ప్రధాన వార్తలు
హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ
సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇందులో నిలదొక్కుకునేందుకు తారలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. అదృష్టం తోడైనవారే తమ కలలను సాకారం చేసుకుంటారు. భాషాభేదం లేకుండా తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందుకు తగిన గుర్తింపు వస్తే ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్స్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక టెక్నాలజీ.ఏఐ దుర్వినియోగంసాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఓపక్క ప్రయోజనాలు చేకూరుతుంటే మరికొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలను ఇష్టారీతిన ఎడిట్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇలా తప్పుగా చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తమన్నా ఫోటోలను ఏఐ టెక్నాలజీతో బికినీ దుస్తుల్లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే హీరోయిన్లకు తలనొప్పి తప్పేలా లేదు!
ఫారెస్ట్పోదాం... షూటింగ్ చేద్దాం... చలో చలో
అడవి నేపథ్యంలో సినిమాలు తీయాలంటే ఆషామాషీ కాదు. ఎన్నో సాహసాలు చేయాలి. ఎన్నో సవాళ్ళను స్వీకరించాలి. అయినా సరే... తగ్గేదేలే అంటూ ఫారెస్ట్ నేపథ్యంలో సినిమాలు చేసేస్తున్నారు మన తెలుగు హీరోలు. ‘ఫారెస్ట్పోదాం... షూటింగ్ చేద్దాం... చలో చలో...’ అంటూ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సినిమాలు చేస్తున్నారు. ఈ ఫారెస్ట్ సినిమాల వివరాలు, విశేషాలపై ఓ లుక్ వేయండి.ఫారెస్ట్లో అడ్వెంచర్ కెన్యా అడవుల్లోకి వెళ్లొచ్చారు మహేశ్బాబు. ఒడిశా అడవుల్లోనూ సంచారం చేశారు. మహేశ్బాబు ఇలా అడవుల్లో తిరుగుతున్నది ‘వారణాసి’ సినిమా కోసమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రుద్రగా మహేశ్బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆల్రెడీ వీరిపాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్పోస్టర్స్ విడుదల అయ్యాయి. అయితే ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంలోనే సాగుతున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవల ‘వారణాసి’ సినిమా గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేయగా, ఈ గ్లింప్స్లోనూ ఫారెస్ట్ విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. ఇక తొలుత ఒడిశా ఫారెస్ట్ లొకేషన్స్, ఆ తర్వాత కెన్యా ఫారెస్ట్ లొకేషన్స్లో మహేశ్బాబు అండ్ రాజమౌళి టీమ్ కొంత చిత్రీకరణ జరిపిన సంగతి తెలిసిందే. సినిమాలోని మరికొన్ని కీలక సన్నివేశాల కోసం ‘వారణాసి’ చిత్ర యూనిట్ వచ్చే ఏడాదిప్రారంభంలో మరోసారి కెన్యా ఫారెస్ట్ లొకేషన్స్కు వెళ్లనుందని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో మహేశ్బాబు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారని సమాచారం.ఆల్రెడీ రుద్రగా మహేశ్బాబు ఫస్ట్ లుక్పోస్టర్ విడుదలైంది. రాముడిపాత్రలో మహేశ్బాబు కనిపిస్తారని స్వయంగా రాజమౌళియే కన్ఫార్మ్ చేశారు. మరో మూడు గెటప్స్లో కూడా మహేశ్బాబు కనిపిస్తారని, మొత్తంగా ‘వారణాసి’ సినిమాలో ఆయన ఐదు గెటప్స్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా ఈ సినిమాలో విభిన్న యుగాల మధ్య టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందని భోగట్టా. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ ‘వారణాసి’ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.ఫారెస్ట్లో డ్రాగన్ ఫారెస్ట్లో అదిరిపోయే చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ చేశారట ఎన్టీఆర్. ఈ చేజ్ని ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో చూడొచ్చు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కీలకపాత్రల్లో నటించనున్నారంటూ హీరోయిన్ రష్మికా మందన్నా, బాలీవుడ్ నటి కాజోల్, మలయాళ యువ నటుడు టోవినో థామస్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండనున్నట్లుగా తెలిసింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని కొన్ని లొకేషన్స్లో ‘ఎన్టీఆర్నీల్’ సినిమా చిత్రీకరణ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ షూటింగ్ షెడ్యూల్లోనే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ చేజింగ్ సీన్ను చిత్రీకరించారట ప్రశాంత్ నీల్. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే ఓ హైలైట్గా ఉంటుందట. అంతేకాదు... విదేశీ ఫారెస్ట్ లొకేషన్స్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనున్నట్లుగా తెలిసింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నారు. తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ సన్నబడిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మళ్లీప్రారంభం కానుంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.గుహలో ఫైట్ ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న అడ్వెంచరస్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘వృషకర్మ’. ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా కనిపిస్తారు. బాలీవుడ్ నటుడు స్పర్‡్ష శ్రీవాస్తవ ఈ చిత్రంలోని విలన్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ మిథికల్ థ్రిల్లర్ సినిమాలో కొన్ని మేజర్ సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటాయని తెలిసింది.కొన్ని సన్నివేశాలను రియల్ లొకేషన్స్లో, మరికొన్ని సన్నివేశాలను అడవిని తలపించేలా వేసిన సెట్స్లో చిత్రీకరిస్తున్నారట. ఆల్రెడీ ఓ పెద్ద గుహ సెట్ వేసి, అక్కడ కొన్ని సీన్స్ను చిత్రీకరించారు. ఈ గుహ నేపథ్యంలో సాగే సీన్స్ ఈ సినిమాలో మేజర్ హైలైట్గా ఉంటాయట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోందని తెలిసింది. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని తెలిసింది.భోగి ఈ ఏడాది వేసవిలో ఉత్తర తెలంగాణలో ‘భోగి’ సినిమాను ఆరంభించారు శర్వానంద్. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1960 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీ ప్రధానంగా ఉత్తర తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ కోసం మేకర్స్ ఇరవై ఎకరాల్లో ఓ భారీ సెట్ను కూడా క్రియేట్ చేశారు. అయితే కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అడివి నేపథ్యంలో సాగుతాయని తెలిసింది.అడివి నేపథ్యంలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉంటాయట. ప్రస్తుతం ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా చిత్రీకరణతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే శర్వానంద్ హీరోగా నటించి, షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బైకర్’ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ‘భోగి’ సినిమా కూడా వచ్చే ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఇదే నిజమైతే శర్వానంద్ వచ్చే ఏడాది మూడుసార్లు థియేటర్స్లో సందడి చేస్తారు.కామ్రేడ్ కళ్యాణ్ శ్రీవిష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. టైటిల్ని బట్టి ఈ సినిమాకు నక్సలిజమ్ బ్యాక్డ్రాప్ ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమా ప్రధానంగా ఫారెస్ట్ నేపథ్యంలోనే సాగుతుందని, ఇటీవల విడుదలైన ‘కామ్రేడ్ కల్యాణ్’ ఫస్ట్ లుక్పోస్టర్, గ్లింప్స్ స్పష్టం చేస్తున్నాయి. 1992లో ఆంధ్ర – ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథాంశం ఉంటుందని తెలిసింది.అలాగే ఈ సినిమాలో శ్రీవిష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓపాత్రలో నక్సలైట్ లీడర్ కామ్రేడ్ కల్యాణ్గా శ్రీ విష్ణు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తయింది. మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.పురాతన ఆలయం దట్టమైన అడవిలో ఉన్న ఓ పవిత్రమైన పురాతన దశావతార ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు కొంతమంది దుండగులు సాహసించారు. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు హీరో బరిలోకి దిగాడు. మరి... ఇందులో ఈ హీరో సక్సెస్ అయ్యాడా? ఈ హీరోకు దైవం నుంచి ఎలాంటి సహాయం లభించింది? అనే విషయాలను వెండితెరపై చూడాలంటే ‘హైందవ’ సినిమా చూడాల్సిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా, సంయుక్త హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్లో రిలీజ్ కానుంది.ఫారెస్ట్లో ప్రేమ తన ప్రేమ కోసం 30 మందిని అడవిలో పరిగెత్తించాడు ఓ కుర్రాడు. ప్రేమ కోసం ఎంతటికైనా తెగించే అతని సాహసాలను ‘మోగ్లీ 2025’ సినిమాలో వెండితెరపై చూడొచ్చు. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మోగ్లీ 2025’. ఈ చిత్రంలో బండి సరోజ్కుమార్ విలన్గా నటించగా, ‘వైవా’ హర్ష మరో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా అంతా ఫారెస్ట్ నేపథ్యంలోనే సాగుతుందని ఇటీవల విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది.అంతేకాదు... ఈ సినిమాలో బదిర యువతిపాత్రలో సాక్షి మడోల్కర్ ఓ చాలెంజింగ్ రోల్ చేశారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. కానీ బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రం ఈ తేదీకి థియేటర్స్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ‘మోగ్లీ– 2025’ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అడవిలో డిష్యుం... డిష్యుం... ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో వీక్షకులను అలరించారు దర్శకుడు తేజ కాకమాను. ఇప్పుడు ఫారెస్ట్ నేపథ్యంలో ఓ సినిమా తీసేందుకు తేజ కాకమాను ఓ కథను రెడీ చేశారని తెలిసింది. ఈ సినిమా కథను సాయిధరమ్ తేజ్కు వినిపించగా ఈ హీరో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్లు అడవి నేపథ్యంలోనే ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా పూర్తయిన తర్వాత తేజ కాకుమాను దర్శకత్వంలోని చిత్రాన్ని సాయిధరమ్ తేజ్ స్టార్ట్ చేస్తారని ఊహించవచ్చు.నాగబంధంభారతదేశంలోనిప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యం, శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న ‘నాగబంధం’ అనే ఆధ్యాత్మిక సంప్రదాయం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం – పూరి జగన్నాథ్ దేవాలయాల్లోని మిస్టరీల స్ఫూర్తి... ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న సినిమా ‘నాగబంధం’. ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫారెస్ట్ నేపథ్యంలో కూడిన సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్స్ను వేశారట మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం కోసమే మేకర్స్ రూ. 20 కోట్ల భారీ బడ్జెట్తో సెట్ను వేశారు. ఈ సెట్లోనే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అభిషేక్ నామా దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది.పొలిమేర 3 అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘పొలిమేర’ హారర్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే వచ్చిన తొలి భాగం ‘మా ఊరి పొలిమేర, పొలిమేర 2’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో ‘పొలిమేర 3’ సినిమాకు శ్రీకారం చూట్టారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘పొలిమేర 2’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంటాయని తెలిసిందే. ‘పొలిమేర 3’లో అంతకు మించి ఫారెస్ట్ సీన్స్ ఉంటాయని తెలిసింది. పైగా ఈ సినిమాకు పదో శతాబ్దం నేపథ్యం కూడా ఉంటుందని, ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్లతోపాటు మరో హీరో కూడా ఓ కీ రోల్ చేయనున్నారని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ సినిమాలే కాదు... ఫారెస్ట్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు
కొత్త డేట్ ఫిక్స్
త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ఇది. వంశీ నందిపాటి, ‘బన్నీ’ వాసు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 12న రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారు. కానీ, వాయిదా వేశారు. ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లుగా మంగళవారం తెలిపారు.
నా కెరీర్లో స్పెషల్ ప్రాజెక్ట్ ఇది: ఈషా రెబ్బా
ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్ 2’. దర్శకుడు మారుతి షో రన్నర్గా ఎస్కేఎన్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘అమ్మాయిలంతా ఒకే దగ్గర రెంట్కు ఉండటం, వాళ్లు కలిసి సరదాగా చేసే కుకింగ్, గాసిప్స్ చెప్పుకోవడం, లైఫ్ లీడ్ చేయడం వంటి అంశాలు సీజన్ 2లో కనిపిస్తాయి. ఇది నా కెరీర్లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్.ఇక నా తర్వాతి చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు చేశాను. అలాగే విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. హర్ష మాట్లాడుతూ– ‘‘సీజన్ 1లోని పగను సీజన్ 2లో తీర్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ప్రభాస్గారి ‘ది రాజా సాబ్’లో చిన్న రోల్ చేశాను. అలాగే ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న అన్ని సినిమాల్లోనూ, ‘మోగ్లీ 2025’లోనూ మంచి రోల్స్ చేశాను. నేను లీడ్ రోల్లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి’’ అని చెప్పారు.
బిగ్బాస్
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి
బిగ్బాస్ హౌస్లో ఆడియన్స్.. టాప్ 5కి చేర్చండి అన్న ఇమ్మూ
పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా..
