Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Divvala Madhuri Gift Gold Earrings to Bigg Boss Thanuja Puttaswamy1
తనూజ బర్త్‌డే.. బంగారు కానుకిచ్చిన మాధురి

ముద్దమందారం సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. ఇటీవల తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో ఎంతోమంది స్నేహితులను సైతం సంపాదించుకుంది. వారిలో దివ్వెల మాధురి ఒకరు. బిగ్‌బాస్‌ షోలో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధురి.. మొదట తనూజపై విరుచుకుపడింది.బిగ్‌బాస్‌ షోలో క్లోజ్‌కట్‌ చేస్తే వారం తిరగకముందే అందరికంటే ఎక్కువ తనూజతో క్లోజ్‌ అయిపోయింది. మాధురి కటౌట్‌ చూసి భయపడ్డ తనూజ ఆమెను ముద్దుగా మ్యాడీ అని పిలుస్తూ ప్రేమగా పెత్తనం కూడా చెలాయించింది. అప్పటినుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక నేడు (మార్చి 5న) తనూజ 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్‌డే ఇది! మై స్వీట్‌ హార్ట్‌ దీంతో దివ్వెల మాధురి తనకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తనతో కేక్‌ కట్‌ చేయించి, చీరగాజులు పెట్టింది. అలాగే బంగారు చెవికమ్మలను బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. హ్యాపీ బర్త్‌డే బంగారా.. మై స్వీట్‌ హార్ట్‌ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న తొలి బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు తనూజ థాంక్యూ మ్యాడీ అని కామెంట్‌ పెట్టింది. View this post on Instagram A post shared by Divvala Madhuri (@madhuri_srinivasduvvada) చదవండి: గర్భధారణలో కష్టాలు.. తనే నా మిరాకిల్‌ బేబీ: ప్రియాంక చోప్రా

Vrushakarma Glimpse Out2
Vrushakarma Glimpse: గ్లింప్స్‌తోనే భయపెట్టిన నాగచైతన్య

‘అతీంద్రియ శక్తి మేల్కోన్నప్పుడు..సృష్టి ధర్మం తప్పినప్పుడు..విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో ‘వృషకర్మ’ గ్లింప్స్‌ రిలీజ్‌ అయింది. ‘విరూపాక్ష’ఫేం కార్తిక్‌ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘వృషకర్మ’. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్‌ అయిన ఈ మూవీ గ్లింప్స్‌లో నాగ చైతన్య లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ గ్రేడ్ చాలా కొత్తగా ఉంది. గ్లింప్స్‌తోనే భయపెట్టేశారు. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రాణం పోసింది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Ustaad Bhagat Singh Release Date Changed3
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌లో మార్పు

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ యశ్‌ ‘టాక్సిక్‌’ వాయిదా పడడంతో కాస్త ముందుగానే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట దేవిశ్రీ సంగీత దర్శకుడు. అయితే ఇప్పటికీ బ్యాగ్‌గ్రౌండ్‌ స్కోర్‌ పూర్తి కాకపోవడంతో..బీజీఎం కోసం తమన్‌ని రంగంలోకి దించారు. పాటలు దేవిశ్రీ.. బీజీఎం తమన్‌ అందించబోతున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే డీఎస్పీ ఫ్యాన్స్‌ మాత్రం నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఫైర్‌ అవుతున్నారు. దేవిశ్రీ కంటే గొప్ప సంగీతం ఇంకెవరు అందించలేరని.. నిర్మాణ సంస్థ తప్పుడు నిర్ణయం తీసుకుందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Priyanka Chopra Face Tough Time with Pregnancies before Malti Birth4
ప్రెగ్నెన్సీ కష్టాలు చూశా.. తనే నా మిరాకిల్‌ బేబీ: ప్రియాంక

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్‌ నిక్‌ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరీ జన్మించింది. అయితే పుట్టినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోగా ఆమెకు రక్తమార్పిడి చేయాల్సి వచ్చింది. పొత్తిళ్లలో ఎత్తుకుని నవ్వులు పంచాల్సిన చిన్నారి ఆపరేషన్‌ థియేటర్‌లో పోరాడుతుంటే ప్రియాంక దంపతుల మనసు తల్లడిల్లిపోయింది. కానీ, వీరి ప్రార్థనలు ఫలించి మాల్తీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చింది. మిరాకిల్‌ బేబీఆనాటి సంగతులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ప్రెగ్నెన్సీలు కలిసిరాలేదు. చాలా కష్టాలు చూశాను. అప్పుడు నాకు (సరోగసి ద్వారా) మిరాకిల్‌ బేబీ పుట్టింది. తను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మరుక్షణం నాకింక ఏమీ కనిపించలేదు. సమస్తం ఆగిపోయినట్లే అనిపించింది. మాల్తీ ఏం చేస్తుందో? కాకపోతే తనగురించి ఎప్పటికీ భయపడుతూనే ఉంటాను. తను స్కూల్‌లో ఉన్నా.. నేను వేరే దేశంలో ఉన్నా.. మాల్తీ ఏం చేస్తుందో? ఎలా ఉందో? అని నా గుండె తనకోసమే కొట్టుకుంటూ ఉంటుంది. తను జోక్స్‌ చెప్తుంది, గొంతెత్తి పాడుతుంది. నన్ను, నా భర్తను, మా కుటుంబం మొత్తాన్ని ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటుంది. నా జీవితంలో తనే గొప్ప బహుమతి. నా ఆలోచనంతా తన చుట్టూనే..తను వచ్చాకే నా ప్రాధాన్యతలన్నీ మారిపోయాయి. మొదటి, చివరి ఆలోచన తన గురించే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రియాంక ఇటీవలే ద బ్లఫ్‌ అనే హాలీవుడ్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వారణాసి అనే సినిమా చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.చదవండి: కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!

Devi Sri Prasad Fans Fires On Mythri Movie Makers And Ustad Bhagat Singh Director Harish Shankar5
దేవిశ్రీ ప్రసాద్‌కి అవమానం.. ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌!

సంగీతం దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ టాలెంట్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు, మ్యూజిక్‌ లవర్స్‌కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడీ అయినా.. ఐటమ్‌ సాంగ్‌ అయినా డీఎస్పీ తర్వాతే ఎవరైనా..అనేలా మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తాడు. ఆయన సంగీతం వల్లే కొన్ని చిత్రాలు హిట్‌ అయ్యాయి. అలాంటి సంగీత దర్శకుడిని అవమానించారంటూ మైత్రీ మూవీస్‌ సంస్థతో పాటు దర్శకుడు హరీశ్‌శంకర్‌పై డీఎస్పీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం విషయంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణం.డీఎస్పీ అవుట్‌..తమన్‌ ఇన్‌పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. మార్చి 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్‌ అయ్యాయి. బ్యాగ్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించడంలో బిజీ అయ్యాయని ఓ ఈవెంట్‌లో స్వయంగా దేవిశ్రీనే చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ మూవీకి బీజీఎం తమన్‌ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిది.Two stalwart musicians join hands for PSPK ❤‍🔥#UstaadBhagatSingh songs by @ThisisDSP & the background score by @MusicThaman are going to be a treat 💥💥This will be a grand celebration and a lifetime memory for fans ❤️POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/060Vz0ONFK— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2026రెండోసారి..మైత్రీ మూవీ మేకర్స్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మధ్య గ్యాప్‌ వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పుష్ప 2 రిలీజ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు కూడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం వేరే సంగీతం దర్శకులను రంగంలోకి దించారు. ఇప్పుడు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ విషయంలోనూ అదే చేశారు. రిలీజ్‌కి 20 రోజుల ముందు బీజీఎం తమన్‌ చేస్తున్నట్లు ప్రకటించి, షాక్‌ ఇచ్చారు. Request💔:#DeviSriPrasad #DSP @ThisIsDSP Garu #UstaadBhagatSingh & Future Films,Any Projects solo Gane Cheyandi Songs & BGMs. Duo & Collaboration Chesedhi Talent Vallu. Miku Avasaramledhu. Dayachesi Encourage Kuda Cheyodhu 🙏.Also Any Productions@MythriOfficial,@UBSTheFilm pic.twitter.com/fRwbgMZUGj— DSP & Harris jayaraj🎶 (@entertynmentfan) March 4, 2026వర్క్‌ నచ్చలేదా?ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం గురించి గతంలో దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బీజీఎం ఆల్మోస్ట్ అయిపోయిందని అన్నారని, మరి ఇప్పుడు తమన్ ను తీసుకోవడం ఏంటీ అని డీఎస్పీ ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. వర్క్‌ నచ్చలేదా? లేదా దేవిని అవమానించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇకపై మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సినిమాలు చేయొద్దు అంటూ దేవికి విజ్ఞప్తి చేస్తున్నారు. Why so much negitivity on #Devisriprasad, todays generation kids dont know the value of him. Anyhow people more interested on copycat only not with the original composers..#DSP— Tanneru Ravi Teja (@rav4467) March 5, 2026

Bigg Boss 17 Anurag Dobhal about Family Torture, This is my last video6
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!

ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా? అంతమాత్రానికే ఇలా నాకు నరకం చూపించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు యూట్యూబర్‌, హిందీ బిగ్‌బాస్‌ 17 ఫేమ్‌ అనురాగ్‌ దోభల్‌. కులాంతర వివాహం చేసుకున్న కారణంతో తన కుటుంబం తనను వెలేసిందని, ఇక తనకు చావే దిక్కని వాపోయాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.చిన్నప్పటినుంచి కష్టాలు'గత కొన్నినెలలుగా నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీవితం ఇంత దుర్భరంగా మారుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. 14 ఏళ్ల వయసులోనే నాకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. ఆ తర్వాత నా పేరెంట్స్‌ వారికి నచ్చిందే చదవాలని నాపై బలవంతం చేశారు. నేనేమో నా కలల్ని నిజం చేసుకోవడం కోసం డబ్బు కూడబెట్టేందుకు కష్టపడ్డాను. ట్యూషన్స్‌ చెప్పాను. నాకన్నా నా పేరెంట్స్‌ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను.పెళ్లి ఇష్టం లేదుసోషల్‌ మీడియా ద్వారా రితిక అనే అమ్మాయిని కలిశాను. తను నా అభిమాని అని పేర్కొంటూ రెండుమూడేళ్లపాటు మెసేజ్‌లు చేసింది. అలా ఒకరోజు ఆమె మెసేజ్‌కు రిప్లై ఇచ్చాను. అలా తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరం రెండేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేడుకకు రామని చెప్పేశారు. ఎంతగానో బతిమాలాను. బంధువులందరి ముందు చేతులెత్తి వేడుకున్నాను. వార్నింగ్‌కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగాను. అయినా వారి మనసు కరగలేదు. మేము సంతోషంగా లేము, మిమ్మల్నీ సంతోషంగా ఉంచము అని వార్నింగ్‌ ఇచ్చారు. మమ్మల్ని టార్చర్‌ పెట్టారు. నా దగ్గరున్నదంతా లాక్కున్నారు. పెళ్లయ్యాక ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వలేదు. చచ్చిపోవాలనుకున్నాను. నాకేదైనా అయితే అందుకు నా ఇంట్లోవాళ్లే కారణం.బోరుమని ఏడ్చిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ఇప్పుడు రితిక కూడా నన్ను వదిలేసింది. నేను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాను. ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ వీడియో తర్వాత నేను కనిపించనేమో! ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. కానీ బయటవాళ్లు చెప్పిందే నమ్మారు. నన్ను దూరం పెట్టారు. నేను చనిపోయాక అయినా నా బిడ్డను ఆదరించండి అని బోరుమని ఏడ్చాడు. ఇదే తన చివరి వ్లాగ్‌ అని అనురాగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అనురాగ్‌ భార్య గతేడాది సెప్టెంబర్‌లో గర్భం దాల్చింది.చదవండి: చిరంజీవి సినిమాలో యాక్ట్‌ చేస్తున్నా: బండ్ల గణేశ్‌

Police Complaint Movie Latest Update7
నవీన్‌ చంద్ర, వరలక్ష్మి శరత్ కుమార్‌లతో ప్రేమ పాట

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీసు కంప్లెంట్‌’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీలోని బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ‘ప్రేమ ఓ ప్రేమ’ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు లాంచ్ చేశారు. ఈ పాట‌ అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది."ప్రేమ ఓ ప్రేమ" పాటకు సంగీతం సుధాకర్ మారియో సమకూర్చారు. ఈ పాట యూత్‌కు బాగా న‌చ్చుతుంద‌ని, ట్రెండింగ్‌గా నిలిచిపోతుంద‌ని, సూప‌ర్ హిట్ ల‌వ్ సాంగ్స్‌ల్లో ఈ పాట కూడా చోటు ద‌క్కించుకుంటుంద‌ని దర్శకుడు సంజీవ్ మేగోటి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్టు తెలిపారు.యాక్షన్, కామెడీ, రొమాన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

