ప్రధాన వార్తలు
దురంధర్కు అదే పెద్ద మైనస్.. అలా జరిగితే భారీ వసూళ్లు: అమిర్ ఖాన్
గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ మూవీ గురించి స్టార్ హీరో అమిర్ ఖాన్ మాట్లాడారు. అలా జరిగి ఉంటే దురంధర్కు ఇంకా వసూళ్లు వచ్చేవని అన్నారు. మనదేశంలో థియేటర్ల కొరత వల్లే దురంధర్ వసూళ్లు ఇంకా తగ్గాయని వెల్లడించారు. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలంటే దేశానికి మరిన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముందని తెలిపారు.ధురంధర్ లాంటి సినిమాకు చైనీస్ సినిమాలకు లభించినంత థియేటర్స్ ఉండి ఉంటే..మరింత భారీ వసూళ్లు సాధించి ఉండేదని అన్నారు. భారత్లో తగినన్ని థియేటర్స్ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. చైనాలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మన దేశంలో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు.థియేటర్స్ మరింత అవసరం..ఇండియాలో మరిన్ని థియేటర్స్ నిర్మించాల్సిన అవసరముందని తాజా ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కేవలం 9 వేల స్క్రీన్లు మాత్రమే ఉన్నాయని.. చైనాలో సుమారు లక్ష స్క్రీన్లు ఉన్నాయని తెలిపారు. అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు భారీగా బిజినెస్ జరుగుతుందదన్నారు. కేవలం చైనాలో మాత్రమే అక్కడి పెద్ద సినిమాలు బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తాయన్నారు. మనం మన స్క్రీన్ల సంఖ్య పెంచితేనే అది సాధ్యమవుతుందని అమిర్ ఖాన్ సూచించారు.గతేడాది చైనీస్ చిత్రం 'నె ఝా 2' ఆ దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీతో పోలిస్తే 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ధురంధర్.. దేశీయంగా 115 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు) మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 150 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూలు చేసిందని తెలిపారు.మరింత భారీ వసూళ్లు..మనదేశంలో కూడా మరిన్ని స్క్రీన్లు అందుబాటులో ఉంటే భారతీయ సినిమాలు గొప్ప విజయాన్ని సాధించేవని అమిర్ ఖాన్ తెలిపారు. మనదేశంలో రూ.1000 కోట్ల వసూలు చేసిన దురంధర్.. 5 వేల స్క్రీన్స్ కాకుండా.. 15,000 స్క్రీన్లలో విడుదలై ఉంటే మరింత భారీ విజయం సాధించి ఉండేదన్నారు. థియేటర్స్ సంఖ్య పెరిగినప్పుడే నిజమైన మార్పు కనిపిస్తుందని.. ఎందుకంటే ప్రస్తుతం మనదేశంలో ఒక్క స్క్రీన్ కూడా లేని జిల్లాలు చాలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ అన్నారు. కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే.. గత సంవత్సరం 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 'హ్యాపీ పటేల్', రజనీకాంత్ 'కూలీ' చిత్రాల్లో అతిథి పాత్రలలో మెరిశారు.
సినిమా బాగుంది, నీకు మంచి భవిష్యత్తుంది బ్రదర్!
