Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Shruti Haasan comments on her past 4 years life1
నాలుగేళ్లు ఒత్తిడిలోనే ఉన్నాను: శ్రుతి హాసన్‌

నటి శ్రుతిహాసన్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. అంతే కాకుండా సినిమా విక్కీపీడియాగా పేర్కొనే నటుడు కమలహాసన్, సారికల వారసురాలు అనే చిరునామా కలిగిన నటి ఈ బ్యూటీ. ఇక ప్రేమ వ్యవహారంలో పలుమార్లు వార్తల్లోకెక్కిన ఈ భామ ఇటీవలే 40వ పుట్టిన రోజును జరుపుకున్నారు. శ్రుతిహసన్‌ నాయకిగా తమిళంలో నటించిన ట్రెయిన్‌ చిత్రం విడుదల కావలసి ఉంది. ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన, గాయని, సంగీతం, రచన అంటూ పలు రంగాల్లో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తాను చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన తల్లిదండ్రులతో పెరిగడమే ఇందుకు కారణం అన్నారు. 2018 నుంచి కొన్ని కారణాల వల్ల కొంత విరామం తీసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తానెవరు అన్నది పునః పరిశీలంచుకోవడానికి ఉపయోగించుకున్నానని చెప్పారు. తాను పలు ఏళ్లుగా చాలా ఒత్తిడితోనే బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ ఒత్తిడి కారణంగా ఆయా పరిస్థితుల కనుగుణంగా పయనించలేకపోయానని చెప్పారు. తన విరామ కాలాన్ని లండన్‌లో గడిపానని, ఆ సమయంలో తన వంట తనే చేసుకున్నానని, తన బట్టలు తానే ఉతుక్కున్నానని, మెట్రో రైలులో పయనించానని, సంగీతం సాధన చేశానని చెప్పారు. ప్రస్తుతం ఒక కళాకారిణిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు.అది ఆనందాన్ని కలిగిస్తోందని, ఇకపై చాలెంజ్‌తో కూడిన కథా పాత్రల్లో నటించడానికి ప్రాముఖ్యతనిస్తానని శ్రుతిహాసన్‌ అన్నారు.

Chiranjeevi, Venkatesh, Balayya, Nagarjuna movies in Sankranthi 20272
సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ?

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. మార్చిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, విడుదలను నేరుగా 2027 సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పవర్‌ఫుల్‌ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన ప్రియమణి భార్య పాత్రలో నటించనున్నారు. కూతురి పాత్రకు కీర్తి సురేష్‌ను పరిశీలిస్తున్నారు. కానీ మరో ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జనవరిలో మన శంకర వరప్రసాద్ విడుదల కాగా, జూలైలో విశ్వంభర థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. 2027 సంక్రాంతికి బరిలో దింపాలని చూస్తున్నారు. అయితే అదే సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపుడి కాంబినేషన్ సినిమా ఉంది. బాలయ్య చిత్రం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున కూడా రంగంలోకి దిగితే 2027 సంక్రాంతి సీనియర్ల సంక్రాంతి అయిపోతుంది. ప్రస్తుతాకి ఇవన్నీ అధికారికంగా ప్రకటించలేదు కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం సీనియర్ల మద్య పోటీ ఉండే అవకాశం ఉంది.

Actor Naveen Chandra About Sentiments3
ఉంగరం పెట్టుకుంటే స్టార్ అయిపోతానన్నారు

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర కెరీర్ చాలా డిఫరెంట్. ఎందుకంటే 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత హీరోగా చేసిన మూవీస్ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. దీంతో 'అరవింద సమేత' చిత్రంతో విలన్‌గానూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే తనకు సరైన గుర్తింపు రాక ఇబ్బంది పడుతున్న టైంలో చాలామంది తనకు మూఢనమ్మకాల గురించి చాలా చెప్పి చూశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: గుండె లోతుల్లో బాధ.. ఎలా చెప్పాలో తెలీదు: నిహారిక)నేను కూడా సరైన ఛాన్సులు రాక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇండస్ట్రీలోని వ్యక్తులు చాలా చెప్పారు. ఇన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నావ్. ఈ ఉంగరం వేసుకుంటే స్టార్ అయిపోతావ్ అని అన్నారు. రాగి రేకుపై ఏదో రాసిచ్చి, అది జేబులో పెట్టుకుని తిరిగితే.. నీతో మాట్లాడిన దర్శకనిర్మాతలు వెంటనే అవకాశాలు ఇచ్చేస్తారని కూడా అన్నారు. కానీ నేను అవేవి నమ్మలేదు. కేవలం మీ(అభిమానుల) అభిమానం వల్లే ఇలా ఉన్నాను అని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు.ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హనీ'. మూఢ నమ్మకాలు, చేతబడులు, బలులు తదితర అంశాలతో తీసిన సినిమా ఇది. దివ్య పిళ్లై హీరోయిన్ కాగా కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆదివారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నవీన్ చంద్ర తన జీవితంలో జరిగిన తనతో చాలామంది ఇప్పటికీ చెప్పిన మూఢనమ్మకాల గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఆ పిల్లి ఉంటే అందరూ దాసోహమే.. 'హనీ' ట్రైలర్ రిలీజ్)

Niharika Konidela About Inner Peace in new Video4
గుండె లోతుల్లో బాధ.. ఎలా చెప్పాలో తెలీదు: నిహారిక

యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా.. అన్నిరకాలుగా తన టాలెంట్‌ నిరూపించుకుంది నిహారిక. ప్రస్తుతం ప్రొడక్షన్‌పైనే ఎక్కువ ఫోకస్‌ చేసిన నిహారిక తాజాగా జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేసింది. అయితే చెమటలు చిందించే ఎక్సర్‌సైజ్‌లను చూపించడమే కాకుండా మనసులోని సంఘర్షణను బయటపెట్టింది.గుండె లోతుల్లో బాధనిహారిక మాట్లాడుతూ.. నా లోపల ఏదో తెలీని బరువు మోస్తున్నా.. అది ఒత్తిడా? బాధనా? అంటే నాకే తెలీదు. కానీ, మనసంతా బరువుగా ఉంది. దాన్ని చెప్పడానికి నాకు పదాలు కూడా దొరకడం లేదు. ఈ భారాన్ని తల్చుకుని కుంగిపోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. కొన్నిసార్లు నేను జిమ్‌కు వెళ్తుంటాను, బరువులు ఎత్తుతాను. మనసు ఇప్పుడిప్పుడే..మరికొన్నిసార్లు వాకింగ్‌ చేస్తాను. ఇందులో ప్లానింగ్‌ చేసుకోవడానికంటూ ఏమీ లేదు. గుండెనిండా ఊపిరి పీల్చుకుంటూ నడుస్తానంతే! ఇంకొన్నిసార్లు డ్యాన్స్‌ చేస్తాను, యోగా చేస్తాను. ఇవన్నీ చేస్తుంటే మనసు తేలికపడుతోంది. బయటకు ఏమీ మారలేదు అనిపించొచ్చేమో, కానీ నాలోపల మాత్రం మార్పు మొదలైంది అని చెప్పుకొచ్చింది. వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చని ఆమె చెప్పకనే చెప్పింది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) చదవండి: ఆడవారిపై ఇలాంటి ట్రోల్సా? చెండాలంగా ఉంది: బిగ్‌బాస్‌ బ్యూటీ

Kayadu Lohar And Mrunal Thakur Latest News5
కాయదు ఓరచూపు.. ఓ రేంజు గ్లామర్‌తో రష్మీ

ఓరచూపుతో మాయ చేసేస్తున్న కాయదు లోహర్మత్తెక్కించే పోజులతో బ్యూటీ మృణాల్ ఠాకుర్గ్లామరస్ స్టిల్స్ ఇచ్చి రచ్చ లేపుతున్న రష్మీజనవరి జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీచీరలో నవ్వుతూ మైమరిపించేస్తున్న అనికామరింత అందంగా అదిరిపోతున్న అషూరెడ్డి View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Naveen Chandra Honey Movie Trailer6
ఆ పిల్లి ఉంటే అందరూ దాసోహమే.. 'హనీ' ట్రైలర్ రిలీజ్

నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ సినిమా 'హనీ'. కరుణ కుమార్ దర్శకుడు. ఓవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇది భయపెట్టేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)నిజ జీవిత సంఘటనల ప్రేరణతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అంశాలతో 'హనీ' మూవీ తీశారు. ఈ మూవీలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ దేవత వాహనంగా పిల్లిని చూపించారు. ఇది ఎవరి దగ్గర ఉంటే అందరూ వాళ్లకు దాసోహం అవుతారనే పాయింట్ చెప్పుకొచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత)

Kalpana Iyer hopes viral Rambha Ho Video Get Acting Offers7
ఇంత సెన్సేషన్‌ ఊహించలేదు, ఇకనైనా అవకాశాలొస్తే బాగుండు!

