Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Shambhala Movie Review And Rating In Telugu1
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

టైటిల్‌: శంబాలనటీనటులు: ఆది సాయికుమార్‌, అర్చన అయ్యర్‌, రవి వర్మ, మీసాల లక్ష్మణ్‌, స్వాసిక విజయ్‌, షీజు మీనన్‌, శివకార్తిక్‌ తదితరులునిర్మాతలు : మహీధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజుదర్శకత్వం: యుగంధర్‌ మునిసంగీతం:శ్రీచరణ్‌ పాకాలవిడుదల తేది: డిసెంబర్‌ 25, 2025ఆది సాయికుమార్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘శంబాల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఆది ఏ సినిమాకు రానంత హైప్‌ శంబాలకు వచ్చింది. సినిమా ఫస్ట్‌ లుక్‌ నుంచి మొదలు ట్రైలర్‌ వరకు ప్రతీది ఆసక్తిని పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉది? ఆది(aadi saikumar) ఖాతాలో హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే...ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్‌(ఆది సాయికుమార్‌) వస్తాడు. చావులోనూ సైన్స్‌ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్‌. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు. ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్‌తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్‌ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్‌) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో శంబాల(Shambhala Review) చూడాల్సిందే.ఎలా ఉందంటే..సైన్స్‌ గొప్పదా? శాస్త్రం గొప్పదా అంటే సరైన సమాధానం చెప్పలేం. కొంతమంది సైన్స్‌ని మాత్రమే నమ్ముతారు. మరికొంత మంది శాస్త్రాలనే నమ్ముతారు. అయితే సైన్స్‌లోనూ శాస్త్రం ఉంది..శాస్త్రంలోనూ సైన్స్‌ ఉంది అని చాటి చెప్పే చిత్రం శంబాల. దర్శకుడు యుగంధర్‌ ముని ట్రెండింగ్‌ సబ్జెక్ట్‌ని ఎంచుకొని.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. అసలు కథ ఏంటో చెప్పకుండా టీజర్‌, ట్రైలర్‌ వదిలి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. అదే ఆసక్తితో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకుడి అంతకు మించిన కొత్త విషయాలను పరిచయం చేసి అబ్బురపరిచాడు. సైన్స్‌, శాస్త్రాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినిమా కథనం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రొటీన్‌ కథే అయినా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ప్రతి ఐదారు నిమిషాలకు ఒక థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ని పరిచయం చేస్తూ.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించారు.పురాణాల్లోని కథని సాయి కుమార్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పించి.. శంబాల కథను ప్రారంభించారు దర్శకుడు. ఫస్టాఫ్‌ మొత్తం శంబాల గ్రామం పరిచయం..అక్కడి ప్రజలకు ఎదురయ్యే వింత ఘటనల చుట్టూనే కథనం సాగుతుంది. శంబాల ఊరిలో ఉల్క పడడం..ఆవు నుంచి పాలుకు బదులు రక్తం రావడం.. రైతు రాములు వింతగా ప్రవర్తించడం..ఇలా సినిమా ఆరంభంలోనే ప్రేక్షకుడిని శంబాల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.ఫస్ట్‌ సీన్‌ నుంచే ప్రేక్షకులను భయపెట్టడం స్టార్ట్‌ చేశాడు. రవివర్మ పాత్ర సన్నివేశాలే భయపెట్టేలా ఉంటే..అంతకు రెండింతలు అన్నట్లుగా మీసాల లక్ష్మణ్‌ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. కల్లు దుకాణంలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోతుంది. ఇక లక్ష్మణ్‌ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు అయితే ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టిస్తాయి.ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఊరి సమస్యను తీర్చేందుకు విక్రమ్‌ చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. సినిమా ప్రారంభంలో వచ్చే ఒక పాటలోని లిరిక్స్‌కి ఈ కథను ముడిపెట్టిన విధానం బాగుంది. ప్రతీ సీన్‌ కన్విన్సింగ్‌ ఉంటుంది. కానీ చాలా చోట్ల రిపీటెడ్‌గా అనిపిస్తాయి. శంబాల గ్రామ చరిత్ర తెలిసిన తర్వాత కథనం ఊహకందేలా సాగుతుంది. ఇంద్రనీల్‌ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉన్నా..అక్కడ వచ్చే ఓ ట్విస్ట్‌ మాత్రం ఆకట్టుకుంటుంది. సైన్స్‌కి, శాస్త్రాలకు మధ్య సంబంధం ఉందని చెప్పేలా ఆ ట్విస్ట్‌ ఉంటుంది. ఓవరాల్‌గా రైటింగ్‌ పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. శంబాల మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆది సినీ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ చిత్రంగా నిలుస్తుంది.ఎవరెలా చేశారంటే..సైంటిస్ట్‌ విక్రమ్‌ పాత్రలో ఆది ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. దేవి పాత్రకు అర్చన అయ్యర్‌ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమెకు బలమైన సన్నివేశాలేవి ఉండవు. రైతు రాములుగా రవివర్మ తనదైన నటనతో భయపెట్టేశాడు. ఇక మీసాల లక్ష్మణ్‌కి కూడా ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర లభించింది. దివ్యాంగుడు కృష్ణగా ఆయన నటన అదిరిపోయింది. కొన్ని చోట్ల కేవలం చూపులతోనే భయపెట్టేశాడు. కానిస్టేబుల్‌ హనుమంతుగా మధునందన్‌ బాగా చేశాడు. అతని కూతురిగా చేసిన అమ్మాయి కూడా చక్కగా నటించింది. స్వాసిక విజయ్‌, శివకార్తిక్‌, ఇంద్రనీల్‌, షిజు మీనన్‌, శైలజ ప్రియలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రవీన్‌ కె బంగారి సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫెక్స్‌ వర్క్‌ ఈ సినిమాలో తక్కువే ఉన్నా.. చక్కగా కుదిరింది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె , సాక్షి డెస్క్

Tollywood actresses Latest SOcial media updates goes Viral2
పట్టు శారీలో ఉప్పెన బ్యూటీ.. బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న నివేదా థామస్..!

పట్టు శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి..వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ హోయలు..డిసెంబర్‌ మూడ్‌లో కోలీవుడ్ భామ ఆదితి గౌతమ్..బ్లాక్ బ్యూటీలా మెరిసిపోతున్న నివేదా థామస్..లిటిల్ హార్ట్స్‌ జ్ఞాపకాలను షేర్ చేసిన శివాని నాగారం.. View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Sai Kamakshi Bhaskarla (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

Anchor Anasuya Reacts On Sivaji Comments about womens Dress3
'అంత పెద్ద మాటలొద్దు సార్.. మేం చిన్నపిల్లలం కాదు'..: శివాజీకి అనసూయ కౌంటర్

టాలీవుడ్ నటుడు శివాజీని వదిలే ప్రసక్తే లేదంటోంది మహిళా లోకం. తన కామెంట్స్‌ను సమర్థించుకోవడమే కాకుండా ఎవరికీ భయపడనంటూ ఇవాళ ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోయారు. ఒకవైపు సారీ చెబుతూనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఓ రేంజ్‌లో తనకు తానే ఎలివేషన్స్‌ ఇచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా యాంకర్, నటి అనసూయ పేరు ప్రస్తావిస్తూ కౌంటర్‌ ఎటాక్ చేశారు. తాను అభద్రతాభావంతో ఉన్నది నిజమేనమ్మా.. మీ రుణం కూడా త్వరలోనే తీర్చుకునే అవకాశం రావాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్‌ మరో కొత్త వివాదానికి తెరతీశాయి.ఇవాళ దండోరా మూవీ ప్రెస్‌మీట్‌లో శివాజీ తనపై చేసిన కామెంట్స్‌పై అనసూయ స్పందించింది. అతి వినయం దుర్త లక్షణం అనేది నాకు చిన్నప్పటి నుంచే తెలుసని వెల్లడించింది. ఈ రోజు వీడియోలు చూస్తుంటే పెద్దవాళ్లు చెప్పింది కరెక్టే అనిపిస్తోందని తెలిపింది. ఈ రోజు ఆయన ప్రెస్‌మీట్‌లో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఒక నార్సిస్ట్‌కు ఉండే లక్షణం ఇదే.. చేతగానితనం వల్లే ఇలాంటి మాటలు వస్తాయని అన్నారు. ఫేక్ ఫెమినిజం అనేది ఎక్కడా లేదండి.. మగాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఉండాలన్నదే ఫెమినిజం అని తెలిపింది.అనసూయ మాట్లాడుతూ..' సెల్ఫ్ కంట్రోల్ లేనివాళ్లు, ఇన్‌ సెక్యూరిటీ వల్లే ఇలా మాట్లాడతారు. అందుకే పాపం సింపతీ కార్డ్‌ వాడేస్తున్నారు. నేనేందుకు అందులోకి లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే? నేను కూడా హీరోయినే సార్.. మిమ్మల్ని ఇలానే బట్టలు వేసుకోవాలని మీకు ఎవరైనా చెబుతున్నారా? మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలనే చెప్పేంత చిన్నపిల్లలం కాదు. మీరు నన్ను లాగలేదు. కానీ కలెక్టివ్‌గా లాగారు. మీరు ఏదైతే బలంగా చెబుతున్నారో.. నేను కూడా అదే చెబుతున్నా. మీరే తెలివి గలవాళ్లు అనుకుంటే..సృష్టికి మూలమైన మాకు ఎంత ఉండాలి. మరణశిక్ష వేయండి అన్నారు. అలాంటివి వద్దు సార్. నిజంగానే మీకు ఆడవాళ్లపై గౌరవం ఉంటే.. ఏంట్రా అడవి జంతువుల్లా మీద పడటం.. ఆ అమ్మాయి అంత అందగా ఉంది. ఆమెను గౌరవించడని మగవాళ్లకే చెప్పండి' అని గట్టిగా ఇచ్చిపడేసింది.అనసూయ మాట్లాడుతూ..'మీరన్నట్లు నేను జాలి పడలేదు.. నా రుణం తీర్చుకునే అవకాశం దొరకాలి అన్నారు. నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా భర్త నాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఎంతోమంది నా తోటి సహచరులు అండగా ఉన్నారు. మీలాంటి వాళ్ల మద్దకు నాకస్సలు అవసరం లేదు సార్. మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది' అంటూ స్వీట్‌ వార్నింగ్ ఇచ్చేసింది. నా గురించి సోషల్ మీడియాలో ఏం వాగినా.. వల్గర్ కామెంట్స్ చేసినా లీగల్ నోటీసులు వస్తాయని హెచ్చరించింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

The Raja Saab Beauty Nidhhi Agerwal Responds On sivaji comments4
శివాజీ వల్గర్ కామెంట్స్‌.. గట్టిగా ఇచ్చిపడేసిన రాజాసాబ్ బ్యూటీ..!

టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పై ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పందించింది. లులు మాల్‌లో జరిగిన సంఘటన తర్వాతే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పడంపై నిధి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. బాధితురాలిదే తప్పని నిందించడం మానిపులేషన్ ‍అవుతుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇవాళ ప్రెస్‌ మీట్‌లో శివాజీ లులు మాల్‌లో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. నిధి అగర్వాల్‌కు ‍అలా జరిగిన తర్వాతే తాను ఈ కామెంట్స్ చేశానని సమర్థించుకున్నారు.అంతకుముందు దండోరా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్లను ఉద్దేశించి చీప్ కామెంట్స్ చేశారు. ఈవెంట్లకు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకోవద్దని.. అంతా బయటికి కనిపించేలా రావొద్దంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సినీతారలతో పాటు యావత్ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంకర్ అనసూయతో పాటు సింగర చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌంటరిచ్చారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సైతం శివాజీకి నోటీసులు జారీ చేసింది.క్షమాపణలు చెప్పిన శివాజీ..తన కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో శివాజీ క్షమాపణలు కోరాడు. తాను ఆ రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందని.. అంతేకానీ నా ఉద్దేశం మాత్రం కరెక్ట్ అంటూ సమర్థించుకున్నారు. కేవలం ఆ రెండు పదాల వల్లే సారీ చెబుతున్నానంటూ వీడియోను రిలీజ్ చేశాడు.

Malaysian police ban political speeches at Vijay Jana Nayagan audio launch5
జన నాయగణ్ భారీ ఈవెంట్‌.. మలేసియా పోలీసుల షాక్.!

పాలిటిక్స్‌ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయ అరంగేట్రానికి ముందు ఇదే నా చివరి సినిమా అవుతుందని ప్రకటించారు. ఈ భారీ యాక్షన్‌ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే గ్రాండ్‌ ఆడియా లాంఛ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తమిళులు ఎక్కువగా ఉండే మలేసియాలో ఈ భారీ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా ఫ్యాన్స్‌ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ 27న జరగనున్న ఈవెంట్‌ ద్వారా గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే ఈ భారీ ఈవెంట్‌ నేపథ్యంలో మలేసియా పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌలాలంపూర్‌లో జరగనున్న ఈ బిగ్‌ ఈవెంట్‌పై ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరించారు. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రసంగాలు చేయవద్దని మలేసియా పోలీసులు సూచించారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ బుకిట్‌ జలీల్‌ స్టేడియంలో జరగనుంది.కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Parthiban Selfie with Fahadh Faasil Goes Viral6
ఫహద్‌ ఫాజిల్‌ తెలుసా? పార్తీబన్‌ ఆన్సరిదే!

ఫహద్‌ ఫాజిల్‌.. మలయాళంలో అనేక సినిమాలు చేసిన ఈ హీరో పుష్ప సినిమాతో తెలుగువారికి సుపరిచితుడయ్యాడు. ఈ మలయాళ స్టార్‌ ప్రస్తుతం సొంత భాషతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ దర్శకనటుడు పార్తీబన్‌తో సెల్ఫీ దిగాడు.ఫహద్‌ తెలుసా?ఈ ఫోటోను పార్తీబన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. నేను ఫాజిల్‌ సర్‌ను కలిశాను. ఈ సందర్భంగా ఆయన తన కొడుకు ఫహద్‌ ఫాజిల్‌ను నాకు పరిచయం చేశాడు. ఫహద్‌ నాకు తెలుసా? అని అమాయకంగా అడిగారు. ఫహద్‌ ఇప్పుడు ప్రపంచంలోనే ఫేమస్‌ యాక్టర్‌. నాకు తెలియకుండా ఉంటుందా? తనను కలిసినప్పుడు నాకో విషయం అర్థమైంది. మగవాళ్లను సైతం ఆకర్షించే తత్వం..ఫహద్‌ మంచి వ్యక్తి.. చాలా ఇంట్రస్టింగ్‌ పర్సన్‌. అతడి మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! ఆడవాళ్లనే కాదు, మగవాళ్లను సైతం ఆకర్షించే శక్తి అతడిలో ఉంది.. మనం మళ్లీ కలుద్దాం అని పోస్ట్‌ కింద రాసుకొచ్చాడు. పార్తీబన్‌ తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేశాడు. చివరగా ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) సినిమాలో కనిపించాడు. View this post on Instagram A post shared by Radhakrishnan Parthiban (@radhakrishnan_parthiban) చదవండి: నా బిడ్డను దూరం చేశారు.. ఏడ్చేసిన కమెడియన్‌

Tollywood actor Sivaji comments about anchor Anasuya7
'అనసూయ నీ రుణం తీర్చుకుంటా'.. శివాజీ మరోసారి వ్యంగ్య కామెంట్స్..!

టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌ తీవ్ర దుమారానికి దారితీశాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు డ్రెస్సులను ఉద్దేశించి మాట్లాడారు. మీ బాడీ అంతా బయటికి కనపడేలా డ్రెస్సులు వేసుకోవద్దని కామెంట్స్ చేశారు. అదే సమయంలో హీరోయిన్లను ఉద్దేశించి అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో శివాజీ కామెంట్స్‌పై టాలీవుడ్ సినీతారలతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.టాలీవుడ్ నటి అనసూయ సైతం శివాజీ కామెంట్స్‌పై స్పందించింది. ఈ బాడీ నీది కాదు.. మాది అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో శివాజీ అభద్రతా భావంతో ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. మిమ్మల్ని చూస్తుంటే జాలీగా ఉందని కూడా రాసుకొచ్చింది.అయితే ఇవాళ దండోరా టీమ్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో శివాజీ ఈ అంశంపై మాట్లాడారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. ఆ రెండు పదాలు వాడడం నా తప్పేనని.. నా ఉద్దేశంలో మాత్రం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. అదే సమయంలో యాంకర్ ‍అనసూయకు కౌంటరిచ్చారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా మిమ్మల్ని అన్నానా అండి? మీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. వాస్తవానికి ఆమె పేరునే కాదు.. తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని.. హీరోయిన్లు అంటూ మాత్రమే మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. నేను చేసిన కామెంట్స్‌పై ఆడపడచులందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్‌సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరుగుతుందనే ఇన్‌సెక్యూరిటీ నాలో ఉంది. మీరు నామీద జాలి చూపించారు కదా. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.అసలు శివాజీ ఏమన్నారంటే.. ?శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు. కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు'అన్నాడు.అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా అన్నానా మిమ్మల్ని ? - Actor Sivaji pic.twitter.com/urw4aUrniQ— Telugu Chitraalu (@CineChitraalu) December 24, 2025

Bharti Singh emotional while holding Newborn for First time8
నా బిడ్డను దూరం చేశారు.. ఏడ్చేసిన కమెడియన్‌

కమెడియన్‌ భారతీ సింగ్‌ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తను ఇంట్లో ఉన్న సమయంలో సడన్‌గా ఉమ్మునీరు లీకైంది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బాబును తొలిసారి తన చేతుల్లోకి తీసుకున్న మధుర క్షణాల గురించి మాట్లాడుతూ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది.దూరంగా ఉంచారుబాబు పుట్టిన వెంటనే నా నుంచి దూరంగా తీసుకెళ్లారు. పరీక్షలని, అబ్జర్వేషన్‌లో ఉంచాలని ఏవేవో కారణాలు చెప్పారు. కానీ వాడిని నాకు దూరంగా ఉంచడం తట్టుకోలేకపోయాను. రెండు రోజుల తర్వాత బాబును నా చేతికందించారు. తొలిసారి వాడిని ఎత్తుకున్నప్పుడు సంతోషంతో ఏడ్చేశాను. ఎవరి దిష్టి తగలకూడదుగోలాలాగే వీడు కూడా చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు అంది. బాబును ముద్దుగా కాజు అని పిల్చుకుంటోంది. ఈ వీడియో కింద అభిమానులు.. మీ పిల్లలు కాజు, గోలా.. ఇద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. కమెడియన్‌ భారతీ సింగ్‌.. యాంకర్‌, నిర్మాత హార్ష్‌ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో బాబు లక్ష్‌ పుట్టాడు. ఇతడిని ముద్దుగా గోలా అని పిల్చుకుంటారు. View this post on Instagram A post shared by Harssh Limbachiyaa (@haarshlimbachiyaa30)

This Year Tollywood Super Hit Small Movies in tollywood9
టాలీవుడ్‌ చిన్న చిత్రాలు.. సూపర్ హిట్స్.. అందువల్లే సక్సెస్..!

టాలీవుడ్‌లో ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలతో చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. భారీ తారాగణ, పెద్ద బడ్జెట్ సినిమాలకు కలెక్షన్స్ వస్తాయి. మరి చిన్న సినిమాల సంగతేంటి? అగ్రతారలు లేకపోయినా సినిమాలకు ఆదరణ దక్కడం అంతా ఈజీ కాదు. కంటెంట్‌ ఉంటే బాక్సాఫీస్ వద్ద రాణిస్తాయి. లేకపోతే వారం రోజుల్లోనే కనుమరుగవుతుంటాయి. కానీ కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు మాత్రం ఈ ఏడాది సత్తా చాటాయి. ఈ ఏడాదిలో పెద్ద స్టార్స్‌ లేకుండానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన వచ్చిన ఆ చిన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం.కోర్ట్ మూవీ..ఈ ఏడాది సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో కోర్టు ఒకటి. మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకుంది. ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని నిర్మించిన ఈ మూవీ.. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష రోషన్-శ్రీదేవి జంటగా అలరించారు. రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రంలో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. ఈ మూవీ కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. దాదాపు రూ. 55 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.8 వసంతాలు..ఈ ఏడాగి సినీ ప్రియులను అలరించిన ప్రేమ కథా చిత్రం '8 వసంతాలు'. ఈ ఏడాది జూన్‌ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొట్టింది. 8 వసంతాల డైరెక్టర్‌ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.లిటిల్ హార్ట్స్..ఈ ఏడాది సూపర్‌ హిట్‌గా నిలిచిన మరో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల వద్ద అదరగొట్టిది. కేవలం మౌత్ టాక్‌తో పుంజుకుని ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.మ్యాడ్ స్క్వేర్..గతంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ మ్యాడ్. ఈ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఉగాదికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఫస్ట్ పార్ట్ అంతా సూపర్ హిట్‌ కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సుమారు రూ. 65 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్ కీలక పాత్రల్లో మెప్పించారు.రాజు వెడ్స్ రాంబాయి..ఇటీవలే రిలీజైన సూపర్ హిట్‌ కొట్టిన మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు దాదాపు రూ. 15 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని సాయిలు కంపటి దర్శకత్వంలో తెరకెక్కించారు.

Ranveer Singh Walks Out Of Don 3 After Dhurandhar Success10
కొత్త డాన్‌ తప్పుకున్నాడా?

‘ధురంధర్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు హీరో రణ్‌వీర్‌ సింగ్‌. అయితే ‘డాన్‌ 3’ సినిమా నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ తప్పుకుంటున్నారనే టాక్‌ బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ‘డాన్‌ 3’ సినిమా రానున్నట్లుగా 2023 ఆగస్టు 9న ప్రకటన వచ్చింది. రితేష్‌ సిద్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌ ఈ ‘డాన్‌ 3’ సినిమాను నిర్మిస్తారని, 2025లో ఈ సినిమా విడుదలవుతుందనేది ఆ అనౌన్స్‌మెంట్‌ సారాంశం. కానీ వివిధ కారణాల వల్ల రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ‘డాన్‌ 3’ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ‘ధురంధర్‌’ సినిమా తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ నెక్ట్స్‌ మూవీ ‘డాన్‌ 3’ అని అందరూ అనుకున్నారు. కానీ రణ్‌వీర్‌ సింగ్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నారని బీ టౌక్‌. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డాన్‌ 3’ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పుడు ‘డాన్‌’గా రణ్‌వీర్‌ సింగ్‌ వెండితెరపై కరెక్ట్‌ కాదన్నట్లుగా కొంతమంది షారుక్‌ ఖాన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో విమర్శించారు (ఫర్హాన్‌ అక్తర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌ (2006), ‘డాన్‌ 2 (2011) చిత్రాల్లో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించారు). కానీ ‘డాన్‌ 3’లో యాక్టర్‌గా తాను ప్రేక్షకులను మెప్పిస్తానని రణ్‌వీర్‌ సింగ్‌ రెస్పాండ్‌ అయ్యారు. అయితే ఈ ్ర΄ాజెక్ట్‌ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త సినిమాకు ‘ప్రళయ్‌’ అనే టైటిల్‌ ఖరారైందని, ఇదొక జాంబీ ఫిల్మ్‌ అని, ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement
Advertisement