Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Mana Shankara Vara Prasad Garu Movie Fans This One Aspect Is Worrying1
'మన శంకర వర ప్రసాద్ గారు'.. మూవీలో ఇదొక్కటే మైనస్‌

సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' వచ్చేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి పండుగ పరీక్షలో డిస్టింక్షన్ కొట్టేశారు. కామెడీతో పాటు భారీ యాక్షన్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. నిర్మాతలను కమర్షియల్‌గా కూడా గట్టెక్కించే సినిమా అని చెప్పాలి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రీమియర్స్‌లో దుమ్మురేపింది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు. అయితే, ఒక విషయంలో మాత్రం చిరంజీవి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.'మన శంకర వర ప్రసాద్ గారి' గురించి ఎక్కడ చూసిన సానుకూల స్పందన కనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించినప్పటికీ, సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. ఇప్పుడు ఇదే అంశం గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మూవీలో ఈ పాటను చాలాసార్లు ఉపయోగించారు. ప్రధానంగా చిరంజీవి, నయనతార కనిపించిన ప్రధాన సీన్స్‌లలో ఈ సాంగ్‌ ఉంటుంది. ఇళయరాజా అనుమతితోనే ఈ పాటను సినిమాలో చేర్చారా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన రాయల్టీ బాధ్యతలను క్లియర్ చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపీరైట్ విషయాలపై ఇళయరాజా దృఢమైన వైఖరిని తీసుకుంటారని తెలిసిందే. ఇప్పటికే తమిళ హీరోల సినిమాలపై కూడా ఆయన కేసులు వేశారు. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ వియషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. సినిమాకు మంచి టాక్‌ రావడంతో ఈ పాట కారణం వల్ల థియేటర్ల ప్రదర్శనకు అంతరాయం కలిగించడానికి చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో చిరు అభిమానులు స్పష్టతను కోరుకుంటున్నారు. నిర్మాతల నుండి ఏదైనా ఒక ప్రకటన వస్తే ఈ ఊహాగానాలకు చెక్‌ పడుతుంది.

Nayanthara remuneration Of TOxic Movie2
40 ప్లస్‌లో నయనతార క్రేజ్‌.. 'టాక్సిక్‌' మూవీకి భారీ రెమ్యునరేషన్‌

తమిళసినిమా: కొందరికి వయసే తెలియదు 40ల్లోనూ 20ల్లాగానే కనిపిస్తారు. అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో నయనతార ఒకరు. పాన్‌ ఇండియా కథానాయకిగా అవతరించిన మాలీవుడ్‌ బ్యూటీ ఈమె. అయితే నయనతార అదృష్టం మామూలుగా లేదు. కోలీవుడ్లో అడుగు పెట్టడంతోనే శరత్‌ కుమార్‌ వంటి స్టార్‌ హీరో సరసన నటించే అవకాశాన్ని పొందారు. ఆ చిత్ర విజయం ఈమెను కథానాయకిగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా చేసింది. ఆ వెంటనే రజినీకాంత్‌ సరసన చంద్రముఖి, సూర్యతో కలిసి గజిని వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించే అవకాశాలు వరించాయి. మంచి చిత్రాలు నటించిన నయనతార టాలీవుడ్‌ ఆహ్వానించింది ఆ తర్వాత మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తున్న నయనతార జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌ లోనూ రంగప్రవేశం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. 41 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ లేడీ సూపర్‌ స్టార్‌ గా వెలుగొందుతూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉండడం విశేషం. ఈమె తెలుగులో చిరంజీవి సరసన నటించిన మన శంకర వరప్రసాద్‌ గారు చిత్రం సంక్రాంతి సందర్భంగా సోమవారం తెరపైకి వచ్చేసింది. కాగా కన్నడంలో యాష్‌ కథానాయకుడు నటించిన టాక్సిక్‌ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో పెట్రియడ్, డియర్‌ స్టూడెంట్‌ చిత్రాలు నటిస్తున్నారు. ఇక తమిళంలో ఈమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మన్నాంగట్టి సీన్స్‌ 1960, హాయ్, రాక్కాయి , మూక్కుత్తి అమ్మన్‌ 2 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా తెలుగులో బాలకృష్ణకు జంటగా ఒక చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా నాలుగు భాషలు నటిస్తూ బిజీగా ఉన్న నయనతార పారితోíÙకం విషయంలోనూ తగ్గేదెలే అంటున్నట్లు సమాచారం. ఈమె కన్నడంలో నడుస్తున్న టాక్సిక్‌ చిత్రం కోసం రూ.18 కోట్లు డిమాండ్‌ చేసినట్లు, చివరికి రూ.15 కోట్లకు సమ్మతించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది.

