Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Toxic faces backlash from Christian group over religious imagery in teaser1
యశ్ టాక్సిక్‌.. రిలీజ్‌కు ముందే మరో వివాదం..!

కేజీఎఫ్ హీరో నటించిన ఫుల్ యాక్షన్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. టీజర్ రిలీజ్ తర్వాత బోల్డ్ సీన్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఆ సీన్‌ విషయంలో కొందపు ఏకంగా డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌పై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌కు ముందే మరో కొత్త వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా చిత్రీకరించారని ఓ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు తమ మత విశ్వాసాలను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ సంబంధిత అధికారులకు లేఖ రాసింది. తమ మతంలో ప్రధాన దేవదూత అయిన సెయింట్ మైఖేల్ చిత్రీకరణపై ఈ బృందం ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సెయింట్‌ను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని.. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది.అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాడని ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ అధికారులను కోరారు. వివాదాస్పద దృశ్యాలను, ఆన్‌లైన్ వీడియోలను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అదనంగా చిత్రనిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మూవీ మేకర్స్ స్పందించాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు చిత్రనిర్మాతలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా.. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ధురంధర-2తో పోటీ పడనుంది.

Tolltwood actor VK Naresh Comments at Hey Bhagawan trailer event2
ఆ సంఘటన తర్వాత అందరు చీరల్లోనే: వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన ఆయన హగ్‌ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్‌ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ‍ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్‌ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్‌గా కనిపించనుంది. గోపి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు.

Vijay and Rashmika Marriage Video Deal Price Goes Viral3
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్‌కు నో..!

టాలీవుడ్‌లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్‌మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్‌ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్‌లో మోస్ట్‌ వైరల్‌ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్‌ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్‌ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్‌ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్‌కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్‌ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Supreme Court Fires On Manoj Bajpayee Ghooskhor Pandit Movie4
మనోజ్ బాజ్‌పేయీ సినిమాకు సుప్రీం షాక్‌.. పేరు మార్చాల్సిందే!

మనోజ్‌ బాజ్‌పేయీ తాజా చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పేరు మార్చనిదే విడుదలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. నీరజ్‌ పాండే, రితేశ్‌ షా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల కానుంది. ఇందులో మనోజ్‌.. అజయ్‌ దీక్షిత్‌ అనే అవినీతీ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా పేరు, మనోజ్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై బ్రహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలను నిలిపిపివేయాలంటూ కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు.. టైటిల్‌ మార్చిన తర్వాత విడుదల చేయాలని నిర్మాతలను ఆదేశించింది. ‘సినిమాలకు ఇలాంటి పేర్లు పెట్టి ఓ వర్గం ప్రజలను తక్కువ చేసి చూపే అధికారం ఎవరీకీ లేదు. వెంటనే పేరు మార్చాలి. కొత్త టైటిల్‌ని కోర్టుకు తెలిపిన తర్వాత విడుదల చేయాలకు అనుమతి ఇస్తాం’ అని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పాటు చిత్రంలో ఏ వర్గాన్నీ కించపరచడం లేదని హామీ ఇస్తూ నిర్మాతలు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్ర బృందం టైటిల్‌ను మార్చే యోచనలో ఉంది.

Arjun Sarja Gives Clarity On Political Entry5
రాజకీయాల్లోకి అర్జున్‌.. యాక్షన్‌ కింగ్‌ ఏమన్నారంటే..?

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్‌తో సహా పలువురు హీరోలు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు. కొత్తగా తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కుడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ హీరో అర్జున్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై అర్జున్‌ స్పందించారు. రాజకీయాలపై ఆసక్తి లేదని.. అంత జ్ఞానం కూడా తనకు లేదన్నాడు. (చదవండి: విశ్వక్‌ సేన్‌తో సినిమా తీస్తారా?.. అర్జున్‌ ఆన్సర్‌ ఇదే!)అర్జున్‌ దర్శకత్వంలో ఆయన కూతురు హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన అర్జున్‌.. ‘రాజకీయ ఎంట్రీ’పై స్పందింస్తూ... ‘నాకు మంచి పని చేయాలని ఉంది కానీ..దాని కోసం రాజకీయాల్లోకి రావాలని లేదు. నాకు అంత జ్ఞానం కూడా లేదు. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. ఒకవైపు నటిస్తూనే..మరోవైపు కొన్ని కథలను రాసుకుంటున్నాను. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే నాకు లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. మంచి చేయాలనుకునేవాళ్లు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటారు. విజయ్‌ ఇప్పుడే వచ్చాడు. ఆయన పని తీరు ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగే తాను కూడా విజయ్‌ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

Suhas Hey Bhagawan Trailer Out Now6
'హే భగవాన్‌'.. మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి రా? (ట్రైలర్‌)

సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'హే భగవాన్‌' ట్రైలర్‌ వచ్చేసింది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు తదితర సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సుహాస్‌ సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో గోపి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించగా నరేంద్రరెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో శివాని నగరం, నరేష్ విజయ కృష్ణ, సుదర్శన్ తదితరులు నటించారు.

Arjun Sarja Interesting Comments On Vishwak Sen7
విశ్వక్‌ సేన్‌తో సినిమా తీస్తారా?.. అర్జున్‌ ఆన్సర్‌ ఇదే!

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా ‘సీతా పయనం’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిరంజన్‌ హీరోగా నటించిన ఈచిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా విశ్వక్‌ సేన్‌ నటించాల్సింది. పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్‌ పాల్గొన్నాడు. కానీ షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో అర్జున్‌ మీడియా ముఖంగా విశ్వక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశ్వక్‌ సైతం వివరణ ఇచ్చుకున్నాడు. చివరకు నిరంజన్‌ని హీరోగా పెట్టుకొని ఈ సినిమాకు తెరకెక్కించాడు అర్జున్‌. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అర్జున్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విశ్వక్‌ వివాదంపై కూడా ఆయన స్పందించారు. విశ్వక్‌పై తనకు ఎలాంటి కోపం లేదని.. కొన్ని కారణాల వల్ల తప్పకున్నాడు. అంతమాత్రనా ఆయనపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ అవకాశం వస్తే కచ్చితంగా అతనితో సినిమా చేస్తా’ అని అర్జున్‌ అన్నారు. విశ్వక్‌ మారిన తర్వాత కథలో ఏవైనా మార్పులు చేశారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘నా సినిమాలో కథే హీరో. హీరో కోసం కథలో మార్పులు చేయలేదు. మొదట అనుకున్న కథతోనే ఈ సినిమాను తెరకెక్కించాను’ అని అర్జున్‌ అన్నారు.

Udit Narayan First Wife Files Complaint In Bihar Against Him8
నా గర్భాశయాన్ని ‍తీసివేయించాడు.. ఉదిత్‌ నారాయణ్‌పై రంజనా ఫిర్యాదు

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు రంజనా ఝా చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది.NDTVలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. బీహార్‌లోని సుపాల్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఉదిత్‌ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య కలిసి తనపై క్రిమినల్ కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఉదిత్ నారాయణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత రంజనా ఝా పలుమార్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. అయితే, తాజాగా ఆమె చేసిన ఆరోపణ అత్యంత హేయంగా ఉంది. ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం... 1996లో హెల్త్‌ చెకప్‌ పేరుతో తనను ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పింది. అయితే, తనకు తెలియకుండా గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపించింది. తన అంగీకారం లేకుండా ఉదిత్‌ నారాయణ కుట్ర పన్నారని చెప్పింది. తాను తల్లి కాకుండా అడ్డుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఈ విషయం తనకు చాలా ఏళ్ల తర్వాత తెలిసిందని చెప్పింది. మరో అనారోగ్య సమస్యతో డాక్టరును సంప్రదించినప్పుడు అసలు విషయం బయటపడిందని పేర్కొంది. ఉదిత్‌ నారాయణ్‌ చేసిన ఈ మోసం తనను మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో కుంగదీసిందని పోలీసుల ముందే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కుట్రలో ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య దీప కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్‌ని రెండో పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. 1984న హిందూ ఆచారాల ప్రకారం తనను మొదట పెళ్లి చేసుకున్నాడని రంజనా తెరపైకి వచ్చింది. అయితే తొలుత బుకాయించాడు గానీ ఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. కొంత కాలంగా భరణం కూడా చెల్లించడం లేదని రంజనా తెలుపుతుంది.

Jai Hanuman Movie will start on this date and venue9
హిస్టారికల్‌ ప్రదేశంలో 'జై హనుమాన్‌' మొదటి అడుగు

హనుమాన్‌ సీక్వెల్‌ 'జై హనుమాన్‌' ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద 2024లో కాసుల వర్షం కురిపించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని రూ. 300 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌ను తీసుకొస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే.తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్నదే ‘జై హనుమాన్‌’. ఈ మూవీ ఫిబ్రవరి 22న చారిత్రాత్మక పట్టణం హంపిలో పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నట్లు సమాచారం. సీక్వెల్‌ ‘హనుమాన్‌’కి మించి ఉంటుందని దర్శకుడు ప్రకటించడంతో భారీ బజ్‌ క్రియేట్‌ అయింది. ఆంజనేయస్వామి పాత్రను స్టార్ హీరో రిషభ్‌శెట్టి పోషిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. జై హనుమాన్ షూటింగ్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ రెండు చిత్రాలూ ‘ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగమే అని తెలిసిందే.

Film Director Rajkumar Hirani confirmed 3 Idiots Sequel10
రాజ్‌కుమార్‌ హిరాణి హిట్‌ సినిమా సీక్వెల్‌ రెడీ

బాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి 3 ఇడియట్స్‌’ మూవీ సీక్వెల్‌ ప్రకటించాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయి అని తెలిపాడు. విధు వినోద్‌ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో ఆమిర్‌ఖాన్ హీరోగా, ఆర్‌. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో 3 ఇడియట్స్‌ సీక్వెల్‌ గురించి రాజ్‌కుమార్‌ హిరాణి ఇలా అన్నారు. 3 ఇడియట్స్‌ సీక్వెల్‌ కథ కోసం పనులు ప్రారంభించామన్నారు. స్టోరీ విషయంలో సరికొత్త ఆలోచన వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ప్రేక్షకులు ఎలా రిసీవ​్‌ చేసుకుంటారో అనే ఆలోచన కూడా ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ పనులు మొదలుపెట్టలేదంటూనే దాదాపు అంతా సిద్ధమైందన్నారు. ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్‌’ సీక్వెల​్‌ కథనం సాగుతుందని బాలీవుడ్‌ భోగట్టా. మరోవైపు మున్నాభాయ్‌ సీక్వెల్‌ కూడా కథ పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement