ప్రధాన వార్తలు
హీరో ఎవరనేది పట్టించుకోను : మీనాక్షి చౌదరి
‘నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే చూస్తాను’ అన్నారు యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.⇢ ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.⇢ నవీన్తో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. లక్కీ భాస్కర్ లోని సుమతి పాత్రకు ఈ చారులత పాత్ర పూర్తి భిన్నమైనది. దర్శకులు ఆ పాత్రలను మలిచిన తీరుకి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.⇢ గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.⇢ ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.⇢ నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.⇢ ప్రస్తుతం నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి.
దాసరి మా తాత.. ఇన్నాళ్లు అందుకే బయటపెట్టలేదు
ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఒకటి. రవితేజ హీరోగా నటించాడు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా చేశారు. వీళ్లలో డింపుల్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. చాన్నాళ్లుగా సినిమాలైతే చేస్తోంది గానీ సరైన బ్రేక్ రావట్లేదు. ఈమె గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసరి నారాయణరావుతో బంధుత్వం గురించి బయటపెట్టింది.దాసరి నారాయణరావు గారు నాకు తాత అవుతారు. మా తాతకు ఆయన కజిన్. అయితే ఈ విషయం చాలామందికి తెలీదు. ఇన్నాళ్లు ఎందుకనో పెద్దగా చెప్పుకోలేదు. మా నానమ్మ పేరు ప్రభ. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తోనూ అప్పట్లో 'దానవీర శూరకర్ణ'లో నటించారు. అలానే మా అమ్మ, వాళ్ల అక్కచెల్లెళ్లు అందరూ నటులే. తెలుగుతో పాటు మలయాళంలోనూ మూవీస్ చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్ పెద్దమ్మ ఆ మాట అన్నారనే రేవంత్రెడ్డి కక్ష.. హరీశ్రావు సంచలన కామెంట్)నానమ్మ ప్రభ.. 'కిక్' సినిమాలో రవితేజకు తల్లి పాత్ర చేసింది. ఆ టైంలోనే నా ఫొటోని దర్శకుడు సురేందర్ రెడ్డికి చూపించడంతో ఇలియానా చెల్లి పాత్ర కోసం అడిగారు. అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను. ఇప్పుడే యాక్టింగ్ ఎందుకు? అని ఇంట్లో వాళ్ల వద్దనేశారు. తర్వాత చాలా బాధపడ్డారు. రవితేజతో 'ఖిలాడి' చేస్తున్నప్పుడు ఆయనకు కూడా ఈ విషయం చెప్పాను అని డింపుల్ హయాతి చెప్పుకొచ్చింది.విజయవాడకు చెందిన ఈమె హైదరాబాద్లో పెరిగింది. 'గల్ఫ్' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత పలు మూవీస్, స్పెషల్ సాంగ్స్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఈమె నానమ్మ ప్రభ విషయానికొస్తే.. అప్పట్లో తెలుగులో భూమి కోసం, దానవీర శూరకర్ణ, జగన్మోహిని, లక్ష్మీ కళ్యాణం, కిక్ తదితర మూవీస్ చేశారు. రాఘవేంద్ర, రెబల్ చిత్రాల్లో ప్రభాస్ తల్లిగానూ ప్రభ నటించారు. అయితే ప్రభ, దాసరి నారాయణరావులతో బంధుత్వం ఉందని డింపుల్ ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బాధగా ఉంది : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో ఫేక్ రివ్యూలు, నెగెటివ్ రేటింగ్స్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ, కొంత బాధను కూడా కలిగిస్తోందని ట్వీట్ చేశారడు.‘ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం సంతోషకరం. ఇది చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుతుంది. అదే సమయంలో బాధ కలిగిస్తోంది ఎందుకంటే... మన సొంత మనుషులే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ‘మనం బతుకుతూ ఇంకొకరికి బతికించాలి’ అనే సూత్రం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది?(చదవండి: మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్పై కక్ష.. హరీశ్రావు సంచలన కామెంట్)'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. అలా చెబితే ఎవరూ పట్టించుకోలేదు .ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకే తిరిగి చెప్పారు. కానీ నాతో సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు ఈ సమస్య యొక్క తీవ్రత తర్వాత అర్థమయింది.ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ, నా కలలను , నా లాగే నా తర్వాత వచ్చే చాలా మంది కలలను కాపాడుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూ అనేక రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇన్నాళ్లకు ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. (చదవండి: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?)మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆదేశాలతో సమస్యను పూర్తి పరిష్కారం లభించదు కానీ, ఆందోళన చెందాల్సిన విషయాల్లో ఒకటి తగ్గుతుంది. ఇదంతా పక్కనపెట్టి ఇప్పుడైతే మనం ‘మన శంకరవరప్రసాద్’(Mana Shankara Varaprasad Garu) తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయవంతంగా అలరించాలని కోరుకుందాం’ అని విజయ్ ట్వీట్ చేశాడు. Happy and Sad to see this - Happy to know hardwork, dreams and money of many is protected in a way. And Sad because of the reality of our own people causing these problems. What happened to live and let live? and growing together?Since the Days of Dear Comrade i first began… pic.twitter.com/gF55B8nXqt— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2026
చచ్చిపోవాలనిపించింది.. ఎంతోమందిని కలిశా..
చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడుతున్నప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలా తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు థెరపీ తీసుకుని చాలా మంచి పని చేశానంటోంది మలయాళ నటి పార్వతి తిరువోతు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థెరపీ తీసుకోవడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం. అర్ధరాత్రి థెరపీకాకపోతే మనకు కరెక్ట్ థెరపిస్ట్ దొరకాలి. అందుకు నాకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను అమెరికన్ థెరపిస్ట్ను కలిశాను. అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల సమయంలో నాతో మాట్లాడేవారు. తర్వాత ఇక్కడే ఉన్న థెరపిస్ట్లను సంప్రదించాను. వారు నా సమస్యలేంటో గుచ్చిగుచ్చి అడిగి.. వాటిని వెలికితీసి మరింత బాధపెట్టేవారు.చచ్చిపోవాలన్న ఆలోచనలుఅప్పటికే నేను తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాను. చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కరెక్ట్ థెరపిస్ట్ దొరికాక నా బాధకు ఉపశమనం లభించింది. నన్ను ఎంతో బాధపెట్టిన 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్ని నా జీవితంలో నుంచే తీసేశాను. సినిమాప్రస్తుతం నేను కుటుంబం, ఫ్రెండ్స్, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. పార్వతి బెంగళూరు డేస్, ఎన్ను నింటె మొయిదీన్, చార్లీ, ఉయరె, వైరస్, పుళు వంటి పలు చిత్రాల్లో నటించింది. దూత వెబ్ సిరీస్తో తెలుగువారికి సైతం పరిచయమైంది.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
బిగ్బాస్
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్
ఇది ప్రారంభం మాత్రమే.. బిగ్బాస్ విన్నర్ గుడ్న్యూస్
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
కల్యాణ్, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్ పంచ్.. వీడియో వైరల్
రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్లో మధుర జ్ఞాపకం: తనూజ
గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
A to Z
'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు?
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. అ...
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'రాజాసా...
ఓటీటీలో 'ఫరియా' డార్క్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ప్రకటన
గుర్రం పాపిరెడ్డి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు...
చైతో పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
హీరోయిన్ శోభిత ధూళిపాళ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది...
రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు!
డార్లింగ్ ప్రభాస్ హారర్ జానర్లో తొలిసారి నటించ...
బంగ్లా నుంచి కబురు వచ్చింది
హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినే...
చిరంజీవి హుక్ స్టెప్, బాలీవుడ్లోనూ టాప్!
ఇప్పుడు తెలుగు ప్రేక్షక సమూహం హుషారుగా హుక్ స్టెప...
సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ!
సినిమాకు ప్రమోషన్స్ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట...
మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు! నటికి ఆఫర్
సెలబ్రిటీలను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కొందరు ...
'అవతార్ 3' విలన్ చార్లీ చాప్లిన్ మనవరాలా?
పదిరోజుల క్రితం థియేటర్లలో వచ్చిన హాలీవుడ్ భారీ బడ...
'స్ట్రేంజర్ థింగ్స్ 5' ఫినాలే ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థ...
భయపెడితే భళా.. బాక్సాఫీస్ గలగలా
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ వుడ్ చూసినా హారర...
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. కొత్తగా ఆ సీన్స్..!
ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్కు డైరెక...
టాక్సిక్లో ఇంటిమేట్ సీన్.. విమర్శలపై డైరెక్టర్ రియాక్షన్..!
కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్...
సడన్ సర్ప్రైజ్.. సంక్రాంతికి విజయ్ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఒక గుడ్న...
సడెన్గా సంక్రాంతి రేసులోకి వచ్చేసిన 'కార్తీ' సినిమా
కోలీవుడ్లో సడెన్గా హీరో కార్తీ సినిమా రేసులోకి వ...
