ప్రధాన వార్తలు
జన నాయకుడు జగన్తో 'జన నాయగన్'
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ కలిశారు. చెన్నైలో జరిగిన జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చొని ఉన్న వీడియో విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో జన నాయకుడు వైఎస్ జగన్తో జన నాయగన్ విజయ్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.TVK Chief Thalapathy #Vijay With YSRCP Chief Political SuperStar #YSJagan🔥pic.twitter.com/UU49hP6JaP— cinee worldd (@Cinee_Worldd) February 8, 2026
‘వారణాసి’ కోసం రాజమౌళి, మహేశ్ కొత్త స్ట్రాటజీ!
ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఒక్కటే నిర్వహించారు. ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్స్ షురూనే చేయలేదు కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఓ రేంజ్లోకి వెళ్లిపోయాయి. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాకు గాను జక్కన్న, మహేశ్ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారట. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఒక్క రూపాయి తీసుకోవద్దని ఫిక్స్ అయ్యారట.గత సినిమాలకు కూడా రాజమౌళి పూర్తిగా పారితోషికం తీసుకునేవాడు కాదు. కొంతమేర రెమ్యునరేషన్గా తీసుకొని.. మిగతాది లాభాల్లో వాటాగా తీసుకునేవాడు. కానీ ఈ సినిమాకు మాత్రం ఒక్క రూపాయి తీసుకోకుండానే పని చేస్తున్నాడట. పారితోషికంగా ఓవర్సీస్ రైట్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు కూడా ఒక్క పైసా తీసుకోకుండా, నిర్మాణంలో భాగస్వామి అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఉన్న బజ్ దృష్ట్యా..కచ్చితంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం.. ఊహించని కలెక్షన్స్ రావడం ఖాయం. ఈ లెక్కన అటు జక్కన్నకు, ఇటు మహేశ్కు రెగ్యులర్గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే అందే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఓవర్సీస్లో రైట్స్ తీసుకోవడం ద్వారా జక్కన్నకు రూ. 150 కోట్లకు పైనే లాభం వచ్చే చాన్స్ ఉంది. అలాగే నిర్మాణం భాగస్వామ్యం అయిన మహేశ్కు రూ. 150-200 కోట్ల వరకు రావొచ్చు. మహేశ్బాబు ఇందులో రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
బిగ్బాస్ అగ్నిపరీక్ష ద్వారా పాపులర్ అయింది శ్రీజ దమ్ము. పేరుకు తగ్గట్లుగానే షోలో తన దమ్ము చూపించి తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టింది. కానీ మొదట్లో ఓవర్ యాటిట్యూడ్ చూపించి విమర్శలపాలైంది. అయితే తన ముక్కుసూటితనం, ఆటతీరు వల్ల అభిమానులను సైతం సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్ ఇతరత్రా విషయాలను పంచుకుంది.ట్రోలింగ్శ్రీజ దమ్ము మాట్లాడుతూ.. మా నాన్న జీవీఎంసీ (మహా విశాఖ నగర పాలక సంస్థ) ఉద్యోగి (పారిశుద్ధ్య కార్మికుడు). నేను బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఓసారి చీర దోపుకుని చెత్త బ్యాగులు పట్టుకెళ్లాను. దానికి విపరీతంగా ట్రోల్ చేశారు. తడిచెత్త, పొడిచెత్త అమ్ముకునేలా ఉంది.. సరిగ్గా సరిపోయింది అని విమర్శించారు. అది చూసి నేను నవ్వుకున్నాను. అందుకు సంతోషంకానీ, మా నాన్న చేసే పని అదే కావడంతో ఇంట్లో వాళ్లు బాధపడ్డారు. ఏదేమైనా బిగ్బాస్కు వెళ్లి నాకంటూ ఓ పేరు సంపాదించుకున్నందుకు హ్యాపీ. కానీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్స్తో గేమ్ ఆడించి బయటకు పంపించినందుకు బాధగా అనిపించింది. నాకే ఎందుకిలా జరుగుతుందని ఏడ్చాను. ఇప్పుడు తల్చుకున్నా బాధనిపిస్తుంది.నేను పెళ్లి చేసుకునేవాడు..