Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Sarvam Maya Movie OTT Streaming Details Telugu1
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెలుగులోనూ కాస్తంత ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నివీన్ పౌలీ. ఈ చిత్రం తర్వాత యాక్టింగ్ అయితే చేస్తున్నాడు గానీ సరైన హిట్ దొరకలేదు. దాదాపు పదేళ్ల తర్వాత 'సర్వం మాయ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ హిట్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)నివీన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ తదితరుల ప్రధాన పాత్రల్లో నటించిన 'సర్వం మాయ'.. గత నెల 25న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‌తో తెలుగు మూవీ లవర్స్ మధ్య చర్చకు కారణమైంది. దీంతో ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో మూవీ అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది.'సర్వం మాయ' విషయానికొస్తే.. ఇదో అందమైన దెయ్యం కథ. ఇది మిమ్మల్ని భయపెట్టదు, నవ్విస్తుంది. చివరకు కంటతడి పెట్టిస్తుంది. ప్రభేందు (నివీన్ పౌలీ) ఓ గిటారిస్ట్. ఇతడి తండ్రి, అన్నయ్య పురోహితులు. కుటుంబం పౌరోహిత్యం చేస్తున్నప్పటికీ ప్రభేందుకి వీటిపై, దేవుడిపై పెద్దగా నమ్మకముండదు. అలాంటి ఇతడి జీవితంలోకి డెలులూ (రియా షిబు) అనే ఓ టీనేజ్ దెయ్యం వస్తుంది. ఈమె రాకతో ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. గతం మర్చిపోయిన ఈ క్యూట్ దెయ్యం.. చివరకు ఎలా ముక్తి పొందింది అనేది స్టోరీ. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అస్సలు మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)Malayalam film #SarvamMaya (2025) by #AkhilSathyan, premieres Jan 30th on @JioHotstar.@NivinOfficial #RiyaShibu @AjuVarghesee #PrietyMukundhan #Janardhanan #RaghunathPaleri #Vineeth #MadhuWariar @justin_tunes #FireflyFilms @APIfilms pic.twitter.com/lw5HDIBQp2— CinemaRare (@CinemaRareIN) January 23, 2026

Jana Nayagan Movie will be Effect On Chiranjeevi and bobby Movie2
'జన నాయగన్‌' ప్రభావం చిరంజీవి మూవీపై పడనుందా..?

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ భారీ హిట్‌ కొట్టేసింది.. ఇదే ఊపులో చిరంజీవి- దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుంది. 'మెగా 158' వర్కింగ్‌ టైటిల్‌తో ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని సమాచారం. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అయితే, విజయ్‌ నటించిన జన నాయగన్‌ వాయిదా ఎఫెక్ట్‌ చిరు మూవీపై పడనుందా అంటూ నెట్టింట అనేక ప్రశ్నలు కనిపిస్తున్నాయి.జన నాయగన్‌ సినిమాను కూడా కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. తెలుగులో చిరంజీవి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆ సంస్థ ప్లాన్‌ చేసుకుంది. ఇప్పటికే మెగా 158 ప్రాజెక్ట్‌తో నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కొనంకి ఢీల్‌ కుదుర్చుకున్నారు. అయితే జ‌న నాయ‌గ‌న్‌ సెన్సార్ గొడవ కార‌ణంగా ఆ సంస్థ కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో చిరు- బాబీ సినిమా మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన చిరంజీవి మూవీ..‌ జన నాయగన్‌ ఎఫెక్ట్‌ వల్ల మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. అయితే, అంత వ‌ర‌కు చిరు, బాబీ వేచి చూస్తారా..? అనే చ‌ర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఇదే సమయంలో మరికొందరు అదంతా రూమర్స్‌ మాత్రమేనని తెలుపుతున్నారు. జ‌న నాయ‌గ‌న్‌ వివాదం ఉన్నప్పటికీ చిరు వంటి స్టార్‌ హీరోతో వచ్చిన ఛాన్స్‌ను ఆ సంస్థ వదులుకోదని చెబుతున్నారు. అనుకున్న సమయానికే షూటింగ్‌ పనులు ప్రారంభమవుతాయని ఫ్యాన్స్‌ తెలుపుతున్నారు.‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత చిరు- బాబీ కాంబోలో ఈ మూవీ రానున్నడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా యాక్షన్ మోడ్‌లో ఉంటుందని తెలుస్తోంది. మెగాస్టార్‌ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో తెరపై కనిపిస్తారని టాక్‌.. ఇందులో చిరుతో పాటు మరో స్టార్‌ కూడా తెర పంచుకునే అవకాశమున్నట్లు ప్రచారం సాగుతోంది.

Oscars Nominations 2026: Sinners Movie Review In Telugu3
‘సిన్నర్స్‌ ’ మూవీ రివ్యూ..16 నామినేషన్లతో సంచలనం!

‘సిన్నర్స్‌’ ... ఈ హాలీవుడ్‌ మూవీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దానికి కారణం.. 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌లో ఏకంగా 16 విభాగాల్లో ఈ సినిమా చోటు​ దక్కించుకోవడమే. గతంలో ‘ఆల్‌ అబౌట్‌ ఈవ్‌’ (1950), ‘టైటానిక్‌’ (1997), ‘లా లా ల్యాండ్‌’ (2016) చిత్రాలు సాధించిన 14 నామినేషన్ల రికార్డును ఈ మూవీ అధిగమించింది. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో మైఖేల్‌ బి.జోర్డాన్‌ ప్రధాన పాత్ర పోషించారు. క్రీడ్ (2015), బ్లాక్ పాంథర్ (2018) లాంటి బ్లాక్‌ బస్టర్స్‌ అందించిన రేయాన్‌ కూగ్లర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 16 విభాగాల్లో నామినేట్‌ కావడానికి గల కారణం ఏంటి? అసలు ఈ సినిమా కథేంటి? ఈ సినిమా కథంతా 1932 నేపథ్యంలో జరుగుతుంది. స్మోక్‌ మరియు స్టాక్‌..ఇద్దరు ట్విన్‌ బ్రదర్స్‌. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఈ సోదరులు, చికాగోలో మాఫియా కోసం పనిచేసి డబ్బు సంపాదించి, తమ స్వస్థలమైన క్లార్క్‌స్‌డేల్‌కు తిరిగి వస్తారు. వీరిద్దరి దగ్గర భారీగా డబ్బు ఉన్నప్పటికీ బ్లాక్‌ కమ్యూనిటీ కావడంతో సరైన గౌరవం ఉండదు. దీంతో వీళ్లే సొంతంగా ఒక మ్యూజిక్‌ బార్‌ని ప్రారంభించాలనుకుంటారు. అందులో సామీ (మైల్స్ కాటన్)ని మ్యూజిక్‌ ప్లే చేయమని కోరతారు. అన్ని పనులు పూర్తయి.. బార్‌ ఓపెన్‌ అవుతుంది. నల్ల జాతీయులు తప్ప వేరే వాళ్లకు అందులో అనుమతి ఉండదు. అదే సమయంలో ఓ ముగ్గురు వ్యక్తులు బార్‌లోకి రావడానికి అనుమతి అడుగుతారు. వాళ్లు తెల్ల జాతీయులు కావడంతో స్మోక్‌ వారిని లోపలికి రానివ్వడు. దీంతో వాళ్లు బార్‌ బయటే మ్యూజిక్‌ ప్లే చేస్తూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే..ఈ ముగ్గురు కూడా వాంపైర్లు(మనుషుల రక్తం తాగి జీవించే అమరజీవులు.. జాంబీలు). ఈ విషయం బార్‌ లోపల ఉన్నవాళ్లకి తెలియదు. కాసేటి తర్వాత మేరీ అనే అమ్మాయిపై బార్‌ నుంచి బయటకు రాగా.. వాంపైర్లు దాడి చేసి ఆమె రక్తం తాగుతారు. దీంతో ఆమె కూడా వాంపైర్‌గా మారిపోతుంది. పరిమిషన్‌ తీసుకొని బార్‌లోకి వెళ్లి.. స్టాక్‌పై దాడి చేసి రక్తం తాగుతుంది. ఇది గమనించి స్మోక్‌..