Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Movie Piracy Portal Ibomma Name As Creator of Ibomma One1
‘ఐబొమ్మ వన్‌’ పేరుతో మరో వెబ్‌సైట్‌.. సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌

సినిమా పైరసీ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌ తర్వాత ‘ఐబొమ్మ’ (Ibomma), ‘బప్పంటీవీ’ (Bappamtv) పూర్తిగా క్లోజ్‌ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌ నిర్మాతలు, సినీ నటులు సీసీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఇమ్మడి రవి లాంటి వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని నిర్మాత సీ కల్యాణ్‌ కామెంట్‌ కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్‌లో కొత్తగా ‘ఐబొమ్మ వన్‌’ వెబ్‌సైట్‌ తెరపైకి వచ్చింది.గతంలో ఉన్న ఐబొమ్మ మాదిరిగానే కొత్త సినిమాలు అందులో ఉన్నాయి. సినిమాను చూసేందుకు క్లిక్‌ చేస్తే ‘మూవీరూల్స్‌’కు కనెక్ట్‌ కావడం గమనార్హం. అలా మళ్లీ తెరపైకి ఐబొమ్మ పేరు వచ్చేసింది. ఈ రకంగా పైరసీ ద్వారా సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఐబొమ్మ క్లోజ్‌ కావడంతో ఇండస్ట్రీ, పోలీసులు సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఐబొమ్మ వన్‌ తెరపైకి రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

Mumbai Police summons to social media influencer Orry2
రూ.252 కోట్ల డ్రగ్స్‌ కేసు.. ఓర్రీకి నోటీసులు

బాలీవుడ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న ఓర్రీ (ఓర్హాన్ అవత్రమణి) వివాదాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్.. 'బాలీవుడ్ బీఎఫ్ఎఫ్'గా ఒర్రీ పాపులర్‌. ఎక్కడ ఏ సెలబ్రిటీ ఫంక్షన్‌ జరిగినా వాలిపోతూ ఉంటాడు. తన చేష్టలతో నెట్టింట హల్‌చల్‌గా మారతాడు. అయితే, తాజాగా డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఓర్రీకి నోటీసులు జారీ చేశారని హిందీ మీడియా నివేదించింది.రూ.252 కోట్ల రూపాయల మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి బాలీవుడ్ ఇన్‌సైడర్‌గా పేరున్న ఓర్రీకి ముంబై పోలీసులు సమన్లు ​​జారీ చేసినట్లు ANI సంస్థ నివేదించింది. నేడు ఉదయం 10 గంటలకు యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) ఘట్కోపర్ యూనిట్ ముందు హాజరు కావాలని ఓర్రీని పోలీసులు కోరారు. విచారణలో మాత్రమే అతని పేరు కనిపిస్తుంది, అయితే ఈ కేసులో ఓర్రీ పాత్ర ఏమిటో పోలీసులు వెల్లడించలేదు.అనేక నివేదికల ప్రకారం, ఇటీవల UAE నుండి వచ్చిన సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాకు సంబంధించిన అనేక విచారణ పత్రాలలో ఓర్రీ పేరు బయటపడింది. సలీం డోలా భారతదేశంతో పాటు విదేశాలలో సెలబ్రిటీ పార్టీలలో బహిరంగంగా మాదకద్రవ్యాలను వినియోగించే భాగమని ఇండియా టుడే నివేదించింది.