'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా సత్తా చాటిన అభిషన్ జీవింత్ 'విత్ లవ్' మూవీతో హీరోగా మారాడు. అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 6న విడుదలయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాపై తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించాడు.విత్ లవ్పై ప్రశంసలువిత్ లవ్ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. ఇటీవలి కాలంలో వచ్చిన ఆహ్లాదకరమైన సినిమా ఇది. ముఖ్యంగా తెలుగు డైలాగులు సందర్భోచితంగా, నీట్గా ఉన్నాయి. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. షాన్ రోల్డన్ సంగీతం సినిమాకు చాలా చక్కగా కుదిరింది.మంచి భవిష్యత్తుతొలి సినిమాకే ఇంతమంచి ప్రతిభ చూపించిన దర్శకుడు మధన్ను మెచ్చుకుని తీరాల్సిందే! సోదరా.. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్యూట్ మూవీ నిర్మించిన సౌందర్య రజనీకాంత్, మగేశ్కు శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన రానా దగ్గుబాటికి ప్రత్యేక అభినందనలు అని ట్వీట్ చేశాడు.దర్శకుడి నుంచి హీరోగా..అభిషన్ జీవింత్ యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టాడు. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో డైరెక్టర్గా మారాడు. తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాత్ర పోషించాడు. ఇకపోతే గతేడాది అతడు ప్రేయసి అఖిల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లికి హాజరైన టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజ్.. అభిషన్కు కారు గిఫ్ట్ ఇచ్చాడు. Truly enjoyed watching #WithLove 🩶A breezy, well-made rom-com in recent times with very apt and neatly penned Telugu dialogues.@Abishanjeevinth & #AnaswaraRajan feels spot on, and @RSeanRoldan’s music works beautifully.Kudos to @madhann_n on a fantastic debut. Long way to…— Anil Ravipudi (@AnilRavipudi) February 8, 2026 చదవండి: సర్వం మాయ హిట్.. తండ్రికి దర్శకుడి విలువైన కానుక
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
టాలీవుడ్ కుర్ర హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్పై కన్నేశారు. ఒకటి, రెండు హిట్లు పడితే చాలు వెంటనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. ‘బ్రో’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘సంబరాల యేటిగట్టు’అనే పాన్ ఇండియా సినిమాను లైన్లో పెట్టాడు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తో ‘హనుమాన్’నిర్మాతలు భారీ బడ్జెట్తో చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించారు. కానీ ఆ బడ్జెట్ అంతా సినిమా మధ్యలోనే అయిపోయింది. అదనంగా డబ్బులు పెట్టి షూటింగ్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. గతేడాది దసరాకే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ బడ్జెట్ లేకపోవడంతో షూటింగ్ ఆలస్యం అయి.. అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారట. కానీ తాజా సమాచారం ప్రకారం వేసవిలో కూడా సినిమా రిలీజ్ కావడమే కష్టమే. ఈ మధ్య ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు షూటింగ్ పూర్తయిందా లేదా అనే సమాచారం కూడా లేదు. తేజు కూడా ఈ చిత్రాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆసల్యం కావడంతో..ఈ సినిమాను వదిలేసి కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్తో దర్శకుడిగా మారిన తేజ కాకుమానుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు ‘క’మూవీ సీక్వెల్లోనూ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో దర్శకులు సుజీత్, సందీప్.. సీక్వెల్కి తేజుని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇటీవల కథ కూడా వినిపించారట. త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించబోతున్నారు. ఇలా సాయి ధరమ్ తేజ్.. వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బట్టి చూస్తే.. ‘సంబరాల యేటిగట్టు’ఇప్పట్లో లేనట్టే అనిపిస్తోంది. ఇప్పుడు కాకపోయినా..ఎప్పుడో ఒక్కసారైనా రిలీజ్కి నోచుకుంటుందా లేదా చూడాలి మరి.
వైఎస్ జగన్ను కలిసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ కలిశారు. చెన్నైలో జరిగిన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలు కార్తీ, సూర్య వైఎస్ జగన్ను ఆత్మీయంగా పలకరించారు. పెళ్లి వేడుకలో హీరోలు కార్తీ, సూర్యతో వైఎస్ జగన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు అటు రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews)
బిగ్బాస్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
యాక్సిడెంట్తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
2009లో ఇండస్ట్రీలోకి.. ఇన్నాళ్లకు నటిగా..: స్రవంతి స్పీచ్
A to Z
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించ...
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం...
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంద...
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సిని...
డేట్ ఫిక్స్
ఈ వేసవిలో ‘భూత్ బంగ్లా’ తలుపులు తెరుచుకుంటాయని అం...
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుక...
'ధురంధర్' సినిమా కోసం 3 కేరవాన్స్ అడిగిన హీరో?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నట...
లుక్స్పై ట్రోలింగ్.. నేనూ హర్ట్ అవుతా: హీరోయిన్
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నటి శరణ్య కూతురు రిసెప్షన్ గ్రాండ్గా జరిగ...
ధనుష్-సాయిపల్లవి-శ్రీలీల సినిమా షురూ
ధనుష్ హీరోగా నటిస్తున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్...
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుక...
శరణ్య కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్ హీరోలు
ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ...
ఫొటోలు
ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
'అమరావతికి ఆహ్వానం' హారర్ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)
కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)
‘యుఫోరియా’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
బ్లూ డ్రెస్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)
గాసిప్స్
View all
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
"ది ప్యారడైజ్" రిలీజ్పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్లోనే!
సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ?
'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?
రివ్యూలు
View all
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
2.75
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
తెలుగులో ఏకైక మూవీ.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఒకప్పుడు హీరోయిన్గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవడం సహజం. కథానాయికగా అలరించినవారే తర్వాత అమ్మ, అత్త, వదిన పాత్రల్లో అలరిస్తుంటారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీని వదిలేసి వెండితెరకు దూరంగా ప్రశాంతంగా బతుకుతుంటారు. నటి డాలీ మిన్హాస్ మొదటి కోవకు చెందినది. నేడు (ఫిబ్రవరి 8న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై ఈ ప్రత్యేక కథనం..మోడలింగ్ నుంచి సినిమాలవైపుడాలీ మిన్హాస్ అసలు పేరు డాలీ మాట్యూ. తనొక మోడల్. 1988లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. 1989లో మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున పోటీ చేసింది. అలా మోడలింగ్ నుంచి సినిమాల్లో వచ్చింది. డాలీ కథానాయికగా నటించిన మొదటి మూవీ దస్తూర్ (1991). సినిమాలుమిస్టర్ బాండ్, క్షత్రియ, గేమ్, ప్యార్ మే ట్విస్ట్, గుడ్ లక్, దిల్ దడక్కనే దో వంటి పలు సినిమాలు చేసింది. హిందీతో పాటు పంజాబీ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో శ్రీమాన్ బ్రహ్మచారి అని ఒకే ఒక్క సినిమా చేసింది. 1992లో వచ్చిన ఈ సినిమాలో సురేశ్ హీరోగా నటించాడు. చివరగా కబీర్ సింగ్ (2019) మూవీలో హీరో తల్లి పాత్రలో కనిపించింది.సీరియల్స్కు షిఫ్ట్తొలి సినిమా దర్శకుడు అనిల్ మాట్యూతో ప్రేమలో పడిన డాలీ అతడినే పెళ్లి చేసుకుంది. రానురానూ సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. ఇస్ ప్యార్కో క్యా నామ్ ధూ?, ఏక్ బార్ ఫిర్, చోటీ సర్దామి వంటి పలు సీరియల్స్లో నటించింది. మహాయోధ, శక్తిమాన్ సీరియల్స్లో నెగెటివ్ పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రేమ్ లీలా సీరియల్ చేస్తోంది. అలా ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన డాలీ ఇప్పుడు బుల్లితెరపై నటిగా రాణిస్తోంది.చదవండి: జీవితంలో సంతోషంగా లేను.. దమ్ము శ్రీజ
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
సినీ నటుడు పవన్ కల్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ గురించి నిర్మాత రామ్ తాళ్లూరి కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. పవన్ నటిస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’ మార్చి 26న విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ మూవీ తర్వాత తదుపరి ఆయన చేయనున్నది సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న సినిమానే కావడం విశేషం. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక గురించి మరోసారి విమర్శలు వస్తున్నాయి.‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఇమాన్వీ ఇస్మాయిల్ను పవన్కు జోడీగా సురేందర్ రెడ్డి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇమాన్వీ ఎంపికను తప్పుబడుతూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఫౌజీ మూవీలో ఇమాన్వీని తీసుకుంటున్నట్లు ప్రకటన వచ్చిన సమయంలో కూడా ఇలాంటి వివాదమే రేగింది. తన మూలాలు పాకిస్థాన్కు చెంది ఉన్నాయని మరికొందరు గుర్తు చేస్తున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్తో ఉన్న సంబంధాలన్నీ కూడా భారత్ తెంచుకుంది. పాకిస్థాన్ నటులు, సినిమాలపై కూడా నిషేధం విధించాలనే డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పవన్ మూవీకి ఇమాన్వీని తీసుకోనున్నారని వార్తలు రావడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, ఇమాన్వీ ఎంపిక అంశం గురించి అధికారికంగా ప్రకటన రాలేదు.నాది పాకిస్థాన్ కాదుఫౌజీ సినిమా సమయంలో కూడా ఇమాన్వీ ప్రాంతీయత గురించి ఇలాంటి విమర్శలే వచ్చాయి. దీంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాను పాకిస్థానిని కాదని, భారతీయ అమెరికన్ని అని గర్వంగా చెప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు తన మూలాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ' పాకిస్థాన్తో నా కుటుంబం సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేవు. నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని కొందరు నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారత సంస్కృతి నా రక్తంలోనే ఉంది. నేను చాలా క్లియర్గా హిందీతో పాటు తెలుగు, గుజరాతీ మాట్లాడగలనని గర్వంగా చెబుతాను. నేను పుట్టింది లాస్ ఏంజెలిస్లో.. చాలా ఏళ్ల క్రితమే నా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. వారు ఎప్పుడో అమెరికన్ సిటిజన్స్గా గుర్తింపు పొందారు. నేను చదివింది కూడా అమెరికాలోనే.. సినిమాలపై ఆసక్తితో నా చదువు పూర్తయ్యాక కొరియోగ్రాఫర్గా కెరీర్ని ప్రారంభించాను. ఫైనల్గా భారతీయ చిత్రపరిశ్రమలో అవకాశాల్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది.' అంటూ గతంలో ఇమాన్వీ తన గురించి క్లారిటీ ఇచ్చింది.
కింగ్ వచ్చేశాడు..ఇక దిల్‘రాజ్’కు పోటీ తప్పదా?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరో రంగంలోనూ సత్తా చాటనున్నారు. అగ్రస్థాయి నటుడుగా, చిన్నితెర పై టాప్ హోస్ట్గా, నిర్మాత, స్టూడియో అధినేత... వంటి బహుముఖ పాత్రలతో రాణిస్తున్న నాగ్... ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో సినిమా పంపిణీదారుగా కూడా కొత్త పాత్ర పోషించనున్నారు. పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన సినీ పంపిణీ రంగంలోకి లాంఛనంగా అడుగుపెట్టారు, రాబోయే సంవత్సరాల్లో తన పంపిణీ సామ్రాజ్యాన్ని గణనీయంగా విస్తరించాలని యోచిస్తున్నారు.బాలీవుడ్ బాటలో...ప్రస్తుతం తెలుగు హీరోలలో ఎవరూ పంపిణీ రంగంలో లేని పరిస్థితుల్లో.. ఈ రంగంలోకి దిగిన తొలి తెలుగు హీరోగా నాగార్జున నిలవనున్నారు. బాలీవుడ్ లో చూస్తే రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్ మెంట్ పేరిట షారూఖ్ఖాన్, అమీర్ఖాన్, సల్మాన్ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, దక్షిణాది హీరోల్లో రాజ్ కమల్ ఫిలింమ్స్ ఇంటర్నేషనల్ పేరిట కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్లాల్...వంటివారు పంపిణీ రంగంలో ఉన్నారు. ఈ హీరోలు ముఖ్యంగా బాలీవుడ్ హీరోల స్ఫూర్తితోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. తెరపై పాత్రల ఎంపిక విషయంలో మాత్రమే కాదు వాణిజ్య ప్రణాళికల విషయంలోనూ ఎప్పుడూ మిగిలిన వారికంటే ఓ అడుగు ముందే నాగ్ ఉంటారనేది గతంలో ఎన్నోమార్లు రుజువైన విషయం. తెలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలు...అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటికే హైదరాబాద్లో ఒక పంపిణీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు విశాఖపట్నంలో కూడా కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది, ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విస్తరణకు సంకేతంగా చెప్పుకోవచ్చు. దాదాపు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థ నాగార్జున స్వంతం. ఇప్పుడు ఆయన మరిన్ని సినిమాలను నిర్మించాలని మరోవైపు తన పంపిణీ నెట్వర్క్ను బలోపేతం చేయాలని యోచిస్తున్నారని తెలుస్తోంది..ఆర్థికపుష్టి ఉన్న అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జున డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టడం ప్రస్తుత అగ్రగామి పంపిణీదారులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.పోటాపోటీ...పంపిణీతెలుగు రాష్ట్రాలలో పంపిణీ రంగం ఇప్పటికే పలు మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు సిండికేట్గా మారాయి. ఈ నేపధ్యంలో నాగార్జున ప్రవేశంతో రెండు రాష్ట్రాల్లో పంపిణీ ఆధిపత్యం కోసం జరిగే పోరు మరింత తీవ్రమవుతుందని సినీ పరిశీలకులు భావిస్తున్నారు. నిజాం, వైజాగ్ ప్రాంతాలలో ప్రధాన పంపిణీదారుగా దిల్ రాజు కొనసాగుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పంపిణీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత, చాలా మంది నిర్మాతలు మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్తో, ముఖ్యంగా నిజాం ప్రాంతంలో, భాగస్వామ్యం కావడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఏషియన్ థియేటర్స్కు చెందిన సునీల్, సురేష్ బాబులు కొన్ని ఎంపిక చేసిన ప్రాజెక్టుల పంపిణీ బాధ్యతలు చేపడుతున్నారు.మారనున్న స్నేహాలు...గత కొంత కాలంగా సితార ఎంటర్టైన్మెంట్స్కు చెందిన సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రాలను దిల్ రాజు, క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారు. అయితే, నిజాం ప్రాంతంలో ఇటీవల తన పంపిణీ కార్యాలయాన్ని ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోస్తో ఇకపై నాగవంశీ భాగస్వామ్యం కావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం బహుళ చిత్రాలను విడుదల చేస్తూన్న నాగవంశీ తెలుగు సినిమాలో అత్యంత చురుకైన విజయవంతమైన నిర్మాతలలో ఒకరనేది తెలిసిందే అంతేకాక దిల్ రాజుతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ మార్పు కార్యరూపం దాల్చితే, నిజాం ప్రాంతంలో దిల్ రాజు ఆధిపత్యానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించవచ్చు. ఓ వైపు పంపిణీదారులుగా మారుతున్న నిర్మాతల సంఖ్య పెరుగుతుండడం, సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ వంటి పంపిణీ రంగంలో స్థిరపడిన వారికి సవాలు గా మారనుందని, నాగార్జున ప్రవేశం తెలుగు సినిమా పంపిణీ వ్యాపారాన్ని పునర్నిర్వచించబోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
బిగ్బాస్ అగ్నిపరీక్ష ద్వారా పాపులర్ అయింది శ్రీజ దమ్ము. పేరుకు తగ్గట్లుగానే షోలో తన దమ్ము చూపించి తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టింది. కానీ మొదట్లో ఓవర్ యాటిట్యూడ్ చూపించి విమర్శలపాలైంది. అయితే తన ముక్కుసూటితనం, ఆటతీరు వల్ల అభిమానులను సైతం సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్ ఇతరత్రా విషయాలను పంచుకుంది.ట్రోలింగ్శ్రీజ దమ్ము మాట్లాడుతూ.. మా నాన్న జీవీఎంసీ (మహా విశాఖ నగర పాలక సంస్థ) ఉద్యోగి (పారిశుద్ధ్య కార్మికుడు). నేను బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఓసారి చీర దోపుకుని చెత్త బ్యాగులు పట్టుకెళ్లాను. దానికి విపరీతంగా ట్రోల్ చేశారు. తడిచెత్త, పొడిచెత్త అమ్ముకునేలా ఉంది.. సరిగ్గా సరిపోయింది అని విమర్శించారు. అది చూసి నేను నవ్వుకున్నాను. అందుకు సంతోషంకానీ, మా నాన్న చేసే పని అదే కావడంతో ఇంట్లో వాళ్లు బాధపడ్డారు. ఏదేమైనా బిగ్బాస్కు వెళ్లి నాకంటూ ఓ పేరు సంపాదించుకున్నందుకు హ్యాపీ. కానీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్స్తో గేమ్ ఆడించి బయటకు పంపించినందుకు బాధగా అనిపించింది. నాకే ఎందుకిలా జరుగుతుందని ఏడ్చాను. ఇప్పుడు తల్చుకున్నా బాధనిపిస్తుంది.నేను పెళ్లి చేసుకునేవాడు..పార్టీలు, పబ్బులకెళ్తా.. కానీ, మందు మాత్రం తాగను. నాకు కాబోయే భర్త తాగుడుకు బానిసైతే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా.. ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి హైట్ ఉండాలి, జుట్టుండాలి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. రేపు నేను ఉద్యోగం చేసినా, చేయకపోయినా, ఖాళీగా ఉన్నా అతడే అన్నీ చూసుకునేలా ఉండాలి. నాకయితే ప్రేమపెళ్లి చేసుకోవాలని ఉంది. నేనంటే పడి చచ్చిపోయేవాడు కావాలి.నా జీవితం నా ఇష్టంనా డ్రెస్సింగ్పై వచ్చే ట్రోల్స్ పట్టించుకోను. నేను షార్ట్ వేసుకుంటా.. టీషర్ట్ వేసుకుంటా.. నీకెందుకు? నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్లుగా బట్టలు వేసుకుంటాను. ఇకపోతే సొంతింటి కల ఒక్కటే నాకున్న పెద్ద డ్రీమ్. ఇంతవరకు నేనెప్పుడూ సంతోషంగా లేను. ఏదో లైఫ్ ముందుకెళ్తుందా? అంటే వెళ్తుందంతే! ప్రశాంతమైన జీవితం దొరికితే సంతోషంగా ఉంటాను. అలా అని డిప్రెషన్లో లేను. బిగ్బాస్ కోసం రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశా.. ఇప్పుడుమ మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను అని శ్రీజ చెప్పుకొచ్చింది.చదవండి: సర్వం మాయ బ్లాక్బస్టర్ హిట్.. తండ్రికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. భయపెడుతోన్న ట్రైలర్
ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత, శివ కంఠనేని ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ థ్రిల్లర్ మూవీ అమరావతికి ఆహ్వానం. ఈ సినిమాకు జీవీకే దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. అమరావతికి ఆహ్వానం ట్రైలర్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏంట్రా ఈ ఊరు మనుషులే కనపడట్లేదు అనే డైలాగ్తో ప్రారంభమైంది. ఈ గ్రామంలో జరిగే మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్లో సీన్స్ ఆడియన్స్ను భయపెట్టేస్తున్నాయి. దెయ్యాల కాన్సెప్ట్తోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
రోజుకు 15 సార్లు వాంతులు.. నరకం చూశా: సుప్రిత
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హల్ చేసిన ఈ బ్యూటీ..ఇకపై వెండితెరపై సందడి చేయబోతుంది. ఆమె హీరోయిన్గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది సుప్రిత. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల అనారోగ్యానికి గురైనప్పుడు..తన మానసిక పరిస్థితి ఎలా ఉందో వివరించింది.ఒత్తిడితో ఎక్కువ తీసేశా.. ఆ మధ్య నేను కాస్త బరువు పెరిగా. అందరూ నన్ను లావు అయ్యావు అనడంతో ఒత్తిడికి లోనయ్యా. నేను ఒత్తిడికి లోనైన ప్రతిసారి ఇంకాస్త ఎక్కువే తింటాను. అలా తినడంతో బరువు పెరిగిపోయా. దీంతో వెంటనే తగ్గాలని ఒక పూట తినడం ప్రారంభించా. ప్రతి రోజు 12-15 గంటల పాటు ఏం తినకుండా ఉండేదాన్ని. ఒక పూట మాత్రం ఏదైనా తీనేదాన్ని. ఎక్కువగా బిర్యానీలు తీనడంతో ఆరోగ్యం దెబ్బతింది. ఆస్పత్రిలో చేరాను. అక్కడ దాదాపు 15 రోజుల పాటు నరకం చూశా. మంచి నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి. 20 రోజుల పాటు అన్నమే తినలేదు. రోజుకు 15 సార్లు వాంతులు అయ్యేవి. ఒకనొక దశలో నేను బతకనేమో అనుకున్నా. నా వల్ల అమ్మతో పాటు స్టాఫ్ అంతా ఇబ్బంది పడింది. ఆస్పత్రిలో వారిని చూసి నాకే బాధకలిగింది. ఈ నరకం భరించడం కంటే..ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి చంపేస్తే బాగుండు అనుకున్నా. కానీ దేవుడి దయతో కోలుకున్నా. ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను’ అని సుప్రీతి చెప్పుకొచ్చింది.ఆ ఇద్దరికి సిస్టర్గా నటించలేనుఇక ఇదే ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు హీరోయిన్గా మాత్రమే కొనసాగాలని లేదని.. మంచి స్క్రిప్ట్ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేస్తానని చెప్పింది. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్కు సిస్టర్గా నటించే అవకాశం వస్తే వదులుకోను. ఈ ఇద్దరనే కాదు.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, అఖిల్ తప్ప వేరే ఏ హీరోకి అయినా సిస్టర్గా నటిస్తా. విజయ్ దేవరకొండ, అఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. పదో తరగతి పాస్ అయితే అఖిల్తో డిన్నర్కి తీసుకెళ్తా అని అమ్మ మాట ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు. అఖిల్, విజయ్ నేరుగా కనిపిస్తే..షాకులో ఉండిపోతానేమో’ అని సుప్రిత చెప్పుకొచ్చింది.
దురంధర్కు అదే పెద్ద మైనస్.. అలా జరిగితే భారీ వసూళ్లు: అమిర్ ఖాన్
గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ మూవీ గురించి స్టార్ హీరో అమిర్ ఖాన్ మాట్లాడారు. అలా జరిగి ఉంటే దురంధర్కు ఇంకా వసూళ్లు వచ్చేవని అన్నారు. మనదేశంలో థియేటర్ల కొరత వల్లే దురంధర్ వసూళ్లు ఇంకా తగ్గాయని వెల్లడించారు. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలంటే దేశానికి మరిన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముందని తెలిపారు.ధురంధర్ లాంటి సినిమాకు చైనీస్ సినిమాలకు లభించినంత థియేటర్స్ ఉండి ఉంటే..మరింత భారీ వసూళ్లు సాధించి ఉండేదని అన్నారు. భారత్లో తగినన్ని థియేటర్స్ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. చైనాలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మన దేశంలో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు.థియేటర్స్ మరింత అవసరం..ఇండియాలో మరిన్ని థియేటర్స్ నిర్మించాల్సిన అవసరముందని తాజా ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కేవలం 9 వేల స్క్రీన్లు మాత్రమే ఉన్నాయని.. చైనాలో సుమారు లక్ష స్క్రీన్లు ఉన్నాయని తెలిపారు. అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు భారీగా బిజినెస్ జరుగుతుందదన్నారు. కేవలం చైనాలో మాత్రమే అక్కడి పెద్ద సినిమాలు బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తాయన్నారు. మనం మన స్క్రీన్ల సంఖ్య పెంచితేనే అది సాధ్యమవుతుందని అమిర్ ఖాన్ సూచించారు.గతేడాది చైనీస్ చిత్రం 'నె ఝా 2' ఆ దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీతో పోలిస్తే 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ధురంధర్.. దేశీయంగా 115 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు) మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 150 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూలు చేసిందని తెలిపారు.మరింత భారీ వసూళ్లు..మనదేశంలో కూడా మరిన్ని స్క్రీన్లు అందుబాటులో ఉంటే భారతీయ సినిమాలు గొప్ప విజయాన్ని సాధించేవని అమిర్ ఖాన్ తెలిపారు. మనదేశంలో రూ.1000 కోట్ల వసూలు చేసిన దురంధర్.. 5 వేల స్క్రీన్స్ కాకుండా.. 15,000 స్క్రీన్లలో విడుదలై ఉంటే మరింత భారీ విజయం సాధించి ఉండేదన్నారు. థియేటర్స్ సంఖ్య పెరిగినప్పుడే నిజమైన మార్పు కనిపిస్తుందని.. ఎందుకంటే ప్రస్తుతం మనదేశంలో ఒక్క స్క్రీన్ కూడా లేని జిల్లాలు చాలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ అన్నారు. కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే.. గత సంవత్సరం 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 'హ్యాపీ పటేల్', రజనీకాంత్ 'కూలీ' చిత్రాల్లో అతిథి పాత్రలలో మెరిశారు.
సినిమా బాగుంది, నీకు మంచి భవిష్యత్తుంది బ్రదర్!
'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా సత్తా చాటిన అభిషన్ జీవింత్ 'విత్ లవ్' మూవీతో హీరోగా మారాడు. అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 6న విడుదలయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాపై తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించాడు.విత్ లవ్పై ప్రశంసలువిత్ లవ్ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. ఇటీవలి కాలంలో వచ్చిన ఆహ్లాదకరమైన సినిమా ఇది. ముఖ్యంగా తెలుగు డైలాగులు సందర్భోచితంగా, నీట్గా ఉన్నాయి. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. షాన్ రోల్డన్ సంగీతం సినిమాకు చాలా చక్కగా కుదిరింది.మంచి భవిష్యత్తుతొలి సినిమాకే ఇంతమంచి ప్రతిభ చూపించిన దర్శకుడు మధన్ను మెచ్చుకుని తీరాల్సిందే! సోదరా.. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్యూట్ మూవీ నిర్మించిన సౌందర్య రజనీకాంత్, మగేశ్కు శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన రానా దగ్గుబాటికి ప్రత్యేక అభినందనలు అని ట్వీట్ చేశాడు.దర్శకుడి నుంచి హీరోగా..అభిషన్ జీవింత్ యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టాడు. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో డైరెక్టర్గా మారాడు. తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాత్ర పోషించాడు. ఇకపోతే గతేడాది అతడు ప్రేయసి అఖిల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లికి హాజరైన టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజ్.. అభిషన్కు కారు గిఫ్ట్ ఇచ్చాడు. Truly enjoyed watching #WithLove 🩶A breezy, well-made rom-com in recent times with very apt and neatly penned Telugu dialogues.@Abishanjeevinth & #AnaswaraRajan feels spot on, and @RSeanRoldan’s music works beautifully.Kudos to @madhann_n on a fantastic debut. Long way to…— Anil Ravipudi (@AnilRavipudi) February 8, 2026 చదవండి: సర్వం మాయ హిట్.. తండ్రికి దర్శకుడి విలువైన కానుక
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
టాలీవుడ్ కుర్ర హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్పై కన్నేశారు. ఒకటి, రెండు హిట్లు పడితే చాలు వెంటనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. ‘బ్రో’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘సంబరాల యేటిగట్టు’అనే పాన్ ఇండియా సినిమాను లైన్లో పెట్టాడు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తో ‘హనుమాన్’నిర్మాతలు భారీ బడ్జెట్తో చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించారు. కానీ ఆ బడ్జెట్ అంతా సినిమా మధ్యలోనే అయిపోయింది. అదనంగా డబ్బులు పెట్టి షూటింగ్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. గతేడాది దసరాకే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ బడ్జెట్ లేకపోవడంతో షూటింగ్ ఆలస్యం అయి.. అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారట. కానీ తాజా సమాచారం ప్రకారం వేసవిలో కూడా సినిమా రిలీజ్ కావడమే కష్టమే. ఈ మధ్య ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు షూటింగ్ పూర్తయిందా లేదా అనే సమాచారం కూడా లేదు. తేజు కూడా ఈ చిత్రాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆసల్యం కావడంతో..ఈ సినిమాను వదిలేసి కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్తో దర్శకుడిగా మారిన తేజ కాకుమానుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు ‘క’మూవీ సీక్వెల్లోనూ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో దర్శకులు సుజీత్, సందీప్.. సీక్వెల్కి తేజుని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇటీవల కథ కూడా వినిపించారట. త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించబోతున్నారు. ఇలా సాయి ధరమ్ తేజ్.. వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బట్టి చూస్తే.. ‘సంబరాల యేటిగట్టు’ఇప్పట్లో లేనట్టే అనిపిస్తోంది. ఇప్పుడు కాకపోయినా..ఎప్పుడో ఒక్కసారైనా రిలీజ్కి నోచుకుంటుందా లేదా చూడాలి మరి.
వైఎస్ జగన్ను కలిసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ కలిశారు. చెన్నైలో జరిగిన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలు కార్తీ, సూర్య వైఎస్ జగన్ను ఆత్మీయంగా పలకరించారు. పెళ్లి వేడుకలో హీరోలు కార్తీ, సూర్యతో వైఎస్ జగన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు అటు రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews)
సినిమా
మా వాడు మాట్లాడింది రెండు, మూడు బూతులే..! కానీ మీరు చేస్తుందేంటి...
చరణ్, తారక్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. RRR సీక్వెల్ కన్ఫర్మ్.. త్వరలోనే..!
పెళ్ళిలో హీరో సూర్య, కార్తీ తో వైఎస్ జగన్
అట్లీ మూవీకి.. బన్నీ రికార్డ్ రెమ్యునరేషన్
సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ
Koti: నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
Keerthi: పని చేస్తేనే ఫుడ్.. కష్టాలు ఎలా ఉంటాయంటే ?
ఇండస్ట్రీకి కొత్త హీరో దొరికాడు.. బిగ్ బాస్లో లాగా, సినిమాలో కూడా...
కొత్త క్రష్ మలయాళ బ్యూటీ రియా శిబు