Mana Shankara Vara Prasad Garu Movie Review And Rating In Telugu3
‘మన శంకరవరప్రసాద్‌ గారు’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

టైటిల్‌: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’.నటీనటులు: చిరంజీవి, వెంకటేశ్‌, నయనతార, కేథరిన్‌ థ్రెసా, సచిన్‌ ఖేడ్కేర్‌, రఘుబాబు, అభినవ్‌ గోమఠం తదితరులునిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెలరచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడిసంగీతం: భీమ్స్‌ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డిఎడిటర్‌: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 12, 2026ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన రెండో పుంజు ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. ‘భోళా శంకర్’ లాంటి డిజాస్టర్‌ తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకొని చిరంజీవి ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? చిరు ఖాతాలో భారీ హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Mana Shankara Vara Prasad Garu Movie Review)కథేంటంటే..శంకరవరప్రసాద్‌(చిరంజీవి) నేషనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌. ఆయన టీమ్‌(కేథరీన్‌, హర్ష వర్ధన్‌, అభినవ్‌ గోమఠం) కేంద్ర హోంమంత్రి నితీష్‌ శర్మ(శరత్‌ సక్సేనా) రక్షణ బాధ్యలతను చూస్తుంటుంది. వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో ఉంటే శంకరవరప్రసాద్‌.. పర్సనల్‌ లైఫ్‌ని లీడ్‌ చేయడంలో మాత్రం ఫెయిల్‌ అవుతాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య శశిరేఖ(నయనతార) అతనికి విడాకులు ఇచ్చి.. బడా వ్యాపారవేత్త అయిన తన తండ్రి జీవీఆర్‌(సచిన్‌ ఖేడ్కెర్‌) దగ్గరకు వెళ్తుంది. పిల్లలను కూడా చూపించపోవడంతో ఆరేళ్లుగా వరప్రసాద్‌ అదే బాధలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నితీష్‌..తనకున్న పలుబడితో బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుతున్న తన పిల్లలకు పీఈటీ టీచర్‌గా వరప్రసాద్‌ని పంపిస్తాడు. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు వరప్రసాద్‌ ఎలా దగ్గరయ్యాడు? అసలు శశిరేఖ, వరప్రసాద్‌ విడిపోవడానికి గల కారణం ఏంటి? మైనింగ్‌ వ్యాపారవేత్త వెంకిగౌడ(వెంకటేశ్‌) కు శశిరేఖతో మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు శనిరేఖ, వరప్రసాద్‌ మళ్లీ కలిశారా లేదా?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..అనిల్‌ రావిపూడి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. ఆయన సినిమాకెళ్లి కొత్తదనం,ట్విస్టులు, లాజిక్కుల గురించి వెతకడం అంటే.. ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌కి వెళ్లి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ ఇచ్చినట్టే ఉంటుంది. పాత కథతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కు రప్పించడం ఆయన స్టైల్‌. కథ-కథనం కంటే.. హీరోకి ఉన్న ప్లస్‌ పాయింట్స్‌ని ఎలా వాడుకోవాలనేదానిపైనే ఎక్కువ ఫోకస్‌ పెడతాడు. హీరోని ఎలా చూపిస్తే..ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు? ఎక్కడ ఏ సీన్‌ పెడితే నవ్వుకుంటారు? అనేది అనిల్‌కి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికీ ఇదే మ్యాజిక్‌ వర్కౌట్‌ అయింది. ఇప్పుడు మన శంకరవరప్రసాద్‌ గారు చిత్రానికి కూడా అనిల్‌ ఆ పనే చేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి కామెడీ టైమింగ్‌ని గట్టిగా వాడుకొని.. ఫ్యాన్స్‌ ఆయన్ని తెరపై ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా చూపించాడు. అలా అని చిరులో ఉన్న మాస్‌ యాంగిల్‌ని పక్కన పెట్టలేదు. మధ్య మధ్యలో యాక్షన్‌ సీన్లను పెట్టి మాస్‌ లుక్‌ని కూడా చూపించాడు. అయితే ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే లేదు. కోపంలో విడాకులు తీసుకున్న భార్యను పొందేందకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. అయితే ఇక్కడ అనిల్‌ రావిపూడి చేసిన మ్యాజిక్‌ ఏంటంటే.. ఈ సింపుల్‌ లైన్‌కి చిరంజీవి మేనరిజాన్ని హైలెట్‌ చేసేలా సన్నివేశాలు అల్లుకోవడమే. ఈ మధ్య కాలంలో...ఇంకా చెప్పాలంటే రీఎంట్రీ తర్వాత చిరంజీవిని తెరపై ఇంత స్టైలీష్‌గా, ఇంత హుషారుగా ఎవరూ చూపించలేదు. ఈ రకంగా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్‌ చిత్రమే. అయితే కథగా చూస్తే మాత్రం మెగాస్టార్‌ చిరంజీవి స్థాయికి సరిపోలేదనే చెప్పాలి. ఒకనొక దశలో చిరంజీవిని చిన్న కమెడియన్‌లా చూపించారనే ఫీలింగ్‌ కలుగుతుంది.ఓ రౌడీ ముఠా.. హోం మంత్రికి వార్నింగ్‌ ఇచ్చే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. చిరు ఎంట్రీ సీన్‌తోనే అనిల్‌ రావిపూడి తరహా కామెడీ ప్రారంభం అవుతుంది. హుక్‌ స్టెప్‌ సాంగ్‌ వరకు కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇక వరప్రసాద్‌ ప్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. వరప్రసాద్‌-శశిరేఖల ప్రేమ..పెళ్లి.. విడాకులకు దారీతీసిన సంఘటనలు అన్నీ నవ్వులు పూయిస్తాయి. స్కూల్‌ ఎపిసోడ్‌ స్టార్ట్‌ అయ్యాక కథనం కాస్త బోరింగ్‌ సాగుతుంది. అయితే బుల్లిరాజా(రేవంత్‌) ఎంట్రీతో మళ్లీ నవ్వులు మొదలవుతాయి. ఇలా ప్రేక్షకుడికి బోర్‌ కొట్టకుండా ప్రతి పది నిమిషాలకు ఒక కామెడీ సీన్‌ని పెట్టి.. ఫస్టాఫ్ ముగించాడు. ఇక సెకండాఫ్‌ ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. వీరేంద్ర పాండే పాత్ర ఎంట్రీతో మళ్లీ కథనం పుంజుకుంటుంది. కథతో సంబంధం లేకున్నా.. విడాకుల అంశంపై హీరో పాత్రతో ఓ మంచి సందేశం ఇప్పించాడు. అది కూడా కామెడీగానే చూపించినా.. సినిమా చూసిన ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తాడు. ఇక వెంకటేశ్‌ పాత్ర ఎంట్రీతో మళ్లీ నవ్వులు స్టార్ట్‌ అవుతాయి. వెంకీ గౌడ్‌గా వెంకటేశ్‌ ఎంట్రీ నుంచి కథనం పరుగులు పెడుతుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. సాధారణ సమయంలో రిలీజ్‌ అయితే ఫలితం ఎలా ఉండేదో తెలియదు కానీ.. సంక్రాంతి పండక్కి వచ్చి ‘మన శంకరవరప్రసాద్‌ ’ మంచి పనే చేశాడు. ముందుగా చెప్పినట్లుగా కొత్తదనం ఆశించకుండా, లాజిక్కులు వెతక్కుండా హాయిగా నవ్వుకోవడానికి అయితే ఈ సినిమా చూడొచ్చు. (Positives And Negatives Of Mana Shankara Vara Prasad Garu Movie)ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం మెగాస్టార్‌ చిరంజీవినే. ఆయన లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, డైలాగులు.. ఇవన్నీ చూస్తే.. ఒకప్పటి మెగాస్టార్‌ మన కళ్లముందు కనిపిస్తాడు. ఒకవైపు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూనే.. యాక్షన్‌ సీన్లను ఇరగదీశాడు. ఇక డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హుక్‌ స్టెప్‌ పాటకు ఆయన వేసిన స్టెప్పులకు థియేటర్స్‌లో విజిల్స్‌ వేయడం గ్యారెంటీ. ఇక శశిరేఖగా నయన తార తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. హీరో మామగారిగా సచిన్‌ ఖేడ్కర్‌ చక్కగా నటించాడు. వెంకీ గౌడ పాత్రలో వెంకటేశ్‌ ఒదిగిపోయాడు. చిరు-వెంకీ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా జరీనా వహాబ్‌ తెరపై కనిపించేది కాసేపే అయినా.. నయనతారతో ఆమె చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. వరప్రసాద్‌ టీమ్‌ సభ్యులుగా నటించిన కేథరిన్‌, హర్షవర్ధన్‌, అభినవ్‌ గోమఠంతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. భీమ్స్‌ సంగీతం సినిమాకు మరో ప్రధానబలం. మీసాల పిల్ల, హుక్ స్టెప్ సాంగ్‌తో తెరపై మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Mana Shankara Vara Prasad Garu Movie USA Premiers collection4
'ఖైదీ 150' తర్వాత 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డ్‌

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్‌ షోల విషయంలో దుమ్మురేపుతున్నాడు. హైదరాబాద్‌లో ఏకంగా 200 స్క్రీన్స్‌లలో ప్రీమియర్స్‌ ప్రదర్శించనున్నారు. రూ. 600 టికెట్‌ ఉన్నప్పటికీ దాదాపు అన్ని థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. ఆపై నార్త్‌ అమెరికాలో కూడా టికెట్స్‌ బుకింగ్‌ జోరు కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్‌ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అమెరికాలో కేవలం ప్రీమియర్స్‌ ద్వారానే 9 లక్షల డాలర్లు (రూ. 8.12కోట్లు) కలెక్ట్‌ చేసినట్లు ప్రకటించారు. 1మిలియన్‌ మార్క్‌ కూడా చేరవచ్చని తెలుస్తోంది. దీంతో చిరంజీవి కెరీర్‌లో మరో అతిపెద్ద ఓవర్సీస్ ఓపెనింగ్‌గా ఈ మూవీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.‘మన శంకర వరప్రసాద్ గారు’ అమెరికా ప్రీమియర్స్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌ పరంగా చిరు కెరీర్‌లో రెండో చిత్రంగా నిలిచింది. మొదటి స్ధానంలో ఖైదీ 150 మూవీ ఉంది. చిరు రీఎంట్రీ మూవీ కావడంతో కేవలం ప్రీమియర్స్‌ ద్వారా 1.25 మిలియన్‌ డాలర్స్‌ వచ్చాయి. ఆ తర్వాత అంతటి రేంజ్‌ ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి దక్కింది. అయితే, చిరు హిట్‌ సినిమా వాల్తేరు వీరయ్య కూడా 6 లక్షల డాలర్ల వద్దే ఆగిపోయింది. సంక్రాంతి పండుగ కాబట్టి చిరు సినిమాకు పాజిటీవ్‌ టాక్‌ వస్తే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచే ఛాన్స్‌ ఉంది. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema)

120 Bahadur Movie Ott Streaming Details5
ఓటీటీలో '120 బహదూర్‌'.. ఉచితంగానే స్ట్రీమింగ్‌

బాలీవుడ్ న‌టుడు ఫర్హాన్ అక్తర్ న‌టించిన కొత్త సినిమా ‘120 బహదూర్‌’ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ప్రస్తుతం అదనంగా రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండా సినిమా చూసే అవకాశం రానుంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీష్‌ (రాజీ ఫేమ్) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పరమ వీర చక్ర అవార్డ్‌ అందుకున్న మేజర్ సైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ మెప్పించారు. ఇందులో రాశీఖన్నా కీల‌క పాత్ర‌లో నటించింది. గతేడాదిలో విడుదులైన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్‌ లేకుండా ప్రభుత్వాలు అనుమతులు కూడా ఇచ్చాయి.‘120 బహదూర్‌’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జనవరి 16నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. భాగ్ మిల్కా భాగ్ త‌ర్వాత ఫర్హాన్ అక్తర్ మ‌రోసారి బ‌యోపిక్ చేయడంతో భారీగా ఫ్యాన్స్‌ ఈ మూవీ కోసం ఎదురుచూశారు. ఈ హిస్టారికల్‌ మూవీ అందరినీ మెప్పిస్తుంది. కానీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.'120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్‌లో ఎలాంటి యుద్ధం చేశాడు. మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్‌గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి.

Bigg Boss Sanjana Galrani Gets Emotional over Bhogi Celebrations to her Daughter6
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్‌

బుజ్జిగాడు సినిమాలో యాక్ట్‌ చేసిన సంజనా గల్రానీ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. మధ్యలో డ్రగ్స్‌ వివాదంలో చిక్కుకోవడంతో తన ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది. తనకు ఆ కేసులో క్లీన్‌చిట్‌ వచ్చినప్పటికీ తన ఆత్మగౌరవం దెబ్బతిందని బాధపడింది. ఆ మరకు పోగొట్టుకునేందుకు బిగ్‌బాస్‌ షోను ఎంచుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో అడుగుపెట్టింది.బిగ్‌బాస్‌ షోలో..చిలిపితనం, ముక్కుసూటితనంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుడ్డు దొంగతనంతో సీజన్‌పై బజ్‌ క్రియేట్‌ చేసిన ఆమె ఏకంగా ఫైనల్స్‌లో అడుగుపెట్టడం విశేషం. ఈ షో కోసం తన ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసింది. ఆరేండ్ల కుమారుడు అలరిక్‌ను, ఏడాది కూడా నిండని పాపను భర్తకు అప్పజెప్పి బిగ్‌బాస్‌ షోలో పాల్గొంది. లోలోపల ఎంత కుమిలిపోయినా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేది. సంజనా కూతురికి భోగి పండ్లుతాజాగా ఓ సంక్రాంతి ఈవెంట్‌లో సంజనా కూతురికి దువ్వాడ మాధురి, శ్రీముఖి, రోహిణి భోగి పండ్లు పోశారు. అందులో సంజనా పాప ఎంతో క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది. ఆ చిన్నారి ముందు పుస్తకం, స్టెతస్కోప్‌, మేకప్‌ వంటి సామాను పెడితే.. మేకప్‌ సామానునే పట్టుకుంది. అంటే తల్లి దారిలో నడవనున్నట్లు సిగ్నల్స్‌ ఇచ్చిందన్నమాట! ఈ సందర్భంగా సంజనా భావోద్వేగానికి లోనైంది. అదే నా సక్సెస్‌'చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లు అనిపిస్తోంది. ఇప్పటికీ ఇదంతా కలా? నిజమా? అర్థం కావడం లేదు. ఇంత చిన్న పాపను పెట్టుకుని బిగ్‌బాస్‌కు వెళ్లడమేంటి? ప్రతిరోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తూ నిద్రపోయేదాన్ని. టాప్‌ 5వరకు వెళ్లాను. ఇప్పుడు మీ అందరితో ఇక్కడున్నాను.. ఇదే నా విజయం' అని సంజనా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రభాస్‌కు కలిసిరాని ఆర్‌ అక్షరం

Nari Nari Naduma Murari Movie Trailer Out now7
'నారీ నారీ నడుమ మురారి' అదిరిపోయేలా ట్రైలర్‌

శర్వానంద్‌ నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలకానుంది. ఈ మూవీని దర్శకులు రామ్‌ అబ్బరాజు తెరకెక్కించగా.. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇందులో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. వివాహ భోజనంబు, సామజవరగమన వంటి సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన రామ్‌ అబ్బరాజు తొలిసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. ఈ మూవీలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Movies Starting with R Letter Not Working For Prabhas8
ప్రభాస్‌కు అచ్చిరాని R అక్షరం.. మరోసారి రుజువైందా?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్‌ సినిమాలున్నాయి. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్లకు సైతం కొదవ లేదు. అయితే తన అపజయాల లిస్టు చూస్తే అందులో R అక్షరంతో మొదలైన సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభాస్‌కు R అక్షరం కలిసిరావడం లేదన్న వాదన మొదలైంది. ఈ భయంతోనే కాబోలు రాజాసాబ్‌ సినిమా టైటిల్‌ ముందు The అనేది యాడ్‌ చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్‌ కొనసాగినట్లే కనిపిస్తోంది...R అక్షరం వల్లే..ప్రభాస్‌ తొలిసారి హారర్‌ జానర్‌లో నటించిన మూవీ ది రాజాసాబ్‌. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. సినిమా టైటిల్‌ రాజాసాబ్‌ ఆర్‌ అక్షరంతో మొదలుకావడం వల్లే ఇంత వ్యతిరేకత వస్తోందని కొందరంటున్నారు. ఈ సెంటిమెంట్‌ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రాఘవేంద్ర సమయంలో మొదలైంది. నెగెటివ్‌ టాక్‌ప్రభాస్‌ నటించిన సెకండ్‌ మూవీయే రాఘవేంద్ర. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రెబల్‌ సినిమా చేశాడు. రాఘవ లారెన్స్‌తో కలిసి చేసిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2022లో రాధే శ్యామ్‌ అని భారీ బడ్జెట్‌ సినిమా చేశాడు. ఇందులో ప్రభాస్‌ పెదనాన్న కృష్టంరాజు చివరిసారిగా యాక్ట్‌ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.సాహసం చేస్తాడా?ఇలా ఆర్‌ లెటర్‌తో చేసిన నాలుగు సినిమాలు తనకస్సలు కలిసిరాలేదు. ఈసారి 'ది రాజాసాబ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆర్‌ సెంటిమెంట్‌ ప్రభాస్‌ను వెంటాడినట్లే కనిపిస్తోంది. మరి మున్ముందు ప్రభాస్‌ R అక్షరంతో సినిమాలు చేస్తాడా? ఈ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటాడా? లేదా లైట్‌ తీసుకుంటాడా? అన్నది చూడాలి!

