Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Ram Charan peddi Movie Latest Update Goes viral1
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్‌ సింగిల్ అప్‌డేట్

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్‌ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్‌ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026

This Friday Ott Release Movies List Goes Viral2
ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్కరోజే ఏకంగా 11 చిత్రాలు స్ట్రీమింగ్..!

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం రాగానే కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. ఈ చివరి వారంలో బాక్సాఫీస్‌ సందడి చేసేందుకు విష్ణు విన్యాసం అంటూ వచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ మూవీపైనే ఆడియన్స్‌లో కాస్తా బజ్‌ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్‌ థ్రిల్లర్‌ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. దీంతో పాటు తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్హనీ(తెలుగు సినిమా)- ఫిబ్రవరి 27జియో హాట్‌స్టార్ రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 27 బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28 బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5 డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27 తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27 క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అబార్‌ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27 అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహా సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్ హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27 నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఆపిల్ టీవీ ప్లస్ మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27

Mohanlal, Pinarai Inteview: Pinarayi To Modi, List Of Politicians Interviewed By Film Stars3
ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!

సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్‌గానే ఉంటాయి. నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారింది.పినరయిలోని మరో కోణంకేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది. ఇదే పంథాలో ప్రపంచ నాయకులుభారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్‌ ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్‌కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్‌లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.కలిసొస్తున్న ‘గ్లామర్‌’ పాలిటిక్స్రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్‌ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్‌ పవర్‌ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.

Vijay Deverakonda Share Wedding Pics, Emotional Note On Rashmika4
ఒక రోజు రష్మికను చాలా మిస్‌ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్‌ చేస్తూ విజయ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్‌లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్‌ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Rashmika mandanna Introduces her Husband vijay devarakonda5
'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్‌ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్‌ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ భర్త విజయ్‌ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా. మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి. ప్రతిరోజు పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు. విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ' అంటూ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది.'ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్..టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Tollywood actress Aditi Myakal comments about sivaji  remarks on dresses6
'అప్పుడెందుకు వాళ్లని ఆపలేదు'.. శివాజీకి అర్జున్ రెడ్డి నటి కౌంటర్..!

హీరోయిన్స్‌ దుస్తులను ఉద్దేశించి టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదం సృష్టించాయి. ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ సంఘటన తర్వాత ఓ మూవీ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడారు. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి అసభ్యకరమైన రీతిలో రెండు పదాలు వాడారు. అప్పట్లో ఈ కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా శివాజీ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ నటి అదితి మైకల్ స్పందించింది. శివాజీ సినిమాలు చిన్నప్పుడు నేను కూడా చూసేదాన్ని అని తెలిపింది. ఒక అమ్మాయి డ్రెస్‌ గురించి మీరు మాట్లాడుతుంటే భయమేస్తోందని వెల్లడించింది. అప్పుడు మీ సినిమాల్లో హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు.. అప్పుడు మీరెందుకు చెప్పలేదని శివాజీని ప్రశ్నించింది. అప్పుడు మనకెందుకని.. మీరు మీ పని చేసుకుని వెళ్లిపోయారు కదా.. అప్పుడు వాళ్లను ఎందుకు ఆపలేదని నిలదీసింది.ఇలాంటి దుస్తులు వేసుకోవడం నాకిష్టమని.. ఇదే నాకు ఫుడ్ పెడుతోందని అదితి తెలిపింది. అలాగని నేను బికినీ వేసుకుని రోడ్డుమీదకి వెళ్లట్లేదు కదా అని పేర్కొంది. ఒకసారి నేను అమీ తుమీ ప్రమోషన్స్‌కు బస్సులో వెళ్లినప్పుడు.. ఓ వ్యక్తి ఏకంగా నా ఛాతి భాగాన్ని టచ్ చేశాడని వెల్లడించింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిదీ అమ్మాయిల రుద్దడం ఆపేయండని శివాజీకి అదితి కౌంటరిచ్చింది. మేము ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపింది. కొందరైతే మీ లో దుస్తులు బయటికి కనిపిస్తున్నాయని సరిగా వేసుకోండని చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అదితి మ్యాకల్ చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో మరోసారి చర్చకు దారితీశాయి. కాగా.. అదితి.. టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్‌ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత అమీ తుమీ, ఏకం, 24 కిస్సెస్, రాధ, షాదీ ముబారక్ లాంటి చిత్రాల్లో నటించింది. మొదట వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన అదితి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. “మీ మూవీస్‌లోనే హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు. అప్పుడెందుకు వాళ్లని ఆపలేదు..నాకు ఇష్టం ఇలాంటి బట్టలు వేసుకోవడం.. నాకు FOOD పెడుతోంది.. అలా అని నేను BIKINI రోడ్ మీద వేసుకొని వెళ్లట్లేదు కదా.”- Aditi Myakal to Actor #Sivaji pic.twitter.com/t9lnKwO5LP— Whynot Cinemas (@whynotcinemass_) February 26, 2026

Virosh Wedding: Crazy Rumors On Vijay Devarakonda Dowry7
గ్రాండ్‌గా విరోష్‌ పెళ్లి.. విజయ్‌ దేవరకొండకు భారీ కట్నకానుకలు?

టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్‌ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్‌నా?విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్‌గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్‌ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్‌కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్‌వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం, ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్‌పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి. అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్‌పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు.

Rashmika Old Video viral about Telugu cinema ahead of her wedding8
రష్మిక చూసిన మొదటి తెలుగు సినిమా.. మన స్టార్ హీరోదే..!

స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్‌తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్‌మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్‌మెన్‌ థియేటర్‌లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్‌ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. “First Telugu movie I watched was #Businessman. I went to theatre with my father” - #RashmikaMandanna 🔥#MaheshBabu | #Varanasi pic.twitter.com/4d1xb3PWK2— VardhanDHFM (@_VardhanDHFM_) February 26, 2026

Vijay and rashmika Marriage special Sweet Boxes To media People9
విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!

ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్‌ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive A 'Sweet' gesture!❣️Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026

Paruchuri Gopala Krishna Review On Mana Shankar Varaprasad Garu10
చిరంజీవితో ఇలాంటి సినిమానా..?, పెద్ద సాహసమే : పరుచూరి

ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ దాదాపు రూ. 400 కోట్ల వరకు వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన విశ్లేషణను (రివ్యూ) పంచుకున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.రాజేంద్ర ప్రసాద్, నరేశ్‌ వంటి వారితో కేవలం కామెడీ సినిమాలు తీయడం వేరు, కానీ చిరంజీవి వంటి మాస్ హీరోతో పూర్తిస్థాయి యాక్షన్ కామెడీ చేయడం ఒక సాహసమని, దాన్ని అనిల్ రావిపూడి విజయవంతంగా పూర్తి చేశారని పరుచూరి కొనియాడారు. నిర్మాతగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల మొదటి ప్రయత్నంలోనే తండ్రిని మళ్లీ ‘ఇంద్రసేనుడిలా’ సింహాసనంపై కూర్చోబెట్టారని ప్రశంసించారు.కేవలం వినోదం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా సక్సెస్ అయిందని, అందుకే రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరిందని ఆయన పేర్కొన్నారు.‘మొదటి సన్నివేశంలో హీరో పాత్రకు పెళ్లి అయిందని భార్యకు దూరంగా ఉంటాడని చూపించారు. రెండో సన్నివేశంలోనే హీరో పాత్ర తీరు చెప్పారు. టీవీ సీరియల్‌తో తన కథను ముడిపెడుతూ చూపించారు. హీరోకు చిన్న కామెడీ టీమ్‌ని పెట్టి ఆ టీమ్‌లో ఒక హీరోయిన్‌ ఉండేలా చూశారు. ఆమెను కామెడీ టీమ్‌లో ఎందుకు పెట్టారు అని అందరికీ అనుమానం కలిగింది. అలా ఎందుకు పెట్టారో చివర్లో చూపించారు. హీరో, హీరోయిన్‌ ఎప్పుడు కలుస్తారు? ఎలా కలుస్తారు.. ఇలా ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం కానీ మనకంటే ముందు రచయిత, దర్శకులు వేసుకొని వాటిని పద్ధతి ప్రకారం స్క్రీన్‌ప్లే చేశారు. మధ్యమధ్యలో ఎమోషనల్‌ డైలాగులతో కూడా ఆకట్టుకున్నారు. ‘నువ్వు ఎప్పుడైనా నీ పిల్లల్ని చూడాలని అనిపించి మా ఇంటికి వస్తే గేటు దగ్గర నిలబడి రిక్వెస్ట్ చేయి. పైనుంచి చూపిస్తా. పిల్లల్ని చూసి వెళ్లిపో’ అన్న మనిషి ప్రమాదంలో పడితే.. అతడిని హీరో ఎలా కాపాడాడు అనేది గొప్పగా చూపించారు. కామెడీ టీమ్‌లో ఉన్న హీరోయిన్‌.. చివరకు వెంకటేశ్‌ను పెళ్లి చేసుకోవడం ట్విస్ట్‌. ఇందులో మధ్యమధ్యలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. దీన్ని యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ అని కూడా అనొచ్చు. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు అనిల్‌ రావిపూడిని ప్రత్యేకంగా అభినందించడానికి, చిరంజీవికి చిన్న సెల్యూట్‌ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికీ అదే ఎనర్జీ, అవే స్టెప్‌లు, అవే మూమెంట్లు అస్సలు ఏమాత్రం తేడా లేదు. మా చిరంజీవి.. ఎప్పటికీ మా చిరంజీవే అనిపించుకున్నారు’అంటూ తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు.

Advertisement
Advertisement