Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Ashika Ranganath Gatha Vaibhava Movie OTT Streaming Now1
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఆషికా సినిమా

అమిగోస్, నా సామిరంగ, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర సినిమాలతో హీరోయిన్‌గా తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఆషికా రంగనాథ్. స్వతహాగా ఈమె కన్నడ అమ్మాయి. అక్కడ చాలానే మూవీస్ చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈ నెల ప్రారంభంలోనే సొంత భాషా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. దాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడా సినిమా ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్)గత జన్మల ప్రేమకథ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెలుగులో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'గత వైభవం'. జనవరి 1న తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఇప్పుడీ మూవీ సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో ఆషికా, దుష్యంత్ ప్రధాన పాత్రలు చేయగా.. సునీ దర్శకత్వం వహించారు.'గత వైభవం' విషయానికొస్తే.. ఆధునిక(ఆషికా రంగనాథ్‍)కి పెయింటింగ్స్ వేయడం అలవాటు. తన ఊహల్లో వచ్చే ఓ వ్యక్తి చిత్రాన్ని గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సరిగ్గా అదే పోలికలతో ఉన్న పురాతన్ (దుష్యంత్) ఈమెకు ఎదురుపడతాడు. విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో నడిపే పురాతన్.. తొలుత ఆధునికకు తప్పుడు ఉద్దేశంతో దగ్గరవ్వాలని చూస్తాడు గానీ తన గత జన్మల గురించి ఆమె చెప్పే నిజాలు ఇతడిని షాక్‌కి గురిచేస్తాయి. ఆధునికకు అసలు గత జన్మల గురించి ఎలా తెలుసు? వందల ఏళ్లక్రితం వీళ్లిద్దరి మధ్య బంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం)

Om Shanti Shanti Shantihi Movie Review And Rating2
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. మలయాళ హిట్‌ సినిమా జయ జయ జయ జయహే రీమేక్‌గా తెలుగులో తెరకెక్కించారు. ఈ సినిమా నేడు జనవరి 30న విడుదలైంది. మాలయాళంలో రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన జయ జయ జయ జయహే మూవీ ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ తెలుగు ఆడియోతోనూ జియోహాట్‌స్టార్‌లో ఉంది. దీంతో చాలామంది సినిమా చూసేశారు. అయితే, ఇదే చిత్రాన్ని రీమేక్‌ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ప్రేక్షకులను మెప్పించేంత కంటెంట్‌ ఏమైనా కొత్తగా ఉందా అంటే సినిమా చూడాల్సిందే.స్త్రీలను మాతృమూర్తులుగా, ఆదిశక్తి స్వరూపులుగా భావించి గౌరవంగా చూసుకోవాలని మన శాస్త్రాలు చెప్తాయి. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారని వింటూనే ఉన్నాం. స్త్రీలను గౌరవించని చోట అక్కడ చేసే పనులన్నీ ప్రయోజనం లేనివిగా మారిపోతాయి. ఇదే కాన్సెప్ట్‌తో‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఉంటుంది.కథేంటంటే..శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్‌ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది. అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్‌ భాస్కర్‌) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంద. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే:నేటి సమాజంలో ఆడపిల్లను చిన్నచూపు చూసే కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. మగపిల్లలను చూసిన తీరు ఆడపిల్లల పట్ల కనిపించదు. చిన్నతనంలోనే కట్టుబాట్ల పేరుతో పెంచుతారు. స్కూల్‌, కాలేజీ రోజుల్లో కూడా వారి చిన్న చిన్న సరదాలను కూడా అడ్డకట్ట వేసి బంధిస్తారు. ఆడపిల్లకు కూడా మనసు ఉంటుంది అనే విచక్షణ మరిచిపోతుంటారు. ఈ కథలో శాంతి పాత్ర కూడా ఇలాగే ఉంటుంది. తన చిన్నతనం నుంచే కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా ప్రేమ, సహకారం అందదు. అయినప్పటికీ చదువులో రాణిస్తుంది. మంచి మార్కులతో పాస్‌ అవుతుంది. గొప్ప చదువులు చదవి ఉద్యోగం సాధించాలనే తపనతో శాంతి ఉంటుంది. శాంతి పాత్రను దర్శకుడు తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. ఇలాంటి అమ్మాయి ప్రతి మధ్య తరగతి కుటుంబంలో కనిపిస్తూనే ఉంటుంది కదా అనే ఫీల్‌ కలుగుతుంది. అత్తారింటికి వెళ్లిన శాంతి అక్కడ పడే ఇబ్బందులు మనం చూస్తే చాలామంది ఆడపిల్లల జీవితాలను గుర్తుచేస్తుంది. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇచ్చిన భర్త.. ఆ తర్వాత దానిని దాటేస్తూ ఉంటాడు. ఈ సమస్య చాలామంది ఆడబిడ్డలకు ఎదురై ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం ఆరు నెలల్లోనే 21 సార్లు చేయి చేసుకున్న భర్త పదేళ్లలో ఎన్నిసార్లు కొడతాడు.. ఆ లెక్కన 40 ఏళ్లలో ఎన్నిసార్లు దెబ్బలు తినాలి అంటూ శాంతి ప్రశ్నిస్తుంది. దీనికి కుటుంబ సభ్యులతో పాటు అత్తగారింటి నుంచి కూడా సరైన సమాధానం ఉండదు. ఇలా ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట జరిగే పలు సంఘటనలే కథలో కనిపిస్తాయి. వాటిని చక్కగా దర్శకుడు తెరకెక్కించాడు.ఫస్టాఫ్‌ అంతా బాగా కథ నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో కాస్త నిరాశపరిచాడనిపిస్తుంది. గృహ‌హింస విష‌యంలో నేటి స‌మాజం ఆలోచ‌న తీరు ఎలా ఉందో చాలా చక్కగా చూపించాడు. భర్తను భార్య కొట్టిందంటే అవ‌మానం అంటారు. అలాంట‌ప్పుడు భార్యను భర్త కొట్టం ఎవరికీ తప్పు అనిపించదా..? అనేది శాంతి పాత్ర బలంగా చెబుతుంది. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ వరకు ఎలాంటి బోర్‌ లేకుండా సినిమాను చూసేయవచ్చు. సంసార జీవితంలో ఒక అమ్మాయికి ముఖ్యంగా ఉండాల్సిన మూడు విషయాలు ఇవే అంటూ.. ఒక భర్త నుంచి ప్రతి భార్య కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అని, అవన్నీ కూడా ఆడపిల్ల పుట్టకతోనే వస్తాయని జడ్జీ చెప్పిన తీరు ఆలోచింపచేస్తుంది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో హీరో ఈషా రెబ్బా అని చెప్పాల్సిందే. ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబంలో ఉండే అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్లు తన నటనతో మెప్పించింది. ఓర్పు, సహనం, ప్రేమ ఇలా అన్ని కోణాలు ఆడపిల్ల జీవితంలో ఉంటాయని చూపింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో పవర్‌ఫుల్‌గా కూడా కనిపించింది. రాయుడు పాత్రలో తరుణ్‌ భాస్కర్‌ అదరగొట్టేశాడు. తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని గుర్తుచేశాడు. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సెటిల్డ్‌గా చూపించాడు. సంక్రాంతి తర్వాత కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఒక సినిమా చూడొచ్చు అనేలా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఉంటుంది.

Tamil Actress Archana Ravindran Entered In arunachalam giri3
అరుణాచలం కొండపై నటి.. జరిమానా

