Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Stephen Movie OTT Trailer And Streaming Date1
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్

ఓటీటీల్లో ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉండొచ్చు. కానీ ఎక్కువమంది చూసేది మాత్రం థ్రిల్లర్ జానరే. మర్డర్ మిస్టరీ, మిస్టరీ థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్.. ఇలా పలు భాషల్లో బోలెడన్ని చిత్రాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలా నేరుగా ఓటీటీలోనే ఓ తెలుగు డబ్బింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్'. మిథున్ దర్శకత్వం వహించాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఇది వచ్చే నెల 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఇదైతే థ్రిల్లింగ్‌గానే ఉంది. కానీ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే.. స్టీఫెన్ జబ్‌రాజ్ అనే సైకో కిల్లర్ 6 నెలల్లో 9 మంది యువతులని చంపేస్తాడు. అది కూడా సినిమాలో ఛాన్స్ అని పిలిచి ఈ హత్యలు చేస్తాడు. కానీ ఊహించని విధంగా ఓ రోజు పోలీసుల దగ్గరకెళ్లి స్వయంగా ఇతడే లొంగిపోతాడు. పోలీసులు వెతకగా.. సదరు అమ్మాయిల వస్తువులు దొరుకుతాయి గానీ వాళ్ల బాడీలు మాత్రం ఎంతకీ కనిపించవు. స్టీఫెన్ నిజంగానే హత్యలు చేశాడా? ఇతడికి ఎవరైనా సాయం చేశారా?అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్‌తో సినిమా ఫ్లాప్.. తొలిసారి ఆ విషయం అర్థమైంది: రకుల్)

Bigg Boss 9 Telugu: Thanuja Out from Final Captaincy Race2
ప్రేరణ ఎంట్రీ.. ధైర్యంగా ముందుకొచ్చి బొక్కబోర్లా పడ్డ తనూజ

Bigg Boss Telugu 9: ఫ్యామిలీ మెంబర్స్‌ వచ్చి వెళ్లాక హౌస్‌మేట్స్‌ ముఖాలు వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోతున్నాయి. ఈవారం చివరి కెప్టెన్సీని చేజిక్కించుకునేందుకు అందరూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముందుగా కెప్టెన్సీ కంటెండర్‌ అవడానికి మాజీ కంటెస్టెంట్లతో గేమ్‌ ఆడి గెలవాలి. అలా ప్రియాంకతో కలిసి గేమ్‌ ఆడి కల్యాణ్‌ గెలిచి కంటెండర్‌ అయ్యాడు. గౌతమ్‌తో ఆడి భరణి ఓడిపోయాడు.తనూజ అవుట్‌తాజాగా ప్రేరణ.. తనూజతో గేమ్‌ ఆడింది. ఈమేరకు ఓప్రోమో వదిలారు. మీరు టఫ్‌ ప్లేయర్‌.. మీతో ఆడాలని ఉంది అని చెప్పింది తనూజ. ఇద్దరూ గేమ్‌లో బాగా కష్టపడ్డారు. కానీ చివరకు ప్రేరణ తనూజను ఓడించినట్లు తెలుస్తోంది. దీంతో తనూజ కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యే అవకాశం కోల్పోయింది. హౌస్‌లోకి మానస్‌, యావర్‌, శోభాశెట్టి వంటి సెలబ్రిటీలు కూడా రానున్నారు. వీరితో కంటెస్టెంట్లు గేమ్‌ ఆడి గెలిచిన డిమాన్‌ పవన్‌, ఇమ్మాన్యుయేల్‌ కెప్టెన్సీ కంటెండర్లు అయినట్లు తెలస్తోంది. వీరి వీరిలో ఎవరు కెప్టెన్‌ అన్నది చూడాలి! చదవండి: గంటకు ఎంత? అని చీప్‌ కామెంట్స్‌: నటి

The Pet Detective Movie OTT Release Date Out3
ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్‌ కామెడీ థ్రిల్లర్‌

