Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Supreme court final judgement on Actress Pratyusha1
నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది. బెయిల్‌ కోసం ఆయన వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో సిద్దార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ్‌ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ప్రత్యూష హీరోయిన్‌గా రాణిస్తున్నప్పడు సిద్ధార్థ్‌ రెడ్డి ఇంజనీరింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ విషం తీసుకున్నారు.చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్‌ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.నాలుగు వారాల్లో లొంగిపోవాలిసీబీఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, తీర్పును సవాల్‌ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది.ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే..అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో సంతోషంగా ఉన్నాం. ఫేషియల్, వ్యాక్సింగ్‌ చేయించుకోవడానికి తన కజిన్‌ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. పార్లర్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్‌ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్‌ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు బయటకు వెళ్లి వస్తానని శిరిని వెయిట్‌ చేయమని చెప్పింది.అయితే, కొంత సేపటికి ప్రత్యూష నుంచి నాకు ఫోన్‌ వచ్చింది... ‘జయం సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్లు తేజ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి నాకు వచ్చిన చివరి ఫోన్‌ కాల్‌.. కానీ, వాళ్లు మాత్రం తేజ గారి ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరికి ఫోన్‌ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత శిరి ఫోన్‌ చేసినా సరే ప్రత్యూష ఫోన్‌ తియ్యలేదట. ఆ తర్వాత అంతా మిస్టరీగానే మిగిలిపోయింది.ప్రత్యూష పోస్ట్‌మార్టమ్‌ప్రత్యూష పోస్ట్‌మార్టమ్‌ నిమ్స్‌లో జరిగిందని ప్రత్యూష తల్లి చెప్పారు. 'సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్‌మార్టమ్‌ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్‌ పోశారని నాకనిపించింది. హాస్పిటల్‌ వాళ్లు మాత్రం ‘ట్రీట్‌మెంట్‌ సమయంలో పాయిజన్‌ వామిట్‌ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు.పాయిజన్‌ ఎందుకు తీసుకుందో..ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇలా చెప్పారు. ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్‌మార్టమ్‌ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్‌ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్‌ వచ్చేశాను.ప్రత్యూష సినిమా విశేషాలుసినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998–2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్.

Sivakarthikeyan Seyon Movie Announcement Video2
కుమారస్వామి ఆవహిస్తే? కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్

స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ.. 'అమరన్'తో పాటు తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ కాస్తంత గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. గతేడాది 'మదరాశి' మూవీతో వచ్చాడు గానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'పరాశక్తి' అనే పీరియాడికల్ చిత్రం చేశాడు. తమిళంలో మాత్రమే ఇది థియేటర్లలో రిలీజైంది. తెలుగు కూడా చేద్దామనుకున్నారు గానీ ఎందుకనో వెనకడుగు వేశారు. నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇకపోతే ప్రస్తుతం 'సెయాన్' అనే సినిమా చేస్తున్నాడు. దీనికి కమల్‌హాసన్ నిర్మాత. శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)దాదాపు మూడున్నర నిమిషాలు ఉన్న ఈ వీడియో బట్టి చూస్తే.. 'సెయాన్' చిత్రం రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని అర్థమవుతోంది. అయితే ఇందులో శివకార్తికేయన్‌.. పూర్తిగా రస్టిక్ లుక్‌లో కనిపించనున్నాడు. కుమారస్వామి ఇతడికి ఆవహించడం లాంటి ఎలిమెంట్ కూడా చూపించారు. 'సెయాన్' అంటేనే కుమారస్వామికి మరోపేరు. టైటిలే ఇది పెట్టారంటే కచ్చితంగా ఇందులో కుమారస్వామి గురించి కాస్తో కూస్తో చూపించడం గ్యారంటీ. కాకపోతే మూడున్నర నిమిషాల వీడియోలో చాలావరకు తమిళ ఫ్లేవర్ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. శివకుమార్ మురుగేశన్ దర్శకుడు. ఇదే ఇతడికి మొదటి సినిమా.ఇకపోతే త్రివిక్రమ్ కూడా కుమారస్వామికి చెందిన 'గాడ్ ఆఫ్ వార్' కథతో ఓ సినిమా తీయాలని అనుకున్నారు. తొలుత అల్లు అర్జున్ హీరో అనుకున్నారు గానీ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో దీన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Court Issues Non Bailable Warrant on Ameesha Patel3
ప్రముఖ హీరోయిన్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

బాలీవుడ్‌ ప్రముఖ నటి అమీషా పటేల్‌పై మొరాదాబాద్‌ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒక ఒప్పందంలో ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెకు పలుమార్లు కోర్టు సమన్లు ​​జారీ చేసినప్పటికీ హాజరు కావడం లేదు. దీంతో తాజాగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది.2017న వ్యాపారావేత్త ఆయుష్ అగర్వాల్ కుటుంబ వివాహ వేడుకలో నటి అమీషా పటేల్‌ ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ యజమాని పవన్ కుమార్ వర్మ రూ. 14.50 లక్షలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ఆపై మొరాదాబాద్‌లోని ఢిల్లీ రోడ్‌లోని ఒక హోటల్‌లో అమీషా పటేల్‌ కోసం లగ్జరీ హోటల్‌ బుకింగ్‌ చేశారు. అయితే, చివరి క్షణంలో ఆమె రావడం లేదని షాకిచ్చింది. తనకు ఇచ్చిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చిన అమీషా. . రూ. 10 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని మిగిలిన రూ. 4.50 లక్షల చెక్కు తరువాత బౌన్స్ అయిందని కోర్టుకు వర్మ తెలిపారు. తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టు అమీషా పటేల్‌కు పలుసార్లు సమన్లు ​​జారీ చేసింది. కానీ, ఆమె హాజరు కాలేదు. ఆమె హాజరును నిర్ధారించడానికి కోర్టు ఇప్పుడు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అమీషా తరపు న్యాయవాది అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఈ వివాదం 2017 నాటిదని, ఒక ఒప్పందం ద్వారా సమస్య ఎప్పుడో క్లియర్‌ అయిందన్నారు. ఆమేరకు మొత్తం డబ్బును తిరిగి ఇచ్చిందని ఆయన అన్నారు. అమీషా పటేల్‌ వివరణఈ విషయంపై అమీషా పటేల్‌ సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్‌ అయ్యారు. 'అర్ధిక లావాదేవీలకు సంబంధించి పవన్ వర్మతో సెటిల్‌మెంట్ గతంలోనే పూర్తి అయింది. ఆమేరకు డీడ్‌పై కూడా అతను సంతకం చేశాడు. తను అంగీకరించిన మొత్తాన్ని ఎప్పుడో చెల్లించాను. అయినప్పటికీ అతను తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేసినట్లు కనిపిస్తోంది. నా న్యాయవాదులు తను చేస్తున్న మోసంపై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం తను ఇప్పటికైనా మానుకోవాలి.' అని అమీషా తెలిపింది.

Eesha Movie Telugu OTT Streaming Now4
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా

ఈ వారం ఓటీటీల్లో చెప్పుకోదగ్గ తెలుగు రిలీజులు అయితే లేవు. ఉ‍న్నవి కూడా డబ్బింగ్, హిందీ చిత్రాలే. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి ఉంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్)గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలు చేశారు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. అయితే ఎప్పటికప్పుడు హారర్ మూవీస్ చూసేవాళ్లకు ఇదేమంత గొప్పగా అనిపించలేదు. కొందరికి మాత్రం నచ్చింది. ఓవరాల్ గా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఇప్పుడీ చిత్రం దాదాపు రెండు నెలలకు ఇ‍ప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'ఈషా' విషయానికొస్తే.. కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతుంటారు. ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి తెలుసుకుంటారు. అతడి బాగోతం బయటపెట్టాలని, అక్కడికే వెళ్లి బాబాని కలుస్తారు. మాటల సందర్భంలో ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

Actor Prakash raj role in Varanasi movie reveal5
'వారణాసి'లో ప్రకాష్ రాజ్ పాత్ర పవర్‌ఫుల్‌.. రివీల్‌ చేసిన నటుడు

మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్‌ సినిమా ‘వారణాసి’.. ఇందులో ప్రకాష్ రాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనేది దర్శకుడు ప్రకటించలేదు. దీంతో సోషల్‌మీడియాలో పలు కథనాలు వచ్చాయి. మహేశ్‌ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని రూమర్స్‌ వచ్చాయి. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు. వారణాసిలో శివుడి పరమ భక్తుడిగా నటిస్తున్నానని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్‌ పంచుకున్నారు. ఆపై హిందీ ‘దృశ్యం 3’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ఇప్పటికే విక్రమార్కుడులో నటించిన విషయం తెలిసిందే. ఆపై మహేశ్‌తో కూడా ఆయన కలిసి పలు సినిమాల్లో నటించారు. ఒక్కడు, రాజకుమారుడు, గుంటూరు కారం వంటి పలు సినిమాల్లో మెప్పించారు. ఇప్పుడు వారణాసిలో వీరిద్దరూ మరోసారి కలిశారు. మైథలాజికల్‌ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వారణాసి సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. అక్కడ షూటింగ్‌ చేసేందుకు సంబంధించిన కార్యాచరణను ఆల్రెడీ ప్రారంభించారట రాజమౌళి. అలాగే ఓ కీలక షెడ్యూల్‌ను అంటార్టికాలోనూ ప్లాన్‌ చేశారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ఒకవేళ అంటార్టికా లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగితే, అక్కడి క్లిష్టమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది.“I am a Maha Shiva Bhakt in #Varanasi”— #PrakashRaj pic.twitter.com/Xr3AMjQZH9— cinee worldd (@Cinee_Worldd) February 16, 2026

Vijay Deverakonda And Rashmika Wedding attend Guest list revealed6
విజయ్‌- రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్‌ వీళ్లే..

విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొననున్నారు. అయితే, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో భారీగా టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.విజయ్‌, రష్మికల వివాహానికి ఉదయ్‌పూర్‌ వెళ్లే అతిధుల జాబితా నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుండి ఎంపిక చేసిన ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, కృతి సనన్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అయితే, హైదరాబాద్‌లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు స్టార్స్‌తో పాటు యువ నటీనటులు హజరుకానున్నారు. ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నుండి కొంతమంది కీలక రాజకీయ నాయకులు కూడా విజయ్‌ పెళ్లిలో పాల్గొంటారని సమాచారం. ఈ జాబితా గురించి విజయ్‌ జోడీ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.

Actress Mamta Mohandas Comment On Her 2ND MARRIAGE7
రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: స్టార్‌ హీరోయిన్‌

ప్రేమలో మోసపోయిన సినీ తారల్లో నటి మమతమోహన్‌దాస్‌ ఒకరు. ఈమె బహు భాషా నాయకి. మలయాళం, తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, రుద్రంగి సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో శివప్పధికారం, గురు ఎన్‌ ఆళు, తడయార తాక్క,ఎనిమి,మహారాజా తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ప్రభు జయరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మైడియర్‌ సిస్టర్‌ చిత్రంలో అరుళ్‌నిధితో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ మధ్య క్యాన్సర్‌ మహ్మమారి బారిన పడ్డారు. అయితే దాని నుంచి పోరాడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మళ్లీ నటించడం మొదలెట్టిన మమత మోహన్‌దాస్‌ (Mamta Mohandas) తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో క్యాన్సర్‌ వ్యాధి నుంచి బయప పడి మళ్లీ నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందన్నారు. అలా మలయాళ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడితో డేటింగ్‌కు వెళ్లానని చెప్పారు. అయితే అతను మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్న విషయం తనకు ఆ తరువాతనే తెలిసిందన్నారు. దాంతో తన మనసు ముక్కలైయ్యిందన్నారు. ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానన్నారు. దీని గురించి ఆ నటుడిని అడగ్గా చాలా లైట్‌గా తీసుకున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం ఆ ఘటనను జీర్ణించుకోలేకపోయానన్నారు. తన మాజీ భర్తతో మొదటిసారి పరిచయం ఎలా అయిందో కూడా ఆమె పంచుకున్నారు. ఒక కార్యక్రమంలో తనను చూసి వివాహం చేసుకుందామని ఆకాంక్షను వ్యక్తం చేశారని, అందుకు తాను తన తల్లిదండ్రులను అడగమని చెప్పానట్లు గుర్తు చేసుకున్నారు. అలా అప్పుడు తమ పెళ్లి జరిగిందని చెప్పారు. కాగా వివాహ బంధంపై తనకు నమ్మకం ఉందని, అది ఎప్పటికీ చెరగదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మాదిరిగానే అర్థం చేసుకోగలిగిన వ్యక్తి తారసపడితే కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి మమత మోహన్‌దాస్‌ పేర్కొన్నారు. మమతకు 2011 నవంబరు 11న బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌తో నిశ్చితార్థం జరిగింది. వీరికి 2011 డిసెంబరు 28న కోజికోడ్‌లో వివాహం జరిగింది. 2012 డిసెంబరు 12న అంటే కేవలం ఏడాదిలోనే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ కారణంగానే వారిద్దరూ విడిపోయారని కొన్ని కథనాలు కూడా వచ్చాయి.

