ప్రధాన వార్తలు
ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..తెలుగులో అత్యధికంగా ఈ సినిమాకే..!
సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక కేరళలో అట్టహాసంగా ప్రారంభమైంది. 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం కొచ్చిలో జరిగింది. ఈ వేడుకల్లో 2024 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప-2) అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ విభాగంలో తేజ సజ్జా(హనుమాన్) అవార్డ్ స్వీకరించారు. అదే ఏడాదికిగానూ ఉత్తమనటిగా నివేదా థామస్(35-చిన్న కథ కాదు) అవార్డ్ అందుకుంది. 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలవగా.. సుకుమార్కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఈ వేడుకను కేరళ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విత్ కేరళ టూరిజం పేరుతో కొచ్చిలోని అడ్లక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరిగింది. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన సినీ తారలకు అవార్డులు అందించారు. Winners selfie 🤩Allu Arjun and Teja Sajja capture a special moment together after their big win at the #70thFilmfareAwardsSouthwithKeralaTourism.❤️Destination Partner: @KeralaTourism Special Partner: @KamarFilmfactry Co-Powered By: @TTKPRESTIGELTD sensodentk.india… pic.twitter.com/LVPMYwYbFF— Filmfare (@filmfare) February 21, 202670వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విజేతల పూర్తి జాబితా(తెలుగు)ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): తేజా సజ్జా (హను-మాన్)ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)ఉత్తమ సహాయనటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ సహాయనటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)ఉత్తమ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రీ కృష్ణ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: యదు వంశీ (కమిటీ కుర్రోల్లు)బెస్ట్ డెబ్యూ యాక్టర్: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోల్లు)బెస్ట్ డెబ్యూ నటి: నయన్ సారిక (గం గం గణేశ)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ అండ్ మోనిక (పుష్ప 2)ఉత్తమ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)
ఓటీటీలోకి ‘ఛాంపియన్’ బ్యూటీ కొత్త సినిమా
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్కుమార్ ఇటీవల ఒక సూపర్ హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఈయన సమీప కాలంలో కథానాయకుడిగా నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణనే పొందింది. తాజాగా జీవీ ప్రకాష్కుమార్ కథానాయకుడుగా నటించిన చిత్రం లక్కీ. నటి అనస్వర రాజన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పుష్ప కందస్వామి నిర్మించారు. ఉదయ్ మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదంతోపాటు ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్, సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందింది. తప్పిపోయిన లక్కీ అనే ఒక కుక్క పిల్ల, ఒక ఆటిజం చిన్నారి చుట్టూ తిరిగే కథాంశంగా ఈ చిత్రం రూపొందింది. తప్పిపోయిన కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి చేతిలో చిక్కడంతో దాన్ని హీరో ఎలా రక్షించాడు అన్నదే లక్కీ చిత్రంలోని ప్రధాన అంశం.నటి మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి కోవై సరళ, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్ల వాయిస్ చోటు చేసుకుంటుంది. మంచి కుటుంబ కథాచిత్రంగా రూపొందిన లక్కీ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని గత 20వ తారీఖున నేరుగా జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది.
'కుడి కన్ను ఫోకస్ చేయమని చెప్పింది.. ఆ సీన్ చేశాక షాకయ్యా'
హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్కుమార్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం సరస్వతి. ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను తన కూతురి కోసం ఈ క్రూరమైన ప్రపంచానికి ఎలా ఎదుర్కొందన్న కాన్సెప్ట్తో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. నటి వరలక్ష్మీ శరత్కుమార్ గురించి మాట్లాడారు. సావిత్రి, ఊర్వశి శారద లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ అని కొనియాడారు. క్రాక్ మూవీలో జయమ్మ క్యారెక్టర్ చూసి ఇలా ఉంటుందా అని.. మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ వాళ్లంతా కూడా షాకయ్యారని వెల్లడించారు. ఆ సీన్ చేసే సమయంలో ఒక చిన్న ఎక్స్ప్రేషన్ ఉందని వరలక్ష్మీకి చెప్పానని తెలిపారు. వెంటనే ఆమె కుడి కన్నుకు కెమెరా పెట్టండని నాతో చెప్పింది.. ఆ షాట్ చెప్పగానే ఆమె కుడి కంటి నుంచి ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేశాయని గోపిచంద్ అన్నారు. అది చూసి నేను కూడా షాకయ్యానని వెల్లడించారు. అంతా ఎక్స్ట్రార్డినరీ ఫర్మామెన్స్ వరలక్ష్మీదేనని ప్రశంసించారు. అంతేకాకుండా బాలయ్యతో వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు నాలుగు పేజీల డైలాగ్స్ ఇచ్చామని గోపీచంద్ తెలిపారు. రెండున్నర్ర రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం.. కానీ మూడు గంటల్లోనే సీన్ అయిపోయిందన్నారు. ఈ సీన్ను సింగిల్ షాట్లోనే పూర్తి చేసిందని వరలక్ష్మీపై ప్రశంసలు కురిపించారు. వరలక్ష్మి పెర్ఫార్మెన్స్ చూసి ఊర్వశి శారద గారిని చూసినట్లు ఉందని బాలయ్య అన్నారని తెలిపారు.
ప్రభాస్ ఆల్టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇటీవల కపుర్ ఫ్రెండ్లీ టీమ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్.కపుల్ ఫ్రెండ్లీ టీమ్కు ఇచ్చిన ఇంటర్వ్వూలో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ గురించి మాట్లాడారు. నాగార్జున, గిరిజా షెట్టర్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి అని తెలిపారు. ఈ ప్రేమకథా చిత్రం ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ చూడాలనిపించే చిత్రమన్నారు.తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' ఒకటి. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఫేమ్ తీసుకొచ్చింది.
బిగ్బాస్
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
A to Z
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ప్రతివారం త...
హెబ్బా పటేల్ హారర్ మూవీ.. ఇక్కడ కూడా స్ట్రీమింగ్
త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో నటించిన హార...
ఈ శుక్రవారం ఓటీటీ చిత్రాలు.. ఒక్కరోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఫ్రైడే వ...
థ్రిల్లర్ సిరీస్లో సముద్రఖని.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుం...
బాడీబిల్డర్ ఆ హీరో... బెండకాయ తిన్నా అరగదు....
పుష్టిగా కండలు తిరిగి ఉన్నవారిని చూస్తే సాధారణంగా ...
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
హిందీ బిగ్బాస్ సీజన్ 1 ఓటీటీ విన్నర్ దివ్య అగర...
ఏడేళ్లు విడివిడిగా నిద్ర.. మా ఇద్దరికీ స్లీప్ డివోర్స్: నటి
బాలీవుడ్ నటి అర్చన పూరణ్ సింగ్ అటు వెండితెర, ఇట...
ధనుష్ ఆ రోజు నా కోసం.. ఓ కారణముంది: మృణాల్
సీతారామం, హాయ్ నాన్న తదితర సినిమాలతో తెలుగు ప్రేక్...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
రజనీకాంత్, కమల్హాసన్ మల్టీస్టారర్.. వీడియో విడుదల
తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్హాసన్ కలిసి స...
చిన్మయి, తన తండ్రిపై నెటిజన్ దిగజారుడు కామెంట్
సోషల్మీడియా వినియోగం పెరుగుతున్న కొద్ది కొందరు నె...
హిట్ సాంగ్ క్రెడిట్ వారిదే.. ఒప్పుకున్న ఏఆర్ రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన "వీర రాజా...
ఆ క్యారెక్టర్ గురించి చెప్పగానే పిచ్చెక్కిపోయింది: ప్రభాస్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్పై రెబల్ స్టార్ ...
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
పళని మురుగన్ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)
నరేశ్కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)
రాధిక, శివకార్తికేయన్ కోసం వచ్చిన కమల్ హాసన్ (ఫోటోలు)
గ్రాండ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్లో హీరోయిన్స్ (ఫోటోలు)
'ది రైజ్ ఆఫ్ అశోక' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
బెంగళూరు AMB మల్టీఫ్లెక్స్లో సందడి చేసిన మహేష్ బాబు (ఫోటోలు)
గ్రాండ్గా నిర్మాత కోన వెంకట్ బర్త్ డే వేడుకల్లో సినీతారల సందడి (ఫొటోలు)
సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)
ఆ ఆనందమే ఇదంతా..: నటి (ఫోటోలు)
గాసిప్స్
View all
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు”
నానికి హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ?