Boycott Parasakthi Hashtag Trending In Social Media9
'పరాశక్తి'లో తెలుగువారిని అవమానపరిచే డైలాగ్‌

సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్‌ సినిమా పరాశక్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, జనవరి 10న కేవలం తమిళ్‌లోనే విడుదల చేశారు. కానీ, సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాపై పలు విమర్శలు వస్తున్నాయి. 1960లలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో ఇద్దరు స్నేహితుల చుట్టూ ఈ మూవీ కొనసాగుతుంది. మూవీలో​ పలు అభ్యంతరకరమైన డైలాగ్స్‌ ఉండటంతో సెన్సార్‌లో భారీ కొతలు పడ్డాయి. అయినప్పటికీ వివాదాలకు ఈ మూవీ తావిచ్చింది.అమరన్ చిత్రంతో తెలుగువారి ప్రేమను పొందిన శివకార్తికేయన్‌.. ఇప్పుడు పరాశక్తితో కొల్పోయేలా ఉన్నాడు. ఈ మూవీలో తెలుగు ప్రజలను అవమానించే విధంగా "గోల్టీ"(Golti) అనే అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. (గోల్టీ అంటే దొంగ, మురికివాడు) ఈ పదాన్ని కట్ చేస్తామని ముంబై సెన్సార్ రివిజన్ కమిటీ ముందు చిద్ర యూనిట్‌ మొదట అంగీకరించి కూడా, తమిళ వెర్షన్‌లో అలాగే ఉంచడంతో #BoycottParasakthi అని వైరల్‌ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ మూవీకి దర్శకత్వం వహించింది కూడా తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర కావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. పైగా ఆ పదం తీసేస్తే సినిమాకు ఉన్న ఆత్మ పోతుందని ఆమె సమర్థించుకున్నారని తెలుస్తోంది.1960 సమయంలో మద్రాసులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల గురించి ఈ మూవీ ఉంది. ఈ కాన్సెప్ట్‌ చాలా సున్నితమైనది కావడంతో సెన్సార్ బోర్డు (CBFC) చాలా అభ్యంతరాలు తెలిపింది. ఏకంగా 20కి పైగా కట్స్‌ సూచించింది. సినిమాలో వాడిన కొన్ని పదాలను తొలగించారు. అందులో కొన్ని రాయలనేని బాషలో ఉన్నాయి. వాటిని తొలగించమని కూడా సెన్సార్‌ ఆదేశించింది. అయితే, ఈ పదాలన్నీ తొలగిస్తే సినిమాకు ఉన్న బలం పోతుందని దర్శకురాలు వాదించారట. అయితే, సినిమాపై సానుకూల రివ్యూలు రాలేదు. కథను సాగదీసి చెప్పారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కేవలం శివకార్తికేయన్‌ ఇమేజ్‌ మాత్రమే ఈ మూవీకి బలాన్ని ఇచ్చిందన్నారు. రాజకీయ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి పర్వాలేదు. ఫ్యామిలీ ప్రేక్షకులకు నిరాశ కలిగించేలా ఉంది.

Meenakshi Chaudhary Talk About Anaganaga Oka Raju Movie, Full Interview10
హీరో ఎవరనేది పట్టించుకోను : మీనాక్షి చౌదరి

‘నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే చూస్తాను’ అన్నారు యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి, నవీన్‌ పొలిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.⇢ ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.⇢ నవీన్‌తో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. లక్కీ భాస్కర్ లోని సుమతి పాత్రకు ఈ చారులత పాత్ర పూర్తి భిన్నమైనది. దర్శకులు ఆ పాత్రలను మలిచిన తీరుకి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.⇢ గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.⇢ ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.⇢ నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.⇢ ప్రస్తుతం నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి.

Advertisement
Advertisement