ఫొటోలు
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
భార్య బర్త్డే సెలబ్రేట్ చేసిన నితిన్ (ఫోటోలు)
Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్గా (ఫోటోలు)
శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
'ది రాజా సాబ్' స్పెషల్ మీట్లో సందడిగా చిత్ర యూనిట్ (ఫోటోలు)
తిరుమలలో సినీ నటులు తనికెళ్ల భరణి (ఫోటోలు)
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన.. ఆషికా, డింపుల్ (ఫొటోలు)
'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)
క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)
రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్
గాసిప్స్
View all
'మన శంకర వరప్రసాద్' యూనివర్స్పై అనిల్ రావిపూడి క్లారిటీ
'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?
సంక్రాంతి బాక్సాఫీస్: సర్ప్రైజ్ హిట్ కోసం ఎదురుచూపులు
విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా? మాట నిలబెట్టుకుంటాడా?
టాలీవుడ్లో ఒకేరోజు ఈవెంట్ల జాతర
'అఖండ-2' ఫైనల్ కలెక్షన్స్.. బిగ్ లాస్
చరణ్తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది
ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?
సల్మాన్ ఖాన్ రూ.80 కోట్ల ఆస్తి ఆమె పేరిట?
బాలకృష్ణ, గోపీచంద్ల కథ కంచికి.. మేకర్స్ కీలక నిర్ణయం
రివ్యూలు
View all
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్..
2.5
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
2.25
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
2.75
'దండోరా' సినిమా రివ్యూ
3
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
'ఖైదీ 150' తర్వాత 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్ షోల విషయంలో దుమ్మురేపుతున్నాడు. హైదరాబాద్లో ఏకంగా 200 స్క్రీన్స్లలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. రూ. 600 టికెట్ ఉన్నప్పటికీ దాదాపు అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. ఆపై నార్త్ అమెరికాలో కూడా టికెట్స్ బుకింగ్ జోరు కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ను విడుదల చేసింది. అమెరికాలో కేవలం ప్రీమియర్స్ ద్వారానే 9 లక్షల డాలర్లు (రూ. 8.12కోట్లు) కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. 1మిలియన్ మార్క్ కూడా చేరవచ్చని తెలుస్తోంది. దీంతో చిరంజీవి కెరీర్లో మరో అతిపెద్ద ఓవర్సీస్ ఓపెనింగ్గా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.‘మన శంకర వరప్రసాద్ గారు’ అమెరికా ప్రీమియర్స్లో సత్తా చాటుతున్నాడు. ప్రీమియర్స్ కలెక్షన్స్ పరంగా చిరు కెరీర్లో రెండో చిత్రంగా నిలిచింది. మొదటి స్ధానంలో ఖైదీ 150 మూవీ ఉంది. చిరు రీఎంట్రీ మూవీ కావడంతో కేవలం ప్రీమియర్స్ ద్వారా 1.25 మిలియన్ డాలర్స్ వచ్చాయి. ఆ తర్వాత అంతటి రేంజ్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి దక్కింది. అయితే, చిరు హిట్ సినిమా వాల్తేరు వీరయ్య కూడా 6 లక్షల డాలర్ల వద్దే ఆగిపోయింది. సంక్రాంతి పండుగ కాబట్టి చిరు సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తే తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema)
ఓటీటీలో '120 బహదూర్'.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించిన కొత్త సినిమా ‘120 బహదూర్’ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం అదనంగా రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండా సినిమా చూసే అవకాశం రానుంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీష్ (రాజీ ఫేమ్) దర్శకత్వం వహించారు. పరమ వీర చక్ర అవార్డ్ అందుకున్న మేజర్ సైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ మెప్పించారు. ఇందులో రాశీఖన్నా కీలక పాత్రలో నటించింది. గతేడాదిలో విడుదులైన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ లేకుండా ప్రభుత్వాలు అనుమతులు కూడా ఇచ్చాయి.‘120 బహదూర్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జనవరి 16నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. భాగ్ మిల్కా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్ మరోసారి బయోపిక్ చేయడంతో భారీగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూశారు. ఈ హిస్టారికల్ మూవీ అందరినీ మెప్పిస్తుంది. కానీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, సబ్టైటిల్స్తో చూడొచ్చు.'120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్లో ఎలాంటి యుద్ధం చేశాడు. మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి.
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్
బుజ్జిగాడు సినిమాలో యాక్ట్ చేసిన సంజనా గల్రానీ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. మధ్యలో డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడంతో తన ఇమేజ్ డ్యామేజ్ అయింది. తనకు ఆ కేసులో క్లీన్చిట్ వచ్చినప్పటికీ తన ఆత్మగౌరవం దెబ్బతిందని బాధపడింది. ఆ మరకు పోగొట్టుకునేందుకు బిగ్బాస్ షోను ఎంచుకుంది. తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టింది.బిగ్బాస్ షోలో..చిలిపితనం, ముక్కుసూటితనంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుడ్డు దొంగతనంతో సీజన్పై బజ్ క్రియేట్ చేసిన ఆమె ఏకంగా ఫైనల్స్లో అడుగుపెట్టడం విశేషం. ఈ షో కోసం తన ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసింది. ఆరేండ్ల కుమారుడు అలరిక్ను, ఏడాది కూడా నిండని పాపను భర్తకు అప్పజెప్పి బిగ్బాస్ షోలో పాల్గొంది. లోలోపల ఎంత కుమిలిపోయినా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేది. సంజనా కూతురికి భోగి పండ్లుతాజాగా ఓ సంక్రాంతి ఈవెంట్లో సంజనా కూతురికి దువ్వాడ మాధురి, శ్రీముఖి, రోహిణి భోగి పండ్లు పోశారు. అందులో సంజనా పాప ఎంతో క్యూట్గా నవ్వుతూ కనిపించింది. ఆ చిన్నారి ముందు పుస్తకం, స్టెతస్కోప్, మేకప్ వంటి సామాను పెడితే.. మేకప్ సామానునే పట్టుకుంది. అంటే తల్లి దారిలో నడవనున్నట్లు సిగ్నల్స్ ఇచ్చిందన్నమాట! ఈ సందర్భంగా సంజనా భావోద్వేగానికి లోనైంది. అదే నా సక్సెస్'చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లు అనిపిస్తోంది. ఇప్పటికీ ఇదంతా కలా? నిజమా? అర్థం కావడం లేదు. ఇంత చిన్న పాపను పెట్టుకుని బిగ్బాస్కు వెళ్లడమేంటి? ప్రతిరోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తూ నిద్రపోయేదాన్ని. టాప్ 5వరకు వెళ్లాను. ఇప్పుడు మీ అందరితో ఇక్కడున్నాను.. ఇదే నా విజయం' అని సంజనా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రభాస్కు కలిసిరాని ఆర్ అక్షరం
'నారీ నారీ నడుమ మురారి' అదిరిపోయేలా ట్రైలర్
శర్వానంద్ నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలకానుంది. ఈ మూవీని దర్శకులు రామ్ అబ్బరాజు తెరకెక్కించగా.. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇందులో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. వివాహ భోజనంబు, సామజవరగమన వంటి సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన రామ్ అబ్బరాజు తొలిసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. ఈ మూవీలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నారు.
ప్రభాస్కు అచ్చిరాని R అక్షరం.. మరోసారి రుజువైందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ సినిమాలున్నాయి. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్లకు సైతం కొదవ లేదు. అయితే తన అపజయాల లిస్టు చూస్తే అందులో R అక్షరంతో మొదలైన సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభాస్కు R అక్షరం కలిసిరావడం లేదన్న వాదన మొదలైంది. ఈ భయంతోనే కాబోలు రాజాసాబ్ సినిమా టైటిల్ ముందు The అనేది యాడ్ చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్ కొనసాగినట్లే కనిపిస్తోంది...R అక్షరం వల్లే..ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన మూవీ ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా టైటిల్ రాజాసాబ్ ఆర్ అక్షరంతో మొదలుకావడం వల్లే ఇంత వ్యతిరేకత వస్తోందని కొందరంటున్నారు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రాఘవేంద్ర సమయంలో మొదలైంది. నెగెటివ్ టాక్ప్రభాస్ నటించిన సెకండ్ మూవీయే రాఘవేంద్ర. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రెబల్ సినిమా చేశాడు. రాఘవ లారెన్స్తో కలిసి చేసిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2022లో రాధే శ్యామ్ అని భారీ బడ్జెట్ సినిమా చేశాడు. ఇందులో ప్రభాస్ పెదనాన్న కృష్టంరాజు చివరిసారిగా యాక్ట్ చేశాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది.సాహసం చేస్తాడా?ఇలా ఆర్ లెటర్తో చేసిన నాలుగు సినిమాలు తనకస్సలు కలిసిరాలేదు. ఈసారి 'ది రాజాసాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆర్ సెంటిమెంట్ ప్రభాస్ను వెంటాడినట్లే కనిపిస్తోంది. మరి మున్ముందు ప్రభాస్ R అక్షరంతో సినిమాలు చేస్తాడా? ఈ సెంటిమెంట్ను పరిగణనలోకి తీసుకుంటాడా? లేదా లైట్ తీసుకుంటాడా? అన్నది చూడాలి!
'పరాశక్తి'లో తెలుగువారిని అవమానపరిచే డైలాగ్
సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ సినిమా పరాశక్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, జనవరి 10న కేవలం తమిళ్లోనే విడుదల చేశారు. కానీ, సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై పలు విమర్శలు వస్తున్నాయి. 1960లలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో ఇద్దరు స్నేహితుల చుట్టూ ఈ మూవీ కొనసాగుతుంది. మూవీలో పలు అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉండటంతో సెన్సార్లో భారీ కొతలు పడ్డాయి. అయినప్పటికీ వివాదాలకు ఈ మూవీ తావిచ్చింది.అమరన్ చిత్రంతో తెలుగువారి ప్రేమను పొందిన శివకార్తికేయన్.. ఇప్పుడు పరాశక్తితో కొల్పోయేలా ఉన్నాడు. ఈ మూవీలో తెలుగు ప్రజలను అవమానించే విధంగా "గోల్టీ"(Golti) అనే అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. (గోల్టీ అంటే దొంగ, మురికివాడు) ఈ పదాన్ని కట్ చేస్తామని ముంబై సెన్సార్ రివిజన్ కమిటీ ముందు చిద్ర యూనిట్ మొదట అంగీకరించి కూడా, తమిళ వెర్షన్లో అలాగే ఉంచడంతో #BoycottParasakthi అని వైరల్ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ మూవీకి దర్శకత్వం వహించింది కూడా తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర కావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. పైగా ఆ పదం తీసేస్తే సినిమాకు ఉన్న ఆత్మ పోతుందని ఆమె సమర్థించుకున్నారని తెలుస్తోంది.1960 సమయంలో మద్రాసులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల గురించి ఈ మూవీ ఉంది. ఈ కాన్సెప్ట్ చాలా సున్నితమైనది కావడంతో సెన్సార్ బోర్డు (CBFC) చాలా అభ్యంతరాలు తెలిపింది. ఏకంగా 20కి పైగా కట్స్ సూచించింది. సినిమాలో వాడిన కొన్ని పదాలను తొలగించారు. అందులో కొన్ని రాయలనేని బాషలో ఉన్నాయి. వాటిని తొలగించమని కూడా సెన్సార్ ఆదేశించింది. అయితే, ఈ పదాలన్నీ తొలగిస్తే సినిమాకు ఉన్న బలం పోతుందని దర్శకురాలు వాదించారట. అయితే, సినిమాపై సానుకూల రివ్యూలు రాలేదు. కథను సాగదీసి చెప్పారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కేవలం శివకార్తికేయన్ ఇమేజ్ మాత్రమే ఈ మూవీకి బలాన్ని ఇచ్చిందన్నారు. రాజకీయ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి పర్వాలేదు. ఫ్యామిలీ ప్రేక్షకులకు నిరాశ కలిగించేలా ఉంది.
హీరో ఎవరనేది పట్టించుకోను : మీనాక్షి చౌదరి
‘నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే చూస్తాను’ అన్నారు యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.⇢ ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.⇢ నవీన్తో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. లక్కీ భాస్కర్ లోని సుమతి పాత్రకు ఈ చారులత పాత్ర పూర్తి భిన్నమైనది. దర్శకులు ఆ పాత్రలను మలిచిన తీరుకి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.⇢ గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.⇢ ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.⇢ నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.⇢ ప్రస్తుతం నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి.
గోశాలకు సోనూసూద్ రూ.11 లక్షలు విరాళం
మంచితనానికి మారుపేరుగా ఉండే ప్రముఖ నటుడు సోనూసూద్ మరో గొప్ప పని చేశాడు. గుజరాత్లోని వారాహి గోశాలకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. వారాహి గోశాలను సందర్శించిన ఆయన గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేశాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య ఏడు వేలకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.గోశాలకు విరాళంఈ గ్రామంలోని ప్రజలందరూ వాటి సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇచ్చాను. దానివల్ల వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరోసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.సినిమాసోనూసూద్ సినిమాల విషయానికి వస్తే.. సూపర్, అరుంధతి, చంద్రముఖి, దూకుడు, జులాయి, అల్లుడు అదుర్స్.. ఇలా అనేక సినిమాల్లో విలన్గా చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు. చివరగా 'ఫతే' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారాడు.చదవండి: చచ్చిపోవాలన్నంత బాధ.. ఎంతోమందిని కలిశా..
