Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Nidhhi Agerwal and Sreemukhi to Attend CID Inquiry | Sakshi TV 1
సీఐడీ విచారణకు యాంకర్ శ్రీముఖి, నిధి అగర్వాల్ హాజరు!

బెట్టింగ్ యాప్స్‌ యాప్‌ కేసులో టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ నిధి ‍అగర్వాల్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ సిట్‌ పలువురు టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు శ్రీముఖి, నిధి అగర్వాల్‌, అమృత చౌదరిని విచారించారు. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌తో లావాదేవీలపై వీరిద్దరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ కేసులో ఇప్పటికే నటులు రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌, విష్ణుప్రియను కూడా సీఐడీ సిట్‌ ప్రశ్నించింది. సిట్‌ అధికారుల సూచన మేరకు బ్యాంకు స్టేట్‌మెంట్లతో హీరో రానా సమర్పించారు. ‘బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు? తీసుకున్న పారితోషికం ఎంత? బెట్టింగ్‌ యాప్‌లను ఎందుకు ప్రమోట్‌ చేయాల్సి వచ్చింది? ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకున్న వివరాలపై సీఐడీ ఆరా తీసింది.

The Great Pre Wedding Show Movie OTT Update2
ఓటీటీలోకి లేటెస్ట్ కామెడీ హిట్ సినిమా

అన్నిసార్లు పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా అద్భుతాలు చేస్తుంటాయి. ప్రేక్షకుల్ని మనసారా నవ్విస్తాయి. అలాంటి ఓ చిత్రమే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ సినిమాని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. రాహుల్ శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు తీసినప్పటికీ తొలి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే.. ఓ ఫొటోగ్రాఫర్ ఎలాంటి తిప్పలు పడ్డాడు? దీని నుంచి వచ్చే కామెడీ అనే సింపుల్ పాయింట్‌తో తీసిన సినిమా ఇది. చెబుతుంటే స్టోరీ ఇంతేనా అనిపిస్తుంది గానీ చూస్తున్నప్పుడు మాత్రం మంచి కామెడీతో అలరిస్తుంది. నవంబరు 7న థియేటర్లలోకి రాగా పాజిటివ్ టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబరు 5 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్‌లో మిస్ అయినోళ్లు ఓటీటీలోకి వచ్చాక తప్పక చూడండి.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విషయానికొస్తే.. ప‌ల్లెటూరిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయ‌డంలో ఆరితేరిన ఫొటోగ్రాఫ‌ర్ ర‌మేశ్ (తిరువీర్‌). స్టూడియోకి ఎదురుగా ఉండే పంచాయ‌తీ ఆఫీస్‌లో ప‌నిచేసే హేమ(టీనా శ్రావ్య)ని ఇష్ట‌ప‌డుతంటాడు. ఆమెకీ ర‌మేశ్ అంటే ఇష్ట‌మే. కట్ చేస్తే ర‌మేశ్ ద‌గ్గ‌ర‌కు ప్రీ వెడ్డింగ్ షూట్ కోస‌మ‌ని ఆనంద్(న‌రేంద్ర‌ ర‌వి) వ‌స్తాడు. రాజ‌కీయ కుటుంబానికి చెందిన యువ‌కుడు ఆనంద్‌. షూట్ అంతా అయ్యాక మెమ‌రీ కార్డ్ త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే స‌హాయ‌కుడు రాము(మాస్ట‌ర్ రోహ‌న్‌) చేతికి రమేశ్ ఇస్తాడు.ఆ కుర్రాడేమో మెమొరీ చిప్ ఎక్క‌డో ప‌డేస్తాడు. అప్పటినుంచి ర‌మేశ్‌కి క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. చిప్ లేద‌నే సంగతి ఆనంద్‌కి తెలిస్తే ఏమ‌వుతుందోననే భ‌యం ఓవైపు రమేశ్‌ని వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ గండం నుంచి బయటపడాలి. ఈ విషయంలో రమేశ్‌కి హేమ ఏం సాయం చేసింది? చివరకు మెమొరీ చిప్ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సారీ చెప్పిన 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్)

Itlu Mee Yedava Telugu Review3
'ఇట్లు మీ ఎదవ' సినిమా రివ్యూ

ఈ రోజు (నవంబరు 21) బోలెడన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ఒకటి 'ఇట్లు మీ ఎదవ'. త్రినాథ్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రంలో సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది. బళ్లారి శంకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మచిలీపట్నంలో శ్రీను (త్రినాథ్).. ఆరేళ్లుగా పీజీ చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే కాలేజీలో చేరిన మనస్విని (సాహితీ)తో ప్రేమలో పడతాడు. కొన్నాళ్ల పాటు తిరిగి ఆమె కూడా తన ప్రేమలో పడేలా చేస్తాడు. ఎప్పుడూ ఎదవలా తిరిగే కొడుకు బాగుపడుతున్నాడే అనుకుని.. మనస్విని ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి శ్రీను తండ్రి వెళ్తారు. ఇలాంటి ఎదవకు పిల్లనిస్తారా అని తిట్టి పంపేస్తారు. దీని గురించి మాట్లాడేందుకు శ్రీను, మనస్విని ఇంటికి వెళ్లగా.. ఓ చిన్న సంఘటన జరిగి శ్రీను, తన ప్రియురాలి తండ్రితో నెలరోజుల పాటు ఉండాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైంది? శ్రీను చివరకు మంచోడు అనిపించుకున్నాడా? ఎదవ అనిపించుకున్నాడా? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఆవారాగా తిరిగే హీరో.. కాలేజీలో హీరోయిన్‌తో ప్రేమలో పడటం.. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ తండ్రితో హీరో ఓ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి రావడం.. చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటి ఓ మూవీనే. తొలి భాగమంతా రొటీన్ లవ్ సీన్స్, కాలేజీ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు అతికించినట్లు అనిపిస్తాయి. శ్రీను, మనుల ప్రేమ ఇంట్లో తెలిసిన తర్వాత కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి 30 రోజుల ఛాలెంజ్ అని పడుతుంది. అలా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపిస్తుంది.సెకండ్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ వాళ్ల నాన్న సీన్స్ ఎక్కువగా ఉంటాయి. నాన్న, బాయ్ ఫ్రెండ్ మధ్యలో నలిగిపోయేలా హీరోయిన్ సీన్స్ ఉంటాయి. కామెడీ ఓకే ఓకే. ప్రీ క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం కథని అప్పటివరకు చూపించిన దానికి కాస్త భిన్నంగా రాసుకున్నాడు.ఎలా చేశారు?హీరో కమ్ దర్శకుడు త్రినాథ్ బాగా చేశాడు. హీరోయిన్ సాహితీ క్యూట్‌గా బాగుంది. గోపరాజు రమణ, దేవీప్రసాద్ తండ్రి పాత్రల్లో ఆకట్టుకున్నారు. తనికెళ్ల భరణి అతిథి పాత్రలో అలా మెరిశారు. మిగిలిన నటీనటులు తమ ఫరిది మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్పీ పట్నాయక్ బ్యాక్ గ్రౌండ్ పాత సినిమాల స్టైల్లో వినిపించింది. పాటలు వినడానికి ఓకే అనిపించాయి. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.రేటింగ్ : 2.5/5

Complaint filed against Bigg Boss Reality show4
నిర్వాహకులకు షాక్.. బిగ్‌బాస్ రియాలిటీ షోపై ఫిర్యాదు!

బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ రన్ అవుతోంది. కన్నడలో ఈ ఏడాది కూడా హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్‌ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. మొదట రెండు రోజుల పాటు ఈ షో మూసివేశారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా ఆపేసి.. మళ్లీ రెండు రోజుల తర్వాత షో ప్రారంభించారు.తాజాగా కన్నడ బిగ్‌బాస్‌ సీజన్-12పై మరో వివాదం మొదలైంది. బిగ్‌బాస్‌ హౌస్‌ కుల వివక్ష, మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిచ్చా సుదీప్‌తో పాటు కంటెస్టెంట్స్‌ అశ్విని గౌడ, రషిక పేర్లను ఫిర్యాదులో చేర్చింది.కంటెస్టెంట్‌ రక్షితను అవమానించేలా హోస్ట్ సుదీప్ వ్యాఖ్యలు చేశారని సంధ్య పేర్కొంది. ఇది మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఓ ఎపిసోడ్‌లో రషికపై మరో కంటెస్టెంట్‌ మాలవల్లి నటరాజ్ (గిల్లి) శారీరకంగా దాడి చేశాడని వెల్లడించింది. అంతేకాకుండా కర్ణాటక రక్షణ వేదికతో సంబంధం ఉన్న పోటీదారు అశ్విని గౌడను ఉద్దేశించి కుల వివక్ష వ్యాఖ్యలు చేయడం, రక్షిత నేపథ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఫిర్యాదులో వివరించింది. అయితే ఈ వివాదంపై కిచ్చా సుదీప్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆయన 'మార్క్' షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 25న పండుగ విడుదల కానుంది.

Raju Weds Rambai Director Apology Latest5
సారీ చెప్పిన 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్

ఈ రోజు (నవంబరు 21) థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో కాస్త ఎడ్జ్ తీసుకున్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. హీరోహీరోయిన్లు, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే. అయినా సరే ఓ షాకింగ్ ప్రేమకథని ప్రెజెంట్ చేశారు. అందుకు తగ్గట్లే మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సరే ఈ సంగతి కాసేపు పక్కనబెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాస్త ఆవేశానికి లోనైన డైరెక్టర్.. పెద్ద ఛాలెంజ్ చేశాడు. దానిపై ట్రోలింగ్ జరిగేసరికి ఇప్పుడు సారీ చెప్పేశాడు.(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ రివ్యూ)సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి' దర్శకుడు సాయిలు కాంపాటి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్‌లో చొక్కా తీసి తిరుగుతా అని అన్నాడు. కానీ ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ కాస్త గట్టిగానే వచ్చింది. సినిమా బాగుంటే సరే గానీ ఇంత పెద్ద స్టేట్‌మెంట్స్ అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. దీంతో ఇప్పుడు రియలైజ్ అయ్యాడు.ఈ రోజు మధ్యాహ్నం సక్సెస్ మీట్ జరగ్గా ఇందులో మాట్లాడిన డైరెక్టర్ సాయిలు.. 'కొత్త డైరెక్టర్లకు మాట్లాడటం రాదు. దయచేసి క్షమించండి అన్న. అమీర్‌పేట్‌లో సాయంత్రం వచ్చి బ్యాండ్ కొడతా అన్నా' అని తన వ్యాఖ్యలని సవరించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అఖిల్ రాజ్, తేజస్వి రావు ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఖమ్మంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)"Konni Years Nunchi Padina Kashtaniki Ee Phalitham Chushaka Maatalu Raatledu"Watch Director #SaailuKampati speech @ #RajuWedsRambai Gratitude Meet💥▶️ https://t.co/e7rE9F4qCpEvent By @shreyasgroup ✌️#RajuWedsRambai #RajuWedsRambaiGratitudeMeet@etvwin @venuudugulafilm… pic.twitter.com/xtHCdo2KWG— Shreyas Media (@shreyasgroup) November 21, 2025

Natasa Stankovic Buys Swanky New Orange Car6
ఖరీదైన కారు కొన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే?

టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా మాజీ భార్య, డ్యాన్సర్‌ నటాషా స్టాంకోవిచ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను సొంతం చేసుకుంది. ఈ కారు విలువు దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. నటాషా స్టాంకోవిచ్ గతంలో క్రికెటర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత జూలై 2024లో అతనితో విడిపోయింది. ఈ మాజీ జంటకు అగస్త్య అనే కుమారుడు ఉన్నారు. విడిపోయినప్పటికీ బాబుకు తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ ప్రస్తుతం మోడల్ మహీకా శర్మతో డేటింగ్‌లో ఉన్నారు.అయితే విడాకుల తర్వాత నటాసా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతోంది. తాను మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవలే ప్రకటించింది. భవిష్యత్తులో తనకు నచ్చినవాడు దొరికితే రెండో పెళ్లికి సిద్ధమేనని పరోక్షంగా హింట్ ఇచ్చింది ముద్దుగుమ్మ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

Raju Weds Rambai Actress Tejaswi Rao Personal Details7
మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాగా.. వాటిలో మూడు సినిమాలు మాత్రమే కొద్దోగొప్పో బజ్‌తో ఉన్నట్లు కనిపించాయి. ఇప్పుడు వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి'కి కాస్త ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సినిమా క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో హీరోయిన్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈమె ఎవరా? బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని ఆరా తీస్తున్నారు.(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ రివ్యూ)'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో హీరోయిన్ అసలు పేరు తేజస్వి రావు. గతేడాది రిలీజైన 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో జ్యోతి పాత్ర చేసింది ఈమెనే. ముద్దు పెట్టుకుంటే కడుపు వచ్చేస్తాది అని ఏడిచే అమ్మాయిగా చేసింది ఈమెనే. అందులో అందులో కట్టుబొట్టు ఒకలా ఉండటంతో పాటు ఎక్కువమంది నటీనటుల ఉండటంతో ఈమెకు ఓ మాదిరి గుర్తింపు మాత్రమే వచ్చింది. ఇప్పుడీ మూవీలో హీరోయిన్‌గా ఆకట్టుకోవడంతో వైరల్ అయిపోయింది.ఈమె పుట్టింది గోదావరి జిల్లాలో అయినప్పటికీ.. రాంబాయిగా తెలంగాణ పిల్లగా మంచి యాక్టింగ్ చేసింది. సినిమాలో ఈమె ఇచ్చిన చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి ఆడియెన్స్‌ ఫిదా అవుతున్నారు. అయితే కమిటీ కుర్రోళ్లు, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు చేయడానికి ముందు దాదాపు ఐదేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసింది. వీటిలో సయోని, బావమరదలు 1-2, పెళ్లి కూతురు విత్ మెనీ డౌట్స్, మినిట్స్, నిశ్చితార్థం, పెళ్లి కూతురు, కేరళ కుట్టి, లవ్ స్టోరీ ఇన్ రాజమండ్రి, మాస్ గాడి క్లాస్ పిల్ల.. ఇలా చాలా లఘు చిత్రాలు చేసింది. ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. రాబోయే రోజుల్లో ఈమె దశ తిరిగేలా కనిపిస్తుంది.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ) View this post on Instagram A post shared by Tejaswi. (@tej_aswiii)

