Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Mohan Babu As Venkatappayya Naidu In Srinivasa Mangapuram Movie, First Look Released1
ఘట్టమనేని జయకృష్ణ సినిమాలో మోహన్‌ బాబు.. లుక్‌ అదిరింది!

‘ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే బాలీవుడ్‌ నటి రాషా తడాని తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వినీదత్‌ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో ఆయన ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పాత్రలో నటిస్తున్నాడు.ఈ పోస్టర్‌లో మోహన్ బాబు సాధారణ తెల్లటి కుర్తా-ధోతీ ధరించి పవర్ ఫుల్‌గా, గంభీరంగా కనిపిస్తున్నాడు. పోస్టర్‌ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మోహన్‌ బాబు నటించినట్లు తెలుస్తుంది. చాలాకాలం తర్వాత మోహన్‌ బాబు మళ్లీ ఇలాంటి పాత్రలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌​‍’లోనూ మోహన్‌ బాబు విలన్‌గా నటిస్తున్నాడు. Introducing the Legendary @themohanbabu garu as “VENKATAPPAYA NAIDU” from #SrinivasaMangapuram❤️‍🔥Brace yourselves for his towering performance in a role carved with power and pride💥An @DirAjayBhupathi Film 🔥 pic.twitter.com/JvGBr9JGg4— Chandamama Kathalu Pictures (@CKPicturesoffl) February 28, 2026

Bigg Boss Fame Thanuja Puttaswamy Strong Counter to Haters2
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ

బిగ్‌బాస్‌ షో వల్ల పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. వాళ్లు ఏం చేసినా, చేయకపోయినా ట్రోలింగ్స్‌ బారిన పడుతూ ఉంటారు. వారికి సంబంధం లేని విషయాల్లో కూడా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల పేరు ఇరికించి విమర్శిస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ రన్నరప్‌, నటి తనూజ విషయంలో ఇదే జరిగింది.తనూజ కోసం నిలబడ్డ పవన్‌'ముద్ద మందారం' సీరియల్‌తో ఫేమస్‌ అయిన తనూజకు ఆ సీరియల్‌ నటీనటులతో మంచి అనుబంధం ఉంది. ముద్ద మందారం సీరియల్‌ హీరో పవన్‌ సాయి కూడా తనకు మంచి మిత్రుడు. తనూజ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసం స్టేజీపైకి కూడా వచ్చాడు. అయితే పవన్‌ విడాకులకు తనూజయే కారణమని కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.ఉసురు తగులుతుందితాజాగా తనూజ తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేయగా ఓ నెటిజన్‌ పవన్‌ సాయి విషయాన్ని ప్రస్తావించాడు. పవన్‌ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు, ఆమె ఉసురు నిన్ను వెంటాడుతుంది అని శాపనార్థాలు పెట్టాడు. అందుకు తనూజ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. నీ కర్మ కూడా నిన్ను వెంటాడకముందే నీపై నువ్వు ఫోకస్‌ చేసుకోవడం మంచిది. నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను చాలా బాగున్నాను. నా కర్మఫలం బాగుంది కాబట్టే నా జీవితంలో అంతా మంచే జరుగుతోంది.కౌంటర్‌ ఇచ్చిన తనూజఅయినా ఇలా ముఖం కూడా చూపించకుండా ఫేక్‌ ఐడీలతో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడానికి కొంచెం కూడా సిగ్గులేదా? నీకు ఎవరి ఉసురు వెంటాడకుండా చూసుకో.. అని ఇచ్చిపడేసింది. చివర్లో తనను విమర్శించేవాళ్లకు ‍కౌంటరిచ్చింది. డియర్‌ హేటర్స్‌.. మీరు నా ప్రశాంతతని పాడు చేయలేరు. నన్ను రెచ్చగొట్టేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయినా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.చదవండి: విజయ్‌తో విడాకులు... సంగీత ఎవరో తెలుసా?

