Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Sri Nandu Talk About Psych Siddhartha Movie1
18 కిలోలు తగ్గాను.. నచ్చకపోతే క్షమాపణలు చెబుతా: నందు

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిదేళ్లు అయింది. నా నటన గురించి ఇప్పటివరకు నెగెటివ్‌ కామెంట్స్‌ రాలేదు. ‘సైక్‌ సిద్ధార్థ’ సినిమా నచ్చకపోతే ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతాను. ఒకవేళ ఫెయిల్‌ అయినా ఇక్కడే ఉంటూ సినిమాలు చేస్తాను. గెలిచేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు శ్రీ నందు. వరుణ్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నందు, యామినీ భాస్కర్‌ జోడీగా నటించిన చిత్రం ‘సైక్‌ సిద్ధార్థ’. రానా స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌పై శ్రీ నందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్‌ కానుంది.ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో శ్రీ నందు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ ఇప్పుడున్న సొసైటీకి రిలేట్‌ అయ్యేలా, యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. దర్శకులు రాఘవేంద్రరావు, సాయిరాజేశ్, అనుదీప్‌గార్లు మా సినిమా చూసి, అభినందించారు. ఈ చిత్రం కోసం నేను పద్దెనిమిది కిలోలు తగ్గాను’’ అని చెప్పారు. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు వరుణ్‌ రెడ్డి. ‘‘చాలా గ్యాప్‌ తర్వాత నా సినిమా రిలీజవుతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు యామినీ భాస్కర్‌.

Director Devdas about His Death and Will Power2
హీరోయిన్‌తో విడాకులు.. రూ.100 కోట్ల ఆస్తి ఎవరికంటే?

దివంగత నటి దేవిక మాజీ భర్త, దర్శకుడు దేవదాస్‌ (88) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం (నవంబర్‌ 30) రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి కాలంలో మాత్రం కనిపించకుండా పోయారు. చాలాకాలంగా ఒంటరిగానే బతుకీడుస్తూ వచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితంపై ఈ ప్రత్యేక కథనం..పెళ్లి చేసుకోమని బలవంతంసినీ నిర్మాత ఎస్‌ఎంఎస్‌ సుందరరామన్‌ కుమారుల్లో దేవదాస్‌ ఒకరు. సినిమాలపై ఆసక్తితో దివంగత ప్రఖ్యాత దర్శకుడు భీంసింగ్‌ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ పలు చిత్రాలు నేరుగా డైరెక్ట్‌ చేశారు. దేవదాస్‌.. వేగుళి పెన్‌, మని కోయ కురుప్‌, రాఖీ వంటి సినిమాలు తెరకెక్కించారు. వేగుళి పెన్‌ మూవీ సమయంలో హీరోయిన్‌ దేవిక ఆయనతో ప్రేమలో పడింది. దేవిక, దేవదాస్‌పెళ్లితో జీవితం తలకిందులుఅయితే దేవికయే తన వెంటపడిందని, పెళ్లి చేసుకోమని కాళ్ల మీద పడి బతిమాలిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మనిద్దరికీ సెట్టవదని దేవదాసు చెప్పినా ఆమె వినిపించుకోలేదట! పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది! దీంతో ఆమె మాటకు తలొగ్గాల్సి వచ్చింది. అలా ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి కనక అనే కూతురు జన్మించింది. కనక.. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడుకు ముని మనవరాలవుతుంది. కానీ కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందని దేవదాస్‌కు నెమ్మదిగా అర్థమైంది. ఆయన్ను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూసింది. దశాబ్దాల తరబడి కోర్టులోఅందుకు ఆయన ఒప్పుకోకపోయేసరికి ఒకరోజు తాళి బొట్టు ఆయన మొహాన విసిరికొట్టింది. అంతేకాదు, భర్తను చంపించాలని ప్రయత్నించిందట. ఈ విషయంపై దేవదాస్‌ పోలీసులను ఆశ్రయించగా దాదాపు 32 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. పెళ్లయిన మూడేళ్లకే దంపతులిద్దరూ విడిపోయారు. కోర్టు కూతురును తల్లికే అప్పగిస్తుంది. అలా కనక తండ్రికి దూరమైంది. కూతురి కోసం ఇంటికెళ్తే...కాదు, దేవికయే కూతుర్ని తనకు దూరం చేసిందంటారు దేవదాస్‌.. ఆమె వేసిన నిందలకు అందరూ తనను శత్రువులా చూశారని బాధపడ్డారు. కనక మానసిక స్థితి సరిగా ఉండదని, ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త వస్తే ఇంటికి వెళ్లి చూశారు. కనక బతికే ఉండటంతో అది తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. కనక ఇంటి బయట అంతా శుభ్రం చేశారు. అయినా తండ్రిని ఆమె లోనికి రానివ్వలేదు. చారిటీకి ఆస్తిఅలా భార్య, కూతురి ప్రవర్తన వల్ల జీవితాంతం నరకం అనుభవించారు దేవదాసు. దేవికను పెళ్లి చేసుకోవడమే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని పశ్చాత్తాపపడ్డారు. తన గురించి పట్టించుకోనివారి కోసం ఆలోచించి సమయం వృథా చేయాలనుకోలేదు. అందుకే తన మరణానంతరం రూ.100 కోట్ల ఆస్తి ట్రస్టుకు చెందాలని వీలునామా రాశారు. ఇ‍ప్పుడిక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవిక తెలుగులో పెండ్లి పిలుపు, అన్నా చెల్లెలు, గాలిమేడలు, రక్త సంబంధం, మంగళసూత్రం, నిండు మనసులు, గండికోట రహస్యం, పాపం పసివాడు, శ్రృ కృష్ణాంజనేయ యుద్ధం, నిప్పులాంటి మనిషి, శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించింది.చదవండి: సాయిపల్లవి వల్ల నా జీవితమే మారిపోయింది: మ్యూజిక్‌ డైరెక్టర్‌