12 A Railway Colony Movie Review And Rating In Telugu8
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ

టైటిల్‌: 12 ఏ రైల్వే కాలనీనటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణికథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్ఎడిటర్ & డైరెక్టర్: నాని కాసరగడ్డనిర్మాణ సంస్థ:శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరిసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: నవంబర్‌ 21, 2025అల్లరి నరేశ్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా రోజులవుతుంది. కామెడీ వదిలి సీరియస్‌ సబ్జెక్టులతో చ్చినా.. సరైన విజయం అందడం లేదు. దీంతో ఈ సారి థ్రిల్లర్‌ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘12 ఏ రైల్వే కాలనీ’. పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పని చేసిన ఈ చిత్రం నేడు(నవంబర్‌ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వరంగల్‌లోని రైల్వే కాలనీకి చెందిన కార్తిక్‌(నరేశ్‌) ఓ అనాథ. స్నేహితులతో(హర్ష, గెటప్‌ శ్రీను, సద్దాం) కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వరంగల్‌ టిల్లు(జీవన్‌ కుమార్‌) దగ్గర పని చేస్తుంటారు. అదే కాలనీలో ఉంటున్న ఆరాధన(కామాక్షి భాస్కర్ల)తో ప్రేమలో పడతాడు. ఆరాధన మాత్రం కార్తిక్‌ని పట్టించుకోదు. ఎలెక్షన్స్‌కి మూడు రోజుల ముందు టిల్లు..కార్తిక్‌ని పిలిచి ఓ కవర్‌ ఇస్తాడు. అది ఓపెన్‌ చేయొద్దని..ఎవరికి తెలియకుండా దాచాలని చెబుతాడు. ఆ కవర్‌ని తన ఇంట్లో దాచుదామని తీసుకెళ్తుండగా..పోలీసులు రైడింగ్‌కు వస్తున్నారనే విషయం తెలుస్తుంది. దీంతో రెండు, మూడు రోజులుగా తాళం వేసి ఉన్న ఆరాధన ఇంట్లో అది దాచాలనుకుంటాడు. దొంగచాటుగా ఆ ఇంట్లోకి వెళ్లిన కార్తిక్‌కి ఓ షాకింగ్‌ విషయం తెలుస్తుంది. మూడు రోజుల క్రితమే ఆరాధన, ఆమె తల్లిని ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఆ హత్య చేసిందెవరు? వారి లక్ష్యం ఏంటి? అసలు ఆరాధన ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ముంబైలో ఉన్న డాక్టర్‌ షిండే(అనీష్‌ కురువిల్లా)కి ఆరాధనకు ఉన్న సంబంధం ఏంటి? చనిపోయిన ఆరాధన..కార్తిక్‌కి మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ మర్డర్‌ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.విశ్లేషణ'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' లాంటి సినిమాలు విజయం సాధించడంలో స్క్రీన్‌ప్లే కీలక పాత్ర పోషించింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అలాంటి సినిమాలు అందించిన డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం కావడంతో ‘12 ఏ రైల్వే కాలనీ’పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్‌ అంతగా ఆకట్టుకోకపోయినా.. స్క్రీన్‌ప్లేతో ఏదో మ్యాజిక్‌ చేస్తాడులే అనుకున్నారు. కానీ ఆడియన్స్‌ అంచనాలను అందుకోవడంతో ఈ చిత్రం ఘోరంగా విఫలం అయింది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఒక్కటంటే ఒక్క సీన్‌ కూడా ఎగ్జైట్‌ చేయలేదు. పైగా ఈ చిత్రానికి అసలు 12ఏ రైల్వే కాలనీ అని టైటిల్‌ ఎందుకు పెట్టారో.. తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడించారో అర్థమే కాదు. పోనీ.. ఆ యాసనైనా సరిగా వర్కౌట్‌ అయిందా అంటే అదీ లేదు. ఏదో అరువు తెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక కథ విషయానికొస్తే.. అసలు దర్శకుడు ఏం చెప్పి నరేశ్‌ని ఒప్పించాడో అర్థమే కాదు. ఒకటి రెండు ట్విస్టులతో స్టోరీ చెప్పేస్తే.. ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ అవుతారా? క్లైమాక్స్‌ ఒకటి బాగుంటే.. సినిమా హిట్‌ అవుతుందా? లాజిక్కుల గురించి ఇక్కడ ప్రస్తావించకపోవడమే మంచింది. ఇంటర్వెల్‌ సీన్‌ మినహా ఫస్టాఫ్‌ మొత్తం బోరింగే అని చెప్పాలి. కొన్ని సీన్లను ఎందుకు పెట్టారో కూడా అర్థమే కాదు. ఏదో సంబంధం ఉన్నట్లుగా సెకండాఫ్‌లో జస్టిఫికేషన్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ..అక్కడ కూడా లాజిక్‌ మిస్‌ అయినట్లుగా అనిపిస్తుంది. ఉన్నంతతో ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఒకటి ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం మర్డర్‌ మిస్టరీ చుట్టూనే కథనం సాగుతుంది. స్క్రీన్‌ప్లే గందరగోళంగానే ఉంటుంది తప్ప..ఎక్కడ ఆకట్టుకోలేదు. క్లైమాక్స్‌లో ఓ పాత్ర ఇచ్చే ట్విస్టు బాగుంటుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడి సహనం నశించిపోవడంతో.. అది కూడా అంత థ్రిల్లింగ్‌గా అనిపించదు.నటీనటుల విషయానికొస్తే.. అల్లరి నరేశ్‌ ఉన్నంతలో బాగానే చేశాడు కానీ కథలో దమ్ములేనప్పుడు ఎంత మంచి నటుడైనా ఏం చేయగలడు? ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానమే బాగోలేదు. ఇక తెలంగాణ యాసలో మాట్లాడేందుకు బాగానే ప్రయత్నించాడు కానీ.. న్యాచులారిటీ మిస్‌ అయింది. కామాక్షి భాస్కర్ల పాత్ర చుట్టూనే ఈ కథ నడుస్తుంది కానీ..ఆమెకు నటించే స్కోప్‌ అయితే లేదు. అభిరామి తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తంలో ఆమె నటన ఒక్కటే బాగా గుర్తుంటుంది. అనీష్‌, సాయికుమార్‌, హర్ష, గెటప్‌ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.సాకేంతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ సిసిరోలియో బీజీఎం జస్ట్‌ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణవిలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Allu Arjun special Birthday Wishes To his Daughter allu arha9
అల్లు అర్హ బర్త్‌ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఐకాన్ స్టార్‌ ‍‍అల్లు అర్జున్ తన ముద్దుల కూతురి అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అర్హ పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్‌ డే టూ మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు కూడా అర్హకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప -2 లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ ‍మూవీని భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని.. భారీగా గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ను అట్లీ పక్కాగా ప్లాన్‌ చేయడమే ఇందుకు కారణమనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Happy birthday to my little princess #AlluArha 💖 pic.twitter.com/pRnMDIOlTe— Allu Arjun (@alluarjun) November 21, 2025 Wishing our sweetest and adorable little princess #AlluArha a very Happy Birthday! 🤩May this year bring you endless happiness and beautiful memories. ❤️#HBDAlluArha #HappyBirthdayAlluArha pic.twitter.com/ZSWgFi8Tl7— Geetha Arts (@GeethaArts) November 21, 2025