Actor Darshan request for one extra bedsheet in jail because weather cold3
చలి వల్ల ఇబ్బంది పడుతున్నా.. ప్లీజ్‌ ఒక దుప్పటి ఇవ్వండి

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌ను 57వ సీసీహెచ్‌ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. దర్శన్‌ నీలం రంగు టీ షర్ట్‌, నల్ల ప్యాంట్‌ ధరించి హాజరయ్యారు. అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయాలని దర్శన్‌ తరఫు న్యాయవాదికి సూచించారు. జైలులో చలి ఎక్కువగా ఉన్నందున ఇంటి నుంచి తెచ్చిన దుప్పటిని కప్పుకోవడానికి ఇప్పించాలని ఆయన కోరారు.మరో నిందితుడు నాగరాజు కూడా ఇదే కోరాడు. అయితే, జడ్జి ముందు దర్శన్‌ ఇలా వాపోయాడు. 'చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర పోవడమే సాధ్యం కావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం అదనంగా ఒక కంబళి ఇప్పించండి.' అని వేడుకున్నాడు. అయితే, జైలు అధికారుల తీరుపై జడ్జి మండిపడ్డారు. 'చలి ఎక్కువగా ఉన్నప్పుడు అదనంగా కంబళి ఇవ్వాలి కదా.. ఇప్పటికే ఆదేశించాం కదా.. పదేపదే ఎందుకు చెప్పించుకుంటున్నారు..? నిందితులకు కావలసిన అదనపు కంబళ్లను ఇవ్వండి.' అని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను డిసెంబర్‌ 3కు వాయిదా వేశారు.జైలు వీడియోల కేసులో భార్య పేరుపరప్పన జైల్లో ఖైదీలకు రాచమర్యాదల వీడియో లీకేజీలో దర్శన్‌ సతీమణి విజయలక్ష్మి పేరు బయటకు వచ్చింది. దర్శన్‌ మిత్రుడు, నటుడు ధన్వీర్‌ను వీడియోల గురించి పోలీసులు విచారిస్తున్నారు. మొదట ఆ వీడియో న్యాయవాది ద్వారా తనకు రాగా, అదే వీడియోను తాను దర్శన్‌ భార్యకు పంపానని ధన్వీర్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. తాను ఈ వీడియోలను వైరల్‌ చేయలేదు, ఎవరు చేశారో తెలియదని పేర్కొన్నట్లు తెలిసింది. ఆమెకు కూడా నోటీసులిచ్చి విచారించాలని పరప్పన అగ్రహార పోలీసులు నిర్ణయించారు. ఈ వీడియోలను ఎవరు అప్‌లోడ్‌ చేశారో చెప్పాలంటూ ఫేస్‌బుక్‌కు పోలీసులు ఈ మెయిల్‌ ద్వారా అడిగినట్లు తెలిసింది.

Kayadu Lohar Comments On social media Criticize4
నన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు..?

నటీనటులు ప్రశంసలనే కాదు విమర్శలను ఎదుర్కోక తప్పదు. అలా అభినందనలకు ఉప్పొంగేవారు, విమర్శలను మాత్రం తట్టుకోలేరు. ఇది వాస్తవం. ఇప్పుడు నటి కయాదు లోహర్‌ పరిస్థితి కూడూ ఇలాంటిదే. 2021లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కన్నడం, మలయాళం, తెలుగు, మరాఠీ, బెంగాళీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా నాయకిగా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే తమిళంలో నటించిన డ్రాగన్‌ చిత్రానికి ముందు ఈ భామకు అంత పేరు లేదు. ఎప్పుడైతే ప్రదీప్‌ రంగనాథ్‌తో డ్రాగన్‌ చిత్రంలో నటించారో అప్పటి నుంచి ఒక్క సారిగా స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు.ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక నటి బరువుపై జరిగిన చర్చలో తలదూర్చిన కయాదు లోహర్‌పై కూడా విమర్శలు రావడం మొదలెట్టాయి. దీంతో తనను టార్గెట్‌ చేస్తున్నారని ఈ అమ్మడు వాపోతున్నారు. దీని గురించి కయాదు లోహర్‌ ఓ యూట్యూట్‌ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో తన గురించి జరుగుతున్న విమర్శలు చాలా వేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తానని అన్నారు. తన గురించి వెనుక విమర్శించినా బాధపడకపోయినా అది తనను వేధిస్తూనే ఉంటుందన్నారు. అసలు తనను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాగా ప్రస్తుతం ఈ భామ తమిళంలో నటుడు అధర్వకు జంటగా నటిస్తున్న ఇదయం మురళి అనే చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా జీవీ ప్రకాశ్‌కు జంటగా ఆమ్మార్టల్‌ అనే చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా నటుడు శింబు సరసన ఒక చిత్రంలో నటించనున్నారు.అదే విధంగా నటుడు దనుష్‌కు జంటగా నటించనున్న చిత్రానికి లబ్బర్‌ బంతు చిత్రం ఫేమ్‌ తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నారు. వీటితో పాటూ కన్నడం, తెలుగు, మలయాళం భాషల్లోనూ ఒక్కో చిత్రంలో నటిస్తున్నారు.

Tollywood actresses Social Media Updates Goes viral5
మెరిసిపోతున్న పాయల్ రాజ్‌పుత్‌.. శారీలో హన్సిక పోజులు!

శారీ లుక్‌లో హీరోయిన్ హన్సిక బ్యూటీపుల్ లుక్..ఫ్యామిలీ ఫంక్షన్‌లో నటి శాన్వీ మేఘన చిల్..మల్లెపూలలాంటి శారీలో శ్రియా శరణ్ అందాలు..టాలీవుడ్ నటి సాహితి స్టన్నింగ్ లుక్స్..మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌ లేటేస్ట్ పిక్స్.. రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా కీర్తి సురేశ్.. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Upasana Konidela reaction on her negative comments over her comments6
సోషల్ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్.. స్పందించిన ఉపాసన!

ఇటీవల మెగా కోడలు ఉపాసన చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఉపాసన యువతకు కెరీర్‌పై సలహాలిచ్చింది. ‍అదే క్రమంలో అమ్మాయిలకు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. ‍పెళ్లి, పిల్లలు తర్వాతే అని ఉపాసన యువతను ఉద్దేశించి మాట్లాడింది. అంతేకాకుండా 30 అమ్మాయిలు తమ అండాలను భద్రపరచుకోవాలంటూ కామెంట్స్ చేసింది.దీంతో ఉపాసన చేసిన వ్యాఖ్యలను కొందర సమర్థించగా.. మరికొందరు తప్పుబట్టారు. అందరి పరిస్థితి మీలా ఉండదని ఫైరయ్యారు. ఇలాంటి వాటితో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ఉపాసన షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్స్‌ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ కామెంట్స్ చేశారు. ఉపాసన కామెంట్స్‌తో నెగెటివిటీ పెరగడంతో తాజాగా ఆమె స్పందించింది. ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది.నేను చేసిన కామెంట్స్‌పై ఆరోగ్యకరమైన చర్చ జరిగినందుకు సంతోషంగా ఉన్నా.. మీ గౌరవప్రదమైన స్పందనలకు ధన్యావాదాలు అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. మీరందరూ మాట్లాడుతున్న ప్రత్యేక హక్కులు/ఒత్తిళ్లపై నా అభిప్రాయాలను నేను వ్యక్తం చేస్తున్నప్పుడు వేచి ఉండండి.. ఇక్కడ నా ఫోటోలు చూడటం మర్చిపోవద్దు.. సరైన వ్యాఖ్యలు చేయడానికి మీకు సహాయపడే చాలా ముఖ్యమైన వాస్తవాలు ఇందులో ఉన్నాయి.. ఇక్కడ ఉన్న యజమానుల కోసం ఎక్కువ మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావడానికి కలిసి పని చేద్దామంటూ ట్విటర్‌లో రాసుకొచ్చింది.అంతేకాకుండా సరైన భాగస్వామి ఎదురయ్యే వరకూ అమ్మాయి వేచి చూడటం తప్పా?.. పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా?’ అంటూ తనపై వచ్చిన విమర్శలపై పలు ప్రశ్నలను సంధించింది ఉపాసన. అంతేకాకుండా ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో ఓ నోట్‌ను కూడా ఉపాసన షేర్ చేసింది. నాకు 27 ఏళ్ల వయసులో పెళ్లయిందని తెలిపింది. నా 29 ఏళ్ల వయసులో ఆరోగ్య కారణాలతో ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకున్నట్లు తెలిపింది. నాకు 36 ఏళ్ల వయసులో బిడ్డ పుట్టిందని.. ఇప్పుడు 39 ఏళ్లకు ట్విన్స్ పుట్టబోతున్నారని వెల్లడించింది. నా జర్నీలో కెరీర్‌.. పెళ్లి సమానంగా మేనేజ్ చేశానని ఉపాసన తెలిపింది. I’m happy to have sparked a healthy debate & thank your for your respectful responses. Stay tuned as I voice my opinions on the pleasures/pressures of privilege - that u all have been talking about. Don’t forget to check out my images ! It has very important facts that will… pic.twitter.com/rE8mkbnUPW— Upasana Konidela (@upasanakonidela) November 19, 2025

Priyanka Chopra confirms Telugu dubbing for Rajamouli Varanasi7
వారణాసిలో తెలుగు డబ్బింగ్.. ప్రియాంక చోప్రా ఏమన్నారంటే?

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తొలిసారి వస్తోన్న భారీ బడ్జెట్‌ అడ్వెంచరస్‌ మూవీ వారణాసి. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ను దర్శకధీరుడు రివీల్ చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఈవెంట్‌ ప్లాన్ చేసి మరి టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రాండ్ గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌కు మహేశ్ బాబు ఫ్యాన్స్‌ పెద్దఎత్తున హాజరయ్యారు.అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ప్రతిష్టాత్మక గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లోనూ మెరిసింది బాలీవుడ్ బ్యూటీ. తన డ్రెస్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే అంతకుముందే ప్రియాంక ట్విటర్ వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీరు తెలుగులో మాట్లాడతారా? ఈ సినిమాలో మీ పాత్రకు తెలుగు డబ్బింగ్‌ చెప్తారా? అంటూ ప్రియాంకను కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు.దీనిపై ప్రియాంక చోప్రా తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. 'వారణాసి' కోసం తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు వెల్లడించింది. అవును నేనే డబ్బింగ్ చెప్తా.. తెలుగు కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది. తెలుగు నా ప్రాథమిక భాష కాదని.. అందుకే రాజమౌళి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారని వెల్లడించింది. అంతకుముందు వారణాసి ఈవెంట్‌లో ఏదైనా తప్పులు దొర్లితే నన్ను క్షమించాలని అభిమానులను కోరింది. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో తగలబెట్టేద్దామా, మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అంటూ డైలాగ్స్‌తో ప్రియాంక చోప్రా అభిమానులను అలరించింది.కాగా.. వారణాసి చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హేశ్‌బాబు రుద్రగా కనిపించనుండగా.. మందాకిని పాత్రలో ప్రియాంక ‍మెప్పించనుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను 2027 వేసవిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

KGF Actor Yash mother complaint about fraud by film promoter8
పోలీసులకు కేజీఎఫ్ హీరో మదర్‌ ఫిర్యాదు.. అంతా ఆ సినిమా వల్లే!

కేజీఎఫ్ హీరో యశ్‌ మదర్‌ పుష్పలత పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది నిర్మాతగా ఆమె నిర్మించిన కోతలవాడి మూవీ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూవీ ప్రమోషన్స్ విషయంలో తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. ఈ మేరకు చిత్ర ప్రమోటర్ హరీష్ అరసుపై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. తనకు రూ.65 లక్షలు మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను బెదిరించాడని పుష్పలత పోలీసులకు తెలిపారు.కాగా.. పాన్-ఇండియా స్టార్ యశ్ తల్లి పుష్పలత.. పిఏ ప్రొడక్షన్స్ అనే తన సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ పేరు పుష్ప, ఆమె భర్త అరుణ్ కుమార్ మొదటి అక్షరాలు వచ్చేలా పెట్టారు. ఈ బ్యానర్‌లో తన మొదటి ప్రాజెక్ట్ కోతలవాడి పేరుతో సినిమా తెరకెక్కిచారు. ఈ చిత్రానికి శ్రీ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు పృథ్వీ అంబార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.

tourist Family Actor sashi kumar latest web series in ott from this date9
టూరిస్ట్ ఫ్యామిలీ హీరో లేటేస్ట్ వెబ్ సిరీస్‌.. ఎక్కడ చూడాలంటే?

వైవిధ్య కథాచిత్రాలతో ప్రేక్షకులను ‍అలరిస్తోన్న నటుడు శశికుమార్. ఇటీవలే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. వరుస సినిమాలు చేస్తున్న శశికుమార్ విజయాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది టూరిస్ట్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ చిత్రాలతో అభిమానులను అలరించాడు. అంతకుముందు 'అయోద్ధి'మూవీ, సూరి కథానాయకుడిగా నటించిన 'గరుడన్‌' చిత్రంలో ముఖ్యపాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు.అంతేకాకుండా తమిళంలో నడుసెంటర్ (Nadu Center OTT Release) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో శశికుమార్ బాస్కెట్ బాల్‌ కోచ్ పాత్రలో కనిపించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా సందడి చేయనుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీతో సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు నరు నారయణన్ దర్శకత్వం వహించారు.

Contemporary Now event in ramanaidu studio in Hyderabad10
రానా సతీమణి మిహికా సరికొత్త ఈవెంట్.. హైదరాబాద్‌లోనే తొలిసారిగా!

హైదరాబాద్‌ సరికొత్త ఈవెంట్‌కు వేదికగా నిలవనుంది. ఆర్ట్ కనెక్ట్ ఆధ్వర్వంలో సరికొత్త కాంటెపరరీ నౌ అనే కళాత్మక కార్యక్రమం జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 34 మంది సీనియర్ కళాకారుల కళలను ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లో తొలిసారి ఈ ఈవెంట్‌ ఏర్పాటు చేయడం విశేషం. ఈ ప్రదర్శన నవంబర్ 21 నుంచి 25 వరకు ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియో సమీపంలో ఉన్న స్పిరిట్ కనెక్ట్‌లో జరగనుంది.ఈ ఈవెంట్‌లో చెన్నైకి చెందిన అశ్వితాస్‌తో కలిసి ఓజాస్ ఆర్ట్, అసైన్, ఆర్చర్ ఆర్ట్ గ్యాలరీ, ఆర్ట్ అలైవ్ గ్యాలరీతో కలిసి ఆర్ట్ షోను ఆర్ట్ కనెక్ట్ హైదరాబాద్ ప్రదర్శించనుంది. ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు.. కళలను ప్రతిబింబించడానికి, ప్రారంభించడానికి ఇదొక ఆహ్వానమని ఆర్ట్ కనెక్ట్ వ్యవస్థాపకురాలు, రానా సతీమణి మిహీకా దగ్గుబాటి తెలిపారు.ఈ సందర్భంగా అశ్విత డైరెక్టర్ అశ్విన్ ఈ రాజగోపాలన్ మాట్లాడుతూ.. 'ఆర్ట్ కనెక్ట్‌తో మా సహకారం ఆలోచనాత్మక, సాంస్కృతిక సంభాషణకు భాగస్వామ్యంలాంటిది. జ్ఞాపకశక్తి, గుర్తింపు, రూపంతో మాట్లాడే రచనలను ఎదుర్కొనే అరుదైన అవకాశాన్ని కాంటెంపరరీ నౌ అందిస్తుందని' అన్నారు.

Advertisement
Advertisement