ప్రధాన వార్తలు
రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలే. వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్.. హీరో ధనుష్ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.లైఫ్లో సెటిలవాలిప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్ మే సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.సన్యాసి జీవితమే..యాక్టర్గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్ ఉంది. కానీ నాపై రూమర్స్ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అందులో డౌటే లేదురూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్ను పట్టించుకుంటూ పోతే కెరీర్పై ఫోకస్ చేయలేను అని మృణాల్ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది?
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ప్రతి వీకెండ్ ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలా మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, వనవీర తదితర తెలుగు మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. అలానే తలైవర్ తంబి తలైమయిల్, ద కంజూరింగ్, బ్యాండ్ వాలే లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా డిజిటల్ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైపోయాయి. పెద్దగా హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ అవేంటి? వేటిలో ఉన్నాయి?సాయిచరణ్, ఉషశ్రీ హీరోహీరోయిన్లుగా చేసిన తెలుగు సినిమా 'ఇట్స్ ఓకే గురు'. గత డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు కాకపోవడంతో ఇదెప్పుడు వచ్చివెళ్లిందనే విషయం కూడా తెలీదు. ఇప్పడీ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్న ఓ వ్యక్తి.. జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎలా వెళ్లాడు? ఈ ఎదుగులలో ప్రేమ ఎలాంటి పాత్ర పోషించింది అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)ఇక డిసెంబరులోనే థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'పతంగ్'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆహా లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అంతా పతంగుల పోటీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ప్రేమకథ సినిమాలు ఏమైనా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా పర్లేదు బాగానే ఉందనిపించేలా ఉంటుంది.గతేడాది తమిళంలో వచ్చిన హిట్ అయిన సినిమా 'గెవి'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి కూడా వచ్చేసింది. అటవీ ప్రాంతంలోని ఓ ఊరిలో కొండచరియలు విరిగిపడటం, సరైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. దీంతో అక్కడి ప్రజలు.. పోలీసులు, రాజకీయ నాయకులపై తిరగబడతారు. ఉద్యమం చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. దయాలన్ దర్శకుడు.(ఇదీ చదవండి: సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం)
మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది?
అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్.. నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. శిరీష్ అన్నవదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం!పత్రికల పంపిణీఇప్పటికే దుబాయ్లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. తాజాగా పెళ్లిపత్రికల పంపిణీని మొదలుపెట్టారు. మొదటి పత్రికను చిరంజీవి- సురేఖ దంపతులకు ఇచ్చారు. ఆ ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మెగాస్టార్కు గాయం?మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్ చేశాడు. అందులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్- నిర్మల, శిరీష్ ఉన్నారు. అయితే ఫోటోలో మెగాస్టార్ షోల్డర్ బ్యాగ్ వేసుకుని కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైంది? సర్జరీ జరిగిందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.చదవండి: తిట్ల దండకం ఆపలేదు.. లాగిపెట్టి కొట్టా: బాలీవుడ్ హీరో
బిగ్బాస్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
A to Z
ఓటీటీల్లో సినిమాల పండగ.. ఒక్క రోజే 13 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారంలో థి...
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళ నటుడు జీవా నటించిన తలైవర్ తంబి తలైమైయిల్ చిత్...
ఓటీటీలోకి వచ్చేసిన ధర్మేంద్ర చివరి సినిమా
బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర.. మూడు నెలల క్రితం అం...
యానిమల్ నటుడి యాక్షన్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తోన్న లేటేస్ట్ మూవ...
అడుక్కుంటున్నా పట్టించుకోవట్లే.. హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత విక్రమ్ భట్ ఆర్థిక...
బన్నీని చూసి బాలీవుడ్ రగిలిపోతోందా?
‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత, దక్షిణాది నటుల్లో ఎవరిక...
దురంధర్పై ప్రశంసలు.. నన్ను కావాలనే టార్గెట్ చేశారు: అనురాగ్ కశ్యప్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర...
పాక్లో ధురంధర్ సీడీలు.. ఇంత చీప్గా దొరుకుతున్నాయా?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ గతేడాది ధురంధర్...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్డేట్
మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irum...
'మరిన్ని మ్యాజికల్ చేద్దాం'.. పెద్ది కెప్టెన్కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ రూరల్ స్ప...
'ఈ బిడ్డ నా జీవితకాల కోరిక'.. బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి తన అభిమా...
ప్రముఖ నటుడి కుమారుడి కారు బోల్తా..
తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన...
ఫొటోలు
ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )
టాలీవుడ్ యాంకర్ మ్యారెజ్ డే.. భర్తలో లాస్య జ్ఞాపకాలు (ఫోటోలు )
విశ్వక్సేన్ 'ఫంకీ' సక్సెస్ మీట్ (ఫోటోలు)
ట్రావెల్ అడ్వెంచర్ టాక్ షో 'సోల్ ట్రిప్' (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో నరేశ్- పవిత్ర (ఫోటోలు)
డాక్టర్గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)
'మెన్షన్ హౌస్ మల్లేష్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
బ్యూటీ విత్ బ్రెయిన్.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫోటోలు )
గాసిప్స్
View all
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
Mrunal Thakur: ధనుష్తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
రివ్యూలు
View all
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
సినీ ప్రపంచం
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు. అసలు సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది.
ప్రభాస్, బన్నీతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడేం చేస్తోంది?
తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నోళ్లు మెల్లమెల్లగా సైడ్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం స్టార్స్ అవుతారనుకుంటే పట్టుమని పది మూవీస్ కూడా చేయకుండా తెరమరుగైపోతుంటారు. అలాంటి బ్యూటీనే ఈమె. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్తో చేసినప్పటికీ మాయమైపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీక్షా సేథ్. ఢిల్లీలో పుట్టిన ఈమె.. తండ్రి ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, కోల్కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో పెరిగింది. మంచి పొడగరి కావడంతో 2009లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మోడలింగ్ అనుభవం లేనప్పటికీ టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఓ మోడలింగ్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమెని చూసిన దర్శకుడు క్రిష్.. 'వేదం'లో అవకాశమిచ్చాడు. ఇందులో పూజగా అల్లు అర్జున్ సరసన నటించింది. అలా టాలీవుడ్ దృష్టిలో పడింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)తర్వాత రవితేజ 'మిరపకాయ్', నిప్పు, గోపిచంద్ 'వాంటెడ్', మంచు మనోజ్ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ప్రభాస్ 'రెబల్' సినిమాలు చేసింది. వీటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉండేసరికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. అనంతరం హిందీలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.రీసెంట్ టైంలో ఈమె ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో అసలు ఇప్పుడేం చేస్తుందా అని వెతకగా.. స్పెయిన్లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా, అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటోందట. అలానే ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయిపోవడంతో జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్, గ్లామర్గా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721)
మెరుపుతీగలా అనుపమ.. మస్తు క్యూట్గా మృణాల్!
మెరుపుతీగలా సన్నని గ్లామర్తో అనుపమముద్దుముద్దుగా పోజులిచ్చేసిన మృణాల్అందాల జాతర చేస్తున్న డింపుల్ హయాతిపట్టుచీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్స్టేజీపై పాడుతూ దుమ్ములేపిన నోరా ఫతేహిచుడీదార్లో క్యూట్ 'కపుల్ ఫ్రెండ్లీ' వారణాసి View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi)
డ్యాన్స్తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి
లోకేష్ కనగరాజ్ తీసిన 'కూలీ' చూసినవారెవ్వరూ అందులోని మోనికా పాటని మర్చిపోలేరు. నిజానికి చూడనివారినీ వదలకుండా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కవర్ సాంగ్గా ఆ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపును ఆ ఒక్క పాటతో దక్కించుకున్నాడు మళయాళ నటుడు సౌబిన్ షాహిర్. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేడుకల్లో ఆ పాట సందడి చేస్తూనే ఉంది.ఈ నేపధ్యంలో మన టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ఆ పాట క్రేజ్కి చెక్ పెట్టేలా ఉన్నాడు. త్వరలో విడుదల కానున్న 'కాటలన్' అనే మళయాళ చిత్రంలో మోనికా పాటని మించేలా డ్యాన్స్ ఊపేశారు. ఈ విషయం తాజాగా ఆ సినిమా టీజర్ లాంచ్తో వెల్లడైంది. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ పెపే, దుసర విజయన్, కబీర్ సింగ్లతో పాటు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్ర నిర్మాతలు తమ చిత్రం మొదటి లిరికల్ వీడియోని విడుదల చేశారు. 'మజాకో మల్లికా' అంటూ సాగే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే వైరల్గా మారింది. ముఖ్యంగా సునీల్ స్టెప్స్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)'మజాకో మల్లికా'లో సునీల్ డ్యాన్స్లో ఈజ్ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ పాటను చాలామంది మోనికా పాటతో పోలుస్తున్నారు. ఓ చేత్తో సిగిరెట్ పట్టుకుని స్మోక్ చేస్తూ ఒకే కాలితో సునీల్ వేసిన స్టెప్స్ని చూసి ఒక నెటిజన్.. 'నటుడు సునీల్ డ్యాన్స్ నెక్ట్స్ లెవల్' అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకులకు సునీల్ డ్యాన్స్ బాగా పరిచయం అయినప్పటికీ... దక్షిణాది మొత్తానికి ఇప్పుడు పరిచయం అయిందని చెప్పొచ్చు.ఈ పాటకు సంగీతాన్ని ప్రముఖ కన్నడ సంగీతకారుడు అజనీష్ లోక్నాథ్ స్వరపరిచారు, ఇతను 'కాంతారా చాప్టర్ 2' కు వర్క్ చేయడం విశేషం. ఈ పాటను ఆనంద్ శ్రీరాజ్ భద్ర పాడారు, వినాయక్ శశికుమార్ సాహిత్యం రాశారు. కూలీ సినిమాలో సౌబిన్ లాగే ఈ సినిమాలో కూడా సునీల్ విలన్గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాటలన్ చిత్రం విడుదల తర్వాత సునీల్ సాంగ్.. మోనికా రేంజ్లో హిట్ కొడితే ఇక దక్షిణాది సినిమాల్లో హీరోలతో పాటుగా విలన్ పాటల ట్రెండ్ మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందిన మార్కో సినిమాను అందించిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అందిస్తున్న ఈ యాక్షన్ సినిమా మే నెలలో విడుదల కానుంది.(ఇదీ చదవండి: పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?)
రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలే. వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్.. హీరో ధనుష్ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.లైఫ్లో సెటిలవాలిప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్ మే సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.సన్యాసి జీవితమే..యాక్టర్గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్ ఉంది. కానీ నాపై రూమర్స్ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అందులో డౌటే లేదురూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్ను పట్టించుకుంటూ పోతే కెరీర్పై ఫోకస్ చేయలేను అని మృణాల్ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది?
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ప్రతి వీకెండ్ ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలా మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, వనవీర తదితర తెలుగు మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. అలానే తలైవర్ తంబి తలైమయిల్, ద కంజూరింగ్, బ్యాండ్ వాలే లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా డిజిటల్ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైపోయాయి. పెద్దగా హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ అవేంటి? వేటిలో ఉన్నాయి?సాయిచరణ్, ఉషశ్రీ హీరోహీరోయిన్లుగా చేసిన తెలుగు సినిమా 'ఇట్స్ ఓకే గురు'. గత డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు కాకపోవడంతో ఇదెప్పుడు వచ్చివెళ్లిందనే విషయం కూడా తెలీదు. ఇప్పడీ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్న ఓ వ్యక్తి.. జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎలా వెళ్లాడు? ఈ ఎదుగులలో ప్రేమ ఎలాంటి పాత్ర పోషించింది అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)ఇక డిసెంబరులోనే థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'పతంగ్'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆహా లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అంతా పతంగుల పోటీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ప్రేమకథ సినిమాలు ఏమైనా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా పర్లేదు బాగానే ఉందనిపించేలా ఉంటుంది.గతేడాది తమిళంలో వచ్చిన హిట్ అయిన సినిమా 'గెవి'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి కూడా వచ్చేసింది. అటవీ ప్రాంతంలోని ఓ ఊరిలో కొండచరియలు విరిగిపడటం, సరైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. దీంతో అక్కడి ప్రజలు.. పోలీసులు, రాజకీయ నాయకులపై తిరగబడతారు. ఉద్యమం చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. దయాలన్ దర్శకుడు.(ఇదీ చదవండి: సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం)
మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది?
అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్.. నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. శిరీష్ అన్నవదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం!పత్రికల పంపిణీఇప్పటికే దుబాయ్లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. తాజాగా పెళ్లిపత్రికల పంపిణీని మొదలుపెట్టారు. మొదటి పత్రికను చిరంజీవి- సురేఖ దంపతులకు ఇచ్చారు. ఆ ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మెగాస్టార్కు గాయం?మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్ చేశాడు. అందులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్- నిర్మల, శిరీష్ ఉన్నారు. అయితే ఫోటోలో మెగాస్టార్ షోల్డర్ బ్యాగ్ వేసుకుని కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైంది? సర్జరీ జరిగిందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.చదవండి: తిట్ల దండకం ఆపలేదు.. లాగిపెట్టి కొట్టా: బాలీవుడ్ హీరో
తిట్లదండకం ఆపలేదు.. కోపంతో లాగిపెట్టి కొట్టా: హీరో
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. ప్రత్యర్థులను మట్టి కరిపించడంలోనే కాదు, వారిపై పంచులు విసరడంలోనూ దిట్ట! ఇతడు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్కు షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 5 జడ్జిలు హాజరయ్యారు. వారిలో ఒకరైన అమన్ గుప్తా.. మీరు జీవితంలో బాగా ఇబ్బందిపడ్డ సంఘటన ఏది? అని అడిగాడు.ఎంత చెప్పినా వినడే..అందుకు అక్షయ్ ఏదైనా ఫన్నీ సంఘటన చెప్తాడనుకుంటే ఏకంగా ఒకరిని లాగి పెట్టి కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్తో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి నా స్నేహితుడిని తిడుతున్నాడు. ఆపమని వారించినా సరే వినకుండా దుర్భాషలాడుతున్నాడు. మొదట మంచిగా చెప్పి చూశా.. తర్వాత వార్నింగ్ ఇచ్చా.. అయినా వినలేదు. ఇక ఆరోసారి మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చాను.ఆవేశం పట్టలేక..అందరిముందు అలా తిడుతుండేసరికి నా ఫ్రెండ్ ఏడుస్తున్నాడు. అది చూసి భరించలేకపోయిన నేను అతడి చెంప చెళ్లుమనిపించాను. ఒక్క దెబ్బకే అతడు కిందపడిపోయి స్పృహ కోల్పోయాడు. అయిపోయింది, నా కెరీర్ ఖతం అని భయపడ్డా.. అతడికి మెలకువ రావాలని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ముఖంపై నీళ్లు చల్లిన కొద్ది క్షణాలకే అతడు లేచి కూర్చో వడంతో ఊపిరి పీల్చుకున్నా..ఈరోజు అయితే..అదే సంఘటన ఈరోజు జరిగి ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని కానీ అలా కొట్టేవాడిని కాదు. అదే నాకు ఇబ్బందిగా అనిపించిన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ చివరగా జాలీ ఎల్ఎల్బీ 3 సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ సినిమా భూత్ బంగ్లా ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న నటి
సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం
సూపర్స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాల్లో 'బాషా'కి ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మరణించారు. వృద్ధాప్య సమస్యలతో నిర్మాత తమిళగన్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల.. రజనీ సంతాపం వ్యక్తం చేశారు. బాధపడుతూ ట్వీట్ చేశారు.(ఇదీ చదవండి: హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్)'సోదరుడు లాంటి అళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా సానుభూతి' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం (ఫిబ్రవరి 15) తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. రజనీ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాషా' చిత్రాన్ని తమిళగన్, తన తల్ల రాజమ్మాళ్తో కలిసి నిర్మించారు. ఇతడి తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితోపాటే మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకుడిగానూ వ్యవహరించారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)மதிப்பிற்குரிய அமரர் ஆர்.எம். வீரப்பன் அவர்களின் புதல்வர், எனது அன்புத் தம்பி தமிழழகன் அருமையான மனிதர். அவரது திடீர் மறைவு எனக்கு மிகுந்த வேதனையளிக்கிறது. அவருடைய ஆத்மா சாந்தியடையட்டும். குடும்பத்தாருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள்.— Rajinikanth (@rajinikanth) February 15, 2026
సినిమా
చికిరి చికిరి హుక్ స్టెప్ వెనకాల రామ్ చరణ్
సీతా పయనం చిత్ర బృందంతో జగపతి బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ
నాకు టైం ఇవ్వట్లేవు నన్ను IGNORE చేస్తున్నావేంటి? మా అమ్మ తర్వాత నువ్వే పవిత్ర
లవ్ &రిలేషన్ షిప్ కి ఉన్న తేడా అదే..! ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే...
సుహాస్ కాల్ చేసి మరీ..! ఫ్రెండ్ రోల్ కోసం వెళ్లి...
పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
మెగా వారసుల నామకరణం.. ఏం పేర్లు పెట్టారంటే
60 కోట్లు ఇస్తానన్న నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన విజయ్
జోరుమీదున్న వెంకీ మామ ఏకంగా లైన్ లో 7 సినిమాలు
Arjun Sarja: రోజుకో గంట మీ శరీరానికి ఇచ్చుకోండి లైఫ్లో ఫిట్గా ఉంటారు
