరెట్‌ పట్టుకుని స్మోక్‌ చేస్తూ ఒకే కాలితో సునీల్‌ వేసిన స్టెప్స్‌ని చూసి ఒక నెటిజన్‌.. 'నటుడు సునీల్‌ డ్యాన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌' అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకులకు సునీల్‌ డ్యాన్స్‌ బాగా పరిచయం అయినప్పటికీ... దక్షిణాది మొత్తానికి ఇప్పుడు పరిచయం అయిందని చెప్పొచ్చు.ఈ పాటకు సంగీతాన్ని ప్రముఖ కన్నడ సంగీతకారుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు, ఇతను 'కాంతారా చాప్టర్‌ 2' కు వర్క్‌ చేయడం విశేషం. ఈ పాటను ఆనంద్‌ శ్రీరాజ్‌ భద్ర పాడారు, వినాయక్‌ శశికుమార్‌ సాహిత్యం రాశారు. కూలీ సినిమాలో సౌబిన్‌ లాగే ఈ సినిమాలో కూడా సునీల్‌ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాటలన్ చిత్రం విడుదల తర్వాత సునీల్‌ సాంగ్‌.. మోనికా రేంజ్‌లో హిట్‌ కొడితే ఇక దక్షిణాది సినిమాల్లో హీరోలతో పాటుగా విలన్‌ పాటల ట్రెండ్‌ మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందిన మార్కో సినిమాను అందించిన క్యూబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అందిస్తున్న ఈ యాక్షన్‌ సినిమా మే నెలలో విడుదల కానుంది.(ఇదీ చదవండి: పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?)

Mrunal Thakur Thanks to Wedding Rumours With Dhanush: I Get such Publicity Freely9
రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్‌ ఠాకూర్‌

సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తలే. వాలంటైన్స్‌ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్‌.. హీరో ధనుష్‌ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్‌ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.లైఫ్‌లో సెటిలవాలిప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్‌ మే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్‌.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్‌ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్‌లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.సన్యాసి జీవితమే..యాక్టర్‌గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్‌డ్‌గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్‌ టీమ్‌ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్‌ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్‌ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్‌ ఉంది. కానీ నాపై రూమర్స్‌ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అందులో డౌటే లేదురూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్‌ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్‌ను పట్టించుకుంటూ పోతే కెరీర్‌పై ఫోకస్‌ చేయలేను అని మృణాల్‌ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్‌మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది?

Vijay Devarakonda Wedding Invites CM Revanth Reddy10
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏ‍ర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

Advertisement
Advertisement