Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Aadu 3 OTT Streaming date of Malayalam blockbuster fantasy comedy film1
ఓటీటీకి వంద కోట్ల సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మలయాళ సినిమాలు ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. అక్కడి హిట్ ‍అయిన చిత్రాలు తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఓటీటీల్లో ఎక్కువగా మలయాళ చిత్రాలకే డిమాండ్ ఉంటోంది. ఇటీవల స్ట్రీమింగ్‌ వచ్చేసిన సంభవం అధ్యాయం ఒన్ను సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిధున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్‌లో వచ్చిన ఆడు 3: వన్ లాస్ట్ రైడ్: పార్ట్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం జీ5 వేదికగా మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ ప్రియులను మెప్పిస్తుందేమో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో జయసూర్య, వినాయకన్, ఇంద్రన్స్, ధర్మజన్, సైజు కురుప్, అల్లేయ బోర్న్ కీలక పాత్రల్లో నటించారు. #Aadu3 (Malayalam) Streaming from May 1 on Zee5 in Malayalam, Tamil, Telugu, Kannada & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/eJURte08qN— OTT Trackers (@OTT_Trackers) April 23, 2026

Kollywood Actress Akshaya Hariharan Bad Experience at Voting In Tamilnadu2
తమిళనాడు ఎన్నికలు.. హీరోయిన్‌కు చేదు అనుభవం

ప్రముఖ నటి అక్షయ హరిహరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్‌కు గురైంది. అడయార్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్‌ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని కోరినట్లు అక్షయ హరిహరన్ తెలిపింది. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరింది. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన ఓటు వేసేందుకు వచ్చిన సెలబ్రిటీకి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాగా.. అక్షయ హరిహరన్ తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. సబా నాయగన్, రంగోలి, బ్లడీ బగ్గర్, హే సినామికా లాంటి సినిమాల్లో మెప్పించింది. నా ఓటు వేరే వాళ్లు వేశారని తెలిసి షాక్ అయ్యాను: నటి అక్షయ హరిహరన్ఓటు వేసేందుకు అడయార్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లానుకానీ అప్పటికే నా పేరుతో వేరే వ్యక్తి ఓటు వేసినట్లు తెలిసి షాక్ అయ్యానునా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని… pic.twitter.com/SJtyWZkQ8L— ChotaNews App (@ChotaNewsApp) April 23, 2026

After Breakup With Tamannaah, Vijay Varma Spotted With Aaliyah Qureishi3
కొత్త బ్యూటీతో విజయ్‌ డేటింగ్‌.. ఎవరీ అలియా?

సినీ తారలకు ప్రేమ, పెళ్లిళ్లు ఎంత కామనో.. బ్రేకప్‌, విడాకులు కూడా అంతే కామన్‌. ఎప్పుడు ఎందుకు ప్రేమలో పడతారో..ఎందుకు విడిపోతారో తెలియదు. ఇలా ప్రేమ విషయాన్ని బయటపెట్టి..అలా బ్రేకప్‌ చెప్పుకుంటారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పి.. కొన్నాళ్లకే బ్రేకప్‌ అయిపోయిందటారు. అలా విడిపోయి సడెన్‌ షాక్‌ ఇచ్చిన వారిలో విజయ్‌ వర్మ-తమన్నా జంట ఒకటి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. కొన్నాళ్ల క్రితం విడిపోయి అందరికి షాకిచ్చింది. తమన్నాతో బ్రేకప్‌ తర్వాత విజయ్‌ పలువురు హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దంగల్‌ బ్యూటీ ఫాతిమా సనాతో ప్రేమలో పడ్డాడనే వార్తకు కూడా వినిపించాయి. కానీ ఫాతిమా ఆ వార్తలను ఖండించింది. ఆ తర్వాత విజయ్‌ మరో యంగ్‌ బ్యూటీతో రిలేషన్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమే అన్నట్లుగా వాలెంటైన్స్‌ డే రోజు ఓ అమ్మాయి చేతిలో చేయి వేస్తున్న ఫోటోని షేర్‌ చేసి..దానికి లవ్‌ ఎమోజీనీ జోడించాడు. ఈ పోస్ట్‌ని ఖుషి అహుజా అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడ్డాడని అనుకున్నారు.తాజాగా ఆ బ్యూటీ పేరు బయటకు వచ్చింది. విజయ్‌ వర్మ ప్రస్తుతం నటి అలియా ఖురేషితో రిలేషనల్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. అలియా ఖురేషితో కలిసి విజయ్ వర్మ ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు రావడం, ఒకే కారులో కలిసి వెళ్లడంతో ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నరానే పుకార్లు బయటకు వచ్చాయి.ఎవరీ ఖురేషీ?షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలోని గర్ల్ గ్యాంగ్‌లో ‘జాన్వి’పాత్రలో మెరిసిన బ్యూటీనే అలియా ఖురేషి. నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. ఇన్‌స్టాలో ‘ఝాలివర్స్’ పేరుతో ఉన్న ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. ప్రముఖ మ్యూజికల్ సిరీస్ 'బందిష్ బాండిట్స్' రెండవ సీజన్‌లో అనన్య పాత్రలో కనిపించింది. తాజాగా ఇభ్రహీం అలీఖాన్‌, ఖుషీ కపూర్‌ల ‘ నదానియన్’ మూవీలో కీలక పాత్ర పోషించింది. మరి నిజంగానే విజయ్ - అలియాలు ప్రేమలో ఉన్నారా? లేక జస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రమేనా అనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. Vijay Varma was spotted with rumoured girlfriend Alia Qureshi at Mizu Restaurant in Bandra, sparking fresh dating buzz.#VijayVarma #AliaQureshi #CelebSpotted #Bollywood #DatingRumours #Mumbai pic.twitter.com/aMnpXoolNq— The Daily Jagran (@TheDailyJagran) April 21, 2026

Ram Charan Peddi Movie Item Song Actress Name Goes Viral4
పెద్ది ఐటమ్ సాంగ్‌.. ఎట్టకేలకు స్టార్ హీరోయిన్‌ ఫిక్స్..!

రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండడంతో ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్‌కు షిఫ్టయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్‌ కోసం హీరోయిన్‌ ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. రోజుకొక హీరోయిన్ పేరు వినిపిస్తున్న వీటిపై అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇటీవలే సంయుక్త మీనన్‌ ఈ ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస అని పలువురు కూడా తెరపైకొచ్చాయి. కానీ అంతలోనే ఊహించని మరో స్టార్ హీరోయిన్‌ పేరు బయటకొచ్చింది. పెద్ది ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతి హాసన్‌ చేయనుందని లేటేస్ట్‌ టాక్ నడుస్తోంది. దాదాపు శృతిని మేకర్స్ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఒకవేళ ఇదే నిజమైతే పెద్ది సరసన శృతి హాసన్ చిందులేయనుంది. ఈ ఐటమ్ సాంగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ‍హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు.

Adivi Sesh Dacoit Movie Ticket Price Reduced5
అప్పుడు మేజర్.. ఇప్పుడు డెకాయిట్.. మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్

టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. ఇప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. తాజాగా డెకాయిట్ మూవీ టీమ్ గుడ్ న్యూస్‌ చెప్పింది. సినీ ప్రియులకు ఊరట కల్పించేలా టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్‌లో షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గించారు. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, రూ.70గా ధరలు నిర్ణయించారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, రూ.80, రూ.50గా ఖరారు చేశారు. టీజీలోని అన్ని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రం రూ.150గా ఫిక్స్ చేశారు. తగ్గించిన ధరలు ఈనెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాగా.. గతంలో మేజర్ సినిమాకు కూడా ఇదే తరహాలో టికెట్ ధరలు తగ్గించారని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో డెకాయిట్ మూవీని థియేటర్లలో చూడాలనుకున్నావారికి అదిరిపోయే గుడ్ న్యూస్‌ చెప్పారు. ఈ మూవీని సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ఠాకూర్‌, అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. Thank you for all the LOVE ❤️‍🔥❤️‍🔥❤️‍🔥Appudu #MAJOR ki Lowest Ticket PriceIppudu #DACOIT ki. We called the Theaters and Spoke to them about Lowering Ticket Prices ❤️‍🔥❤️‍🔥❤️‍🔥ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరల్లో:👉 ఆంధ్రప్రదేశ్ – ₹105, ₹70👉 తెలంగాణ – ₹105, ₹80, ₹50… pic.twitter.com/63Cq0H0Q4m— Adivi Sesh (@AdiviSesh) April 23, 2026

the Kerala Story Actress Adah Sharma announced one more interesting Film6
ఆదా శర్మ.. మరో సెన్సేషనల్‌ సినిమా

ది కేరళ ‍స్టోరీ మూవీతో సెన్సేషనల్‌ హిట్ ‍కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్‌గా నిలిచింది.తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్‌ ది సైలెంట్ సేవియర్‌ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్‌ పోస్టర్‌ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్‌లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్‌ టైటిల్‌తోనే ఈ మూవీ థీమ్‌ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. My next ❤️GOVERNOR releasing in cinemas on 12th June, 2026.We are a world power todaybecause an unsung hero fought an untold war.GOVERNOR releasing in cinemas on 12th June, 2026.@BajpayeeManoj @adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha… pic.twitter.com/QdlMFeeM0v— Adah Sharma (@adah_sharma) April 23, 2026