Arjun Sarja Says That He Wanted To leave movies before Gentleman8
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ కింగ్‌గా ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జున్ సర్జా, సినీమాల్లోకి రాకముందు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలని అనుకున్నారట. తన తండ్రి తనకోసం ఒక డాక్టర్‌ సీటు ఎలాగైనా సంపాదించి ఇస్తాను నువ్వు చదివి డాక్టర్‌ కావాలి అన్నారట. అయితే తనకు డాక్టర్‌ అవ్వాలని లేదు. అయితే అనుకోకుండా తను సినిమాల్లోకి వచ్చానని. తనకి సినీ హీరో అవుతాడని తెలియదని, తనని సినీమాల్లోకి ఎవరో తోసేశారని అర్జున్ అన్నారు. అర్జున్ సర్జా తాజాగా తన సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న సమయంలో సినిమాలను వదిలేయాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో శంకర్ తన వద్దకు వచ్చాడు. కానీ అప్పటికి తను కొత్త వాడు కావడంతో మొదట రిజెక్ట్ చేశాను. అయితే దర్శకుడు శంకర్ వెంటపడి మరీ ‘జెంటిల్‌మెన్’ కథ వినిపించారు. కాగా అందులోని సామాజిక సందేశం తనను ఆకట్టుకుంది. దాంతో ఆ చిత్రానికి ఓకే చెప్పాను.అయితే ‘జెంటిల్‌మెన్’ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం కథలోని సామాజిక సందేశం, పాత్ర బలం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కథను వదిలేస్తే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడు అనిపించింది. 1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్జున్ నటన అన్నీ కలిసి ‘జెంటిల్‌మెన్’ సినిమాను బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలబెట్టాయి. ఆ చిత్రంతో ఆయన స్టార్‌ హీరోగా మారారు. ఆ తరువాత యాక్షన్ కింగ్‌గా ఎన్నో హిట్లు తన కెరీర్‌లో సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించడం విశేషం. కుటుంబ విలువలతో పాటు ప్రేమ, రోడ్ జర్నీ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది. అర్జున్ సర్జా చెప్పినట్లుగా ఒక్క నిర్ణయం జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలదు. అర్జున్ సర్జా కెరీర్‌లో ‘జెంటిల్‌మెన్’ అలాంటి మలుపు.

Tollywood director Movie 8 AM Metro Streaming In Another Ott9
టాలీవుడ్ డైరెక్టర్ సినిమా.. మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలో స్ట్రీమింగ్

ఓటీటీల్లో సినిమాలు సడన్‌గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ రోజుల్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ముందుగానే డీల్స్ ఉండడంతో స్ట్రీమింగ్ చేసేస్తుంటారు. మరికొన్ని చిత్రాలు ఒకే ఫ్లాట్‌ఫామ్ కాకుండా రెండు, మూడింటిలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా మూవీ విడుదలైన కొన్ని నెలలు, ఏడాదిలోపు రావడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ చిత్రం రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా?బాలీవుడ్‌ మూవీ 8 ఏఎమ్ మెట్రో 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. 2023 మే 19న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం మరో ఓటీటీకి రావడం విశేషం. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు.

megastar chiranjeevi Tweet about His Hand Fracture surgery 10
మెగాస్టార్ చేతికి పట్టీ.. అసలు విషయం ఇదే

తనకు సర్జరీ జరిగిందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అల్లు శిరీశ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకునే సమయంలో చేతికి పట్టీ వేసుకుని మెగాస్టార్ కనిపించారు. దీంతో చిరు ఏమైందని ఫ్యాన్స్‌తో పాటు పలువురు ఆరా తీశారు. తాజాగా సర్జరీ జరిగిన విషయాన్ని మెగాస్టార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' నా చేయి పట్టీ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీ హోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నా. ఇప్పటికే నా దినచర్య తిరిగి ప్రారంభించా. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడంలో ఆయన శ్రద్ధ, నైపుణ్యం అద్భుతం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. Several well-wishers have enquired about my health after noticing the arm sling.It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine.My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care… pic.twitter.com/txLNH2yNFQ— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2026

Advertisement
Advertisement