Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Mumbai andheri police Arrested to actor kamal rashid khan1
కాల్పుల ఘటనలో సినీ నటుడు అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు కమల్‌ రషీద్ ఖాన్ అరెస్ట్‌ అయ్యారు.. కొద్దిరోజుల క్రితం ముంబైలో ఓ నివాసంలో కాల్పులు జరిగిన కేసులో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఈ కాల్పులకు పాల్పడింది కమల్‌ రషీద్‌ అని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం రాత్రి కమల్‌ను అంధేరీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Music Director Santhosh Narayanan Comments On Kalki 22
'ప్రభాస్‌' సీక్వెల్‌ అదిరిపోతుంది.. సంగీత దర్శకుడు కామెంట్‌

ప్రభాస్‌ అభిమానులను ‘ది రాజాసాబ్‌’ కాస్త నిరాశపరిచింది. అయినప్పటికీ డార్లింగ్‌ ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మూవీ తర్వాత ఆయన నుంచి ఫౌజీ, స్పిరిట్‌, సినిమాలు తెరపైకి రానున్నాయి. ఈ రెండూ ఇప్పుడు షూటింగ్‌ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతి త్వరలోనే ‘కల్కి 2’ కూడా మొదలు కానుంది. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ తెలిపారు. ‘కల్కి 2898ఏడీ’కి కొనసాగింపుగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించనున్నారు.కల్కి2 గురించి సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ ఇలా అన్నారు. 'కల్కి -2 నా కెరీర్‌లోనే టాప్‌ సినిమాగా ఉండబోతుంది. ఈ మూవీ కోసం నేను అందించబోయే సంగీతం చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసం మా టీమ్‌ చాలా కష్టపడుతుంది. కల్కి 2898AD మా అందరికీ ఒక మెగా లెర్నింగ్. మేము ఇప్పటికే కల్కి పార్ట్-2 కోసం పని చేయడం ప్రారంభించాము. ఈ మూవీలో పాల్గొనే నటీనటుల తేదీలు సర్దుబాటు అయిన తర్వాత, షూటింగ్ ప్రారంభమవుతుంది.' అని ఆయన అన్నారు. సంతోష్ నారాయణన్ చేసిన తాజా ప్రకటనతో అంచనాలను గణనీయంగా పెంచారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే ఉంది.భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ తదితరులు కీలక పాత్రలలలో పోషిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, ప్రభాస్‌ మార్చి తర్వాత కల్కి-2 సెట్‌లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ ఇందులో భైరవగా, కర్ణగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. "I hope #Kalki2 is going to be my best work🔥. We are putting a lot of effort. #Kalki2898AD was a mega learning for all of us🎶. We have already started work for Kalki Part-2. All are mega stars, once date align, shooting will begin✅"- #SanthoshNarayananpic.twitter.com/AEGd0TP7qM— AmuthaBharathi (@CinemaWithAB) January 23, 2026

Sushmita Konidela As Film Producer New Journey Begins3
కొత్త ఛాప్టర్‌ ప్రారంభం.. 'సుష్మిత' మరో ముందడుగు

చిత్ర పరిశ్రమలో హీరో కొడుకు హీరో అవడం అనేది పెద్ద విషయం కాదు.. దర్శకుడి కుమారుడు మెగాఫోన్‌ పట్టుకునే ఛాన్స్‌ ఉంది. అదే ఒక స్టార్‌ హీరో కూతురు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటితే ఎవరైనా సరే శభాష్‌ అనాల్సిందే. చిరంజీవి తనయ సుష్మిత కొణిదెల నిర్మాతగా కోట్ల రూపాయల వ్యవహారాల్నీ చాకచక్యంగా పూర్తి చేయగలనని 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో విజయం సాధించారు. చిరు జోక్యం లేకుండానే ఈ మూవీ డిస్ట్రీబ్యూషన్‌ నుంచి అన్ని వ్యవహారాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు.సుస్మిత తన చదువు పూర్తయ్యాక 'నిఫ్ట్‌'లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. అనంతరం సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చారు. రంగస్థలం, ఖైదీ నెంబర్‌ 150, సైరా, ఆచార్, వాల్తేరు వీరయ్య సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశారు. తర్వాత 'గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' (Gold Box Entertainment) పతాకంపై ‘శ్రీదేవి శోభన్‌బాబు’ పేరుతో నిర్మాతగా కొత్త జర్నీ ప్రారంభించారు. ఆ తర్వాత తన తండ్రితో మన శంకర వరప్రసాద్ గారు మూవీ తెరకెక్కించి భారీ హిట్‌ అందుకున్నారు.ఇదే స్పీడ్‌తో ఆమె మరో కొత్త ఛాప్టర్‌ను ప్రారంభించారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ హిట్‌ తర్వాత 'గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' సంస్థ కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు చిన్న గదికి పరిమితమైన ఆ సంస్థ ఇప్పుడు మరో ముందు అడుగు వేసింది. తమ బ్యానర్‌ నుంచి భారీ బడ్జెట్‌తో పాటు పెద్ద సినిమాలు వస్తాయని సుస్మిత అన్నారు. ఈ క్రమంలోనే తన టీమ్‌తో కేక్‌ కట్‌ చేసి ఒక వీడియోను షేర్‌ చేశారు. View this post on Instagram A post shared by Gold Box Entertainments (@goldboxent)

Actress Malavika Mohanan comments on Nayanthara4
నయనతారపై 'రాజా సాబ్‌' బ్యూటీ వైరల్‌ కామెంట్స్‌!

బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న మలయాళ భామ మాళవిక మోహన్‌. మాతృభాషతో పాటు, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తున్న ఈమె తమిళంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత విజయ్‌ సరసన మాస్టర్‌ చిత్రంలో నటించి గర్తుంపు పొందారు. తర్వాత విక్రమ్‌ హీరోగా నటించిన తంగలాన్‌ మూవీలో ప్రతినాయకిగా విలక్షణ నటనను ప్రదర్శించారు.ఇకపోతే తెలుగులో ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన రాజాసాబ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. మలయాళంలో మోహన్‌లాల్‌ సరసన నటించిన హృదయపూర్వం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తమిళంలో కార్తీకి జంటగా సర్ధార్‌–2లో నటిస్తున్నారు. ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే మాళవికమోహన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు భాష విషయంలో ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొందరు ఎమోషనల్‌ సన్నివేశాల్లో కేవలం ముఖభావాలనే చూపించి ఎలాంటి సంభాషణలు చెప్పకుండా ఒన్, టూ, త్రీ అని చెబుతారని విమర్శించారు. అదే.. కోపంగా ఉన్న డైలాగులు చెప్పమంటే.. ఏ,బీ, సీ, డీ అంటారని పేర్కొంది. అలా చెప్పిన వాటిని డబ్బింగ్‌లో అనువాద కళాకారులు సరి చేస్తున్నారని చెప్పారు. కొందరు నటీమణులైతే కెరీర్‌ మొత్తం ఇదే పని చేస్తున్నారని విమర్శించారు. ఇలా ఈమె ఏ నటిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. మరి కొందరు అయితే నయనతార గురించే ఆమె అలా విమర్శిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కారణం ఇంతకుముందు కూడా ఈమె నయనతారపై విమర్శలు చేశారన్నది గమనార్హం. ఈ విషయంలో ఏ నటి ఎలా స్పందిస్తారో చూడాలి . ఈ సంక్రాంతి రేసులో రాజా సాబ్‌తో మాళవిక మోహన్‌.. మన శంకరవరప్రసాద్‌ గారు మూవీతో నయనతార తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

bigg boss Amardeep Chowdary comments about His life style5
'లగ్జరీ కారు వదిలేశా.. ఆ లైఫ్ స్టైల్‌ నుంచి పూర్తిగా బయటికొచ్చా'

బిగ్‌బాస్ రియాలిటీ షో మరింత ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్‌ అమర్‌దీప్‌ చౌదరి. తన అగ్రెసివ్‌ మాటలతో హౌస్‌లో తన ఆటతో మెప్పించాడు. బుల్లితెరపై అలరించిన అమర్‌దీప్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా చేస్తోన్న చిత్రం సుమతి శతకం. ఈ సినిమాతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో సైలీ చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమర్‌ దీప్‌ చౌదరి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. టీవీ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చి సినిమాలు చేద్దామని ఎప్పటి నుంచో ఉందని అన్నారు. తన లైఫ్‌ స్టైల్‌ను మార్చుకుని బతకాల్సి వచ్చిందని తెలిపారు. అన్ని లగ్జరీ వసతులు ఉన్న కారును వదిలిపెట్టి.. నార్మల్ కారు వాడుతున్నానని అమర్ దీప్‌ వెల్లడించారు. కానీ ఏదో ఒక రోజు మళ్లీ ఆ రోజు వస్తుందని అన్నారు.తనకు హీరో రవితేజ అంటే చాలా ఇష్టమని అమర్‌దీప్ అన్నారు. ఆయనకు తాను అభిమానినని.. ఇండస్ట్రీలో తనకు ఆదర్శమని తెలిపారు. ఆయనే నాకు గురువు.. రవితేజను చూసే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని వెల్లడించారు. సింధూరం సినిమాలో రవి తేజలో కనిపించిన ఆ స్పార్క్‌ను నేను పట్టుకుని.. అదే స్పార్క్‌ను ఈ సినిమాలో చూపించానని అమర్ దీప్‌ తెలిపారు. లగ్జరీ కార్‌ నుంచి నార్మల్ కార్‌కు మారినా నేను సంతోషంగానే ఉన్నాను. మెయింటెనెన్స్ భారం లేకపోవడమే కారణం. ఏదో ఒక రోజు ఈ రెండింటికీ మించి ఇంకొక్కటి తీసుకోగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను.- Amardeep Chowdary #SumathiSathakamFull interview youtube link :… https://t.co/mxoFvqHGz2 pic.twitter.com/9Ti5Wmopbq— idlebrain.com (@idlebraindotcom) January 23, 2026

Akkineni Akhil Hello Movie Child artist latest look Goes Viral6
అక్కినేని అఖిల్ హలో.. జున్ను ఇంతలా మారిపోయిందేంటి?

అక్కినేని అఖిల్‌ హీరోగా వచ్చిన రెండో చిత్రం హలో. 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఆడియన్స్‌ మనసులను గెలుచుకుంది. ఈ చిత్రానికి విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అఖిల్‌ సరసన కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటించింది. ‌అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన పాప ముద్దుముద్దు మాటలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో జున్ను పాత్రలో అలరించింది. ఈ మూవీ రిలీజై దాదాపు తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ జున్నుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అప్పుడు క్యూట్‌ క్యూట్‌గా ఈ చిన్నారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో హలో చిన్నారి ఇంతలా మారిపోయిందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ హలో సినిమాలో జున్ను ఎలా మారిపోయిందో చూడండి..#Hellomovie #AkhilAkkineni pic.twitter.com/s86NsIfAt8— 𝐊𝐢𝐧𝐠𝐕𝐞𝐧𝐤𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐥𝐨𝐫𝐞 (@KingVenkyBAF) January 23, 2026 #Hello Movie ni Endhuku ra Hit Chailedhu 😈💔#HelloMovie 😻🗿 pic.twitter.com/CuA4LcgZSJ— sId 𝕏 (@IntrovertSidX) October 27, 2024

Tollywood Producer SKN Lodged complaint at Cyber Crime Police station7
పోలీసులకు నిర్మాత ఎస్‌కేఎన్ ఫిర్యాదు.. ది రాజాసాబ్ వల్లేనా?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకుని అవమానపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి దురుద్దేశపూరిత చర్యలు గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతికూలత వ్యాప్తి చేసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటివి వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా.. ఇటీవల ది రాజాసాబ్ మూవీ రిలీజ్ తర్వాత ఎస్‌కేఎన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఎస్‌కేఎన్‌ ఆ తర్వాత కనిపించలేదని విమర్శలు చేశారు. కొందరు సోషల్ మీడియాలో ఎస్‌కేఎన్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. దీనిపైనే తనపై తప్పుడు ప్రచారం సోషల్ మీడియా హ్యాండిళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వచ్చిన ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Producer @SKNonline has lodged a formal complaint at the Cyber Crime Police Station against certain social media handles that were impersonating him and posting derogatory and misleading remarks targeting the film and its actors. Such malicious acts are intended to create… pic.twitter.com/4pjlxhh9Ek— Telugu Film Producers Council (@tfpcin) January 23, 2026

Actress Anupama Parameswaran Lock Down release date announced8
అనుపమ సస్పెన్స్ థ్రిల్లర్‌.. ఎట్టకేలకు రిలీజ్ డేట్‌

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ లాక్ డౌన్. ఈ చిత్రానికి ఏఆర్ జీవా దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుందని లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి కష్టాలు పడిన ఓ యువతి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ కనిపించనుంది. ఈ చిత్రంలో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎన్‌ఆర్‌ రఘునందన్, సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం అందించారు. Every pause had a purpose. 🎬 #Lockdown in cinemas Jan 30. 🗓️#LockdownInCinemasJan30@anupamahere #ARJeeva @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #PriyaaaVenkat @shakthi_dop @NRRaghunanthan @sidvipin @EditorSabu @sherif_choreo #SriGirish #OmSivaprakash… pic.twitter.com/hqNtUX8qxl— Lyca Productions (@LycaProductions) January 23, 2026

Tollywood Movie Baa Baa Black Sheep Official TEASER Out now9
'బాక్స్ కోసం వేట'.. ఫుల్ కామెడీగా బాబా బ్లాక్‌షీప్ టీజర్

టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ బాబా బ్లాక్ షీప్.. ఈ సినిమాకు గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్‌పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో శర్వానంద్ చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అంతా ఓ బాక్స్‌ చుట్టే తిరుగుతున్నట్లు టీజర్‌లో అర్థమవుతోంది. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో ఉపేంద్ర కామెడీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, కార్తికేయ దేవ్, సమ్రీధీ ఆర్యల్, మాల్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు.

Sara Arjun And Mrunal Thakur Latest News10
జిమ్‌లో అనసూయ.. మాయ చేసేస్తున్న మృణాల్

జిమ్‌లో కష్టపడిపోతున్న యాంకర్ అనసూయసిల్క్ చీరలో అందంగా 'ధురంధర్' సారా అర్జున్సింపుల్ బట్ బ్యూటీపుల్‌గా కాయదు లోహర్సన్నని నడుముతో మాయ చేస్తున్న దిశా పటానీరోజురోజుకీ మెరుపుతీగలా మారిపోతున్న త్రిషనవ్వుతూ కితకితలు పెట్టేస్తున్న మృణాల్ ఠాకుర్ View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)

Advertisement
Advertisement