Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Jr Ntr Went Delhi High Court For Personal Rights1
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

తెలుగు స్టార్ హీరో జూ.ఎన్టీఆర్.. ఢిల్లీ హైకోర్ట్‌ని ఆశ్రయించాడు. వ్యక్తిత్వ హక్కులని రక్షించుకోవడంలో భాగంగానే పిటిషన్ వేశాడు. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ చేసిన ఫిర్యాదులపై.. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలానే తదుపతి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ అరోరా చెప్పారు.(ఇదీ చదవండి: 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం.. నందమూరి హీరో ఏమైపోయాడు?)ఇటీవల కాలంలో ఇలానే చిరంజీవి, నాగార్జున కూడా హైకోర్ట్‌ని ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇ‍ప్పుడు వీళ్ల బాటలోనే జూ.ఎన్టీఆర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు లేదా ఫొటోని ఉపయోగిస్తే ఆలోచించాల్సిందే అనమాట.ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇది థియేటర్లలోకి రానుందని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చిత్రీకరణ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ తదితర దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)

Raat Akeli Hai The Bansal Murders Streaming On this Ott From this date2
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. క్రైమ్ అండ్ సెస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్‌ నచ్చితే చాలు ఓటీటీల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలా 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మర్టర్ మిస్టరీ థ్రిల్లర్‌ రాత్ అకేలి హై. కోవిడ్ సమయంలో ఈ మూవీ రిలీజైంది.తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రాత్ అకేలి హై.. ది బన్సల్ మర్డర్స్‌ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సీక్వెల్‌ మూవీ డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదకగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే మరోసారి తమ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సీక్వెల్‌లో కొత్తగా చిత్రాంగద సింగ్, రజత్ కపూర్, రేవతి, దీప్తి నావల్, సంజయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఇటీవల గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ షో ప్రదర్శించారు.ఈ సినిమాకు హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ రాసిన ఈ థ్రిల్లర్ మూవీని ఆర్వీఎస్‌పీ, మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. #RaatAkeliHai : #TheBansalMurders Tamil Dubbed Movie OTT Release Sets To Premiere From December 19th on Netflix Also In Telugu Hindi pic.twitter.com/dxhpWaJ15l— SRS CA TV (@srs_ca_tv) December 7, 2025

Bigg Boss 9 Telugu: Bharani Shankar Becomes 14th Week captain3
కొత్త కెప్టెన్‌గా భరణి.. ఆమె జైలుకు!

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రెండు వారాల్లో ఈ సీజన్‌కు శుభం కార్డు పడనుంది. రీతూ ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మిగిలారు. సుమన్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజనా, తనూజ, కల్యాణ్‌, పవన్‌.. వీరందరూ ఆల్‌రెడీ కెప్టెన్‌ అయ్యారు. కానీ భరణి మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవ్వలేదు. కూతురి కోరిక నెరవేరినట్లేఫ్యామిలీ వీక్‌లో వచ్చిన కూతురు కూడా కెప్టెన్‌ అవు డాడీ అని అడిగింది. ఆమె కోరిక తీర్చలేకపోయినందుకు చాలా ఫీలయ్యాడు భరణి. కానీ ఎట్టకేలకు ఆమె కోరిక నెరవేర్చినట్లు కనిపిస్తోంది. తాజా ప్రోమోలో భరణి చేతికి కెప్టెన్‌ బ్యాండ్‌ ఉంది. అంటే ఈ పద్నాలుగో వారం భరణి కెప్టెన్‌ అయ్యాడన్నమాట! జైలుకు సంజనాఅలాగే బిగ్‌బాస్‌ ఇచ్చిన గేమ్‌లో సంజనా (Sanjana Galrani)కు జీరో ఉన్న బాక్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను జైల్లో వేశారని భోగట్టా! అదేంటో కానీ మొట్టమొదటిసారి ఇమ్మాన్యుయేల్‌.. సంజనా కోసం స్టాండ్‌ తీసుకున్నాడు. అయితే హౌస్‌ అందరూ దాన్ని వ్యతిరేకించడంతో ఆమె చేతికి జీరో బాక్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి:

Payal Rajput Praises tollywood Rebal star Prabhas4
'ప్రభాస్ ఇప్పటికీ సిగ్గుపడతాడు'.. మంగళవారం బ్యూటీ క్యూట్ పోస్ట్!

మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఆర్‌ఎక్స్‌100 మూవీతో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. మంగళవారం మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టేసింది. గతేడాది రక్షణ చిత్రంలో కనిపించిన భామ.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్‌ నెట్టింట చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.ఎవరైనా అంత అమాయకంగా ఎలా ఉండగలరు? అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటోలను షేర్ చేసింది. సినీ ఇండస్ట్రీ మనల్ని చాలా కఠినంగా మార్చుతుంది.. అంతేకాదు మంద చర్మం గలవారిగా మార్చేస్తుంది. అయినప్పటికీ ఈ వ్యక్తి మాత్రం ఇప్పటికీ సిగ్గుపడతాడు.. అతని సిగ్గువల్ల చాలా తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే అతను అంత ముద్దుగా ఉంటాడా? దేవుడు అతన్ని దీవించునుగాక.. అంటూ ప్రభాస్‌ సో క్యూట్‌ తెగ పొగుడుతూ ట్వీట్ చేసింది ముద్దుగుమ్మ. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.How can someone be so innocent?The industry toughens people up, making them thick-skinned, yet this guy still blushes easily and speaks very little because of his shyness. Why so cute? God bless him 🪬♾️ pic.twitter.com/Y8w7ZZwcKp— paayal rajput (@starlingpayal) December 8, 2025

Why Nandamuri Kalyan Chakravarthy Quits Cinema5
ఆ ఒక్క సంఘటనతో 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం!

ఎన్టీఆర్‌.. ఈ పేరొక ప్రభంజనం. క్లాస్‌ అయినా, మాస్‌ అయినా, దేశభక్తి అయినా, ఆధ్యాత్మికం అయినా.. ఎటువంటి సినిమాలోనైనా సరే ఇట్టే జీవించి తన పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు నందమూరి తారకరామారావు. అచంచలమైన నటనతో తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన సోదరుడు త్రివిక్రమరావు రావు కూడా నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఈయన కుమారులు కళ్యాన్‌, హరిన్‌ ఇద్దరూ యాక్టింగ్‌నే ఎంచుకున్నారు.హీరోగా ఎంట్రీకళ్యాణ్‌ చక్రవర్తి 1986లో 'అత్తగారు స్వాగతం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కథానాయకుడిగానే కాకుండా సహాయక పాత్రల్లోనూ మెప్పించారు. తలంబ్రాలు, ఇంటి దొంగ, మామా కోడలు సవాల్‌, రౌడీ బాబాయ్‌, అత్తగారు జిందాబాద్‌, ప్రేమ కిరీటం వంటి పలు సినిమాలు చేశారు. చివరగా మెగాస్టార్‌ చిరంజీవి లంకేశ్వరుడు (1989) మూవీలో కీలక పాత్రలో నటించారు.ఆ విషాదంవల్లే..నటుడిగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్‌ చక్రవర్తి (Nandamuri Kalyana Chakravarthy) ఇంట తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్‌ మరణించారు. తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి చెన్నైలో ఉండిపోయారు. తర్వాత బిజినెస్‌ చూసుకున్నారు. మధ్యలో 2003లో వచ్చిన కబీర్‌దాస్‌ మూవీలో శ్రీరాముడి పాత్రలో కాసేపు కనిపించారు. 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ పూర్తి స్థాయిలో నటుడిగా మాత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. రోషన్‌ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్‌ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్‌ చక్రవర్తి.. రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌లో కళ్యాణ్‌ లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. కాగా ఎన్టీఆర్‌ నామకరణం చేసిన వైజయంతి మూవీస్‌ సంస్థతోనే కళ్యాణ్‌ చక్రవర్తి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం! ఈ మూవీ డిసెంబర్‌ 25న విడుదలవుతోంది.చదవండి: రాత్రిపూట మనోజ్‌ ఫోన్‌కాల్‌.. ఎంతో ఏడ్చా! బాలీవుడ్‌ నటుడు

Actress Sunaina Reveals Relation With Youtuber Khalid Al Ameri6
దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి

హీరోయిన్ సమంత.. గతవారం పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీళ్లిద్దరికీ గతంలోనే వేర్వేరుగా వివాహాలు జరిగాయి కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ విషయం పక్కనబెడితే మరో తెలుగు హీరోయిన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పెళ్లయిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు!తెలుగు కుటుంబంలో పుట్టిన సునయన.. 'కుమారి vs కుమారి' అనే సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్, పగలే వెన్నెల, మిస్సింగ్ తదితర చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళంలో ట్రై చేసింది. ఈమెకు హిట్స్ పడ్డాయి. రీసెంట్ టైంలో అయితే శ్రీ విష్ణు 'రాజ రాజ చోర'లో నటించింది. ఈ ఏడాది వచ్చిన 'కుబేర' మూవీలో నాగార్జున పాత్రకు భార్యగా కనిపించింది.అసలు విషయానికొస్తే.. గతేడాది జూన్‌లో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని హీరోయిన్ సునయన బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. కాకపోతే కాబోయే వ్యక్తి ఎవరనేది రివీల్ చేయలేదు. కొన్నాళ్లకు రూమర్స్ వచ్చాయి. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో ప్రేమలో ఉందని టాక్ వినిపించింది. కాకపోతే దీన్ని సునయన ఎప్పుడు ధ్రువీకరించలేదు. తాజాగా ఖలీద్.. సునయతో బంధాన్ని పబ్లిక్ చేశాడు.ఖలీద్ పుట్టినరోజు రెండు రోజుల క్రితం జరగ్గా.. సునయనతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. చేతులు పట్టుకుని తీసుకున్న ఓ సెల్ఫీని కూడా ఖలీద్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో గతేడాది వచ్చినవి రూమర్స్ కాదు నిజమేనని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రిలేషన్ బయటపెట్టారంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో?ఖలీద్ విషయానికొస్తే.. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఇతడు. సలామా అనే యూట్యూబర్‌ని 2007లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆమెకు విడాకులు ఇచ్చాడో తెలీదు గానీ ఇప్పుడు సునయనతో వివాహానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri)

Akkineni Akhil Doing A big Project with Star Director Assistant goes viral7
ఎన్టీఆర్ ఇంట్లో మీట్.. అఖిల్ బిగ్‌ ప్రాజెక్ట్‌ కోసమేనా?

సినిమాల్లో కేవలం స్టార్‌డమ్ ఉంటే చాలదు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కూడా ఉండాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీలో సక్సెస్‌ కావాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు కొంతవరకు బెనిఫిట్ ఉన్నప్పటికీ.. అది పూర్తిస్థాయిలో రావాలంటే సొంతం పనిమీదే ఆధారపడి ఉంటుంది.అలా టాలీవుడ్‌ అగ్రకుటుంబం నుంచి వచ్చిన అఖిల్‌ అక్కినేనికి సరైన హిట్‌ పడడం లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఏజెంట్‌ మూవీ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో మంచి కమ్ బ్యాక్‌ ఇచ్చేందుకు అఖిల్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తోన్న యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రం లెనిన్ . ఈ మూవీకి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగానే అఖిల్‌కు సంబంధించి మరో టాక్‌ వినిపిస్తోంది. లెనిన్‌తో బిజీగా ఉన్న అఖిల్ మరో క్రేజీ ప్లాన్ చేస్తున్నారని చర్చ మొదలైంది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్‌ ఇంట్లో ప్రశాంత్ నీల్‌తో అఖిల్ మీట్ అయినట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో అఖిల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంట్లో సమావేశమైనట్లు సమాచారం.అయితే ప్రశాంత్‌ నీల్‌ వద్ద పనిచేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌తోనే ఈ మూవీ ప్లాన్‌ చేస్తున్నారని టాక్. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్ నీల్‌ పర్యవేక్షణలోనే చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లెనిన్ ఈ మూవీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే అఖిల్ ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్ తెప్పించే న్యూస్ ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Upcoming OTT Telugu Movies December 2nd Week 20258
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు చూడాల్సిందే

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి ఏకంగా 15కి పైగా తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో మోగ్లీ, సైక్ సిద్ధార్థ్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు కార్తీ 'అన్నగారు వస్తారు'.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ నుంచి 'రీతూ' ఎలిమినేట్‌.. విన్నర్‌ రేంజ్‌లో రెమ్యునరేషన్‌)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1'తో పాటు త్రీ రోజెస్ సీజన్ 2 అనే తెలుగు వెబ్ సిరీస్ ఉన్నంతలో చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 8 నుంచి 14 వరకు)నెట్‌ఫ్లిక్స్ఎల్మ్ అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్ మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 08మ్యాన్ vs బేబీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12వేక్ అప్ డెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12హాట్‌స్టార్సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 11అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)అమెజాన్ ప్రైమ్ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 08ద లాంగ్ వాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08మెర్వ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12ఆహా3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12జీ5సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12సన్ నెక్స్ట్అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12సోనీ లివ్రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ సిరీస్) - డిసెంబరు 09ఆపిల్ టీవీ ప్లస్ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12మనోరమ మ్యాక్స్ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12(ఇదీ చదవండి: ఆస్తి మొత్తం తిరుమలకు ఇ‍చ్చేసిన అలనాటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం)

Manoj Bajpayee: Actors Insecure in Industry9
రాత్రిపూట మనోజ్‌ ఫోన్‌ కాల్‌.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్‌ నటుడు

సినిమా లేదా సిరీస్‌ బాగుందంటే జనం ఆటోమేటిక్‌గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్‌ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్‌లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్‌ ఉండవంటున్నాడు నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్‌ సిరీస్‌ 'ద ఫ్యామిలీ మ్యాన్‌'. ఈ సిరీస్‌ మూడో సీజన్‌ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.జీవితంలో మర్చిపోలేనుతాజాగా ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌ అంతా ఓ చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్‌ అహ్లావత్‌ మాట్లాడుతూ.. పాతాళ్‌ లోక్‌ సీజన్‌ 1 రిలీజైనప్పుడు మనోజ్‌ రాత్రిపూట నాకు ఫోన్‌ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్‌కాల్‌ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్‌ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్‌లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్‌స్టిట్యూషన్‌ ఓపెన్‌ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు. అభద్రతా భావం ఎక్కువఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్‌ చేసి నీ యాక్టింగ్‌ బాగుంది, నీ ప్రాజెక్ట్‌ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్‌ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్‌(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్‌ బాజ్‌పాయ్‌, జైదీప్‌ అహ్లావత్‌ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్‌ ఆఫ్‌ వాసేపూర్‌ అనే వెబ్‌ సిరీస్‌లో, చిట్టగ్యాంగ్‌ మూవీలో నటించారు.చదవండి: చిన్న వయసులో చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి

Krithi Shetty Left in Tears over Trolling over her Films10
చిన్న వయసులోనే చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి

కృతీ శెట్టి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్‌ సినిమాకే టాలీవుడ్‌ సెన్సేషన్‌ అయింది. ఉప్పెన మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు రావడంతో యంగ్‌ హీరోలతో జోడీ కట్టింది. అయితే తెలుగులో తన క్రేజ్‌ను, సక్సెస్‌ను అలాగే నిలబెట్టుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్‌కు షిఫ్ట్‌ అయింది. ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలు చేస్తోంది.ట్రోలింగ్‌తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై జరిగే ట్రోలింగ్‌ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కృతీ శెట్టి మాట్లాడుతూ.. నేను చాలా సున్నితమైన వ్యక్తిని.. అమ్మ లేకుంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్నే కాదు. చిన్న వయసులోనే నేను చాలా విషయాలు ఫేస్‌ చేశాను.అమ్మ సపోర్ట్‌సోషల్‌ మీడియాలో నాపై ట్రోలింగ్‌, ద్వేషం చూసి నాకు చాలా బాధేసింది. ఇక్కడ ఏవీ మన చేతుల్లో ఉండవు. అయినా సరే మనల్నే నిందించినప్పుడు ఇంకా ఎక్కువ బాధేస్తుంది. అప్పుడు అమ్మ అండగా నిలబడి.. నీ వల్ల అయినదానికన్నా ఎక్కువే కష్టపడుతున్నావు అని ధైర్యం చెప్పేది. ఒకానొక సమయంలో నాపై నేను నమ్మకం కోల్పోయాను. తట్టుకలోకపోయా..నిజ జీవితంలో నన్నెవరైనా కామెంట్‌ చేసుంటే పట్టించుకునేదాన్ని కాదు. కానీ కెరీర్‌లో ఇలాంటి కామెంట్స్‌ వినేసరికి తట్టుకోలేకపోయాను. అప్పుడు ఫ్రెండ్స్‌ నేను బాధపడనీయకుండా నాతోనే ఉన్నారు. నేను హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు అంటూ కృతీ శెట్టి (Krithi Shetty) కన్నీళ్లు పెట్టుకుంది.చదవండి: నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: శింబు

Advertisement
Advertisement