ప్రధాన వార్తలు
మైథాలజీ వరల్డ్కు కిరణ్ అబ్బవరం.. కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా పనులు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రంలో ఆయన భాగమయ్యారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్తో ఈ సినిమాను మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో సినిమాను నిర్మించేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదే సమయంలో హీరోయిన్ ఎంపికపై బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు వంటి సాంకేతిక యూనిట్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు చెల్లిస్తారా.. జైలుకెళ్తారా రజనీకాంత్ నిర్మాతకు కోర్టు ఆదేశాలు
చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ ‘కొచ్చడైయాన్’ సినిమా నిర్మాతకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి రూ.2.5 కోట్లు చెల్లిస్తారా.. లేదా జైలుకు వెళ్తారా అనేది తేల్చుకోవాలని చిత్ర నిర్మాతకు కోర్టు హుకూం జారీ చేసింది. రజనీకాంత్ హీరోగా 3డీ మోషన్ క్యాప్చర్ మూవీగా కొచ్చడైయాన్ ( Kochadaiiyaan) 2014లో విడుదలైంది. ఈ మూవీకి ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత జె. మురళి మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. చివరి దశలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసేందుకు బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిర్మాత మురళి మనోహర్ విఫలం కావడంతో చట్టపరమైన వివాదానికి మూలంగా మారింది. అయితే, కొంత కాలం తర్వాత తిరిగి చెల్లింపులో భాగంగా చిత్ర నిర్మాత కొన్ని చెక్కులు ఇచ్చాడు. అందులో ఒకటి బౌన్స్ అయింది. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశాడు. అనేక సంవత్సరాల పాటు విచారణ తర్వాత, ట్రయల్ కోర్టు నిర్మాతను దోషిగా నిర్ధారించి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన గడవులోపు చెల్లించకపోతే జైలు శిక్షను అమలు చేయవచ్చని కోర్టు పేర్కొంది.
'బాలకృష్ణ' ఫ్యాన్స్ను పదేపదే నిరాశపరుస్తున్న తమన్
సంగీత దర్శకుడు తమన్ కొట్టే బీజీఎమ్కు ఫ్యాన్స్కు పూనకాలు వస్తుంటాయి.. కొన్ని చోట్ల థియేటర్ సౌండ్ బాక్స్లు బద్దలవుతాయి. డాల్బీ థియేటర్ అయితే మరింత కిక్ ఇస్తుందని అభిమానులు అంటుంటారు. తమన్ కొట్టే మ్యూజిక్కు డెసిబుల్ స్థాయి మారిపోతుందని తన వర్క్ ఔట్పుట్ గురించి చెబుతుంటారు. అయితే, తమన్ ఏడాది క్రితం బాలకృష్ణ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయాడు. దీంతో బాలయ్య అభిమానులు మరోసారి నిరాశ చెందుతున్నారు.డాకు మహారాజ్ మూవీ OST/BGM విడుదల చేస్తానని సరిగ్గా ఏడాది క్రితం థమన్ అభిమానులకు హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం గడిచిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం గురించి హామీలు ఇచ్చినప్పటికీ, అతను దానిని అమలు చేయలేదు. ఇది బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ, డాకు మహారాజ్ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు సంబంధించిన OSTని కూడా ఆయన విడుదల చేశారు. ఇదీ బాలయ్య ఫ్యాన్స్ను మరింత నిరాశ చెందేలా చేసింది. కొద్దిరోజుల క్రితం 2026 జనవరిలో విడుదల చేస్తానని మరోసారి మాట ఇచ్చాడు. ఆ తేదీ కూడా దాటిపోవడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.డాకు మహారాజ్లో డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా... ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా'అంటూ సాగిన ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. దీంతో పాటు 'సర్కారు రా' అంటూ సాగిన ఈ రెండు ఈ పాటలలో తమన్ కొట్టిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఈ ట్రాక్ కావాలని చాలాసార్లు కోరుతున్నారు. గతేడాది సంక్రాంతి విడుదలైన ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయినప్పటికీ ఫ్యాన్స్ను మాత్రం ఈ మూవీ మెప్పించింది. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో పాటు ‘డాకు మహారాజ్’కు తమన్ సంగీతం అందించాడు. ఇవన్నీ కూడా ఆదరణ పొందాయి. దీంతో తమన్కు ఖరీదైన కారును గిఫ్ట్గా బాలకృష్ణ ఇచ్చిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
మల్టీఫ్లెక్స్ థియేటర్స్ నిర్మించడంలో అల్లు అర్జున్ దూకుడుగా ఉన్నారు. హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా జోరు చూపిస్తున్నారు. మొదట మహేష్ బాబు ఏఎమ్బీతో ఈ ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఈ తర్వాత బన్నీ, విజయ్ దేవరకొండ, రవితేజ అదే దారిలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా ఏషియన్ గ్రూప్స్తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అమిర్పేట్లో ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్ నిర్మించిన అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.అల్లు సినిమాస్ పేరుతో హైదరాబాద్లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. ఈ థియేటర్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్ను ఏర్పాటు చేయడంతో హైదరబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, 4 స్క్రీన్లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ను మార్చి 19న ప్రారంభించాలనే ఆలోచనలో అల్లు సినిమాస్ టీమ్ ఉన్నట్లు సమాచారం. ఇందులో తొలి సినిమాగా 'ధురంధర్ 2, టాక్సిక్' ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్ బ్రాండ్ విస్తరిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ సినీప్రియులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం అల్లు సినిమాస్తో లభించనుంది. విశాఖపట్నంలో కూడా అతిపెద్ద మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులను అల్లు అర్జున్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే.
బిగ్బాస్
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
యాక్సిడెంట్తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
A to Z
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించ...
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం...
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంద...
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సిని...
లగ్జరీ ఇల్లు కొన్న బాలీవుడ్ హీరో
'హోంబౌండ్' సినిమా హీరో ఇషాన్ ఖట్టర్ కొత్త ఇల్లు...
తెలుగులో ఏకైక మూవీ.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఒకప్పుడు హీరోయిన్గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర...
దురంధర్కు అదే పెద్ద మైనస్.. అలా జరిగితే భారీ వసూళ్లు: అమిర్ ఖాన్
గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ ద...
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ షో...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
టాలీవుడ్ ఇండస్ట్రీలో అసమ్మతి.. మళ్లీ మొదలైన వివాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో కథ మళ్లీ మొదటికొచ్చింది. గతం...
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది...
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమా...
దృశ్యం నటి.. ఒకే ఒక్క సీరియల్తో సినిమా ఛాన్స్..!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రా...
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
రేసులో అజిత్.. సపోర్ట్గా నిలిచిన సెలబ్రిటీలు (ఫోటోలు)
'ఎర్ర చీర' మూవీ హీరోయిన్ కారుణ్య చౌదరి స్టన్నింగ్ స్టిల్స్
‘నువ్వే ఉండిపో ఇలా’ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
‘హై’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
‘గాయపడ్డ సింహం’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
‘విప్లవ వీరుడు’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
గ్లామర్తో పడేస్తున్న శ్రద్ధా దాస్.. నెట్టింట ఫోటోలు వైరల్
'ఎర్రచీర' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
గాసిప్స్
View all
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
రివ్యూలు
View all
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
2.75
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
'ఐకాన్ స్టార్తో షూట్.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే అల్లు అర్జున్పై ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆమె.. అల్లు అర్జున్ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.కావేరి బారువా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్తో జరిగింది. ఈ సౌత్ స్టార్ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. అలాగే షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn— AnandTanniru (@ceoyktv) February 10, 2026
ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్లో మహేశ్ బాబు, నమ్రత జోడి ఒకటి. ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికి 21 సంవత్సరాలు అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. విమానంలో మహేశ్బాబుతో కలిసి ఉన్న పాత ఫోటోని షేర్ చేస్తూ.. ‘21 వసంతాలు దాటినా ఇప్పటికీ ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోస్ట్ని మహేశ్ కూడా తన ఇన్స్టా ఖాతాలో రీ షేర్ చేశాడు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా కామెంట్ చేసింది. లవ్, ఫైర్, క్లాపింగ్ ఎమోజీలతో మ్యారేజ్ డే విషెస్ తెలియజేసింది. కాగా, వంశీ(2000) మూవీ షూటింగ్ టైమ్లో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఐదేళ్ల తర్వాత 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2006లో గౌతమ్, 2012లో సితార జన్మించింది. మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమాచేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)
'తన కెరీర్లోనే అతిపెద్ద సినిమా'..వారణాసిపై ప్రియాంక భర్త కామెంట్స్
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అండ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. తొలిసారి వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు డేట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ గురించి ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత పద్నాలుగు నెలలుగా ప్రియాంక ఓ మూవీ కోసం పనిచేస్తోందని తెలిపారు. ఈ సౌతిండియా ఫిల్మ్ను ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు. ఇది తన కెరీర్లోనే అతి పెద్ది సినిమా అని నిక్ జోనాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ అద్భుతంగా ఉండనుందని నిక్ కొనియాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కారణం లేకుండా బూతులు తిట్టేవాళ్లు : నటి షాకింగ్ కామెంట్స్
కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమనాలు ఎదుర్కొన్నానని, కొంతమంది దర్శకులతో బూతులు కూడా తిట్టించుకున్నానని చెబుతోంది బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన కొన్ని సంఘటలను పంచుకుంది. ‘చాలా మంది నటీనటులాకే నాకు కూడా కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురైయ్యాయి. సెట్లో అవమానించేలా మాట్లాడేవారు. కొంతమంది దర్శకులు కారణం లేకుండా బూతులు తిట్టేవారు. అప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. డబ్బులు కావాలి. అందుకే వాళ్లు అసభ్య పదాలతో దూషించినా.. సైలెంట్గా ఉండిపోయా. కొన్ని సినిమాలు అయితే కేవలం డబ్బుల కోసమే నటించా. షూటింగ్ అయిపోయాక ఈ చిత్రాలను ఎందుకు అంగీకరించానా అని చాలా బాధపడేదాన్ని. అవి విడుదల కావొద్దని దేవుడ్ని కోరుకున్నా. అవకాశాలు రాకపోవడంతో ఆ చిత్రాలను అంగీకరించా. ఒకవేళ ఆ సమయంలో నాకు వేరే చిత్రాలు వచ్చి ఉంటే.. కొన్ని సినిమాలను వదిలేదాన్ని’ అని నీనా గుప్తా చెప్పుకొచ్చింది. సినిమాలతో పాటు సిరియళ్లలోనూ నటించింది నీనా గుప్తా.‘ఇష్క్’, ‘ఎలోన్’, ‘ముల్క్’, ‘83’, ‘డయల్ 100’, ‘గుడ్బై’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా అలరించింది.
ఓకేరోజు రెండు హిట్ సినిమాలు.. ప్రేక్షకులకు పండగే
ఈ సంక్రాంతి సీజన్లో చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్స్గా నిలిచాయి. థియేటర్ రన్ ముగిసిన ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వెండితెరపై వాటిని మిస్ అయిన వారు, మళ్ళీ చూడటానికి ప్లాన్ చేసుకున్న వారికి ఇప్పుడు శుభవార్త వచ్చింది. రెండు సినిమాలు వేర్వేరు ప్లాట్ఫామ్లలో ఈ రాత్రి ఓటీటీలో ప్రీమియర్ కానున్నాయి.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫిబ్రవరి 11న జీ5(ZEE5)లో విడుదల కానుంది. అంటే నేడు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీ5 పేర్కొంది. ఇందులో మరో హీరో వెంకటేశ్ సందడి చేయగా నయనతార తన నటనతో మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 375 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరీ ఓటీటీలో కూడా ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు కూడా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. మారి దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ రాజకీయ హాస్య చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా నేడు అర్ధరాత్రి నెట్ఫ్లిక్స్(Netflix)లో OTTలోకి అడుగుపెడుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది.. రెండు విజయవంతమైన సినిమాలు ఒకే రాత్రి ప్రీమియర్ అవుతుండటంతో, ఇది OTT ప్రేక్షకులకు డబుల్ ట్రీట్గా మారుతుంది. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో చూడతగిన చిత్రాలుగా ఉండనున్నాయి.
