ప్రధాన వార్తలు

అగ్నిపరీక్ష: చిరాకు తెప్పించిన అతడు, బిందు, శ్రీముఖినే ఓడించిన ఆమె
బిగ్బాస్ అగ్నిపరీక్షలో 45 మంది రానున్నారు. వీరిలో ఫైనల్స్కు 15 మందిని సెలక్ట్ చేసి అందులో 5 లేదా 9 మందిని బిగ్బాస్ తొమ్మిదో సీజన్కు పంపించనున్నారు. ఈ ఎంపిక బాధ్యత బిందుమాధవి, నవదీప్, అభిజిత్లపై ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఎనిమిది మందిని టెస్ట్ చేశారు. మరి రెండో ఎపిసోడ్లో ఎవరెవరు వచ్చారు? జడ్జిలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో చూసేద్దాం..మాటల తుపానుమొదటగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ డెమాన్ పవన్ స్టేజీపైకి వచ్చాడు. యాక్టింగ్ కోసమే బిగ్బాస్ (Bigg Boss 9 Telugu)కు రావాలనుకుంటున్నానన్న ఇతడు శరీరంపై రెండు టైర్లు పెట్టుకుని 25 పుషప్స్ చేశాడు. ఇతడికి ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. దమ్ము శ్రీజ.. రాగానే ఓవర్ చేసింది. ఆమె నోటివాగుడుకు అందరూ బెంబేలిత్తిపోయారు. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. నీ ఆడపులి టైటిల్ నేను లాగేసుకుంటానని బిందుమాధవితో సవాలు చేసింది. ఆమె మాటలు ఎవరికీ నచ్చలేదు. నవదీప్ ఒక్కడే తనకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.పేడ రుద్దుకోమనగానే..తర్వాత తేజ సజ్జ మిరాయ్ ప్రమోషన్స్ జరిగాయి. తర్వాత వచ్చిన మోడల్ ఊర్మిళ చౌహాన్కు మాస్ టాస్కులిచ్చారు. పిడకలు చేయమనగానే చేసింది. చెంపలకు పేడ రుద్దుకోమనగానే బుగ్గలపై పూసుకుంది. ఈమెక్కూడా నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. చిదానందశాస్త్రి, గొంగలి కప్పుకుని వచ్చిన నర్సయ్య తాత, మిస్ ఇండియా మాధురిని జడ్జిలు ఎలిమినేట్ చేశారు. అడ్వొకేట్ నాగప్రశాంత్కు నవదీప్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.అబ్బాయిలే గ్రేట్19 ఏళ్ల శ్రేయకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి టాప్ 15కి పంపించారు. అబ్బాయిలే గ్రేట్ అంటూ అమ్మాయిలను చులకన చేసిన రవి అనే కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేశారు. ఆడవాళ్లు ప్రెగ్నెన్సీలో 30 నిమిషాలు పురిటినొప్పులు భరిస్తారు, అదొక్కటే గ్రేట్ అన్నట్లుగా మాట్లాడాడు. తొమ్మిది నెలల జర్నీ అతడి కళ్లకు కనిపించలేదా? అని అక్కడున్నవాళ్లు షాకయ్యారు. కోపంతో బిందుమాధవి అతడిని గెంటేసినంత పని చేసింది. సింగర్ శ్రీతేజ్కు ఒక ఛాన్సిద్దామంటూ అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరూ ఇంట్రస్టింగ్గా లేరంటూ దాదాపు ఏడుగురిని వెంటవెంటనే ఎలిమినేట్ చేశారు (Bigg Boss Agnipariksha).బిందు, శ్రీముఖిని ఓడించిన కల్కిఅనంతరం ఫోర్బ్స్ అండర్ 30లో నిలిచిన మర్యాద మనీష్ స్టేజీపైకి వచ్చాడు. ఇతడికి బిందు మినహా మిగతా ఇద్దరూ గ్రీన్ ఫ్లాగ్తో నెక్స్ట్ లెవల్కు పంపించారు. మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి స్టేజీపైకి వచ్చి.. మా నాన్నకు ఆడపిల్లలంటే ఇష్టం లేరు. కానీ మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలమే అంటూ తన స్టోరీ చెప్పింది. హ్యాండ్ రెజ్లింగ్లో బిందు, శ్రీముఖిని ఓడించింది. ఈమెక్కూడా బిందుమినహా మిగతా ఇద్దరూ ఓ ఛాన్సిద్దామని గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ

తెరపైకి మరోసారి స్టార్ హీరో విడాకుల వివాదం
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై కొన్ని నెలలుగా విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి గోవిందా తరఫు లాయర్ లలిత్ బింద్రా కూడా స్పందించారు. వారిద్దరి విడాకులకు సంబంధించి ఎలాంటి కేసు లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు కావాలనే పాత విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు. వినాయకచవితి పండగనాడు వారిద్దరినీ జంటగా చూడొచ్చని లాయర్ లలిత్ చెప్పారు. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.నటుడు గోవింద మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే సునీతా అహుజా విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించినట్టు పలు కథనాలు వచ్చాయి. 30 ఏళ్ల ఓ మరాఠీ నటితో గోవిందా దగ్గరగా ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె వల్లనే సునీతతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం.

బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: 'ఇంద్ర' నటుడి ఆగ్రహం
సోషల్ మీడియాను మంచికన్నా చెడుకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న నటులు చనిపోయారంటూ ఫేక్ వదంతులు సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రజా మురద్ (Actor Raza Murad) గురించి ఇటువంటి ఫేక్ ప్రచారం చేపట్టారు. యాక్టర్ చనిపోయాడని ప్రకటిస్తూ నివాళులు అర్పించారు. సదరు పోస్ట్పై రజా మురద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు తాను బతికున్నానని నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అసత్య ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సీరియస్ మ్యాటర్రజా మురద్ మాట్లాడుతూ.. నేను ఇంకా బతికున్నందుకు కొందరు చాలా బాధపడుతున్నారు. కారణమేంటో నాకర్థం కావట్లేదు. ఏకంగా నేను చనిపోయానంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పనిచేశానని, కానీ నన్ను స్మరించుకోవడానికి కూడా ఎవరూ లేరని రాశారు. నా పుట్టినరోజు, అలాగే ఫేక్ డెత్ డెట్ కూడా ఆ పోస్ట్లో జత చేశారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. చాలా సీరియస్.చెప్పీచెప్పీ గొంతెండిపోయిందినేను బతికే ఉన్నానని చెప్పీచెప్పీ నా గొంతు, నాలుక, పెదాలు తడారిపోయాయి. చనిపోయానన్న వార్త అంతటా వైరలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి నాకు ఫోన్కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఇలాంటి వదంతి సృష్టించినవారిది వక్రబుద్ధి అయి ఉండాలి. జీవితంలో ఏదీ సాధించడం చేతకాక ఇలాంటి నీచపు పనులు చేసి ఆనందిస్తున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి! పోలీసులు ఆ దుర్మార్గుడిని పట్టుకుంటానని హామీ ఇచ్చారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక చాలుబతికుండగా ఎవరినీ చంపొద్దు.. ఇలాంటివి ఇకనైనా ఆపేయండి. నాగురించి మాత్రమే చెప్పడం లేదు. చాలామంది సెలబ్రిటీలను ఇలాగే సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. అది పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. రజా మురద్.. జోధా అక్బర్, గోలియాకీ రాస్లీల రామ్లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో.. ఇంద్ర, జానీ, సుభాస్ చంద్రబోస్, రుద్రమదేవి చిత్రాల్లో నటించాడు. బుల్లితెరపై మేఘ బర్సేంగె సీరియల్లో నటించాడు.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ

అనిరుధ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander)కు మద్రాస్ హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 'హుక్కుమ్' పేరుతో ప్రపంచ వ్యాప్తంగా సంగీత కచేరిలను నిర్వహించాలని ఆయన తలపెట్టారు. అందులో భాగంగా చెన్నైలో నేడు సాయింత్రం (ఆగష్టు 23)వ తేదీన నిర్వహించనున్నారు. చెన్నై సముద్ర తీర ప్రాంతం, కువత్తూర్లోని స్వర్మభూవి ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టికెట్ల బుకింగ్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నట్లు అనిరుద్ వెల్లడించారు. అయితే ఈ సంగీత కచేరిని నిర్వాహకులు కలెక్టర్ అనుమతి పొందకుండా నిర్వహిస్తున్నారని, నిర్వహణ ప్రాంతంలో వచ్చే ప్రజలకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని, అందువల్ల ఆ సంగీత కచేరి జరగకుండా నిషేధం విధించాలని కోరుతూ చెయ్యూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు పనైయూర్ బాబు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ పలు సూచనలు ఇచ్చి... అనిరుద్ హుక్కుమ్ పేరుతో నిర్వహిస్తున్న సంగీత కచేరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇచ్చారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మహాబలిపురం డీఎస్సీ అనుమతి పొందాలని ఆదేశాలు జారీ చేశారు. What a tour it was and the most perfect way to end it - this evening, at home in Chennai ! Thank you all for the craziness! The #HukumTour ❤️Let’s go crazy - https://t.co/CiF0CnJaB0📹 @GndShyam ⚡️ pic.twitter.com/nnSvkQ71ZS— Anirudh Ravichander (@anirudhofficial) August 23, 2025
ఫొటోలు


ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)


జపాన్లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)


పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)


'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ (ఫొటోలు)


షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్ ఫోటోలు చూశారా..?


#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్ ఫాదర్.. 'చిరంజీవి' బర్త్డే స్పెషల్ (ఫోటోలు)


మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)


బలగం బ్యూటీ కొత్త సినిమా.. గ్రాండ్గా పూజా కార్యక్రమం (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగచైతన్య దంపతులు (ఫోటోలు)


‘బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్’ ఈవెంట్లో షారుఖ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
A to Z

అగ్నిపరీక్ష: బిగ్బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు
బిగ్బాస్ 9వ సీజన్లో సామాన్యుల ఎంట్రీ ఉండబోతోంది...

ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ
అనుపర పరమేశ్వరన్ వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంద...

హృతిక్ రోషన్ ప్రియురాలి మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
బాలీవుడ్ నటి, హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నట...

థియేటర్లలో పరదా..ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పె...

ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడే అనుకున్నా.. దత్తత తీసుకోవాలని!
35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్గానే ఉంది బుల్లితెర ...

బిగ్బాస్ షోలో మైక్ టైసన్? పారితోషికంపై చర్చలు!
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్బాస్ ...

చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్...

ఆమె అంటే నాకు పిచ్చి.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచి...

63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?
సినిమా సెలబ్రిటీల మధ్య డేటింగ్, ప్రేమ, పెళ్లి లాంట...

జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 ట్రైలర్ చూశారా?
సినీ ప్రియుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న వి...

'స్క్విడ్ గేమ్లో బాహుబలి'.. తెగ నవ్వులు తెప్పిస్తోన్న వీడియో!
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ ...

ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Imp...

కీ రోల్కి సై
విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో ఓ సినిమా తెరకె...

రజినీకాంత్ కూలీ.. మాస్ సాంగ్ వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర...

ఓటీటీకి పరదా హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాల చూసే తీరు పూర్తిగా మారిపోయి...

మెగాస్టార్-బాలయ్య కాంబోలో సినిమా.. అనిల్ రావిపూడి ఏం చెప్పారంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు అభిమ...
గాసిప్స్
View all
స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా

తెరపైకి మరోసారి స్టార్ హీరో విడాకుల వివాదం

ఒకే వేదికపైకి రానున్న ప్రభాస్, అనుష్క

'వార్ 2' ఎఫెక్ట్.. నాగవంశీకి బిగ్ ఆఫర్?

రెమ్యునరేషన్ లేకుండానే స్టార్ హీరో కొత్త సినిమా!

హీరోగా తేజ వారసుడు ఎంట్రీ సరే.. హీరోయిన్ పేరే కాస్త డౌట్..?