CPI Narayana Fires On Chandrababu Government Over Akhanda 2 Ticket Rate Hike3
అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు.. సీపీఐ నారాయణ ఫైర్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘అఖండ 2:తాండవం’. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లో రూ. 100, సింగిల్‌ స్క్రీన్లలో రూ. 75 పెంచుకునేందుకు వెలుసుబాటు కల్పిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. దీంతో పాటు ఈ నెల 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్స్‌కి కూడా అనుమతి ఇస్తూ.. టికెట్‌ ధరను రూ. 600గా నిర్ణయించింది.పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ విధంగా టికెట్ల రేట్లను పెంచడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చినట్లుగా టికెట్ల రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా సీపీఐ నారాయణ(CPI Narayana ) కూడా అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై స్పందించారు. వందల కోట్లలో సినిమాలు తీసి.. ఆ భారం సామాన్య ప్రజలపై వేయడం కరెక్ట్‌ కాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు.ఐబొమ్మ రవిని అరెస్ట్‌ చేసే నైతిక హక్కు లేదుఅఖండ 2( Akhanda 2 ) చిత్రానికి టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రకటన వల్లే కదా ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుట్టుకొచ్చేంది. కోట్ల కోట్ల రూపాయలను ఖర్చు చేసి సినిమా తీసి.. ఆ భారమంతా ప్రజలపై వేస్తాననడం ఎంత వరకు న్యాయం? ఇలాంటి విలువలైన సినిమాలను చూడడానికి ఇష్టపడని ప్రజానీకం.. ఐబొమ్మ రవిలాంటి వాళ్లు చేసిన పైరసీని ఎంకరేజ్‌ చేనస్తున్నారు. మీరే కదా రవిని సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఐబొమ్మ రవిని అరెస్ట్‌ చేసే నైతిక హక్కులేదు.రవి లాంటివాళ్లు పుడుతూనే ఉంటారుసంక్రాంతి పండుగ సందర్భంగా ఐదారు సినిమాలు వస్తున్నాయి. వాటికి కూడా సినిమా టికెట్ల రేట్లను పెంచుతారు. ఇలా పెంచుకుంటూ పోతున్నంత కాలం ఐబొమ్మ రవిలాంటి వాళ్లు వస్తూనే ఉంటారు. వాళ్లను ఆపడం ఎవరి తరం కాదు. ఇది స్వయంకృతాపరాధం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే..ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి’ అని నారాయణ అన్నారు.

Chitrapuri Colony Case Final Verdict Latest4
చిత్రపురి కాలనీ అక్రమాల కేసు.. విచారణ పూర్తి

చిత్రపురి కాలనీ కేసు.. గతేడాది టాలీవుడ్‌లో బయటపడిన పెద్ద కుంభకోణం. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు తేలడంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు 15 నుంచి 21 మందిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇండస్ట్రీకి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు. అక్రమ నిర్మాణాలు, ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు, లబ్ధిదారులకు అన్యాయం జరగడం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు. ఇప్పుడు ఈ కేసు విచారణ పూర్తయింది.2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ చేసింది. ఈ మేరకు నవంబర్ 27న ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో పేర్కొంది. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్ద పాత్రపై రిపోర్ట్‌లో కీలక అంశాలు పొందుపరిచింది. ఈ నివేదికలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానందం ,వల్లభనేని అనిల్‌తో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. మొత్తం రూ.43.78 కోట్లు రికవరి చేయాలని రిపోర్ట్‌లో ఉంది. అదనంగా 18 శాతం చెల్లించాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!)ఏంటి చిత్రపురి కాలనీ కేసు?మణికొండలోని సర్వే నం.246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని తెలుగు సినీకార్మికుల సహకార హౌసింగ్‌ సొసైటీకి గతంలో ప్రభుత్వం కేటాయించింది. గజానికి రూ.40 చొప్పున ధరతో ప్రభుత్వం స్థలాన్ని ఇవ్వగా, 2002లో సొసైటీ.. సభ్యత్వ ప్రక్రియ ప్రారంభించింది. ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు విభాగాల్లో ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 4300 మంది సభ్యులుగా చేరారు. తక్కువ ధరకు వచ్చిన భూమి కాలక్రమంలో ఐటీ కారిడార్‌ కావడం గజం రూ.లక్షల్లోకి చేరడంతో అక్రమాల పరంపర మొదలైంది.సొసైటీలో సభ్యులకు ఫ్లాటు కేటాయింపునకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సహకార శాఖ, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్లు, ఇద్దరు సినీ ప్రముఖులతో కూడిన కమిటీ సంతకాలుండాలి. 2010, 2012, 2015లో ఆరుదశల్లో 4213 ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో కమిటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ అనర్హులకు ఫ్లాట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. 4213 ఫ్లాట్లకు 9153 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్పించడం గమనార్హం. రాజకీయ నేతల సూచనలతో అనర్హులను చేర్పించినట్లు తేలింది.(ఇదీ చదవండి: బుకింగ్‌ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్')

Music Director Suresh Bobbili about Sai Pallavi5
పూటుగా తాగేసి ఫోన్లు ఎత్తకపోయేవాడిని.. నాకోసం సాయిపల్లవి..

విరాటపర్వం, రాజు వెడ్స్‌ రాంబాయి వంటి సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోశాడు సురేశ్‌ బొబ్బిలి. లేటెస్ట్‌ హిట్‌ బాయిలోన బల్లిపలికే అనే జానపద పాటకు సైతం ఈయనే మ్యూజిక్‌ అందించాడు. అయితే తన కెరీర్‌ ఇక్కడివరకు రావడానికి హీరోయిన్‌ సాయిపల్లవి కారణం అంటున్నాడు.బ్యాక్‌గ్రౌండ్‌తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేశ్‌ బొబ్బిలి మాట్లాడుతూ.. మాది గౌరారం గ్రామం, మహబూబాబాద్‌ జిల్లా (ఉమ్మడి ఖమ్మం జిల్లా). అమ్మ పొలం గట్ల దగ్గర పాటలు పాడేది. నాన్న స్టేజీ ఆర్టిస్టు. మా అ‍న్నయ్య నందన్‌ రాజు కూడా మ్యూజిక్‌ డైరెక్టర్‌. అన్న వేరేవాళ్లతో కలిసి పెట్టుకున్న స్టూడియోలో ఆఫీస్‌ బాయ్‌గా చేరాను. అక్కడే కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయడం నేర్చుకున్నాను.కెరీర్‌ మార్చిన మూవీఆరు నెలల్లో అదే స్టూడియోలో ఇంజనీర్‌ అయ్యాను. శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారాను. అయితే మొదటగా మా అబ్బాయి మూవీ రిలీజైంది. వరుసగా నాలుగు శ్రీ విష్ణు సినిమాలే చేశాను. నా కెరీర్‌ను పూర్తిగా మార్చిన మూవీ విరాటపర్వం. అయితే ఆ మూవీ సమయంలో నాకు తాగుడు అలవాటు ఉండేది. ఫోన్లు ఎత్తేవాడిని కాదుఅమ్మానాన్న లేరు. అన్న చెప్పినా చెవికెక్కించుకునేవాడిని కాదు. నా లక్ష్యాన్ని చేరుకోగానే దారి తప్పాను. ప్రేమ- బ్రేకప్‌ వల్ల తాగుడుకు అలవాటుపడ్డా.. దర్శకుడు వేణు ఊడుగుల, సాయిపల్లవి (Sai Pallavi).. ఎవరు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేసేవాడిని కాదు. తాగిన మైకం దిగాక ఎందుకిలా చేస్తున్నానని ఏడ్చేవాడిని. చనిపోదామన్న ఆలోచనలు కూడా వచ్చేవి. రెండేళ్లపాటు నరకం అనుభవించాను.నన్ను పక్కనపెట్టి..విరాటపర్వం సినిమా సమయంలో నేను ఫోన్లు ఎత్తకపోయేసరికి వేరేవాళ్లకు మిగతా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయమని చెప్పారు. అయితే అప్పటికే నేను బీజీఎమ్‌ అంతా రెడీ చేసి పెట్టాను. అది ఓసారి సాయిపల్లవి, రానా విన్నారు. వాళ్లు నేను ఇచ్చే మ్యూజికే కావాలన్నారు. అదే సినిమాను బతికిస్తుంది, వేరేవాళ్లతో చేయొద్దన్నారు.సాయిపల్లవి ఫోన్‌అప్పుడు సాయిపల్లవి నాకు ఫోన్‌ చేసి.. మీకేదైనా నేనున్నాను. మీరు ఏకాగ్రత పెట్టి పని చేయండి. ఆరోగ్య సమస్య లేదా వ్యక్తిగత సమస్యలేమైనా ఉంటే నేను చూసుకుంటాను. మీరు వెనక్కి తగ్గొద్దు, చక్కగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. అలా నెలరోజులపాటు కూర్చుని సినిమాలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించేశాను.మందు జోలికి వెళ్లలేసినిమా రిలీజయ్యాక ఫస్ట్‌ మీకే మంచి పేరొస్తుంది.. చాలా బాగా సంగీతం అందించారు. మీకు మంచి కెరీర్‌ ఉంది. వేణుగారు కొన్ని విషయాలు చెప్పారు. వాటిని వదిలేయండి.. మీకు మంచి భవిష్యత్తు ఉంది. చిన్నచిన్నవాటిని పట్టించుకోవద్దు అని సాయిపల్లవి సలహా ఇచ్చారు. అలా ఆమె సలహా వల్లే మద్యం మానేశాను. ఇంతవరకు మళ్లీ మందు జోలికి వెళ్లలేదు అని సురేశ్‌ బొబ్బిలి (Suresh Bobbili) చెప్పుకొచ్చాడు.చదవండి: తనూజపై గెలిచిన సుమన్‌.. టికెట్‌ టు ఫినాలే ఎవరిదో?

Kriti Sanon's Sister Nupur Sanon Wedding Details6
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!

సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. ఒకవేళ వీళ్లకు చెల్లి లేదా తమ్ముడు ఉంటే వాళ్లకు ముందుగా వివాహం చేసేస్తారు. త‍ర్వాత ఎప్పుడో టైమ్ చూసుకుని వీళ్లు కొత్త జీవితం ప్రారంభిస్తారు. గతంలో సాయిపల్లవి ఇలానే తనకంటే ముందు చెల్లి పెళ్లి చేసింది. ఇప్పుడు లిస్టులోకి మరో స్టార్ హీరోయిన్ చేరబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్‌.. రాజ్‌ సోదరి ఎమోషనల్‌ పోస్ట్‌)మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ అయిన కృతి సనన్.. తర్వాత 'దోచేయ్' అనే మరో తెలుగు మూవీ చేసింది. ఈ రెండు ఫ్లాప్ అయ్యేసరికి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. బాగానే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగానే ఉంది. ఈమె చెల్లి నుపుర్ కూడా నటినే. గతంలో ఆల్బమ్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫెయిలైంది. ఈమె యాక్టింగ్ కూడా తేలిపోవడంతో తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతానికైతే హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది.అలాంటిది ఇప్పుడు నుపుర్ పెళ్లి చేసుకోనుందనే న్యూస్ బయటకొచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయపుర్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్‌తోనే నుపుర్ కొత్త జీవితం ప్రారంభించనుందని టాక్. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని.. జనవరి 8,9 తేదీల్లో ఈ శుభాకార్యం జరగనుందని సమాచారం. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొద్ది మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. అయితే నుపుర్ లేదా స్టెబిన్ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.(ఇదీ చదవండి: బుకింగ్‌ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్')