తల్లయిన బిగ్బాస్ సోనియా.. పోస్ట్ వైరల్
కొత్త కెప్టెన్గా భరణి.. ఆమె జైలుకు!
రీతూ ఎలిమినేషన్కు కారణాలివే! అదే ప్లస్సు, మైనస్!
ఓడిపోయానంటూ ఏడ్చిన రీతూ.. టాప్ 5 వీళ్లేనంటూ..
బిగ్బాస్ నుంచి 'రీతూ' ఎలిమినేట్.. విన్నర్ రేంజ్లో రెమ్యునరేషన్
టార్గెట్ 'తనూజ'.. బిగ్బాస్ ఇదేం 'ట్రై యాంగిల్'
A to Z
ఓటీటీలో 'కాంత'.. ప్రకటన వచ్చేసింది
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగ...
మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వైద్య రంగంలో చాలా అవకతవకలు జరుగుతుంటాయి. వాటిపై ఇప...
నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అంతం...
'బెడ్రూమ్ వీడియో ల్యాప్టాప్లో బంధిస్తే'.. నునాకుజి మూవీ చూడాల్సిందే!
ఓటీటీలు వచ్చాక సినిమాల పరంగా కంటెంట్కు కొదువే లేద...
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తి...
రాత్రిపూట మనోజ్ ఫోన్ కాల్.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్ నటుడు
సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్గా చూస...
బాక్సాఫీస్ వద్ద దురంధర్ దూకుడు.. మూడు రోజుల్లోనే సెంచరీ!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్...
హిందీ ‘బిగ్బాస్ 19’ విజేత గౌరవ్.. ప్రైజ్ మనీ ఎంతంటే..
హిందీ ‘బిగ్బాస్ 19’ ముగిసింది. ఈ సీజన్లో గౌరవ్...
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్.. వేదికలు ఇవే..!
హైదరాబాద్ గ్రాండ్ ఈవెంట్కు వేదికగా నిలవనుంది. ప్...
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ...
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంక...
ప్రియాంక పీఆర్ స్టంట్? వాళ్లు నిజమైన ఫ్యాన్స్ కాదా?
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ ప్లీజ్ అని జనాల...
వరుణ్ సందేశ్- ప్రియాంక జైన్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున...
సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి.. ఇలా కూడా రిలీజ్ చేస్తారా?
సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల...
'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!
కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్ మూవీ...
భారీ ధరకు ది రాజాసాబ్ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న హారర్ రొమాంటిక్ ...
ఫొటోలు
ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)
‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘నయనం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్ బ్యూటీ లుక్ (ఫొటోలు)
ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)
Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)
యూత్ను గ్లామర్తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)
తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ 'ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
ముంబైలో లైఫ్ స్టైల్ ఆసియా అవార్డ్స్ 2025.. సందడిగా సినీ తారలు (ఫోటోలు)
‘గుర్రం పాపిరెడ్డి’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
గాసిప్స్
View all
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు.. ‘స్పిరిట్’ కోసం అన్ని కోట్లా?
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి
నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్కు ముందే సంచలనం!