Dhurandhar 2 First Review: Yami Gautam Reveals She Has Watched Dhurandhar 23
‘ధురంధర్‌ 2’ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో అంచనాలు రెట్టింపు

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్‌’ క్రియేట్‌ చేసిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ధురంధర్‌ 2 చిత్రం కోసం యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్‌ చేసింది. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్‌ సతీమణి యామీ గౌతమ్‌ ధురంధర్‌ 2పై తన రివ్యూని ఇచ్చేసింది.భారత్‌ సమ్మిట్‌ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్‌.. తాను ఇప్పటికే ‘ధురంధర్‌ 2’ చూశానని చెబుతూ..భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్‌ 2 నేను చూసేశాను. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు. ధురంధర్‌ 2 చాలా అసాధరణమైన సినిమా. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్‌తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను’ అని యామీ గౌతమ్‌ అన్నారు.ఇక ధురంధర్‌ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్‌ 370’ షూటింగ్‌లో ఉన్నప్పుడే ‘ధురంధర్‌’ స్క్రిప్ట్ చదివాను. అది కేవలం 40 పేజీలు మాత్రమే ఉంది. కానీ చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడు కూడా ఆదిత్యకు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. కానీ నా స్పందన ఏంటో ఆయను అర్థమైపోయింది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హిస్టరీ క్రియేట్‌ చేసే సినిమా అవుతుందని ముందే ఊహించా. ధురంధర్‌ 2 అంతకు మించి ఉంటుంది’ అంటూ అంచనాలను రెట్టింపు చేసింది. మరి ధురంధర్‌ 2 ఎన్ని రికార్డులకు బద్దలు కొడుతుందో చూడాలి.

Endayya Saami Special Surprise song out from Ranabaali movie4
విజయ్‌, రష్మికలకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్న నూతనంగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు రణబాలి మూవీ నుంచి స్పెషల్‌ వీడియోను విడుదల చేసి మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. ఏందయ్య సామీ అంటూ సాగే ఒక గీతాన్ని ప్రోమోగా వదిలారు. సింగర్స్‌ శ్వేతా మోహన్, అజయ్ గోగవాలే ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటలో కొత్తగా పెళ్లైన దంపతులుగా విజయ్‌, రష్మికలు కనిపిస్తున్నారు. 1854 - 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sree Vishnu Mrityunjay movie Official Trailer5
ఎన్టీఆర్‌ విడుదల చేసిన మృత్యుంజయ్‌ ట్రైలర్‌

‘సామజవరగమన’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్‌ జంటగా నటించిన చిత్రం మృత్యుంజయ్‌.. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను దర్శకుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదల కానుంది.

Thalapathy Vijay's Wife Sangeetha Sornalingam; Do You Know Who Is She?6
విజయ్‌తో విడాకులు.. సంగీత ఎవరో తెలుసా..?

నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ దంపతులు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఆయన నుంచి విడాకులు కోరుతూ తన సతీమణి సంగీత కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈమేరకు తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో ఆమె పిటిషన్‌ వేశారు. 2021లో ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. అందుకే తనతో విడాకులు కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. సంగీత దాఖలు చేసిన పిటిషన్‌ ఏప్రిల్‌ 20న విచారణకు రానుంది.సంగీత ఎవరు..?సంగీత శ్రీలంక తమిళ మూలానికి చెందినది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో పుట్టి పెరిగిన ఆమె 1999లో విజయ్‌తో వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు ఆమె శ్రీలంక సంతతికి చెందిన బ్రిటిష్ పౌరురాలిగా గుర్తింపు పొందింది. శ్రీలంకకు చెందిన ఒక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తెగా ఆమె లండన్‌లో స్థిరపడింది. కొన్ని మీడియా నివేదికలు ఆమెను గృహిణిగా ఉన్నారని చెబుతున్నప్పటికీ.. మరికొన్ని ఆమెకు వ్యాపార రంగంలో రాణిస్తున్నారని కథనాలు ఉన్నాయి.1996లో విజయ్‌ నటించిన 'పూవే ఉనక్కగా' చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో శుభాకాంక్షలు పేరుతో రిలీజ్‌ అయింది. విజయ్‌ సినిమాలు చూసి అతడికి వీరాభిమానిగా మారిపోయిన సంగీత ఆయనను చూడటానికే 1996లో లండన్‌ నుంచి చెన్నై వచ్చింది. విశ్వప్రయత్నాలు చేసి విజయ్‌ను కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్‌ నుంచి వచ్చారా’ అని విజయ్‌ ఆశ్చర్యపోయాడు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విజయ్‌ పేరెంట్స్‌కు ఆమె బాగా నచ్చేసింది. అప్పుడప్పుడూ సంగీత తన పేరెంట్స్‌తో ఈ హీరో ఇంటికి వచ్చేది. విజయ్‌ పేరెంట్స్‌ ఆమెను పెళ్లిచేసుకోమన్నారు. ఆపై వారు చొరవ తీసుకుని సంగీతను తమ కొడుకును వివాహం చేసుకుంటారా అని అడిగారు. అలా వారిద్దరూ 1999లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఈ జంట 2000 సంవత్సరంలో తమ మొదటి బిడ్డకు, 2005లో రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత, వారి పిల్లలు విజయ్‌తో పాటు వెట్టైకారన్, తేరి వంటి చిత్రాల్లో కూడా కొద్దిసేపు తెరపై కనిపించారు. సుమారు 27ఏళ్ల తర్వాత ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోనున్నడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Spirit Poster released After aishwarya desai trending7
'స్పిరిట్‌' పోస్టర్‌తో వైరల్‌ అవుతున్న బ్యూటీ.. ఎవరో తెలుసా?