పరమేశ్వరుడి ప్రతిరూపం అరుణాచలం.. అక్కడి పర్వతమే పరమాత్మగా ప్రాభవం పొందిన అరుణగిరిని దర్శించుకోవటం పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. అయితే, ఆలయం వెనుక వైపు 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరి ఉన్న విషయం తెలిసిందే. లక్షలాది మంది భక్తులు 14 కి.మీ దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అక్కడ మరింత రద్దీగా ఉంటుంది. అక్కడ గిరి ప్రదక్షిణకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొండ ఎక్కడానికి అటవీశాఖ వారు నిషేధం విధించారు. పవిత్రమైన అన్నామలై కొండపైకి అనుమతి లేకుండా నటి అర్చనా రవిచంద్రన్‌తో పాటు నటుడు అరుణ్ వెళ్లారు. అక్కడ వారిద్దరూ ఫోటోలను కూడా తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. వాటిని గుర్తించిన అటవీశాఖ అధికారులు ఇద్దరికి రూ. 5వేలు చొప్పున జరిమానా విధించారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. అన్నామలై (అరుణాచల) కొండపైకి భక్తులు ఎక్కకూడదనడానికి ప్రధాన కారణం ఉంది. ఆ కొండను స్వయంగా శివుడి రూపంగా పరిగణించడం వల్ల ఎవరూ కొండపైకి వెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. కొండపైకి నేరుగా ఎక్కడం అపచారం. పవిత్రతకు విరుద్ధం అని భక్తులు భావిస్తారు. ఈ కొండను దేవాలయ గోపురంలా కాకుండా.. దేవుడి శరీరంగా భక్తులు భావిస్తారు. కాబట్టి దానిపై నడవడం, ఎక్కడం అనేది శివుని శరీరంపై నడిచినట్లుగా అవుతుంది.

Danush Son Yatra Enter In Movie Industry4
ధనుష్‌ వారసుడు ఎంట్రీ.. 'యాత్ర'కు రజనీకాంత్‌ ఇమేజ్‌

కథానాయకుడు, కథా రచయిత, గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్‌. టాలీవుడ్‌ నుంచి, హాలీవుడ్‌ వరకు తన సినీ సామ్రాజ్యాన్ని విజయవంతంగా విస్తరించుకుంటూ పోతున్న ఈ మల్టీటాలెంట్‌ స్టార్‌ ఒక పక్క హీరోగా నటిస్తునే మరో పక్క దర్శకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ధనుష్‌ తన 55వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి అమరన్‌ చిత్రం ఫేమ్‌ రాజ్‌ కుమార్‌ పెరియస్వామి కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ ప్రేమించుకుని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సుమారు 17 ఏళ్ల తర్వాత మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఇటీవలే విడాకులు కూడా పొందారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడి పేరు యాత్ర ఇతన్ని ఇప్పుడు ధనుష్‌ కథానాయకుడిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు ధనుష్‌ నే దర్శకత్వం వహించడంతో పాటూ తన వండర్‌ బార్‌ పతాకంపై నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే నిజం అయితే, ధనుష్‌ కుమారుడికి మంచి ఎంట్రీనే దొరుకుతుంది. తన తాతయ్య రజనీకాంత్‌ ఇమేజ్‌ కూడా యాత్రకు కలిసొస్తుంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు అన్నది గమనార్హం.

Tollywood Actresses Social Media Updates in instagram goes viral5
చిట్టి గౌనులో జ్యోతి పూర్వాజ్ అందాలు.. మార్నింగ్‌ మూడ్‌లో బిగ్‌బాస్ దివి..!

టాలీవుడ్ నటి అభినయ లేటేస్ట్ లుక్..కలర్‌ఫుల్ శారీలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..వైట్ డ్రెస్‌లో శ్రియా శరణ్ అందాలు..పొట్టి గౌనులో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ పిక్స్..బ్లాక్‌ డ్రెస్‌లో అనుపమ పరమేశ్వరన్‌ బ్యూటీఫుల్ లుక్స్..మార్నింగ్ మూడ్‌లో బిగ్‌బాస్ దివి.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Divi (@actordivi)

This Friday Ott Release Movies List Here Goes Viral6
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమాల సందడి మొదలవుతుంది.ఈ వారంలో టాలీవుడ్ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ సందడి చేయనుంది. ఈ మూవీపై మాత్రమే ఆడియన్స్‌లో బజ్‌ ఏర్పడింది. దీంతో పాటు ఒకట్రెండ్ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే బ్లాక్‌ బస్టర్‌ మూవీ దురంధర్ ఓటీటీకి రానుంది. దీంతో పాటు సర్వం మాయ లాంటి డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 12 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30 మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30 97 మినిట్స్(హాలీవుడ్)- జనవరి 30అమెజాన్ ప్రైమ్ దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30 క్రిస్టీ(హాలీవుడ్ మూవీ)-జనవరి 30 ది లాంగ్ వాక్(హాలీవుడ్ మూవీ)- జనవరి 30జియో హాట్‌స్టార్ సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30సన్ నెక్స్ట్ పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30ఆపిల్ టీవీ ప్లస్ యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30జీ5 దేవ్‌కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30మనోరమ మ్యాక్స్..గులాబ్ జామూన్(మలయాళ సినిమా)- జనవరి 30హులు..ఎల్లామెక్‌కే(హాలీవుడ్ సినిమా)- జనవరి 30

Amardeep Chowdary comments at Sumathi Sathakam Trailer event7
'ఆల్రెడీ హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అనుకోవచ్చు'

బిగ్‌బాస్‌ అమర్‌దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్‌ఎమ్‌ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో సాయి సుధాకర్‌ నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అమర్‌దీప్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చానని అన్నారు. అనంతపురం నుంచి వచ్చిన వ్యక్తిని.. రామ అనే పేరుతో మీ అందరికీ పరిచయమే.. అందుకే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చారు. ఆల్రెడీ హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అని మీరందరూ అనుకోవచ్చు.. కానీ దీనికి నా దగ్గర సమాధానం ఉందన్నారు. ఇది రేపొద్దున కాదు అంటే.. అప్పుడు నన్ను మీరు ట్రోల్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నారు. కానీ మీకు ఆ అవకాశం ఇవ్వకుండా చేశానని తెలిపారు. ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి చేశానని అమర్‌దీప్‌ చౌదరి పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమా మైత్రీ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. "హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అనుకోవచ్చు"'నేను ఎందుకురా' అనేదానికి ఇందులో ఫుల్ సమాధానం ఉంది!!"రేప్పొద్దున కాదు ఇది లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్స్.. అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్"- #Amardeep గారు #SumathiSathakam pic.twitter.com/hxka7yk0CH— Mega Abhimani (@megaabhimani3) January 29, 2026

 Indian poet and lyricist Veturi Sundararama Murthy birth anniversery8
వేటూరినై వచ్చాను భువనానికి...!

అవి 1980, 1990 రోజులు.. అప్పటి మద్రాసులో కోదండపాణి, ప్రసాద్, ఎ.వి.యం., విజయ రికార్డింగ్ స్టూడియోలు ఉండేవి.. అన్నిచోట్ల రోజుకు రెండు చొప్ప్పున పాటలు రికార్డ్ అయ్యేవి.. సినిమాలు వేరే, నిర్మాతలు వేరే, సంగీత దర్శకులు వేరే, కానీ పాటల రచయిత మాత్రం ఒకే ఒక్కరు.. ఆయనే వేటూరి సుందరరామమూర్తి..!తెలుగు సినిమా పాట... ‘వేటూరికి ముందు, వేటూరికి తర్వాత’ అనొచ్చేమో. ఏమో ఏంటీ అనొచ్చు, అనాలి..! మనకు ఎందరో మహా రచయితలు ఉన్నారు. ఆ మహానుభావులు అందరూ కలిసి, ఒక్కరైతే... ఆ ఒక్కరే వేటూరి సుందరరామమూర్తి..!అవునండీ..! వేటూరి వారు రాకముందు.. ఒక్కోరకం పాటకు ఒక్కో రచయితను వెతుక్కునేవారు దర్శక`నిర్మాతలు.. వేటూరి వారు వచ్చాక, అన్ని పాత్రలకూ, అన్ని సందర్భాలకూ.. అన్ని పాటలకూ ఒక్కరే రచయిత. ఆయనే వేటూరి వారు..!మరో విషయం కూడా ఇక్కడ చెప్ప్పుకోవాలి.. వేటూరి రాకముందు పాటల విషయంలో తెలుగు సినిమా ఒక ఇబ్బందిలో ఉండేది.. అద్భుతమైన పాటలే గానీ, బాగా ఆలస్యం అవుతూ ఉండేవి.. పాటల రికార్డింగ్ కోసం పడిగాపులు కాసే పరిస్థితి.. అలాంటి రోజుల్లో, ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు వేటూరి. అనాయాసంగా అత్యుత్తమస్థాయి సాహిత్యాన్ని అందించారు.మూడు అక్షరాల ‘వేటూరి... మూడు తరాల తెలుగు పాటకు ‘భరోసా’ అయ్యారు ‘ఎంత ఎదిగిన బిడ్డ అయినా, తండ్రి ముందు ఒదిగే వుండాలి’ అన్న నానుడి నిజం చేస్తూ... తన ముందు తరం మహా రచయితలను ఎంతగానో గౌరవించేవారు, వినమ్రతతో వ్యవహరించేవారు. వేటూరి వారు... వెండితెర విశారదుడు. తెలుగు పాటల తాంత్రికుడు. పాటను శ్వాసించాడు. పాటల ప్రపంచంలో ఆయనది ఒక అధ్యాయం ఒక శకం, ఒక యుగం ఒక ఇతిహాసం..! గత వైభవానికి వారధి..! భావి ప్రాభవానికి సారధి..! ముందు తరాలకు వేటూరి... ఒక విభ్రమం..! ఒక దిగ్భమం..!!రాబోయే రోజుల్లో ప్రేక్షకులు...ఒకప్ప్పుడు వేటూరి అనే ఒక పాటల రచయిత ఉండేవారట.. ఆశువుగా పాటలు చెప్పేవాడట.. విజయాగార్డెన్ చెట్టు కింద, విమానంలో టిష్యూ పేపర్ మీద, ఆటోలో తిరుగుతూ, హాస్పిటల్‌లో దాక్కుని, మెరీనా బీచ్‌లో, గుర్రాల పందాల దగ్గర, ఇక్కడ అక్కడ, అయిన చోట, కాని చోట, అన్ని చోట్లా, అన్ని వేళలా, అనితరసాధ్యమైన, అజరామరమైన పాటలు అలవోకగా రాసేవాడట..! అని కథలు కథలుగా వేటూరి గురించి విడ్డూరంగా చెప్ప్పుకుంటారు. ప్రతిరోజూ, ప్రతి నిమిషం వేటూరి పాటలు వినపడుతూనే వుంటాయి. ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు. మహాపురుషులు అవుతారు..’ అని రాసారు ఆయన..! ఆ కషి, ఆ ఋషి, ఆ మహాపురుషుడు... వేటూరి సుందరరామమూర్తి..! మనసా స్మరామి..!! శిరసా నమామి..!!-పైడిపాటి రాజేంద్రకుమార్ ప్రముఖ సినిమా రచయిత

Producer Tg Vishwa Prasad gets West Bengal Governor Award of Excellence9
ది రాజాసాబ్‌ నిర్మాతకు అరుదైన గౌరవం

టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు బెంగాల్ గవర్నర్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా ఈ అవార్డ్‌ను నిర్మాత అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ చేతుల మీదుగా తీసుకున్నారు.కాగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో టీజీ విశ్వప్రసాద్ ఒకరు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఉన్నారు. ఇటీవలే ఈ బ్యానర్‌లో ప్రభాస్‌ నటించిన ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజైంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. అభిమానుల అంచనాలు ది రాజాసాబ్‌ అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధికుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.Deeply honoured and humbled to share that our Producer @vishwaprasadtg garu has been awarded the West Bengal Governor’s Award of Excellence 🤗Our heartfelt gratitude to the Hon’ble Governor of West Bengal, Dr. C. V. Ananda Bose ji, for this prestigious recognition bestowed upon… pic.twitter.com/c9mgUz28Jc— People Media Factory (@peoplemediafcy) January 29, 2026

Ranveer singh dhurandhar Movie ott release announced10
దురంధర్ ఓటీటీ డేట్‌ ఫిక్స్.. అదొక్కటే నిరాశ

రణ్‌వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్‌ కోసం ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈనెల 30 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ థియేట్రికల్‌ వెర్షన్‌ రన్‌టైమ్‌ 3 గంటలా 34 నిమిషాలు కాగా.. ఓటీటీలో దాదాపు 9 నిమిషాలు తగ్గించారు. ఓటీటీలో అన్‌కట్‌ వెర్షన్‌ రిలీజ్‌ చేస్తారని ప్రచారం జరిగినా రన్‌టైమ్‌ తగ్గడం ఆడియన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.కాగా.. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, కాంతార-2 చిత్రాలను దాటేసింది. అంతేకాకుండా తాజాగా దేశీయంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. It’s official! 🔒🔥Dhurandhar drops on Netflix TONIGHT! pic.twitter.com/gsAGMURqj7— Fozzy (@fozzywrites) January 29, 2026

Advertisement
Advertisement