Ram Pothineni Talk About Andhra King Taluka At Success Meet7
ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు తక్కువే ఉన్నాయి: ‘ఆంధ్రకింగ్‌..’ నిర్మాత

‘‘ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో మనం చాలా ఎమోషన్స్‌ చూశాం. కానీ, ఓ స్టార్‌ హీరో, ఫ్యాన్‌కి మధ్య ఉన్న భావోద్వేగాన్ని చెబుతూ, హ్యూమన్‌ ఎమోషన్‌ని కూడా టచ్‌ చేసిన సినిమా ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. ఇలాంటి భావోద్వేగం ప్రపంచంలో ఎక్కడా లేదు... మన తెలుగు సినిమాకే సొంతం. మనం సినిమా లవర్స్‌... మంచి సినిమాకి గుర్తింపు వస్తూనే ఉంటుంది’’ అన్నారు రామ్‌ పోతినేని. మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 27న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో వై. రవిశంకర్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. నెక్ట్స్‌ వీక్‌ అద్భుతమైన రన్‌ ఉంటుందని నమ్ముతున్నాం. నేటి నుంచి థియేటర్స్‌ని విజిట్‌ చేసి, ఫ్యాన్స్‌ని కలుసుకుంటాం’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రంలో మహాలక్ష్మిలాంటి మంచి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు భాగ్యశ్రీ. ‘‘ఇక్కడి నుంచి మా సినిమా చాలా లాంగ్‌ వెళ్లబోతోంది’’ అని మహేశ్‌బాబు పి. పేర్కొన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ వివేక్, మెర్విన్‌ మాట్లాడారు.

Bigg Boss 9 Telugu: Thanuja Puttaswamy out From Ticket to Finale Race8
సుమన్‌ చేతిలో ఓటమి.. తనూజకు ఏడుపే దిక్కు!

టికెట్‌ టు ఫినాలే ఎలాగైనా కొట్టాల్సిందే అన్న కసితో ఆడుతున్నారు హౌస్‌మేట్స్‌. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్‌, తనూజ గేమ్స్‌ గెలిచి అందరికంటే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా తనూజ సుమన్‌తో పోటీపడింది. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇది బ్యాలెన్స్‌ గేమ్‌. తనూజకు సపోర్ట్‌ చేయని భరణిహౌస్‌మేట్స్‌ ఎవరిని రేసులో నుంచి తొలగించాలనుకుంటారో వారి ట్యాప్‌ తిప్పి ట్యాంకులో నీళ్లు నింపాల్సి ఉంటుంది. కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, రీతూ.. తనూజకు సపోర్ట్‌ చేయగా భరణి, పవన్‌.. సుమన్‌కు మద్దతిచ్చారు. ఈ గేమ్‌లో తనూజపై సుమన్‌ పైచేయి సాధించాడు. దీంతో తనూజ టికెట్‌ టు ఫినాలే రేసులో లేకుండా పోయింది. రేసు నుంచి అవుట్‌ఈ ఓటమిని తట్టుకోలేక తనూజ ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇక మరో గేమ్‌లో డిమాన్‌ పవన్‌ గెలవగా.. భరణితో తలపడినట్లు తెలుస్తోంది. ఈ ఆటలో భరణి గెలిచి పవన్‌ను రేసు నుంచి తప్పించాడని తెలుస్తోంది. ఇలా మలుపులు తిరుగుతూ పోతున్న ఈ ఆటలో ఎవరు ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ (Bigg Boss Telugu 9) అవుతారో చూడాలి! చదవండి: రీతూ పరువు తీసిన బిగ్‌బాస్‌

Prabhas' The Raja Saab Movie Runtime Details9
బుకింగ్‌ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్'

ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ టైమ్ ఫిక్స్ అయింది. లెక్క ప్రకారం ఈ వారమే థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి రావాలని నిర్ణయించుకుని.. విడుదల తేదీని జనవరి 9కి మార్చారు. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా బాగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్నిరోజుల క్రితం రిలీజైన తొలి పాట మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా యూఎస్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఓ విషయంలో ఫ్యాన్స్‌కి క్లారిటీ వచ్చేసింది.'రాజాసాబ్' ఓవర్సీస్‌కి సంబంధించిన టికెట్లని తాజాగా ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఈ క్రమంలోనే మూవీ రన్ టైమ్ ఎంతో బయటపడింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో సినిమా రాబోతుందని క్లారిటీ వచ్చింది. గతంలో మూడున్నర గంటలకు పైనే ఉండొచ్చని అన్నారు. ఇప్పుడు ఫైనల్‌గా ఈ టైమ్‌కి ఫిక్సయ్యారనమాట.(ఇదీ చదవండి: నేనంటే చిన్నచూపు.. స్టేజీపై ఏడ్చేసిన నందు)గత కొన్నేళ్లలో అర్జున్ రెడ్డి, పుష్ప 2, యానిమల్ తదితర చిత్రాలు 3 గంటలకు పైగా రన్ టైమ్‌తోనే థియేటర్లలోకి వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. అవన్నీ డిఫరెంట్ జానర్స్. 'రాజాసాబ్' కూడా 3 గంటలకు పైనే ఉన్న పెద్ద మూవీ. కంటెంట్ పరంగా మెప్పిస్తే పర్లేదు లేదంటే మాత్రం చూసే ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశముంది. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త టెన్షన్. మరి 3 గంటల పాటు టీమ్ ఏ రేంజులో మెప్పిస్తారో తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే.'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు. తమన్ సంగీతమందించగా.. మారుతి దర్శకత్వం వహించారు. హారర్ ఫాంటసీ కామెడీ కథతో దీన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పెట్టింది. సంక్రాంతి బరిలో తొలుత రాబోతున్న సినిమా ఇదే. తర్వాత మిగతా చిత్రాలు థియేటర్లలోకి వస్తాయి.(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్‌.. రాజ్‌ సోదరి ఎమోషనల్‌ పోస్ట్‌)

Avatar: Fire and Ash Advance Bookings Starts From 5th December 202510
అప్పటినుంచే 'అవతార్‌ 3' అడ్వాన్స్‌ బుకింగ్స్‌

యానిమేషన్‌ కథా చిత్రాలకు ప్రపంచస్థాయిలో స్ఫూర్తిదాయకుడు జేమ్స్‌ కామెరూన్‌. ఆయన 2009లో తెరకెక్కించిన అవతార్‌ చిత్రం ఒక అద్భుతం. ఈ మూవీ ప్రపంచ సినీ ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తరువాత దానికి సిక్వెల్‌గా రూపొందిన అవతార్‌. ది వే ఆఫ్‌ వాటర్‌ చిత్రం 2022లో విడుదలై ప్రేక్షకులకు కనువిందు చేసింది. అప్పుడే దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దీనికి ఫ్రాంచైజీ ఉందన్నారు. దీంతో ప్రేక్షకులు ఈ సారి ఎలాంటి వండర్‌ సృష్టిసారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడే రోజు వచ్చేసింది. అవతార్‌ మూడో పార్ట్‌గా అవతార్‌ ఫైర్‌ అండ్‌ యాష్‌ డిసెంబర్‌ 19వ తేదీన తెలుగు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల కానుంది. దీన్ని 20 సెంచరీ స్టూడియో సంస్థ విడుదల చేస్తోంది.ఈ మూవీ గత రెండు చిత్రాల కంటే మరింత బ్రహ్మాండంగా తెరకెక్కించినట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా ఈసారి ఈ చిత్రం ప్రేక్షకులకు ఐమాక్స్‌ థియేటర్లో అనుభూతిని కలిగించబోతోంది. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్‌ థియేటర్లు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రానికి డిసెంబర్‌ 5నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌ మొదలు కాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement