Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

IMDb Announces the Most Anticipated Indian Movies of 20261
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలివే.. ‘స్పిరిట్‌’ ఏ స్థానంలో ఉందంటే..

సినిమాలకు సంబంధించి రేటింగ్‌ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్‌లైన్‌ వేదికగా పేరున్న ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌ (ఐఎండీబీ).. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా మోస్ట్‌ మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ జాబితాను ప్ర‌క‌టించింది. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్‌ వ్యూస్‌ ఆధారంగా తీసిన ఈ లిస్ట్‌ను తాజాగా ప్ర‌క‌టించింది. ఈ లిస్ట్‌లో టాప్‌ పొజిషన్‌లో షారుఖ్‌ఖాన్‌ కింగ్‌ సినిమా ఉండగా.. ప్రభాస్‌-సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ మూవీ నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే ప్రభాస్‌ మరో చిత్రం పౌజీ పదో స్టానంలో ఉంది. ఇక రామ్‌ చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం పెద్ది 13వ స్థానం దక్కించుకుంది. మొత్తంగా టాప్‌ 20లో 5 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. ఐఎండీబీ ప్రకటించిన టాప్‌ 20 సినిమాలివే...1) కింగ్‌ (హిందీ) :‘పఠాన్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమింది. ఇందులో షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కీలక పాత్ర పోషిస్త్ననారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్‌ కూడా ఇందులో నటిస్తున్నారు.2) రామాయణ (హిందీ)రణ్‌బీర్‌ ప్రధాన పాత్రలో నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ‘రామాయణ’ రానున్న ఈ మూవీ మొదటి పార్ట్‌ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.2027లో రెండో భాగం విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్‌ రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రని పోషించింది. కన్నడ స్టార్‌ హీరో యశ్‌.. రావణుడిగా కనిపించబోతున్నాడు.3) జననాయగన్‌(తమిళ్‌)తమిళ స్టార్ హీరో విజ‌య్ నటించిన చివరి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.4) స్పిరిట్‌(తెలుగు)ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటించగా,.బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.5) టాక్సిక్‌(కన్నడ)యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్‌. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.6) బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌సల్మాన్‌ఖాన్‌ హీరోగా అపూర్వ లఖియా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’. ఇందులో సల్మాన్‌ ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.7) ఆల్ఫా(హిందీ)అలియా భట్‌. శార్వరీ వాఘ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో రాబోతున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్నారు.8) దురంధర్‌ 2 (హిందీ)బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ దురంధర్‌ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఆదిత్యధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.9) బోర్డర్‌ 2 (హిందీ)1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఈ సీక్వెల్‌లో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్‌జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.10) ఫౌజీహను రాఘవపూడి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతన్న చిత్రమిది. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో ప్రభాస్‌ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్‌ ఖేర్, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.11) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) (తమిళ్‌) : ప్రదీప్ రంగనాథన్(హీరో)12) ది ప్యారడైజ్(తెలుగు) : నాని13) పెద్ది(తెలుగు): రామ్‌ చరణ్‌14) డ్రాగన్(తెలుగు)‌: ఎన్టీఆర్‌15) లవ్‌ అండ్‌ వార్‌(హిందీ): రన్‌బీర్‌ కపూర్‌16) బూత్‌ బంగ్లా(హిందీ): అక్షయ్‌ కుమార్‌17) బెంజ్‌(తమిళ్): లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి రాబోతున్న చిత్రమిది.18) శక్తి శాలిని(హిందీ): హారర్-కామెడీ ఫ్రాంచైజీ19) ‘పేట్రియాట్‌ (మలయాళం) - మమ్మూట్టీ, మోహన్‌లాల్20) ఓ రోమియో (హిందీ): షాహిద్ కపూర్

Chiranjeevi: a couple Cancel their Divorce after watching Mana Shankara Vara Prasad Garu Movie2
'MSG' చూసి ఓ జంటలో మార్పు.. విడాకులు క్యాన్సిల్‌

అనిల్‌ రావిపూడి సినిమా వస్తోందంటే హిట్టు గ్యారెంటీ.. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాడంటే బ్లాక్‌బస్టర్‌ పక్కా! పైగా మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా అంటే బాక్సాఫీస్‌ దద్దరిల్లాల్సిందే.. అనిల్‌ రావిపూడి- చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పెషల్‌ ఇంటర్వ్యూ నయనతార హీరోయిన్‌గా యాక్ట్‌ చేయగా వెంకటేశ్‌ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను సంక్రాంతి హిట్‌ బొమ్మగా ప్రేక్షకులు ఆల్‌రెడీ డిసైడ్‌ చేశారు. అందుకే సంక్రాంతి కానుకగా చిరు, వెంకీ, అనిల్‌ రావిపూడిల స్పెషల్‌ ఇంటర్వ్యూ రిలీజ్‌ చేశారు. అందులో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓ జంట విడాకులు తీసుకోవాలని మూడు నెలలుగా అనుకుంటోంది. విడాకులు క్యాన్సిల్‌ఇద్దరూ వేర్వేరుగా మన శంకరవరప్రసాద్‌గారు మూవీ చూశారు. సినిమా చూడగానే ఇద్దరూ ఫోన్‌ మాట్లాడుకుని విడాకులు రద్దు చేసుకుని కలిసిపోయారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి అని హీరో తల్లి చెప్పే డైలాగులు సినిమాలో ఉంటాయి. అవే వారిలో మార్పు తెచ్చాయి. ఇలాంటి సీన్స్‌ రాసిన అనిల్‌ రావిపూడికి హ్యాట్సాఫ్‌' అని మెచ్చుకున్నాడు.సినిమా కథ విషయానికి వస్తే..శంకర వరప్రసాద్‌(చిరంజీవి) నేషనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌. అతడి భార్య పేరు శశిరేఖ (నయనతార). ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోతారు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని శశిరేఖ తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది. ఆరేళ్ల తర్వాత పిల్లలు చదివే స్కూల్‌లో పీఈటీ టీచర్‌గా చేరతాడు శంకర్‌. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు ఆయన ఎలా దగ్గరయ్యాడు? అసలు భార్యాభర్తల మధ్య గొడవేంటి? మళ్లీ కలిశారా? లేదా? అన్నదే కథ!చదవండి: భర్తతో సమంత తొలి సంక్రాంతి

The RajaSaab box office Collections In first week goes viral3
ది రాజాసాబ్ ఫస్ట్‌ వీక్‌ కలెక్షన్స్‌.. ఆదిపురుష్ కంటే తక్కువే..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. జనవరి 9న రిలీజైంది. తొలి రోజే మిక్స్‌డ్‌ టాక్ అందుకున్న రాజాసాబ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్‌ ఆశించినస్థాయిలో రాబట్టలేకపోయింది.ఈ మూవీ రిలీజై వారం రోజులు పూర్తి కావడంతో వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే ది రాజాసాబ్ దేశవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.130 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏడో రోజు ఇండియాలో కేవలం రూ.5.65 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి వారంలో రూ.200 కోట్ల నెట్ వసూళ్లు మార్క్‌ను ది రాజాసాబ్ చేరుకోలేకపోయింది. ఇండియా వ్యాప్తంగా గ్రాస్‌ వసూళ్ల పరంగా చూస్తే రూ.156 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిన ది రాజా సాబ్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్‌ దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లో రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో చిత్రాలు మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాల కంటే ది రాజా సాబ్ వెనకే ఉంది. గతంలో రిలీజైన కల్కి మూవీ వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది. కాగా.. ది రాజాసాబ్‌ మూవీని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు.

Varun Tej and Lavanya Tripathi Ssankranthi Celebratiions with son vaayu4
కుమారుడితో తొలి సంక్రాంతి.. వరుణ్‌తేజ్ దంపతుల పోస్ట్ వైరల్

టాలీవుడ్ దంపతులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ముద్దుల కుమారుడితో తొలి సంక్రాంతి వేడుక జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. వాయుతో ఫస్ట్ పండుగ కావడం మరింత స్పెషల్‌గా ఉందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మెగా హీరో వరుణ్ తేజ్ రెండేళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్‌ 10న ఈ జంటకు బాబు పుట్టాడు. ఆ తర్వాత బారశాల వేడుక కూడా నిర్వహించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడి పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.కాగా.. నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Samantha celebrates first Sankranti with husband Raj Nidimoru5
భర్తతో తొలి సంక్రాంతి వేడుక.. ఫోటో షేర్ చేసిన సమంత

టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ డైరక్టర్‌ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వీరి వివాహా వేడుక జరిగింది. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు.తాజాగా సమంత సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి ఈ పండుగను జరుపుకుంది. సంక్రాంతి వైబ్స్ అంటూ రాజ్‌ నిడిమోరుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్‌ సామ్ జంటకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ జంట సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.

Vijay Sethupath, Puri Jagannadh Film Titled Slum Dog, First Look Released6
పూరీ-సేతుపతి సినిమా టైటిల్‌ ఇదే.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌!

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైటిల్ టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. విజయ్‌ సేతుపతి(Vijay Sethupath) బర్త్‌డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ.. ‘మురికివాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుపాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది’ అంటూ విజయ్‌ పాత్ర తీరును వివరించారు. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. టబు, విజయ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం .. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉంది.From the slums… rises a storm no one can stop.RAW. RUTHLESS. REAL. ❤️‍🔥❤️‍🔥❤️‍🔥#PuriSethupathi is #SLUMDOG - 33 Temple Road 💥💥💥Happy Birthday Makkalselvan @VijaySethuOffl ❤️#HBDVijaySethupathi A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥Produced by Puri… pic.twitter.com/ca2PCs6tBG— Puri Connects (@PuriConnects) January 16, 2026

Interesting Facts About Toxic Movie DIrector Geetu Mohandas7
టాక్సిక్‌ టాక్స్: ట్రైలర్‌తో వైరల్‌ అయిన లేడీ డైరెక్టర్‌

‘కేజీఎఫ్‌’ వంటి చారిత్రక విజయం తర్వాత రాకింగ్‌ స్టార్, దక్షిణాది క్రేజీ హీరో యష్‌ నటించిన ‘టాక్సిక్‌’ ట్రైలర్‌ తోనే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరో యష్‌ తన స్వంత బ్యానర్‌ మాన్‌స్టర్‌ క్రియేషన్స్‌ ద్వారా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ మూవీ టాక్సిక్‌. ఇందులో యష్‌ అత్యంత క్రూరమైన గ్యాంగ్‌ లీడర్‌ ‘రాయా’ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ ‘ది టీజ్‌’ తోనే ఈ మూవీ భారీ అంచనాలు పెంచి సంచలనాలు కూడా రేపింది. కెమెరా టేకింగ్‌ యాక్టింగ్‌ వగైరాలన్నీ సినీ సాంకేతిక నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారి పలు ప్రశంసలు కూడా అందుకుంటుంటే... మరోవైపు నీలిచిత్రాల స్థాయిలో ఉన్న సన్నివేశం సంప్రదాయవాదుల కన్నెర్రకు కారణమైంది. ఈ నేపధ్యంలోనే ఆ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు?తన నేపధ్యం ఏమిటి? అంటూ కన్నడేతర భాషా ప్రేక్షకుల్లో చర్చ కూడా జోరుగా సాగుతోంది. మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించే షాకింగ్‌ సీన్లను జోడిస్తూ రూపొంది త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌–అప్స్‌’.చిత్రం∙దర్శకురాలి పేరు గీతూ మోహన్‌దాస్‌.యాక్షన్‌ టూ డైరెక్షన్‌...ఆమె ఒక సెన్సేషన్‌...పాన్‌ ఇండియా యాక్షన్‌ చిత్రాలకు అలవాటైన దర్శకుల నుంచి కాకుండా, యష్‌ పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.దానికి తగినట్టుగా ఆయనకు కనిపించారు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌. ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి, తరువాత ఆస్కార్‌ స్థాయికి ఎదిగిన ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరొందారు. సాధారణ వాణిజ్య చిత్రాలకు పూర్తి భిన్నం గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘లైయర్స్‌ డైస్‌’ (2013). ప్రముఖ నటీనటులు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, గీతాంజలి థాపాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, హిమాలయాల్లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీ వరకు తన భర్త కోసం ఒక మహిళ చేసే ప్రమాదకర ప్రయాణాన్ని భావోద్వేగ సహితంగా చూపిస్తుంది.ఈ చిత్రం సండాన్స్ రోటర్‌డామ్‌ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రశంసలు అందుకోవడంతో పాటు 87వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైన ఘనత దక్కించుకుంది. అంతేకాదు 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమనటి, ఉత్తమ సినిమాటోగ్రఫీలకు గాను రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాటోగ్రాఫర్‌ రాజీవ్‌ రవి గీతూ మోహందాస్‌ భర్త కావడం. ఆయన అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌’ కు తన రఫ్‌ అండ్‌ రియలిస్టిక్‌ విజువల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చి విజువల్‌ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. గీతూ మోహన్‌దాస్‌ వైవిధ్యభరిత లైన్స్‌కు తెరపై జీవం పోసే లెన్స్ రాజీవ్‌ రవి అని చెప్పొచ్చు. అలాగే దేవ్‌ డి, చాందినీ బార్, ఉడ్తా పంజాబ్‌ వంటి వైవిధ్యభరిత సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.‘టాక్సిక్‌’ కోసం గీతూనే ఎందుకు?‘కేజీఎఫ్‌’ లాంటి మాస్‌ బ్లాక్‌బస్టర్‌ తర్వాత, యష్ గీతూ మోహన్‌దాస్‌ లాంటి ఆలోచనాత్మక చిత్రాలకు పేరొందిన దర్శకురాలిని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె రెండో చిత్రం ‘మూతోన్‌’ (సండాన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్లోబల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ అవార్డు విజేత) చూసినవారికి ఈ నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. గీతూ కథనాల్లో ఉండే డార్క్‌ రియలిజం, అంతర్జాతీయ టచ్‌ – యశ్‌ మాస్‌ ఇమేజ్‌తో కలిసినప్పుడు, ఒక కొత్త తరహా భారతీయ బ్లాక్‌బస్టర్‌ రూపుదిద్దుకోబోతోందన్న అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా... భారతీయ చిత్రాల్లో కామసూత్ర తీసిన మీరానాయర్‌ ఎంత వివాదాస్పదం అయ్యారో తెలిసిందే. అయితే సబ్జెక్ట్‌ పరంగా అవసరం కాబట్టి తీశానంటూ ఆమె సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు. మరి కేవలం ఒకే ఒక్క టీజర్‌ ద్వారా సంప్రదాయవాదుల దాడులతో పాటుగా న్యాయ వివాదాలు కూడా ఎదుర్కుంటున్న గీతూ మోహన్‌...పూర్తి సినిమా విడుదల తర్వాత ఏవేం వివాదాలు ఎదుర్కోనున్నారో వేచి చూడాలి.

Music Directors who turns as a Hero in his Career in South India cinema8
మ్యూజిక్ డైరెక్టర్‌ టూ హీరో.. సక్సెస్ అయింది వీళ్లే..!

ఒక సినిమా హిట్‌ కావాలంటే కథతో పాటు బీజీఎం, నేపథ్య సంగీతం చాలా కీలకం. కథను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చడంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర తప్పనిసరి. అందుకే స్టార్‌ హీరోల చిత్రాలకు సంగీత దర్శకుడు ఎవరనే దానిపై ఆడియన్స్‌లో ఆసక్తి ఉంటుంది. అలా టాలీవుడ్‌లో ఎస్ఎస్ తమన్, భీమ్స్ సిసిరోలియో, దేవీశ్రీ ప్రసాద్‌, అనూర్ రూబెన్స్, మిక్కీ జే మేయర్ లాంటి వాళ్లు ఉన్నారు. వీరి టాలెంట్‌పైనే సినిమా రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది.అలా తమ మ్యూజిక్‌ టాలెంట్‌తో అలరించిన సంగీత దర్శకులు ఆ తర్వాత హీరోలుగా కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా మన టాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇస్తున్నారు. బలగం మూవీతో హిట్ కొట్టిన వేణు యెల్దండి డైరెక్షన్‌లో వస్తోన్న ఎల్లమ్మతో అరంగేట్రం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్‌ టూ హీరోగా ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఈ లిస్ట్‌లో ఉన్నది ఎవరైనా ఆరా తీస్కే ఒకట్రెండు ప్రముఖుల పేర్లు మాత్రమే వినిపించాయి. అలా ఎంట్రీ ఇచ్చినవారిలో కోలీవుడ్ నుంచి విజయ్ ఆంటోనీ, జీవీ ప్రకాశ్ కుమార్ ఉన్నారు. వీరిద్దరు మాత్రమే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోలుగా పలు సినిమాలు చేశారు. అయితే బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ మాత్రం కొట్టకపోయినా.. ఓ మాదిరి చిత్రాలైతే చేశారు. ఒకరకంగా చూస్తే వీరిద్దరు హీరోలుగా అంతగా సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. విజయ్ ఆంటోనీ మాత్రం సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకని.. ఆ తరువాత నటుడిగా, నిర్మాతగా రాణించారు.ఇప్పుడు టాలీవుడ్‌ నుంచి దేవీశ్రీ ప్రసాద్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా బలగంతో హిట్‌ కొట్టిన వేణు యెల్దండి.. రెండో సినిమా కావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి మొదటి సినిమాతోనే దేవీశ్రీ ప్రసాద్ హిట్ కొడతాడా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అంతేకాకుండా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్ రవిచందర్ కూడా హీరోగా మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Bollywood Actor Anil Kapoor Confirms In Jr NTR-Neel Dragon9
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. యానిమల్ నటుడి ఎంట్రీ ఫిక్స్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం డ్రాగన్‌(రూమర్ టైటిల్). టైటిల్‌ ఇంకా ఖరారు చేయనప్పటికీ ఈ పేరే ఫైనల్ కావొచ్చని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఓ షూటింగ్ షెడ్యూల్‌ కూడా పూర్తయింది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ధృవీకరించారు. ఈ మూవీలో కీలక పాత్రలో పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. డ్రాగన్‌ పోస్టర్‌ను పంచుకున్న ఆయన.. మరో రెండు లైనప్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. డ్రాగన్‌లో ఆసక్తికర రోల్‌లో మెప్పించనున్నారని అర్థమవుతోంది.కాగా.. జూనియక్ ఎన్టీఆర్‌తో అనిల్‌ కపూర్‌ నటిస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరూ వార్‌-2లో నటించారు. సందీప్‌ రెడ్డి వంగా యానిమల్‌ తర్వాత రెండోసారి దక్షిణాది దర్శకుడితో మూవీలో నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది.One has landed 🐉 The rest two are lining up...#Dragon @AnilKapoor garu via insta story ❤️‍🔥. #NTRNeel @tarak9999 pic.twitter.com/yWTdgUoFfJ— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) January 16, 2026

Sai Pallavi Bollywood Debut Movie Ek din Poster Gets copy trolls10
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. పోస్టర్‌తోనే విపరీతంగా ట్రోల్స్..!

భామ.. తమిళం, మలయాళంలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన సాయిపల్లవి.. రామాయణతో పాటు ఏక్‌ దిన్‌ అనే మూవీలో కనిపించనుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.తాజాగా సంక్రాంతి కానుకగా ఏక్‌ దిన్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఏక్ దిన్ మూవీ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అయితే ఈ పోస్టర్ కాస్తా విమర్శలకు దారి తీసింది. ఇది చూస్తుంటే 2016లో వచ్చిన థాయ్‌ రొమాంటిక్‌ డ్రామా వన్‌ డేను పోలి ఉందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆ మూవీని కాపీ చేశారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.పేరుతో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ చిత్రం రీమేక్‌ చేయనున్నారా? లేదా కొత్త స్టోరీనా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే కాపీ కంటెంట్‌ అనే విమర్శలొస్తూనే ఉంటాయి. ఈ మూవీని ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. సునీల్‌ పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో మే 1న రిలీజ్ చేయనున్నారు. Amir Khan Production: Sai Pallavi’s Bollywood debut #EkDin is the remake of Thai Film #OneDay.Of late Why Amir Khan is behind remakes🤔#LalSinghChadha - Flop#Loveyapa - Flop#SithareZameenPar - Decent#EkDin - 🤞 pic.twitter.com/W0IuZ7bbZZ— Christopher Kanagaraj (@Chrissuccess) January 16, 2026

Advertisement
Advertisement