ప్రధాన వార్తలు
మరో సినిమాకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ నటి రేణు దేశాయ్.. రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరే సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల కొద్దికాలంగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్లో ఉంటోంది. అయితే తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేణు దేశాయ్. పదహారు రోజుల పండుగ పేరుతో వస్తోన్న టాలీవుడ్ మూవీలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫన్ బిగిన్స్ అంటూ అనసూయతో ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది .ఈ మూవీతో నంది అవార్డ్ విన్నర్ సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. 2008లో నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాలో నటనకు గానూ సాయికృష్ణ ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత డీఎస్ రావు తనయుడిగా సినిమాల్లో అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో గోపికా ఉద్యన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ గతంలో కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లాంటి చిత్రాలను తెరకెక్కించాడు. సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించనున్నారు. ఇందులో కృష్ణుడు, వెన్నెల కిషోర్, విష్ణు, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
ఓటీటీకి జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది ఎడాపెడా సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్దిలోనూ కనిపించనుంది. ఇక హిందీలో హిట్తో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలతో అలరిస్తోంది. అలా ఈ ఏడాదిలో వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి.ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది దేవర భామ. ఈ సినిమా దసరా కనుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.98.35 కోట్లు వసూలు చేసింది.దాదాపు నెలన్నర్ర రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. Muhurat nikal gaya guys 🥳#SSKTKonNetflix pic.twitter.com/xU2N5bKcej— Netflix India (@NetflixIndia) November 26, 2025
గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు యంగ్ హీరో
తండ్రి సాయికుమార్ అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆది.. తొలి రెండు సినిమాలతోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. అప్పటినుంచి వరసగా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెలలో 'శంభాల' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు తాను మళ్లీ తండ్రి కాబోతున్నాననే శుభవార్త కూడా చెప్పేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: మహేశ్తో సినిమా ఫ్లాప్.. తొలిసారి ఆ విషయం అర్థమైంది: రకుల్)2011లో 'ప్రేమకావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది.. అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రెండో మూవీ 'లవ్ లీ' కూడా హిట్ అయింది. తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు గానీ అవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. గతేడాది ఎలాంటి చిత్రంతోనూ రాలేదు. ఈ సంవత్సరం మాత్రం 'షణ్ముఖ' అనే మూవీతో వచ్చాడు. త్వరలో క్రిస్మస్ సందర్భంగా 'శంభాల' అనే సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.వ్యక్తిగత జీవితానికొస్తే.. 2014లో అరుణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీళ్లకు ఓ కూతురు పుట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆది.. మరోసారి తండ్రి కాబోతున్నాడు. వచ్చే జనవరిలో తన భార్య, బిడ్డని ప్రసవించనుందని.. తాము ముగ్గురు నుంచి నలుగురుం కాబోతున్నామని ఆది.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi)
సినిమాల్లో ఫెయిల్.. ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడేమో వేలకోట్ల సామ్రాజ్యం..!
సినిమా రంగం అందరికీ కలిసి రావడం అనేది చాలా అరుదు. ఒక్క మూవీ డిజాస్టర్ అయిందంటే చాలు కెరీర్ కొనసాగించడం చాలా కష్టమే. అలా అని అందరికీ పరిస్థితి ఇలానే ఉంటుందని కాదు. కొందరికీ మొదటి సినిమానే సూపర్ హిట్ కావొచ్చు.. మరికొందరికీ డిజాస్టర్ కావొచ్చు. కానీ ఒకట్రెండు సినిమాలు ఫెయిల్ అయినా కూడా.. తర్వాత సక్సెస్ బాట పట్టొచ్చు. మరి ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ తలుపు తట్టలేదంటే కారణం.. మనకు ఈ రంగం సెట్ కాదని ఫిక్సయిపోవచ్చు. అలాంటి హీరో కథే ఈ స్టోరీ. ఇలా జరగడం చాలా అరుదనే చెప్పాలి. కానీ ఇదే అతన్ని ఈ రోజు మరో స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందామా?తొలి మూవీనే కొత్త కథతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ గిరీశ్ కుమార్ తౌరానీ మాత్రం టాలీవుడ్ రీమేక్తో తన జర్నీ మొదలెట్టారు. అయితే ఆయన తొలి సినిమాకే స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే మూవీ రీమేక్తో బాలీవుడ్ హీరో గిరీశ్ కుమార్ తౌరానీ ఎంట్రీ ఇచ్చారు. హిందీలో ఈ మూవీని జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా.. వస్తావయ్యా అనే టైటిల్తో తెరకెక్కించారు. అయినా కూడా గిరీశ్ కుమార్ లక్ కలిసి రాలేదు. తన మొదటి చిత్రం కొత్త కథతో చేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఈ చిత్రంలో గిరీశ్ సరసన కోలీవుడ్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచి గిరీశ్కు తీవ్ర నిరాశను మిగిల్చింది.ఆ తర్వాత గిరీశ్ కుమార్ 2016లో విడుదలైన 'లవేష్ షుదా' అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో హీరోగా కనిపించారు. ఇది కూడా గిరీశ్కు కలిసి రాలేదు. ఈ సినిమా విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విఫలం కావడంతో గిరీశ్ తన కెరీర్లో కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కేవలం రెండు సినిమాల్లో మాత్రమే హీరోగా చేసిన గిరీశ్.. సినిమాలు తనకు సెట్ కావని డిసైడ్ అయిపోయాడు. తన రెండో సినిమా రిజల్ట్తోనే బయటకొచ్చేశాడు.బిజినెస్లో సక్సెస్..సినీ నిర్మాత కుమార్ ఎస్ తౌరానీ కుమారుడైన గిరీశ్ బిజినెస్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన తండ్రితో పాటు మేనమామ రమేష్ ఎస్ తౌరానీ ఆధ్వర్వంలో నడుస్తోన్న టిప్స్ ఇండస్ట్రీస్లో అడుగుపెట్టారు. కుటుంబ వ్యాపారంలోకి ప్రవేశించిన గిరీశ్ టిప్స్ కంపెనీ నడపడంలో సక్సెస్ అయ్యారు. సినిమాల్లో ఫెయిల్ అయినప్పటికీ.. టిప్స్ ఇండస్ట్రీస్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువు దాదాపు పదివేల కోట్లకు పైమాటే. డిసెంబర్ 2024 నాటికి మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. రూ.10,517 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో గిరీశ్ షేరింగ్ దాపు రూ.2164 కోట్లుగా ఉంది. ఈ క్రమంలోనే సంపాదనలో రణబీర్ కపూర్ (రూ.400 కోట్లు), రణవీర్ సింగ్ (రూ.245 కోట్లు), వరుణ్ ధావన్ (రూ.380 కోట్లు), ఆమిర్ ఖాన్ (₹రూ.1900 కోట్లు) లాంటి సూపర్ స్టార్స్ను అధిగమించారు.బిజినెస్లో సక్సెస్ అయిన గిరీష్ తన చిన్ననాటి ప్రియురాలు కృష్ణ మంగ్వానీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ ఉంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబయిలో నివసిస్తున్నారు. గిరీశ్ ప్రస్తుతం టిప్స్ కంపెనీలో ప్రమోటర్ అండ్ ఎగ్జిక్యూటివ్గా కొనసాగుతున్నారు.
బిగ్బాస్
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్కు ఛాన్సే లేదు!
ప్రేరణ ఎంట్రీ.. ధైర్యంగా ముందుకొచ్చి బొక్కబోర్లా పడ్డ తనూజ
కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోపోయా.. భరణి భావోద్వేగం
బిగ్బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
ఇదేమైనా చిన్నపిల్లల ఆటనా?: తనూజను నామినేట్ చేసిన భరణి
ఇమ్మూపై ఒత్తిడి.. దివ్య సేఫ్.. హర్టయిన తనూజ
అది నా పిల్లరా..: ముద్ద మందారం హీరో
తప్పు చేశా.. నన్ను క్షమించండి: శివజ్యోతి
A to Z
అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'పైరసీ' అనే ...
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంక...
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా...
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
మీలో చాలామంది అమెజాన్ ప్రైమ్లో 'టాక్ టు మి' Tal...
వంద ఎకరాల ఫామ్ హౌస్.. లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర ఆస్తులివే!
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇవాళ కన...
లవ్ ఫెయిల్యూర్.. అద్దం ముందు నిలబడి..: ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. అప్పుడప్...
డ్రీమ్ గర్ల్నే మెప్పించిన 'ధర్మేంద్ర'.. కెరీర్నే మార్చిన సంఘటన ఇదే
బాలీవుడ్లో ఓ శకం ముగిసింది. హీ మ్యాన్ ధర్మేంద్ర (...
బాలీవుడ్ యాక్షన్ కింగ్ 'ధర్మేంద్ర' కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇక లేరు. ముంబ...
తెరపై తండ్రి కూతురు.. నిజజీవితంలో ఆమెపై వేధింపులు
ఓటీటీలో 'స్ట్రేంజర్ థ్రింగ్స్' అనే వెబ్ సిరీస్ మన ...
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఇండియాలోనూ రిలీజ్
హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ఇండియన్ అభిమానులను...
ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సూపర్ హీరో సినిమాలు అనగానే హాలీవుడ్లో మార్వెల్, డ...
ఇండియాలో అవతార్ ఈవెంట్
‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘అవత...
అమ్మను కారులో ఎక్కనివ్వకుండా అవమానించి...
చిత్రపరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది. హీ...
శింబుకు విలన్గా?
హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో రూ...
అబుదాబిలో అల్లు అర్జున్ సతీమణి.. ప్రగ్యా జైస్వాల్ బ్యూటీఫుల్ లుక్!
అబుదాబి టూర్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి చ...
ప్రభాస్ స్పిరిట్.. సందీప్ రెడ్డి మరో బిగ్ ప్లాన్.!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)- యానిమల్ డైరెక్టర్...
ఫొటోలు
కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
హీరోయిన్ జెనీలియా ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
దుబాయి మ్యూజియంలో అల్లు స్నేహ (ఫొటోలు)
రుక్మిణి వసంత్ ఆలోచన ఎప్పుడూ వీటి గురించే (ఫొటోలు)
పెద్ద ముక్కెరతో 'బలగం' బ్యూటీ కావ్య (ఫొటోలు)
‘16 రోజుల పండుగ’ సినిమా ఓపెనింగ్.. కీలక పాత్రలో రేణు దేశాయ్ (ఫొటోలు)
హీరోయిన్ రాశి సింగ్ అందాలు... శారీ ఫోటోషూట్ చూశారా? (ఫొటోలు)
మరింత గ్లామరస్గా అనసూయ లేటేస్ట్ లుక్ (ఫొటోలు)
23 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట (ఫొటోలు)
వెరైటీ డ్రస్తో కీర్తి సురేశ్ వెరైటీ పోజులు (ఫొటోలు)
గాసిప్స్
View all
సిక్స్ప్యాక్తో హీరో సెకండ్ ఇన్నింగ్స్..
ఫ్యామిలీ మ్యాన్-3.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
హిట్ మూవీ దర్శకుడితో సాయిపల్లవి మరోసారి?
రవితేజతో సమంత.. ఓ క్రైమ్ థ్రిల్లర్!
'వారణాసి' ఈవెంట్కి అన్ని కోట్లు ఖర్చయిందా?
ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!
న్యూయార్క్లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?
ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్
'గర్ల్ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
రివ్యూలు
View all
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
3
‘కాంత’ మూవీ రివ్యూ
2.5
'జిగ్రీస్' మూవీ.. నలుగురి స్నేహితుల కథ (రివ్యూ)
40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!
3
Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ
3
'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?
సినీ ప్రపంచం
బిగ్బాస్ బ్యూటీ స్టన్నింగ్ అవుట్ఫిట్.. ఫ్రెండ్తో సుప్రీత చిల్..!
శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ లయ..బ్యూటీఫుల్ డ్రెస్లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్..ఫ్రెండ్తో సురేఖవాణి కూతురు సుప్రీత చిల్..స్టన్నింగ్ అవుట్ఫిట్లో బిగ్బాస్ బ్యూటీ అషు రెడ్డి..డిఫరెంట్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ హోయలు.. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Prisha R Singh (@prishasinghofficial9) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty)
చిరు కంటే ఆయనే బెస్ట్ డ్యాన్సర్.. కీర్తి సురేశ్ క్లారిటీ.!
కీర్తి సురేశ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. కీర్తి సురేశ్ లీడ్ రోల్లో వస్తోన్న తాజా చిత్రం రివాల్వర్ రీటా. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు హాజరైన కీర్తి సురేశ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించింది.ఈ ఈవెంట్లో కీర్తి సురేశ్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో మీరు చిరంజీవి కంటే విజయ్ బాగా డ్యాన్స్ చేస్తారని అన్నారు.. అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలా మీరు ఎందుకు అనాల్సి వచ్చిందని ఆమెను ప్రశ్నించారు. దీనికి కీర్తి సురేశ్ స్పందించింది.కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. 'నా మాటలు మిమ్మల్ని బాధపెడితే క్షమించండి. కానీ నేను దళపతి విజయ్ సర్కు వీరాభిమానిని. చిరంజీవి సార్కు కూడా ఈ విషయం గురించి తెలుసు. నేను, మెగాస్టార్ గతంలో సెట్స్లో దీనిపై సరదాగా మాట్లాడుకున్నాం. ఆయన దానిని స్పోర్టివ్గా తీసుకున్నారు. చిరంజీవి సర్పై నాకు చాలా గౌరవం ఉంది. అందుకే నాకు అనిపించింది చెప్పాను. కొన్నిసార్లు నాకు ఏమి అనిపిస్తుందో చెప్పలేనప్పుడు చాలా బాధగా ఉంటుంది.' అని అన్నారు.Here is the video of the interview. pic.twitter.com/X0ZbUTNXEa— MK (@MK_VOXX) November 26, 2025
ఆంధ్ర కింగ్ తాలూకా.. ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే చాలు..!
రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాకు పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై రామ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా వీడియోను పంచుకున్నారు. ఇందులో సముద్రంలో సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో వీడియో చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు.
బోల్డ్ సీన్.. ఆ విషయం డైరెక్టర్ ముందే చెప్పారు.. కానీ..: ఆండ్రియా జెరెమా
సింగర్గా మాత్రమే కాదు.. నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ ఆండ్రియా జెరెమా. విభిన్నమైన పాత్రలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది. కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్లోనూ ఆమె దాదాపు సుపరిచితమే. ఈ ఏడాది మాస్క్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కవిన్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే ఆండ్రియా పిశాచి-2 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రకటించి మూడేళ్లయినా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్ సీన్లో కనిపించే పోస్టర్పై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆండ్రియా.. ఆ వివాదస్పద సీన్ గురించి మాట్లాడింది. స్క్రిప్ట్ ప్రారంభంలోనే ఆ బోల్డ్ సీన్ చేర్చారని పంచుకుంది. అయితే షూటింగ్ సమయంలో ఆ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారని తెలిపింది. ఈ చిత్రంలో ఎవరూ కూడా నగ్నంగా కనిపించరని పేర్కొంది. తనకు డైరెక్టర్ మిస్కిన్పై పూర్తి నమ్మకముందని.. ఆయన కథకు అవసరమైతేనే అలాంటి సీన్స్ పెడతారని వివరించింది. ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయని.. కానీ అవన్నీ నగ్నంగా మాత్రం ఉండవని చెప్పింది. ఆయన ఇప్పటికే పలువురు స్టార్ నటులతో సినిమాలు చేశారని గుర్తు చేసింది. ఒకవేళ డైరెక్టర్ ఆ సీన్ అవసరమని భావిస్తే అతని దృష్టి కోణం అది కాదని.. ఆ సీన్ వెనకాల కచ్చితంగా అర్థముంటుందని ఆండ్రియా చెబుతోంది.
సోషియో ఫాంటసీ కథతో ‘వానర’
అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న "వానర" సినిమా సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది."వానర" చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అవినాశ్ బైక్ పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. "వానర" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ప్రేక్షకులను ముందుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా జూలైలో థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ నిరాశపరిచింది. భారీ హైప్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది.ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి రాహుల్ సాంకృత్యాన్తో జతకట్టారు. టాక్సీవాలా కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వీడీ14 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే వీడీ14 మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్, మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ వీడీ14లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్లో వినోద్ సాగర్తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. హాలీవుడ్ యాక్టర్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ పీరియాడికల్ డ్రామాలో ది మమ్మీ స్టార్ రోల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.ఈ స్టోరీ 1854 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో వోస్లూ ఆంగ్ల అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆర్నాల్డ్ విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఆర్నాల్డ్ పాత్ర ఏంటనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా.. గతంలో లైగర్ మూవీలో మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్రలో ఆర్నాల్డ్ కనిపించారు. ఈ మూవీతో రెండోసారి విజయ్ దేవరకొండ సినిమాలో మమ్మీ విలన్ కనిపించనున్నారు.
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025
మరో సినిమాకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ నటి రేణు దేశాయ్.. రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరే సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల కొద్దికాలంగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్లో ఉంటోంది. అయితే తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేణు దేశాయ్. పదహారు రోజుల పండుగ పేరుతో వస్తోన్న టాలీవుడ్ మూవీలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫన్ బిగిన్స్ అంటూ అనసూయతో ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది .ఈ మూవీతో నంది అవార్డ్ విన్నర్ సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. 2008లో నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాలో నటనకు గానూ సాయికృష్ణ ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత డీఎస్ రావు తనయుడిగా సినిమాల్లో అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో గోపికా ఉద్యన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ గతంలో కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లాంటి చిత్రాలను తెరకెక్కించాడు. సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించనున్నారు. ఇందులో కృష్ణుడు, వెన్నెల కిషోర్, విష్ణు, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
ఓటీటీకి జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది ఎడాపెడా సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్దిలోనూ కనిపించనుంది. ఇక హిందీలో హిట్తో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలతో అలరిస్తోంది. అలా ఈ ఏడాదిలో వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి.ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది దేవర భామ. ఈ సినిమా దసరా కనుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.98.35 కోట్లు వసూలు చేసింది.దాదాపు నెలన్నర్ర రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. Muhurat nikal gaya guys 🥳#SSKTKonNetflix pic.twitter.com/xU2N5bKcej— Netflix India (@NetflixIndia) November 26, 2025
గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు యంగ్ హీరో
తండ్రి సాయికుమార్ అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆది.. తొలి రెండు సినిమాలతోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. అప్పటినుంచి వరసగా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెలలో 'శంభాల' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు తాను మళ్లీ తండ్రి కాబోతున్నాననే శుభవార్త కూడా చెప్పేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: మహేశ్తో సినిమా ఫ్లాప్.. తొలిసారి ఆ విషయం అర్థమైంది: రకుల్)2011లో 'ప్రేమకావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది.. అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రెండో మూవీ 'లవ్ లీ' కూడా హిట్ అయింది. తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు గానీ అవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. గతేడాది ఎలాంటి చిత్రంతోనూ రాలేదు. ఈ సంవత్సరం మాత్రం 'షణ్ముఖ' అనే మూవీతో వచ్చాడు. త్వరలో క్రిస్మస్ సందర్భంగా 'శంభాల' అనే సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.వ్యక్తిగత జీవితానికొస్తే.. 2014లో అరుణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీళ్లకు ఓ కూతురు పుట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆది.. మరోసారి తండ్రి కాబోతున్నాడు. వచ్చే జనవరిలో తన భార్య, బిడ్డని ప్రసవించనుందని.. తాము ముగ్గురు నుంచి నలుగురుం కాబోతున్నామని ఆది.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi)
సినిమా
సల్మాన్ ఖాన్ రంజాన్ సెంటిమెంట్.. మళ్లీ మ్యాజిక్ జరుగుతుందా?
దివ్య-భరణిలపై ట్రోల్స్ ఆపండి..! భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
హీరోయిన్ మెసేజ్ చేసిందా? అయితే జాగ్రత్త
Horror Movie: గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి!
Dharmendra : బాలీవుడ్ దిగ్గజ నటుడు కన్నుమూత
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న iBOMMA రవి
iBOMMA One రవిది కాదు..! కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు
పెద్ది పోస్ట్ పోన్ అంటున్న కన్నడ ఇండస్ట్రీ..!
తిరుమల ప్రసాదంపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శివజ్యోతి
వారణాసి బీట్స్ పై క్లారిటీ ఇచ్చేసిన కీరవాణి
