Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tamanna Comment Her Past Decisions In Movies1
నేను ఏదీ అర్థం చేసుకోలేకున్నా: తమన్నా

అందం ఏ ఒక్కరికీ సొంతం కాదు. అయినా ఎవరి అందం వారికి ముద్దే. అదేవిధంగా అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుందంటారు. అలాంటి అందాల్లో తమన్నా అందమే వేరయా అని పేర్కొనవచ్చు. ఈమె ఒక్కో చిత్రంలో ఒక్కో విధంగా తన అందాలను మార్చుకుంటారు. అలా ఏ కోణంలో చూసిన తమన్నా అందంగానే కనిపిస్తారు. అలా తన అందచందాలతో, హావభావాలతో రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కాగా ఈ 36 ఏళ్ల భామ ఇప్పటికీ కథానాయకిగా నాటౌట్‌గా నిలబడడం మరో విశేషం. అదేవిధంగా ఐటం సాంగ్స్‌లోనూ యువతను గిలిగింతలు పెట్టడంలో ఈ బ్యూటీది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. అలా ఒక్క ఐటమ్‌ సాంగ్‌కు రూ.6 కోట్లు డిమాండ్‌ చేస్తున్న నటి తమన్నా. కాగా చిన్న గ్యాప్‌ తర్వాత ఈ అమ్మడు తాజాగా కోలీవుడ్లో విశాల్‌కు జంటగా సుందర్‌.సి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. విజయ్‌వర్మ అనే బాలీవుడ్‌ నటుడితో కొద్దిరోజులు చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అదీ మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. కొంతకాలానికే వీరి మధ్య బ్రేకప్‌ అయ్యింది. ఇటీవల ఇకపై ఐటెం సాంగ్స్‌లో నటించనని పేర్కొన్న తమన్నా మళ్లీ ఇప్పుడు ప్రముఖ హీరోల చిత్రాల్లో అలాంటి పాటల్లో నటించడానికి సిద్ధమే అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తమన్నా లైఫ్‌లో తను తీసుకున్న నిర్ణయాలనే పలుమార్లు మార్చుకుంటూ వెళ్తుందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రశ్నే ఇటీవల ఒక కార్యక్రమంలో ఎదురైన ప్రశ్నకు తమన్నా ఆసక్తికరమైన బదులు చెప్పారు. తనను తానే అర్థం చేసుకోలేకపోతున్నానని, ఇతరులు ఎలా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు.

Director Meher Ramesh Mother In Law No More2
ఒకే తేదీన అమ్మ, అత్తమ్మ.. బాధలో మెహర్ రమేశ్

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇతడి అత్తమ్మ పద్మావతి చనిపోయారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఈ డైరెక్టర్.. చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇన్నాళ్లు అమ్మని తనలో చూసుకున్నానని, ఒకే తేదీన అప్పుడు అమ్మ ఇప్పుడు అత్తమ్మ చనిపోయారని బాధపడుతూ ఈ సంగతి పంచుకున్నాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటోలు కూడా పంచుకున్నాడు.'ఇన్నాళ్లు మా అమ్మ ని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ 'పద్మావతి' శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు.. 2003 ఫిబ్రవరి 7వ తేదీన పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు మా కుటుంబానికి తీరని లోటు' అని మెహర్ రమేశ్.. తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని కన్నడలో రీమేక్ చేసి దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మెహర్ రమేశ్.. 'కంత్రి' మూవీతో టాలీవుడ్‌లో ప్రయాణం మొదలుపెట్టాడు. తర్వాత బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ అంటూ పలు చిత్రాలు చేసినప్పటికీ.. ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. గత కొన్నాళ్లుగా అయితే బయట కూడా మెహర్ రమేశ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు విషాద వార్తని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Meher Raamesh (@meherramesh)

Vaibhavam And Maathru Movies OTT Streaming Now3
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్‌లకి ఓ ప్రొఫెసర్‌కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ.

Jayaram Reveals Telugu Dialogues And Allu Arjun Support4
అల్లు అ‍ర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం

టాలీవుడ్‍‌ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్‌ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు.

Tollywood Actresses Social Media Updates in instagram goes viral5
అర్జున్ రెడ్డి బ్యూటీ బోల్డ్ లుక్.. థాయ్‌లాండ్‌లో శ్వేతామీనన్ చిల్..!

భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ పిక్స్..అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే బోల్డ్ లుక్స్..థాయ్‌లాండ్‌లో చిల్ అవుతోన్న శ్వేతామీనన్..పాట పాడుతూ హీరోయిన్ మాధవి చిల్..బాలీవుడ్ బుల్లితెర భామ మౌనీ రాయ్ లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp)

Blood Roses Movie Review In telugu6
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్లడ్ రోజెస్. ఈ మూవీకి ఏంజీఆర్ దర్శకత్వం వహించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో హరీష్ కమర్తి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్ నగరంలో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు లీడర్స్ ఉంటారు. వీరిద్దరు తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో నిలబెడతారు. ఆ తర్వాత సిటీలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. అదే సమయంలో ఈ వరుస హత్యలకు దేవి దాస్ కొడుకు మదన్‌కి సంబంధం ఉందని వార్తల్లో వస్తుంది. దేవి దాస్ కొడుకు రాజకీయ జీవితం నాశనం చేయడానికి భజరంగి దాస్ ప్లాన్ చేసాడని దేవి దాస్ కార్యకర్తలు రోడ్ మీదకి వస్తారు. ఈ కేసును సీఐ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. పొలిటికల్ ఒత్తిడితో అరుణ్ గోగోయ్ స్పెస్పెండ్ అవుతాడు. ఈ కేసు సీబీఐకి వెళ్తుండగా హోమ్ మినిస్టర్‌ని కమిషనర్ రిక్వెస్ట్ చేసి అధిరను ఒప్పిస్తాడు. ఈ వరుస హత్యలను వెనక ఉన్నా హంతకుడిని అధిర ఎలా పట్టుకున్నది అనేదే అసలు కథ.ఎలా ఉందంటే..ఈ సినిమాలో మహిళలను తక్కువ చేయొద్దని.. వాళ్లు అన్నింటిలో సమానం అని స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ప్రేమించకూడదు.. ప్రేమిస్తే మోసం చేయకూడదని అమ్మాయి పాయింట్ అనే మెసేజ్ ఇందులో చూపించారు. అలాగే 2026లో డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా బ్లడ్‌ రోజెస్. వరుస హత్యల నేపథ్యంలో ఈ కథ సాగడం రోటీన్‌గా అనిపిస్తుంది. కథ నెమ్మదిగా సాగడంతో ఆడియన్స్‌కు అంతగా నచ్చదు.డైరెక్టర్ యం. జి అర్ కథ, మాటలు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నప్పటికీ తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యారు. తాను అనుకున్న పాయింట్‌ ఆడియన్స్‌ చెప్పడంలో కాస్తా తడబాటుకు గురయ్యారు. కన్నడతో రెండు సినిమాలు చేసిన ఆయన తెలుగు ఆడియన్స్‌కు మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. క్రైమ్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు కొద్దిగా నచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా చూస్తే రోటీన్‌ కథే. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.ఎవరెలా చేశారంటే..ఇందులో అధిర క్యారెక్టర్ చేసిన అప్సర రాణి లుక్‌ అదిరిపోయింది. ఆమెకు ఈ మూవీ తర్వాత ప్రత్యేక మార్క్ ఉంటుంది. శాండల్ వుడ్ హీరో ధర్మాకీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీలు పృథ్విరాజ్ జనని క్యారెక్టర్‌లో ఫర్వాలేదనిపించింది. క్రాంతి కిల్లి మార్టిన్ క్యారెక్టర్ అదరగొట్టేశారు. ఈ సినిమాలో సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్ మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్,ధ్రువ,నరేన్ తేజ్,ప్రగ్య,నవిత, లౌక్య,హాసిని,ఆనంద్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

Tollywood actress Renu Desai Comments About How to Become Vegan7
'ఏడేళ్లప్పుడు ఆ ఒక్క సంఘటన..‍ ‍‍ ఆ దెబ్బకు మారిపోయా'

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగ తెలిసిందే. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడగా.. అది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కామెంట్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కేవలం తాను కుక్కుల క్షేమం కోసమే పనిచేస్తున్నానని చాలా సార్లు వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్.. తాను వేగాన్‌గా మారడానికి కారణాలను పంచుకుంది.తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూశానని రేణు దేశాయ్ తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదని రేణు వెల్లడించింది. మాది బ్రాహ్మణ కుటుంబమని.. అయినప్పటికీ నాన్న మాంసం తినేవారని పేర్కొంది. కానీ మా అమ్మ మమ్మల్ని తినద్దని ఎప్పుడు ఆపలేదని.. కానీ నేను తినకూడదని నిర్ణయించుకున్నాని రేణు దేశాయ్ పంచుకుంది. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి పూర్తి వేగాన్‌గా మారిపోయానని తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి..వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినకపోయేదని రేణు వివరించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)

tollywood movie Venkatramayya Gari Taluka title and poster 8
రూరల్ బ్యాక్‌డ్రాప్‌ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్‌తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ మూవీ. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న కథ. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..'మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సురేష్ బాబు లాంఛ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

Pushpa 2 makes top 10 highest grossing Indian films at Japan box office9
జపాన్‌లో పుష్ప-2.. అక్కడ కూడా తగ్గేదేలే..!

ఐకాన్ స్టార్‌ అ‍ల్లు ‍అర్జున్- సుకుమార్‌ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ పుష్ప-2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఏకంగా వరల్డ్‌ వైడ్‌గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో రెండో పేస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు అమిర్ ఖాన్ మూవీ దంగల్‌ రూ.2200 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.అయితే జపాన్‌లో మన తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన హిట్ సినిమాలను జపనీస్‌లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల పుష్ప-2 మూవీని కూడా జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూవీని జనవరి 16న జపాన్‌లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేశారు. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ.139.73 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది.ఇటీవల జపాన్‌లో రిలీజైన పుష్ప-2 సైతం జపాన్ ‍బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా మూవీ రిలీజైన 14 రోజుల్లోనే ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్‌-10లో అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.రూ.6.06 కోట్ల వసూళ్లతో ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 (రూ6.03 కోట్లు) వసూళ్లను అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. దీంతో జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలలో పుష్ప 2 చోటు దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెప్పించింది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా..ఆర్ఆర్ఆర్ - రూ.139.73 కోట్లుముత్తు - రూ.23.39 కోట్లుబాహుబలి 2: ది కన్‌క్లూజన్ - రూ.17.61 కోట్లు3 ఇడియట్స్- రూ.9.81 కోట్లుఇంగ్లీష్ వింగ్లీష్- రూ.9.24 కోట్లుది లంచ్‌బాక్స్- రూ.8.66 కోట్లుసాహో- రూ.7.56 కోట్లుమగధీర- రూ.7.51 కోట్లుఎంతిరన్ (రోబో - రూ.6.33 కోట్లుపుష్ప 2: ది రూల్- రూ.6.06 కోట్లు

Dhurandhar tops Netflix in 22 nations including Pakistan and Bangladesh10
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్‌లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్‌గా టాప్‌-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్‌-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్‌లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్‌లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026

Advertisement
Advertisement