ప్రధాన వార్తలు
సరదాగా మంచు లక్ష్మీ బోటింగ్.. శ్రీలీల బ్యూటీఫుల్ లుక్..!
సిస్టర్కు నమ్రతా శిరోద్కర్ బర్త్ డే విషెస్..సరదా సరదాగా బోటింగ్ చేస్తోన్న మంచు లక్ష్మీ..సాగర తీరాన ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న శ్వేతా బసు ప్రసాద్..బ్యూటీఫుల్ డ్రెస్లో హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11)
గ్రాండ్గా ఇఫీ ఈవెంట్.. ఆకట్టుకున్న తెలంగాణ గోండు ఆదివాసీ నృత్యం
గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఇఫీ )లో భాగంగా నిర్వహించిన ఇఫీ పెరేడ్ కార్యక్రమంలో టాలీవుడ్ సందడి కనిపించింది. దేశవ్యాప్తంగా 16 కళా బృందాలు కనుల పండుగ చేసిన ఈ పెరేడ్ను ప్రారంభించిన ఘనతను తెలంగాణకు చెందిన గోండు ఆదివాసీ నృత్యం గుస్సాడీ కళాకారులు దక్కించుకున్నారు.టాలీవుడ్ తారల సందడి..ఈ కార్యక్రమంలో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ,నటి శ్రీలీల నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్, మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదల రవి, సినీ నటుడు నాజర్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు,మాదల రవీలు మాట్లాడుతూ ప్రాంతీయ భాష నుంచీ పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగిందని గుర్తు చేశారు ప్రాంతాలకతీతంగా అందరినీ ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకు ఇఫీ లాంటి వేదికలు ఎంతైనా ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు.56वें भारतीय अंतरराष्ट्रीय फिल्म महोत्सव का भव्य परेड के साथ हुआ शुभारंभ✨इस दौरान देश की ऐतिहासिक विरासत की छठा बिखेरते कलाकार👇#IFFI56 #IFFI @IFFIGoa pic.twitter.com/xeN768F1J0— पीआईबी हिंदी (@PIBHindi) November 20, 2025
నాగ చైతన్య మైథలాజికల్ థ్రిల్లర్.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గాల కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నాగచైతన్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు.
'ప్లీజ్ అన్నా.. సినిమాలు ఆపేయ్'.. నెటిజన్కు ప్రియదర్శి స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.మూవీ రిలీజ్కు ముందు ప్రియదర్శి నెటిజన్లతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు నెటిజన్స్. అయితే ఓ నెటిజన్ చాలా ఆసక్తికర ప్రశ్న వేశాడు. అన్న నువ్వు సినిమాలు చేయడం అపు అన్న.. ప్లీజ్ అన్నా అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన ప్రియదర్శి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకమంటావా? అంటూ ప్రశ్నించాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమంటే కథేంటంటే..?మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. Mari em cheyyamantavGaddi Peekalna?😅 https://t.co/HFnQJk2ujL— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 20, 2025
బిగ్బాస్
ఇంత బాధేంట్రా పిచ్చోడా.. నాకో మాటివ్వు: కల్యాణ్ తల్లి
నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తుందేంటి?: రీతూ తల్లి
నాకు క్యాన్సర్, అప్పటినుంచి తిండి మానేశా..: పవన్ తండ్రి
భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు
రీతూతో బంధం.. అమ్మతో పంచుకున్న డిమాన్ పవన్
బిగ్బాస్ ఫ్యామిలీ వీక్: తనూజతో తగ్గించండి.. సుమన్కి భార్య సలహా
భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేసిన సుమన్ శెట్టి
రీతూతో కల్యాణ్.. రెచ్చిపోయిన పవన్
నన్ను తొక్కుతూనే ఉన్నావ్.. రీతూ ఫ్రస్టేషన్
రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్
A to Z
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో మలయాళ సినిమాలనే ఎందుకు ఎక్కువగా చూస్తారు...
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా
గత నెలలో దీపావళికి తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యా...
ఓటీటీకి తెలుగు సస్పెన్స్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్క...