పార్టీలు, పబ్బులకెళ్తా.. కానీ, మందు మాత్రం తాగను. నాకు కాబోయే భర్త తాగుడుకు బానిసైతే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా.. ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి హైట్ ఉండాలి, జుట్టుండాలి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. రేపు నేను ఉద్యోగం చేసినా, చేయకపోయినా, ఖాళీగా ఉన్నా అతడే అన్నీ చూసుకునేలా ఉండాలి. నాకయితే ప్రేమపెళ్లి చేసుకోవాలని ఉంది. నేనంటే పడి చచ్చిపోయేవాడు కావాలి.నా జీవితం నా ఇష్టంనా డ్రెస్సింగ్పై వచ్చే ట్రోల్స్ పట్టించుకోను. నేను షార్ట్ వేసుకుంటా.. టీషర్ట్ వేసుకుంటా.. నీకెందుకు? నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్లుగా బట్టలు వేసుకుంటాను. ఇకపోతే సొంతింటి కల ఒక్కటే నాకున్న పెద్ద డ్రీమ్. ఇంతవరకు నేనెప్పుడూ సంతోషంగా లేను. ఏదో లైఫ్ ముందుకెళ్తుందా? అంటే వెళ్తుందంతే! ప్రశాంతమైన జీవితం దొరికితే సంతోషంగా ఉంటాను. అలా అని డిప్రెషన్లో లేను. బిగ్బాస్ కోసం రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశా.. ఇప్పుడుమ మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను అని శ్రీజ చెప్పుకొచ్చింది.చదవండి: సర్వం మాయ బ్లాక్బస్టర్ హిట్.. తండ్రికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు
రోజుకు 15 సార్లు వాంతులు.. నరకం చూశా: సుప్రిత
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హల్ చేసిన ఈ బ్యూటీ..ఇకపై వెండితెరపై సందడి చేయబోతుంది. ఆమె హీరోయిన్గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది సుప్రిత. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల అనారోగ్యానికి గురైనప్పుడు..తన మానసిక పరిస్థితి ఎలా ఉందో వివరించింది.ఒత్తిడితో ఎక్కువ తీసేశా.. ఆ మధ్య నేను కాస్త బరువు పెరిగా. అందరూ నన్ను లావు అయ్యావు అనడంతో ఒత్తిడికి లోనయ్యా. నేను ఒత్తిడికి లోనైన ప్రతిసారి ఇంకాస్త ఎక్కువే తింటాను. అలా తినడంతో బరువు పెరిగిపోయా. దీంతో వెంటనే తగ్గాలని ఒక పూట తినడం ప్రారంభించా. ప్రతి రోజు 12-15 గంటల పాటు ఏం తినకుండా ఉండేదాన్ని. ఒక పూట మాత్రం ఏదైనా తీనేదాన్ని. ఎక్కువగా బిర్యానీలు తీనడంతో ఆరోగ్యం దెబ్బతింది. ఆస్పత్రిలో చేరాను. అక్కడ దాదాపు 15 రోజుల పాటు నరకం చూశా. మంచి నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి. 20 రోజుల పాటు అన్నమే తినలేదు. రోజుకు 15 సార్లు వాంతులు అయ్యేవి. ఒకనొక దశలో నేను బతకనేమో అనుకున్నా. నా వల్ల అమ్మతో పాటు స్టాఫ్ అంతా ఇబ్బంది పడింది. ఆస్పత్రిలో వారిని చూసి నాకే బాధకలిగింది. ఈ నరకం భరించడం కంటే..ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి చంపేస్తే బాగుండు అనుకున్నా. కానీ దేవుడి దయతో కోలుకున్నా. ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను’ అని సుప్రీతి చెప్పుకొచ్చింది.ఆ ఇద్దరికి సిస్టర్గా నటించలేనుఇక ఇదే ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు హీరోయిన్గా మాత్రమే కొనసాగాలని లేదని.. మంచి స్క్రిప్ట్ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేస్తానని చెప్పింది. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్కు సిస్టర్గా నటించే అవకాశం వస్తే వదులుకోను. ఈ ఇద్దరనే కాదు.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, అఖిల్ తప్ప వేరే ఏ హీరోకి అయినా సిస్టర్గా నటిస్తా. విజయ్ దేవరకొండ, అఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. పదో తరగతి పాస్ అయితే అఖిల్తో డిన్నర్కి తీసుకెళ్తా అని అమ్మ మాట ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు. అఖిల్, విజయ్ నేరుగా కనిపిస్తే..షాకులో ఉండిపోతానేమో’ అని సుప్రిత చెప్పుకొచ్చింది.
బిగ్బాస్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
యాక్సిడెంట్తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
2009లో ఇండస్ట్రీలోకి.. ఇన్నాళ్లకు నటిగా..: స్రవంతి స్పీచ్
A to Z
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించ...
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం...
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంద...
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సిని...
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా '...
డేట్ ఫిక్స్
ఈ వేసవిలో ‘భూత్ బంగ్లా’ తలుపులు తెరుచుకుంటాయని అం...
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుక...
'ధురంధర్' సినిమా కోసం 3 కేరవాన్స్ అడిగిన హీరో?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నట...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
పూజా హెగ్డే మోనికా సాంగ్.. ఐదేళ్ల బుడ్డోడు అదుర్స్..!
గతేడాది సూపర్స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూల...
13 ఏళ్ల మిర్చి .. అనుష్క సినిమాల్లో.. శేఖర్ కమ్ముల హీరోయిన్ ఎక్కడ?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మ...
అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నటి శరణ్య కూతురు రిసెప్షన్ గ్రాండ్గా జరిగ...
ధనుష్-సాయిపల్లవి-శ్రీలీల సినిమా షురూ
ధనుష్ హీరోగా నటిస్తున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్...
ఫొటోలు
ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
'అమరావతికి ఆహ్వానం' హారర్ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)
కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)
‘యుఫోరియా’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
బ్లూ డ్రెస్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)
గాసిప్స్
View all
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
"ది ప్యారడైజ్" రిలీజ్పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్లోనే!
సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ?
రివ్యూలు
View all
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
2.75
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'స్పిరిట్'. సందీప్ వంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మొదలైంది. త్వరలో విదేశాలకు కూడా వెళ్లనున్నారు. కొన్నిరోజుల క్రితమే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అంతకు ముందు న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలి అంచనాలని పెంచేశారు. ఇప్పుడీ చిత్రం నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమా నుంచి కొన్నాళ్ల క్రితం ఆడియో గ్లింప్స్ ఒకటి వదిలారు. ఇందులో ప్రభాస్, ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు వాయిస్ ద్వారా అర్థమైంది. హీరోయిన్ తృప్తి దిమ్రి కాగా వివేక్ ఒబెరాయ్ కూడా ఉన్నాడని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ప్రకాశ్ రాజ్.. ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారట. ఈ మేరకు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే ప్రకాశ్ రాజ్ తప్పుకోవడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సులే కారణమని మాట్లాడుకుంటున్నారు. సందీప్ వర్కింగ్ స్టైల్ గానీ సినిమా తీసే విధానం మిగతా దర్శకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మరి ఎక్కడ సమస్య వచ్చిందో గానీ ప్రకాశ్ రాజ్ తప్పుకొన్నారనే విషయం చర్చనీయాంశమవుతోంది. మరి ఇదే నిజమైతే ఇతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి?
హైదరాబాద్లో సమావేశమైన 'అల్లు అర్జున్' ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్లో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై తాజాగా చర్చించారు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు.టాలీవుడ్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఆ సమయంలో తను చెప్పాలనుకున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యాడు. బన్నీ తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్ చేసేవారు లేరు. అందుకే ఫ్యాన్స్ కొరతను ఆయన గ్రహించారని తెలుస్తోంది.
విశ్వక్ సేన్కు భవిష్యత్ ఉంది.. గొడవకు 'అర్జున్' ఫుల్స్టాప్
ప్రముఖ నటుడు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా 'సీతాపయనం'.. ఇదే మూవీతో తన కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో నిరంజన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను మొదట విశ్వక్ సేన్ హీరోగా ప్రకటించారు. కానీ, పలు విభేదాల కారణంగా అతను వాకౌట్ చేశాడు. అయితే, యాదృచ్చికంగా, విశ్వక్ చిత్రం ఫంకీతో పాటు 'సీతాపయనం' కూడా వాలెంటైన్స్ డే స్పెషల్గా విడుదలవుతోంది. తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ గురించి అర్జున్ పలు వ్యాఖ్యలు చేశారు.గతంలో విశ్వక్తో జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ అడిగిన ప్రశ్నకు అర్జున్ ఇలా సమాధానం ఇచ్చారు. మా సినిమా సీతాపయనంతో పాటు విశ్వక్ సేన్ మూవీ ఫంకీ కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అతనొక యువకుడు.. తనకు చాలా భవిష్యత్ ఉంది. ఏదో మనకు కుదరలేదని అతనిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. వారి అమ్మగారి చేతి భోజనం తిన్నాను. వాళ్లు బాగుండాలని కోరుకుంటాను. కాలంతో పాటు కొన్ని మరిచిపోతూ సంతోషంగా ముందుకు సాగాలి. మా రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను అని అర్జున్ అన్నారు.విశ్వక్పై అర్జున్ చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ నుంచి అభినందనలు వస్తున్నాయి. పెద్దరికం ఎలా ఉంటుందో చూపించావ్ అంటూ అర్జున్ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అర్జున్ కూతురు హీరోయిన్గా విశ్వక్ సేన్తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే, షూటింగ్ కొంత జరిగిన తర్వాత పలు కారణాలతో విశ్వక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్, విశ్వక్ మధ్య మాటల గొడవ జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Crazziee Stuff (@crazziee_stuff)
స్టార్ హీరోయిన్ సీమంతం.. సందడిగా సెలబ్రిటీలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్కపూర్ త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్.. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజను 2018లో పెళ్లి చేసుకుంది. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కొడుకు (వాయు)ను స్వాగతించారు. గతేడాది నవంబర్లో సోనమ్ తన బేబీ బంప్ను రివీల్ చేస్తూ రెండవ గర్భధారణను ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ ఆనందాన్ని బంధువులు, సన్నిహితులతో పంచుకుంటూ ముంబైలోని తమ నివాసంలో బేబీ షవర్(సీమంతం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. కరీనా కపూర్ , అనిల్ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, భూమి పెడ్నేకర్, షబానా అజ్మీ ఈ కార్యక్రమంలో సందడిగా కనిపించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరే కూడా సోనమ్ నివాసంలో కనిపించారు. తరువాత, అనుపమ్ ఖేర్, మసాబా గుప్తా, కునాల్ రావల్, సంజయ్ కపూర్ ఇతరులు కూడా వచ్చారు. Mothering glow, Sonam 🤍✨#SonamKapoor pic.twitter.com/2ARGdBSXnh— 𝙰𝚍𝚊𝚛𝚜𝚑 (@_Adarsh______) February 2, 2026#KareenaKapoorKhan arrived looking stunning as ever for #SonamKapoor's baby shower. ♥️#FilmfareLens pic.twitter.com/jfSHD1Gvs2— Filmfare (@filmfare) February 8, 2026
బరిలోకి దిగుతున్న 'సంక్రాంతి సోగ్గాళ్లు'
‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ను అధికారికంగా అన్నపూర్ణ స్టూడియో ప్రకటించింది. అయితే, పూర్తి క్లారిటీ కాకుండా ఒక పంచ్ డైలాగ్తో పోస్ట్ చేశారు. 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2022 సంక్రాంతికి సీక్వెల్గా బంగార్రాజు వచ్చాడు. అయితే, 2027 సంక్రాంతికి మరో సీక్వెల్ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. వాసివాడి తస్సాదియ్యా అంటూ.. 2027 జనవరి 15న సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్గా ఉంటాది కదా అని డేట్ మార్క్ చేసుకోమని పోస్ట్ చేశారు.దర్శకుడు కల్యాణ్కృష్ణ కురసాల ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి హిట్ కొట్టడమే కాకుండా బంగార్రాజు సీక్వెల్తో మెప్పించాడు. దీంతో ఇదే ప్రాంఛైజీలో మరో సినిమా రానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ చేసిన పోస్ట్తో ఒక క్లారిటీ ఇచ్చేసింది. కల్యాణ్కృష్ణ, నాగార్జున కలిసి పార్ట్-3 ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో మరిన్ని విషయాలు వెల్లడించే ఛాన్స్ ఉంది. రాబోయే సంక్రాంతికి సీనియర్ హీరోలు అందరూ పోటీలో ఉన్నారు. చిరంజీవి- బాబీ సినిమాతో పాటు బాలకృష్ణ- గోపీచంద్ మలినేని, వెంకటేశ్- అనిల్ రావిపూడి సినిమాలు రేసులో ఉన్న విషయం తెలిసిందే.వాసివాడి తస్సాదియ్యా 💫✨వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా💥 🔥🔥 డేట్ మార్క్ చేసుకోండి 🤩— Annapurna Studios (@AnnapurnaStdios) February 8, 2026
అర్ధరాత్రి రజనీతో బైక్ రైడ్.. అనిరుధ్ తండ్రి మమ్మల్ని అడ్డుకుని!
దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టిన రాధికా శరత్కుమార్ ఈసారి చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ "తాయి కిళవి". ఈ చిత్రంలో తను ఊరిలో రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.బైక్పై తిరిగాంఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఒకరోజు రజనీకాంత్, నేను బైక్పై చెన్నై అంతా తిరిగాం. నేను ఇక్కడే తిన్నాను, ఇక్కడే నిద్రపోయాను, ఇక్కడే కొన్నాళ్లు ఉన్నానంటూ రజనీ తను తిరిగిన ప్రదేశాలన్నీ నాకు చూపించాడు. రజనీ లైఫ్ స్టోరీ తన నోటి నుంచి వింటున్నప్పుడు చలించిపోయాను.జీవితంలో అనేక కష్టాలుఇన్ని కష్టాలు పడ్డాడా? అని ఫీలయ్యాను. చాలామంది జీవితంలో అనేక కష్టాలు చూసుండొచ్చు. కానీ, రజనీకాంత్ తన బాధ, కష్టం, శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని అట్టడుగు స్థాయి నుంచి తారాస్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే మేము అలా బైక్పై తిరుగుతూ ఉంటే సడన్గా ఒక కారు మమ్మల్ని చేజ్ చేసుకుంటూ వచ్చి మా ముందు ఆగింది. నాకు ఒక్కసారిగా భయమేసింది. సీక్రెట్ షికారు అనుకుని..అయితే వచ్చింది మరెవరో కాదు, రజనీకాంత్ భార్య లత సోదరుడు, నటుడు రాఘవేంద్ర. రజనీకాంత్ అర్ధరాత్రి ఒక మహిళను వెంటేసుకుని రహస్యంగా షికార్లు చేస్తున్నాడని భావించి మమ్మల్ని ఆపేందుకు వచ్చాడు. కానీ.. రజనీ, నేను షికారుకు వెళ్లామని లతకు ముందే తెలుసు. దీంతో అతడి ఆందోళన నీరుగారిపోయింది అని చెప్పుకొచ్చింది. కాగా రజనీకాంత్ భార్య, నిర్మాత, సింగర్ లత తమ్ముడే నటుడు రవి రాఘవేంద్ర. ఈయన కుమారుడు అనిరుధ్ రవిచందర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు.చదవండి: సంతోషంగా లేను, మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు: శ్రీజ దమ్ము
జన నాయకుడు జగన్తో 'జన నాయగన్'
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ కలిశారు. చెన్నైలో జరిగిన జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చొని ఉన్న వీడియో విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో జన నాయకుడు వైఎస్ జగన్తో జన నాయగన్ విజయ్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.TVK Chief Thalapathy #Vijay With YSRCP Chief Political SuperStar #YSJagan🔥pic.twitter.com/UU49hP6JaP— cinee worldd (@Cinee_Worldd) February 8, 2026
‘వారణాసి’ కోసం రాజమౌళి, మహేశ్ కొత్త స్ట్రాటజీ!
ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఒక్కటే నిర్వహించారు. ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్స్ షురూనే చేయలేదు కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఓ రేంజ్లోకి వెళ్లిపోయాయి. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాకు గాను జక్కన్న, మహేశ్ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారట. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఒక్క రూపాయి తీసుకోవద్దని ఫిక్స్ అయ్యారట.గత సినిమాలకు కూడా రాజమౌళి పూర్తిగా పారితోషికం తీసుకునేవాడు కాదు. కొంతమేర రెమ్యునరేషన్గా తీసుకొని.. మిగతాది లాభాల్లో వాటాగా తీసుకునేవాడు. కానీ ఈ సినిమాకు మాత్రం ఒక్క రూపాయి తీసుకోకుండానే పని చేస్తున్నాడట. పారితోషికంగా ఓవర్సీస్ రైట్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు కూడా ఒక్క పైసా తీసుకోకుండా, నిర్మాణంలో భాగస్వామి అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఉన్న బజ్ దృష్ట్యా..కచ్చితంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం.. ఊహించని కలెక్షన్స్ రావడం ఖాయం. ఈ లెక్కన అటు జక్కన్నకు, ఇటు మహేశ్కు రెగ్యులర్గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే అందే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఓవర్సీస్లో రైట్స్ తీసుకోవడం ద్వారా జక్కన్నకు రూ. 150 కోట్లకు పైనే లాభం వచ్చే చాన్స్ ఉంది. అలాగే నిర్మాణం భాగస్వామ్యం అయిన మహేశ్కు రూ. 150-200 కోట్ల వరకు రావొచ్చు. మహేశ్బాబు ఇందులో రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లగ్జరీ ఇల్లు కొన్న బాలీవుడ్ హీరో
'హోంబౌండ్' సినిమా హీరో ఇషాన్ ఖట్టర్ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. నవరోజ్ అపార్ట్మెంట్లోని 14వ నెంబర్ ఫ్లాట్ను తన సొంతం చేసుకున్నాడు. దీని విలువ రూ.29.37 కోట్లు అని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కింద అదనంగా రూ.1.76 కోట్లు ఖర్చు చేశాడని సమాచారం.సినిమాఇషాన్ ఖట్టర్ చిన్న వయసులోనే ఇల్లు సొంతం చేసుకోవడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్- రాజేశ్ ఖట్టర్ ఇద్దరూ కూడా యాక్టర్సే కావడం విశేషం! ఇషాన్ ఖట్టర్.. గతంలో కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగానూ పని చేశాడు. బియాండ్ ద క్లౌడ్స్, ధడక్, ఖాలీ పీలి ఫోన్ బూత్, పిప్పా వంటి పలు హిందీ సినిమాలు నటించాడు.ఆస్కార్ రేసు నుంచి అవుట్గతేడాది రిలీజైన హోంబౌండ్ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సత్తా చాటింది. అంతేకాదు ఆస్కార్ రేసులో అడుగుపెట్టి అంచనాలు పెంచేసింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో భారత్ నుంచి హోంబౌండ్ మూవీ అధికారికంగా ఎంపికైంది. ఈ విభాగంలో మొత్తం 15 సినిమాలను షార్ట్ లిస్ట్ చేయగా అందులో స్థానం సంపాదించుకుంది. జనవరి 22న మరోసారి షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మాత్రం హోంబౌండ్ ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో ఆస్కార్ నుంచి నిరాశగా వెనుదిరిగింది.చదవండి: తెలుగులో ఏకైక సినిమా.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
అతన్ని పడేయాలని ట్రై చేశాను.. కానీ..,: కంగనా రనౌత్
ధురంధర్ సినిమా ఓటీటీలోకి రావడంతో మరోసారి ట్రెండ్ అవుతోంది. అందులో నటించిన అక్షయ్ ఖన్నా మళ్లీ వైరల్ అవుతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ ఖన్నాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఓ వీడియో క్లిప్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. హీరోయిన్గా బాలీవుడ్లో టాప్ రేంజ్లో కొనసాగిన కంగనా.. బీజేపీలో చేరి హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.'ధురంధర్' (Dhurandhar)సినిమా చూసిన వారందరూ సోషల్మీడియాలో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లిప్ 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి సంబంధించింది కావడం విశేషం. 2010లో విడుదలైన నో ప్రాబ్లమ్ మూవీ ప్రమోషన్ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. అందులో అనిల్ కపూర్, సంజయ్ దత్లతో పాటు అక్షయ్, కంగనా కూడా కలిసి నటించారు.అతడ్ని ట్రై చేశాను.. కానీ, పడలేదు: కంగనాఈ వీడియోలో కరణ్ జోహార్ మాట్లాడుతూ ఎవరితోనైనా సరసాలాడటానికి ప్రయత్నించారా అని కంగనాను అడగడంతో ఆమె ఏమాత్రం సంకోచించకుండా.., "అవును అంటూ అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) పేరును చెప్పారు. 'నేను మొదట అక్షయ్తో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అతడ్ని నిజంగానే పడేయాలని ట్రై చేశాను. కానీ అతడు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నాతోనే కాదు, అతడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు.' స్వయంగా కంగనా రనౌత్ ఆ షోలో అక్షయ్ ఖన్నా గురించి చెప్పిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిత్ పాత్ర సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రణ్బీర్ సింగ్కు ఎంత పేరొచ్చిందో, అక్షయ్ ఖన్నాకు కూడా అంతే పేరొచ్చింది. ఈ సినిమా పార్ట్-2 మార్చి 19న రిలీజ్ అవుతోంది.in Coffee with Karan #KanganaRanaut reveals she once tried flirting with #AkshayeKhanna, but he was completely in hi won world and he didn't even notice her. pic.twitter.com/BccEj0twm6— आदेश 🚩 (@ADfanatic_New) February 8, 2026
సినిమా
మా వాడు మాట్లాడింది రెండు, మూడు బూతులే..! కానీ మీరు చేస్తుందేంటి...
చరణ్, తారక్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. RRR సీక్వెల్ కన్ఫర్మ్.. త్వరలోనే..!
పెళ్ళిలో హీరో సూర్య, కార్తీ తో వైఎస్ జగన్
అట్లీ మూవీకి.. బన్నీ రికార్డ్ రెమ్యునరేషన్
సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ
Koti: నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
Keerthi: పని చేస్తేనే ఫుడ్.. కష్టాలు ఎలా ఉంటాయంటే ?
ఇండస్ట్రీకి కొత్త హీరో దొరికాడు.. బిగ్ బాస్లో లాగా, సినిమాలో కూడా...
కొత్త క్రష్ మలయాళ బ్యూటీ రియా శిబు
