Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

A young hero with KGF level Movie dreams in Tollywood1
'కెజియఫ్' రేంజ్ కలలలో కుర్ర హీరో

టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెడుతున్న యంగ్ హీరోలలో చాలామంది "కెజియఫ్ రేంజ్"లో సినిమాలు చేయాలని కలలు కంటున్నారు. మేకప్ వేసుకున్న వెంటనే తమ రేంజ్ వేరే లెవల్‌ అని భావించే ఈ తరం హీరోలు తమ వ్యక్తిత్వం ఏమిటి? తమ వాయిస్, నటనకు ఏం సూటవుతాయి? ఎలాంటి పాత్రలు చేయాలనే విషయాలపై మాత్రం పెద్దగా ఆలోచించరు. అలా కొంతమంది హీరోలకు చేతిలో సినిమాలు లేకపోయినా "పాన్ ఇండియా" సినిమానే చేస్తానని, మాస్ సినిమానే చేస్తానని గట్టిగా చెప్పేస్తున్నారు. ఇక వారసత్వం ఉన్నవారైతే మరింత ధైర్యం చేస్తున్నారు. ఇటీవల ఓ నిర్మాత ఒక కథకు సరిపోతాడని భావించి ఓ చిన్న హీరోను కలిశాడు. కాగా సదరు హీరో నిర్మాతకు ఫోన్‌లో ఓ వీడియో చూపించాడు. తీరా చూస్తే అది అతనిపై తానే తయారు చేయించుకున్న గ్లింప్స్. అది కెజియఫ్ లెవెల్‌లో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి సినిమా చేద్దామని హీరో ప్లాన్ చెప్పాడట. అయితే దానికి సదరు నిర్మాత మాత్రం 'గ్లింప్స్ బాగుంది కానీ మీకు అంతగా సూట్ కాలేదు" అని చెప్పి వెళ్లిపోయాడని సమాచారం.కెజియఫ్ లాంటి చిత్రాలు అందరికీ సెట్‌ కావు. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే చేస్తానని కలలతో కాలక్షేపం చేస్తున్న కుర్ర హీరోలు, ఏజ్ బార్ అయ్యాకే వాస్తవం గ్రహిస్తారు. కానీ అప్పటికే తన తండ్రి ఇచ్చిన ఆస్తి కూడా ఖర్చయిపోయి, కెరీర్‌లో స్థిరపడే అవకాశాలు తగ్గిపోతాయి. టాలీవుడ్‌లో కొత్తగా వస్తున్న హీరోలు తమకు సూటయ్యే పాత్రలు, కథలు ఎంచుకుంటేనే నిలబడగలరనే వాస్తవాన్ని గ్రహించాలి. లేకపోతే "కెజియఫ్ రేంజ్" కలలతోనే వారి కెరీర్ ముగిసే ప్రమాదం ఉంది.

Indian Play Back Singer Arijit Singh has announced his Retirement2
ప్రముఖ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ రిటైర్‌మెంట్ ప్రకటన

ప్రముఖ బాలీవుడ్ సింగర్‌ తన కెరీర్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. ప్లే బ్యాక్ సింగర్ అర్జిత్‌ సింగ్‌ తాజాగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇకపై ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకొనని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఇన్ని రోజులుగా నాపై ప్రేమ, అభిమానం చూపిన వారందరికీ థాంక్స్‌ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేయనని వెల్లడించారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందన్నారు. అయితే తన రిటైర్‌మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించలేదు. సినిమాలకు గుడ్‌బై చెప్పిన అర్జిత్‌ ఇండిపెండెంట్‌ సింగర్‌గా కొనసాగుతారని సమాచారం. View this post on Instagram A post shared by Arijit Singh (@arijitsingh)