'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రెడీ.. రెండు సీజన్లలో జరిగింది ఇదే
ఓటీటీ ప్రియులకు ఇష్టమైన స్వదేశీ సిరీస్ల్లో 'ద ఫ్య...
రూ.252 కోట్ల డ్రగ్స్ కేసు.. ఓర్రీకి నోటీసులు
బాలీవుడ్లో ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్న ఓర...
కొడుకు పేరు రివీల్ చేసిన హీరోయిన్.. అలాంటి అర్థం వచ్చేలా!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా గతనెలలో పండంటి బిడ్డకు...
ఒళ్లు జలదరించేలా 'ధురంధర్' ట్రైలర్
గత కొన్నాళ్లుగా సినిమాలతై చేస్తున్నాడు గానీ బాలీవు...
విడాకుల వార్తలు.. స్పందించిన ప్రముఖ బుల్లితెర నటి!
ఈ రోజుల్లో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. కొంద...
తెరపై తండ్రి కూతురు.. నిజజీవితంలో ఆమెపై వేధింపులు
ఓటీటీలో 'స్ట్రేంజర్ థ్రింగ్స్' అనే వెబ్ సిరీస్ మన ...
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఇండియాలోనూ రిలీజ్
హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ఇండియన్ అభిమానులను...
ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సూపర్ హీరో సినిమాలు అనగానే హాలీవుడ్లో మార్వెల్, డ...
ఇండియాలో అవతార్ ఈవెంట్
‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘అవత...
మోహల్ లాల్తో ఇంటిమేట్ సీన్.. షూటింగ్కు ముందే: హీరోయిన్
ప్రముఖ మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ పేరు ఒక్కసారి...
వివాదాల సుడిగుండంలో దర్శకధీరుడు
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో తెలుగు సినిమ...
నా ఫోటోలు అలా చూస్తుంటే చాలా బాధేస్తోంది: కీర్తి సురేశ్
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రివాల్వరీ...
హీరో అభిమాని కుటుంబానికి నిర్మాత భారీ సాయం
బేబీ సినిమాతో టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తిం...
ఫొటోలు
భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)
సిస్టర్ శిల్పా శిరోద్కర్ బర్త్డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)
రివాల్వర్ రీటా ప్రమోషన్స్లో కీర్తి సురేశ్.. (ఫోటోలు)
వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి సిస్టర్స్ (ఫోటోలు)
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
నాగదుర్గ హీరోయిన్గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
తెలుసు కదా మూవీ సెట్లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)
శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)
సినిమా పైరసీపై ఫిల్మ్ ఛాంబర్ మహా ధర్నా (ఫోటోలు)
జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)
గాసిప్స్
View all
హిట్ మూవీ దర్శకుడితో సాయిపల్లవి మరోసారి?
రవితేజతో సమంత.. ఓ క్రైమ్ థ్రిల్లర్!
'వారణాసి' ఈవెంట్కి అన్ని కోట్లు ఖర్చయిందా?
ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!
న్యూయార్క్లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?
ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్
'గర్ల్ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
స్పిరిట్లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం!
ఓటీటీలోకి 'డ్యూడ్'.. డేట్ ఫిక్సయిందా?
రివ్యూలు
View all
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
3
‘కాంత’ మూవీ రివ్యూ
2.5
'జిగ్రీస్' మూవీ.. నలుగురి స్నేహితుల కథ (రివ్యూ)
40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!
3
Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ
3
'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?
3
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ
2.5
Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
సినీ ప్రపంచం
సరదాగా మంచు లక్ష్మీ బోటింగ్.. శ్రీలీల బ్యూటీఫుల్ లుక్..!