'రంభ హో హోహో..' ఈ పాట ఒకప్పుడు చాలా ఫేమస్‌. ధురంధర్‌ సినిమాలో ఈ సాంగ్‌ను వాడుకోవడంతో మరోసారి వైరల్‌ అయింది. అయితే ఈ పాటకు 70 ఏళ్ల నటి కల్పనా అయ్యర్‌ హుషారుగా స్టెప్పులెయ్యడం అంతకంటే ఎక్కువ వైరలవుతోంది. 1981లో వచ్చిన అర్మాన్‌ సినిమాలోని పాటే రంభ హో హో. ఈ డిస్కో సాంగ్‌లో కల్పనా అయ్యర్‌ స్టెప్పులేసింది. పెళ్లిలో డ్యాన్స్‌దాదాపు 45 ఏళ్ల తర్వాత మరోసారి ఈ పాటపై కాలు కదిపింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కల్పనా అయ్యర్‌ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్‌ కుమారుడి పెళ్లికి వెళ్లాను. అతడిని నా కొడుకులాగే భావిస్తాను. అందుకే ఫ్యామిలీతో కలిసి ఆ పెళ్లికి హాజరయ్యాను. అందరూ డ్యాన్స్‌ చేయమని కోరితే అప్పటికప్పుడు స్టెప్పులేశా.. అదేమీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు.చాలా స్పెషల్‌ఆ వీడియోను సాధారణంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను. ఇంకేముంది, కొద్ది గంటల్లోనే చాలా వైరల్‌ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే వీడియో కనిపిస్తోంది. అందరూ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులోనూ నాలుగు దశాబ్దాల కిందట డ్యాన్స్‌ చేసిన పాట మరోసారి గుర్తింపు తెచ్చుకుంటుంటే మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది. అవకాశాలు వస్తే అంతే చాలుఈ సాంగ్‌ను ధురంధర్‌ మూవీలో వాడారని విన్నాను. అందుకు దర్శకుడు ఆదిత్య ధర్‌కు కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే! ఆయన వల్లే ఇప్పటి జెనరేషన్‌ ఆ పాటను మళ్లీ పాడుకోగలుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీని చాలా మిస్‌ అయ్యాను. ఈ వైరల్‌ పాపులారిటీ మూలాన అవకాశాలు వస్తే కెమెరా ముందు నటిస్తాను అంటోంది. మరి కల్పనా కోరిక నెరవేరుతుందా? మరోసారి వెండితెరపై కనిపిస్తుందా? అన్నది చూడాలి! వందకు పైగా సినిమాల్లో యాక్ట్‌ చేసిన కల్పనా.. చివరగా హమ్‌ సాత్‌ సాత్‌ హై (1999) మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by RISE & INSPIRE 💫 (@rise_and_inspire_org) చదవండి: కవలలు పుట్టాక రామ్‌చరణ్‌ ఫస్ట్‌ పోస్ట్‌.

Shefali Bagga slams AI posters linking her to Yuzvendra Chahal8
ఆడవాళ్లపై ఇలాంటి ట్రోల్సా? చెండాలం: యాంకర్‌ ఫైర్‌

ఒకప్పుడు ఆడ, మగ క్లోజ్‌గా కనిపిస్తే చాలు వాళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని రూమర్స్‌ వచ్చేవి. కానీ, ఇప్పుడు కేవలం కలిసి కనిపించినా సరే.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌, యాంకర్‌ షెఫాలి బగ్గా డిన్నర్‌కు వెళ్లడంతో వీరు లవ్‌లో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఒక ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) పోస్టర్‌ వైరలవుతోంది.యాంకర్‌ ఫైర్‌ఇందులో చాహల్‌ కుర్చీలో కూర్చోగా అతడి పక్కన మాజీ భార్య ధనశ్రీ వర్మ, ఆర్జే మహవశ్‌, షెఫాలి ఉన్నారు. ఈ ఫోటో మొదట చాహల్‌ కంట పడింది. అది చూసిన అతడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని మిస్‌ అయ్యారంటూ సెటైర్లు వేశాడు. తాజాగా ఈ ఏఐ పోస్టర్‌పై షెఫాలి మండిపడింది. ఇదెంత చెండాలం.. ఆడవారిని ఇలా చూపించడం సిగ్గుచేటు. మీ మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుంది. మీ పనేదో మీరు చూసుకుంటే బెటర్‌ అని కౌంటరిచ్చింది.పెళ్లి- విడాకులుఇకపోతే చాహల్‌.. కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌ ధనశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 2024లో విడిపోయారు. 2025లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యాంకర్‌ ఆర్జే మహవశ్‌తో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సడన్‌గా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో బ్రేకప్‌ అయిపయిందని నెటిజన్లు ఫిక్స్‌ అయిపోయారు. బిగ్‌బాస్‌తో ఫేమస్‌అనంతరం షెఫాలీతో కనిపించడంతో మళ్లీ ప్రేమలో పడ్డాడని పలువురు భావించారు. కానీ ఇప్పుడు యాంకర్‌ ఇచ్చిన కౌంటర్‌తో అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. కాగా షెఫాలి న్యూస్‌ యాంకర్‌. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లో పార్టిసిపేట్‌ చేయడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.చదవండి: అల్లు శిరీష్‌ బ్యాచిలర్‌ పార్టీ