AR Rahman: My Father Worked 3 Jobs to Get a House10
కుటుంబం రోడ్డుమీదకు.. నాన్న గుండె ఆగిపోయింది!

సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman). ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఆయన బాల్యంలో ఎన్నో కష్టాలు చూశాడు. వాటిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. నానమ్మ మరణం. నాన్న మరణం.. ఈ రెండూ మా జీవితాలను కుదిపేశాయి. నాన్న చనిపోయినప్పుడు నాకు తొమ్మిదేళ్లే! ఎన్నో అవమానాలుఒంటరి తల్లిగా అమ్మ ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే కుంగిపోకుండా మమ్మల్ని ముందుకు నడిపించింది. నా బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. నేను అక్కడే పుట్టాను. మా నాన్న అక్కడి స్టూడియోలలోనే పనిచేసేవారు. కోడంబాక్కం దగ్గర్లోనే మేముండేవాళ్లం. నా పేరెంట్స్‌ను వారి కుటుంబసభ్యులే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. నడివీధిలో నిలబెట్టారు. మాకంటూ మంచి ఇల్లుండాలని నాన్న పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడేవాడు. కోలుకోవడానికి చాలా ఏళ్లువిశ్రాంతి లేకుండా రోజులో మూడు ఉద్యోగాలు చేసేసరికి ఆయన గుండె అలిసిపోయి ఒకరోజు ఆగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది అని చెప్పుకొచ్చాడు. ఏఆర్‌ రెహమాన్‌ చివరగా ధనుష్‌-కృతీ సనన్‌ల 'తేరే ఇష్క్‌ మే' సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా నవంబర్‌ 28న విడుదల కానుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ 'పెద్ది' మూవీకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అలాగే రామాయణ: పార్ట్‌ 1, జీనీ వంటి పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.చదవండి: అమల అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

Advertisement
Advertisement