సిస్టర్కు నమ్రతా శిరోద్కర్ బర్త్ డే విషెస్..సరదా సరదాగా బోటింగ్ చేస్తోన్న మంచు లక్ష్మీ..సాగర తీరాన ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న శ్వేతా బసు ప్రసాద్..బ్యూటీఫుల్ డ్రెస్లో హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11)
గ్రాండ్గా ఇఫీ ఈవెంట్.. ఆకట్టుకున్న తెలంగాణ గోండు ఆదివాసీ నృత్యం
గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఇఫీ )లో భాగంగా నిర్వహించిన ఇఫీ పెరేడ్ కార్యక్రమంలో టాలీవుడ్ సందడి కనిపించింది. దేశవ్యాప్తంగా 16 కళా బృందాలు కనుల పండుగ చేసిన ఈ పెరేడ్ను ప్రారంభించిన ఘనతను తెలంగాణకు చెందిన గోండు ఆదివాసీ నృత్యం గుస్సాడీ కళాకారులు దక్కించుకున్నారు.టాలీవుడ్ తారల సందడి..ఈ కార్యక్రమంలో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ,నటి శ్రీలీల నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్, మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదల రవి, సినీ నటుడు నాజర్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు,మాదల రవీలు మాట్లాడుతూ ప్రాంతీయ భాష నుంచీ పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగిందని గుర్తు చేశారు ప్రాంతాలకతీతంగా అందరినీ ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకు ఇఫీ లాంటి వేదికలు ఎంతైనా ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు.56वें भारतीय अंतरराष्ट्रीय फिल्म महोत्सव का भव्य परेड के साथ हुआ शुभारंभ✨इस दौरान देश की ऐतिहासिक विरासत की छठा बिखेरते कलाकार👇#IFFI56 #IFFI @IFFIGoa pic.twitter.com/xeN768F1J0— पीआईबी हिंदी (@PIBHindi) November 20, 2025
నాగ చైతన్య మైథలాజికల్ థ్రిల్లర్.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గాల కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నాగచైతన్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు.
'ప్లీజ్ అన్నా.. సినిమాలు ఆపేయ్'.. నెటిజన్కు ప్రియదర్శి స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.మూవీ రిలీజ్కు ముందు ప్రియదర్శి నెటిజన్లతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు నెటిజన్స్. అయితే ఓ నెటిజన్ చాలా ఆసక్తికర ప్రశ్న వేశాడు. అన్న నువ్వు సినిమాలు చేయడం అపు అన్న.. ప్లీజ్ అన్నా అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన ప్రియదర్శి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకమంటావా? అంటూ ప్రశ్నించాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమంటే కథేంటంటే..?మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. Mari em cheyyamantavGaddi Peekalna?😅 https://t.co/HFnQJk2ujL— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 20, 2025
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఫ్రైడే వచ్చిందంటే చాలు సినీ ప్రియులకు ఇక పండగే. థియేటర్లతో పాటు ఓటీటీల్లో వరుసపెట్టి సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇకపోతే ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. తెలుగులో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి. వీటిలో ది బెంగాలీ ఫైల్స్ అనే కాంట్రవర్సీ సినిమా కూడా ఉంది. అంతేకాకుండా విక్రమ్ తనయుడు నటించిన బైసన్, 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా సందడి చేయనుంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్ ఇవే..నెట్ఫ్లిక్స్ బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21 ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21 హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21 డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21 వన్ షాట్ విత్ ఈడ్ షీరాన్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 21అమెజాన్ ప్రైమ్ ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21జియో హాట్స్టార్ జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21 ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో(కామెడీ సిరీస్)- నవంబర్ 21 ర్యాంబో ఇన్ లవ్(తెలుగు వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్స్)- నవంబర్ 21 అజ్టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23సన్ నెక్స్ట్ ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21 కర్మణ్యే వాధికరస్తే(తెలుగు సినిమా)- నవంబరు 21 డీజిల్(తెలుగు సినిమా)- నవంబరు 21జీ5 ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21మనోరమ మ్యాక్స్షేడ్స్ ఆఫ్ లైఫ్(మలయాళ సినిమా)- నవంబరు 21లయన్స్ గేట్ ప్లే..టన్నెల్(తమిళ సినిమా)- నవంబర్ 21
కాంతార చాప్టర్-1.. బాక్సాఫీస్ వద్ద మరో క్రేజీ రికార్డ్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కాంతార చాప్టర్-1. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద కనుమరుగవుతున్న సమయంలో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టేసింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిషబ్ శెట్టి మూవీ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో కాంతార ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఇప్పటికే పలు రికార్డులు తిరగరాసిన కాంతార చాప్టర్-1 మరో క్రేజీ ఫీట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. Celebrating 50 glorious days of #KantaraChapter1.A divine cinematic experience rooted in our timeless heritage and sacred traditions.#50DaysOfKantaraChapter1 ❤️🔥https://t.co/d7It7XIZUO#BlockbusterKantara #KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere… pic.twitter.com/iEvur0NiQL— Rishab Shetty (@shetty_rishab) November 20, 2025
మోహల్ లాల్తో ఇంటిమేట్ సీన్.. షూటింగ్కు ముందే: హీరోయిన్
ప్రముఖ మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మూడో పెళ్లి చేసుకున్న భామ.. మరోసారి విడాకులు తీసుకుంది. దీంతో మీనా వాసుదేవన్ పేరు మాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.మలయాళంలో పలువురు స్టార్ హీరోల సరసన మీనా నటించింది. మోహన్ లాల్ హీరోగా 2005లో వచ్చిన తన్మాత్ర అనే మూవీలో కనిపించింది. ఈ సినిమాలో మోహన్లాల్తో ఓ ఇంటిమేట్ సీన్ చేయాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సీన్లో మోహన్ లాల్ పూర్తి నగ్నంగా నటించాల్సి వచ్చిందని తెలిపింది. దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయని.. ఇలా చేస్తున్నందుకు షూటింగ్కు ముందే మోహన్ లాల్ తనకు క్షమాపణ చెప్పాడని మీరా గుర్తుచేసుకుంది.మీరా వాసుదేవన్ మాట్లాడుతూ.. "నేను అతన్ని ఒకే ఒక్క విషయం అడిగా. ఈ సన్నివేశం ఎందుకు అవసరం? దాని ఉద్దేశ్యం ఏమిటి?' అని ప్రశ్నించా. కానీ ఇది చాలా ముఖ్యమని అన్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచే రెండు పాత్రలను చాలా దగ్గరగా చిత్రీకరించారు. ఇది కూడా ఒక సన్నిహిత కుటుంబం. భార్యాభర్తలు ఎల్లప్పుడూ చాలా సున్నితంగా, భావోద్వేగంగా ఉంటారు. ఈ సీన్లో మోహన్ లాల్ సర్ పూర్తిగా నగ్నంగా నటించాల్సి రావడంతో ఆయనకు చాలా కష్టంగా అనిపించింది. అతనికి మరింత సవాలుగా అనిపించింది. ఈ సీన్లో నా గురించి, నా గౌరవం గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. ఆయన చాలా ప్రొఫెషనల్. దీంతో షూట్కు ముందే మోహన్ లాల్ స్వయంగా వచ్చి నాకు క్షమాపణలు చెప్పా. ఇలా చేయాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే సారీ' చెప్పారని" తెలిపింది.కాగా.. ఈ చిత్రం ఉత్తమ మలయాళ మూవీగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో పాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది. ఈ చిత్రం మోహన్ లాల్కు ఉత్తమ నటుడిగా ఐదోసారి రాష్ట్ర అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇటీవలే మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వృషభతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.మీరా వాసుదేవన్ కెరీర్..మీరా వాసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. గోల్మాల్ అనే తెలుగు చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంజలి ఐ లవ్యూ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.
వివాదాల సుడిగుండంలో దర్శకధీరుడు
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) ఇప్పుడు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. 'వారణాసి’ ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి దారి తీశాయి.అసలేం జరిగింది?నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి కొత్త సినిమా 'వారణాసి' టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్లతో పాటు రాజమౌళి కుటుంబం ఈ ఈవెంట్కి కూడా హాజరయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఈవెంట్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయింది. తాను అనుకున్నట్లుగా ఈవెంట్ జరగకపోవడంతో జక్కన్న కాస్త నిరాశకు లోనయ్యాడు. తన బాధను అభిమానులతో పంచుకున్నాడు ‘నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. కానీ మా నాన్నగారు(విజయేంద్ర ప్రసాద్) టెన్షన్ పడొద్దని, 'హనుమంతుడు అన్నీ సవ్యంగా నడిపిస్తాడు' అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఈవెంట్ సాంకేతిక లోపాలతో ఆగిపోయింది.. ఆయన ఏం చేస్తున్నాడు? అందుకే నాన్న అలా అంటే నాకు కోపం వస్తుంది’ జక్కన్న ఎమోషనల్ అయ్యాడు. దేవుడిని నమ్మనంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి దారీతీశాయి. 'హనుమంతుడిని అవమానించాడు’ అంటూ హిందూ సంఘాలు రాజమౌళిపై భగ్గుమన్నాయి. రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానరసేన (వానర సేనా) సంస్థ హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 'హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు' అని ఆరోపిస్తూ, రాజమౌళి, మహేష్ బాబు ఇళ్లను ముట్టడిస్తామని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. వారణాసిలో కూడా మరో కేసు నమోదు అయింది. భగ్గుమన్న బీజేపీ నేతలుబీజేపీ నేతలురాజమౌళిని తీవ్రంగా విమర్శించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ..‘రాజమౌళి నిజంగా నాస్తికుడైతే బహిరంగంగా చెప్పాలి లేదా క్షమాపణ చెప్పాలి. దేవుళ్ల కథలతో సినిమాలు తీసి కోట్లు సంపాదించి, ఇప్పుడు 'నమ్మకం లేదు' అంటే ఏమిటి? బాహుబలి, ఆర్ఆర్ఆర్లా హిందూ కథలు ఉపయోగించి డబ్బులు దక్కించుకున్నాడు. హిందూ సమాజం అతని ప్రతి సినిమాను బహిష్కరించాలి. గతంలో రాముడి కథను 'బోరింగ్' అని, శ్రీకృష్ణుడి దాసీలపై కామెంట్స్ చేశాడు. ఇలాంటి వాళ్ల సినిమాలు చూడకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ స్పందిస్తూ జక్కన్నపై తనదైన శైలీలో సెటైర్లు వేశాడు. ‘రాజమౌళి నిండు నూరేళ్ళు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నాను. దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి.. ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా అని బండి సంజయ్ అన్నారు.బీజేపీ నేత చికోటీ ప్రవీణ్ మాట్లాడుతూ..‘రాజమౌళి తీరు 'మదం ఎక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డట్టు'. అహంకారంతో వెళ్తే పతనం ఖాయం. దేవుడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించి, ఇలా మాట్లాడటం తగ్గదు. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి’ అని ఫైర్ అవ్వడం లేదు. రాజమౌళి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలంటూ బీజేపీ నాయకురాలు మాధవీలత సూచించారు.టైటిల్ విషయంలోనూ.. హనుమంతుడి విషయంతో పాటు, సినిమా టైటిల్ కూడా వివాదాస్పదం అయింది. తెలంగాణ డైరెక్టర్-నిర్మాత సుబ్బారెడ్డి 'రామభక్త హనుమ క్రియేషన్స్' బ్యానర్లో 'వారణాసి' టైటిల్ను తెలుగులో ముందే రిజిస్టర్ చేసి ఉన్నారు. రాజమౌళి టీమ్ దీనిని తెలుగులో వాడలేక, ఇంగ్లీష్లో 'Varanasi'గా రిజిస్టర్ చేసి, అదే టైటిల్తో ముందుకు సాగుతున్నారు. సుబ్బారెడ్డి తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. ఇది లీగల్ ఇష్యూకు మారే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.పెదవి విప్పన జక్కన్నమీడియాలో, సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా... హిందూ సంఘాలు కేసులు పెడుతున్నా..బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నా..రాజమౌళి మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ వివాదం మొదలై నాలుగైదు రోజులైనప్పటికీ..అతని నుంచి స్పందన లేకపోవడం ఆశ్చర్యాన్నికలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే.. రాజమౌళి క్షమాపణలు చెబితే తప్ప ఈ వివాదం ముగిసేలా కనిపించడం లేదు. మరి జక్కన్న క్షమాపణలు చెబుతాడా లేదా? చూడాలి.
ఇంత బాధేంట్రా పిచ్చోడా.. నాకో మాటివ్వు: కల్యాణ్ తల్లి
సామాన్యుడు బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)దాకా రావడమనేది చిన్న విషయం కాదు. షోలో అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా టైటిల్ రేసులో ఉండటం అంటే చాలా గొప్ప విషయం! ట్రోఫీ గెలుస్తాడా? లేదా? అని పక్కనపెడితే టాప్ 3లో చోటు దక్కించుకున్నా సరే అతడు గెలిచాడనే చెప్పాలి. అతడే పవన్ కల్యాణ్ పడాల.విమర్శల నుంచి పొగడ్తల వరకుచిన్న పల్లెటూరు నుంచి ఆర్మీకి... అక్కడ బ్రేక్ ఇచ్చి బిగ్బాస్ హౌస్కి వచ్చాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). మొదట్లో తనూజను చూసేవిధానం, మాట్లాడే విధానం ఎవరికీ నచ్చలేదు. అమ్మాయిల పిచ్చోడు అని తనపై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ తిట్టిన నోళ్లతోనే పొగిడించుకునేలా చేశాడు. తన తీరు మార్చుకున్నాడు, ఆట మార్చాడు.వద్దు వద్దంటూ..అందుకే ఇప్పుడు ఎంతోమందికి ఫేవరెట్ అయ్యాడు. చిన్నప్పుడు అమ్మానాన్న సావాసాన్ని మిస్ అయ్యానని చెప్తూ ఇటీవలి ఎపిసోడ్లో బోరుమని ఏడ్చాడు కల్యాణ్. కానీ, ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనకు ఇంట్లోవాళ్లు రావొద్దని, కావాలంటే ఎవరికోసమైనా త్యాగం చేయడానికైనా రెడీ అంటూ పిచ్చిపట్లునట్లు ప్రవర్తించాడు. తీరా కళ్ల ముందు తల్లి కనిపించేసరికి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మాటిచ్చిన కల్యాణ్ఇంత బాధ పెట్టుకున్నావేంట్రా పిచ్చోడా అని తల్లి అడిగేసరికి అమ్మ కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా మారిపోయాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలి అని తల్లి అడిగింది. అందుకు కల్యాణ్ తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటూ ఆమె చేతిలో చేయేసి మాటిచ్చాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఎమోషనల్గా సాగనుంది. చదవండి: పెళ్లయి 9 ఏళ్లు.. నాకు తల్లవ్వాలని లేదు: నటి
ఓటీటీలో టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. టాలీవుడ్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ధూల్పేట్ పోలీస్ స్టేషన్. ఈ వెబ్ సిరీస్కు జస్విని దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ధూల్పేట్ పోలీస్ స్టేషన్ సిరీస్ వచ్చేనెల 5 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలిపారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో అశ్విన్, శ్రీతు, గురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే హత్యల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. The investigation begins this December 🚨🚔#DhoolpetPoliceStation Premieres 5th Dec only on #ahaEvery Friday - New Episodes#DhoolpetOnaha pic.twitter.com/EUadfirmZm— ahavideoin (@ahavideoIN) November 20, 2025
సినిమా
రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు
ఒకటి పోతే మరొకటి.. ఆన్ లైన్ లో మరో ఐబొమ్మ
ధనుష్ దర్శకత్వంలో రజనీ..
ప్రభాస్ ఒక్కడే సపరేట్!
వారణాసి బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే?
ఎన్టీఆర్ వారణాసి ఎప్పుడు..
మాస్ కాంబినేషన్ సెట్..!
IBomma: ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
సజ్జనార్ కి కృతజ్ఞతలు తెలిపిన సినీ ప్రముఖులు
IBOMMA; SS రాజమౌళి స్వీట్ వార్నింగ్