ప్రభాస్‌- సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘స్పిరిట్‌’. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను సందీప్‌ పంచుకున్నారు. ఈ మూవీలో కనిపించనున్న విలన్‌ పాత్రను ఆయన పరిచయం చేశారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ లుక్‌ను విడుదల చేశారు. అయితే, పోస్టర్‌లో ఆయనతో పాటుగా మరో అమ్మాయి కనిపిస్తుంది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.స్పిరిట్‌ పోస్టర్లో వివేక్ ఒబెరాయ్‌తో పాటుగా కనిపిస్తున్న ఆ బ్యూటీ పేరు ఐశ్వర్య దేశాయ్. ఆమె ఇండియన్ అమెరికన్ నటి. ఆమె ఇప్పటికే బాలీవుడ్‌ గల్లీ బాయ్ సినిమాలో నటించింది. ఆపై ర్యాట్‌ ఇన్‌ ద కిచెన్‌ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఆమె ఉత్తమ సహాయ నటిగా అవార్డ్ కూడా అందుకుంది. యూనివర్శిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ నుంచి మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. వివేక్ ఒబెరాయ్‌తో పోస్టర్‌లో ఐశ్వర్య దేశాయ్‌ని కలిపి విడుదల చేయడంతో స్పిరిట్‌లో ఆమె పాత్ర బలంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ఒక్క పోస్టర్‌తో ఆమె ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది.స్పిరిట్‌లో సరికొత్త అవతారంలో ప్రభాస్‌ కనిపించనున్నారు. ఇందులో త్రిప్తి డిమ్రి,‌ వివేక్‌ ఒబెరాయ్, సీనియర్‌ నటి కాంచన తదితరులు నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో టి - సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.

Gandhi Talks Movie Now Streaming In OTT8
ఓటీటీలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మూకీ సినిమా

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నటించిన సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్' ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. వెండితెరపై మూకీ చిత్రాల యుగం ఎప్పుడో ముగిసింది. ఇలాంటి తరుణంలో ‘గాంధీ టాక్స్‌’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని దర్శకుడు కిశోర్‌ తెరకెక్కించారు. ఇందులో ఒక్క డైలాగ్‌ కూడా వినిపించదు. కానీ, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అలరిస్తుంది.‘గాంధీ టాక్స్‌’(Gandhi Talks) అమెజాన్‌ ప్రైమ్‌(amazon prime video)లో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఈ మూవీని చూడాలంటే రూ. 279 అధనంగా చెల్లించాల్సి ఉంటుంది. తమిళ్‌ వర్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ డైలాగ్స్‌ ఉండవ్‌ కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. కానీ, ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్‌ ఉంటాయి.కథేంటి..?దేశంలోని ఆర్థిక పరిస్థితిలు ఆపై నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలను సున్నితంగా స్పృశిస్తూ గాంధీ టాక్స్‌ కథ సాగుతుంది. డబ్బు అందరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ మూవీలో చూపించారు. ముంబయి ధారావిలో జీవించే నిరుపేద కుర్రాడు మహాదేవ్‌ విష్ణు (విజయ్‌ సేతుపతి). చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ముంబై నగర మున్సిపాలిటీలో ఉద్యోగం‌ కోసం ప్రయత్నించగా రూ.50 వేలు లంచం అడుగుతారు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న తల్లి మరోవైపు ప్రేమించిన అమ్మాయి (అదితీ రావ్‌ హైదరి)ని పెళ్లి చేసుకోవాలనే తపన.. అందుకోసం తనకు ఆ ఉద్యోగం చాలా అవసరం. అయితే, ఉద్యోగం దక్కాలంటే లంచం ఇవ్వాలి.. ఆ డబ్బు కోసం నైతిక విలువల్ని పక్కకు పెట్టి ఒక తప్పుడు పని చేసేందుకు రెడీ అవుతాడు. అదే ముంబైలో బోస్‌మన్‌ (అరవింద్‌ స్వామి) బిగ్గెస్ట్‌ బిజినెస్‌మెన్‌గా రాణిస్తుంటాడు. అయితే, తన వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడుతాడు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న బోస్‌మన​్‌ బయటపడేందుకు ఎలాంటి ప్లాన్‌ చేశాడు. మహాదేవ్‌ విష్ణు, బోస్‌ మన్‌లు ఇద్దరూ ఎలా కలుసుకున్నారు. డబ్బు వల్ల వారిద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

amala paul Comment Her 2ND Marriage9
జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైంది: స్టార్‌ హీరోయిన్‌

నటి అమలాపాల్‌ గుర్తుందా ? ఆమెను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. కారణం అంతగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన నటి ఈ బ్యూటీ. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రముఖ నటులతో జతకట్టిన అమలాపాల్, అంతకంటే ఎక్కువగా వివాదాస్పద నటిగా ముద్ర వేసుకున్నారు. ఈమె ప్రేమ, పెళ్లి అంతా సంచలనమే. స్టార్‌గా రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. రెండేళ్లు తిరక్కుండానే విడాకులు పొందారు. ఆ తర్వాత అమలాపాల్‌ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. అదేవిధంగా నిర్మాతగానూ రంగ ప్రవేశం చేశారు. అలా కొద్ది కాలం తర్వాత మరో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యారు. తన రెండవ పెళ్లి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమలాపాల్‌ మాట్లాడుతూ మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటానని అనుకోలేదన్నారు. జీవితం నిస్సారంగా సాగిపోతున్న తరుణంలో ఒక జ్యోతిష్కుడిని కలిశానన్నారు. ఆయన తనకు 32 ఏళ్ల వయసులో పెళ్లి జరుగుతుందని చెప్పాడన్నారు. జ్యోతిష్యుడు చెప్పిన కొద్దిరోజుల తర్వాత జగత్‌ అనే వ్యక్తిని గోవాలో కలుసుకున్నానన్నారు. మొదట్లో తాము డేటింగ్‌ చేశామని, అలా గర్భం దాల్చినట్లు చెప్పుకొచ్చారు. అప్పటికీ కూడా తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదన్నారు. అయితే గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే కదా! అనిపించడం వల్ల జగత్‌తో తన వివాహం జరిగిందని ఆమె అన్నారు. ఈమె చివరగా నటించిన మలయాళ చిత్రం ది గోట్‌ చిత్రం 2024లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె మరో చిత్రంలో నటించలేదు. అయినా ఈ అమ్ముడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటున్నారు.

Tollywood Movie Son Of Movie Review In Telugu10
తండ్రీ, కొడుకుల ఎమోషనల్ కథ.. సన్ ఆఫ్ మూవీ రివ్యూ

టైటిల్: సన్‌ ఆఫ్దర్శకుడు.. బత్తుల సతీష్ నిర్మాణ సంస్థ.. సైన్మా బ్యానర్విడుదల తేదీ.. ఫిబ్రవరి 27, 2026సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజైంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రిని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు భిన్నంగా ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి లవ్ ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్‌మెంట్‌ టైమ్‌కి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే స్టోరీ.ఎలా ఉందంటే..తండ్రీ కొడుకుల నేపథ్యంలో గతంలో చాలా కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా ప్రేక్షకులకు కొత్తగా చూసిన ఫీలింగ్ కలగదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేసేజ్ ఇచ్చేలా ఉంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగితే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా ఈ కథలో చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరముందనే కాన్సెప్ట్‌తో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం.. హీరో గాలి తిరుగుడు, హీరోయిన్‌తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్‌కి వస్తుంది.కోర్ట్‌లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్‌లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్‌తో కంటతడి పెట్టిస్తాయి. కథ చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలిగేలా చేస్తుంది.ఎవరెలా చేశారంటే..సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని రకాల ఎమోషన్స్‌ పండించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మెప్పించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరు కూడా తమ పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.

Advertisement
Advertisement