'కూలీ' vs 'వార్ 2'.. రెండు రోజుల కలెక్షన్ ఎవరికెంత?

మారణహోమం తలపించేలా 'బెంగాల్ ఫైల్స్' ట్రైలర్

స్టార్ హీరో కొడుకు కోసం ముగ్గురు హీరోయిన్లు?

'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
రివ్యూలు
View all
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ

'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ రివ్యూ.. వివాదాల సినిమా ఎలా ఉందంటే?

రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ

‘వార్ 2 ’మూవీ రివ్యూ

పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే!

'అరేబియా కడలి' తెలుగు సిరీస్ రివ్యూ

‘బకాసుర రెస్టారెంట్’ మూవీ రివ్యూ

'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్బస్టర్ మరి తెలుగులో?

'సార్ మేడమ్' మూవీ రివ్యూ.. అందరికీ కనెక్ట్ అవుతుందా..?

‘కింగ్డమ్’ మూవీ రివ్యూ
సినీ ప్రపంచం

తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్
టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా.. గుడ్ న్యూస్ చెప్పేశాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోని షేర్ చేశాడు. రెండు నెలల క్రితం తన భార్య ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టిన ఇతడు.. గత నెలలో సీమంతం వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పుడు తన భార్య ప్రసవించిందని చెప్పి ఆనందం వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా.. తర్వాత టాలీవుడ్లోకి వచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. బిగ్బాస్ షోలోనూ రెండుసార్లు పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ సంగతి చెప్పాడు. అదే ఏడాది శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు.మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండ్ శ్రావణి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మహేశ్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. దళపతి విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?) View this post on Instagram A post shared by Mahesh Vitta (@maheshvitta)

సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మరోవైపు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఓటీటీలోకి వస్తే మాత్రం టైమ్ పాస్ కోసం అలా చూస్తుంటారు. ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం అలాంటి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఏడాది తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా?గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు పర్లేదనిపించే రెస్పాన్స్ అందుకుంది. మరోవైపు స్టార్స్ ఎవరూ లేకపోవడంతో దీనికి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: అనిరుధ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్)'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో' విషయానికొస్తే.. చైత్ర (స్రవంతి బెల్లంకొండ) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. తాను ఇష్టపడటం కంటే తనని ప్రేమించే కుర్రాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటుంది. సూర్యలో (సూర్య శ్రీనివాస్) అలా కనిపించేసరికి అతడితో ప్రేమలో పడుతుంది. గౌతమ్ (గురుచరణ్) ఓ జులాయి. ఇతడి తండ్రి పట్టాభి పోలీస్ కానిస్టేబుల్. తన కళ్ల ఎదుట తప్పు జరిగితే గౌతమ్ సహించలేడు.ఓ సందర్భంలో బ్రహ్మవరం ఎస్ఐని ఎదురించిన గౌతమ్.. అతడికి శత్రువుగా మారుతాడు. అనుకోకుండా ఓ రోజు బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఓ శవం దొరుకుతుంది. ఆ కేసు సంచలనంగా మారుతుంది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెడతారు. సరిగ్గా అదే సమయంలో గౌతమ్ని కలవడం కోసం చైత్ర, అమెరికా నుంచి స్వదేశానికి వస్తుంది. ఆ శవానికి చైత్ర, గౌతమ్లకు సంబంధమేంటి? హంతుకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)

రెండు బ్రేకప్స్.. మగవాడి తోడు అవసరం లేదు: హీరోయిన్
గతంలో రెండు బ్రేకప్స్ జరిగాయంటోంది బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా (Daisy Shah). అందులో తనను బాగా ఇబ్బంది పెట్టిన రిలేషన్షిప్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఓ అబ్బాయితో చాలా ఏళ్లు రిలేషన్లో ఉన్నాను. మొదటి నాలుగేళ్ల సమయంలో అసలు పెళ్లి ఆలోచనే రాలేదు. తర్వాత నాకు ఆ ఆలోచనే రాకుండా చేశాడు. ఏడో సంవత్సరంలో ఉండగా.. నేను సంతోషంగా లేనన్న విషయాన్ని గ్రహించి బ్రేకప్ చెప్పాను. రెండో రిలేషన్లో పరిస్థితి మరీ దారుణం. నేనెక్కడికి వెళ్తున్నా?.. అబ్బాయిలతో కలిసి పని చేస్తున్నానా? ఇలా ప్రతీది గుచ్చిగుచ్చి అడిగేవాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయమేంటంటే.. అతడు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒకసారి మేమిద్దరం పార్టీలో ఉన్నాం. ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. ఇంతలో ఒకరు నా వెనక నుంచి వచ్చి చేయి పట్టుకుని లాగి తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు.నా తప్పేముంది?అందులో తప్పేముంది? దానికి నాపై కోప్పడాల్సిన అవసరం లేదుకదా! కానీ అతడు మాత్రం వేరే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ తనను అర్థం చేసుకోమన్నాడు. అతడి పద్ధతి నాకు చిరాకు తెప్పించేది. నన్నెప్పుడూ కంట్రోల్ చేయాలని చూసేవాడు. దానివల్ల మరింత ఫ్రస్టేట్ అయ్యేదాన్ని. బలమైన అమ్మాయిలను చూసి మగవాళ్లు అస్సలు ఓర్వలేరు. అలాంటివాళ్లను చాలామందిని చూశాను. ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. పైగా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నా పోషణ కోసం ఒక మగవాడి తోడు అవసరం లేదు. అయితే నా స్నేహితురాలి సలహాతో అండాలు భద్రపరిచాను అని చెప్పుకొచ్చింది.కెరీర్డైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టింది. భద్ర అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా మారింది. సల్మాన్ ఖాన్తో చేసిన 'జై హో' మూవీతో మంచి గుర్తింపు అందుకుంది. ఈమె చివరగా మిస్టరీ ఆఫ్ ద టాటూ మూవీ చేసింది. గతేడాది వచ్చిన రెడ్ రూమ్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. మరో రెండు రోజుల్లో (ఆగస్టు 25న) డైసీ షా 41వ వయసులోకి అడుగుపెట్టనుంది.చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం

ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే?
అటు థియేటర్లో ఈ మధ్య అన్నీ పెద్ద సినిమాలే రిలీజవ్వగా ఇటు ఓటీటీ (OTT)లో చిన్నాపెద్ద తేడా లేకుండా అన్నిరకాల చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పాయ్, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇన్స్పెక్టర్ జెండే (Inspector Zende). మనోజ్.. మధుకర్ జెండె అనే పోలీస్గా నటించగా జిమ్ సర్బ్.. కార్ల్ భోజ్రాజ్ అనే స్విమ్సూట్ కిల్లర్గా కనిపించనున్నాడు.ఓటీటీలోబాలచంద్ర కడం, సచిన్ ఖేడెకర్, గిరిజ, హరీశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్మయి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలింది. ఈ మూవీని ఓం రౌత్, జే షెవక్రమణి నిర్మించారు. ఇకపోతే మనోజ్ బాజ్పాయ్ చివరగా డిస్పాచ్ మూవీలో నటించాడు. ఓటీటీలో కిల్లర్ సూప్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ చేస్తున్నాడు. జిమ్ సర్బ్ విషయానికి వస్తే.. ఇతడు చివరగా బ్లాక్బస్టర్ మూవీ కుబేరలో నటించాడు. ఇందులో విలన్గా నటించి మెప్పించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం

స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరోను లాంచ్ చేసేందుకు అంతా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నారు. త్వరలో ఆయన సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మహేశ్ కి అన్నయ్య అయిన రమేశ్ బాబు కూడా హీరోగా పలు చిత్రాలు చేశారు గానీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. తర్వాత వ్యాపారాలు చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయారు. బాబాయ్గా జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను మహేశ్ తీసుకున్నారు.హీరోయిన్ ఎవరు..?ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా టాండానీ టాలీవుడ్కు పరిచయం కానుందని వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే బాలీవుడ్లో ఆజాద్ అనే సినిమాలో నటించింది. - రషా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందింది. సోషల్మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఇప్పుడు వీరద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతిని దర్శకుడిగా తీసుకున్నారని సమాచారం. ఎమోషనల్ లవ్ స్టోరీతో జయకృష్ణను చిత్రపరిశ్రమకు పరిచయం చేయాలనే ఆలోచనతో అజయ్ భూపతి ఉన్నారని టాక్.మహేశ్ బాబుని లాంచ్ చేసిన నిర్మాత అశ్వనీదత్.. జయకృష్ణని కూడా ఒక నిర్మాతగా పరిచయం చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం అంతా ఫిక్స్ అయినప్పటికీ, త్వరలో ఈ విషయమై క్లారిటీ ఇస్తారు. ఇకపోతే మహేశ్.. రాజమౌళి సినిమా బిజీలో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ కి విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంచింగ్ పనులు చూస్తున్నారట.

'కింగ్డమ్' నుంచి బ్రదర్స్ సాంగ్ వీడియో విడుదల
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నాదమ్ములుగా నటించిన చిత్రం 'కింగ్డమ్' (Kingdom).. వారిద్దరి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన 'అన్నా అంటూనే' సాంగ్ను వీడియో వర్షన్ను తాజాగా విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని అనిరుధ్ పాడారు. ఆపై సంగీతం కూడా ఆయనే అందించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని నిర్మాత నాగవంశీ నిర్మించారు. ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ మొదటిరోజు భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత పెద్దగా అనుకున్నంత రేంజ్లో రాబట్టలేకపోయింది. అయితే, ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో నిర్మాత నాగవంశీ మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు.

అగ్నిపరీక్ష: చిరాకు తెప్పించిన అతడు, బిందు, శ్రీముఖినే ఓడించిన ఆమె
బిగ్బాస్ అగ్నిపరీక్షలో 45 మంది రానున్నారు. వీరిలో ఫైనల్స్కు 15 మందిని సెలక్ట్ చేసి అందులో 5 లేదా 9 మందిని బిగ్బాస్ తొమ్మిదో సీజన్కు పంపించనున్నారు. ఈ ఎంపిక బాధ్యత బిందుమాధవి, నవదీప్, అభిజిత్లపై ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఎనిమిది మందిని టెస్ట్ చేశారు. మరి రెండో ఎపిసోడ్లో ఎవరెవరు వచ్చారు? జడ్జిలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో చూసేద్దాం..మాటల తుపానుమొదటగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ డెమాన్ పవన్ స్టేజీపైకి వచ్చాడు. యాక్టింగ్ కోసమే బిగ్బాస్ (Bigg Boss 9 Telugu)కు రావాలనుకుంటున్నానన్న ఇతడు శరీరంపై రెండు టైర్లు పెట్టుకుని 25 పుషప్స్ చేశాడు. ఇతడికి ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. దమ్ము శ్రీజ.. రాగానే ఓవర్ చేసింది. ఆమె నోటివాగుడుకు అందరూ బెంబేలిత్తిపోయారు. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. నీ ఆడపులి టైటిల్ నేను లాగేసుకుంటానని బిందుమాధవితో సవాలు చేసింది. ఆమె మాటలు ఎవరికీ నచ్చలేదు. నవదీప్ ఒక్కడే తనకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.పేడ రుద్దుకోమనగానే..తర్వాత తేజ సజ్జ మిరాయ్ ప్రమోషన్స్ జరిగాయి. తర్వాత వచ్చిన మోడల్ ఊర్మిళ చౌహాన్కు మాస్ టాస్కులిచ్చారు. పిడకలు చేయమనగానే చేసింది. చెంపలకు పేడ రుద్దుకోమనగానే బుగ్గలపై పూసుకుంది. ఈమెక్కూడా నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. చిదానందశాస్త్రి, గొంగలి కప్పుకుని వచ్చిన నర్సయ్య తాత, మిస్ ఇండియా మాధురిని జడ్జిలు ఎలిమినేట్ చేశారు. అడ్వొకేట్ నాగప్రశాంత్కు నవదీప్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.అబ్బాయిలే గ్రేట్19 ఏళ్ల శ్రేయకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి టాప్ 15కి పంపించారు. అబ్బాయిలే గ్రేట్ అంటూ అమ్మాయిలను చులకన చేసిన రవి అనే కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేశారు. ఆడవాళ్లు ప్రెగ్నెన్సీలో 30 నిమిషాలు పురిటినొప్పులు భరిస్తారు, అదొక్కటే గ్రేట్ అన్నట్లుగా మాట్లాడాడు. తొమ్మిది నెలల జర్నీ అతడి కళ్లకు కనిపించలేదా? అని అక్కడున్నవాళ్లు షాకయ్యారు. కోపంతో బిందుమాధవి అతడిని గెంటేసినంత పని చేసింది. సింగర్ శ్రీతేజ్కు ఒక ఛాన్సిద్దామంటూ అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరూ ఇంట్రస్టింగ్గా లేరంటూ దాదాపు ఏడుగురిని వెంటవెంటనే ఎలిమినేట్ చేశారు (Bigg Boss Agnipariksha).బిందు, శ్రీముఖిని ఓడించిన కల్కిఅనంతరం ఫోర్బ్స్ అండర్ 30లో నిలిచిన మర్యాద మనీష్ స్టేజీపైకి వచ్చాడు. ఇతడికి బిందు మినహా మిగతా ఇద్దరూ గ్రీన్ ఫ్లాగ్తో నెక్స్ట్ లెవల్కు పంపించారు. మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి స్టేజీపైకి వచ్చి.. మా నాన్నకు ఆడపిల్లలంటే ఇష్టం లేరు. కానీ మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలమే అంటూ తన స్టోరీ చెప్పింది. హ్యాండ్ రెజ్లింగ్లో బిందు, శ్రీముఖిని ఓడించింది. ఈమెక్కూడా బిందుమినహా మిగతా ఇద్దరూ ఓ ఛాన్సిద్దామని గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ

బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: 'ఇంద్ర' నటుడి ఆగ్రహం
సోషల్ మీడియాను మంచికన్నా చెడుకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న నటులు చనిపోయారంటూ ఫేక్ వదంతులు సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రజా మురద్ (Actor Raza Murad) గురించి ఇటువంటి ఫేక్ ప్రచారం చేపట్టారు. యాక్టర్ చనిపోయాడని ప్రకటిస్తూ నివాళులు అర్పించారు. సదరు పోస్ట్పై రజా మురద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు తాను బతికున్నానని నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అసత్య ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సీరియస్ మ్యాటర్రజా మురద్ మాట్లాడుతూ.. నేను ఇంకా బతికున్నందుకు కొందరు చాలా బాధపడుతున్నారు. కారణమేంటో నాకర్థం కావట్లేదు. ఏకంగా నేను చనిపోయానంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పనిచేశానని, కానీ నన్ను స్మరించుకోవడానికి కూడా ఎవరూ లేరని రాశారు. నా పుట్టినరోజు, అలాగే ఫేక్ డెత్ డెట్ కూడా ఆ పోస్ట్లో జత చేశారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. చాలా సీరియస్.చెప్పీచెప్పీ గొంతెండిపోయిందినేను బతికే ఉన్నానని చెప్పీచెప్పీ నా గొంతు, నాలుక, పెదాలు తడారిపోయాయి. చనిపోయానన్న వార్త అంతటా వైరలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి నాకు ఫోన్కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఇలాంటి వదంతి సృష్టించినవారిది వక్రబుద్ధి అయి ఉండాలి. జీవితంలో ఏదీ సాధించడం చేతకాక ఇలాంటి నీచపు పనులు చేసి ఆనందిస్తున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి! పోలీసులు ఆ దుర్మార్గుడిని పట్టుకుంటానని హామీ ఇచ్చారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక చాలుబతికుండగా ఎవరినీ చంపొద్దు.. ఇలాంటివి ఇకనైనా ఆపేయండి. నాగురించి మాత్రమే చెప్పడం లేదు. చాలామంది సెలబ్రిటీలను ఇలాగే సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. అది పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. రజా మురద్.. జోధా అక్బర్, గోలియాకీ రాస్లీల రామ్లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో.. ఇంద్ర, జానీ, సుభాస్ చంద్రబోస్, రుద్రమదేవి చిత్రాల్లో నటించాడు. బుల్లితెరపై మేఘ బర్సేంగె సీరియల్లో నటించాడు.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ

అనిరుధ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander)కు మద్రాస్ హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 'హుక్కుమ్' పేరుతో ప్రపంచ వ్యాప్తంగా సంగీత కచేరిలను నిర్వహించాలని ఆయన తలపెట్టారు. అందులో భాగంగా చెన్నైలో నేడు సాయింత్రం (ఆగష్టు 23)వ తేదీన నిర్వహించనున్నారు. చెన్నై సముద్ర తీర ప్రాంతం, కువత్తూర్లోని స్వర్మభూవి ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టికెట్ల బుకింగ్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నట్లు అనిరుద్ వెల్లడించారు. అయితే ఈ సంగీత కచేరిని నిర్వాహకులు కలెక్టర్ అనుమతి పొందకుండా నిర్వహిస్తున్నారని, నిర్వహణ ప్రాంతంలో వచ్చే ప్రజలకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని, అందువల్ల ఆ సంగీత కచేరి జరగకుండా నిషేధం విధించాలని కోరుతూ చెయ్యూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు పనైయూర్ బాబు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ పలు సూచనలు ఇచ్చి... అనిరుద్ హుక్కుమ్ పేరుతో నిర్వహిస్తున్న సంగీత కచేరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇచ్చారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మహాబలిపురం డీఎస్సీ అనుమతి పొందాలని ఆదేశాలు జారీ చేశారు. What a tour it was and the most perfect way to end it - this evening, at home in Chennai ! Thank you all for the craziness! The #HukumTour ❤️Let’s go crazy - https://t.co/CiF0CnJaB0📹 @GndShyam ⚡️ pic.twitter.com/nnSvkQ71ZS— Anirudh Ravichander (@anirudhofficial) August 23, 2025

ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ
మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడేవాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం ఎక్కువై, ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అన్న సున్నితమైన పాయింట్తో తీసిన ఓ భావోద్వేగంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్’. ఓటీటీలో సూపర్ హిట్ మూవీఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రశాంత్ పాండ్యరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్ యాక్షన్ ఇటువంటివి ఏమీ లేకపోయినా సినిమా చూస్తున్నంతసేపు సీటులోంచి కదలలేరు. అంతలా కట్టిపడేస్తుంది. ప్రముఖ తమిళ కమెడియన్ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి, మెప్పించారు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనస్సులను కదిలించారు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం (Maaman Movie Review). కథ‘మామన్’ సినిమా కథ ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముళ్ళు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. ఎలా ఉందంటే?అక్క బిడ్డా లేక తనకు పుట్టబోయే బిడ్డా అన్న సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలి. చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో భావుకతతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్ప్లేతో సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం. ఈ భూమ్మీద భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఈ సినిమాలో ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు, చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా ‘మామన్’ మామూలు సినిమా అయితే కాదు. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు
సినిమా


2026 లో మెగా ఫ్యాన్స్ కి పండగే..!


జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్


వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్


ఫాన్స్ కు భారీ అప్డేట్ ఇచ్చిన చిరు


రావిపూడి దర్శకత్వంలో చిరు మూవీ... గ్లింప్స్ రిలీజ్


అక్కినేని ఫ్యాన్స్ కి పండగే..! నాగ్ 100 నాటౌట్..!


War 2 Movie: ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని..!


టైంకి సెట్ కి రాడు..! సల్మాన్ పై మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు..!


Megastar Chiranjeevi: స్ట్రగుల్స్ నుంచి స్టార్డమ్ వరకు..!


టాలీవుడ్ లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర