ప్రధాన వార్తలు

ప్రియుడితో 'మనోభావాలు పాప' ఎంగేజ్మెంట్..
తెలుగు బిగ్బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.ఆన్స్క్రీన్ కపుల్.. రియల్ లైఫ్లోనూ..ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ

చాకో కారుకు ప్రమాదం.. ‘దసరా’ విలన్ ఇంట తీవ్ర విషాదం!
కోలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు షైన్ టామ్ చాకో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చాకో తండ్రి మృతి చెందగా, తల్లి, సోదరుడు, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో చాకో కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో ప్రయాణిస్తుండగా, పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుడి చేతికి గాయం అయింది. అతని తల్లి, సోదరుడు, డ్రైవర్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. షైన్కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుషైన్ టామ్ చాకో మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మాత్రమే కాకుండా, తెలుగు చిత్రం దసరాలో విలన్ పాత్రతో టాలీవుడ్లో కూడా గుర్తింపు పొందారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో షైన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక్కడ ఏమీ లేదు.. సమంత పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత(Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగతం లేదా సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్లో ఉంటారు. ప్రస్తుతం ఆమె అబుదాబీలో ఉన్నారు. అక్కడ హ్యాపీగా... జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు సమంత. (చదవండి: అక్కినేని అఖిల్ పెళ్లి.. బరాత్లో జోరుమీదున్న నాగచైతన్య)‘‘ఇక్కడ ఏమీ లేదు... సౌండ్ లేదు... హడావిడి లేదు... చక్కని స్పేస్ ఉంది’’ అంటూ వెకేషన్లో భాగంగా అబు దాబీలో సంతోషంగా ఉన్న అక్కడి ఫొటోలను ఆమె షేర్ చేయగా, వైరల్గా మారాయి. దుబాయ్లో జరిగిన ఓ జ్యువెలరీ బ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత అనంతరం అక్కడి అందాలను చూస్తూ సందడి చేస్తున్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్: హీరో నాగార్జున (Nagarjuna Akkineni) చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil) బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్కమ్ చెప్పాడు. ప్రియురాలు జైనబ్ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరివాళ్లే ఈ వెడ్డింగ్కు హాజరయ్యారు. సెలబ్రిటీల హాజరుమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ, రామ్చరణ్- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్నాడు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.అఖిల్ ఎంగేజ్మెంట్అఖిల్- జైనబ్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్లో జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాగచైతన్య (Naga Chaitanya)- శోభితల పెళ్లి పనులు మొదలుకావడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. చై-శోభిత గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాద్లో పుట్టిన జైనబ్ రవ్జీ ఒక ఆర్టిస్ట్. రిఫ్లెక్షన్ పేరుతో హైదరాబాద్లో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించగా అందులో ఈమె వేసిన పెయింటింగ్స్ను ప్రదర్శించారట! మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించిందట! ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ అని తెలుస్తోంది. గతంలో పెళ్లి క్యాన్సిల్మరి అఖిల్- జైనబ్లు పెయింటింగ్ ఎగ్జిబిషన్లోనే ఒకరికొకరు పరిచయమయ్యారా? అసలు వీరి ప్రేమకథ ఎలా మొదలైందన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. ఇదిలా ఉంటే అఖిల్ గతంలో.. పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయ భూపాల్తో ప్రేమలో పడ్డాడు. 2016లో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లితో ఒక్కటి కాబోతారనుకునేలోపే వివాహం రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్' అనే సినిమా చేస్తున్నాడు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)Director #PrashanthNeel at #AkhilAkkineni's wedding.#NTRNeelpic.twitter.com/D8jMH6gJHx— Milagro Movies (@MilagroMovies) June 6, 2025Yuvasamrat #NagaChaitanya at the baraat ceremony of his brother @AkhilAkkineni8!📸#AkhilAkkineni #Nagarjuna pic.twitter.com/wVUqswOfVV— shiva (@shivshankar68) June 5, 2025#TFNExclusive: Yuvasamrat @chay_akkineni and @sobhitaD snapped at #AkhilAkkineni & #ZainabRavdjee's wedding! 📸😍#NagaChaitanya #SobhitaDhulipala #SoChay #TeluguFilmNagar pic.twitter.com/1uCz8xUcym— Subhodayam Subbarao (@rajasekharaa) June 6, 2025చదవండి: విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే!
సినిమా పోల్
ఫొటోలు
A to Z

ఆరేళ్ల తర్వాత ఓటీటీకి దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
గతేడాది లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ...

ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్లోకి ఎం...

సడన్గా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంట...

ఓటీటీలో కోర్ట్ థ్రిల్లర్ 'గుడ్ వైఫ్'
కొన్నాళ్ల ముందు వరకు ప్రియమణి.. దక్షిణాది భాషల్లో ...

స్టార్ హీరోతో 'లోకేష్ కనగరాజ్' కొత్త సినిమా ప్రకటన
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లో...

సినిమా ఒకటి... క్లైమాక్స్లు రెండు
ఒకప్పుడు ప్రేక్షకులకు వినోదం అంటే థియేటర్స్లో సిన...

Wedding: క్యాన్సర్తో నటి.. కంటికి రెప్పలా చూసుకునే ప్రియుడు..
బుల్లితెర సెలబ్రిటీ జంట హీనా ఖాన్ (Hina Khan)- రా...

ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్
ఏదైనా ప్రమోషన్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచి...

ఏంజెలీనా జోలితో విడాకులు.. తొలిసారి బ్రాడ్ పిట్ వ్యాఖ్యలు
ప్రముఖ హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలి - బ్రాడ్ పిట్...

బాలీవుడ్ సినిమాలో జాకీ చాన్?
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన కరాటే కిడ్ ...

రింగ్లో దిగనున్న 'కరాటే కిడ్: లెజెండ్స్'.. ఎప్పుడంటే
హాలీవుడ్ చిత్రాలకు భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఎప్ప...

Cannes 2025: పొడవాటి గౌను ధరించి షాకిచ్చిన హీరో!
‘నో న్యూడిటీ’... ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

నా తల్లికి పుట్టుకతోనే చెవులు వినిపించవు.. బాధేసేది: మోహన్బాబు
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప...

30 శాతం వడ్డీతో డబ్బు చెల్లించండి.. విశాల్కు కోర్టు హెచ్చరిక
కోలీవుడ్ హీరో విశాల్, ప్రముఖ నిర్మాణసంస్థ లైకా...

కాశ్మీర్లో స్టార్ హీరోయిన్ పేరుతో ఒక గ్రామం.. వైరల్ అవుతున్న ఫోటో
కోలీవుడ్ నటి త్రిషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న...

కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ..!
కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో 1987లో వచ్చిన...
గాసిప్స్
View allరివ్యూలు
View allసినీ ప్రపంచం

ప్రియదర్శి కొత్త మూవీ.. టాలీవుడ్లోకి సోషల్ మీడియా సెన్సేషన్!
హీరో ప్రియదర్శి, 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో నీలిరంగు ముసుగుల వెనక ఓ గ్యాంగ్ అందర్నీ నవ్వించేందుకు రెడీగా ఉంది. అంతేకాదు, ఈ పోస్టర్లో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. ఉండటం విశేషం.హాలీవుడ్ హీరోతో పనిచేసిన సెన్సేషనల్ బ్యూటీసోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. మ్యాడ్నెస్ మొదలైందిఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్గా పీకే వ్యవహరిస్తున్నారు. 'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. ఫస్ట్లుక్ పోస్టర్తో మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైందని చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?

పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున 3 గంటలకు జైనబ్ రవ్జీతో ఒక్కటయ్యాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగ్గా.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అఖిల్.. గతేడాది నవంబరులో జైనబ్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగేంతవరకు ఎవరికీ తెలియనంత సీక్రెట్గా ఉంటారు. ఎంగేజ్మెంట్ జరిగిన ఆరు నెలలకు ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ భార్య జైనబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ జైనబ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్)అఖిల్ భార్య జైనబ్ రవ్జీ.. ముంబైకి చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్. ఇదివరకే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్, దుబాయిలలో ఎగ్జిబిషన్స్ పెట్టింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ముంబైకి చెందిన బిజినెస్మ్యాన్ జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్. ఈమెకు జైన్ రవ్జీ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అతడు జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు.జైనబ్ తండ్రి, నాగార్జున స్నేహితులు. అలా వీరిమధ్య ఉన్న స్నేహం కారణంగా కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. అలా అఖిల్-జైనబ్ ఒకరికొకరు పరిచయం. అలా కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. గతేడాది పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్ల పెద్ద. అఖిల్ ప్రస్తుత వయసు 31 ఏళ్లు కాగా.. జైనబ్ వయసు 39 అని తెలుస్తోంది. జైనబ్ కూడా గతంలో 'మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే హిందీ సినిమాలో నటించిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

సైలెంట్గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' ... చాలామందికి ఫేవరెట్ సినిమా. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా.. మరో హీరోయిన్గా షాజన్ పదమ్సీ చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన 'మసాలా' మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈమెని గ్రాండ్గా ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే?మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా.. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్కి పరిచయం. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు.(ఇదీ చదవండి: సడన్గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్' శుభశ్రీ)గత రెండు మూడు రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం.. రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదమ్సీ పెళ్లికి సంబంధించిన ఫొటోలని తన్ ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేస్తోంది.మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2009 నుంచి సినిమాలు చేస్తోంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమొళి, ఆరెంజ్, దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్ పన్ నెక్స్ట్ లెవల్ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ ధమాల్, హై జానూన్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు పుల్ స్టాప్ పెట్టేస్తుందేమో?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.బ్లాక్బస్టర్ కల్కిస్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్.. ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ నిర్మించాడు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తేలిపోయింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు శుక్రవారం.. బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.(ఇదీ చదవండి: సడన్గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్' శుభశ్రీ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)అమెజాన్ ప్రైమ్సింగిల్ - తెలుగు సినిమాసుశీల సుజిత్ - మరాఠీ మూవీబెంగాల్ 1947: ద అన్టోల్డ్ స్టోరీ - హిందీ సినిమామట్ లాక్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్జొరకయ్యా తట్టుంగ - తమిళ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీభోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమాఅంటిల్ డాన్ - ఇంగ్లీష్ మూవీగుల్కండ్ - మరాఠీ సినిమాపారిస్ ఇన్ బాలీ - ఇండోనేసియన్ మూవీద అకౌంటెంట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాహాట్స్టార్దేవిక & డానీ - తెలుగు సిరీస్గెట్ ఎవే - ఇంగ్లీష్ మూవీఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ - ఇంగ్లీష్ సినిమావై 2 కే - ఇంగ్లీష్ మూవీనెట్ఫ్లిక్స్కె.ఓ - ఇంగ్లీష్ సినిమామెర్సీ ఫర్ నన్ - కొరియన్ సిరీస్స్ట్రా - ఇంగ్లీష్ మూవీద సర్వైవర్స్ - ఇంగ్లీష్ సిరీస్గోల్డెన్ సిక్స్టీన్స్ సీజన్ 1 - జపనీస్ రియాలిటీ షోజాట్ - తెలుగు సినిమాజీ5ఛల్ కపట్ - హిందీ సిరీస్సన్ నెక్స్ట్లాల్ సలామ్ - తెలుగు డబ్బింగ్ సినిమాజిగేల్ - తెలుగు మూవీఆహావడక్కన్ - తెలుగు డబ్బింగ్ మూవీఒక యుమడి ప్రేమకథ - తెలుగు డబ్బింగ్ సినిమాలయన్స్ గేట్ ప్లేచౌర్య పాఠం - తెలుగు సినిమాకోడ్ 8 - ఇంగ్లీష్ మూవీహై ఫోర్సెస్ - చైనీస్ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్లఫంగే - హిందీ సిరీస్బుక్ మై షోద లాస్ట్ విష్ - తెలుగు డబ్బింగ్ మూవీమనోరమ మ్యాక్స్పట్త్ - మలయాళ సినిమా(ఇదీ చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ)

కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్లు కనిపించబోవని హెచ్చరించాడు. శుక్రవారం నాడు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా టాలీవుడ్లో నెలకొన్న సంక్షోభం గురించి ఓ ట్వీట్ చేశాడు.ఈ ట్రెండ్ కొనసాగితే..ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పర్సంటేజీ సిస్టం గురించి మాట్లాడుకునేబదులు... ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలా? అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి? అనేది ఆలోచించాలి. ఇక సినిమా రిలీజైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.పెద్ద హీరోలు ఆలోచించాలిఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకో సినిమా, మూడేండ్లకో సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలోనే చాలామంది థియేటర్ యజమానులు వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. పెద్ద హీరోలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సింగిల్ స్క్రీన్స్ మూతపడి కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అని రాసుకొచ్చాడు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025 చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ బొమ్మ.. ఎక్కడంటే?
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.సింగిల్ సినిమా కథేంటంటే?విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ

ప్రియుడితో 'మనోభావాలు పాప' ఎంగేజ్మెంట్..
తెలుగు బిగ్బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.ఆన్స్క్రీన్ కపుల్.. రియల్ లైఫ్లోనూ..ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ

చాకో కారుకు ప్రమాదం.. ‘దసరా’ విలన్ ఇంట తీవ్ర విషాదం!
కోలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు షైన్ టామ్ చాకో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చాకో తండ్రి మృతి చెందగా, తల్లి, సోదరుడు, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో చాకో కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో ప్రయాణిస్తుండగా, పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుడి చేతికి గాయం అయింది. అతని తల్లి, సోదరుడు, డ్రైవర్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. షైన్కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుషైన్ టామ్ చాకో మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మాత్రమే కాకుండా, తెలుగు చిత్రం దసరాలో విలన్ పాత్రతో టాలీవుడ్లో కూడా గుర్తింపు పొందారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో షైన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక్కడ ఏమీ లేదు.. సమంత పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత(Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగతం లేదా సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్లో ఉంటారు. ప్రస్తుతం ఆమె అబుదాబీలో ఉన్నారు. అక్కడ హ్యాపీగా... జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు సమంత. (చదవండి: అక్కినేని అఖిల్ పెళ్లి.. బరాత్లో జోరుమీదున్న నాగచైతన్య)‘‘ఇక్కడ ఏమీ లేదు... సౌండ్ లేదు... హడావిడి లేదు... చక్కని స్పేస్ ఉంది’’ అంటూ వెకేషన్లో భాగంగా అబు దాబీలో సంతోషంగా ఉన్న అక్కడి ఫొటోలను ఆమె షేర్ చేయగా, వైరల్గా మారాయి. దుబాయ్లో జరిగిన ఓ జ్యువెలరీ బ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత అనంతరం అక్కడి అందాలను చూస్తూ సందడి చేస్తున్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)