ఆమెని తుపాకితో కాల్చుతాడు. అయినా చనిపోకుండా.. బార్‌ నుంచి బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు స్మోక్‌ భార్య వచ్చి.. వాళ్లు వాంపైర్లు అని చెబుతుంది. బార్‌ నుంచి బయటకు వెళ్లిన వాళ్లంతా వాంపైర్లుగా మారిపోతారు. వారి నుంచి స్టోక్‌ గ్యాంగ్‌ ఎలా తప్పించుకుందనేదే ఈ సినిమా మిగతా కథ(Sinners Movie Review). వాస్తవానికి ఈ సినిమా కథ కొత్తదేమి కాదు. తెలుగులో వచ్చిన జాంబీ రెడ్డి సినిమా తరహా కథే ఇది. హాలీవుడ్‌లో ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘సిన్నర్స్‌ ప్రత్యకత ఏంటంటే.. ఈ పీరియాడికల్‌ హారర్‌ చిత్రంలో ఆఫ్రికన్ అమెరికన్లు చరిత్రను (జిమ్‌ క్రో ఎరా, బ్లూస్‌ సంగీతం) మిళితం చేసి, ఇంట్రా-రేసియల్‌ కాన్‌ఫ్లిక్ట్‌లను అద్భుతంగా చూపించారు. బ్లూస్ సాంగ్స్, సౌండ్ డిజైన్ బాగుంటుంది. జాతి వివక్ష ఎలా ఉండేదో చెప్పడానికి ప్రత్యేకంగా సీన్లను రాసుకోకున్నా.. సినిమా చూస్తుంటే ఆ విషయం ఈజీగా తెలిసిపోతుంది. మ్యూజిక్‌ అందించమని సామిని అడిగేందుకు ట్విన్‌ బ్రదర్స్‌ రైల్వే స్టేషన్‌కి వెళ్తారు. అక్కడ బాత్రూంలపై తెల్లజాతీయులకు మాత్రమే అన్నట్లుగా రాసి ఉండడం.. బ్లాక్‌ కమ్యూనిటీ వాష్‌రూమ్‌ని సపరేట్‌గా పెట్టినట్లు చూపిస్తారు. ఇలాంటి చిన్న చిన్న సీన్లతోనే జాతి వివక్ష గురించి చర్చించారు. అయితే ఫస్టాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగుతుంది. బార్‌ కోసం ట్విన్‌ బ్రదర్స్‌ చేసే ప్రయత్నాల చుట్టూనే ప్రథమార్థం సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. వాంపైర్లు బార్‌లోకి రావడానికి ప్రయత్నించడం.. తప్పించుకునేందుకు స్మోక్‌ బృందం చేసే పోరాటం..అన్ని ఆసక్తికరంగా ఉంటాయి. చివరి 40 నిమిషాలు కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. (ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రెంట్‌ పద్దతిలో అందుబాటులో ఉంది)‘సిన్నర్స్‌’ మూవీ నామినేట్‌ అయిన 16 విభాగాలు ఇవే..బెస్ట్‌ పిక్చర్‌బెస్ట్‌ డైరెక్టర్‌ (రేయాన్‌ కూగ్లర్‌)బెస్ట్‌ యాక్టర్‌ (మైఖేల్‌ బి. జోర్డాన్‌)బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్ (వున్మి మోసాకు)బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ (డెల్రాయ్‌ లిండో)బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లేబెస్ట్‌ సినిమాటోగ్రఫీబెస్ట్‌ కాస్టింగ్‌ (కొత్త కేటగిరీ)బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌బెస్ట్‌ సౌండ్‌బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ 98వ ఆస్కార్‌ అవార్డుల్లో ఈ చిత్రం ఎన్ని గెలుచుకుంటుందో చూడాలి. మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలో జరుగుతుంది.

Sobhita Dhulipala Cheekatilo Movie Review Telugu4
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ

శోభిత తెలుగమ్మాయే. కానీ దాదాపు పదేళ్ల కెరీర్‌లో రెండే తెలుగు సినిమాలు చేసింది. కానీ అక్కినేని కోడలు అయిన తర్వాత ఈమె ముందు కంటే బాగానే ఫేమస్ అయిపోయింది. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె చేసిన సినిమా 'చీకటిలో'. థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? అక్కినేని కోడలు హిట్ కొట్టిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)కథేంటి?క్రిమినాలజీ చదివిన సంధ్య(శోభిత).. ఓ న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ వార్తలు చదివే యాంకర్‌గా పనిచేస్తుంటుంది. చేస్తున్న ఉద్యోగంపై పెద్దగా ఆసక్తి ఉండదు. సొంతంగా పాడ్‌కాస్ట్ ఛానెల్ ప్రారంభించాలనేది ఈమె గోల్. మరోవైపు అమర్ (విశ్వదేవ్ రాచకొండ)తో ప్రేమలో ఉంటుంది. పెళ్లికి కూడా వీళ్లిద్దరూ రెడీ అవుతుంటారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ రోజు సంధ్య సహొద్యోగి బాబీ(అదితీ మ్యఖల్) హత్యకు గురవుతుంది. ఇంతకీ ఈమెని చంపింది ఎవరు? 25 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో జరిగిన వరస హత్యలకు.. బాబీ చావుకు ఏమైనా సంబంధం ఉందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అనగానే స్టోరీ ఏంటనేది ఓ అంచనా ఏర్పడుతుంది. 'చీకటిలో' కూడా దాదాపు అదే శైలిలో తీశారు. హత్యలు జరగడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇలా చాలా విషయాలు రొటీన్‌గానే అనిపిస్తాయి. జానర్ పరంగా చూస్తే మాత్రం ఇదో మాములు స్టోరీలానే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో సామాజిక అంశాన్ని చూపించిన విధానం బాగుంది.అత్యాచారాలకు ముగింపు ఇవ్వాలంటే.. ధైర్యంగా బయటకు వచ్చి తమపై అత్యాచారం జరిగిందని చెప్పే గొంతుక కావాలి. బాధితులు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ పాయింట్ పరంగా చూస్తే మాత్రం 'చీకటిలో' కాస్త భిన్నంగా అనిపిస్తుంది. అసలు విషయానికొస్తే.. శోభిత పరిచయం, హత్యలు జరగడం లాంటి అంశాలతో సినిమాని చాలా ఫ్లాట్‪‌గా మొదలుపెట్టారు. దాదాపు గంటవరకు అలానే వెళ్తుంది. శోభిత, పోలీసులతో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్ అయితే ఏ మాత్రం ఆసక్తి కలిగించదు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇదంతా చూసేశాం అనే ఫీలింగ్ కలిగిస్తుంది.కానీ చివరి అరగంట మాత్రం బాగుంది. రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లు కూడా సీరియల్ కిల్లర్ ఎవరనేది ఊహించడం కష్టం. ఎందుకంటే హీరోయిన్ చుట్టుపక్కనే అతడు ఉంటాడు. కానీ చివరివరకు అతడు ఎవరనేది తెలియనివ్వలేదు. అలానే చిన్నతనంలో జరిగే లైంగిక వేధింపులు, పెద్దయిన తర్వాత కూడా జీవితంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని బాగానే చూపించారు. మహిళలపై అత్యాచారం, హత్యలు లాంటి సీన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు వల్గారిటీ జోలికి పోలేదు. ఎక్కడ అసభ్యతగా అనిపించదు.ఇలా పాజిటివ్స్ పరంగా చాలా అంశాలు ఉన్నప్పటికీ నెగిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. క్లైమాక్స్, సీరియల్ కిల్లర్ ఎవరనేది రివీల్ చేసినప్పడు తప్పితే మిగతా విషయాల్లో అస్సలు థ్రిల్ అనిపించదు. శోభిత చేసే ఇన్వెస్టిగేషన్ అయితే మరీ లాజిక్‌లెస్‌గా ఉంటుంది. పోలీసులు బొమ్మల్లా ఉంటారు. ఈమెకు మాత్రం అన్ని ప్రూఫ్స్ దొరికిపోతుంటాయి. ఇది మాత్రం కన్విన్సింగ్‌గా అనిపించలేదు.ఎవరెలా చేశారు?చాన్నాళ్ల తర్వాత శోభిత చేసిన తెలుగు సినిమా ఇది. సంధ్య పాత్రలో పద్ధతిగా చుడీదార్, చీరల్లో కనిపించింది. సెటిల్డ్ యాక్టింగ్ చేసింది. పాత్రకు ఎంత కావాలో అంతే చేసింది. డబ్బింగ్ కూడా బాగుంది. విశ్వదేవ్ రాచకొండ, ఇషా చావ్లా, ఆమని, ఝాన్సీ, రవీంద్ర విజయ్ లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్లలో ఒక్కరికి కూడా ఆకట్టుకునే అవకాశం దొరకలేదు. మూవీ అంతా దాదాపు శోభిత చుట్టూనే తిరగడం దీనికి కారణం కావొచ్చు.టెక్నికల్ విషయాలకొస్తే.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్లు ఉంది. టైటిల్‌కి తగ్గట్లు సినిమా చాలావరకు చీకటిలోనే ఉంటుంది. అందుకు తగ్గట్లే సినిమాటగ్రఫీ ఉంది. దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ తప్పితే మిగతాది అంతా రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే 'చీకటిలో' మరో మంచి థ్రిల్లర్ అయ్యిండేది. కుటుంబంతోనూ కలిసి ఈ సినిమా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!)

Anil Ravipudi Counter to Who Trolled Chiranjeevi, Give Example about Rajinikanth5
అలా రజనీకాంత్‌ సినిమాలు చూడలేం, చిరంజీవి కూడా అంతే!

సక్సెస్‌ అందుకోవడం కన్నా దాన్ని కొనసాగించడం చాలా కష్టం. కానీ, కెరీర్‌ మొదలైనప్పటినుంచి అపజయమనేదే ఎరుగకుండా విజయాల పరంపరతో దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. అతడు డైరెక్ట్‌ చేసిన 9వ సినిమా మన శంకరవరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఇందులో చిరు స్టైల్‌, డ్యాన్స్‌, కామెడీ చూసి ఫ్యాన్స్‌ కడుపు నిండిపోయింది.రజనీకాంత్‌ను అలా ఊహించుకోగలమా?అయితే కొందరు మాత్రం చిరంజీవి వయసుకు తగ్గ పాత్రలు చేయాలని, తాతగా నటిస్తే బెటర్‌ అని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు గట్టి కౌంటరిచ్చాడు అనిల్‌ రావిపూడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ప్రతి హీరోకు కొన్ని బలాలుంటాయి. వాటిని వదిలేసి మనమెప్పుడూ ప్రయోగాలు చేయకూడదు. రజనీకాంత్‌గారిని తన వాకింగ్‌ స్టైల్‌ లేకుండా ఒక సినిమా చేయమనండి, మనం చూడగలమా? అలాగే చిరంజీవి కూడా..ఒక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ లేకుండా రజనీకాంత్‌గారి సినిమా ఊహించుకోగలమా? అది రజనీకాంత్‌గారి స్టైల్‌. అలాంటి రజనీకాంత్‌తో పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమా చేస్తే జనాలు ఒప్పుకోరు. ఆయనకు తగ్గ ఎలిమెంట్స్‌ ఆయన సినిమాలో కచ్చితంగా ఉండాలి. అలాగే చిరంజీవికి తగ్గ అంశాలు ఆయన మూవీలో ఉండాలి. చిరంజీవిగారు అనగానే మనకు గుర్తొచ్చేవి డ్యాన్సు, ఫైట్లు, పాటలు, కామెడీతో పాటు మంచి పర్ఫామెన్స్‌ లేదా కథాబలం.నేను చేసి చూపించా..ఆయన ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయాలా? అంటే దానికి తగ్గట్లుగా కథ రాస్తే చేయొచ్చు. నేను తీసి చూపించానుగా! చిరంజీవి- నయనతార మధ్య లవ్‌స్టోరీ పెట్టాను. ఎక్కడా ఓవర్‌గా చూపించలేదు. ఆయన వయసుకు తగ్గట్టుగా చాలా హుందాగా ఉంది. ఇలాంటి ప్రయోగాలు మనం చేయొచ్చు. ప్రేక్షకులు ఆ ఎపిసోడ్‌ ఎంజాయ్‌ చేశారు. హీరో బలాలను వాడుకుంటేనే సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరో విషయం.. చిరంజీవిగారు తన లుక్స్‌ మెయింటైన్‌ చేస్తారు. తాత పాత్రలెందుకు చేయాలి?అలుపు, ఆయాసం లేకుండా హుషారుగా హుక్‌ స్టెప్‌ సాంగ్‌లో డ్యాన్స్‌ చేశారు. ఆయన అలాగే ఉండాలని కోరుకుంటాను. ఒక మనిషి అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నప్పుడు మనమెందుకు ఆయన తండ్రి, తాత పాత్రలు మాత్రమే చేయాలని రుద్దాలి? కావాలని ఒక వ్యక్తిని తగ్గించడానికే కొందరు ఇలా మాట్లాడుతున్నారు. చిరంజీవి.. గాడ్‌ఫాదర్‌, సైరా నరసింహారెడ్డి అని మధ్యమధ్యలో ప్రయోగాలు చేశారు.. కానీ ఈ సినిమాకే ఎందుకింత పెద్ద ఫలితం వచ్చిందంటే జనాలు ఆయన్ను పాత చిరంజీవిగా చూడాలనుకున్నారు అని అనిల్‌ రావిపూడి చెప్పుకొచ్చాడు.చదవండి: శశిరేఖ.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Mammootty Padayatra Movie Latest Update6
మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన

మమ్ముట్టి 'పాదయాత్ర' చేసేందుకు రెడీ అయిపోయారు. స్వతహాగా ఈయన మలయాళ హీరోనే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల రూపంలో అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'పాదయాత్ర' గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా గతంలో తీసిన 'యాత్ర' సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించారు. వైఎస్ఆర్‌గా అద్భుతమైన యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్ టైంలో అయితే తన నిర్మాణంలోనే కన్నూర్ స్క్వాడ్, కలంకావళ్ అనే చిత్రాలతో వావ్ అనిపించారు. కలంకావళ్ చిత్రంలో అయితే మహిళల్ని చంపే సైకో పాత్రలో అలరించారు. ఇప్పుడు తన నిర్మాణంలోనే 'పాదయాత్ర' అనే మూవీని ప్రకటించారు.(ఇదీ చదవండి: మమ్ముట్టి సైకో కిల్లర్‌ 'కలాం కావల్‌' మూవీ రివ్యూ..)సాధారణంగా 'పాదయాత్ర' అంటే రాజకీయ పరిభాషలోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరి మమ్ముట్టి ఇప్పుడు తీయబోయేది కూడా పొలిటికల్ సినిమాయేనా? లేదంటే ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్‌ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అదూర్ గోపాలకృష్ణన్ దర్శకుడు. 84 ఏళ్ల ఈ డైరెక్టర్‌తో మమ్ముట్టి.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయనుండటం విశేషం. గతంలో వీళ్లిద్దరూ 'విధేయన్' అనే మూవీ చేశారు. దానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది.అదూర్ గోపాలకృష్ణన్ విషయానికొస్తే.. 1965 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎక్కువగా డాక్యుమెంటరీలు తీశారు. కొన్ని ఫీచర్ ఫిల్మ్స్ కూడా తెరకెక్కించారు. 1972లో ఈయన తీసిన 'స్వయంవరం' చిత్రానికి ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. తర్వాత కాలంలోనూ 'కొడియట్టం', విధేయన్, మథిలుకళ్, అనంతరం, ముఖాముఖం, ఎలిపత్యం, కథాపురుషన్, నిళల్ కుతు, నాళ్ పెన్నుంగళ్ తదితర మూవీస్‌తోనూ ఈయన జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. చివరగా 2016లో ఓ సినిమా చేసిన ఈయన.. ఇన్నాళ్లకు మమ్ముట్టి కలిసి పనిచేయబోతుండటం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఈసారి 'పాదయాత్ర'తో మరో జాతీయ అవార్డ్ కొడతారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!)'പദയാത്ര' ആരംഭിക്കുന്നു...Proudly Presenting The Title Poster of Our Production No.8 "Padayaatra" Directed by Adoor Gopalakrishnan.#Mammootty #AdoorGopalakrishnan #Padayaatra #MammoottyKampany #WayfarerFilms pic.twitter.com/XwCF2oERUd— MammoottyKampany (@MKampanyOffl) January 23, 2026

Rajinikanth and hema malini movie Hum Mein Shahenshah Kaun released after 37 years7
స్టార్‌ యాక్టర్స్‌ నటించిన సినిమా.. 37ఏళ్ల తర్వాత విడుదల

రజనీకాంత్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా దాదాపు నలభై ఏళ్ల తర్వాత విడుదల కానుంది. 1989లోనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న హమ్ మేన్ షాహెన్‌షా కౌన్ మూవీ ఎట్టకేలకు థియేటర్స్‌లోకి రానుంది. ఈ మూవీలో చాలామంది టాప్‌ నటీనటులు కలిసి నటించారు. ఒకప్పుడు హిందీ సినిమాను ఏలిన టాప్‌ నటులంతా ఈ మూవీ కోసం భాగమయ్యారు. ఈ చిత్రాన్ని నిర్మాత రాజా రాయ్ ఆరోజుల్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో రజనీకాంత్‌, శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని, అనితా రాజ్ , ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, శరద్ సక్సేనా వంటి స్టార్స్‌తో పాటు మన మధ్యలేని అమ్రిష్ పూరి, జగదీప్ కూడా వెండితెరపై మరోసారి కనిపిస్తారు.హమ్ మేన్ షాహెన్‌షా కౌన్ సినిమాకు దర్శకత్వం వహించిన హర్మేష్ మల్హోత్రా ఇప్పటికే మరణించారనే విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేసిన చాలామంది నటులు, టెక్నీషయన్స్‌లలో కొందరు మరణించారు. ఈ మూవీ కోసం దేశంలోనే పేరుపొందిన టీమ్‌ పనిచేసింది. సంగీతాన్ని లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ లక్ష్మీకాంత్–ప్యారేలాల్ అందించగా.. డైలాగ్స్‌ను సలీం-ఫైజ్ రాశారు. భారతీయ సినిమా డాన్స్‌ ఐకాన్‌గా పేరుపొందిన సరోజ్ ఖాన్ ఇందులో భాగమయ్యారు. రాజా రాయ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా అస్లాం మిర్జా, షబానా మిర్జా పనిచేశారు.తాజాగా ఈ మూవీ విడుదలపై నిర్మాత రాజా రాయ్ రియాక్ట్‌ అయ్యారు. హమ్ మేన్ షాహెన్‌షా కౌన్ మూవీపై తాము ఎప్పుడూ కూడా ఆశలు వదులుకోలేదన్నారు. అయితే, ఈ మూవీ మొదలైన తర్వాత ఎక్కువగా బాధలను ఎదుర్కొన్నామని గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ చిత్రం విడుదలౌతుంది అంటే కేవలం విధి రాతగా ఉందన్నారు. ఫైనల్‌గా తమ కోరిక నెరవేరుతుందని చెప్పుకొచ్చారు.ఈ మూవీకి ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించినట్లు అస్లాం మిర్జా పేర్కొన్నారు. పిక్చర్ నాణ్యతతో పాటు సౌండ్ కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు చెప్పారు. కథలో ఎలాంటి మార్పులు లేకుండానే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు చెప్పారు. ఆ కాలానికి అనుగుణంగానే ఇందులోని కలర్‌, విజువల్స్‌ ఉంటాయని తెలిపారు.వాయిదాకు కారణం1989లోనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మూవీకి సెన్సార్‌, డబ్బు సమస్యలు లేవు. ఎక్కువగా వ్యక్తిగత కారణాల వల్లే విడుదలకు నోచుకోలేదు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నిర్మాత రాజా రాయ్ తన వ్యాపార నిమిత్తం లండన్‌ వెళ్లారు. అయితే, తన చిన్న కుమారుడు అక్కడే మరణించడంతో చాలా కుంగిపోయాడు. చాలా ఎళ్లుగా తను కోలుకోలేదు. దీంతో సినిమా విడుదల ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత మూవీని విడుదల చేద్దామని కార్యచరణ ప్రారంభించారు. ఇంతలో దర్శకుడు హర్మేష్ మల్హోత్రా మరణించడంతో మళ్లీ బ్రేక్‌ పడింది. ఇలా పలు కారణాలతో సినిమా విడుదల కాలేదు. ఫైనల్‌గా 4K టెక్నాలజీతో ఇప్పుడు హమ్ మేన్ షాహెన్‌షా కౌన్ టైటిల్‌తోనే విడుదల కానుంది.

Sasirekha Video Song Out From Chiranjeevi Mana Shankara Vara Prasad Garu Movie8
శశిరేఖ ఫుల్‌ వీడియో సాంగ్‌.. నయన్‌తో చిరు స్టెప్పులు

మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌ హిట్టు కొట్టాడు మెగాస్టార్‌ చిరంజీవి. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న విడుదల కాగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా మన శంకరవరప్రసాద్‌గారు సినిమా నుంచి శశిరేఖ ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశారు.అప్పుడేమో ట్రోల్స్‌..ఈ పాట విడుదలైన కొత్తలో ఇదేం పాట? అని ట్రోల్స్‌ వచ్చాయి. కానీ తర్వాత అదే హిట్టు సాంగ్‌గా మారిపోయింది. తాజాగా రిలీజ్‌ చేసిన పాటలో నయనతారతో కలిసి హుషారుగా స్టెప్పులేశాడు చిరంజీవి. అది చూసిన అభిమానులు బాస్‌ గ్రేస్‌ చూస్తుంటే మరోసారి సినిమా చూడాలనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ సమకూర్చాడు. భీమ్స్‌తో పాటు మధుప్రియ ఆలపించింది.

Sharwanand Says He Did not Take Remuneration for Anil Sunkara9
నెక్స్ట్‌ సినిమా నుంచి ఒక్క రూపాయి తీసుకోను: శర్వానంద్‌

సినిమా హిట్టవగానే రెమ్యునరేషన్‌ అమాంతం పెంచేస్తుంటారు హీరోలు. కానీ శర్వానంద్‌ మాత్రం ఇకపై ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోనంటున్నాడు. కాకపోతే అన్ని సినిమాలకు కాదు! నిర్మాత అనిల్‌ సుంకరతో చేసే సినిమాలకు నయాపైసా వద్దని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు.హిట్టు కొట్టిన శర్వానంద్‌శర్వానంద్‌-అనిల్‌ సుంకర కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. పెద్ద సినిమాల పోటీని తట్టుకుని మరీ సక్సెస్‌ సాధించింది. దీంతో గురువారం నాడు సంక్రాంతి విన్నర్‌ బ్లాక్‌బస్టర్‌ ఈవెంట్‌ పేరిట వేడుకలు జరిపారు.రాసిపెట్టుకోండిఈ కార్యక్రమంలో శర్వానంద్‌ మాట్లాడుతూ.. శ్రీవిష్ణుగారు మంచితనంతో మా మూవీలో అతిథి పాత్ర చేశారు. మా ఇద్దరికీ మంచి కథ రాస్తే కలిసి సినిమా చేస్తాం. హిట్టు వచ్చింది కదా.. ఎలా ఫీలవుతున్నారు? అని అందరూ అడుగుతున్నారు. నాకు ఎలా ఫీల్‌ అవ్వాలో కూడా తెలియడం లేదు. కానీ, అందరూ నవ్వుతూ ఉంటే బాగుంది. ఈ సినిమా ఇక్కడితో ఆగిపోదు, ఇంకో నాలుగు వారాలు ఆడుతుంది. ఇది నా మాట.. రాసిపెట్టుకోండి. ఇప్పుడు థియేటర్లు పెంచాం. దీనంతటికి కారణమైన వ్యక్తి నిర్మాత అనిల్‌గారు.ఒక్క రూపాయి తీసుకోనుథాంక్స్‌ చాలా చిన్న విషయం. కృతజ్ఞతలు చెప్పి మీ రుణం తీర్చుకోవాలనుకోవడం లేదు. హీరో- నిర్మాత కలిసుంటే ఏమవుతుందనేది మేము చూపిస్తాం. నెక్స్ట్‌ సినిమాకు అనిల్‌ను రూపాయి కూడా అడగనని మాటిస్తున్నా.. మా అనిల్‌గారు పెద్ద సినిమాలు చేసేవరకు ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర తీసుకోను. ఏడేళ్ల నుంచి కష్టపడుతున్నాం. హిట్టు విలువ ఏంటో మాకు బాగా తెలుసు. అలాంటి విజయాన్ని మీరు నాకిచ్చారు అని సంతోషం వ్యక్తం చేశాడు.చదవండి: కుక్కలు, పిల్లులు, కోతులు పోతాయ్‌.. : రేణూ దేశాయ్‌ ఆవేదన

Netizens trolls on Film Director Venu Yeldandi Shared Photos10
గుడిపై అపచారం.. వేణుపై భగ్గుమంటున్న నెటిజన్లు

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి.. తొలి సినిమాతోనే భారీ హిట్‌ కావడంతో తనపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎల్లమ్మ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. చిత్రంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కథానాయకుడు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ అదిరిపోయిందని నెటిజన్లు రివ్యూలు కూడా ఇచ్చేశారు. మూవీ షూటింగ్‌ పనుల్లో ఉన్న వేణుపై సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు.తాజాగా వేణు తన షోషల్‌మీడియాలో కొన్ని ఫోటోలు షేర్‌ చేశాడు. తెలంగాణలోని ఓ ఆలయ ప్రాంగణంలో ఆయన ఫోటోలు దిగాడు. ఆ సమయంలో తను షూ ధరించే ఉండటంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో వేణుపై విరుచుకుపడుతున్నారు. షూ ధరించి గుడిపైకి మంచిగానే వెళ్లినవ్‌ అంటూనే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరికొందరు వేణుకు మద్ధతుగా నిలుస్తున్నారు. తను కూర్చొని ఉన్నది ప్రధాన ఆలయం కాదని చెబుతున్నారు. ఆపై సినిమా షూటింగ్‌ కాబట్టి ఎక్కువగా విద్యుత్‌ వైర్లు ఉంటాయని అందుకే తను అలా షూ ధరించాడని తెలుపుతున్నారు. అయితే, ఈ వివాదం గురించి వేణు స్పందించలేదు. షూటింగ్‌లో భాగంగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు.

Advertisement
Advertisement