VTV Ganesh Says He Cast Vote For TVK, Predict VIjay As A Tamil Nadu CM7
నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్‌ సీఎం అవుతాడు: వీటీవీ గణేష్

తమిళనాడులో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. సినీ నటుడు విజయ్‌ పార్టీ టీవీకే కూడా ఈ సారి పోటీలో ఉండడంతో సినీ తారలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. రజనీకాంత్‌, ధనుష్‌, త్రిష, మణిరత్నం, అజిత్‌, శృతీహాజన్‌తో పాటు పలువురు తమిళ స్టార్స్‌ ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు వీటీవీ గణేష్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్​లో ఓటు వేశాడు. అనంతరం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా పలకరించగా, తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్‌ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్‌ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ పర్‌ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను. టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, విజయ్‌ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్‌ కూడా తిరుచురాపల్లి ఈస్ట్‌, పెరంబూర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.#WATCH | Tamil Nadu Elections 2026 | Actor VTV Ganesh says, "I cast my vote to TVK. Vijay is a perfect fit to upgrade the society, people and the system... I want him to become the CM..."He also says, "Young voters should exercise their voting rights..." pic.twitter.com/RWJ5mc5ydS— ANI (@ANI) April 23, 2026

Singer Mangli Post On Micro Finance Scam Allegations8
కొన్ని దుష్టశక్తులు నాపై కుట్ర: సింగర్ మంగ్లీ మరో పోస్ట్

సింగర్ మంగ్లీ వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్‌ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగిందని తెలిపింది. వాళ్లకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని వెల్లడించింది. బాధితుల తరఫున అండగా ఉంటానని గతంలో చెప్పానని.. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నానని పేర్కొంది. ఈ ఆర్థిక మోసాలతో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నానని మంగ్లీ తెలిపింది.కానీ కొందరు వ్యక్తులు, దుష్ట శక్తులు అదే పనిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజం ఏంటనేది నిలకడపై తెలుస్తుందని.. న్యాయ వ్యవస్థ, చట్టాలపై తనకు పూర్తిగా నమ్మకముందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli)

actress Ranya Rao Walk Out Of parappana Jail After Years9
ఏడాది తర్వాత సినీ నటి రన్యారావు విడుదల

బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు విడుదల అయ్యారు. విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ఏడాదిలోనే 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ కేసు నమోదు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆమెను ఇక విచారించబోదని తెలిపారు. గత ఏడాది మార్చిలో రన్యారావు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్‌ గడువు ముగియడాన్ని కూడా డీఆర్ఐ అధికారులు సవాలు చేయబోదని, గడువు పొడిగింపు కోరడం లేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో బెంగళూరులోని ఆర్థికనేరాల నియంత్రణ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు తీర్పు అనంతరం పరప్పన అగ్రహార కారాగారం నుంచి రన్యారావు విడుదలయ్యారు.

Deepika Padukone Getting Replaced In Allu Arjun Raaka, Team Respond10
‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్‌ క్లారిటీ

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపికపై రకరకాల రూమర్స్‌ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే ఆమె ఒప్పుకున్న ‘రాకా’ మూవీ నుంచి కూడా తప్పుకున్నట్లు సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వచ్చాయి. ప్రెగ్నెంట్‌తో ఆమె షూటింగ్‌లో పాల్గొనడం కష్టం అని తెలిసి.. దీపిక స్థానంలో మరో నటిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ‘రాకా’ టీమ్‌ స్పందించింది. దీపికను తొలగించారనే వార్తల్లో నిజం లేదని టీమ్‌ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలిసిన తర్వాత ఆమె పాత్ర నిడివిని తగ్గించారనే ప్రచారాన్ని కూడా టీమ్‌ ఖండించింది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని.. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే షూటింగ్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.అల్లు అర్జున్‌-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో దీపిక కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె పాత్రకు యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉన్నాయట. గర్భం దాల్చినప్పటికీ.. యాక్షన్‌ సీన్స్‌ చేసేందుకు దీపిక ఒప్పుకుందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్‌ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో దీపికతో పాటు రష్మిక, జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్‌ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇప్పటికే విలన్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. త్వరలోనే హీరో పాత్రకు సంబంధించిన లుక్‌ కూడా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. హీరో పాత్రలో బన్నీ స్టైలీష్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement