Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Megastar Chiranjeevi Speech At Mana Shankara Varaprasad Success Meet1
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు.. నాకు కష్టపడటంలోనే ఆనందం: చిరంజీవి

‘మనశంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి హాజరై తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ అన్నం, అమ్మ, సినిమా సక్సెస్ ఎప్పుడూ బోర్ కొట్టదు. వింటేజ్ చిరంజీవితో పాటు ఆ వింటేజ్ షీల్డ్ లు ఈ సినిమా ద్వారా మళ్లీ చూడటం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు. ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరి వర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. కొందరు ఔట్‌డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వెయ్యడం జరుగుతుంది. ఈ సినిమాను 85 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేశాం. సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావడం సంతోషకరం. ఈ సినిమా సక్సెస్ అనంతరం కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ ఫీలింగ్ కలిగించాయి. ఈ వయస్సులో కూడా ఎందుకు కష్టం అంటున్నారు.. నాకు కష్టపడటంలోనే ఆనందం. అందుకు తగ్గ ఉత్సాహం అభిమానుల శ్రేయోబిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుందని అన్నారు. మెగాస్టార్ మాటలు అక్కడి అభిమానులను, చిత్రబృందాన్ని ఉత్సాహపరిచాయి.

Allu Arjun Following Prabhas Movies Strategy Announcing films continuously2
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు

టాలీవుడ్‌లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్‌లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్‌పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్‌ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Nani The Paradise Movie And Antagonists List Latest3
నాని 'ప్యారడైజ్'.. ఇంతమంది విలన్లా?

నాని హీరోగా నటిస్తున్న సినిమా 'ద ప్యారడైజ్'. లెక్క ప్రకారం మార్చి 26న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మే తొలి వారం లేదంటే జూన్ నెలలో రిలీజ్ ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. సరే రిలీజ్ గురించి కాసేపు పక్కనబెడితే ఇదే మూవీ గురించిన ఓ విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'ప్యారడైజ్' మూవీలో నాని.. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో ఆ క్లారిటీ వచ్చేసింది. సీనియర్ నటుడు మోహన్ బాబు.. సికంజా మాలిక్ అనే విలన్‌గా కనిపించబోతున్నాడు. 'కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్ కూడా ఓ విలన్. ఇప్పుడు తనికెళ్ల భరణి కూడా ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టారు. చాన్నాళ్ల తర్వాత విలన్ రోల్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.కెరీర్ ప్రారంభంలో తనికెళ్లి భరణి.. విలన్ రోల్స్ ఎక్కువగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన తర్వాత తండ్రి తరహా పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతినాయక పాత్ర అంటే విశేషమే. ఈ మూవీలోనే సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా ఉన్నారు. ఈయనది కూడా నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. చూస్తుంటే నానితో ఢీ కొట్టేందుకు చాలామంది విలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని ఫ్రెండ్‌ బిర్యానీగా సంపూర్ణేశ్ బాబు నటిస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. ఈ సినిమా కోసం ఒకప్పటి సీనియర్స్‌ని విలన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఏం ప్లాన్ చేశాడనేది మూవీ రిలీజైతే తెలుస్తుంది.(ఇదీ చదవండి: అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి)

Chiranjeevi Gifts Range Rover Sport To Director Anil Ravipudi4
అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవి సినిమాలైతే చేస్తున్నాడు గానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం చిరు ఫుల్ జోష్ చూపించాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే చిరు.. దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)గత పదేళ్ల కాలంలో 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి.. ప్రతి దానితోనూ సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు. 'ఎఫ్ 3'కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇతడి సినిమాల్లో ఉండేది క్రింజ్ కామెడీ అని ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ప్రతిసారి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అనిల్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతూనే ఉంది. ఈసారి కూడా అదే ప్రూవ్ అయింది. దీంతో చిరు ఆనందంతో.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుని అనిల్‌కి గిఫ్ట్ ఇచ్చారు.అనిల్ రావిపూడి బహుమతిగా అందుకున్న ఈ కారు ధర హైదరాబాద్ మార్కెట్‌లో దాదాపు రూ.2 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలని నిర్మాణ సంస్థ.. సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ కాగా, వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ అందించిన పాటలు జనాల్ని బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.(ఇదీ చదవండి: పవన్‌ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్‌ చేసిన హరీష్‌ శంకర్‌!)A MEGA GIFT to the HIT MACHINE 🔥🔥🔥Moments of Megastar @KChiruTweets garu honouring @AnilRavipudi with a surprising gift, a brand-new Range Rover ❤️‍🔥#ManaShankaraVaraPrasadGaru THE ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER 💥💥💥 pic.twitter.com/o3C2DvAoL1— Shine Screens (@Shine_Screens) January 25, 2026

Samyuktha And Mrunal Thakur Latest News5
సంయుక్త మస్తే షేడ్స్.. మృణాల్ అక్కని చూశారా?

అక్కతో కలిసి మృణాల్ థాయ్‌లాండ్ ట్రిప్ఎర్రని చుడీదార్‌లో అందంగా మాళవికమస్త్ షేడ్స్ చూపించేస్తున్న సంయుక్తఖతార్‌లోని ఎడారిలో దివి గ్లామరస్ పోజులుబ్లాక్ డ్రస్ లో మోడ్రన్ గర్ల్‌లా భాగ్యశ్రీ బోర్సేచీరలో ఓరచూపులు చూస్తున్న హీరోయిన్ త్రిష View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

Chiranjeevi, Nagarjuna, Venkatesh in One Frame6
ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్‌ హీరోలు

మా తమ్ముళ్లు జెమ్స్‌ అని చిరంజీవి ఓ సినిమాలో డైలాగ్‌ చెప్తాడు. చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునను ఒకేచోట చూసినప్పుడు అభిమానుల నోట కూడా ఇదే డైలాగ్‌ వస్తుంది. మా ముగ్గురు హీరోలు జెమ్స్‌ అని గొప్పగా చెప్పుకుంటారు. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న స్నేహం వారిది.స్టార్‌ హీరోలు ఒకేచోటఎప్పుడు తారసపడ్డా ఆత్మీయంగా పలకరించుకుంటారు. ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ముగ్గురి ముఖాల్లోనూ వారికి తెలియకుండానే ఓ చిరునవ్వు కనిపిస్తుంది. తాజాగా ఈ స్టార్‌ హీరోలు మరోసారి కలిశారు. మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఇంట్లో ఓ పార్టీ జరగ్గా దానికి ఈ ముగ్గురూ హాజరయ్యారు. వీరితో డాక్టర్‌ గురవారెడ్డి ఓ ఫోటో దిగారు. దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. అదిరిపోయిన సంక్రాంతిఇది చూసిన అభిమానులు వీళ్లు అప్పటికీ.. ఇప్పటికీ.. యంగ్‌గానే కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఇటీవలే సంక్రాంతి పండక్కి 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించాడు. నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లు దాటేసింది.చదవండి: చిరంజీవి, వెంకటేశ్‌ల ఏంటీ బాసూ సంగతి.. పాట రిలీజ్‌

Padma Awards 2026 Telugu Actors Latest Update7
పద్మ అవార్డుల ప్రకటన.. మమ్ముట్టి, ధర్మేంద్రకు ఏమొచ్చాయంటే?

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, క్రీడలు తదితర రంగాల నుంచి మొత్తంగా 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఇందులో 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. అలానే 13 మందికి పద్మభూషణ్ వరించాయి. ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారులు దక్కాయి.హిందీ చిత్రసీమకు విశేష సేవలందించిన దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టిని పద్మభూషణ్ వరించింది. ప్రముఖ నటుడు మాధవన్‌ని పద్మ శ్రీ దక్కించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్.. పద్మశ్రీలుగా ఎంపికయ్యారు.

Prakash Raj: Hindi Cinema has lost its roots8
బాలీవుడ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు

సౌత్‌ టు నార్త్‌.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ప్రకాశ్‌ రాజ్‌. దాదాపు 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీయే బలమైన సినిమాలు చేస్తోందని.. హిందీ సినిమా తన మూలాలు కోల్పోయిందంటున్నాడు. శనివారం నాడు కోజికోడ్‌లో కేరళ లిటరేటర్‌ ఫెస్టివల్‌కు ప్రకాశ్‌ రాజ్‌ హాజరయ్యాడు. సహజత్వం లేదుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తమిళం, మలయాళంలో బలమైన సినిమాలు తీస్తున్నారు. కానీ హిందీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడి సినిమాలు ఆత్మను, సహజత్వాన్ని కోల్పోయాయి. పైకి అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే అంతా ప్లాస్టిక్‌లా ఉంటుంది.. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలోని విగ్రహాలలాగా! కానీ దక్షిణాదిలో ఇప్పటికీ చెప్పడానికి బోలెడన్ని కథలున్నాయి. ఫోకస్‌ అంతా దానిపైనేదళితుల సమస్యలను తమిళ యంగ్‌ డైరెక్టర్స్‌ తెరపై చాలా చక్కగా చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక బాలీవుడ్‌ కేవలం వాటికి అనుగుణంగా సినిమాలు తీయడంపైనే శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయతను కోల్పోయింది. కేవలం డబ్బు, లుక్స్‌, రీల్స్‌, ప్రమోషన్స్‌.. వీటిపైనే ఫోకస్‌ చేసింది. దానివల్లే హిందీ చిత్రపరిశ్రమ ప్రేక్షకులకు కాస్త దూరమైంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: కూతురి చిన్ననాటి కోరిక.. రూ.50 లక్షల గిఫ్ట్‌ ఇచ్చిన నటి

Actor Siva Karthik Talk About Shambhala Movie9
‘శంబాల’తో మంచి గుర్తింపు వచ్చింది: నటుడు శివకార్తిక్‌

అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే పాత్ర లభించడం అంటే ఓ నటుడికి అదృష్టం అనే చెప్పాలి. అలాంటి అదృష్టం నాకు శంబాల సినిమాతో దక్కింది అంటున్నాడు నటుడు శివకార్తిక్‌. ఆది సాయికుమార్‌ హీరోగా నటించిన చిత్రంలో శివకార్తిక్‌ కీలక పాత్ర పోషించాడు. సినిమా రిలీజ్‌ తర్వాత శివకార్తిక్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. చిత్ర విజయోత్సవంలో భాగంగా శివ కార్తిక్ తన సినీ ప్రయాణం, అందులోని ఒడిదుడుకుల గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.నాకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. ఒంటరిగానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘జోష్’ మూవీ కోసం వేల మంది ఆడిషన్స్ ఇస్తే అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తరువాత వరుసగా ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘పిల్లా జమీందార్’ చిత్రాలు చేశాను.కారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న సమయంలోనే హీరోగా ‘లజ్జా’ అనే సినిమాను చేశాను. అది అంతగా వర్కౌట్ కాలేదు. ఈ మూవీ కోసం నేను రెండున్నరేళ్లు కష్టపడ్డాను. కానీ ఫలితం మాత్రం రాలేదు. దీంతో అటు హీరోగా, ఇటు కారెక్టర్ ఆర్టిస్ట్‌గా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. అలాంటి టైంలోనే బాబీ గారు ‘పంతం’ సినిమాలో నా పర్ఫామెన్స్ చూసి చాలా మెచ్చుకున్నారు. నటుడిగా మంచి స్థాయికి వెళ్లాలని, ఇంకా గట్టిగా ప్రయత్నించాలన్న కసి అక్కడి నుంచి నాలో మరింత పెరిగింది.అలా ప్రయత్నిస్తున్న సమయంలోనే నేను ఆర్జీవీ గారి ‘భైరవగీత’ చిత్రంలో పవర్ ఫుల్ రోల్‌ చేశాను. అది చూసి బోయపాటి గారు చాలా మెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయనే నన్ను పిలిచి ‘అఖండ’లో అవకాశం ఇచ్చారు. అయితే ఈ క్రమంలో నేను చేసిన చాలా చిత్రాలకు మంచి పేరు వచ్చింది. ‘ఉగ్రం’ తరువాత మరింతగా నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకున్నారు. ‘తండేల్’లో మంచి పాత్ర దక్కింది.ఎప్పుడూ ఒకేలా సింపతీ పాత్రలు చేయకూడదు.. వెరైటీ పాత్రల్ని చేయాలని అనుకున్నాను. ఆ సమయంలో మనీష్ అని కో డైరెక్టర్ ద్వారా యుగంధర్ ముని వద్దకు నేను వెళ్లాను. ఆడిషన్స్ ఇచ్చాను. అలా ‘శంబాల’ మూవీలో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే పాత్ర లభించడం అంటే ఓ నటుడికి అదృష్టం అనే చెప్పాలి. ‘శంబాల’లో అవకాశం ఇచ్చిన దర్శకుడు యుగంధర్ మునికి నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను.ఆది గారు ‘శంబాల’ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన డెడికేషన్ చూసి మాలోనూ మరింతగా కసి పెరిగింది. ఆయనతో పాటుగా, పోటీగా నటించాలని అందరూ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. ‘శంబాల’ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు రావడం ఆనందంగా ఉంది.ప్రస్తుతం నేను నటుడిగా సంతృప్తికరంగానే ఉన్నాను. అయితే విక్రమ్ చేసిన ‘శివ పుత్రుడు’ లాంటి డిఫరెంట్ రోల్స్ చేయాలన్నదే నా కోరిక, కల. అందులో శివ కార్తిక్ కాకుండా కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించాలి. అలా ఓ అద్భుతమైన పాత్ర చేయాలని అనుకుంటున్నాను. నేను కీలక పాత్రలు పోషించిన ‘హైందవ’, ‘వృషకర్మ’ చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల కాబోతోన్నాయి. అందులోనూ అద్భుతమైన పాత్రల్నే పోషించాను.

Psych Siddhartha Movie OTT Streaming Update10
ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

చాన్నాళ్లుగా టాలీవుడ్‌లో ఉంటూ సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నందు.. రీసెంట్ టైంలోనూ దండోరా, వనవీర తదితర చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్, విలన్ తరహా పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. వీటితో పాటు హీరోగానూ ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే 'సైక్ సిద్ధార్థ'. థియేటర్లలో ఘోరమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: పరోటా మాస్టర్‌కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్)పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన 'సైక్ సిద్ధార్థ'.. ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. హీరో నందు.. ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. ఒకటి రెండు సందర్భాల్లో ఎమోషనల్ కూడా అయిపోయాడు. ఈ సినిమాతో హీరోగా నిలబడతానని చెప్పాడు కూడా. కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు దీన్ని ఫిబ్రవరి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేనున్నారు. గోల్డ్ యూజర్స్ ఒకరోజు ముందే చూడొచ్చు. ఇందులో నందు, యామినీ భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.'సైక్ సిద్ధార్థ' విషయానికొస్తే.. సిద్ధార్థ (శ్రీ నందు) అనుకోకుండా ప‌రిచ‌య‌మైన త్రిష(ప్రియాంక‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. వీళ్లు మ‌న్సూర్ (సుఖేష్‌రెడ్డి)తో క‌లిసి ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మొదలుపెడతారు. అందులో రూ.2 కోట్ల పెట్టుబ‌డి సిద్ధార్థ‌దే. కానీ మ‌న్సూర్‌, త్రిష కలిసిపోయి.. సిద్ధార్థ‌ని దారుణంగా మోసం చేస్తారు. దీంతో అన్నీ పోగొట్టుకున్న సిద్ధార్థ.. చివరకు హైదరాబాద్‌లోని ఓ బ‌స్తీలో చిన్న గ‌ది అద్దెకు తీసుకుని బతుకుతుంటాడు. సిద్ధార్థ ఉంటున్న బిల్డింగ్‌లోకి త‌న కొడుకుతో క‌లిసి శ్రావ్య (యామినీ భాస్క‌ర్‌) అద్దెకు వస్తుంది. భ‌ర్త వేధింపులు తట్టుకోలేక వేరేగా వచ్చి బతుకుతూ ఉంటుంది. తర్వాత సిద్ధార్థ-శ్రావ్య ఎలా కలిశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)

Advertisement
Advertisement