Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Rachita Ram Interesting Comments On Body Shaming1
నా శరీరం, నా ఇష్టం.. బయటకు చెప్పాల్సిన అవసరం లేదు: నటి

బాడీ షేమింగ్‌కు గురై ఆత్మహత్యలు చేసుకునేవారంతా తన దృష్టిలో మూర్ఖులేనని అన్నారు ప్రముఖ నటి రచితా రామ్‌. రజనీకాంత్‌ ‘కూలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి రచితా రామ్‌. ఆ సినిమాలో మాస్‌ విలన్‌ పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఆమె నటించిన తాజా కన్నడ చిత్రం ‘కల్ట్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో బాడీ షేమింగ్‌ గురించి రచితా(Rachita Ram ) మాట్లాడారు. చాలా మంది ఆడపిల్లలాగే తాను కూడా బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నానని.. కానీ దాన్ని చాలా తెలివిగా హ్యాండిల్‌ చేశానని చెప్పారు. వాళ్ల కామెంట్స్‌ని పట్టించుకోకుండా..మన పని మనం చేసుకుంటే సరిపోతుందని ఆమె సలహా ఇచ్చారు.‘ప్రతి మహిళ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బరువు పెరుగుతుంటారు. పీసీఓడీ, ఒత్తిడి వల్ల కొంతమంది లావు అవుతుంటారు. పీరియడ్స్‌కి ముందు, తర్వాత కూడా శరీరంలో మార్పులు వస్తుంటాయి. నిద్ర కూడా మన శరీరంపై ప్రభావం చూపుతుంది. కొంతమందికి ఎనిమిది గంట నిద్ర కచ్చితంగా అవరసరం ఉంటుంది. లేదంటే వాళ్ల బాడీలో మార్పులు వచ్చేస్తుంటాయి. నేను కూడా ఆ లిస్ట్‌లోకి వస్తా. నేను సరిగా నిద్రపోకపోతే.. ఉదయం నా మొఖం చాలా ఉబ్బుగా కనిపిస్తుంది. కొన్ని గంటల తర్వాత మళ్లీ సన్నబడుతుంది. నాతో పని చేసే దర్శకులు కూడా ఇది గమనించి చెప్పారు. ఇలాంటి సమస్యలు చాలా మంది మహిళలకు ఉంటాయి. ఇవన్నీ బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్లుగా మనం ఉండాలి. ఇది నా శరీరం.. నా ఇష్టం. ఎందుకు లావు అయ్యామో.. ఎందుకు సన్నబడ్డామో అనే విషయాలను ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం గురించి వేరేవాళ్లకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అని రచితా చెప్పుకొచ్చారు.అలాగే ఆన్‌లైన్‌లో వచ్చే నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోలింగ్‌ని ఎలా హ్యాండిల్‌ చేయాలనేదాని గురించి మాట్లాడుతూ.. ‘ అసలు నెగెటివ్‌ కామెంట్స్‌ని ఎందుకు చూడాలి? ఎందుకు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి? అలాంటి విషయాలను మీరు మైండ్‌లోకి తీసుకోకండి. వాటిని పట్టించుకోకుండా.. మన పని మనం చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటాం’ అని రచితా రామ్‌ చెప్పుకొచ్చింది.

Bollywood singer Says He was Paid 0 for This Songs2
ఆ పాటలు పాడినందుకు పైసా ఇవ్వలేదు: సింగర్‌

యాక్టర్సే కాదు సింగర్స్‌ కూడా లక్షల్లో ఏకంగా కోట్లల్లో సంపాదిస్తున్నారు. అయితే అందరి పరిస్థితి అలా లేదంటున్నాడు బాలీవుడ్‌ సింగర్‌ కృష్ణ బ్యూరా. ఇతడు చక్‌దే ఇండియాలో మౌలా మేరే లేలే మేరీ జాన్‌, ఆషిక్‌ బనాయా ఆప్నేలో ఆప్‌కీ కాశిశ్‌ వంటి పలు సాంగ్స్‌ ఆలపించాడు. తనకు సరైన పారితోషికం ఇవ్వలేదని చెప్తున్నాడు.సరైన పారితోషికం లేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్‌ కృష్ణ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో సింగర్స్‌ కోసం ఎటువంటి విధివిధానాలు లేవు. ఆర్టిస్ట్‌కు ఒకరోజుకు ఇంత అని ఎలా ఇస్తారో.. సింగర్‌ను స్టూడియోకు పిలిపించినప్పుడు కనీసం రూ.10 వేలయినా ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఆప్‌ కీ కాశిశ్‌ పాటకు నాకు రూ.10 వేలిచ్చారు. అందులో రూ.900 టీడీఎస్‌ కట్‌ అయింది. చక్‌దే ఇండియాలో ఒక పాట పాడినందుకు మళ్లీ అంతే ఇచ్చారు.పైసా రాలేరాజ్‌ మూవీలోని సోనియా ఓ సోనియా పాటకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోకో కహా దుండెరే బండె, మేరా ఇంతకం దేకేగి పాటలకు పైసా పారితోషికం ఇవ్వలేదు. నా 23 ఏళ్ల కెరీర్‌లో సినిమా పాటలు పాడి పెద్దగా సంపాదించిందే లేదు. మేము బయట షోలు, కచేరీల ద్వారా బాగా సంపాదిస్తామని ఇక్కడ నిర్మాతలు అనుకుంటారు. డిమాండ్‌ ఉంటేనేపోనీ, మొమహమాటం పక్కనపెట్టి డబ్బు అడిగామనుకో.. నెక్స్ట్‌ టైం నీకు పాడే ఛాన్స్‌ ఇవ్వరు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. కొందరు పాటకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు తీసుకుంటారు. ఒక్క సాంగ్‌కు రూ.50 లక్షలు, రూ.3 కోట్ల వరకు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. సింగర్స్‌కు డిమాండ్‌ ఉంటేనే వారు అడిగినంత ఇస్తారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: పెళ్లికి పిలిచి అవమానించాలా? అసభ్యంగా ఫోటోలు, వీడియోలు: నటి ఆగ్రహం

Viral Penguin Story Full Details Telugu3
ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో 'పెంగ్విన్' స్టోరీ ఒకటి తెగ వైరల్ అవుతోంది. కొన్ని పెంగ్విన్స్ గుంపుగా సముద్రం వైపు వెళ్తుండగా.. ఒకటి మాత్రం ఒంటరిగా మంచు పర్వతాల్లోకి వెళ్తున్న వీడియో ఇది. చాలామంది దీనికి రిలేట్ అవుతున్నారు. తమని తాము ఆ ఒంటరి పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. ఇంతకీ ఈ సింగిల్ పెంగ్విన్ స్టోరీ ఏంటి? అసలేమైంది?(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)పెంగ్విన్ వీడియో.. సాధారణ వైరల్ వీడియో అయితే కాదు. దీని వెనక పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంది. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఐదేళ్ల క్రితం తన మ్యూజింగ్స్‌లో ఒంటరి పెంగ్విన్ గురించి చెప్పుకొచ్చాడు. సందర్భం ఏంటో తెలీదు గానీ ఇప్పుడు మరోసారి అది వైరల్ అవుతోంది. అంటార్కిటికాలో పెంగ్విన్స్ అన్నీ నివసిస్తుంటాయి. వీటి జీవన విధానం చాలా సింపుల్. సముద్రంలో ఉంటాయి. లేదంటే కాలనీల్లో ఉంటూ మిగతా పెంగ్విన్స్‌తో కలిసి పిల్లల్ని కంటూ ఉంటాయి. ట్రెండింగ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్ వెనక మాత్రం కళ్లు చెమర్చే కథ ఉందట! మనుషులకే పరిమితమైన ప్రేమ, విరహం, వైరాగ్యం అనే ఎమోషన్స్ మూగజీవుల్లోనూ ఉంటాయని ఈ పెంగ్విన్ స్టోరీ చెప్పకనే చెబుతోంది.డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటుంది. ఒకసారి జత కుదిరితే చనిపోయే వరకు ఆ బంధాన్ని వదులుకోదు. ఒకవేళ ఆడ పెంగ్విన్.. ఆ నమ్మకాన్ని వంచిస్తే లేదా బంధాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మగ పెంగ్విన్ ఆ వియోగాన్ని తట్టుకోలేదు. ఈ ఒంటరి పెంగ్విన్ కూడా అలానే బంధం నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. అందుకే మిగతా వాటితో కాకుండా ఒంటరిగా పర్వతాల వైపు వెళ్లదలుచుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో బిట్.. 2007లో ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన 'ఎన్‌కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే డాక్యుమెంటరీలోనిది. పరిశోధకుడు డాక్టర్ ఐన్లీతో కలిసి వెర్నర్.. అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ గుంపుని గమనించినప్పుడు.. ఈ ఒంటరి పెంగ్విన్‌ని చూశారు. మిగతా పెంగ్విన్లు అన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే..ఈ ఒంటరి పెంగ్విన్ మాత్రం కాసేపు అక్కడే ఆగిపోయింది. వెనక్కి తిరిగి దాదాపు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న మధ్యభాగం వైపు నడవటం మొదలుపెట్టింది. అది దారితప్పిందేమో అనుకుని తీసుకొచ్చి గుంపులో కలిపినా తిరిగి పర్వత ప్రాంతాల వైపు వెళ్లింది. దీంతో ఏదో విషయంలో అది మోసపోయిందని, జీవితంలో బాగా విసిపోయిందని.. అందుకే ఒంటరి దారిని ఎంచుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రేమలో విఫలమైందని అంటున్నారు.సోషల్ మీడియా.. ఈ ఒంటరి జీవికి 'నిహిలిస్ట్ పెంగ్విన్' అని పేరు పెట్టింది. ప్రస్తుతం జీవితం చాలా ఒత్తిడిగా మారిపోయిందని భావించే చాలామంది.. తమని తాము ఈ పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. పోటీతత్వం, బాధ్యతలు, జీవితంలో అలసట వల్ల 'ఇక చాలు' అని విషయాన్ని ఆ పెంగ్విన్ ప్రవర్తన ప్రతిబింబిస్తోందని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఓ ఒంటరి పెంగ్విన్ వీడియో.. ఇంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషమే!(ఇదీ చదవండి: మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్)The Original 🐧 Story 🙂#penguin pic.twitter.com/TR6L5Adm7Q— THE LITTLE SQUIRREL 🇮🇳🚩🐿️⚡️ (@ReadwithLS) January 23, 2026

Dhanush Mrunal Thakur Wedding Video Ai Details4
మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్

తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ప్రేమలో ఉన్నారని.. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్నిరోజుల ముందు షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమని చాలామంది నమ్మేశారు కూడా. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని స్వయానా మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో రిలాక్స్ అవుతారనుకుంటే ఇప్పుడు ఏకంగా ధనుష్-మృణాల్ పెళ్లి చేసేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)రీసెంట్ టైంలో ఏఐ(కృత్రిమ మేధ) వినియోగం చాలా పెరిగిపోయింది. తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలని యూజర్స్ తయారు చేసుకుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ నెటిజన్.. ఇలానే ధనుష్-మృణాల్ పెళ్లి జరిగినట్లు, ఈ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన దళపతి విజయ్, అజిత్, త్రిష, అనిరుధ్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు హాజరైనట్లు కూడా సృష్టించారు. ఇది ఫేక్ వీడియోనే అయినప్పటికీ యూజర్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుండటం విశేషం.ఈ పెళ్లి రూమర్స్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ధనుష్ ఒంటరిగానే ఉంటున్నాడు. రీసెంట్ టైంలో మృణాల్ చేసిన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ జరిగితే వీటిలో ధనుష్ కనిపించడం, డేటింగ్ రూమర్స్ రావడానికి కారణమైంది. ఈ క్రమంలోనే పెళ్లి గాసిప్స్ కూడా వచ్చాయి. అవి అబద్ధమని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఏఐ వీడియోలు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)Dey 😂😂😂Wedding 🙏🏻🙏🏻🙏🏻🙏🏻#MrunalThakur #Dhanush pic.twitter.com/tCWx7bTVcE— Swaasthi (@swaasthi) January 24, 2026

Bollywood Actress Mouni Roy Spoke Out About A Disturbing Incident At A Haryana Event5
నడుముపై చేయి వేసి.. అవమానంతో చచ్చిపోయా!

యాక్టర్స్‌ సినిమాలు, సీరియల్స్‌, యాడ్స్‌, షోలతో పాటు బయట ఈవెంట్స్‌ కూడా చేస్తుంటారు. నటి మౌనీ రాయ్‌ కూడా అలాంటి ప్రోగ్రామ్స్‌కు తరచూ వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఆ కార్యక్రమం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందంటోంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నడుముపై చేయి వేసిన అంకుల్స్‌'కర్నాల్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ ఇద్దరు అంకుల్స్‌ చాలా చెత్తగా ప్రవర్తించారు. వాళ్లకు తాత వయసుంటుంది. నేను స్టేజీపైకి వెళ్తుంటే ఆ అంకుల్స్‌తో పాటు వారి కుటుంబంలోని మగవారు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా నడుముపై చేయి వేసి ఫోటోలు దిగారు. సర్‌, చేయి తీసేయండి అని వినయంగా చెప్పినా వెగటుగా ప్రవర్తించారు. స్టేజీ ఎక్కాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పరిస్థితి మరింత ఘోరంఎదురుగా ఉన్న ఇద్దరు అంకుల్స్‌ చెండాలమైన కామెంట్స్‌ చేస్తూ అసభ్య సంజ్ఞలు చూపించారు. దయచేసి అలా చేయొద్దు అని చెప్పగానే నాపై గులాబీలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు నేను డ్యాన్స్‌ మధ్యలోనే ఆపేసి స్టేజీ దిగి వచ్చేయాలనుకున్నాను. కానీ కోపాన్ని ఆపుకుని నా పర్ఫామెన్స్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా వాళ్లు అలాగే నీచంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆ ఫంక్షన్‌ నిర్వాహకులు, కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు వచ్చి వాళ్లను వారించలేదు. కనీసం పక్కకు కూడా తీసుకెళ్లలేదు.తలుచుకుంటనే భయంగాఅవమానంతో చచ్చిపోయా.. మానసిక క్షోభకు లోనయ్యాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల గురించి తలుచుకుంటనే భయంగా ఉంది. ఇలా నీచంగా ప్రవర్తించేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. మాకు వచ్చిన కళను నమ్ముకుని మేము బతుకుతున్నాం. వీళ్ల కూతురితోనో, అక్కాచెల్లితోనే వేరేవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకుంటారా? మగవాళ్లమన్న అహంకారమా?కొంచెమైనా సిగ్గుండాలి! ఇంకో విషయం.. స్టేజీ కాస్త హైట్‌లో ఉంది. దాంతో ఈ అంకుల్స్‌.. లో యాంగిల్‌లో వీడియోలు తీశారు. కొందరు అది చూసి వీడియోలు షూట్‌ చేయడం ఆపమని చెప్పినందుకు వారిపైనే అరిచారు. ఎందుకంత ధైర్యం? మగవాళ్లమన్న అహంకారమా? ఇలాంటివారిని తిట్టేందుకు తిట్లు కూడా రావడం లేదు. పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని దీవించేందుకు ఈ ప్రోగ్రామ్స్‌కు పిలుస్తారు, రివర్స్‌లో మాకు జరిగేది ఇలాంటి వేధింపులు, అవమానం!' అని మౌనీరాయ్‌ ఆవేదన వ్యక్తం చేసిందిద.సీరియల్స్‌, సినిమాలుమౌనీరాయ్‌.. క్యూంకీ సాస్‌భీ కబీ బహుతీ సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. పలు సీరియల్స్‌లో యాక్ట్‌ చేసిన ఈ బ్యూటీ.. జర నచ్‌కే దిఖా 1 సీజన్‌ విన్నర్‌గా నిలిచింది. నాగిని సీరియల్‌తో ఫుల్‌ ఫేమస్‌ అయింది. గోల్డ్‌, మేడ్‌ ఇన్‌ చైనా, బ్రహ్మాస్త్ర, ద భూతిని సినిమాల్లో నటించింది. కేజీఎఫ్‌ 1లో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమాలో యాక్ట్‌ చేస్తోంది.చదవండి: చెట్ల మందులు వాడా.. చాలా గలీజ్‌గా ఫీలయ్యా: శివజ్యోతి

