ప్రధాన వార్తలు
హీరో బూతు పాట.. అక్కడున్నవారికి తెలీదు: నిర్మాత
సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ప్రమోషన్స్ది కీలక పాత్ర. కానీ, ప్రమోషన్స్లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ దెబ్బతింటుంది. అందుకు దండోరా సినిమాయే సాక్ష్యం. సినిమా బాగున్నప్పటికీ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన నీచపు కామెంట్స్ వల్ల జనాలు దండోరాను లైట్ తీసుకున్నారు. ఇదంతా చూశాక కూడా జాగ్రత్తపడకపోతే మొదటికే మోసం వస్తుంది.బూతు పాటవిషయమేంటంటే.. బుల్లితెర హీరో ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ తనలో సింగింగ్ టాలెంట్ బయటపెట్టాడు. అయితే అత్యుత్సాహంతో అసభ్య పదాలున్న పాట పాడాడు. స్టేజీపై అందరిముందు ఇలా బూతు పాట పాడటంతో అతడిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రహాస్పై పోలీస్ కేసు కూడా నమోదైంది.పొరపాటుకు చింతిస్తున్నాంఈ క్రమంలో బరాబర్ ప్రేమిస్తా టీమ్ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాలన్న ఉద్దేశంతో ఒక పాట పాడాడు. ఆ పాటలో కొంచెం పొరపాటు జరిగింది. దానిగురించి ఈవెంట్లో ఉన్న ఎవరికీ తెలియదు. అతడు కావాలని చేయలేదు. ఏదేమైనా పొరపాటు జరిగినందుకు మేము బాధపడుతున్నాం అన్నాడు.సినిమాలో అలాంటి పాటల్లేవ్దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్ పాటలో తప్పులు దొర్లాయి. అందుకు చింతిస్తున్నాం. సినిమాలో మాత్రం అలాంటి పాటలు లేవు అని వెల్లడించాడు. అటు జేడీ చక్రవర్తి కూడా ఆ పాట పాడినప్పుడు తాను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్గా చేయడం తప్పు కాదని, కానీ, అవి అసభ్యంగా, ఆడవారిని కించపర్చేలాగా ఉండకూడదన్నాడు.చదవండి: మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. ఆరుసార్లు రక్తమార్పిడి: ప్రియాంక భర్త ఎమోషనల్
'360 గ్రాముల బంగారం'.. పాదపూజ చేసిన నటుడు
'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్ దేశం చప్పట్లు కొడుతోంది.నిజాయితీజనవరి 11న చెన్నైలోని టీ నగర్లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.ఘనంగా సన్మానంఅప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశాడు.అందుకే పాదపూజ చేశా..బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. సినిమాఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్.పార్తీబన్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ వెబ్ సిరీస్లోనూ కనిపించాడు. தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026 చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్ ఎమోషనల్
'మన శంకర వరప్రసాద్గారు' 25 రోజుల కలెక్షన్స్.. ఇండస్ట్రీ రికార్డ్
మన శంకర వరప్రసాద్ గారు ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. 25రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 375 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు.మొదటివారంలోనే మన శంకర వరప్రసాద్ గారు రూ.292 కోట్లు వసూలు చేసింది. కేవలం ఫస్ట్ వీక్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు 25 రోజుల్లో రూ. 375 కోట్లు రాబట్టి ఆల్టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగు భాషలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇప్పటి వరకు ఏదీ లేదు. ఇప్పటి వరకు రూ. 300 కోట్ల కలెక్షన్స్తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, గుంటూరు కారం, సర్కారు వారి పాట, మహార్షి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు వర్షన్లో మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే.ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు రాబట్టింది. చిరు (Chiranjeevi) కెరీర్లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు నెలకొల్పింది. ఆపై బుక్మైషోలో ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ప్రతి అంశంలో మన శంకర వరప్రసాద్ రికార్డ్స్ క్రియేట్ చేశారు.
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ, బాలీవుడ్లో మాత్రం పెళ్లయ్యాకే కాదు, తల్లయ్యాక కూడా హీరోయిన్లు ఓ వెలుగు వెలుగుతున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి పలువురు హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా కూడా అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.నా కూతురే ఒక అద్భుతంహీరోయిన్ ప్రియాంక చోప్రా- సింగర్ నిక్ జోనస్ దంపతులకు 2022లో కూతురు మాల్తీ మేరీ చోప్రా జన్మించింది. అయితే మాల్తీ మూడు నెలలు ముందుగా పుట్టిందని, అప్పుడు చాలా బాధ అనుభవించామంటున్నాడు నిక్ జోనస్. తాజాగా ఓ పాడ్కాస్ట్లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. 'నా కూతురు ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటీవలే తనకు నాలుగేళ్లు నిండాయి. కిలో కంటే తక్కువ బరువుభవిష్యత్తులో తను గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తను చేసే పనులన్నీ నేను కళ్లారా చూస్తూ ఆస్వాదించాలి. తన జననం అంత ఈజీగా జరగలేదు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాం. ఆ తల్లికి 2022 ఏప్రిల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. తీరా డెలివరీ ముందే అవొచ్చన్నారు. కిలో కంటే తక్కువ బరువుతో పాప పుట్టింది. అప్పుడంతా కరోనా కాలం. పుట్టిన మూడు నెలలకే మాల్తీ అనారోగ్యంపాలైంది. హాస్పిటల్కు తీసుకెళ్లాం. ఫలించిన నిరీక్షణమూడున్నర నెలల్లో ఆరుసార్లు రక్తమార్పిడి చేశారు. నేను, నా భార్య రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ప్రియాంక సానుకూల దృక్పథంతో చాలా ధైర్యంగా నిలబడింది. ఈ విషయంలో తనే నాకు ఇన్స్పిరేషన్.. అలా మేమిద్దరం కుంగిపోకుండా, ఓపికగా తనకు బాగవుతుందని ఎదురుచూశాం. మా నిరీక్షణ ఫలించింది. నా బిడ్డ అనారోగ్యాన్ని జయించింది. బరువు పెరిగి ఆరోగ్యంగా మా చేతుల్లోకి వచ్చింది' అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు నిక్.చదవండి: చంద్రహాస్పై కేసు నమోదు
బిగ్బాస్
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
యాక్సిడెంట్తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
2009లో ఇండస్ట్రీలోకి.. ఇన్నాళ్లకు నటిగా..: స్రవంతి స్పీచ్
బిగ్బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
A to Z
నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ థ...
సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్
శృంగారం లేదా సె*క్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చా...
బ్లాక్బస్టర్ సిరీస్.. ఇప్పుడు మళ్లీ యానిమేషన్లోనూ
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థ...
ఓటీటీలో దురంధర్ క్రేజ్.. ఏకంగా పాకిస్తాన్లో నంబర్వన్గా ట్రెండింగ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్...
'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?
'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స...
'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది
గతేడాది డిసెంబరులో రిలీజై సెన్సేషన్ సృష్టించిన హిం...
కూతురు తెచ్చిన అదృష్టం.. హీరోల రేంజ్ మారిపోయింది!
ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప...
15 ఏళ్లకే రోడ్డుపైకి.. ఎన్నో అవమానాలు: అమాల్ మాలిక్
సినిమా బ్యాక్గ్రౌండ్ వల్ల కెరీర్ తొలినాళ్లలో తన...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవ...
ఓటీటీకి మనశంకర వరప్రసాద్గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమ...
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్...
ఓ టార్చర్ ప్రేమ కథా చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల
సన్నీ మాదాల, మౌనిక జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్...
ఫొటోలు
ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)
ఫ్యామిలీతో వండర్ పార్క్లో లహరి (ఫోటోలు)
బర్త్డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్లో ఫోటోలు
‘ఎర్రచీర’ మూవీ హీరోయిన్ కారుణ్య చౌదరి (ఫొటోలు)
‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ ‘మారెమ్మ’ మూవీ టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
నేను తప్పు చేసినా సహించావ్.. సంఘవి ఎమోషనల్ (ఫోటోలు)
శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)
గాసిప్స్
View all
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
"ది ప్యారడైజ్" రిలీజ్పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్లోనే!
సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ?
'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?
భర్త కోసం పేరు మార్చుకోనున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా?
సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్
రామ్ బతికే ఉన్నాడా? సీతారామం సీక్వెల్!
మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!
రివ్యూలు
View all
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
2.75
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ సర్వం మాయ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో మలయాళ చిత్రాల కోసం ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరో మలయాళ థ్రిల్లర్ మూవీ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.నివిన్ పౌలీ హీరోగా నటించిన చిత్రం బేబీ గర్ల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై మలయాళ ఫ్యాన్స్ను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. కాహా.. ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి ఎలా అదృశ్యమైందన్న పాయింట్తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీలో లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు. A missing baby girl. An attendant on the run. A truth darker than the crime.Nivin Pauly, Lijomol, and Sangeeth Pratap headline this high-tension thriller.Watch #BabyGirl, streaming from 12th February, only on Sony LIV.@NivinOfficial pic.twitter.com/WnyS2vnXHG— Sony LIV (@SonyLIV) February 5, 2026
ఉపాసనకు ట్విన్స్.. ఇంటికి వెళ్తున్న వీడియో వైరల్..!
ఈ ఏడాది జనవరి మాసం మెగా ఫ్యామిలీలో సంబురాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రామ్ చరణ్ దంపతులు సారి తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానలంతా సంబురాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.తాజాగా ఉపాసన అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఉపాసన.. ట్విన్స్ను తీసుకుని ఇంటికెళ్లారు. ఆస్పత్రి నుంచి కారులో వెళ్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Visuals of Mega Power Star @AlwaysRamCharan and #UpasanaKonidela as they take the #MegaTwins home!📸🫶#RamCharan #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/bkTROvEsgC— Telugu FilmNagar (@telugufilmnagar) February 5, 2026
అర్ధరాత్రి అదే ఆలోచన.. స్టేజీపై ఏడ్చేసిన భూమిక
హీరోయిన్ భూమిక చావ్లా చాలాకాలం తర్వాత యుఫోరియా మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, సారా అర్జున్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతోంది. ఈక్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో భూమిక భావోద్వేగానికి లోనైంది. ఏడుపు ఆపుకోలేకపోయిన భూమికయుఫోరియాలాంటి సినిమాను తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నిన్ననే సినిమా మొత్తం చూశాను. రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి ఆ పాత్ర గురించే ఆలోచించా.. అంటూ ఏడ్చేసింది. దాంతో అక్కడే ఉన్న గుణశేఖర్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే దుఃఖంతో గొంతు కూరుకుపోవడంతో ఆమె ఇక మాట్లాడలేకపోయింది. ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీశా..తర్వాత గుణశేఖర్ మాట్లాడుతూ.. 1992లో వచ్చిన లాఠీ నా మొదటి సినిమా. యుఫోరియా నా పద్నాలుగో సినిమా. కొత్త కథ చెప్పాలని సాయశక్తులా ప్రయత్నించాను. ప్రేక్షక దేవుళ్ల సమయం, డబ్బు, విజ్ఞతకు విలువిస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశాను. మీ సమయం, డబ్బు.. ఏదీ వృథా చేయను. తొలిసారి చూస్తున్నా..మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ కథకు వెన్నెముక భూమిక. తను చాలా స్ట్రాంగ్ లేడీ. తనలా ఎమోషనల్ అవడం తొలిసారి చూస్తున్నాను. సినిమా చూసిన కొందరు భయపడ్డామన్నారు. యుఫోరియా అనే టైటిల్ ఎందుకు పెట్టామో రేపు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: కాబోయే భార్యపై అల్లు శిరీష్ ప్రేమ వర్షం
'నన్ను ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్బాస్ అమర్దీప్
బిగ్బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్దీప్ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.అవకాశాల కోసం తిరుగుతూ ఛీ కొట్టించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. ఇదేదో సింపతీ కోసం చెప్పడం లేదు#AmardeepChowdary #SaylimChaudhari #SumathiSathakam pic.twitter.com/WmxM6pwUdO— Filmy Focus (@FilmyFocus) February 5, 2026
'ఆ స్ట్రెస్ ఏంటో నాకు కూడా తెలుసు'.. నిహారిక ఆసక్తికర కామెంట్స్
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం శ్రీ చిదంబరంగారు.ఈ మూవీకి వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా టీమ్పై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్తో పాటు నటులపై కొనియాడారు. మరి ముఖ్యంగా నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడారు. సినిమా నిర్మించడం అనేది అంత సులభం కాదని అన్నారు. కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమా నా వీపు మీద వేసుకున్నందుకు.. ఒక నిర్మాతకు ఉండే స్ట్రెస్ ఎలాంటిదో నాకు కూడా తెలుసన్నారు. మీలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వస్తేనే సినిమా ఊపిరి తీసుకుంటుందని నా నమ్మకమని అన్నారు. ఎవరికైనా సరే మొదటి సినిమా ఫీలింగ్ అనేది లైఫ్లో ఎప్పటికీ రాదని మూవీ టీమ్ను ఉద్దేశించి మాట్లాడారు. కమిటీ కుర్రాళ్లు నా వీపు మీద వేసుకున్నందుకు.. నాకు తెలుసు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది అనేది#VamsiTummala #SandhyaVasishta #Gopinath #VinayRatnam pic.twitter.com/86RQYx2iTc— Filmy Focus (@FilmyFocus) February 4, 2026
కాబోయే భార్యపై ముద్దుల వర్షం.. అల్లు శిరీష్ వీడియో
అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లికి రెడీ అయింది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఆరోజు అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కావడం విశేషం!బ్యాచిలర్ పార్టీపెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉండకపోతే ఎలా? సింగిల్ లైఫ్కు చెక్ పెట్టబోతున్నాడు కాబట్టి బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలిగా! అందుకే దుబాయ్లో శిరీష్- నయనిక గ్రాండ్గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఓ పడవలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా ఆ వీడియోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో అల్లు అర్జున్, స్నేహతో పాటు మిగతా అందరూ నచ్చిన ఫుడ్ ఆస్వాదిస్తూ, డ్యాన్స్ చేస్తూ, ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపారు. శిరీష్ కాబోయే భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. దుబాయ్లో జనవరి 30, 31 తేదీల్లో ఈ సెలబ్రేషన్స్ జరిగాయన్నాడు శిరీష్.అలా మొదలైంది.2023 అక్టోబర్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. వీరి పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక వచ్చింది. అదే పార్టీకి శిరీష్ కూడా వెళ్లగా.. అక్కడ నయనికను చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెద్దలు కూడా ప్రేమకు పచ్చజెండా ఊపారు. అలా ఈ ప్రేమకథ వచ్చే నెలలో పెళ్లిపుస్తకంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: 36 తులాల బంగారం.. చెత్త శుభ్రం చేసే మహిళ కాళ్లు మొక్కిన నటుడు
హీరో బూతు పాట.. అక్కడున్నవారికి తెలీదు: నిర్మాత
సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ప్రమోషన్స్ది కీలక పాత్ర. కానీ, ప్రమోషన్స్లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ దెబ్బతింటుంది. అందుకు దండోరా సినిమాయే సాక్ష్యం. సినిమా బాగున్నప్పటికీ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన నీచపు కామెంట్స్ వల్ల జనాలు దండోరాను లైట్ తీసుకున్నారు. ఇదంతా చూశాక కూడా జాగ్రత్తపడకపోతే మొదటికే మోసం వస్తుంది.బూతు పాటవిషయమేంటంటే.. బుల్లితెర హీరో ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ తనలో సింగింగ్ టాలెంట్ బయటపెట్టాడు. అయితే అత్యుత్సాహంతో అసభ్య పదాలున్న పాట పాడాడు. స్టేజీపై అందరిముందు ఇలా బూతు పాట పాడటంతో అతడిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రహాస్పై పోలీస్ కేసు కూడా నమోదైంది.పొరపాటుకు చింతిస్తున్నాంఈ క్రమంలో బరాబర్ ప్రేమిస్తా టీమ్ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాలన్న ఉద్దేశంతో ఒక పాట పాడాడు. ఆ పాటలో కొంచెం పొరపాటు జరిగింది. దానిగురించి ఈవెంట్లో ఉన్న ఎవరికీ తెలియదు. అతడు కావాలని చేయలేదు. ఏదేమైనా పొరపాటు జరిగినందుకు మేము బాధపడుతున్నాం అన్నాడు.సినిమాలో అలాంటి పాటల్లేవ్దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్ పాటలో తప్పులు దొర్లాయి. అందుకు చింతిస్తున్నాం. సినిమాలో మాత్రం అలాంటి పాటలు లేవు అని వెల్లడించాడు. అటు జేడీ చక్రవర్తి కూడా ఆ పాట పాడినప్పుడు తాను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్గా చేయడం తప్పు కాదని, కానీ, అవి అసభ్యంగా, ఆడవారిని కించపర్చేలాగా ఉండకూడదన్నాడు.చదవండి: మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. ఆరుసార్లు రక్తమార్పిడి: ప్రియాంక భర్త ఎమోషనల్
'360 గ్రాముల బంగారం'.. పాదపూజ చేసిన నటుడు