జన నాయగన్ 'విజయ్' ఫ్యాన్స్కు శుభవార్త
దళపతి విజయ్ అభిమానులకు శుభవార్త. జన నాయగన్ మూవీ నిర్మాతలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకుంటున్నట్లు మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మధ్య జరిగిన చట్టపరమైన వివాదం ముగిసింది. చిత్ర నిర్మాతలకు CBFCపై వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఈ కేసులో KVN ప్రొడక్షన్స్ తరపున వాదిస్తున్న న్యాయవాది విజయన్ సుబ్రమణ్యం చేసిన అభ్యర్థనను జస్టిస్ PT ఆశా అనుమతించారు. కేసును ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ ద్వారా తెలియజేసింది. సినిమాను మరోసారి రివైజింగ్ కమిటీకి పంపి సమీక్ష ప్రక్రియను కొనసాగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇకపై చట్టపరమైన చర్యలను కొనసాగించడం లేదని లేఖలో నిర్మాతలు పేర్కొన్నారు. CBFCకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకోవడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పటికే జన నాయగన్ నిర్మాతలు ఈ చిత్రాన్ని CBFC రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
మైథాలజీ వరల్డ్కు కిరణ్ అబ్బవరం.. కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా పనులు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రంలో ఆయన భాగమయ్యారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్తో ఈ సినిమాను మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో సినిమాను నిర్మించేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదే సమయంలో హీరోయిన్ ఎంపికపై బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు వంటి సాంకేతిక యూనిట్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు చెల్లిస్తారా.. జైలుకెళ్తారా రజనీకాంత్ నిర్మాతకు కోర్టు ఆదేశాలు
చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ ‘కొచ్చడైయాన్’ సినిమా నిర్మాతకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి రూ.2.5 కోట్లు చెల్లిస్తారా.. లేదా జైలుకు వెళ్తారా అనేది తేల్చుకోవాలని చిత్ర నిర్మాతకు కోర్టు హుకూం జారీ చేసింది. రజనీకాంత్ హీరోగా 3డీ మోషన్ క్యాప్చర్ మూవీగా కొచ్చడైయాన్ ( Kochadaiiyaan) 2014లో విడుదలైంది. ఈ మూవీకి ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత జె. మురళి మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. చివరి దశలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసేందుకు బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిర్మాత మురళి మనోహర్ విఫలం కావడంతో చట్టపరమైన వివాదానికి మూలంగా మారింది. అయితే, కొంత కాలం తర్వాత తిరిగి చెల్లింపులో భాగంగా చిత్ర నిర్మాత కొన్ని చెక్కులు ఇచ్చాడు. అందులో ఒకటి బౌన్స్ అయింది. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశాడు. అనేక సంవత్సరాల పాటు విచారణ తర్వాత, ట్రయల్ కోర్టు నిర్మాతను దోషిగా నిర్ధారించి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన గడవులోపు చెల్లించకపోతే జైలు శిక్షను అమలు చేయవచ్చని కోర్టు పేర్కొంది.
'బాలకృష్ణ' ఫ్యాన్స్ను పదేపదే నిరాశపరుస్తున్న తమన్
సంగీత దర్శకుడు తమన్ కొట్టే బీజీఎమ్కు ఫ్యాన్స్కు పూనకాలు వస్తుంటాయి.. కొన్ని చోట్ల థియేటర్ సౌండ్ బాక్స్లు బద్దలవుతాయి. డాల్బీ థియేటర్ అయితే మరింత కిక్ ఇస్తుందని అభిమానులు అంటుంటారు. తమన్ కొట్టే మ్యూజిక్కు డెసిబుల్ స్థాయి మారిపోతుందని తన వర్క్ ఔట్పుట్ గురించి చెబుతుంటారు. అయితే, తమన్ ఏడాది క్రితం బాలకృష్ణ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయాడు. దీంతో బాలయ్య అభిమానులు మరోసారి నిరాశ చెందుతున్నారు.డాకు మహారాజ్ మూవీ OST/BGM విడుదల చేస్తానని సరిగ్గా ఏడాది క్రితం థమన్ అభిమానులకు హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం గడిచిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం గురించి హామీలు ఇచ్చినప్పటికీ, అతను దానిని అమలు చేయలేదు. ఇది బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ, డాకు మహారాజ్ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు సంబంధించిన OSTని కూడా ఆయన విడుదల చేశారు. ఇదీ బాలయ్య ఫ్యాన్స్ను మరింత నిరాశ చెందేలా చేసింది. కొద్దిరోజుల క్రితం 2026 జనవరిలో విడుదల చేస్తానని మరోసారి మాట ఇచ్చాడు. ఆ తేదీ కూడా దాటిపోవడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.డాకు మహారాజ్లో డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా... ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా'అంటూ సాగిన ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. దీంతో పాటు 'సర్కారు రా' అంటూ సాగిన ఈ రెండు ఈ పాటలలో తమన్ కొట్టిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఈ ట్రాక్ కావాలని చాలాసార్లు కోరుతున్నారు. గతేడాది సంక్రాంతి విడుదలైన ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయినప్పటికీ ఫ్యాన్స్ను మాత్రం ఈ మూవీ మెప్పించింది. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో పాటు ‘డాకు మహారాజ్’కు తమన్ సంగీతం అందించాడు. ఇవన్నీ కూడా ఆదరణ పొందాయి. దీంతో తమన్కు ఖరీదైన కారును గిఫ్ట్గా బాలకృష్ణ ఇచ్చిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
మల్టీఫ్లెక్స్ థియేటర్స్ నిర్మించడంలో అల్లు అర్జున్ దూకుడుగా ఉన్నారు. హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా జోరు చూపిస్తున్నారు. మొదట మహేష్ బాబు ఏఎమ్బీతో ఈ ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఈ తర్వాత బన్నీ, విజయ్ దేవరకొండ, రవితేజ అదే దారిలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా ఏషియన్ గ్రూప్స్తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అమిర్పేట్లో ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్ నిర్మించిన అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.అల్లు సినిమాస్ పేరుతో హైదరాబాద్లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. ఈ థియేటర్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్ను ఏర్పాటు చేయడంతో హైదరబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, 4 స్క్రీన్లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ను మార్చి 19న ప్రారంభించాలనే ఆలోచనలో అల్లు సినిమాస్ టీమ్ ఉన్నట్లు సమాచారం. ఇందులో తొలి సినిమాగా 'ధురంధర్ 2, టాక్సిక్' ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్ బ్రాండ్ విస్తరిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ సినీప్రియులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం అల్లు సినిమాస్తో లభించనుంది. విశాఖపట్నంలో కూడా అతిపెద్ద మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులను అల్లు అర్జున్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే.
సినిమా
పూర్తిగా తెలుగు హీరోగా మారిపోతున్న సూర్య
రామ్ చరణ్ కోసం సీక్వెల్ స్టోరీ రెడీ చేసిన సుకుమార్?
గ్లోబల్ రేంజ్ లో డార్లింగ్ క్రేజ్ తొలి భారతీయ హీరోగా రికార్డ్
వారణాసి కోసం RRR స్టాటజీ
AA22: బన్నీకి విలన్ గా రష్మిక
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
జపాన్ లో పుష్ప గాడి రూల్ ధూమ్ 3 రికార్డు బ్రేక్
మరో వివాదంలో ప్రభాస్ స్పిరిట్ క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్..
ఖైదీ 2 సంగతేంటి..? ఉన్నట్టా..? లేనట్టా...?
ప్రభాస్ స్పిరిట్ లో మెగాస్టార్?
