Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement

బిగ్‌బాస్

Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Mohanlal Latest Movie Vrusshabha Trailer out now1
రాజుగా మోహన్‌ లాల్.. వృషభ ట్రైలర్‌ వచ్చేసింది!

మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌, తెలుగు యంగ్‌ హీరో రోషన్‌ తండ్రి, తనయులుగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి విడుదల కావాల్సిన ఈ ఫుల్ యాక్షన్‌ మూవీ క్రిస్‌మస్‌కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని మైథలాజికల్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలం నాటి విజువల్స్, యాక్షన్ సీన్స్‌ బాహుబలి తరహాలో మోహన్ లాల్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా ట్రైలర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్‌ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నేహా సక్సెనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్‌, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్‌. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా నిర్మించారు. ఈ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న తమిళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది.

Indian Cricket Team Watches Ranveer Singhs Dhurandhar In Lucknow2
దురంధర్ క్రేజ్‌.. మూవీని వీక్షించిన టీమిండియా

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్‌ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీని టీమిండియా సభ్యులు వీక్షించారు. లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మల్టీప్లెక్స్‌ మాల్‌లో క్రికెటర్స్ దురంధర్ సినిమాను ఆస్వాదించారు. టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ దురంధర్‌ మూవీని చూసినవారిలో ఉన్నారు. క్రికెటర్స్ థియేటర్‌లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడుతోంది. రెండు జట్ల నాలుగో టీ20 లక్నో వేదికగా బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే లక్నో చేరుకున్న టీమ్‌ దురంధర్‌ను వీక్షించింది.ధురందర్ రిలీజైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సైయారా ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Subodh Rambir Singh (@bollyfreaksofficial)

Court Sridevi And Nivetha Thomas Latest News3
నీలిరంగు చీరలో శ్రీదేవి.. నివేదా ఇంత గ్లామరా?

గ్లామర్‪‌తో రచ్చ లేపుతున్న నివేదా థామస్నీల రంగు చీరలో చాలా అందంగా శ్రీదేవిఎత్తయిన కొండపైన కూర్చుని నిహారిక పోజులుషూటింగ్ జ్ఞాపకాలని పంచుకున్న సంయుక్త'మసూద' బ్యూటీ బాంధవి మాయ చేసేలాహీరోయిన్ మీనాక్షి చౌదరి క్లోజప్ స్టిల్స్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar) View this post on Instagram A post shared by Preethi Anju Asrani (@thepreethiasrani) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor)

Tollywood Present Situation And Ticket Rates Issue4
అందరూ కలిసి ప్రేక్షకుడిని దూరం చేసుకుంటున్నారా?

గత కొన్నేళ్లలో టాలీవుడ్ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే. అందుకు తగ్గట్లే పాన్ ఇండియా మార్కెట్‌లో మనోళ్లు పోటీపడుతున్నారు. పోటీపడితే పర్లేదు కానీ దీని మోజులో పడి అయిన కాడికి బడ్జెట్, రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. ఇది తప్పితే ప్రేక్షకుడి గురించి ఒక్కరూ ఆలోచించట్లేదు. చూస్తుంటే ఇది భవిష్యత్తులో టాలీవుడ్‌కి సంకటంలా మారనుందా అనే సందేహం కలుగుతోంది.టాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే అంతంత మాత్రంగానే ఉందనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఏడాది మొత్తంలో సరాసరిగా 250-300 సినిమాలు రిలీజైతే వీటిలో 10-20 తప్పితే మిగిలిన మూవీస్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఎవరు ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా ఇదే సత్యం. కానీ అటు హీరోలకు గానీ ఇటు దర్శకనిర్మాతలకు గానీ ఈ విషయం అర్థం కావట్లేదా అనిపిస్తుంది.ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్ గానీ టికెట్ రేట్లు గానీ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో.. మూవీస్ బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. హీరోలకు పదుల కోట్లు లేదంటే వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్నారు. నిర్మాణానికీ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెస్తున్నారు. ఇంతా చేసి హిట్స్ కొడుతున్నారా అంటే లేదు. పదిలో ఒకటో రెండు మాత్రమే హిట్ అవుతున్నాయి. వీటికి కూడా పెట్టిన డబ్బులు తిరిగి వస్తున్నాయి గానీ పెద్దగా లాభాలు మాత్రం రావట్లేదు. అటు సినిమాలు హిట్ కాక, ఇటు అప్పులు పెరిగిపోతుండటం కలవరపరిచే విషయం.టికెట్ రేట్లు అయితే ఎప్పటికప్పుడు చర్చల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు టికెట్ రేట్లు రూ.50, రూ.100, రూ.150.. ఇలా అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు అంటూ ట్రెండ్ మొదలైందో వీటికోసం రేట్లలో పెంపు అడుగుతున్నారు. ప్రీమియర్లకు అయితే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుని మరీ వందలు, వేల రూపాయలు రేట్లు పెట్టుకుంటున్నారు. అభిమానులు.. తమ హీరో మూవీ కలెక్షన్స్ ఎక్కడ తగ్గిపోతాయోనని నామోషీ వల్లనో ఏమో గానీ ఇంతింత రేట్లు పెట్టి థియేటర్లకు వెళ్తారు. మరి సామాన్య ప్రేక్షకుడు కొనుగోలు చేస్తాడా అంటే సందేహమే.ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. థియేటర్లలో టికెట్ రేట్లు, తినుబండారాల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. దీనికి బదులు ఇందులో కొత్త మొత్తం పెట్టి ఓటీటీల్లో సినిమాలు చూసుకుంటున్నారు. ఈ ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలకు అది కూడా బాగుందనే టాక్ వస్తే వెళ్తున్నారు. చిన్న చిత్రాలకైతే బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే తప్ప ఆడియెన్స్.. థియేటర్ ముఖం చూడట్లేదు. ఒకప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకేలా టికెట్ రేటు ఉండేది. ఇప్పుడు అంతరం కనిపిస్తోంది. ప్రేక్షకుడు కూడా చూడాలా వద్దా అనే విషయంలో అంతరం చూపిస్తున్నాడు.

Tollywood tv actress Buys Luxury car pics goes viral5
కొత్త కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర నటి

టాలీవుడ్ బుల్లితెర నటి అన్షు రెడ్డి తన కోరికను నెరవేర్చుకుంది. ఖరీదైన కారును కొనుగోలు చేసిన సీరియల్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న బుల్లితెర నటి ఆ తర్వాత పలు సీరియల్స్‌తో అభిమానులను మెప్పించింది.అన్షు రెడ్డి దాదాపు పదేళ్లుగా 15కి పైగా సీరియల్స్‌లో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో నర్మదగా టాలీవుడ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. అన్షు తెలుగుతో పాటు తమిళ సీరియల్స్‌లోనూ కనిపించింది. సీరియల్స్‌తో పాటు డీ జోడీ-20లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. అంతే కాకుండా అన్షు రెడ్డికి సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఎలాంటి వీడియోలు చేయడం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది బుల్లితెర భామ. View this post on Instagram A post shared by Anshu Reddy❤ (@_anshureddy)

Tollywood Actress Mehreen Pirzada Reacts On Marriage Rumours6
'నాకు ఎవరితోనూ పెళ్లి కాలేదు'.. రూమర్స్‌పై టాలీవుడ్‌ హీరోయిన్ ఆగ్రహం

టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వెంకీమామ, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్‌2, ఎఫ్‌3 సినిమాలతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా రాజా ది గ్రేట్‌ చిత్రంలో రవితేజ సరసన కనిపించింది.అయితే సినీతారలపై రూమర్స్ రావడం సహజం. డేటింగ్, పెళ్లి అంటూ ఎప్పుడో ఒకసారి రూమర్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. గతంలో మెహరీన్‌పై కూడా అలాగే వదంతులు వచ్చాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో మెహరీన్‌ ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత అదంతా ఫేక్ అని తేలిపోయింది. ‍అప్పటి నుంచి మెహరీన్‌ సినిమాలతో బిజీ అయిపోయింది.అయితే తాజాగా మరోసారి మెహరీన్‌ పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. దీంతో మెహరీన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకపోయినా ఇలాంటి వార్తలు రాయడం చూస్తుంటే వింతగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు. కేవలం డబ్బుల కోసం పనికిమాలిన వార్తలతో జర్నలిజం పూర్తిగా దెబ్బతినిందని మెహరీన్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ విషయంపై రెండు ఏళ్లుగా మౌనంగా ఉన్నానని.. నిరంతరం ఇలాంటి వేధింపుల కారణంగా ఈ రోజు మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.తాను ఎవరో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు రాశారని మెహరీన్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎప్పుడు కలవని వ్యక్తితో పెళ్లయిందని రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. నాకు ఇప్పటి వరకు ఎవరితోనూ పెళ్లి కాలేదు.. నన్ను నమ్మండి అంటూ పోస్ట్‌ చేసింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసుకుంటానని మెహరీన్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ట్వీట్‌తో మెహరీన్‌ పెళ్లి రూమర్స్‌కు ఇక చెక్ పడినట్లే.IMPORTANT!!!Nowadays it’s bizzare how misinformation can spread without any repercussions for it. And journalism has definitely taken a hit when it comes to stupid paid articles. I’ve stayed shut about this for 2 years but because of constant harassment I choose to speak up…— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) December 16, 2025

IBomma Ravi Case Latest Update7
మరోసారి పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి

సినిమాలని పైరసీ చేసి పోలీసులకు చిక్కిన రవి అలియాస్ ఐబొమ్మ రవి.. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. రీసెంట్‌గా బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్స్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో రవిని 12 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఒక్కో కేసులో 3 రోజులు పాటు విచారించాలని ఆదేశించింది. దీంతో 4 కేసులకుగాను 12 రోజులు పాటు విచారించనున్నారు. ఈనెల 18 నుంచి సైబర్ క్రైమ్ విచారణ మొదలవుతుంది.మరోవైపు ఇవ్వాళ కొనసాగిన విచారణలోనే రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ తమ వాదనలు వినిపించారు. రవిని కస్టడీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం.. కస్టడీకి తీసుకుంటేనే రవి నెట్వర్క్ బయటపడుతుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్లతో సినిమాల పైరసీ చేశాడు. దీని ద్వారానే బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇందుకోసం కరేబియన్‌ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్‌ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు.

Mufti Police Movie OTT Telugu Streaming Details8
ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ ఈ ఏడాది రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ఐశ్వర్యా రాజేశ్ మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం గత నెలలో తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)అర్జున్ సర్జా, ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ 'తీయవర్ కులై నడుంగ'. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో 'మఫ్టీ పోలీస్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరైన ప్రమోషన్స్ చేయకుండా విడుదల చేయకపోయేసరికి ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. గతవారం తమిళ వెర్షన్, సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. తెలుగు వెర్షన్‌ ఈ శుక్రవారం(డిసెంబరు 19) నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.'మఫ్టీ పోలీస్' విషయానికొస్తే.. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసు విచారణని ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జా) తీసుకుంటాడు. అయితే అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా కనిపిస్తారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నాడా లేదా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటి? ఇందులో ఐశ్వర్యా రాజేశ్ పాత్రేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)

Ranveer Singh film Dhurandhar will Become the Highest Collections in 20259
ఇకపై కాంతార, ఛావా కాదు.. దురంధర్‌ పేరు రాసుకోండి..!

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. తెలుగులో బాక్సాఫీస్ వద్ద అఖండ-2 రిలీజైన దురంధర్ వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం 11 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్‌ సైతం మేకర్స్‌ను కొనియాడారు.సైయారాను దాటేసిన దురంధర్..డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన దురంధర్‌ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్‌ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ‍అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. రెండవ సోమవారం కూడా కలెక్షన్లపరంగా దుమ్ములేపింది. మొదటి సోమవారం కంటే అధిక వసూళ్లు రాబట్టింది. ఈ లిస్ట్‌లో తొలి రెండు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1, విక్కీ కౌశల్ ఛావా ఉన్నాయి.కాంతార చాప్టర్-1 ను అధిగమించే ఛాన్స్..ఈ మూవీ రిలీజై ఇప్పటికి 11 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ‍అలా దురంధర్‌ తెలుగులోనూ రిలీజైతే ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్‌-1ను త్వరలోనే దురంధర్ అధిగమించే ఛాన్స్ ఉంది.అందుకే బజ్‌..పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాకిస్తాన్‌లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు. అందువల్లో దేశవ్యాప్తంగా ఈ మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించడం.. రెండేళ్ల గ్యాప్ తర్వాత రణ్‌వీర్ సింగ్‌ మూవీ రావడం కూడా దురంధర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా అత్యధిక వసూళ్లు సాధించింది.ఇప్పటివరకు 11 రోజుల్లోనే రూ.600.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో ఇండియాలో ఏకంగా రూ.140 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.600 కోట్ల మార్క్‌తో ఈ ఏడాది రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ సైయారా (రూ.580) కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా పద్మావత్ (రూ.585 కోట్లు), సంజు (రూ.592 కోట్లు) వంటి పెద్ద హిట్‌ల రికార్డులను తుడిచిపెట్టేసింది.ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీల నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్‌, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్‌గా మార్చి 12, 2026న విడుదల కానుంది.

Top 10 Most Beautiful Actresses in the World 202510
ప్రపంచంలో అందమైన టాప్‌ టెన్ హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆమె ఒక్కరే..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్‌తో పాటు గ్లామర్‌ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. కానీ అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్ పడకపోయినా ఛాన్స్ రావడం కష్టమే. సినిమా అనే రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలా ఈ ఏడాది అత్యంత అందమైన తారల గురించి చర్చించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే టాప్‌ టెన్‌ అందమైన హీరోయిన్ల లిస్ట్‌లో ఇండియా నుంచి కేవలం ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. ఆమె మరెవరో కాదు.. ఆదిపురుష్ భామ కృతి సనన్ మాత్రమే టాప్-5లో నిలిచింది. ఈ ఏడాదితో గానూ ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్ట్‌లో కృతి సనన్ ఐదో స్థానం దక్కించుకుంది.మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ, చైనాకు చెందిన దిల్‌రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు. టాప్‌-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్‌ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్‌ నిలిచారు.Top 10 Most Beautiful Actresses in the World 2025/261. 🇦🇺 Margot Robbie2. 🇺🇸 Shailene Woodley3. 🇨🇳 Dilraba Dilmurat4. 🇰🇷 Nancy McDonie5. 🇮🇳 Kriti Sanon6. 🇵🇰 Hania Aamir7. 🇨🇺/🇪🇸 Ana de Armas8. 🇬🇧 Emma Watson9. 🇺🇸 Amber Heard10. 🇹🇷 Hande Erçel(Source: IMDb List - Top… pic.twitter.com/DlW1Hj9Pzy— Infodex (@infodexx) December 15, 2025

Advertisement
Advertisement