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
మారుతి కొత్త ప్రాజెక్ట్పై ఆసక్తికర చర్చ
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
Mrunal Thakur: ధనుష్తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
రివ్యూలు
View all
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.75
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
సినీ ప్రపంచం
పవిత్ర ఉన్నప్పుడు నాన్న సైలెంట్: నరేశ్ కుమారుడు
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్ చాలాకాలంగా కలిసే ఉంటున్నారు. వీరిద్దరి గురించి నరేశ్ కుమారుడు, నటుడు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ మాట్లాడుతూ.. నటుల జీవితం చాలా కష్టతరం. వాళ్లందరూ ఏ కష్టం, బాధ వచ్చినా బాత్రూమ్లోనే ఏడుస్తారు. అలా కన్నీళ్లు పెట్టుకోని యాక్టర్స్ ఉండను.స్టార్ హోటల్స్లో భోజనంనా విషయానికి వస్తే.. నేను బైక్స్, ఫుడ్ కోసం లక్షలు ఖర్చుపెట్టాను. కానీ రానురానూ ఫైవ్ స్టార్ హోటల్స్లో పెట్టే భోజనం కంటే ఇంటిభోజనమే మేలని రియలైజ్ అయ్యాను అన్నాడు. పవిత్ర లోకేశ్ గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా మంచి మనిషి. తనను తరచూ కలుస్తుంటాను. అందరినీ ప్రేమగా పలకరిస్తుంటుంది. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. నాన్నకు సరైన జోడీ అని నా అభిప్రాయం. ఆమె ఉన్నప్పుడు ఆయన కూడా సైలెంట్గా ఉంటాడు.నాన్న హ్యాపీ50 + ఏజ్లో నాన్న ఇంత ప్రశాంతంగా ఉండటానికి ఆవిడే కారణం. ఇది చాలా మంచి విషయం. ప్రేమకు ఎటువంటి హద్దులు లేవనడానికి ఇది నిదర్శనం. పవిత్ర- నాన్నల బంధాన్ని నిర్మల నానమ్మ, కృష్ణ తాతయ్య కూడా ఆమోదించారు. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా సరే నానమ్మ- తాతయ్య సపోర్ట్ చేసేవారు. పవిత్ర వచ్చాక నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు.నావల్ల కాదునాన్న మల్టీ టాలెంటెడ్. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పనులు పూర్తి చేస్తాడు. కానీ, నేను చాలా ఎమోషనల్ పర్సన్ని. నాన్నలా నేనుండలేను అని చెప్పుకొచ్చాడు. కాగా నరేశ్, మొదటి భార్య నేత్రల సంతానమే నవీన్. ఇతడు నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు వంటి పలు సినిమాల్లో నటించారు. దర్శకుడిగా సత్య అనే షార్ట్ ఫిలిం తీశాడు. అయితే నవీన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడు.చదవండి: OTT: పాతిరాత్రి మూవీ రివ్యూ
తలకిందులుగా వేలాడుతున్న ఈ హీరోని గుర్తుపట్టారా?
పైన ఫోటోలో తలక్రిందుగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైన నటుడు. కేవలం నటనతోనే కాదు, క్రమశిక్షణతో కూడిన ఫిట్నెస్తో కుర్రకారుకు ఇన్పిరేషన్గా నిలుస్తుంటారు. ఆయనే మాస్ హీరో విశాల్. ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీపడని ఈ హీరో, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా డెంగ్యూ బారిన పడటం, షూటింగ్స్ ఒత్తిడి వల్ల కొన్నాళ్ల పాటు వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ జిమ్లోకి అడుగుపెట్టారు.తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన జిమ్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. శరీరాన్ని దృఢంగా మార్చుకుంటూ, పాత 'పందెంకోడి' లుక్ను గుర్తుచేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఆరోగ్యం కోసమే కాదు, తన తదుపరి ప్రాజెక్టుల కోసం కూడా అని తెలుస్తోంది.ప్రస్తుతం విశాల్ తన 36వ చిత్రంలో బిజీగా ఉన్నారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో 'మొగుడు' అనే టైటిల్ను ఖరారు చేశారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మగ మహారాజు', 'యాక్షన్' సినిమాల తరహాలోనే ఇది కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial)
మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నా: రకుల్ ప్రీత్ సింగ్
పద్దెనిమిది ఏళ్లకే కన్నడ సినిమా గిల్లి ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ సరసన ధృవ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా కన్నడ, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.సినిమాలతో బిజీగా ఉండగానే 2024లో తను ప్రేమించిన జాక్కీ భగ్నానీని పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్గా జరిగింది. తాజాగా వీరి పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో భర్తకు విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. నేను కలలు కన్నదంతా నీకోసమేనని ట్వీట్లో రాసుకొచ్చింది. తన భర్తకు శుభాకాంక్షలు చెబుతూ పెళ్లి వీడియోను షేర్ చేసింది. రకుల్ తన ట్వీట్లో రాస్తూ..'నా జీవిత భాగస్వామికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను కలలు కన్నది నీకోసమే. నీతో ఉండటం నాకు ఒక ఇల్లులా అనిపిస్తుంది. నువ్వే నా ఓదార్పు, నా ప్రాణ స్నేహితుడు.. నాకు తెలిసిన అత్యంత సున్నితమైన వ్యక్తి. నువ్వు చూపించే ఉత్సాహం, అభిరుచి గురించి నేను చాలా గర్వపడుతున్నా. నీ దయ, బలం ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తాయి. నా జీవితాన్ని నవ్వు, ప్రేమ, సాహసంతో నింపినందుకు ధన్యవాదాలు. ఇంకా చాలా సంవత్సరాలు కలిసి అందమైన జ్ఞాపకాలను మనం సృష్టించుకోవాలి. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు మ్యారేజ్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది దేదే ప్యార్ దే-2, మేరే హస్బెండ్ కీ బీవీ చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం రామాయణ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. Happy 2nd anniversary to the love of my life @jackkybhagnani ! ❤️❤️You are everything I ever dreamt of and more. Being with you feels like home; you are my comfort, my best friend, and the most gentle person I know. I am so proud of the man you are and the drive and passion with… pic.twitter.com/vn0p4onxtT— Rakul Singh (@Rakulpreet) February 21, 2026
'అందుకే బాలీవుడ్ వదిలేయాల్సి వచ్చింది.. కానీ'.. వారణాసి బ్యూటీ
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్లో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక ప్రస్తుతం ది బ్లఫ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ది బ్లఫ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక హాలీవుడ్కి వెళ్లడంపై మాట్లాడింది. నేను బాలీవుడ్ను వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగానే ఫీలయ్యానని పేర్కొంది. అందువల్లే హాలీవుడ్లో అడుగుపెట్టాల్సి వచ్చిదంని వెల్లడించింది. ఇండియన్ సినిమాల్లో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని.. వారణాసిలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా తెలిపింది.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..' నేను హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగా భావించా. నా కెరీర్ మరింత విస్తరించాలనుకున్నా. అందుకే హాలీవుడ్లో పనిచేశా. కానీ బాలీవుడ్ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పరిమితమైన అవకాశాలే రావడంతో ప్రాజెక్టుల విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యా. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్లోకి అడుగుపెట్టా. నాకు భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు రాజమౌళి సార్తో వారణాసి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపింది.
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ
మంజుమ్మల్ బాయ్స్, కూలీ సినిమాలతో టాలీవుడ్లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సౌబిన్ షాహిర్. అతడు గతేడాది పోలీస్గా నటించిన థ్రిల్లర్ మూవీ పాతిరాత్రి. రతీనా పీటీ దర్శకత్వం వహించిన ఈ మలయాళ మూవీ 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం...కథేంటి?పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ అనగానే కేసుల్ని పోలీసులు ఎలా చేధిస్తారనేది చూపిస్తారు. అయితే ఈ మూవీలో మాత్రం కాస్త విభిన్నంగా తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్న పోలీసులు దాన్నుంచి ఎలా బయటపడ్డారన్నది చూపించారు. అదే సమయంలో తమ తప్పు లేదని నిరూపిస్తూనే కేసును చేధిస్తారు. పాతిరాత్రి అంటే అర్ధ రాత్రి అని అర్థం. ఆ కటిక చీకటిలో ఏం జరిగిందనేదే సినిమా. ఎలా ఉంది?ఓపెనింగ్ షాట్తో సినిమాలో ఏదో విశేషం ఉండబోతుందని హింట్ ఇచ్చారు. తీరా చూస్తే మరీ అంత హైప్ ఇచ్చే మూమెంట్స్ ఏవీ ఉండవు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, కొంత బోరింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కాస్త ఆసక్తి పుంజుకుంటుంది. సెకండాఫ్లో స్పీడ్ పెరుగుతుంది. ప్రముఖ జర్నలిస్టు మరణం కేసులో కానిస్టేబుల్ హరీశ్ (సౌబిన్ షాహిర్), ఎస్ఐ జాన్సీ (నవ్య నాయర్) సస్పెండ్ అవుతారు.అక్కడి నుంచి వారు కేసులో అసలు హంతకులెవరో నిరూపించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ క్రమంలో వెలుగుచూసే నిజాలు కొంత ఆశ్చర్యంగా అనిపించినా, విచారణ మాత్రం మరీ అంత ఆసక్తికరంగా సాగదు. అయితే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు పాతిరాత్రిని ఒకసారి చూసేయొచ్చు. ప్రస్తుతం జీ5లో ఉన్న ఈ సినిమా మలయాళ ఆడియోతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. (Paathirathri Movie Review)
Thalaivar 173: రజనీ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు?
ఏడుపదుల వయసు దాటినా వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న నటుడు రజనీకాంత్. నిజం చెప్పాలంటే ఇటీవల మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. జైలర్ చిత్రం మినహా మంచి సక్సెస్ కాలేదు. రజనీకాంత్ ఈ మధ్య కాలంలో నటించిన వేట్టయన్, కూలీ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా ఈయన వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం జైలర్–2 చిత్రాన్ని పూర్తిచేసిన రజనీకాంత్ తాజాగా ఆయన 173వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన సహనటుడు కమలహాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించడం విశేషం. దీనికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ ఆస్థాన సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు కడుతున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్కు జంటగా నటించే కథానాయకి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల రజనీకాంత్ నటిస్తున్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలో ఇతర భాషలకు చెందిన ప్రముఖ తారలు నటించడం ఆనవాయితీగా మారింది. మరి ఇందులోనూ అలాంటి నటీనటులు నటించే అవకాశం లేకపోలేదు. ఈ విషయం పక్కన పెడితే ఇందులో నటి పూజా హెగ్డే, ప్రియాంక మోహన్ నటించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మలు సహజంగా పోషించే గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. వీటితోపాటు ఒక సీనియర్ నటి కూడా నటించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..తెలుగులో అత్యధికంగా ఈ సినిమాకే..!
సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక కేరళలో అట్టహాసంగా ప్రారంభమైంది. 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం కొచ్చిలో జరిగింది. ఈ వేడుకల్లో 2024 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప-2) అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ విభాగంలో తేజ సజ్జా(హనుమాన్) అవార్డ్ స్వీకరించారు. అదే ఏడాదికిగానూ ఉత్తమనటిగా నివేదా థామస్(35-చిన్న కథ కాదు) అవార్డ్ అందుకుంది. 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలవగా.. సుకుమార్కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఈ వేడుకను కేరళ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విత్ కేరళ టూరిజం పేరుతో కొచ్చిలోని అడ్లక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరిగింది. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన సినీ తారలకు అవార్డులు అందించారు. Winners selfie 🤩Allu Arjun and Teja Sajja capture a special moment together after their big win at the #70thFilmfareAwardsSouthwithKeralaTourism.❤️Destination Partner: @KeralaTourism Special Partner: @KamarFilmfactry Co-Powered By: @TTKPRESTIGELTD sensodentk.india… pic.twitter.com/LVPMYwYbFF— Filmfare (@filmfare) February 21, 202670వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విజేతల పూర్తి జాబితా(తెలుగు)ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): తేజా సజ్జా (హను-మాన్)ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)ఉత్తమ సహాయనటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ సహాయనటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)ఉత్తమ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రీ కృష్ణ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: యదు వంశీ (కమిటీ కుర్రోల్లు)బెస్ట్ డెబ్యూ యాక్టర్: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోల్లు)బెస్ట్ డెబ్యూ నటి: నయన్ సారిక (గం గం గణేశ)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ అండ్ మోనిక (పుష్ప 2)ఉత్తమ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)
ఓటీటీలోకి ‘ఛాంపియన్’ బ్యూటీ కొత్త సినిమా
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్కుమార్ ఇటీవల ఒక సూపర్ హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఈయన సమీప కాలంలో కథానాయకుడిగా నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణనే పొందింది. తాజాగా జీవీ ప్రకాష్కుమార్ కథానాయకుడుగా నటించిన చిత్రం లక్కీ. నటి అనస్వర రాజన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పుష్ప కందస్వామి నిర్మించారు. ఉదయ్ మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదంతోపాటు ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్, సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందింది. తప్పిపోయిన లక్కీ అనే ఒక కుక్క పిల్ల, ఒక ఆటిజం చిన్నారి చుట్టూ తిరిగే కథాంశంగా ఈ చిత్రం రూపొందింది. తప్పిపోయిన కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి చేతిలో చిక్కడంతో దాన్ని హీరో ఎలా రక్షించాడు అన్నదే లక్కీ చిత్రంలోని ప్రధాన అంశం.నటి మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి కోవై సరళ, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్ల వాయిస్ చోటు చేసుకుంటుంది. మంచి కుటుంబ కథాచిత్రంగా రూపొందిన లక్కీ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని గత 20వ తారీఖున నేరుగా జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది.
'కుడి కన్ను ఫోకస్ చేయమని చెప్పింది.. ఆ సీన్ చేశాక షాకయ్యా'
హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్కుమార్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం సరస్వతి. ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను తన కూతురి కోసం ఈ క్రూరమైన ప్రపంచానికి ఎలా ఎదుర్కొందన్న కాన్సెప్ట్తో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. నటి వరలక్ష్మీ శరత్కుమార్ గురించి మాట్లాడారు. సావిత్రి, ఊర్వశి శారద లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ అని కొనియాడారు. క్రాక్ మూవీలో జయమ్మ క్యారెక్టర్ చూసి ఇలా ఉంటుందా అని.. మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ వాళ్లంతా కూడా షాకయ్యారని వెల్లడించారు. ఆ సీన్ చేసే సమయంలో ఒక చిన్న ఎక్స్ప్రేషన్ ఉందని వరలక్ష్మీకి చెప్పానని తెలిపారు. వెంటనే ఆమె కుడి కన్నుకు కెమెరా పెట్టండని నాతో చెప్పింది.. ఆ షాట్ చెప్పగానే ఆమె కుడి కంటి నుంచి ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేశాయని గోపిచంద్ అన్నారు. అది చూసి నేను కూడా షాకయ్యానని వెల్లడించారు. అంతా ఎక్స్ట్రార్డినరీ ఫర్మామెన్స్ వరలక్ష్మీదేనని ప్రశంసించారు. అంతేకాకుండా బాలయ్యతో వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు నాలుగు పేజీల డైలాగ్స్ ఇచ్చామని గోపీచంద్ తెలిపారు. రెండున్నర్ర రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం.. కానీ మూడు గంటల్లోనే సీన్ అయిపోయిందన్నారు. ఈ సీన్ను సింగిల్ షాట్లోనే పూర్తి చేసిందని వరలక్ష్మీపై ప్రశంసలు కురిపించారు. వరలక్ష్మి పెర్ఫార్మెన్స్ చూసి ఊర్వశి శారద గారిని చూసినట్లు ఉందని బాలయ్య అన్నారని తెలిపారు.
ప్రభాస్ ఆల్టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇటీవల కపుర్ ఫ్రెండ్లీ టీమ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్.కపుల్ ఫ్రెండ్లీ టీమ్కు ఇచ్చిన ఇంటర్వ్వూలో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ గురించి మాట్లాడారు. నాగార్జున, గిరిజా షెట్టర్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి అని తెలిపారు. ఈ ప్రేమకథా చిత్రం ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ చూడాలనిపించే చిత్రమన్నారు.తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' ఒకటి. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఫేమ్ తీసుకొచ్చింది.
సినిమా
విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు
ప్రభాస్ కల్కి 2.. దీపిక ప్లేస్ లో సాయిపల్లవి
ప్రేమలో ప్రభాస్ వైరల్ అవుతున్న వీడియో
చిరు, మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్ ఎవరు..? రాధిక సమాధానం వైరల్
ధురంధర్-2 కు పోటీగా టాక్సిక్.. అసలు తగ్గేదేలే అంటున్న యష్..
విజయ్, రష్మికల సంపాదన ఇద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు అంటే..?
ఇన్ స్టాలో రికార్డు సృష్టిస్తోన్న #AA23 మూవీ థీమ్ సాంగ్
వైరల్ గా మారిన ఆలియా భట్ డ్రెస్..
వారణాసిలో కిచ్చా సుదీప్ రోల్ ఏంటంటే..?
మహేష్ బాబు NEXT మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా!