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బాధగా ఉంది : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో ఫేక్ రివ్యూలు, నెగెటివ్ రేటింగ్స్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ, కొంత బాధను కూడా కలిగిస్తోందని ట్వీట్ చేశారడు.‘ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం సంతోషకరం. ఇది చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుతుంది. అదే సమయంలో బాధ కలిగిస్తోంది ఎందుకంటే... మన సొంత మనుషులే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ‘మనం బతుకుతూ ఇంకొకరికి బతికించాలి’ అనే సూత్రం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది?(చదవండి: మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్పై కక్ష.. హరీశ్రావు సంచలన కామెంట్)'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. అలా చెబితే ఎవరూ పట్టించుకోలేదు .ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకే తిరిగి చెప్పారు. కానీ నాతో సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు ఈ సమస్య యొక్క తీవ్రత తర్వాత అర్థమయింది.ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ, నా కలలను , నా లాగే నా తర్వాత వచ్చే చాలా మంది కలలను కాపాడుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూ అనేక రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇన్నాళ్లకు ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. (చదవండి: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?)మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆదేశాలతో సమస్యను పూర్తి పరిష్కారం లభించదు కానీ, ఆందోళన చెందాల్సిన విషయాల్లో ఒకటి తగ్గుతుంది. ఇదంతా పక్కనపెట్టి ఇప్పుడైతే మనం ‘మన శంకరవరప్రసాద్’(Mana Shankara Varaprasad Garu) తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయవంతంగా అలరించాలని కోరుకుందాం’ అని విజయ్ ట్వీట్ చేశాడు. Happy and Sad to see this - Happy to know hardwork, dreams and money of many is protected in a way. And Sad because of the reality of our own people causing these problems. What happened to live and let live? and growing together?Since the Days of Dear Comrade i first began… pic.twitter.com/gF55B8nXqt— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2026
చచ్చిపోవాలనిపించింది.. ఎంతోమందిని కలిశా..
చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడుతున్నప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలా తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు థెరపీ తీసుకుని చాలా మంచి పని చేశానంటోంది మలయాళ నటి పార్వతి తిరువోతు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థెరపీ తీసుకోవడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం. అర్ధరాత్రి థెరపీకాకపోతే మనకు కరెక్ట్ థెరపిస్ట్ దొరకాలి. అందుకు నాకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను అమెరికన్ థెరపిస్ట్ను కలిశాను. అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల సమయంలో నాతో మాట్లాడేవారు. తర్వాత ఇక్కడే ఉన్న థెరపిస్ట్లను సంప్రదించాను. వారు నా సమస్యలేంటో గుచ్చిగుచ్చి అడిగి.. వాటిని వెలికితీసి మరింత బాధపెట్టేవారు.చచ్చిపోవాలన్న ఆలోచనలుఅప్పటికే నేను తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాను. చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కరెక్ట్ థెరపిస్ట్ దొరికాక నా బాధకు ఉపశమనం లభించింది. నన్ను ఎంతో బాధపెట్టిన 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్ని నా జీవితంలో నుంచే తీసేశాను. సినిమాప్రస్తుతం నేను కుటుంబం, ఫ్రెండ్స్, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. పార్వతి బెంగళూరు డేస్, ఎన్ను నింటె మొయిదీన్, చార్లీ, ఉయరె, వైరస్, పుళు వంటి పలు చిత్రాల్లో నటించింది. దూత వెబ్ సిరీస్తో తెలుగువారికి సైతం పరిచయమైంది.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
సినిమా
సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు
థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి
ఏజెంట్ మూవీ నాకు చాలా స్పెషల్
మరో బిగ్ సీక్వెల్ కన్ఫర్మ్.. రెబల్ ఫ్యాన్కు పండగే..
బోర్డర్ 2 రిలీజ్... దురంధర్ రికార్డులు బ్రేక్ అవుతాయా?
సూరత్ ఎయిర్ పోర్ట్ లో అమితాబ్ కు తప్పిన ప్రమాదం
మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న హుక్ స్టెప్ సాంగ్
పెళ్లి తరువాత అభిమానులకు సమంత గుడ్ న్యూస్
చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా
ఆస్కార్ కు అడుగు దూరంలో కాంతారా, మహావతార్..
