Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Rajamouli Reacts Varanasi Two Parts And Working With Mahesh Babu1
మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై క్లారిటీ

'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా 'వారణాసి'. 2024లో షూటింగ్ మొదలైనప్పటికీ.. గతేడాది నవంబరులోనే అన్ని విషయాలు బయటపెట్టారు. టైటిల్‌తో సహా మూవీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని గ్లింప్స్ రూపంలో రివీల్ చేశారు. దానికోసం భారీ ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, రాజమౌళి.. పలు హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ చేసేశారు. ఇందులోనే రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్ అంటూ వస్తున్న రూమర్స్‌పైనా క్లారిటీ ఇచ్చేశారు.15 ఏళ్ల క్రితమే మహేశ్ బాబు, మీరు కలిసి పనిచేయాలనుకున్నారు? మరి దానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? అనే ప్రశ్నకు బదులిచ్చిన రాజమౌళి.. '2010లో నేను-మహేశ్ మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని ఫిక్సయ్యాం. కాకపోతే నాకున్న మూడు కమిట్మెంట్స్ పూర్తి చేసి వస్తానని మాటిచ్చాను. ఆరు నెలల్లో ఈగ తీద్దామనుకుంటే రెండేళ్లు పట్టేసింది. రెండేళ్లలో బాహుబలి తీద్దామనుకుంటే మూడేళ్లు పట్టేసింది. కొవిడ్ వల్ల 'ఆర్ఆర్ఆర్' చాలా ఆలస్యమైపోయింది. అందుకే మహేశ్ బాబుతో చేయడానికి ఇన్నేళ్లు పట్టేసింది' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజమౌళి.. మేం ఆలోచించుకున్న తర్వాత సీక్వెల్ వద్దని డిసైడ్ అయ్యాం. దాదాపు 3 గంటల నిడివితోనే మూవీ థియేటర్లలోకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చేశాడు. అలానే ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్.. ఐదు నిమిషాలు బోర్ కొట్టినా సరే ఫోన్ చూసుకుంటాడు. స్టోరీ విషయంలో ప్రేక్షకుడు తల పక్కకు తిప్పకుండా ఉండేలా మూవీని తీస్తున్నాం. అదే అతిపెద్ద ఛాలెంజ్ అని అన్నాడు. 'వారణాసి'లో రామాయణం సీన్స్ ఉండటానికి గల కారణాన్ని కూడా రాజమౌళి వెల్లడించాడు. 'నా సినిమాలన్నీ కూడా రామాయణ, మహాభారత నుంచి స్ఫూర్తి పొందినవే. కానీ ఈసారి స్ఫూర్తి కాకుండా 'రామాయణం' ఓ భాగాన్ని 'వారణాసి'లో చూపించే అవకాశం దొరికింది' అని జక్కన్న అన్నాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారులు కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్..'వారణాసి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. మొన్నటివరకు విడుదల తేదీపై కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న అంటే ఉగాది సందర్భంగా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ బల్లగుద్ది చెప్పింది.(ఇదీ చదవండి: సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్)

Rajamouli, Mahesh Babu Varanasi Movie will be released 2 parts says netizens2
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?

బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్‌ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్‌కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్‌లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Veteran Malayalam music director S P Venkatesh dies at 70 years3
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ ఇవాళ కన్నుమూశారు. గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించారు. ఆయన మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆయన మరణం కేరళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అభివర్ణించారు1980- 1990లలో మలయాళ సినిమాకు వెంకటేశ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. మలయాళ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్‌పీ వెంకటేశ్ ఒకరు. మలయాళ సినీ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగారు. 1980వ దశకంలో అత్యంత ఫేమస్ అయ్యారు. తన సూపర్ హిట్‌ పాటలతో, సినిమాల భావోద్వేగ లోతును పెంచే శక్తివంతమైన నేపథ్య సంగీతానికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. రాజవింటే మకన్, జానీ వాకర్, పైతృకం, సోపానం, హైవే వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు వెంకటేశ్ సంగీతం అందించారు.

Ram Charan fans show off gift hampers they received after his twins birth4
రామ్ చరణ్ దంపతులకు ట్విన్స్.. అభిమానులకు మెగా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్..!

మెగా ఫ్యామిలీ ఇంట మరో సంబురం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో సంతోషం మరింత రెట్టింపైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే అభిమానులతో పంచుకున్నారు. అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్..అయితే ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్‌కు స్వీట్స్‌ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుండి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ఈ మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిని ఫ్యాన్స్‌ అంటున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Lakshmi Vadupu (@lakshmi_naidu_10)

Rashmika indirectly confirms her wedding to Vijay Deverakonda on this date5
రష్మిక- విజయ్ పెళ్లి తేదీపై కన్‌ఫ్యూజన్‌.. కన్‌ఫామ్ చేసినట్టేనా?

టాలీవుడ్‌లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్‌ నుంచి ఎంగేజ్‌మెంట్‌ వరకు ఫ్యాన్స్‌లో కన్‌ఫ్యూజన్‌ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా? అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్‌ అంటూ వార్తలు హల్‌ చల్‌ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్‌ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్‌గా నవ్వుకుంటూ ‍అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్‌తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.గత డిసెంబర్‌లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ప్యాలెస్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

Anand Deverakonda Latest Movie Takshakudu Teaser out now6
నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్‌.. ఆసక్తిగా టీజర్

అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్‌ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.కాగా.. ఈ మూవీలో లపతా లేడీస్‌ ఫేమ్‌ నీతాన్షీ గోయెల్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.

Tollywood hero Sharwanand Latest Movie Biker Release date Locked7
శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ ‍మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.ఈ సమ్మర్‌ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. The engine's revved up 🏍️The track is ready 🛣️Now, THERE IS NO STOPPING HIM ❤️‍🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rdCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i— UV Creations (@UV_Creations) February 3, 2026

Meenakshi Chaudhary And Malavika Mohanan Latest News8
పడుకుని పోజులిచ్చిన మీనాక్షి.. బ్లాక్ డ్రస్‌లో మాళవిక

కింద పడుకుని పోజులిచ్చేసిన మీనాక్షి చౌదరిబ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మాళవిక మోహనన్క్యూట్ అండ్ స్వీట్ లుక్స్‌లో అనన్య నాగళ్లముంబై జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్తెగ నవ్వేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sai Dhanshika (@saidhanshika)

Super Subbu Series Teaser9
సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్

శృంగారం లేదా సె*క్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చాలు చాలామంది అదేదో బూతులా చూస్తారు. అసలు ఈ పదాలు ఉచ్ఛరించడమే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ ప్రస్తుత జనరేషన్‌లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పలు రకాలుగా అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. దాని టీజర్ ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)'సూపర్ సుబ్బు' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించిన సదరు ఓటీటీ సంస్థ.. అక్కడ దీని టీజర్ రిలీజ్ చేసిది. కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది. టీజర్ బట్టి చూస్తే.. సుబ్బు.. చిన్నప్పటి నుంచి చిలిపి కుర్రాడు. పెద్దయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడనుకుంటే ఏకంగా 60 మంది అమ్మాయిలు ఇతడిని రిజెక్ట్ చేస్తారు.మరోవైపు సుబ్బుకి టీచర్‌గా అవకాశమొస్తుంది. కాకపోతే ఓ పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు వెళ్లిన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. ఈ సిరీస్‌లో సందీప్ కిషన్‌కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది. మురళీ శర్మ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు చేశారు. (ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!)

Interesting Comparison Of Naveen And Adivi Sesh Siddhu Jonnalagadda10
ఈ హీరోల టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!

టాలీవుడ్‌లో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. కమర్షియల్ సినిమాలు ఒకటో రెండు ఆడుతున్నాయి తప్పితే కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఎక్కువగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే రైటింగ్ లాంటి వాటిలో పాలుపంచుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ పేర్లు ప్రముఖమైనవి. వీళ్ల ప్రతిభని అందరూ మెచ్చుకుంటున్నారు. కాకపోతే నాణెనికి మరోవైపు చూస్తే పరిస్థితి చిత్రంగా ఉంటుంది.(ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ.. వీళ్లు డైరెక్ట్‌గా హీరోలు అయిపోలేదు. చాన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేశారు. గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ టైంలోనే కేవలం యాక్టింగ్‌ని నమ్ముకోకుండా రైటింగ్‌పై కూడా పట్టుసాధించారు. తమ సినిమాలకు కథలు, సీన్స్ విషయంలో వీళ్ల వైపు నుంచి అద్భుతమైన తోడ్పాటు అందించారు. ఇదే ఆయా చిత్రాల తీసే దర్శకులకు మైనస్ అవుతుందా అనే సందేహం కలుగుతోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.అడివి శేష్‌నే తీసుకుందాం. క్షణం, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తోనే తీసిన ఈ మూవీస్.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. వీటి సక్సెస్‍‌లో శేష్ సహకారం చాలానే ఉంది. కానీ ఈ చిత్రాలు తీసిన దర్శకులు రవికాంత్ పేరేపు, శశికిరణ్ తిక్క.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయా చిత్రాల రిలీజ్‌కి ముందు, తర్వాత కూడా శేష్‌కే చాలా పేరొచ్చింది తప్పితే దర్శకులని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. శేష్ ప్రస్తుతం చేస్తున్న డకాయిట్, గూఢచారి 2 సినిమాలకు దర్శకులు ఎవరని అడిగితే చాలామంది చెప్పలేరు. అది పరిస్థితి.(ఇదీ చదవండి: ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?)నవీన్ పొలిశెట్టి విషయానికొస్తే.. స్వతహాగా తెలుగు కుర్రాడే కానీ మొదట హిందీలో పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, వన్ నేనొక్కడినే, డీ ఫర్ దోపిడి లాంటి చిత్రాల్లో యాక్టింగ్ చేశాడు. కాకపోతే వాటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు! హీరోగా చేసిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ'.. నవీన్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఈ మూవీ దర్శకుడు ఎవరని అడిగితే.. చాలామంది చెప్పలేరు. అంతెందుకు రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన 'అనగనగా ఒక రాజు' మూవీకి కూడా కర్త కర్మ క్రియ నవీనే.. దర్శకుడిగా మారి అనే కుర్రాడు ఉన్నప్పటికీ.. క్రెడిట్ అంతా నవీన్‌కే వచ్చింది.సిద్ధు జొన్నలగడ్డ.. కెరీర్ ప్రారంభంలో 'ఆరెంజ్'తో పాటు పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసినప్పటికీ 'డీజే టిల్లు' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కింది. 'టిల్లు స్కేర్'తో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ రెండు మూవీస్‌కి దర్శకులు ఎవరంటే? చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఈ చిత్రాల రైటింగ్ విషయంలో సిద్ధు కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాల తర్వాత సదరు దర్శకులు కొత్తగా ఏం మూవీస్ చేస్తున్నారో? ఎక్కడున్నారో తెలీదు? ఇలా పైన చెప్పిన హీరోలు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వీళ్ల సినిమాలకు దర్శకులుగా చేస్తున్న వాళ్లు మాత్రం.. తర్వాత నుంచి పెద్దగా కనిపించకుండా పోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?)

Advertisement
Advertisement