Salman Khan's Battle Of Galwan Movie Maatrubhumi Song Out Now6
సల్మాన్ దేశభక్తి సినిమా.. మాతృభూమి సాంగ్ రిలీజ్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్సెస్ రేసులో చాలా వెనకబడిపోయాడు. ప్రస్తుతం 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో ఓ దేశభక్తి సినిమా చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పుడీ మూవీ నుంచి 'మాతృభూమి' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ఇందులో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సల్మానే స్వయంగా నిర్మిస్తుండగా.. గతంలో రామ్ చరణ్‌తో 'జంజీర్(తుఫాన్)' లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిన అపూర్వ లఖియా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి ట్రెండ్ నడుస్తోంది. మరి దాన్ని సల్మాన్ సినిమా అందుకుని హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)

Woman Throws Shoe at Vairamuthu, lyricist 1st post after this Incident7
చెప్పు విసిరిన ఘటన.. 'నన్ను నేను మర్చిపోయా!'

సినీగేయరచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇటీవల కలకలం రేపింది. తమిళనాడులోని తిరుప్పూర్‌లో కొంగు కళ, సాహిత్య సంస్కృతి మండలి ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకుగానూ తిరుప్పూర్‌ కలెక్టరేట్‌కు రాగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడున్న ఓ మహిళ చెప్పు విసిరింది. తొలి పోస్ట్‌అయితే అది వైరముత్తుపై కాకుండా మరోవైపు పడింది. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఈ ఘటన తర్వాత వైరముత్తు సోషల్‌ మీడియలో తొలిసారి ఓ పోస్ట్‌ పెట్టాడు. తిరుప్పూర్‌లో తను హాజరైన మరో కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశాడు. రెండువేలమంది విద్యార్థులు ఒక్కచోట చేరి చప్పట్లు కొడుతుంటే తనను తాను మర్చిపోయానన్నాడు.గతంలో ఆరోపణలుకాగా వైరముత్తు గతంలో మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలామంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా నడుచుకున్నారంటూ సింగర్‌ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను వైరముత్తు కొట్టిపారేశాడు. திருப்பூரில்வெற்றித் தமிழர் பேரவை ‘வள்ளுவர் மறை வைரமுத்து உரை’கையொப்பத் திருவிழாவைநிகழ்த்தியதுஏ.வி.பி அரங்கு முழுக்கஆயிரத்துக்கு மேற்பட்டபள்ளிப் பிள்ளைகள்;கல்லூரிக் கண்மணிகள்வெற்றித் தமிழர் பேரவையின்அவைத் தலைவர்ராம்ராஜ் நாகராஜன்அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026 చదవండి: ప్రెగ్నెన్సీ అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్‌ శివజ్యోతి

Woman Throws Shoe At Vairamuthu At Tiruppur Event, Video Goes Viral8
పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ.. వీడియో వైరల్‌

తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.గత బుధవారం తిరుప్పూర్‌లో జరిగిన కొంగు కళ, సాహిత్య, సంస్కృతి మండలి ప్రారంభోత్సవానికి వైరముత్తుకి ఆహ్వానం అందింది. ఇందులో పాల్గొనేందుకు వైరముత్తు తిరుప్పూర్‌ కలెక్టరేట్‌కు వచ్చినప్పుడు ఎవరో చెప్పు విసిరారు. అయితే ఆ చెప్పు ఆయనపై కాకుండా మరో వ్యక్తిపై పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చెప్పు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోలీవుడ్‌ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెప్పు విసిరిన మహిళ పేరు జయ. 45 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళకు మతిస్థిమితం లేదు. కలెక్టర్‌ ఆఫీస్‌తో పాటు కోర్టు దగ్గర కూడా పలుసార్లు ఇలానే చెప్పులు విసిరిందట. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలియజేస్తూ..ఆమెను అరెస్ట్‌ చేసినట్లుగా అధికారికంగా వెల్లడించారు. பாடல் ஆசிரியர் வைரமுத்துவை நோக்கி காலணிகள் வீச்சு..! என்ன காரணம்..? திருப்பூரில் பரபரப்பு..#tiruppur | #vairamuthu | #polimernews pic.twitter.com/I5EscQ5cWv— Polimer News (@polimernews) January 22, 2026ఈ ఘటన జరిగిన తర్వాత వైరముత్తు తొలిసారిగా సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాజాగా ఆయన తిరుప్పూర్‌ లో విక్టోరియస్ తమిళ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘రెండు వేల మంది యువకులు ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టడం చూసి, నన్ను నేను మర్చిపోయాను’ అంటూ రాసుకొచ్చాడు. చెప్పు విసిరిన ఘటనపై ఆయన స్పందించపోవడం గమనార్హం. అయితే ఆమెకు మతి స్థిమితం లేదనే విషయం తెలిసి.. వైరముత్తు ఆ ఘటనను లైట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వైరముత్తు వరుస వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. 2018లో, మీటూ ఉద్యమం సమయంలో, గాయని చిన్మయి శ్రీపాద భువన శేషన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వైరమత్తు మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. திருப்பூரில்வெற்றித் தமிழர் பேரவை ‘வள்ளுவர் மறை வைரமுத்து உரை’கையொப்பத் திருவிழாவைநிகழ்த்தியதுஏ.வி.பி அரங்கு முழுக்கஆயிரத்துக்கு மேற்பட்டபள்ளிப் பிள்ளைகள்;கல்லூரிக் கண்மணிகள்வெற்றித் தமிழர் பேரவையின்அவைத் தலைவர்ராம்ராஜ் நாகராஜன்அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026

Akira Nandan Protect His Personal rights petition Delhi High court9
హైకోర్టును ఆశ్రయించిన 'పవన్‌' కుమారుడు అకీరా నందన్‌

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు కథనాలు వస్తున్నాయి. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్‌మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సోషల్‌మీడియాలో తన పేరుతో పాటు ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏఐ సాయంతో పలు వీడియోలు క్రియేట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ సాంకేతికతతో క్రియేట్‌ చేసిన కంటెంట్‌ను వెంటనే తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పనులు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని అకీరా కోరారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.గతంలో ఇలాంటి ఈ అంశంపై పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. నాగార్జున, ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కరణ్‌ జోహార్‌, అనిల్‌ కపూర్‌, సునీల్‌ గావస్కర్‌ వంటి స్టార్స్‌ ఉన్నారు. అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో 56 నిమిషాల పాటు ఒక వీడియోను క్రియేట్‌ చేసి.. దానిని యూట్యూబ్‌లో విడుదల చేశారంటూ పవన్‌ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూవీ తీసిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫ్యాన్స్‌ ఫిర్యాదు చేశారు.

Bigg Boss Shiva Jyothi about her Pregnancy Journey10
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్‌గా ఫీలయ్యా: శివజ్యోతి

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, యాంకర్‌ శివజ్యోతి త్వరలోనే తల్లి కాబోతోంది. తను గర్భం దాల్చిన దగ్గరి నుంచి రెండు సార్లు సీమంతం చేసుకోవడం వరకు ప్రతి విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుంటూ వస్తోంది. డెలివరీకి దగ్గర్లో ఉన్న ఆమె తన ప్రెగ్నెన్సీపై ఉన్న అనేక అనుమానాలకు, అపోహలకు చెక్‌ పెడుతూ ఓ వీడియో షేర్‌ చేసింది.లేనివారికే తెలుసు ఆ బాధఅందులో శివజ్యోతి మాట్లాడుతూ.. ముందుగా అందరికీ ఓ మాట చెప్పాలనుకుంటున్నా.. ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లలెప్పుడు? పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడు? ఉద్యోగం లేనివాళ్లను ఏం చేస్తున్నావ్‌? వంటి ప్రశ్నలు అడగకండి. ఎందుకంటే అది లేనివారికే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. 2015లో మా పెళ్లి జరిగింది. అంటే పదేళ్లవుతోంది. దయచేసి అడగకండిమొదట్లో కెరీర్‌పై ఫోకస్‌ చేశాం. ఆ సమయంలో పిల్లలెప్పుడు అని అడిగితే నాకు కావాల్సినప్పుడు కంటాను అని ధైర్యంగా ఆన్సరిచ్చేదాన్ని. మూడేళ్లుగా నేను పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ సమయంలో ఎవరైనా అడిగినప్పుడు మాత్రం చాలా గలీజ్‌గా ఫీలయ్యేదాన్ని. కాబట్టి ఎదుటివాళ్ల పర్సనల్‌ విషయాలు అడగకండి.బిగ్‌బాస్‌ నుంచి రాగానే లాక్‌డౌన్‌బిగ్‌బాస్‌ ముందు వరకు కూడా మా ఇద్దరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.. 2019లో నేను బిగ్‌బాస్‌ నుంచి రాగానే లాక్‌డౌన్‌ వచ్చింది. దాంతో పిల్లల ఆలోచనను రెండేళ్లు పోస్ట్‌పోన్‌ చేసుకున్నాం. ఆ తర్వాత మేము ఓ ఇల్లు కొని దాన్ని మాకు నచ్చినట్లుగా డిజైన్‌ చేయించుకుని గృహప్రవేశం చేశాం.. 2023 డిసెంబర్‌ నుంచి పిల్లలు కావాలనుకున్నాం. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం.మొక్కని దేవుడు లేడురెండున్నరేళ్లు రకరకాల టెస్టులు చేయించుకున్నాను. చెట్లమందులు ప్రయత్నించాను. మొక్కని దేవుడు లేడు. అయితే నేను ఐయూఐ, ఐవీఎఫ్‌ ఏది ఎంచుకున్నాను? అని అడుగుతున్నారు. అవేవీ కాదు, వెంకటేశ్వర స్వామి వ్రత ఫలితంతో సహజంగానే గర్భం దాల్చాను. ఒకవేళ ఇది జరగకపోతే ఐయూఐ, ఐవీఎఫ్‌ చేయించుకునేదాన్ని. అందులో అనుమానమే లేదు అని చెప్పుకొచ్చింది. శివజ్యోతి తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొంది.చదవండి: బోర్డర్‌ 2 ఫస్డ్‌ డే కలెక్షన్స్‌

Advertisement
Advertisement