Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood actresses latest Social Media upodates1
జీన్స్ పాపలా శోభిత.. ప్రెగ‍్నెన్సీ లుక్‌లో బిగ్‌బాస్ సోనియా!

జీన్స్ పాపలా అ‍క్కినేని శోభిత ధూళిపాళ్ల..బిగ్‌బాస్ సోనియా ప్రెగ్నెన్సీ లుక్స్..పడచుపిల్లలా బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..కెన్యా టూర్‌లో అనసూయ చిల్..పెళ్లి వేడుకలో సందడి చేసిన హీరోయిన్ మహేశ్వరి.. View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad)

Ram Pothineni Andhra King Taluka Trailer out now2
ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్.. అబ్బురపరిచిన డ్రోన్ షో

రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఇవాళ ఆంధ్ర కింగ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కర్నూలులోని ఔట్‌డోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన డ్రోన్స్ విజువల్స్ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇలా చేయడం తొలిసారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది.

Netizens questioned upasana konidela about her advice to youngers3
సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?.. ఉపాసనపై నెటిజన్ల ఫైర్!

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ సతీమణిగా..మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చిట్‌చాట్‌ సందర్భంగా ఉపాసన ఓ ప్రశ్న అడిగారు.మీలో ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంది? అని ఐఐటీ విద్యార్థులను ప్రశ్నించగా.. వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నకు అమ్మాయిల కంటే యువకులే ఎక్కువమంది చేతులు ఎత్తారని ఉపాసన తెలిపింది. దీంతో మహిళలు కెరీర్‌పై ఎక్కువ దృష్టి సారించినట్లు అనిపించిందని ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఈ పరిణామం చూస్తుంటే సరికొత్త ప్రగతిశీల భారతదేశం అంటూ కితాబిచ్చింది. మీ దార్శనికతను నిర్దేశించుకోండి.. మీ లక్ష్యాలను నిర్వచించుకోండి.. మీ పాత్రను సొంతం చేసుకోండి. మిమ్మల్న ఎవరూ ఆపలేని వ్యక్తిగా మారండి అంటూ యువతను ఉద్దేశించి మాట్లాడింది.అయితే ఉపాసన షేర్ చేసిన వీడియోలో మహిళల గురించి మాట్లాడింది. మీరు మీ కాళ్లపై ఆర్థికంగా నిలబడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకోవాలంటూ సూచించింది. అప్పటి వరకు ఒక్కరూ తమ అండాలను భద్రపరచుకోవాలంటూ ఉపాసన మాట్లాడారు. ఈ రోజు నేను నా సొంత కాళ్లపై నిలబడ్డానని.. నా సంపాదనతో ఆర్థికంగా ఎదిగానని తెలిపింది. ఈ ఆర్థిక భద్రతే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా తోడ్పడిందని పేర్కొంది. మీ జీవితంలో 30 ఏళ్లు వచ్చేసరికి కెరీర్‌లో నిలదొక్కుకోవాలని ఉపాసన వివరించింది. నీ కెరీర్‌లో విజన్‌, గోల్‌ సాధించడంలో సక్సెస్ అయితే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరంటూ మాట్లాడింది.అయితే ఉపాసన కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మీ బిజినెస్ కోసం యువతకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలతో యువత తప్పుదారి పట్టేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అపోలో ఫెర్టిలిటీ సెంటర్‌ ప్రమోట్‌ కోసం ఇలా చెప్పడం సరికాదని హితవు పలుకుతుకున్నారు. 30 ఏళ్ల తర్వాత పిల్లలను కనాలనే ఆసక్తి అమ్మాయిలకు ఉండదని ఉపాసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.కాగా.. ఉపాసన, రామ్ చరణ్‌కు దాదాపు పెళ్లయిన 12 ఏళ్లకు క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఇంతకీ సమాజానికి ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు??You are just promoting your apollo ferlity centre that's it..Sorry @upasanakonidelaGaaru, you are misleading the young generations with this message.After 30 women loose intrest to have kids...Kindly spare our younger… pic.twitter.com/1JbRQhudVX— 𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్🇮 (@Mani_Karnika06) November 18, 2025

Balakrishna Akhanda 2 Thaandavam Movie Jajikaya Jajikaya Lyrical song out4
బాలయ్య అఖండ-2.. జాజికాయ వచ్చేసింది!

బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మారో చిత్రం అఖండ-2(Akhanda 2). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. జాజికాయ.. జాజికాయ అంటూ సాగే పాటను విడుదల చేశారు. వైజాగ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ పాటను లాంఛ్ చేశారు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. బ్రిజేశ్ శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు తమన్ సంగీతమందించారు.ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్‌లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

C Kalyan Fires On Ibomma Ravi At Telugu Film Chamber of Commerce Press Meet5
పైరసీ చేసేవాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయాలి: నిర్మాత సి.కళ్యాణ్‌

పైరసీ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్‌ చేశారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌. పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్‌కి సినీ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘వందలాది మంది కష్టం సినిమా. అలాంటి కష్టాన్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేను తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ సెక్రటరీగా ఉన్న సమయంలో.. యాంటీ వీడియో పైరసీ సెల్‌ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా? అని అప్పుడు చాలామంది అడిగారు. మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దానిని ప్రారంభించాం. కొందరు రిటైర్‌ పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు.పైరసీ అరికట్టేందుకు ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసి పైరసీ సెల్‌ ఎంతో కృషి చేసింది. ఇక్కడే కాదు విదేశీ సినిమాల విషయంలోనూ పైరసీని అరికట్టేందుకు ఈ విభాగం ఎంతో పని చేసింది. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్‌ దేశాలకు చెందిన సినీ పెద్దలను పైరసీ సెల్‌ని అభినందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ‘ఐబొమ్మ’ వాళ్లను పట్టుకోవడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు డిపార్ట్‌మెంట్‌కి టాలీవుడ్‌ తరపున ధన్యవాదాలు. పైరసీ అరికట్టడంతో ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తాం’ అన్నారు. ఫిలిం చాంబర్‌ అధ్యక్షకులు భరత్‌ భూషన్‌ మాట్లాడుతూ.. ‘ఛాంబర్ కు సంబంధించిన వీడియో పైరసీ సెల్ కూడా పైరసీకి అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తుంది. పైరసీ చేస్తున్న వాళ్ళను అరెస్ట్ చేసిన తెలంగాణా ప్రభుత్వానికి , సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు’ అన్నారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... " పోలీస్ వారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలను పైరసీలో చూస్తున్నారు అంటున్నారు. కానీ ఈ పరిస్థితి వల్ల మిగతా చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే సినిమా క్యూబ్, యుఎఫ్ఓ వెళుతున్న సంగతి అర్థమవుతుంది. వారి సర్వర్లు బలంగా ఉండేలా చూసుకోవాలి" అని అన్నారు.వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ... "సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. అది టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్‌గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకోవడం జరిగింది. అది సినీ పరిశ్రమకు వరం. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చి చూసే విధంగా టికెట్ ధరలు ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు" అని అన్నారు.

tollywood actor Josh Ravi Emotional Post After Father demise6
'గుండెలో బాధను దిగమింగుకుని'.. తండ్రి మరణం వేళ జోష్ రవి ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు, జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జోష్ రవి తండ్రి మరణించారు. గుండె పోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గతవారమే ఈ సంఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తన తండ్రి మరణంతో జోష్ రవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా అనేది నీకు సరదా..నాకు సినిమానే బతుకుదెరువు.. సినిమా నాకు సెంటిమెంట్.. అది నీకు జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమా అనేది నీకు వీకెండ్.. నాకు టిల్ మై లైఫ్ ఎండ్..అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నువ్వు కష్టాలు మర్చిపోవడానికి థియేటర్‌కు వస్తావ్.. నేను తండ్రి చనిపోయినా ఆ బాధను దిగమింగుకుని నవ్విస్తాను.. నీకు బాధ వస్తే ఏడుస్తావ్.. అదే నాకు వస్తే సినిమా చూస్తా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. తన తండ్రి చనిపోయినా కూడా బాధను దిగమింగుకుని షూటింగ్ పూర్తి చేశారు. ఇది చూస్తుంటే ఆయనకు సినిమాపై ఉన్న కమిట్‌మెంట్‌ ఏంటో అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు జోష్ రవికి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. 'జోష్' సినిమాతో నటుడిగా పరిచయమైన రవి.. తర్వాత జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించాడు. 'జబర్దస్త్' కామెడీ షోలోనూ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. View this post on Instagram A post shared by Ravi universe (@iamravi.josh_official)

Ari Director Jaya Shanker Shares His Career Starting Struggles7
టాప్‌ డైరెక్టర్ తిట్టాడు..ఆడియన్స్‌ క్లాప్స్‌ కొట్టారు: జయ శంకర్‌

