ప్రధాన వార్తలు
హీరో కాదు నటుడు మాత్రమే.. దటీజ్ 'మమ్ముట్టి'
మమ్మట్టి తనను తాను ఎప్పుడూ హీరో అని చెప్పుకోరు. తానొక నటుడిని మాత్రమేనని ఓపెన్గా చెబుతారు. ఆయనకు కథ నచ్చితే చాలు తన ఇమేజ్ను పక్కన పెట్టేసి ఓకే చెప్తారు.. భారీ ఫైట్స్, విదేశాల్లో షూటింగ్స్, హీరోయిన్లతో రొమాన్స్లు అక్కర్లేదు. కేవలం కథ బలంగా ఉంటే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ప్రయోగాలకు చిరునామాగా వైవిధ్యభరితమైన పాత్రలతో 400కి పైగా సినిమాల్లో నటించారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా అయిదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. మలయాళం, తెలుగుతో సహా పలు భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించి ఎనలేని కీర్తిని పొందారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గాను తాజాగా పద్మ భూషణ్ అవార్డ్ వరించింది.ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ. ఆయన తనను తాను ఎప్పుడూ కూడా హీరో అని చెప్పుకోరు. కేవలం తానొక నటుడిని మాత్రమేనని చెప్తారు. అందుకే ఆయనకు భాషతో సంబంధం లేకుండా అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు. మమ్ముట్టి పూర్తి పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు 1951 సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్లో ఆయన జన్మించారు. పెరిగింది మాత్రం కేరళలోని కొట్టాయం జిల్లాలో. మమ్ముట్టిది మధ్యతరగతి ముస్లిం కుటుంబం. ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ డిగ్రీ పట్టా పొందారు మమ్ముట్టి. ఆ తర్వాత రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మరోవైపు సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేశారు.1971లో అనుభవంగళ్ పాలిచకల్ అనే మూవీతో తన కెరీర్ ప్రారంభమైంది. కొన్నేళ్ల పాటు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మమ్ముట్టి వచ్చారు. అయితే, 1980లో విడుదలైన ‘విల్కనుండు స్వప్నంగల్’ సినిమాతో తొలిసారి మమ్ముట్టి పేరు మారుమోగింది. ఈ చిత్రంతో మమ్ముట్టికి మంచి గుర్తింపు లభించింది. ఇక అక్కడి నుంచి మలయాళ చిత్రసీమలో తనకు ఎదురులేదు. ఈ క్రమంలోనే 1992లో కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘స్వాతి కిరణం’ మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని మమ్ముట్టి మెప్పించారు. అలా టాలీవుడ్లో కూడా ఆయనకు అభిమానులు పెరిగారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ (2019) సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇందులో రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు .అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ చిత్రంలోనూ మమ్ముట్టి నటించారు.మమ్ముట్టిని తన అభిమానులు మమ్ముక్కగా ముద్దుగా పిలుచుకుంటారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా మూడు జాతీయ పురస్కారాల్ని (ఒరు వడక్కన్ వీరగాథ, పొంతన్ మదా అండ్ విధేయన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలకుగాను) అందుకున్నారు. ఆపనై పది కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు 11 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ను సొంతం చేసుకున్నారు. తన కెరీర్లో 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా ఉన్నాయి. 1998లో ఆయన్ను పద్మశ్రీ అవార్డు వరించగా.. ఇప్పుడు పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
3 సబ్జెక్ట్స్ ఫెయిల్.. చిరంజీవి పరువు తీయకురా అంటే..
పుత్రోత్సాహం.. కొడుకు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలుగుతుంది. ప్రయోజకుడైన అనిల్ రావిపూడిని చూసి ఆయన తండ్రి బ్రహ్మయ్య కూడా అంతే సంతోషపడుతున్నాడు. కాకపోతే కొడుకు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ దిశగా సాగిన ప్రయాణాన్ని మన శంకరవరప్రసాద్గారు ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్లో బ్రహ్మయ్య గుర్తు చేసుకున్నాడు.కుళ్లుగా ఉందిముందుగా ఇండస్ట్రీకి ఇంతమంచి దర్శకుడినిచ్చినందుకు చిరంజీవి బ్రహ్మయ్యను ప్రశంసించాడు. బ్రహ్మయ్య ప్రతిరోజు సెట్కు వచ్చి కొడుకు ఎదుగుదలను చూసి సంతోషించేవాడు. ఈయన్ను చూస్తే నాకే కుళ్లు వచ్చేస్తుంది. నాకంటే ఎక్కువ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్గా కష్టపడి కొడుకును చదివించాడు. అయితే సినిమాల్లో అనిల్ రావిపూడిని చెడగొట్టిందే ఈయన. ఇంకేం కావాలిఅనిల్ ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు నాన్నా.. చిరంజీవి సినిమా రిలీజైందనగానే అమ్మకు చెప్పకు పదా అని సినిమాకు తీసుకెళ్లేవాడు. నేను సినిమాల్లో వేసుకున్న డ్రెస్లను కొడుక్కి కుట్టించి అతడు డ్యాన్స్ చేసుంటే సంతోషపడ్డాడు ఇప్పుడు కొడుకు ఇంత గొప్ప దర్శకుడు అయి సూపర్ స్టార్స్ను డైరెక్ట్ చేస్తుంటే తండ్రిగా అతడికి ఇంకేం కావాలి అని మెచ్చుకున్నాడు.మూడు సబ్జెక్ట్స్ ఫెయిల్బ్రహ్మయ్య మాట్లాడుతూ.. నా కొడుకు బీటెక్ చదివేటప్పుడు మూడో సంవత్సరంలో మూడు సబ్జెక్టులు పోయాయి. చిరంజీవి సినిమాలు తెగ చూసేవాడు. అప్పుడు నేను.. చిరంజీవికి చెడ్డ పేరు తీసుకురాకురా.. ఆయన సినిమాలు చూసి చెడిపోయావంటారు అని భయపెట్టాను. దాంతో చదువు పూర్తి చేసి చిరంజీవిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు.చిరంజీవి స్పీడ్అనిల్ వంద మైళ్ల స్పీడులో సినిమా తీస్తే చిరంజీవి దాన్ని 200 మైళ్ల స్పీడులో ముందుకు తీసుకెళ్లాడు. ఉదయం తొమ్మిదిన్నరకు షూటింగ్ అంటే ఏడున్నరకే ఆయన సెట్లో ఉండేవాడు. మేము ఆదరాబాదరాగా పరిగెత్తేవాళ్లం అని చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్గారు మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే!చదవండి: మన శంకరవరప్రసాద్గారు మూవీలో రమణ గోగుల్ సాంగ్ డిలీట్.. ఎందుకంటే?
సుస్మితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: చిరంజీవి
మనశంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్బస్టర్ కావడంతో తాజాగా సక్సెస్మీట్ను నిర్వహించారు. చిత్ర యూనిట్తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. రెండువారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 350 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలుగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విజయం అందుకున్నారని చిరు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన కూతురు సుస్మిత ఒక నిర్మాతగా పడిన కష్టం గురించి చిరు పలు విషయాలను పంచుకున్నారు.సుస్మిత గురించి చిరంజీవి ఇలా అన్నారు. 'చరణ్ వద్ద సలహా తీసుకున్న తర్వాతే సుస్మిత ఇండస్ట్రీలోకి వచ్చింది. రంగస్థలం మూవీ కోసం కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన ఆమె ఒక నిర్మాతగా మరో అడుగు ముందుకు వేసింది. సుస్మిత అనుకుంటే ఇంట్లో ఉన్న హీరోలతో సినిమాలు చేయవచ్చు. కానీ, ఆమె మొదట వెబ్ సీరిస్లను నిర్మించి నిర్మాతగా పలు విషయాలను తెలుసుకుంది. ఆ తర్వాతే మరో నిర్మాత సాహు గారపాటితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ప్రయాణంలో ఆమెకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిర్మాతలుగా వారిద్దరే చెరో సగం పెట్టుబడి పెట్టారు. డబ్బు అవసరం అయితే అప్పుగా తెచ్చుకుంది కానీ నన్ను ఎన్నడూ అడగలేదు. పలు దపాలుగా నా రెమ్యునరేషన్ కూడా సమయానికి ఇచ్చేశారు. కూతురుగా కాకుండా ఒక నిర్మాతగా చాలా ప్రొఫెషనల్గా సుస్మిత పనిచేసింది. ఈ మూవీకి చాలా డబ్బు పెట్టుబడి పెట్టి ఆమె విజయం సాధించడంతో ఒక తండ్రిగా నేను సంతోషిస్తున్నాను.' అని చిరు అన్నారు. ఆపై ‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ గురించి మరిన్ని విషయాలను చిరు పంచుకున్నారు. పూర్తి వీడియోలో చూడండి.
పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు
కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డ్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ దక్కడం సంతోషంగా ఉందని చిరు పేర్కొన్నారు. ప్రియమైన నటుడు మమ్ముట్టి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రియమైన మిత్రులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, సోదరుడు మాధవన్, మన ఛాంపియన్ రోహిత్ శర్మ, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్ ప్రీత్లు పద్మశ్రీని అందుకోవడం అభినందనీయం అన్నారు. కళలు, సైన్స్, వైద్యం, సాహిత్యం, క్రీడల రంగాలలో విశేష కృషి చేసిన 2026 పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ చిరు పేర్కొన్నారు. Honouring such distinguished individuals brings great pride and joy…Sri Dharamji’s Padma Vibhushan, my dear @mammukka and Dr Dattatreyudu Nori garu’s Padma Bhushan are recognitions earned through decades of dedication, excellence and grace.Very happy to see dear friends…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2026
బిగ్బాస్
బిగ్బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
అటు మోడ్రన్గా.. ఇటు అమ్మవారి వేషంలో..
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
నా క్యారెక్టర్పై నింద.. వాష్రూమ్లో ఏడ్చేదాన్ని: రీతూ
వైల్డ్కార్డ్స్గా రీతూ-పవన్.. నయని విమర్శలు
కూతురి ఫస్ట్ బర్త్డే.. బిగ్బాస్ జంట ఎమోషనల్
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్
A to Z
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెలుగులోనూ కాస్తంత ఫా...
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
శోభిత తెలుగమ్మాయే. కానీ దాదాపు పదేళ్ల కెరీర్లో రె...
ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక సంక్రాంత...
ఓటీటీలో 'మోగ్లీ' సినిమా.. 3 భాషల్లో స్ట్రీమింగ్
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన ర...
నడుముపై చేయి వేసి.. అవమానంతో చచ్చిపోయా!
యాక్టర్స్ సినిమాలు, సీరియల్స్, యాడ్స్, షోలతో పా...
సల్మాన్ దేశభక్తి సినిమా.. మాతృభూమి సాంగ్ రిలీజ్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్స...
‘బోర్డర్ 2’ ఫస్ట్డే కలెక్షన్స్.. ‘ధురంధర్’ కంటే ఎక్కువే!
బాలీవుడ్ నుంచి వచ్చిన మరో దేశభక్తి చిత్రం బోర్డర్...
కాల్పుల ఘటనలో సినీ నటుడు అరెస్ట్
బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ అరెస్ట్ అయ్యారు....
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
ఏడేళ్ల తర్వాత 'తుంబాడ్' దర్శకుడి కొత్త సినిమా.. గూస్ బంప్స్ ట్రైలర్
'తుంబాడ్' సినిమాతో దర్శకుడు రాహి అనిల్ బార్వే దేశ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట...
నా కంటే ముందు చాలామందితో డేటింగ్ చేశాడు.. కాకపోతే: హీరోయిన్
సాధారణంగా హీరోయిన్లు ప్రేమలో ఉన్నాసరే దాన్ని బయటపె...
స్టార్ హీరోకు తల్లిగా.. నో చెప్పా కానీ..: మీనా
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెల...
మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ప్ర...
చెప్పు విసిరిన ఘటన.. 'నన్ను నేను మర్చిపోయా!'
సినీగేయరచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన...
ఫొటోలు
‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ బ్లాక్బస్టర్ సక్సెస్మీట్ (ఫొటోలు)
అనిల్ రావిపూడికి ఒక రేంజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)
తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)
కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్ ఫోటోలు
మ్యాడ్ నటి 'రెబా జాన్' ట్రెండింగ్ ఫోటోలు
తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)
కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)
ఫారిన్ ట్రిప్లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)
ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
గాసిప్స్
View all
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
ప్రభాస్ ‘స్పిరిట్’పై క్రేజీ గాసిప్.. గోపీచంద్ కీలక పాత్ర?
మెగా హీరో సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
తర్వాతి రెండు నెలలు డ్రై?
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్
టాలీవుడ్లో ట్రెండ్ మారుతోందా?
మెగా హీరోతో మారుతి కొత్త సినిమా!
గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?
రివ్యూలు
View all
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్..
2.5
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
సినీ ప్రపంచం
డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. అల్లు అర్జున్తో రెండు వారాల క్రితం కొత్త సినిమాని ప్రకటించాడు. దీంతో ఈ దర్శకుడిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేసరికి 'ఖైదీ 2' వదిలేశాడు, LCU(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఆగిపోయింది అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై లోకేశ్ స్వయంగా స్పందించాడు. చెన్నైలో సోమవారం ఉదయం జరిగిన ఓ ప్రెస్మీట్లో తనపై వస్తున్న అన్ని పుకార్లకు సమాధానమిచ్చాడు.'గత వారం నుంచి ఎల్సీయూ క్లోజ్ అయిపోయిందని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఖైదీ 2 కూడా ఆగిపోయిందంటున్నారు. ఇది కూడా నిజం కాదు. అల్లు అర్జున్తో చేస్తున్న మూవీ పూర్తవగానే 'ఖైదీ 2' చేస్తా. తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ చిత్రాలు వరసగా వస్తాయి. లారెన్స్తో చేస్తున్న 'బెంజ్' కూడా ఎల్సీయూలో భాగమే. దయచేసి రూమర్స్ నమ్మకండి'(ఇదీ చదవండి: తమిళ బ్లాక్బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)'ఖైదీ 2 ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు. వేరే నిర్మాతలు డబ్బులు ఎక్కువ ఇచ్చారని దీన్ని వదిలేయలేదు. ఇతర ప్రాజెక్టుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. 'కూలీ' తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం చేయమన్నారు. దీంతో ఒకటిన్నర నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాను. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తుండటంతో ఒక సింపుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేద్దామన్నారు. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీక ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాను''అల్లు అర్జున్తో సినిమా కోసం మైత్రీ మూవీస్ సంస్థతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నాయి. అది ఇప్పటికి కుదిరింది. అందుకే బన్నీ మూవీ ఇప్పుడు చేస్తున్నాను తప్పితే 'ఖైదీ 2' వదిలేసి చేయట్లేదు. అలానే దళపతి విజయ్ 'జన నాయగణ్'లో అతిథి పాత్ర చేశా' అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)#LokeshKanagaraj about UpComing #LCU Film- After my film with #AlluArjun sir, my very next project will be #Kaithi2, #Vikram2, and the #Rolex standalone film are all commitments I’ve made, and I will complete every one of them.#AA23pic.twitter.com/de7CqnwckD— Movie Tamil (@_MovieTamil) January 26, 2026
బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నా: బాలీవుడ్ హీరో
కష్టాలు దాటుకుని సక్సెస్ను ఆస్వాదిస్తున్న తారలు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే ఒకరు. చిన్న వయసులోనే బండెడు కష్టాలు చూశానంటున్న ఈయన తాజాగా వాటిని ఓ సారి గుర్తు చేసుకున్నాడు. విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను. అప్పటివరకు కాఫీ షాప్లో పని చేశాను. రోజులో 16 గంటలు పనినా చదువు ముందుకు సాగాలంటే ఆ ఉద్యోగం చేయడం తప్పనిసరి. ముంబైలోని ఓ రెస్టారెంట్లో కూడా పని చేశాను. అదే సమయంలో ఓ డ్యాన్స్ గ్రూప్కు అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశాను. ప్రతిరోజు నాలుగు లోకల్ ట్రైన్స్ మారేవాడిని. 16 గంటలు పనిచేసేవాడిని. పార్లీజీ బిస్కెట్, నీళ్లు.. ఈ రెండింటితోనే కడుపు నింపుకునేవాడిని. తర్వాత నేనొక షో చేశాను. దానికోసం దాదాపు 8 నెలలపాటు కష్టపడ్డాను. డబ్బు కూడా సగమే..తీరా ఆ షో ప్రసారమే కాలేదు. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సగమే ఇచ్చారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయిందని చాలా బాధపడ్డాను. కొన్నేళ్ల తర్వాత ఆ షోను అర్ధరాత్రి టీవీలో ప్రసారం చేశారు. ఇలాంటి సమస్యలు యాక్టర్స్కు చివరి నిమిషం వరకు తెలియవు. అయితే ఈ షో కోసం నేనెంత కష్టపడ్డానో గుర్తించిన ఓ మహిళా నిర్మాత తన బ్యానర్లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా బుల్లితెరకు.. అక్కడినుంచి వెండితెరకు పరిచయమయ్యాను అని గుర్తు చేసుకున్నాడు.సీరియల్, సినిమావిక్రాంత్ మాస్సే.. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు), ఖుబూల్ హై వంటి సీరియల్స్లో యాక్ట్ చేశాడు. సినిమాల్లో రాణించాలన్న ఆశతో బుల్లితెరకు గుడ్బై చెప్పాడు. లూటేరా చిత్రంతో 2013లో తొలిసారి వెండితెరపై కనిపించాడు. 12th ఫెయిల్ మూవీతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఓ రోమియో సినిమా చేస్తున్నాడు. షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది.చదవండి: ఫ్లాప్ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే: చిరంజీవి కౌంటర్?
తమిళ బ్లాక్బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
ఇప్పుడంతా ఓటీటీ జమానా. వివిధ భాషల సినిమాలని డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్లోకి తీసుకొస్తున్నారు. గత కొన్నేళ్లలో అలా దక్షిణాది భాషల మూవీస్కి తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు అయిపోయారు. ఇకపోతే గత వీకెండ్ రిలీజైన ఓ తమిళ బ్లాక్బస్టర్ చిత్రానికి ఇప్పుడు కాస్త ఆలస్యంగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఏ సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్, అనిష్మా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'సిరై'. తమిళంలో ఈ టైటిల్కి జైలు అని అర్థం. డిసెంబరులో థియేటర్లలోకి రిలీజైనప్పుడు అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. మూడు రోజుల క్రితం జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంటెన్స్ పోలీస్ డ్రామా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.'సిరై' విషయానికొస్తే.. శీను(విక్రమ్ ప్రభు) అనే పోలీస్, ఎక్కువగా ఎస్కార్ట్ డ్యూటీ చేస్తుంటాడు. ఎస్కార్ట్ అంటే ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లడం అనమాట. వృత్తిలో సిన్సియర్ అయిన ఇతడు ఓ రోజు అబ్దుల్ రౌఫ్(అక్షయ్ కుమార్) అనే ఖైదీని గుంటూరు జైలు నుంచి కడప కోర్టు వరకు తీసుకెళ్లాల్సిన ఎస్కార్ట్ పనిపడుతుంది. మరి ఈ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. అబ్దుల్ గతమేంటి? ఇతడు ప్రేమించిన కళ (అనిష్మా) చివరకు ఏమైంది? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్
మరోవారం వచ్చేసింది. సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీకెండ్.. ఓం శాంతి శాంతి శాంతిః, త్రిముఖ, ప్రేమకడలి తదితర తెలుగు మూవీస్ బిగ్ స్క్రీన్పైకి రాబోతున్నాయి. విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్', 'తుంబాడ్' డైరెక్టర్ కొత్త చిత్రం 'మయసభ' కూడా ఈ వారాంతలోనే థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ అవనున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఈ వారం ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. ఛాంపియన్, సర్వం మాయ, పతంగ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్ 'ధురంధర్' కూడా ఇదే వీకెండ్లో స్ట్రీమింగ్లోకి రానుందనే టాక్ ఉంది. ప్రస్తుతానికైతే ఇవే. సడన్ సర్ప్రైజులు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు)నెట్ఫ్లిక్స్మైక్ ఎప్స్: డెల్యూషనల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 27టేక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 27బ్రిడ్జర్టన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29ఛాంపియన్ (తెలుగు సినిమా) - జనవరి 29ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30 (రూమర్ డేట్)మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30అమెజాన్ ప్రైమ్ద రెకింగ్ క్రూ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 28దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30హాట్స్టార్గుస్తాక్ ఇష్క్ (హిందీ మూవీ) - జనవరి 27సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30సన్ నెక్స్ట్పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30ఆపిల్ టీవీ ప్లస్స్క్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 28యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30బుక్ మై షోద ఇంటర్న్షిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 28జీ5దేవ్కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)
ఫ్లాప్ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే! కొరటాలకు కౌంటర్?
'మన శంకరవరప్రసాద్గారు' సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ విజయోత్సవ వేడుకల్లో చిరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య.. ఈ రెండు సినిమాల షూటింగ్కు ఉత్సాహంగా వెళ్లాను. మళ్లీ మన శంకరవరప్రసాద్గారు షూటింగ్ కూడా అంతే ఎంజాయ్ చేశాను. నేనే బాధ్యత తీసుకుంటా..ఈ సినిమాలన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి. మధ్యలో కొన్ని సినిమాలు ఏదో డౌట్గా అనిపించాయి. వాటిని నేను తప్పుపట్టను. తప్పు నా మీద వేసుకుంటాను కానీ ఒకరిపై నెట్టను అన్నాడు. దీంతో ఆచార్య సినిమా విషయంలో వచ్చిన విమర్శలకు చిరు కౌంటరిచ్చాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మూవీ ఆచార్య (2022). ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్ఆ సినిమా డిజాస్టర్ కాగా దానికి కొరటాలే కారణమని చిరంజీవి అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అనంతరం ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ.. ఎవరి పని వాళ్లు చేసుకుంటే ఈ ప్రపంచమంతా హ్యాపీగా ఉంటుంది అని కామెంట్స్ చేశాడు. ఆచార్య స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి జోక్యం చేసుకోవడం వల్లే ఫ్లాప్ అయిందన్న ఆరోపణలు వస్తున్న సమయంలో కొరటాల ఇలాంటి కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురూ భావించారు.డైరెక్టర్కు కౌంటర్?అయితే కొరటాల మాత్రం.. సాధారణంగా పని గురించి మాట్లాడాను తప్ప ఆ వ్యాఖ్యల వెనక మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ నెట్టింట చర్చ మాత్రం ఆగలేదు. ఇప్పుడు చిరంజీవి తన కామెంట్స్తో.. తాజాగా కొరటాల శివకు పరోక్షంగా కౌంటరిచ్చారని పలువురు భావిస్తున్నారు.చదవండి: 3 సబ్జెక్టులు ఫెయిల్.. చిరంజీవి పరువు తీయొద్దన్నా.. అనిల్ రావిపూడి తండ్రి
హీరో కాదు నటుడు మాత్రమే.. దటీజ్ 'మమ్ముట్టి'
మమ్మట్టి తనను తాను ఎప్పుడూ హీరో అని చెప్పుకోరు. తానొక నటుడిని మాత్రమేనని ఓపెన్గా చెబుతారు. ఆయనకు కథ నచ్చితే చాలు తన ఇమేజ్ను పక్కన పెట్టేసి ఓకే చెప్తారు.. భారీ ఫైట్స్, విదేశాల్లో షూటింగ్స్, హీరోయిన్లతో రొమాన్స్లు అక్కర్లేదు. కేవలం కథ బలంగా ఉంటే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ప్రయోగాలకు చిరునామాగా వైవిధ్యభరితమైన పాత్రలతో 400కి పైగా సినిమాల్లో నటించారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా అయిదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. మలయాళం, తెలుగుతో సహా పలు భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించి ఎనలేని కీర్తిని పొందారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గాను తాజాగా పద్మ భూషణ్ అవార్డ్ వరించింది.ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ. ఆయన తనను తాను ఎప్పుడూ కూడా హీరో అని చెప్పుకోరు. కేవలం తానొక నటుడిని మాత్రమేనని చెప్తారు. అందుకే ఆయనకు భాషతో సంబంధం లేకుండా అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు. మమ్ముట్టి పూర్తి పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు 1951 సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్లో ఆయన జన్మించారు. పెరిగింది మాత్రం కేరళలోని కొట్టాయం జిల్లాలో. మమ్ముట్టిది మధ్యతరగతి ముస్లిం కుటుంబం. ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ డిగ్రీ పట్టా పొందారు మమ్ముట్టి. ఆ తర్వాత రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మరోవైపు సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేశారు.1971లో అనుభవంగళ్ పాలిచకల్ అనే మూవీతో తన కెరీర్ ప్రారంభమైంది. కొన్నేళ్ల పాటు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మమ్ముట్టి వచ్చారు. అయితే, 1980లో విడుదలైన ‘విల్కనుండు స్వప్నంగల్’ సినిమాతో తొలిసారి మమ్ముట్టి పేరు మారుమోగింది. ఈ చిత్రంతో మమ్ముట్టికి మంచి గుర్తింపు లభించింది. ఇక అక్కడి నుంచి మలయాళ చిత్రసీమలో తనకు ఎదురులేదు. ఈ క్రమంలోనే 1992లో కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘స్వాతి కిరణం’ మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని మమ్ముట్టి మెప్పించారు. అలా టాలీవుడ్లో కూడా ఆయనకు అభిమానులు పెరిగారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ (2019) సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇందులో రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు .అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ చిత్రంలోనూ మమ్ముట్టి నటించారు.మమ్ముట్టిని తన అభిమానులు మమ్ముక్కగా ముద్దుగా పిలుచుకుంటారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా మూడు జాతీయ పురస్కారాల్ని (ఒరు వడక్కన్ వీరగాథ, పొంతన్ మదా అండ్ విధేయన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలకుగాను) అందుకున్నారు. ఆపనై పది కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు 11 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ను సొంతం చేసుకున్నారు. తన కెరీర్లో 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా ఉన్నాయి. 1998లో ఆయన్ను పద్మశ్రీ అవార్డు వరించగా.. ఇప్పుడు పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
3 సబ్జెక్ట్స్ ఫెయిల్.. చిరంజీవి పరువు తీయకురా అంటే..
పుత్రోత్సాహం.. కొడుకు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలుగుతుంది. ప్రయోజకుడైన అనిల్ రావిపూడిని చూసి ఆయన తండ్రి బ్రహ్మయ్య కూడా అంతే సంతోషపడుతున్నాడు. కాకపోతే కొడుకు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ దిశగా సాగిన ప్రయాణాన్ని మన శంకరవరప్రసాద్గారు ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్లో బ్రహ్మయ్య గుర్తు చేసుకున్నాడు.కుళ్లుగా ఉందిముందుగా ఇండస్ట్రీకి ఇంతమంచి దర్శకుడినిచ్చినందుకు చిరంజీవి బ్రహ్మయ్యను ప్రశంసించాడు. బ్రహ్మయ్య ప్రతిరోజు సెట్కు వచ్చి కొడుకు ఎదుగుదలను చూసి సంతోషించేవాడు. ఈయన్ను చూస్తే నాకే కుళ్లు వచ్చేస్తుంది. నాకంటే ఎక్కువ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్గా కష్టపడి కొడుకును చదివించాడు. అయితే సినిమాల్లో అనిల్ రావిపూడిని చెడగొట్టిందే ఈయన. ఇంకేం కావాలిఅనిల్ ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు నాన్నా.. చిరంజీవి సినిమా రిలీజైందనగానే అమ్మకు చెప్పకు పదా అని సినిమాకు తీసుకెళ్లేవాడు. నేను సినిమాల్లో వేసుకున్న డ్రెస్లను కొడుక్కి కుట్టించి అతడు డ్యాన్స్ చేసుంటే సంతోషపడ్డాడు ఇప్పుడు కొడుకు ఇంత గొప్ప దర్శకుడు అయి సూపర్ స్టార్స్ను డైరెక్ట్ చేస్తుంటే తండ్రిగా అతడికి ఇంకేం కావాలి అని మెచ్చుకున్నాడు.మూడు సబ్జెక్ట్స్ ఫెయిల్బ్రహ్మయ్య మాట్లాడుతూ.. నా కొడుకు బీటెక్ చదివేటప్పుడు మూడో సంవత్సరంలో మూడు సబ్జెక్టులు పోయాయి. చిరంజీవి సినిమాలు తెగ చూసేవాడు. అప్పుడు నేను.. చిరంజీవికి చెడ్డ పేరు తీసుకురాకురా.. ఆయన సినిమాలు చూసి చెడిపోయావంటారు అని భయపెట్టాను. దాంతో చదువు పూర్తి చేసి చిరంజీవిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు.చిరంజీవి స్పీడ్అనిల్ వంద మైళ్ల స్పీడులో సినిమా తీస్తే చిరంజీవి దాన్ని 200 మైళ్ల స్పీడులో ముందుకు తీసుకెళ్లాడు. ఉదయం తొమ్మిదిన్నరకు షూటింగ్ అంటే ఏడున్నరకే ఆయన సెట్లో ఉండేవాడు. మేము ఆదరాబాదరాగా పరిగెత్తేవాళ్లం అని చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్గారు మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే!చదవండి: మన శంకరవరప్రసాద్గారు మూవీలో రమణ గోగుల్ సాంగ్ డిలీట్.. ఎందుకంటే?
రమణ గోగుల సాంగ్ అందుకే పెట్టలేదు: అనిల్ రావిపూడి
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా రాణించిన రమణ గోగుల తర్వాత సడన్గా సినిమాలకు దూరమయ్యాడు. గతేడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సింగర్గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఆయన పాడిన గోదారి గట్టు మీద రామసిలకవే.. పాట బ్లాక్బస్టర్గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సాంగ్ యూట్యూబ్లో మార్మోగిపోయింది.రమణతో సాంగ్దీంతో అనిల్ రావిపూడి కాంబినేషన్లో రమణ గోగుల మరో పాట పాడబోతున్నాడని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అది ఏ సినిమాకో కాదు.. చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్గారు మూవీకి! భీమ్స్ ఇచ్చిన ట్యూన్కు అతడితో పాట కూడా పాడించారట.. ఇంకేముంది, ఈ సాంగ్ కూడా చార్ట్బస్టర్గా నిలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. తీరా సినిమాలో ఆయన పాడిన పాటే లేదు. ఈ విషయంపై తాజాగా అనిల్ రావిపూడి స్పందించాడు. అంత ఊపు లేదని..ఆయన మాట్లాడుతూ.. రమణ గోగులతో ఓ పాట పాడించాను. కాకపోతే అది మెలోడియస్గా ఉందని పక్కన పెట్టాల్సి వచ్చింది. సినిమాలో మొదటి పాట అంటే ఎనర్జీ, ఊపు, వైబ్ ఉండాలి. కానీ రమణ పాడిన పాట మెలోడియస్గా డ్యుయెట్లా ఉంది. ఓపెనింగ్ సాంగే ఊపు రావాలి.. కానీ ఇదంత జోష్గా లేదని నాకెక్కడో కొడుతూనే ఉంది. దీంతో ఆయనకు చెప్పి ఆ పాటను పక్కనపెట్టాం. దాని స్థానంలో హుక్ స్టెప్ సాంగ్ పెట్టాం. రమణ పాడిన సాంగ్ రిలీజ్ చేయాలనుకోవడం లేదు. అది ఇంకో సినిమాలో వాడుకుంటాను అని చెప్పుకొచ్చాడు.సింగర్ మాత్రమే కాదుసింగర్ రమణ గోగుల ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు మాత్రమే కాదు. వీటన్నింటికన్నా ముందు ఆయన ఓ వ్యాపారవేత్త. ఐఐటీ ఖరగ్పూర్లో సోలార్ ఎనర్జీ, అమెరికాలోని లూసియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చదివాడు. తర్వాత పలు స్టార్టప్ కంపెనీలను ప్రారంభించాడు. ఎన్నో వందలాది గ్రామాలకు సోలార్ ఎల్డీ కాంతులు అందించాడు.చదవండి: పనిమనిషిపై 10 ఏళ్లుగా అత్యాచారం, ధురంధర్ నటుడి అరెస్ట్
పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు
కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డ్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ దక్కడం సంతోషంగా ఉందని చిరు పేర్కొన్నారు. ప్రియమైన నటుడు మమ్ముట్టి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రియమైన మిత్రులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, సోదరుడు మాధవన్, మన ఛాంపియన్ రోహిత్ శర్మ, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్ ప్రీత్లు పద్మశ్రీని అందుకోవడం అభినందనీయం అన్నారు. కళలు, సైన్స్, వైద్యం, సాహిత్యం, క్రీడల రంగాలలో విశేష కృషి చేసిన 2026 పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ చిరు పేర్కొన్నారు. Honouring such distinguished individuals brings great pride and joy…Sri Dharamji’s Padma Vibhushan, my dear @mammukka and Dr Dattatreyudu Nori garu’s Padma Bhushan are recognitions earned through decades of dedication, excellence and grace.Very happy to see dear friends…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2026
పనిమనిషిపై పదేళ్లుగా అత్యాచారం.. 'ధురంధర్' నటుడు అరెస్ట్
బాలీవుడ్ హిట్ సినిమా ధురంధర్తో పాపులర్ అయిన నటుడు నదీమ్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్లుగా తన ఇంటి పనిమనిషిపై అత్యాచారం, లైంగిక దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాదితురాలే స్వయంగా మాల్వాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేకసార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ధురంధర్లో అక్షయ్ ఖన్నా (రెహమాన్ దకైత్) వంటవాడిగా అఖ్లాక్ పాత్రతో నదీమ్ కనిపించాడు. నదీమ్ తనను మానసిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు పేర్కొంది. తనపై భయంతోనే ఈ విషయాన్ని ఇన్నేళ్లు దాచినట్లు ఆమె తెలిపింది. పెళ్లి చేసుకోవాలని అనేకసార్లు నేను కోరడంతో దాటవేస్తూ వచ్చాడని ఆమె పేర్కొంది. నదీమ్ మిమి (2021), వాధ్ (2022), మై లడేగా (2024) వంటి చిత్రాల్లో కూడా నటించాడు. అమితాబ్ బచ్చన్తో కలిసి కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్లో కూడా నదీమ్ పాల్గొన్నాడు.
సినిమా
థ్రిల్లింగ్ ట్విస్ట్ కు వెంకీ రెడీ!
ధనుష్, మృణాల్ పెళ్లి..! ఇదిగో క్లారిటీ
అనిల్ రావిపూడికి చిరు కార్ గిఫ్ట్.. ధర ఎంతో తెలుసా..!
ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!
సూర్య వర్సెస్ ధనుష్.. కోలీవుడ్ లో బిగ్ క్లాష్..
అనిల్ రావిపూడి 10వ సినిమా టైటిల్ చూస్తే Wow అనాల్సిందే..
మొగుడు టీజర్ అదుర్స్.. రజిని రిజెక్ట్ చేసిన మూవీతో వస్తున్న విశాల్
సంక్రాంతికి వస్తున్నాం..సీక్వెల్ లేనట్టేనా..!
ఊ అంటావా ని మించి..! పెద్దిలో మృణాల్ ఎంట్రీ
డల్లాస్ థియేటర్స్ లో కేకలు.. USలో నా సినిమా హౌస్ ఫుల్