Aadhi Pinisetty Latest Movie Drive comes To another Ott3
మరో ఓటీటీకి టాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం డ్రైవ్‌. గతేడాది డిసెంబర్‌ 12న అఖండ-2తో పాటు ఈ మూవీ విడుదలైంది. చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఆది పినిశెట్టి న‌టించారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆనంద్ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన ఈ మూవీలో మ‌ల‌యాళ బ్యూటీ మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్‌గా చేసింది. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం జనవరి 30 నుంచి ఆహాలో అందుబాటులో ఉంటుందని ట్వీట్ చేసింది. సైబ‌ర్ క్రైమ్స్‌, హ్యాకింగ్స్ నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. Every secret has a price.And someone is always watching👀@AadhiOfficial @MadonnaSebast14 @RajaChembolu @kamalkamaraju @anishkuruvilla @jenusemohamed @AbinandhanR @osho_venkat @PrawinPudi #AnandaPrasad @BhavyaCreations pic.twitter.com/GFARaOuO0S— ahavideoin (@ahavideoIN) January 27, 2026

Tollywood Hero Vishwak Sen Comments about Tharun Bhascker4
ఎవరో కూడా తెలియని టైమ్‌లో నా కోసం నిలబడ్డాడు: విశ్వక్ సేన్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. నేను ఎవరో కూడా తెలియని సమయంలో తరుణ్ నా కోసం నిలబడ్డాడని కొనియాడారు. తరుణ్ భాస్కర్ నటించిన ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఈ కామెంట్స్ చేశారు.తరుణ్ నాకు పరిచయం లేకపోయినా కూడా నాకోసం నిలబడ్డారని విశ్వక్ సేన్ అన్నారు. నాకు ఫోన్‌ చేయగానే ఈవెంట్‌కు వచ్చానని తెలిపారు. ఈరోజు నన్ను గెస్ట్‌ అని అంటున్నారని.. ఎందుకంటే ఇది నా కుటుంబ ఫంక్షన్‌ అని అన్నారు. కాగా.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. మలయాళంలో తెరకెక్కించిన జయ జయ జయహే మూవీకి రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

Chhaava To Border 2 Movie, Patriotic Movies Shakes Of Bollywood Box Office5
దేశభక్తి టచ్ చేస్తే చాలు.. కాసుల పంట పండాల్సిందే!

బాలీవుడ్ ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'నేషనలిజం' ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వెండితెరపై త్రివర్ణ పతాకం కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. 'ఉరి', 'గదర్ 2' నుంచి మొదలైన ఈ ఊపు, ఇప్పుడు 'ధురంధర్', 'బోర్డర్ 2' వరకు కొనసాగుతోంది. సామాన్యుడిలో ఉండే దేశభక్తిని భావోద్వేగంతో కలిపి వెండితెరపై చూపించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన దేశభక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.450 కోట్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక వీరగాథలకు దేశభక్తి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది.రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక స్పై థ్రిల్లర్‌గా వచ్చి, దేశభక్తిని అద్భుతంగా పండించిన ఈ చిత్రం కేవలం ఏడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,285 కోట్లకు పైగా వసూలు చేసి 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది.ఇక గతవారం (జనవరి 23) రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' ప్రస్తుతం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. 1971 ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్కును చేరుకుంది. నిన్న ఒక్క రోజులోనే ఇండియాలో ఈ చిత్రం రూ.59 కోట్లు రాబట్టిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇలానే కొనసాగితే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. .సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రానికి అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. 1971 ఇండో - పాక్‌ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్‌(1997) చిత్రానికి సీక్వెల్‌ ఇది.

Musician Sri Oruganti Anand Mohan has passed away6
సంగీత విద్వాంసుడు శ్రీ ఓరుగంటి ఆనంద్ మోహన్ కన్నుమూత

ప్రముఖ సంగీతజ్ఞులు, 'సంగీత క్షీరసాగరం' వ్యవస్థాపకులు విద్వాన్ శ్రీ ఓరుగంటి ఆనంద్ మోహన్ (90) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు సంతానం ఉన్నారు. సంగీతమే శ్వాసగా..1956 నుంచి 1977 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో లలిత సంగీత కళాకారుడిగా సేవలందించిన ఆనంద్ మోహన్.. వృత్తిరీత్యా ఢిల్లీలోని కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ కార్యాలయం లోనూ కాగ్ (CAG) కార్యాలయంలో పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని సంగీతానికే అంకితం చేశారు. తన గురువు ఉప్పలపాటి అంకయ్య స్మరణార్థం 2002లో 'సంగీత క్షీరసాగరం' సభను స్థాపించి, సప్తపర్ణి సహకారంతో ఇప్పటివరకు 699 కచేరీలను నిర్వహించారు. ఎవరి వద్ద ధనసహాయం ఆశించకుండా తన పెన్షన్ డబ్బులే ఖర్చు చేస్తూ నిస్వార్థంగా ఈ కచేరీలు నిర్వహించడం విశేషం.అందుకున్న పురస్కారాలు..శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన కృషికి గాను 2012లో కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా గౌరవం పొందారు. 2013లో చెన్నైలో జ్ఞాన సరస్వతీ పీఠ పురస్కారాన్ని అందుకున్నారు. 1966-67 మధ్య కాలంలో శ్రీ త్యాగరాయ గాన సభ వ్యవస్థాపక కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. యువ కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆయన మృతి పట్ల పలువురు సంగీత విద్వాంసులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