Telugu Actor Raghunath Reddy No More9
విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత

తెలుగు చిత్రసీమలో విషాదం. 350కి పైగా సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న రఘునాథ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న ఈయనకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. నెలరోజుల క్రితమే ఈయన కొడుకు కూడా గుండెపోటుతో చనిపోయారు. కుమారుడిని కోల్పోయిన బాధతోనే ఈయన కూడా కాలం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు నటీనటులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)రఘునాథరెడ్డి మృతదేహాన్ని సందర్శించిన నటి శివ పార్వతి.. ఈయనకు నివాళి అర్పించారు. ఇంత సీనియర్ నటుడు చనిపోతే.. టాలీవుడ్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. రఘునాథ రెడ్డి చేసిన మూవీస్ విషయానికొస్తే.. కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం తదితర చిత్రాలో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.శోభన్ బాబు హీరోగా చేసిన 'సర్పయాగం' సినిమాతో రఘునాథరెడ్డి.. నటుడిగా పరిచయమయ్యారు. చివరగా 2018లో సుమంత 'సుబ్రహ్మణ్యపురం'లో నటించారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా.. నటనకు వీడ్కోలు చెప్పేశారు. గతేడాది పలు యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు కొడుకుని కోల్పోయిన బాధతో ఈయన కూడా తనువు చాలించారు.(ఇదీ చదవండి: 'చరణ్‌' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్‌ అత్యుత్సాహం)

Sirai Movie OTT Streaming Details10
ప్రేమను కాపాడిన పోలీసోడి కథ

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్‌లలో చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం సిరై ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా కథలనేవి సమాజం నుండి పుట్టినవే. మన చుట్టూ జరిగిన ఘటనలను కాల్పనిక సన్నివేశాలతో జనరంజకంగా రూపొందిస్తారు దర్శకులు. అందుకే అడపాదడపా కొన్ని సినిమాలకు వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా అని ముందే చెబుతారు. నిజానికి వాస్తవ ఘటనలతో సినిమా తీయడం కత్తి మీద సామే అని చెప్పవచ్చు. ఎందుకంటే తీసే సినిమా ఎవ్వరి మనోభావాలను దెబ్బ తీయకుండా, అలాగే వాస్తవంగా జరిగిన ఘటనను అంతే స్పష్టంగా చెబుతూ ప్రేక్షకులను కట్టిపడేయడమంటే కష్టమే. అదే కోవలో వచ్చిన తమిళ చిత్రం ‘సిరై’(Sirai). తమిళ రచయిత తమీజ్‌ అందించిన కథతో దర్శకుడు సురేశ్‌ రాజకుమారి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘సిరై’. విక్రమ్‌ ప్రభు కథానాయకుడిగా ఈ సినిమాలో అలరించారు. సున్నిత మనస్కులు ఈ సినిమాని చూస్తే మాత్రం కంట నీరు పెట్టక మానరు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. కానిస్టేబుల్‌ కదిరవన్‌ ఓ అండర్‌ ట్రైల్‌ ఖైదీని జైలు నుండి కోర్టుకు విచారణకై తీసుకెళ్లడమే ఈ సినిమా కథాంశం. అబ్దుల్‌ అనే ఖైదీ చుట్టూ సాగుతుందీ కథ. అబ్దుల్‌ ఓ హత్య కేసులో అండర్‌ ట్రైల్‌ ఖైదీగా ఉంటాడు. కోర్టులో తన కేసు విచారణకు రావడంతో కదిరవన్‌తో కలిసి కోర్టుకు బయలుదేరతాడు అబ్దుల్‌. మార్గ మధ్యంలో అబ్దుల్‌ తన కథను కానిస్టేబుల్‌ కదిరవన్‌కు చెబుతాడు. అబ్దుల్‌ అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకున్న కానిస్టేబుల్‌ కదిరవన్‌ కోర్టు ప్రాంగణంలోనే సాయపడాలని నిర్ణయించుకుంటాడు. అయితే కోర్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు కానిస్టేబుల్‌ కదిరవన్‌కు అబ్దుల్‌ వినిపించిన కథేంటి? ఈ కథలో తనకు న్యాయం జరిగిందా? కోర్టులో జరిగిన ఘటనలు ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే జీ5 (Zee5) వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్‌ అవుతున్న ‘సిరై’ చూడాల్సిందే. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కంట తడిపెట్టిస్తాయి. మరి... ప్రేమను కాపాడిన ఈ పోలీస్‌ కథను మీరూ చూసేయండి. – హరికృష్ణ ఇంటూరు

Advertisement
Advertisement