రివ్యూలు
View all
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
2
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
3
‘కాంత’ మూవీ రివ్యూ
సినీ ప్రపంచం
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఈ వారం పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీతో పాటు 'త్రీ రోజెస్' అనే తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 2 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.. తమిళంలో హీరోయిన్గా చేసిన లేటెస్ట్ మూవీ 'ఆరోమలే'. కిషన్ హీరోగా నటించాడు. నవంబరు 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. హౌస్ఫుల్స్ కూడా బాగానే అయ్యాయి. నెల పూర్తయిందో లేదో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (డిసెంబరు 12) నుంచి హాట్స్టార్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. బయట దేశాల్లో సింప్లీ సౌత్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.'ఆరోమలే' విషయానికొస్తే.. ప్రేమ అనేది సినిమాల్లో చూపించినట్లు ఉంటుందని నమ్మే కుర్రాడు అజిత్ (కిషన్). స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమిస్తాడు కానీ అపర్థాల వల్ల బ్రేకప్ అవుతుంది. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఓ మ్యాట్రిమోనీ ఏజెన్సీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ ఇతడి బాస్ అంజలి (శివాత్మిక)తో సమస్యలొస్తాయి. ఈమె.. ప్రేమ అనేది లాజిక్ అని నమ్మే టైపు. అలా ప్రేమ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్న వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా? అజిత్కి మూవీ టైపు ప్రేమ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ. ప్రేమ అనే ఎమోషన్స్ని చూపిస్తూనే కామెడీ కూడా బాగుందనే టాక్ అయితే వచ్చింది. ఓటీటీలోకి వచ్చాక తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?Fall in love. Laugh out Loud..❤️😂 #Aaromaley from Nov 12#Aaromaley streaming from Dec 12 only on #JioHotstar#AaromaleyOnJioHotstar #AaromaleyStreamingFromDec12 #JioHotstarTamil @kishendas @ShivathmikaR @SarangThiagu #HarshathKhan pic.twitter.com/Phe82tuBti— JioHotstar Tamil (@JioHotstartam) December 10, 2025
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి
ఇమ్యూనిటీ + ఓట్ అప్పీల్ కోసం బిగ్బాస్ హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి. లీడర్ బోర్డులో మొదటి స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టించిన ఇమ్మాన్యుయేల్ అందరికంటే మొదటగా ఓట్ అప్పీల్ గెలిచాడు. ఇప్పుడు మరో ఓట్ అప్పీల్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.బాల్ గేమ్అందులో సంజనా, కల్యాణ్ సంచాలకులుగా ఉండగా మిగతావారు గేమ్స్ ఆడారు. సంచాలకులు విసిరే బాల్స్ను తమ జంబో బ్యాగుల్లో పడేలా చూసుకోవాలి. ఈ గేమ్లో తనూజ గెలిచినట్లు సమాచారం. ఈ గేమ్ అయిపోయాక భరణి.. సుమన్తో మాట్లాడుతూ.. ఎంత దారుణం.. తనూజ కూర్చో అంటే (కల్యాణ్) కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు. భరణిపై సెటైర్స్తనూజ ఎక్కువ కమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అని ఫీలయ్యాడు. ఈ ప్రోమో కింద కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. దివ్య మిమ్మల్ని కమాండ్ చేసినప్పుడు ఏమైపోయారు? అని భరణిపై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో తనూజ ఓట్ అప్పీల్ గెలిచినట్లు భోగట్టా! చదవండి: ఇమ్మాన్యుయేల్ ప్రభంజనం.. టాప్5లో ఉంచమని రిక్వెస్ట్
ఏఎన్నార్ టైటిల్తో త్రివిక్రమ్-వెంకీ కొత్త సినిమా
వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోకి టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. అలా అని వీళ్లు దర్శకుడు-హీరోగా కలిసి పనిచేయలేదు. త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకీ హీరోగా చేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' మూవీస్కి పనిచేశారు. వాటిల్లో కామెడీ గానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ గానీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి పనిచేయాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకున్నారు. అది కొన్నాళ్ల ముందు నెరవేరింది.ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్లు అప్డేట్ ఇచ్చారు. 'ఆదర్శ కుటుంబం హౌస్ నం.47' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు వచ్చే ఏడాది వేసవిలో మూవీ రిలీజ్ అవుతుందని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇదే టైటిల్తో 1969లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే పేరుని టైటిల్గా ఉపయోగిస్తున్నారు. పేరు, పోస్టర్ చూస్తుంటేనే మంచి హోమ్లీ ఫీల్ అనిపిస్తుంది.ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సంగీత దర్శకుడిగా 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు వినిపిస్తుండగా.. హీరోయిన్గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతేడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమా రిలీజైన తర్వాత నుంచి త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ చేయలేదు. మధ్యలో అల్లు అర్జున్తో ఓ సినిమా అనుకున్నారు కానీ తర్వాత ఎన్టీఆర్తో ఫిక్స్ అయ్యారు. కుమారస్వామి దేవుడు బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఇది తీయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ తీయడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశముండటంతో ఇంతలో వెంకీతో ఈ సినిమాని త్రివిక్రమ్ తీస్తున్నారు.ఇకపోతే త్రివిక్రమ్.. ఈ సినిమాతో మరోసారి 'ఆ' సెంటిమెంట్ రిపీట్ చేశారని చెప్పొచ్చు. గతంలో అతడు, అత్తారింటికి దారేది, అఆ, అల వైకుంఠపురములో, అరవింద సమేత.. ఇలా అ లేదా ఆ అక్షరంతో ఎక్కువగా టైటిల్స్ పెట్టారు. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. ఇప్పుడు తన సెంటిమెంట్ని కొనసాగిస్తూ వెంకీతో తీస్తున్న చిత్రానికి 'ఆదర్శ కుటుంబం' అని పేరు పెట్టారా అనిపిస్తుంది.
నా భర్తే నా సర్వస్వం.. ఎందుకో తెలుసా?: యష్ భార్య
కన్నడ స్టార్ హీరో యష్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లవుతోంది. 2016లో నటి రాధికా పండిత్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు ఐరా, కుమారుడు యాత్రవ్ సంతానం. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా రాధిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ అద్భుతమైన వీడియో షేర్ చేసింది. నా సర్వస్వం నా భర్తే అని ఎందుకంటానో తెలుసా? అంటూ మొదట్లో ఓ క్యాప్షన్ వచ్చింది. అతడే నా సర్వస్వంఆ వెంటనే దానికి సమాధానంగా.. నా భర్త నా పర్సనల్ బాడీగార్డ్, నా చాట్జీపీటీ, నా చెఫ్, నా పర్సనల్ ఫోటోగ్రాఫర్, నా మెంటార్, నా డీజే, నా డాక్టర్, నా కాలిక్యులేటర్, నా స్ట్రెస్ బస్టర్ అంటూ యష్ ఏఐ ఫోటోల్ని జత చేసింది. చివర్లో మాత్రం నా ప్రశాంతతకు కారకుడు అంటూ భర్తపై వాలిపోయి ఉన్న ఒరిజినల్ ఫోటోను యాడ్ చేసింది. ఇది చూసిన అభిమానులు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని యష్ను కొనియాడుతున్నారు.సినిమాకేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్ ప్రస్తుతం రామాయణ మూవీలో రావణుడిగా నటిస్తున్నాడు. అలాగే టాక్సిక్ సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit)
అజిత్ ఆశీర్వాదం తీసుకున్న హీరో శింబు
సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఒక నటుడికి మరో నటుడు అభిమానం కావడం కాస్త అరుదు. అలా సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు గాంచిన స్టార్ హీరో అజిత్కు శింబు వీరాభిమాని కావడం విశేషం. ఈ విషయాన్ని శింబు బహిరంగంగానే పలు వేదికలపై చెప్పారు. ఒక నటుడిగా తనకు అజిత్ మార్గదర్శి అని చెప్తూ ఉంటారు. తాజాగా శింబు.. అజిత్పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఫేవరెట్ హీరోను కలిసిన శింబుఅజిత్ సినిమాలతోపాటు కార్ రేస్లపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేసుల్లో పోటీ చేసి పథకాలను పొందారు. తాజాగా మలేషియాలో జరుగుతుననన్న కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్ కోసం మలేషియా వెళ్లిన శింబు ప్రత్యేకంగా అజిత్ను కలిసి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అజిత్ జట్టు కోసం చేసిన జెర్సీ ధరించడం విశేషం.ఆశీర్వాదంశింబు తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అజిత్కు తెలిపి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇలా అజిత్, శింబు కలుసుకోవడం మరో విశేషం. అజిత్తో కలిసి శింబు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్తో వన్స్ మోర్అజిత్ మలేషియాలో జరుగుతున్న కార్ రేస్ ముగిసిన తరువాత తన తర్వాతి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతారని తెలిసింది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబోలో ఇంతకుముందు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం వచ్చిందన్న విషయం తెలిసిందే! #SilambarasanTRமலேசியா Racing Circuitல் அஜித் குமாரை சந்தித்த சிம்பு#Simbu #Silambarasan #AK #Ajithkumar #AjithKumarRacing #Ajith #Malaysia #STR #Atman pic.twitter.com/OqE9vo7ptB— Actor Kayal Devaraj (@kayaldevaraj) December 6, 2025
బిగ్బాస్ హౌస్లో ఆడియన్స్.. టాప్ 5కి చేర్చండి అన్న ఇమ్మూ
ఇది ఫెయిర్ కాదు బిగ్బాస్ పేరిట హౌస్లో ఇమ్యూనిటీ చాలెంజ్ నడుస్తోంది. ఇప్పటికే ఓ గేమ్ పూర్తవగా లేటెస్ట్ ఎపిసోడ్లో మరో రెండు గేమ్స్ పెట్టారు. అలాగే బిగ్బాస్ ప్రియులు హౌస్లోకి వెళ్లి మాట్లాడారు. ఆ విశేషాలేంటో మంగళవారం (డిసెంబర్ 9వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..సంజనాకు సీక్రెట్ టాస్క్మూడుసార్లు జైలు నుంచి బయటకు రావాలని సంజనాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో ఆమె తెలివిగా ఆరోగ్యం బాలేదంటూ మూడుసార్లు జైలు ఓపెన్ చేయించింది. అలా ఆమె జైలు జీవితం రద్దవడంతో పాటు ఏ గేమ్ ఆడకుండానే 20 పాయింట్లు గెలుచుకుంది. ఇక ఇమ్యూనిటీ రేసులో భాగంగా రెండో గేమ్ పెట్టాడు బిగ్బాస్. ఇందులో ఇమ్మూ గెలవగా డిమాన్ పవన్ రెండో స్థానంలో నిలిచాడు. సుమన్, తనూజ, సంజనా, భరణి తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచారు.గేమ్ నుంచి తప్పించే ఛాన్స్మూడో గేమ్లో ఒకరు ఆడకుండా సైడ్ చేయొచ్చన్నాడు బిగ్బాస్. ఇమ్మూ.. సంజనాను పక్కకి పిలిచి అదిరిపోయే సలహా ఇచ్చాడు. వాళ్లు ముగ్గురూ (భరణి, తనూజ, సుమన్) కచ్చితంగా మా ఇద్దరి (పవన్, ఇమ్మ)లో ఒకరి పేరు చెప్తారు. కాబట్టి నువ్వు ఆ ముగ్గురిలో ఒకరి పేరు చెప్తే, నేను, పవన్, కల్యాణ్ కూడా అదే చెప్తాం. దీనివల్ల లీడర్ బోర్డులో చివర్లో ఉన్న నువ్వు ముందుకొస్తావ్ అని ఐడియా ఇచ్చాడు. కానీ, సంజనా వింటేగా.. నేను నీ పేరు కాదు, పవన్ పేరు చెప్తున్నా అంది.ప్లేటు తిప్పేసిన సంజనానువ్వు పవన్ పేరు చెప్తే.. వాళ్లంతా నా పేరు చెప్తారు, అలా నేను బలవ్వాల్సి వస్తుంది అని మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. దీంతో భరణి, సుమన్, తనూజ.. ఇమ్మూ అనుకున్నారు. కానీ సంజనా ఒక్కరే డిమాన్ పవన్ పేరు చెప్పింది. పవన్, కల్యాణ్.. సంజనా పేరు చెప్పారు. దీంతో ఇమ్మూ.. తనను కాపాడుకోవడం కోసం సంజనా పేరు చెప్పక తప్పదన్నాడు. అలాగైతే తాను డేంజర్లో పడతానని అర్థమైన సంజనా.. వెంటనే తన నిర్ణయం మార్చుకుంది. తనూజ వర్సెస్ సంజనాపవన్కు బదులుగా ఇమ్మూని తీసేస్తానంది. అందుకు తనూజ ఒప్పుకోలేదు. అలాగైతే నేనూ నా నిర్ణయం మార్చుకుంటా.. అంటూ సంజనా పేరు చెప్పింది. ఇక్కడ వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. చివరకు ఇమ్మాన్యుయేల్.. సంజనా పేరు చెప్పాడు. అలా సంజనాకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె నెక్స్ట్ గేమ్ ఆడటానికి వీల్లేదని బిగ్బాస్ ప్రకటించాడు. ప్రస్తుతానికి లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న ఇమ్మూ, పవన్.. గార్డెన్ ఏరియాలోకి వచ్చారు.ఇమ్మూ ఓట్ అప్పీల్వీరి కోసం కొందరు ప్రేక్షకులు బిగ్బాస్ హౌస్కి వచ్చారు. మెజారిటీ జనం ఇమ్మూ (Emmanuel) ఓట్ అప్పీల్ గెల్చుకోవాలని కోరారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు నాకు ఓటేస్తూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మూడుసార్లు కెప్టెన్ అయ్యాను. ఇంట్లోని పరిస్థితులను తట్టుకుని అందర్నీ నవ్విస్తున్నాను. వీలైనన్ని గేమ్స్ గెల్చుకుంటూ వచ్చాను. ఓట్ అప్పీల్ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క. దయచేసి నాకు ఓటేయండి. ఒక్క ఎంటర్టైనర్ అయినా కప్పు గెలవాలని ఆడుకుంటూ వచ్చాను. నాకు ఓటేసి టాప్ 5లో ఉంచుతారని అనుకుంటున్నాను అని ఓట్ అప్పీల్ అడిగాడు. తర్వాత ప్రేక్షకులతో కాసేపు చిట్చాట్ చేశాడు. కప్పు గెలవగానే ఫస్ట్ అమ్మ చేతికి ఇస్తానని, తర్వాత ప్రేయసి చేతిలో పెడతానని చెప్పాడు.చదవండి: షూటింగ్కు ఫారెస్ట్ పోదాం చలోచలో
హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ
సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇందులో నిలదొక్కుకునేందుకు తారలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. అదృష్టం తోడైనవారే తమ కలలను సాకారం చేసుకుంటారు. భాషాభేదం లేకుండా తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందుకు తగిన గుర్తింపు వస్తే ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్స్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక టెక్నాలజీ.ఏఐ దుర్వినియోగంసాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఓపక్క ప్రయోజనాలు చేకూరుతుంటే మరికొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలను ఇష్టారీతిన ఎడిట్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇలా తప్పుగా చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తమన్నా ఫోటోలను ఏఐ టెక్నాలజీతో బికినీ దుస్తుల్లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే హీరోయిన్లకు తలనొప్పి తప్పేలా లేదు!
అఫీషియల్.. అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
కొన్ని గంటల్లో రిలీజ్ కావాల్సిన అఖండ 2.. గత గురువారం అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఖండ 2 నిర్మాతలకు ఈరోస్ సంస్థతో ఉన్న ఫైనాన్స్ వివాదం కోర్టుకు వెళ్లడంతో చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది. దీంతో కొత్త రిలీజ్ డేట్పై రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో తాజాగా నిర్మాత సంస్థ సినిమా విడుదల తేదిని ప్రకటించింది. అభిమానులు కోరుకున్నట్లుగానే ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. రిలీజ్కి ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 11న ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. All set for the Divine Destruction at the box office 🔥Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱BOOKINGS OPEN SOON!#Akhanda2Thaandavam‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/LVmTNIObEr— 14 Reels Plus (@14ReelsPlus) December 9, 2025
శ్రీలంకలో ధనశ్రీ వర్మ చిల్.. ప్రియా ప్రకాశ్ వారియర్ బోల్డ్ లుక్..!
బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ బోల్డ్ లుక్స్..శ్రీలంకలో చిల్ అవుతోన్న ధనశ్రీ వర్మ..మరింత బోల్డ్గా ప్రియా ప్రకాశ్ వారియల్..శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి హాట్ పోజులు..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్ పిక్స్.. View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by AaradhyaDevi🦋 (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran)
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
ప్రముఖ బుల్లితెర భామ, బిగ్బాస్ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ డిసెంబర్ 5న జరిగింది.కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.రూపల్ త్యాగి కెరీర్..హమారీ బేటియూన్ కా వివాహ్ సీరియల్తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది. View this post on Instagram A post shared by Roopal Tyagi (@roopaltyagi06)
సినిమా
చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి
ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!
పెద్దికి పెద్ద కష్టం..! పాన్ ఇండియా స్టార్స్
AI ఎఫెక్ట్ తో కోర్టులను ఆశ్రయిస్తున్న సినీ తారలు
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్
రామ్ చరణ్ బంగారం.. వైరల్ అవుతోన్న బండ్ల గణేష్ కామెంట్స్
పుష్ప ఏపిక్ తో బాక్సాఫీస్ పీస్ పీస్ చేయడానికి సుకుమార్ రెడీ
సంక్రాంతి మూవీ ఫెస్టివల్.. ఈ సారి మాములుగా ఉండదు
జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్ బేస్.. స్పిరిట్ లుక్ లో అదరగొట్టాడు
చిరంజీవి & శ్రీకాంత్ న్యూ మూవీ..ఫ్యాన్స్ కోసం క్రేజీ అప్డేట్!