Meenakshi Chaudhary And Tamannaah Movie news7
మీనాక్షి కొంటె చూపు.. తమన్నా ఊహించని లుక్!

కొంటె చూపులతో ఫన్నీ పోజులిచ్చిన మీనాక్షి చౌదరిజ్యూవెలరీతో హీరోయిన్ తమన్నా ఊహించని లుక్స్జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న హాట్ బ్యూటీ కేతిక శర్మఎయిర్‌పోర్ట్‌లో అనన్య నాగళ్ల సందడే సందడిడ్యాన్స్ అదరగొట్టిన 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్విబాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రుహానీ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

Bhartha Mahasayulaku Wignyapthi Vaammo Vaayyo Full Video song release8
'వామ్మో.. వాయ్యో..' ఫుల్ వీడియో సాంగ్‌ చూసేయండి

రవితేజ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో ఓ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వామ్మో వాయ్యో అనే పాట అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ మహారాజా ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి.

Bha Bha Ba Movie OTT Telugu Streaming Details9
మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ

రీసెంట్ టైంలో ఓటీటీ సంస్థలు.. ఏ భాషా చిత్రాలకైనా తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా భాషల్లో హిట్ అయిన మూవీస్‪‌కి తెలుగు వెర్షన్ అందుబాటులోకి తెస్తున్నాయి. రీసెంట్‌గా 'సిరై' అనే తమిళ చిత్రానికి ఇలానే చేశారు. ఇప్పుడు మలయాళంలో బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న ఓ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన దాదాపు 10 రోజులకు తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)మలయాళంలో ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా చెలామణీ అయిన దిలీప్.. 2017లో హీరోయిన్ భావనపై అత్యాచారం చేయించాడనే ఆరోపణలతో మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటన తర్వాత నుంచి దిలీప్ పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. గత నెల అంటే 2025 డిసెంబరులో ఈ కేసు నుంచి దిలీప్‌కి పూర్తిగా రిలీఫ్ దక్కింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి దిలీప్ పేరు తొలగించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే దిలీప్ కొత్త మూవీ 'భా భా భా' థియేటర్లలోకి వచ్చింది.కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించాడు. డిసెంబరు 18న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి టాక్ పాజిటివ్‌గానే వచ్చింది. ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కొన్నిరోజుల క్రితం ఈ చిత్రం జీ5 ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు మలయాళం మాత్రమే రాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

Anaganaga Oka Raju Movie Bhimavaram Balma Video Song10
డ్యాన్స్ అదరగొట్టిన మీనాక్షి.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' కూడా ఒకటి. నవీన్ పొలిశెట్టి.. చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన మూవీ ఇది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‪‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇకపోతే ఇందులో ఇద్దరూ కలిసి భీమవరం బల్మా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ పాట పూర్తి వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మీనాక్షి డ్యాన్స్ అదరగొట్టేసింది.ఈసారి పండగకు రిలీజైన వాటిలో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' లీడ్ తీసుకోగా.. నవీన్ పొలిశెట్టి సినిమా కూడా ఉ‍న్నంతలో బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. కథ పరంగా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కామెడీ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు బాగానే చూశారు. నిర్మాణ సంస్థ అయితే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించారు. రిలీజై దాదాపు రెండు వారాలుపైనే అయిపోయింది. అయినా సరే హీరో నవీన్ పొలిశెట్టి.. అమెరికా వెళ్లి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నాడు.

Advertisement
Advertisement