Bandla Ganesh Says He Is Acting In Chiranjeevi Movie8
చిరంజీవి సినిమాలో యాక్ట్‌ చేస్తున్నా: బండ్ల గణేశ్‌

బండ్ల గణేశ్‌ మొదట నటుడిగానే అందరికీ పరిచయం. ఆ తర్వాత ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారాడు. తీన్మార్‌, గబ్బర్‌ సింగ్‌, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్‌ వంటి పలు చిత్రాలు నిర్మించాడు. దాదాపు దశాబ్దకాలంగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆయన ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. బీజీ బ్లాక్‌బస్టర్స్‌ పేరుతో రెండో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.అంత టైం లేదుతాజాగా ఈయన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రయూనిట్‌తో ప్రత్యేకంగా సంభాషించాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్‌ చేసే సమయం లేదు. నాదగ్గర వెయ్యి మంది పని చేస్తున్నారు. నేను షూటింగ్స్‌కు వెళ్లి యాక్టింగ్‌ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యాపారం దెబ్బతింటుంది. చిరంజీవి సినిమాలో..కాకపోతే నా మనసుకు నచ్చి ఈ వేషం నేను వేయాల్సిందే అనిపించిన రోల్స్‌ మాత్రం స్వీకరిస్తాను. ఇప్పుడు చిరంజీవి సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాను. నాకు ఓ వేషం వేయాలని కోరిక ఉంది. అది నా బ్యానర్‌లోనే నిర్మించి ఆ రోల్‌ నేనే చేస్తాను, కచ్చితంగా సూపర్‌ హిట్‌ కొడతాను అని బండ్ల గణేశ్‌ చెప్పుకొచ్చాడు. కాగా చిరంజీవి- బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనే బండ్ల గణేశ్‌ యాక్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: విజయ్‌ సేతుపతికి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

Anantha Sriram about Rai Rai Raa Raa Song from Peddi Movie9
'రైరై రారా' పాట రాసేందుకు 2 నెలలు: అనంత శ్రీరామ్‌

ఒక మంచి పాట రాయడం, మాస్‌ పాట రాయడం అనేది కష్టం కాదు. కానీ, పెద్ది సినిమా కోసం రై రై రా రారా.. పాటలో మాస్‌ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం అనేది కత్తిమీద సాములా అనిపించింది. రెహమాన్‌ గారి బాణీ అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ పాట రాయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది అని పాటల రచయిత అనంత శ్రీరామ్‌ తెలిపారు.పెద్ది సెకండ్‌ సాంగ్‌రామ్‌చరణ్‌ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి రై రై రారా.. అంటూ సాగే రెండో పాటను మార్చి 2న విడుదల చేశారు.అదే జరిగితే..ఈ పాట రికార్డ్‌ బ్రేకింగ్‌ వ్యూస్‌తో టాప్‌ వన్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ పాట రాసిన అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ.. రామ్‌చరణ్‌గారి రుద్రతాండవం, రెహమాన్‌ గారి ధీర శంఖారావం, రత్నవేలుగారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ.. వీటన్నిటి మధ్యలో నుంచి కూడా రై రై రారా.. పాటలోని లిరిక్స్‌ బాగున్నాయి అనడం.. సాహిత్యానికి ప్రశంసలు రావడం ఆనందాన్నిచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లు ఆ ఆలోచన విరమించుకునేలా నా పాట స్ఫూర్తి నింపితే నా రచన సార్థకమైనట్లే అని చెబుతుంటాను. ఆ లక్షణం ఈ పాటకు ఉంది అని చెప్పాడు.

Buzz: Shraddha Kapoor Star Alongside with Vijay Sethupathi10
విజయ్‌ సేతుపతికి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!

చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్‌ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్‌ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్‌ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.బాలీవుడ్‌ బ్యూటీవిడాముయుర్చి ఫేమ్‌ మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్‌ సేతుపతికి జంటగా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!

Advertisement
Advertisement