‘ఇండస్ట్రీలో అవమానాలు కామన్‌.ఎదిగే క్రమంలో కొందరు కిందకు లాగాలని చూస్తుంటారు.అవన్నీ పట్టించుకోకుండా.. పనిపై శ్రద్ధ పెడితేనే సక్సెస్‌ ఉంటుంది’ అంటున్నాడు ప్రముఖ సినీ దర్శకుడు జయశంకర్‌(Jaya Shanker). పేపర్‌ బాయ్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత తాజాగా ‘అరి’(Ari )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జయశంకర్‌. ఇంతవరకు ఎవరూ టచ్‌ చేయని అరిషడ్వార్గాల కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 10న, యూఎస్‌ఏలో నవంబర్‌ 14న రిలీజై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన కెరీర్‌కు సబంధించి పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నాడు.‘పేపర్‌ బాయ్‌’ కంటే ముందు పలు చిత్రాలకు గోస్ట్‌ రైటర్‌గా పని చేసిన ఆయన...తన టాలెంట్‌తో సంపత్‌ నందిని మెప్పించి..తక్కువ సమయంలోనే దర్శకుడిగా మారాడు. అయితే కెరీర్‌లో ప్రారంభంలో అందరిలాగే తాను కూడా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడట. ‘చిత్ర పరిశ్రమలో విజయం సాధించాలంటే టాలెంట్‌తో పాటు ఓపిక కూడా ఉండాలి. మనం ఎదిగే క్రమంలో చాలా అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కెరీర్‌ ప్రారంభంలో ఒక టాప్‌ డైరెక్టర్‌ టీమ్‌లో పని చేశాను. ఓ సినిమా కోసం డైలాగులు రాస్తే..‘ఇవేం డైలాగులు..ఇలా ఉంటాయా?’ అని అందరి ముందే తిట్టాడు.ఆయన అవమానించినా..నేను మాత్రం అది చాలెంజ్‌గానే తీసుకున్నాను. నా బలం ఏంటో నాకు తెలుసు. ఆయన తిట్టాడని నా శైలీని వీడలేదు. సంపత్‌నంది దర్శకత్వం వహించిన ‘గౌతమ్‌ నంద’ సినిమాకు నా శైలీలోనే డైలాగులు రాస్తే.. థియేటర్స్‌లో ఆడియన్స్‌ చప్పట్లు కొట్టారు. పేపర్‌ బాయ్‌, అరి సినిమాల్లోని డైలాగ్స్‌పై కూడా చాలా మంది ప్రశంసించారు. నన్ను అవమానించిన ఆ టాప్‌ డైరెక్టర్‌ ఇప్పుడు ఇండస్ట్రీకే దూరం అయ్యాడు. అందుకే ఆడియన్స్‌కి నచ్చుతుందా లేదా అని కాకుండా మన మనసు నచ్చిన కథని అనుకున్నట్లుగా తెరపై చూపిస్తే.. అది కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని జయశంకర్‌ అన్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి చెబుతూ.. ‘అరి’ మాదిరే ఇది కూడా ఓ డిఫరెంట్‌ సబ్జెక్‌ అని చెప్పాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

TV Actress Manya Anand Accuses Dhanush Manager Of Casting Couch8
క్యాస్టింగ్ కౌచ్‌.. ధనుశ్ మేనేజర్‌పై నటి షాకింగ్ కామెంట్స్!

క్యాస్టింగ్ కౌచ్‌ అనే పదం బయటి వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్లకు తరచుగా ఈ పదం వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఎదుర్కొని ఉంటారు. కొందరు ఈ విషయాన్ని బయటకు చెబుతుంటారు. మరికొందరేమో సమాజానికి భయపడి తమలోనే దాచుకుంటారు. ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న ప్రముఖ బుల్లితెర నటి ఓపెన్ అయింది.తన కెరీర్‌లో ఎదురైన క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. కోలీవుడ్ బుల్లితెర నటి మాన్య ఆనంద్‌ తమిళంలో సుపరిచితమైన పేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తనను కమిట్‌మెంట్ అడిగారని షాకింగ్ కామెట్స్ చేసింది. హీరో ధనుశ్ మేనేజర్ శ్రేయాస్ కొత్త సినిమా కోసం తనను సంప్రదించారని తెలిపింది. ఈ మూవీ కోసం మీరు కమిట్‌మెంట్‌ ఇవ్వాలని అడిగారని క్యౌస్టింగ్ కౌచ్‌ అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అయితే తాను వెంటనే రిజెక్ట్‌ చేసి వెనక్కి వచ్చేశానని పేర్కొంది. అయినప్పటికీ తనకు ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్ వివరాలు, స్క్రిప్ట్ పంపాడని వెల్లడించింది. తాను నో చెప్పినా శ్రేయాస్ తనను చాలాసార్లు సంప్రదించాడని మాన్య ఆనంద్ తెలిపింది.అంతేకాకుండా మరో మేనేజర్ కూడా ఇదే సినిమా కోసం ఇలాంటి అభ్యర్థనతో తనను సంప్రదించాడని నటి పేర్కొంది. కాగా.. వనతై పోలా అనే తమిళ టీవీ సీరియల్‌లో మాన్య ఆనంద్ నటించింది. తాజాగా మాన్య చేసిన కామెంట్స్‌పై శ్రేయాస్ కానీ, ధనుష్ టీమ్‌ నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.

Actress Tulasi Announce Acting Retairment9
రిటైర్మెంట్ ప్రకటించిన టాలీవుడ్ 'అమ్మ'

ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు.. తాము తుదిశ్వాస వరకు నటిస్తూనే ఉంటామని చెబుతుంటారు. కానీ అవకాశాలు వస్తున్నా సరే వద్దని చెప్పి రిటైర్మెంట్ తీసుకునేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇప్పుడు సీనియర్ నటి తులసి అలాంటి షాకింగ్ ప్రకటన చేశారు. ఈ డిసెంబరు 31 తర్వాత తాను ఇకపై నటించనని అన్నారు. తర్వాత తన జీవితం సాయిబాబాకు అంకితం చేసేశానని ప్రకటించారు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.తులసి.. మూడు నెలల వయసు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చేశారు. తులసి తల్లి అలనాటి సావిత్రి స్నేహితురాలు. దీంతో 'జీవన తరంగాలు' అనే సినిమాలో ఊయలలో ఉండే పాపాయి పాత్ర కోసం తులసి తల్లిని అడిగారు. అలా తులసి.. తాను పుట్టిన 1967లో సినీ రంగ ప్రవేశం చేశారు.(ఇదీ చదవండి: భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేసిన సుమన్ శెట్టి)నాలుగేళ్లు వచ్చిన తర్వాత నుంచి బాలనటిగా వరస సినిమాలు చేశారు. అలా తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి భాషల్లో నటించింది. కన్నడ దర్శకుడు శివమణిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు నటనకు విరామం ఇచ్చారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తల్లి పాత్రలతో ఫేమ్ సొంతం చేసుకున్నారు. తెలుగులోనూ ప్రభాస్, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతో పాటు పలువురు స్టార్ హీరోయిన్లకు తల్లిగా నటించారు.గత కొన్నాళ్ల నుంచి చాలా పరిమితంగా మూవీస్ చేస్తున్న తులసి.. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న సాయిబాబా దర్శనానికి వెళుతున్నానని, ఆ రోజే తన రిటైర్మెంట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. తర్వాత సాయిబాబాకు సేవ చేసుకుంటూ బతికేస్తానని అన్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ నటి హేమ ఇంట్లో విషాదం) View this post on Instagram A post shared by Tulasi (@tulasiactress)

Actress Hema Mother Passes Away10
టాలీవుడ్ నటి హేమ ఇంట్లో విషాదం

తెలుగులో పలు సినిమాల్లో సహాయ నటిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న హేమ.. గతంలో బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. గత కొన్నాళ్లుగా అయితే మూవీస్‌లో యాక్ట్ చేయట్లేదు. కానీ గతేడాది ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలతో ఈమెని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బయటకొచ్చిన హేమ.. తను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పింది. కానీ తను జైలుకెళ్లడం చూసి తల్లి తట్టుకోలేకపోయిందని, అనారోగ్యానికి గురైందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇప్పుడు ఆరోగ్యం క్షీణించడంతో హేమ తల్లి తుదిశ్వాస విడిచింది.హేమ తల్లి కోళ్ల లక్ష‍్మి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు. సోమవారం రాత్రి ఈమె తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న హేమ.. స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. నిన్న ఉదయం తనతో బాగానే మాట్లాడిందని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని చెబుతూ గట్టిగా ఏడ్చేసింది.

Advertisement
Advertisement