అనుపమ పరమేశ్వరన్‌ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్‌ ‘ది పెట్‌ డిటెక్టివ్‌’. షరాఫుద్దీన్, వినాయ‌క‌న్‌, శ్యామ్ మోహ‌న్, జ్యోమ‌న్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్‌ విజయన్‌ దర్శకత్వం వహిచారు. అక్టోబర్‌ 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్‌ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోస్ అలులా (షరాఫుద్దీన్‌) ఓ డిటెక్టివ్‌. అత‌నికి చెప్పుకోద‌గ్గ‌క కేసులుండ‌వు. అయితే త‌నను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌నిపించ‌కుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయ‌టానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్ర‌మంలో ఏర్ప‌డ్డ గంద‌ర గోళ ప‌రిస్థితుల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ స్మ‌గ్ల‌ర్స్‌, కిడ్నాప‌ర్స్‌, క‌నిపించ‌కుండా పోయిన ఓ చిన్నారి, మెక్సిక‌న్ మాఫియా డాన్, అరుదైన చేప‌, క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్ట‌ర్ అంద‌రూ ఈ క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తారు. క‌థ‌లోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మ‌లుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్‌.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌, కామెడీ మూవీ ల‌వ‌ర్స్ స‌హా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Rakul Preet Singh About Mahesh Spyder Movie Failure4
మహేశ్‌తో సినిమా ఫ్లాప్.. మొదటిసారి ఆ విషయం అర్థమైంది

రకుల్ ప్రీత్ సింగ్.. కొన్నేళ్ల ముందు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. అలాంటిది ఉన్నట్లుండి సడన్‌గా మాయమైపోయింది. ప్రస్తుతానికైతే హిందీలో మాత్రమే మూవీస్ చేస్తోంది. రీసెంట్‌గా ఈమె నటించిన 'దే దే ప్యార్ దే 2' థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. టాలీవుడ్‌లో హిట్స్, ఫ్లాప్ అందుకోవడం లాంటి విషయాల గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)'తెలుగులో వరసగా 8-9 సినిమాలతో హిట్ కొట్టిన తర్వాత 'స్పైడర్' చేశా. ఇది నా కెరీర్‌లో తొలి ఫ్లాప్. మన అంచనాలు దెబ్బతిన్నప్పుడు ఎలా ఉంటుందో మొదటిసారి నాకు అర్థమైంది. చెప్పాలంటే చాలా భారంగా అనిపించింది. ఆ చిత్రం తర్వాత మానసికంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టేసింది' అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.మహేశ్-మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా 2017లో తెలుగు, తమిళంలో రిలీజైంది. ఫ్లాప్ అయింది. అయితే రకుల్.. ఇది తనకు తొలి ఫ్లాప్ అని చెప్పింది గానీ అంతకుముందే ఈమెకు టాలీవుడ్‌లో మూడు నాలుగు ఫెయిల్యూర్స్ పడ్డాయి. కానీ మహేశ్ మూవీనే తనకు మొదటి ఫ్లాప్ అ‍న్నట్లు చెప్పుకొచ్చింది. మర్చిపోయిందా లేదంటే కావాలనే చెప్పిందా అనేది అర్థం కాలేదు.(ఇదీ చదవండి: వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు: గిరిజా ఓక్)2011లో 'కెరటం' అనే సినిమాతో రకుల్.. తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఫ్లాప్. తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్ అవడంతో తెలుగులో ఛాన్సులొచ్చాయి. అలా 'రఫ్' చేయగా ఇది ఫెయిలైంది. దీని తర్వాత చేసిన లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో సక్సెస్ అయ్యాయి. అనంతరం చేసిన 'కిక్ 2' డిజాస్టర్ అయింది. తర్వాత చేసిన బ్రూస్ లీ యావరేజ్ అనిపించుకోగా.. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ చిత్రాలు హిట్ అయ్యాయి. దీని తర్వాత చేసిన 'విన్నర్' ఫ్లాప్ అయింది. అనంతరం మళ్లీ రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక మళ్లీ ఆకట్టుకోగా.. తర్వాత చేసిన 'స్పైడర్' ఫ్లాప్ అయింది.మహేశ్ సినిమా తర్వాత రకుల్ దాదాపు టాలీవుడ్‌కి దూరమైపోయింది. చివరగా 'కొండపొలం' అనే మూవీలో డీ గ్లామర్ రోల్ చేసింది గానీ వర్కౌట్ కాలేదు. వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు హిందీలో మూవీస్ చేస్తోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'లో హీరోయిన్ ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా)

Girija Oak: Iam not Getting Extra Work Offers5
వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు

సడన్‌గా బోలెడంత పాపులారిటీ వస్తే ఏ సెలబ్రిటీ సంతోషపడడు? మరాఠి నటి గిరిజ ఓక్‌ (Girija Oak) కూడా అంతే.. ఓ ఇంటర్వ్యూ క్లిప్స్‌ వల్ల సడన్‌గా సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అయింది. లేటు వయసులో ట్రెండ్‌ అయింది. తన ఫాలోవర్లు అమాంతం పెరిగారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 20 ఏండ్ల తర్వాత ఈరేంజ్‌ పాపులారిటీ చూసి గిరిజ సైతం షాకైపోయింది. ఏ మార్పూ లేదుఇదే మంచి తరుణంగా భావించి కెరీర్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. కానీ, రియాలిటీలో అదేమీ జరగడం లేదు. పేరొచ్చింది కానీ అవకాశాలైతే రావడం లేదంటోంది. తాజాగా ద లాలన్‌టాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే లేదనే చెప్తాను. నాకేమీ ఎక్స్‌ట్రా సినిమా ఆఫర్లు రావడం లేదు. పైగా నెగెటివ్‌ కామెంట్లు కూడా చాలా వస్తున్నాయి. గంటకు ఎంత?నా రేటెంత? అని అడుగుతున్నారు. నాతో గంటసేపు గడపాలంటే ఎంత తీసుకుంటానని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లకు లెక్కే లేదు. వీళ్లకు నిజ జీవితంలో నేను తారసపడితే కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ చూసినా.. గౌరవంతో మాట్లాడతారే తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరు. కానీ ఈ ఆన్‌లైన్‌ చాటున నోటికి ఏదొస్తే అది అనేస్తున్నారు అని గిరిజ అసహనం వ్యక్తం చేసింది.సినిమాకాగా మరాఠి నటి గిరిజ ఓక్‌ 2004లో మానిని అనే మరాఠి సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. తారే జమీన్‌ పర్‌, షోర్‌ ఇన్‌ ద సిటీ, సైకిల్‌ కిల్‌, కాలా, జవాన్‌, ద వ్యాక్సిన్‌ వార్‌, ఇన్‌స్పెక్టర్‌ జిండె వంటి హిందీ సినిమాల్లో నటించింది. హిందీతో పాటు మరాఠి, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది.చదవండి: కాస్త మర్యాద ఇవ్వండి.. బలుపుతో చెప్పట్లేదు: నిర్మాత

Riddhi Kumar Reacts Prabhas Rajasaab Movie Chance6
ప్రభాస్ 'రాజాసాబ్'లో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ నటి మాత్రం.. హీరోయిన్ అవకాశం ఇవ్వడం కోసం ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకుంది. తర్వాత ఎంక్వైరీ చేసి నమ్మకం తెచ్చుకుంది. ఈ మొత్తం విషయాన్ని స్వయంగానే సదరు నటి బయటపెట్టింది. ఆ మూవీ 'రాజాసాబ్' కాగా.. నటి పేరు రిద్ధి కుమార్. ఇంతకీ అసలేం జరిగింది?మహారాష్ట్రకు చెందిన రిద్ధి కుమార్.. 'లవర్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. 2018లో వచ్చిన ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరో. దీని తర్వాత మలయాళ, మరాఠీ భాషల్లో తలో మూవీ చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2022లో వచ్చిన 'రాధేశ్యామ్'లో అతిథి పాత్రలో కనిపించింది. అనంతరం హిందీలో ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా రిద్ధి చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)''రాజాసాబ్' చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్కేన్.. నాకు ఓసారి కాల్ చేశారు. మేం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నాం. నిన్ను హీరోయిన్‌గా అనుకుంటున్నాం అని చెప్పారు. మొదట ఇదంతా నేను నమ్మలేదు. ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా. మా మేనేజర్‍‪‌ని ఫోన్ చేసి కనుక్కుంటే నిజమని క్లారిటీ వచ్చింది. తర్వాత లుక్ టెస్ట్, ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు' అని రిద్ధి కుమార్.. 'రాజాసాబ్'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ కామెడీ మూవీకి మారుతి దర్శకత్వం వహించారు. రిద్ధి కుమార్‌తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా వేశారు. జనవరి 9న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్‪‌గా తొలి పాట రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్‌తో పాటు రిద్ధి కుమార్ కనిపించింది.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్‌ రాంబాయి' నిర్మాత ఎమోషనల్‌)Riddhi - Her being Part of #TheRajaSaab: 😂❤️‍🔥Got Call from SKN garu: “We’re making Film with #Prabhas, we want you as Heroine.” Thought it was a prank! Called my manager to verify. They asked “Do you know Prabhas?” I said “Yes of course!” Gave look test, auditioned & Here I'm. pic.twitter.com/Latj2XAXbI— Prabhas (@HereForDarling) November 25, 2025

Roshan Meka Champion Movie First Song7
శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా.. మెలోడీ సాంగ్ రిలీజ్

నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్.. బాలనటుడిగా కాస్త పరిచయమే. 'రుద్రమదేవి' మూవీలో అలా నటించాడు. కాస్త పెద్దోడు అయిన తర్వాత 'నిర్మల కాన్వెంట్' చిత్రంతో హీరో అయ్యాడు. 2021లో 'పెళ్లి సందD' అనే సినిమా చేశాడు. దీనితోనే శ్రీలీల.. హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ మూవీ తర్వాత శ్రీలీల వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ అయిపోయింది. రోషన్ మాత్రం మరో మూవీ చేయలేకపోయాడు. ఇన్నాళ్లకు ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అదే 'ఛాంపియన్'.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్‌ రాంబాయి' నిర్మాత ఎమోషనల్‌)డిసెంబరు 25న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌ స్టోరీతో తీస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకుడు కాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. ఈమెకు ఇదే తొలి తెలుగు మూవీ. విడుదలకు మరో నెల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలి పాటని రిలీజ్ చేశారు. 'గిర గిర గింగిరిగిరే' అంటూ సాగే రామ్ మిర్యాల పాడిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)

Producer Venu Udugula Emotional at Raju Weds Rambai Movie Success Meet8
ఇంతకన్నా అవమానం ఉంటుందా?: నిర్మాత ఎమోషనల్‌

ఒక్క షో ఆడదన్నారు.. ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు దర్శకనిర్మాత వేణు ఊడుగుల. ఈయన రాహుల్‌ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజు వెడ్స్‌ రాంబాయి (Raju Weds Rambai Movie). అఖిల్‌ రాజ్‌, తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు సినిమా సక్సెస్‌ మీట్‌ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్‌, బివిఎస్‌ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దొంగల్లా పరిగెట్టారుఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సినిమాను కొంతమందికి చూపించాం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ లాంటి పెద్దమనిషిని పిలిచాం. వాళ్లతోపాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు. వారిని మేము పిలవనేలేదు. ఇంటర్వెల్‌ అవగానే సడన్‌గా లేచి వెళ్లిపోయారు. దొంగల్లాగా పరిగెడుతున్నారు. వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే! థియేటర్‌లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్‌ చెడిపోదా? ఒక ఫిలింమేకర్‌కు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా? అదసలు మర్యాదగా ఉందా?గుండెల్లో పెట్టుకున్నారుమావాళ్లేమన్నారంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, పోనివ్వండి అన్నారు. వెళ్లిపోయాక రెండుమూడు రోజులు నెగెటివ్‌ ప్రచారం చేశారు. వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయడమే రాలేదు. అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు. కానీ, ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. సినిమా హిట్టయిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు. సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే! ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి, కానీ మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: దర్శకుడు సంపత్‌ నంది ఇంట తీవ్ర విషాదం

Sathvik Premistunna Movie OTT Streaming Update9
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా

రీసెంట్ టైంలో ప్రేమకథలతో సినిమాలు తీస్తున్నప్పటికీ బోల్డ్, రొమాంటిక్ కాన్సెప్ట్‌లు ఎక్కువగా తీస్తున్నారు. అలా ఈ నెల ప్రారంభంలో వచ్చిన మూవీ 'ప్రేమిస్తున్నా'. పలు హిట్ సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ప్రీతీ నేహా అనే అమ్మాయి హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. తెలుగు దర్శకుడి ఇంట్లో విషాదం) సాత్విక్, ప్రీతీ నేహా జంటగా నటించిన ఈ రొమాంటిక్ బోల్డ్ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. నవంబరు 7న థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ పరంగా బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే అంటే ఈ శుక్రవారం (నవంబరు 28) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి.'ప్రేమిస్తున్నా' విషయానికొస్తే.. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారద, తన కొడుకుని (సాత్విక్ వర్మ) అల్లారుముద్దుగా పెంచుతుంది. బదిలీపై ఘట్కేసర్‌లోని రైల్వే కాలనీకి శారద కుటుంబం షిఫ్ట్ అవుతుంది. అదే కాలనీకి చెందిన అమ్మాయి (ప్రీతీ నేహా) వీళ్లకు సాయం చేయడానికి వస్తుంది. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిన సాత్విక్.. 'నీతో రొమాన్స్‌ చేయాలని ఉంది' అని తొలి పరిచయంలోనే అడిగేస్తాడు. అమ్మాయి దీన్ని సిల్లీగా తీసుకుంటుంది. సాత్విక్‌ మాత్రం టైమ్‌ టేబుల్‌ వేసుకొని మరీ, ఆమెని ఫాలో అవుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో సాత్విక్‌తో అమ్మాయి రొమాన్స్‌కి ఒప్పుకొంటుంది. కానీ కండీషన్‌ పెడుతుంది. ఆ కండీషన్ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన వాడిని ప్రీతీ ఎందుకు దూరం పెట్టింది? అమ్మాయి కోసం అతడు పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మాస్ జాతర'తో పాటు ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)

Tollywood Director Sampath Nandi Father Kishtaiah Passed Away10
నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. దర్శకుడు భావోద్వేగం

తెలుగు దర్శకుడు సంపత్‌ నంది (Sampath Nandi) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కిష్టయ్య (73) మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కిష్టయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తండ్రి మరణవార్తను సంపత్‌ నంది సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులుబాపును తల్చుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. బాపు.. నువ్ లేకుండానే తెల్లారింది. నువ్ లేకుండానే ఓదెల లేచింది.. నువ్ లేకుండానే ఇల్లూ లేచింది. కల్లాపితో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది.. “ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు.. “ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు! చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది. భుజంపై ఎత్తుకెళ్లావ్‌గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నిన్నే కదా అనిపిస్తోంది. నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక.. మనం దున్నిన జంబు అరక.. పత్తి మందుకు పంపు.. పల్లి చేను లో సద్ది.. మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు.. ఇక అన్నీ జ్ఞాపకాలేనా? దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు.. మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు.. ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా? నీ ప్రేమ నాకు మళ్లీ కావాలిఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో.. కానీ మళ్లీ రా.. అంటూ ఎమోషనలయ్యాడు. సంపత్‌ నంది విషయానికి వస్తే ఏమైంది ఈవేళతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రచ్చ, బెంగాల్‌ టైగర్‌, సీటీమార్‌ సినిమాలకు తెరకెక్కించాడు. ఓదెల రైల్వే స్టేషన్‌, ఓదెల 2, బ్లాక్‌ రోజ్‌ చిత్రాలకు కథ అందించాడు. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా 'భోగి' సినిమా డైరెక్ట్‌ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Sampath Nandi (@isampathnandi)

Advertisement
Advertisement