Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Yamini Er Queen Movie Glimpse 1
తెలుగు హీరోయిన్‌గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్

సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న యామినీ ఈఆర్.. టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'క్వీన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు.తను ప్రేమించిన వ్యక్తి కలని నిజం చేస్తూ, అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే మూవీలో కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్. ఈ మూవీలో కీలకమైన తండ్రి పాత్ర కోసం 90స్ హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.

Tusshar Kapoor Recalls becoming Single Dad through IVF, Surrogacy Journey2
పెళ్లి చేసుకోకుండానే తండ్రినయ్యా.. ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా!

యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోయినా సరే.. కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోనని మొండిగా కూర్చున్నాడు ప్రముఖ నటుడు జితేంద్ర కుమారుడు, నటుడు తుషార్‌ కపూర్‌. అయితే పెళ్లికి విరుద్ధమే కానీ, తండ్రవడానికి కాదని సింగిల్‌ పేరెంట్‌ అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా తండ్రయిన తొలి బాలీవుడ్‌ సెలబ్రిటీగా గుర్తింపు పొందాడు. తాజాగా ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.అక్కడే నేర్చుకున్నా..తుషార్‌ కపూర్‌ మాట్లాడుతూ.. మా నాన్నలాగే నేను కూడా పాతకాలం మనిషిని. కాకపోతే ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు కాస్త భిన్నంగా ఉండేవి. ఐదేళ్లు అమెరికాలో ఉండటం వల్ల ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నాను. పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఓ బిడ్డకు తండ్రయ్యాను. మా నాన్న అలా కాదు. తను పెళ్లిని గౌరవిస్తాడు. కుటుంబ బంధాలను నమ్ముతాడు.40 ఏళ్లకు తండ్రినయ్యా..నేను కాస్త మొహమాటస్తుడినే. ఎక్కువగా బయట కూడా తిరగను. అయితే ఒక పిల్లవాడిని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. 40 ఏళ్ల వయసులో తండ్రయ్యాను. తండ్రవడానికి అదే సరైన సమయం అని భావిస్తాను. మన సమాజం మాత్రం 25 ఏళ్లకే పెళ్లి, పిల్లలు అని గోల మొదలుపెడుతుంది. నేను కూడా పెళ్లిని గౌరవిస్తాను, నమ్ముతాను. కానీ ఎందుకో అది నాకు సూటవదనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు.ఆ జర్నీ వల్లే..39 ఏళ్ల వయసులో ఓసారి తిరుపతికి వెళ్లాను. అప్పుడే నటుడు, నిర్మాత ప్రకాశ్‌ జాను కలిశాను. తిరుపతి నుంచి తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు మా విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇద్దరం కాసేపు కూర్చుని కాలక్షేపం చేశాం. అప్పుడే అతడో మాటన్నాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ సింగిల్‌ పేరెంట్‌ అవొచ్చుగా.. అదొకసారి ఆలోచించు అన్నాడు. అతడి కుటుంబంలో ఒక అమ్మాయి ఇలాగే సింగిల్‌ పేరెంట్‌ అయిందని తెలిపాడు.సినిమావెంటనే నాక్కూడా ఓ బిడ్డ కావాలనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పటికప్పుడు అన్నీ తెలుసుకుని, ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు. చివరకు ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా తండ్రినయ్యాను అని తుషార్‌ చెప్పుకొచ్చాడు. తుషార్‌ కపూర్‌.. ముజే కుచ్‌ కెహ్నా హై, గాయబ్‌, గోల్‌మాల్‌, గోల్‌మాల్‌ రిటర్న్స్‌, షోర్‌ ఇన్‌ ద సిటీ, ద డర్టీ పిక్చర్‌, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'వెల్‌కమ్‌ టు ద జంగిల్‌' మూవీ చేస్తున్నాడు.చదవండి: సూర్య-జ్యోతిక ప్రేమను ఒప్పుకోని హీరో తండ్రి

Rayudi Gari Thaluka Movie Trailer3
'రాయుడు గారి తాలూకా' ట్రైలర్

'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ దర్శకుడు కల్యాణకృష్ణ చేతులు మీదుగా 'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ విడుదలైంది. హీరో కమ్ నిర్మాతగా ఉలిశెట్టి శ్రీనివాస్ చేశారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం, కుటుంబ విలువలు తెలిపే సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కానుందని అన్నారు.

Vikram Bhatt owes lakhs to 1920, make up artist alleges she was asked to work for free4
అడుక్కుంటున్నా పట్టించుకోవట్లే.. హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత విక్రమ్‌ భట్‌ ఆర్థిక మోసం కేసులో చిక్కుకున్నాడు. దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రమ్‌ దంపతులను పోలీసులు ఇటీవలే అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో విక్రమ్‌, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ ఏమందంటే?ఇదే సమయంలో పలువురు ఆర్టిస్టులు విక్రమ్‌ తమకు సరిగా జీతాలివ్వలేదని ముందుకొస్తున్నారు. 2023లో వచ్చిన 1920: హారర్స్‌ ఆఫ్‌ ద హార్ట్‌, ఖిలోనా (ఇది మధ్యలోనే ఆగిపోయింది) సినిమాలకు టెక్నీషియన్లకు డబ్బు చెల్లించలేదని పలువురు మీడియా ముందుకొచ్చారు. తాజాగా హీరోయిన్‌ అవికాగోర్‌కు మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసిన స్నేహ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.స్పందన లేదుమిడ్‌డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ శర్మ మాట్లాడుతూ.. 1920: హారర్స్‌ ఆఫ్‌ ద హార్ట్‌ సినిమాకు పని చేసిన చాలామందికి పూర్తి వేతనాలు చెల్లించలేదు. మా జీతాలు మాకు చెల్లించమని అడుక్కుంటున్నాం.. కానీ విక్రమ్‌ భట్‌ టీమ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఒక హెయిర్‌స్టైలిస్ట్‌కి అయితే ఇంటి అద్దె కట్టకపోవడంతో అతడిని ఇంటినుంచి గెంటేసే పరిస్థితి వచ్చింది. మొదట్లో మాకు సమయానికి డబ్బు చెల్లించారు.సగమే ఇచ్చి..కానీ రెండో షెడ్యూల్‌కు వచ్చేసరికి నిధులు లేవన్నారు. ఓపక్క డబ్బు లేదంటూనే మరో పక్క కొత్త సినిమాను కూడా మొదలుపెట్టారు. 1920 మూవీ కోసం నాకు రోజుకు రూ.18 వేల లెక్కన డీల్‌ మాట్లాడుకున్నాను. అయితే అందులో నాకు సగమే ఇచ్చారు. విక్రమ్‌ భట్‌ కూతురు కృష్ణ భట్‌ను అడిగితే ఆ లెక్కలేవీ తనకు తెలియదంది. పైగా మరికొన్ని రోజులు ఉచితంగా పని చేయమని కోరింది.పైసా ఇవ్వడుడబ్బు ఇవ్వకపోతే నేనెందుకు పని చేస్తానని కరాఖండిగా రానని చెప్పేశాను. దాంతో మరో మేకప్‌ ఆర్టిస్ట్‌తో ఉచితంగా పని చేయించుకున్నారు అని చెప్పుకొచ్చింది. విక్రమ్‌ భట్‌ మనమంతా ఒకే కుటుంబం అని సెంటిమెంట్‌ డైలాగ్‌ చెప్పి అందరితో ఇలాగే పని చేయించుకుంటాడని, డబ్బు మాత్రం సరిగా ఇవ్వడని పలువురు సిబ్బంది వాపోయారు. కొందరికైతే లక్షలు ముట్టాల్సింది ఉందని, అవేవీ ఇవ్వకుండా మోసం చేశాడంటున్నారు.చదవండి: సూర్య -జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు: హీరో తండ్రి

Allu Sirish Wife Nayanika Valentines Day Video5
కాబోయే భార్యకు ముద్దుపేరు.. వాలంటైన్స్ డే వీడియో

అల్లు వారి కుటుంబంలో పెళ్లి హడావుడి మొదలైపోయింది. బన్నీ సోదరుడు శిరీష్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనికతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. రెండు రోజుల క్రితమే పసుపు దంచుడు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని శిరీష్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమకథ గురించి, కాబోయే భార్యతో క్యూట్ మూమెంట్స్ ఉన్న వీడియోని షేర్ చేశాడు.శిరీష్.. తనకు కాబోయే భార్య నయనికకు 'క్యూటేష్' అనే ముద్దుపేరు పెట్టుకున్నాడు. వీడియోలో అదే విషయాన్ని చూపించాడు. ప్రపంచం తమని కలిపిందని చెప్పుకొచ్చాడు. పారిస్ వీధుల్లో కొన్ని రొమాంటిక్ క్షణాల్ని చూపించడంతో పాటు నిశ్చితార్థానికి సంబంధించిన విజువల్స్‌ని చూపించాడు. ఇకపోతే మార్చి 6న శిరీష్-నయనిక పెళ్లి జరగనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)

Is Bollywood Uncomfortable With Allu Arjun Growth6
బన్నీని చూసి బాలీవుడ్‌ రగిలిపోతోందా?

‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత, దక్షిణాది నటుల్లో ఎవరికీ రానంత దేశవ్యాప్త క్రేజ్‌ అల్లు అర్జున్‌కి రావడం, జవాన్‌ సినిమా తీసిన అట్లీ తన రెండో సినిమాకి ఎంచుకోవడం...అలాగే బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొణే వంటి స్టార్స్‌తో బన్నీ కలిసి నటించనుండడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ బాలీవుడ్‌లో కొందరికి ముప్పుగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్నకు కొందరు సినీ పెద్దలు అవుననే సమాధానమే చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం అటు టాలీవుడ్‌ ఇటు బాలీవుడ్‌లో సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్‌ సంఘటన తర్వాత అల్లు అర్జున్‌ ఎదుర్కున్న పరిణామాలు తను కొందరు ప్రముఖులకు టార్గెట్‌గా మారాడనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాయి. తాజా పరిణామాల నేపధ్యంలో బన్నీ ని ఈ సారి వేరే రకంగా టార్గెట్‌ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివాదమా? బాలీవుడ్‌ వ్యూహమా?ఇండియన్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఓ బ్రాండ్‌ స్ట్రాటజిస్ట్‌ అల్లు అర్జున్ ను కలవాలంటే ఏకంగా 42 కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందులో కళ్లలోకి చూడకూడదు, చేతులు కలపకూడదు వంటి ఆంక్షలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ కావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫలితంగా అల్లు అర్జున్‌ పేరు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, నిజంగానే ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అని కొందరిలో సందేహాలు వ్యక్తమవడం సహజమే.అయితే అదే సమయంలో కొందరు ఇది అల్లు అర్జున్‌ పెరుగుతున్న పాన్ ఇండియా క్రేజ్‌ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలను కావాలనే పెద్దవిగా చేసి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ఇలా టాలీవుడ్‌ స్టార్స్‌పై వ్యతిరేక ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల భారీ విజయం తర్వాత ప్రభాస్‌ కూడా ఇలాంటి విమర్శలు, నెగెటివ్‌ ప్రచారం చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ ఆదరణ పొందిన దక్షిణాది నటులు ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందన..తమపై పడిన వివాదంపై అల్లు అర్జున్‌ టీమ్‌ వెంటనే స్పందించి వైరల్‌ అవుతున్న ఆరోపణలు అసత్యమని, ఆధారంలేనివని స్పష్టం చేసింది. అల్లు అర్జున్‌ ఎప్పుడూ గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నదని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. ఈ ఉదంతంపై తగినంత కూపీ లాగి కుట్రలపై ఆధారం దొరికిన తర్వాతే అల్లు టీమ్‌ ఇలా చెప్పి ఉంటుందనేది నిస్సందేహం. అంతేకాదు అల్లు అర్జున్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. తద్వారా ఇకపై కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అల్లు అండ్‌ కో భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో కలిసి రెండు భాగాలుగా రూపొందనున్న ఓ భారీ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. , అల్లు అర్జున్‌ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కుట్రలలో ఆరితేరిన చరిత్ర ఉన్న కొన్ని బాలీవుడ్‌ మీడియా సంస్థల విషయంలో అల్లు అర్జున్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

Sivakumar Says He Denied Suriya Love with Jyothika7
సూర్య- జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు!: హీరో తండ్రి

ప్రేమించడం ఈజీయేమో కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మాత్రం కొంత కష్టమైన పనే! కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సూర్య- జ్యోతిక ప్రేమాయణం హీరో తండ్రి, నటుడు శివకుమార్‌కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ సూర్య పట్టుపట్టి సాధించి, ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ విశేషాలను శివకుమార్‌ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.జీవితాంతం ఒంటరిగానే..శివకుమార్‌ మాట్లాడుతూ.. మొదట్లో సూర్య ప్రేమను నేను ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానన్నాడు. వెంటనే నాకు నేను నటించిన 150 సినిమాలు కళ్లముందు కదిలాయి. అందులో చాలావరకు ప్రేమకథలే ఉన్నాయి. దీంతో వెంటనే అతడి ప్రేమను అంగీకరించాను.ఎలా ఉండేవాడు?వాడు మొదట్లో చాలా బిడియంగా ఉండేవాడు. రాధికా శరత్‌కుమారే వాడిని జ్యోతికతో మాట్లాడించింది. అలా మొదలైన మాటలు తర్వాత ప్రేమకు దారితీశాయి. ఎంతో మొహమాటంతో ఉండే వీడేనా ఈరోజు ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని శివకుమార్‌ సరదాగా చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లిసూర్య, జ్యోతిక అనేక సినిమాల్లో కలిసి నటించారు. 'పూవెల్లం కేట్టుప్పార్‌' మూవీ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ 2006 సెప్టెంబర్‌ 11న పెళ్లితో మరింత బలపడింది. ఈ దంపతులకు కూతురు దియా, కుమారుడు దేవ్‌ సంతానం. సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం 'కరుప్పు' సినిమా చేస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. అలాగే హీరోయిన్‌ నజ్రియాతో సూర్య మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: కొడుకు- కోడల్ని అభినందించిన మెగాస్టార్‌

Seetha Payanam Movie Review And Rating In Telugu8
‘సీతా పయనం’ మూవీ రివ్యూ

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ‘సీతా పయనం’. ముందుగా ఈ చిత్రంలో హీరోగా విశ్వక్‌ సేన్‌ అనుకున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్‌ పాల్గొన్నాడు. కానీ షూటింగ్‌కి కొద్ది రోజుల ముందు ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతొ విశ్వక్‌ ప్లేస్‌లో కన్నడ స్టార్‌ ఉపేంద్ర సోదరుడి కొడుకు నిరంజన్‌ని హీరోగా పెట్టి ఈ సినిమా తెరకెక్కించాడు అర్జున్‌. కూతురు డెబ్యూ ఫిల్మ్‌ అవ్వడంతో ప్రమోషన్స్‌ భారీగా చేశాడు.మొత్తానికి రిలీజ్‌కి ముందే సీతా పయనంపై హైప్‌ అయితే క్రియేట్‌ అయ్యేలా చేశారు. మంచి అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వైజాగ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్‌(సత్య రాజ్‌)కి కూతురు సీత(ఐశ్వర్య అర్జున్‌) అంటే ప్రాణం. తల్లి లేకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. కూతురికి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరుతుందని భావిస్తాడు. కానీ సీతకు మాత్రం పెళ్లి అంటే నచ్చదు. పెళ్లి టాపిక్‌ తీసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఓ రోజు వర్క్‌ షాప్‌ కోసం వైజాగ్‌ నుంచి తన కారులో హైదరాబాద్‌కి బయలు దేరుతుంది. మార్గ మధ్యలో అభి(నిరంజన్‌) పరిచయం అవుతాడు. తనతో కలిసి చేసే ప్రయాణంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవేంటి? ఆ సంఘటనల వల్ల సీతలో వచ్చిన మార్పు ఏంటి? సీత ప్రయాణంలో గిరి(అర్జున్‌), బసవన్న(ధృవ్‌ సర్జా) ఎలా భాగమయ్యారు? పెళ్లే వద్దనుకున్న సీత..చివరకు అభితో ప్రేమలో ఎలా పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సీతా పయనం కొత్త కథేమీ కాదు. మనం ఇంత వరకు ఎన్నో సార్లు, ఎన్నో సినిమాల్లో చూసిన విషయాలతోనే అర్జున్ ఈ మూవీని తెరకెక్కించాడు. ప్రస్తుత తరం మరిచిపోతోన్న విలువల్నిఈ కథ ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. మన హైందర ధర్మంలో పెళ్లికి ఉన్న గొప్పదనం చర్చిస్తూనే.. . తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత సంస్కారంతో పెద్ద చేయాలి.. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి అనే విషయాలను గొప్పగా చూపించారు. వీటితో పాటు గో రక్షణ గురించి ఓ ఎపిసోడ్‌ని యాడ్‌ చేశారు. ఈ సినిమాలో ఉన్న మరో గొప్పదనం ఏంటంటే.. ఇందులో అందరూ మంచి వాళ్లే. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఒకటి, రెండు పాత్రలు కూడా ఒక్క సీన్‌తో మంచి వాళ్లు అయిపోతాయి. ఇదంతా చెప్పుకోవాడానికి బాగానే ఉన్నా.. తెరపై చూస్తుంటే మాత్రం అంత రక్తి కట్టించదు. ఎలాంటి మలుపులు, ట్విస్టులు లేకుండా ‘సీతా పయనం’ చాలా సాఫీగా సా..గుతుంది. ఇచ్చిన సందేశం మంచిదే కానీ.. కూర్చొబెట్టి హితబోధ చేసినట్లుగా అనిపిస్తుంది.తండ్రి కూతురు బాండింగ్‌ని చూపిస్తూ కథ ప్రారంభించాడు దర్శకుడు. కూతురుకి పెళ్లి చేయాలని తండ్రి.. పెళ్లి టాపిక్‌ వస్తేనే ఏదో ఒకటి చెప్పి డైవర్ట్‌ చేసే కూతురు..మొదటి పది నిమిషాల కథంతా ఇలానే రొటీన్‌గా ఉంటుంది. ఇక సీత వర్క్‌ షాప్‌ కోసం హైదరాబాద్‌కి బయలుదేరినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. మార్గ మధ్యలో అభి పరిచయం అవ్వడం.. గిరి పాత్ర ఎంట్రీ.. ఆ తర్వాత కొన్ని సంఘటనలు ఇవన్నీ మొదట రొటీన్‌గానే అనిపించినా.. ఇంటర్వెల్‌ తర్వాత ఆయా సన్నివేశాల వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. ఫస్టాఫ్‌ మొత్తం వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కి సీత ప్రయాణం ఉంటే.. సెకండాఫ్‌ రిటర్న్‌ జర్నీ ఉంటుంది. ధృవ్‌ సర్జా ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్‌ భావోద్వేగానికి గురి చేస్తుంది. కొత్తదనం ఆశించకుండా, ఫ్యామిలీతో కలిసి ఓపికతో ఫీల్‌ గుడ్‌ మూవీ చూడాలనుకునేవారిని ‘సీతా పయనం’ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఎవరెలా చేశారంటే..సీత పాత్రలో ఐశ్వర్య ఒదిగిపోయింది. ఆమె ఆహార్యం, హావభావాలు, మాట తీరు అన్నీ కూడా ఆడియెన్స్‌ని ప్రేమలో పడేస్తాయి. ఆమెని చూస్తే ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. అయితే డబ్బింగ్‌ విషయం ఇంకాస్త కేర్‌ తీసుకుంటే బాగుండేదేమో. ఇక అభి పాత్రకు నిరంజన్ న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ఓ చిన్న ట్విస్ట్‌ సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్లని కూడా బాగానే చేశాడు. ఇక హీరోయిన్‌ తండ్రిగా సత్యరాజ్‌ రెగ్యులర్‌ పాత్రను చేశాడు. హీరో తాతా, ఊరి పెద్దగా ప్రకాశ్‌ రాజ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇలాంటి పాత్ర ఆయన కొత్తేమి కాదు. బిత్తిరి సత్తి రెండు, మూడు చోట్ల కనిపించి, నవ్విస్తాడు. అర్జున్ సర్జా ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ధృవ్ సర్జా బ్లాక్, అక్కడ చెప్పిన సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రధారులందరూ కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ నుంచి మంచి పాటల్ని, బీజీఎంని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, సెట్ వర్క్ బాగానే కుదిరింది. కూతురు కోసం నిర్మాతగా మారిన అర్జున్‌.. ఈ సినిమాకు బాగానే ఖర్చు చేశాడు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. - రేటింగ్‌ : 2.75/5

Roshan Meka Emo Emo Idi Movie Glimpse9
శ్రీకాంత్ కొడుకు రొమాంటిక్ కామెడీ సినిమా.. వీడియో రిలీజ్

'హిట్' ఫ్రాంచైజీ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అన్నీ థ్రిల్లర్సే తీశాడు. ఇప్పుడు రూటు మార్చి తొలిసారి ఓ ప్రేమకథని తెరకెక్కిస్తున్నాడు. అదే 'ఏమో ఏమో ఇది'. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో కాగా ప్రీతి ముకుందన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ బ్రీజ్ పేరిట సినిమా కాన్సెప్ట్ ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు.సింగల్ మదర్ పెంపకంలో పెరిగే అభయ్(రోషన్).. ఓ కెఫే యజమాని అయిన అపూర్వ(ప్రీతి ముకుందన్)తో ఎలా ప్రేమలో పడ్డాడు? ఈ జర్నీలో ఏమేం జరిగింది? అనేది సినిమా స్టోరీలా అనిపిస్తుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరాకే థియేటర్లలోకి మూవీ వస్తుందని ప్రకటించారు. గతంలో 'పెళ్లి సందD', 'ఛాంపియన్' చిత్రాలు చేసిన రోషన్.. వాటితో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈసారి ఏం చేస్తాడో చూడాలి?

Roshan And Sridevi Band Melam Movie Latest Glimpse10
చిన్నప్పటి నుంచి తను నా పెళ్లాం అనుకున్నారా!

'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన జంట శ్రీదేవి-రోషన్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 13వ తేదీన థియేటర్లలోకి రానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. బ్రేకప్ అయినప్పుడు హీరో బాధపడుతున్నట్లు ఇందులో చూపించారు.'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఇది తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. సతీష్ జవ్వాజి దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించాడు. మరి రోషన్-శ్రీదేవి ఈసారి ఏం చేస్తారో చూడాలి? గ్లింప్స్‌లో ఎమోషన్ చూపించినప్పటికీ.. హీరో, తన ఫ్రెండ్‌కి తాళి కట్టడం ఫన్నీగా అనిపించింది.

Advertisement
Advertisement