Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Actress Ranya Rao how much illegal gold transport1
నటి రన్యారావు తెచ్చిన బంగారం ఎన్ని కేజీలో తెలుసా..?

బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు ఇప్పట్లో విడుదలయ్యే ఛాన్స్‌ లేదని తెలుస్తోంది. విదేశాల నుంచి ఒక ఏడాదిలోనే 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు తాజాగా ఈడీ అధికారులు గుర్తించారు. దాని మార్కెట్‌ రూ.102 కోట్లుగా పీఎంఎల్‌ఏ న్యాయస్థానంలో ఈడీ తమ అభియోగపత్రంలో పేర్కొంది. 2025లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోదా చేయగా ఆమె వద్ద అక్రమంగా రవాణ చేస్తున్న రూ.12 కోట్ల విలువ చేసే బంగారం లభించింది. దీంతో ఆమెను అరెస్ట్‌ చేసి విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం ద్వారా అక్రమంగా కూడబెట్టిన డబ్బు మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని డీఆర్‌ఐ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. సుమారు 10నెలలకు పైగా పరప్పన అగ్రహార జైల్లో ఆమె ఉంది.బెయిల్‌ కోసం పలుమార్లు పిటీషన్‌ పెట్టుకున్నప్పటికీ కోర్టులు కొట్టివేస్తూ వస్తున్నాయి.రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్‌కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్‌ పర్యటనలో భాగంగా భారత్‌ నుంచి తరుణ్‌తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. దీంతో అసలుగుట్టు బయటపడింది.

Interesting Facts About Michael Jackson, His Biopic Michael Latest Update2
చిరంజీవి కూడా తన డ్యాన్స్‌లు కాపీ కొట్టాడు.. ఆ పాప్‌ కింగ్‌ ఓ హిస్టరీ!

‘‘గోళీమార్‌...మార్‌ మార్‌ మార్‌...’’ అంటూ దొంగ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి తన డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు అని గుర్తు చేయడం ఇప్పుడు అవసరం. ఎందుకంటే.. ఆ పాటలో చిరు డ్యాన్స్‌కు స్ఫూర్తి ని అందించిన మరో డ్యాన్సర్‌ జీవితం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది కాబట్టి. ఓ మూడున్నర దశాబ్ధాల క్రితం మైఖేల్‌ జాక్సన్‌ అనే పేరు వింటేనే కుర్రకారు వేర్రెత్తినట్టు ఊగిపోయేవారు. కాళ్లలో ఎముకలున్నాయా లేవా అన్నంత చాకచక్యంగా నృత్యాలు చేసిన మైఖేల్‌ జాక్సన్‌ సృష్టించిన రికార్డ్స్, సాధించిన సక్సెస్‌లు సాధారణమైనవి కావు. 2009లో 50ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించిన అమెరికా వాసి మైఖేల్‌ ఎన్ని గొప్ప విజయాలు సాధించాడో అన్ని వివాదాలకూ కేంద్రబిందువయ్యాడు.కొత్తగా చర్మాన్ని పునఃసృష్టించుకున్నాడు అనే దగ్గర నుంచి చిన్నారులపై లైంగిక అకృత్యాలకు పాల్పడ్డాడు దాకా మైఖేల్‌ను చుట్టుముట్టిన తీవ్రమైన వివాదాలు బహుశా ప్రపంచంలోనే ఏ సెలబ్రిటీ కూడా ఎదుర్కుని ఉండడు అంటే అతిశయోక్తి కాదు.అలాంటి మైఖేల్‌ జీవితం ఇప్పుడు తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ప్రపంచ ప్రేక్షకులకు మైఖేల్‌ జీవితం కళ్లకు కట్టనుంది. అనేక అడ్డంకులను దాటుకున్న తర్వాత మైఖేల్‌ పేరిట ఈ చిత్రం వచ్చే ఏప్రిల్‌ 24న థియేటర్లలో , ఐమ్యాక్స్‌ తెరపై విడుదల కానుంది, జాక్సన్‌ మేనల్లుడు జాఫర్‌ జాక్సన్‌ పాప్‌ మ్యూజిక్‌ ఐకాన్ గా ప్రధాన పాత్రలో నటించడం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేస్తున్నాడు. లయన్స్ గేట్‌ ఈ చిత్రాన్ని దేశీయంగా పంపిణీ చేస్తుండగా, యూనివర్సల్‌ ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ను నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ గురించి చిత్ర దర్శకుడు ఆంటోయిన్‌ ఫుక్వా తన ఆలోచనల్ని పంచుకున్నారు.‘‘ మైఖేల్‌ లాంటి వ్యక్తి జీవితం గురించి సినిమా తీయడం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం, ఒక నల్లజాతి కళాకారుడిగా మాత్రమే తనను పరిగణించడాన్ని అతను ఎలా నిరాకరించాడో చూశాను. దర్శకుడిగా నా కెరీర్‌పై మైఖేల్‌ పెనుప్రభావాన్ని చూపాడు. ’’ అని లయన్స్ గేట్‌ విడుదల చేసిన ఓ వీడియోలో ఫుక్వా చెప్పారు. ‘‘మైఖేల్‌ జీవితమంతా ప్రజలకు తన స్వరం ద్వారా ఆనందాన్ని పంచాడు. అందుకే అతను తన జీవితం కంటే ఎంతో ఉన్నతుడు . అంత ఉన్నతమైన జీవితాన్ని సినిమాటిక్‌ మార్గంలో చూపడం నాకు అంత సులభం కాలేదు.’’ అన్నారాయన. ‘‘తనతో పాటు వెనక్కి తిరిగి వెళ్లి కొంచెం దూరం ప్రయాణం చేయకపోతే ఓ మనిషిగా మైఖేల్‌ జాక్సన్ ను ఎవరైనా అర్థం చేసుకోగలరని అనుకోను. అతను తన కుటుంబం పట్ల తనకున్న ప్రేమకు సంగీతం పట్ల తనకున్న ప్రేమకు మధ్య పోరాడాడు.’’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారు పుక్వా.సంగీత ప్రయాణం కోసం తన కుటుంబాన్ని జాక్సన్ విడిచిపెట్టడంతో మొదలై 1979 లో జాక్సన్‌ తన మొదటి సోలో ఆల్బమ్‌ ఆఫ్‌ ది వాల్‌ విడుదల చేయడంతో తొలి చిత్రం ముగుస్తుందని హాలీవుడ్‌ రిపోర్టర్‌ అంచనా. ఆ తర్వాత జాక్సన్‌ 2009 మరణానికి ముందు అతని మిగిలిన కెరీర్‌ ఇతరత్రా సంఘటనలపై రెండవ చిత్రం రానుందని కూడా తెలుస్తోంది.ఈ మైఖేల్‌ చిత్రం తాజా ట్రైలర్‌ను ఈ నెల ప్రారంభంలో విడుదల చేశారు. జాక్సన్‌ తండ్రి జో జాక్సన్ పాత్రలో మైఖేల్‌ కోల్మన్‌ డొమింగో, అతని తల్లి కేథరీన్ గా నియా లాంగ్‌ నటించారు. తారాగణంలో మైల్స్‌ టెల్లర్, లారా హారియర్, కాట్‌ గ్రాహం, లారెంజ్‌ టేట్, డెరెక్‌ లూక్‌ ఉన్నారు. గ్రాహం కింగ్, జాన్‌ బ్రాంకా జాన్‌ మెక్‌క్లైన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు, దీనికి జాన్‌ లోగన్‌ స్క్రిప్ట్‌ అందించారు.

Rukmini Vasanth Hike Her Remuneration After Kantara 23
అమ్మో.. రుక్మిణినా?.. భయపడిపోతున్న దర్శకనిర్మాతలు!

ఈ తరం హీరోయిన్లు నటనపై కంటే ధనార్జన పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారా? అలా అవకాశాలను కోల్పోతున్నారా ? నటి రుక్మిణి వసంత్‌ లాంటి నటీమణులను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ కన్నడ భామ సినీ పయనం జస్ట్‌ ఆరేళ్లే. అయితే ఈ అమ్మడు ఇంత తక్కువ కాలంలోనే పాన్‌ ఇండియా కథానాయకిగా మారడం విశేషమే. 2019లో ఒక కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తాజాగా తెలుగు భాషల్లో చిత్రాలు చేశారు. ఇటీవల కన్నడం చిత్రం కాంతార –2లో నటించి విశేష గుర్తింపును పొందారు. పారితోషికం పెంచాలంటే ఎవరైనా, మంచి విజయం కోసం ఎదురు చూడాలి. అలాంటి హిట్‌ రుక్మిణి వసంత్‌కు కాంతారా– 2 చిత్రంతో వచ్చింది. తాజాగా ఓ తెలుగు, కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఇంతకు ముందు విజయ్‌ సేతుపతికి జంటగా ఏస్‌ చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత శివకార్తికేయన్‌ సరసన నటించిన మదరాసి చిత్రం ఓకే అనిపించుకుంది. అదే విధంగా తెలుగులోనూ రంగప్రవేశం చేశారు. అక్కడ నటించిన తొలి చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం విజయాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి లక్కు ఉన్నట్లుంది ఇప్పుడు డ్రాగన్‌ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించే అవకాశం వరించింది. ఇకపోతే కన్నడంలో యశ్‌తో కలిసి నటించిన టాక్సిక్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ అమ్మడి చేతిలో డ్రాగన్‌ అనే ఒక్క చిత్రం మాత్రమే ఉంది. కొత్తగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఈ భామ తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేయడమేనట. ఇలాంటి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం వల్లే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని ఎంపిక చేయడానికి వెనుకడుగు వేస్తున్నారట. రుక్మిణి వసంత్‌ ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 12 చిత్రాలు మాత్రమే చేశారు. అప్పుడే కోట్లలో పారితోషికం డిమాండ్‌ చేస్తుండడం చర్చనీయాశంగా మారుతోంది.

Tollywood actresses daily Updates In Social Media4
కలర్‌పుల్ డ్రెస్సుల్లో మృణాల్ ఠాకూర్.. ట్రెండీ లుక్‌లో దుషారా విజయన్!

డిఫరెంట్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్..బీచ్‌లో టాలీవుడ్ నటి అభినయ చిల్..మెరూన్ డ్రెస్సులో హీరోయిన్ సదా అందాలు..ట్రెండీ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ దుషారా విజయన్..పట్టు పరికిణిలో విమలా రామన్‌ హోయలు.. View this post on Instagram A post shared by Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman)

Tollywood director anil ravipudi crazy combo announced 5
అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్‌.. వెంకీతో పాటు ఎవరంటే?

ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన డైరెక్టర్‌ అనిల్ రావిపూడి. ఏకంగా మెగాస్టార్‌తోనే మ్యాజిక్‌ క్రియేట్ చేశాడు. మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ మల్టీస్టారర్ మూవీ 2026 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా హిట్ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్‌ సినిమాను కూడా ప్రకటించారు. మరోసారి టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టనున్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్‌ కొట్టి వీరిద్దరు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ ట్వీట్ చేశారు. మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. వెంకీమామతో.. "మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి..2027 మొదటి పండగకి మీ ముందుకు వస్తున్నాం అంటూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబో మల్టీస్టారర్ మూవీ కోసం వెంకీమామ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Back again with my director @AnilRavipudi for #VenkyAnil5 🤗🤗🤗Every time we team up, it feels like coming back home full of fun, positivity, and pure entertainment! ❤️Glad to have @NANDAMURIKALYAN join this journey making it special for all of us.. పండగకి కలుద్దాం!!… https://t.co/mCqMXCW10x— Venkatesh Daggubati (@VenkyMama) February 26, 2026

Allu Sirish Pre wedding Celebrations On This Date with Tollywood6
అల్లు వారి పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ ఎప్పుడంటే?

టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిన వెంటనే మరో టాలీవుడ్ హీరో పెళ్లికి అంతా సిద్ధమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల దుబాయ్‌లో శిరీష్‌- నయనిక గ్రాండ్‌గా బ్యాచిలర్‌ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా అల్లు శిరీష్‌ తన పెళ్లి వేడుకకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. అల్లు స్టూడియోస్‌లో ఈ సెలబ్రేషన్స్‌ జరుగుతాయని వెల్లడించారు. మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నామని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.కాగా.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తమ్ముడు, హీరో అల్లు శిరీష్‌ గతేడాది అక్టోబర్‌ 31న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. శిరీష్‌- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. Nayanika & I are having an intimate wedding with family & friends on 6th March. We are excited to celebrate our Pre Wedding Celebrations with the Telugu film industry prestigiously at Allu Studios on the 2nd March.— Allu Sirish (@AlluSirish) February 26, 2026

Ram Charan peddi Movie Latest Update Goes viral7
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్‌ సింగిల్ అప్‌డేట్

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్‌ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్‌ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026

This Friday Ott Release Movies List Goes Viral8
ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్కరోజే ఏకంగా 11 చిత్రాలు స్ట్రీమింగ్..!

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం రాగానే కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. ఈ చివరి వారంలో బాక్సాఫీస్‌ సందడి చేసేందుకు విష్ణు విన్యాసం అంటూ వచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ మూవీపైనే ఆడియన్స్‌లో కాస్తా బజ్‌ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్‌ థ్రిల్లర్‌ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. దీంతో పాటు తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్హనీ(తెలుగు సినిమా)- ఫిబ్రవరి 27జియో హాట్‌స్టార్ రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 27 బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28 బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5 డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27 తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27 క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అబార్‌ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27 అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహా సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్ హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27 నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఆపిల్ టీవీ ప్లస్ మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27

Mohanlal, Pinarai Inteview: Pinarayi To Modi, List Of Politicians Interviewed By Film Stars9
ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!

సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్‌గానే ఉంటాయి. నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారింది.పినరయిలోని మరో కోణంకేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది. ఇదే పంథాలో ప్రపంచ నాయకులుభారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్‌ ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్‌కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్‌లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.కలిసొస్తున్న ‘గ్లామర్‌’ పాలిటిక్స్రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్‌ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్‌ పవర్‌ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.

Vijay Deverakonda Share Wedding Pics, Emotional Note On Rashmika10
ఒక రోజు రష్మికను చాలా మిస్‌ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్‌ చేస్తూ విజయ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్‌లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్‌ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Advertisement
Advertisement