'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్ దేశం చప్పట్లు కొడుతోంది.నిజాయితీజనవరి 11న చెన్నైలోని టీ నగర్లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.ఘనంగా సన్మానంఅప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశాడు.అందుకే పాదపూజ చేశా..బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. సినిమాఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్.పార్తీబన్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ వెబ్ సిరీస్లోనూ కనిపించాడు. தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026 చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్ ఎమోషనల్
'మన శంకర వరప్రసాద్గారు' 25 రోజుల కలెక్షన్స్.. ఇండస్ట్రీ రికార్డ్
మన శంకర వరప్రసాద్ గారు ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. 25రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 375 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు.మొదటివారంలోనే మన శంకర వరప్రసాద్ గారు రూ.292 కోట్లు వసూలు చేసింది. కేవలం ఫస్ట్ వీక్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు 25 రోజుల్లో రూ. 375 కోట్లు రాబట్టి ఆల్టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగు భాషలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇప్పటి వరకు ఏదీ లేదు. ఇప్పటి వరకు రూ. 300 కోట్ల కలెక్షన్స్తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, గుంటూరు కారం, సర్కారు వారి పాట, మహార్షి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు వర్షన్లో మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే.ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు రాబట్టింది. చిరు (Chiranjeevi) కెరీర్లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు నెలకొల్పింది. ఆపై బుక్మైషోలో ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ప్రతి అంశంలో మన శంకర వరప్రసాద్ రికార్డ్స్ క్రియేట్ చేశారు.
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ, బాలీవుడ్లో మాత్రం పెళ్లయ్యాకే కాదు, తల్లయ్యాక కూడా హీరోయిన్లు ఓ వెలుగు వెలుగుతున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి పలువురు హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా కూడా అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.నా కూతురే ఒక అద్భుతంహీరోయిన్ ప్రియాంక చోప్రా- సింగర్ నిక్ జోనస్ దంపతులకు 2022లో కూతురు మాల్తీ మేరీ చోప్రా జన్మించింది. అయితే మాల్తీ మూడు నెలలు ముందుగా పుట్టిందని, అప్పుడు చాలా బాధ అనుభవించామంటున్నాడు నిక్ జోనస్. తాజాగా ఓ పాడ్కాస్ట్లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. 'నా కూతురు ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటీవలే తనకు నాలుగేళ్లు నిండాయి. కిలో కంటే తక్కువ బరువుభవిష్యత్తులో తను గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తను చేసే పనులన్నీ నేను కళ్లారా చూస్తూ ఆస్వాదించాలి. తన జననం అంత ఈజీగా జరగలేదు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాం. ఆ తల్లికి 2022 ఏప్రిల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. తీరా డెలివరీ ముందే అవొచ్చన్నారు. కిలో కంటే తక్కువ బరువుతో పాప పుట్టింది. అప్పుడంతా కరోనా కాలం. పుట్టిన మూడు నెలలకే మాల్తీ అనారోగ్యంపాలైంది. హాస్పిటల్కు తీసుకెళ్లాం. ఫలించిన నిరీక్షణమూడున్నర నెలల్లో ఆరుసార్లు రక్తమార్పిడి చేశారు. నేను, నా భార్య రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ప్రియాంక సానుకూల దృక్పథంతో చాలా ధైర్యంగా నిలబడింది. ఈ విషయంలో తనే నాకు ఇన్స్పిరేషన్.. అలా మేమిద్దరం కుంగిపోకుండా, ఓపికగా తనకు బాగవుతుందని ఎదురుచూశాం. మా నిరీక్షణ ఫలించింది. నా బిడ్డ అనారోగ్యాన్ని జయించింది. బరువు పెరిగి ఆరోగ్యంగా మా చేతుల్లోకి వచ్చింది' అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు నిక్.చదవండి: చంద్రహాస్పై కేసు నమోదు
సినిమా
ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..
రష్మిక, విజయ్ పెళ్లి డేట్ వచ్చేసింది..!
అందుకే మహేష్ తో 15 ఏళ్ళు పట్టింది.. వారణాసి సీక్వెల్ పై రాజమౌళి
బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!
నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
Chiranjeevi : క్యాన్సర్ మహమ్మారిని తేలిగ్గా తీసుకోకండి..
స్పిరిట్ లో అర్జున్ రెడ్డి.. వంగ మాస్టర్ ప్లాన్..!
ధురంధర్ డైరక్టర్ తో అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్..!
Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది
