Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Balakrishna Akhanda 2 release date announced1
అఫీషియల్‌.. అఖండ 2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కొన్ని గంటల్లో రిలీజ్‌ కావాల్సిన అఖండ 2.. గత గురువారం అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఖండ 2 నిర్మాతలకు ఈరోస్‌ సంస్థతో ఉన్న ఫైనాన్స్‌ వివాదం కోర్టుకు వెళ్లడంతో చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది. దీంతో కొత్త రిలీజ్‌ డేట్‌పై రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో తాజాగా నిర్మాత సంస్థ సినిమా విడుదల తేదిని ప్రకటించింది. అభిమానులు కోరుకున్నట్లుగానే ఈ చిత్రం డిసెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్‌ 11న ప్రీమియర్స్‌ కూడా పడనున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. All set for the Divine Destruction at the box office 🔥Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱BOOKINGS OPEN SOON!#Akhanda2Thaandavam‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/LVmTNIObEr— 14 Reels Plus (@14ReelsPlus) December 9, 2025

Tollywood actresses social media Updates in Instagram 2
శ్రీలంకలో ధనశ్రీ వర్మ చిల్.. ప్రియా ప్రకాశ్ వారియర్ బోల్డ్ లుక్..!

బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ బోల్డ్ లుక్స్..శ్రీలంకలో చిల్ ‍అవుతోన్న ధనశ్రీ వర్మ..మరింత బోల్డ్‌గా ప్రియా ప్రకాశ్ వారియల్‌..శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి హాట్ పోజులు..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్‌ పిక్స్.. View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by AaradhyaDevi🦋 (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran)

Bigg Boss 9 fame Roopal Tyagi marries Nomish Bhardwaj3
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!

ప్రముఖ బుల్లితెర భామ, బిగ్‌బాస్‌ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి ‍‍అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్‌ వెడ్డింగ్‌ డిసెంబర్‌ 5న జరిగింది.కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్‌పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.రూపల్ త్యాగి కెరీర్..హమారీ బేటియూన్ కా వివాహ్‌ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్‌ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్‌ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది. View this post on Instagram A post shared by Roopal Tyagi (@roopaltyagi06)

Varun Sandesh web series Nayanam Official Trailer out now4
వరుణ్ సందేశ్- ప్రియాంక జైన్‌ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ట్రైలర్

టాలీవుడ్ హీరో వరుణ్‌ సందేశ్‌ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. వరుణ్ సందేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ‘న‌య‌నం’. ఈ సిరీస్‌ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. మ‌నుషుల్లోని నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించనున్నారు.తాజాగా ఈ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'కన్ను ట్రాన్స్‌మీటర్.. నాలుగు నిమిషాలు వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో నేను చూడగలను' అంటూ వరుణ్ సందేశ్‌ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సిరీస్‌ను సస్పెన్స్‌తో పాటు సైక‌లాజిక‌ల్ మేసేజ్‌ ఓరియంటెడ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్ కీలక పాత్రలో నటించింది. డాక్ట‌ర్ న‌య‌న్ పాత్ర‌లో వ‌రుణ్ సందేశ్ కనిపించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈనెవల 19 నుంచి జీ5 వేదికగా ఈ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది.

Nari Nari Naduma Murari Official Release Date Locked 5
సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి.. ఇలా కూడా రిలీజ్ చేస్తారా?

సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందే కర్ఛీప్‌ వేసేయాల్సిందే. లేదంటే చివరికీ వచ్చేసరికి పోటీ మరింత పెరిగిపోతుంది. అలా ఇప్పటికే వచ్చే ఏడాది రిలీజయ్యే పొంగల్‌ సినిమాలు చాలా వరకు డేట్స్ ప్రకటించారు. వాటిలో మనశంకరవరప్రసాద్‌ గారు, అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్‌, భర్త మహాశయులకు విజ్ఞప్తి అఫీషియల్‌ తేదీలు వెల్లడించారు.తాజాగా మరో టాలీవుడ్‌ హీరో సంక్రాంతి పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు, శర్వానంద్ హీరోగా వస్తోన్న నారీ నారీ నడుమ మురారి రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుందని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. అయితే ఈ సినిమా సాయంత్రం ఐదు గంటల 49 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇదే ఆడియన్స్‌కు కాస్తా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్‌ డే మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇలా సాయంత్రం వేళ మూవీని విడుదల చేసి కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన ఈవినింగ్ ఫస్ట్‌ షోతో నారీ నారీ నడుమ మురారి షురూ కానుంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామజవరగమన ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్‌లో 37వ చిత్రంగా నిలవనుంది. This Sankranthi is set to deliver a HATTRICK BLOCKBUSTER for our Charming Star @ImSharwanand! 🌟The celebration begins with #NariNariNadumaMurari, hitting theatres January 14th, 2026 from 5:49 PM onwards! 🤩🎋@AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju… pic.twitter.com/akIyawyACH— AK Entertainments (@AKentsOfficial) December 9, 2025

Allu Aravind, Suresh Babu, Amala, Film Celebrities Meet With CM Revanth Reddy6
స్క్రిప్ట్ తో వస్తే.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా చేస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమలతో పాటు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ చిత్ర పరిశ్రమకు కావాల్సిన సదుపాయలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, అక్కడ 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌​ సమ్మిట్‌-2025’లో మంగళవారం సినీ, వినోద రంగాలపై చర్చ ఏర్పాటు చేశారు. ఈ చర్చలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా, టాలీవుడ్‌ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Hero Karthi Comments about Kollywood Cinema Industry7
'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!

కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్‌ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు.మరి కోలీవుడ్‌ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడ? అని కార్తీ ప్రశ్నించారు. వాళ్లలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే.. భయానికి దూరంగా ఉండాలన్నారు. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందని సూచించారు. సరిహద్దులు చెరిపేసి తమిళ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కార్తీ వెల్లడించారు.(ఇది చదవండి: భారీ ధరకు ది రాజాసాబ్‌ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?)అంతేకాకుండా ఓ నటుడిగా వా వాతియార్‌ తనకు రిస్కీ సబ్జెక్ట్‌ అని కార్తీ అన్నారు. ఈ సినిమా కత్తితో సావాసం చేయడం లాంటిదని.. తమిళ నటుడు దివంగత ఎంజీఆర్‌ను అనుకరించడాన్ని ఉద్దేశించి కార్తి మాట్లాడారు. దర్శకుడు నలన్‌ కుమారస్వామి కథ చెప్పినప్పుడు నటించేందుకు సందేహించా.. కానీ తర్వాత ఓకే చెప్పానని తెలిపారు."I always think that Telugu makers are doing big films & Malayalam makers are doing different films.. What's the identity of Tamil films..? We can't do new things if we are scared to try.. We need to break the barriers.."- #Karthi at #VaaVaathiyaar Event pic.twitter.com/5QIyqfr14L— Laxmi Kanth (@iammoviebuff007) December 8, 2025

Aadhi Pinisetty Drive Movie Trailer Out8
ఆసక్తికరంగా ఆది పినిశెట్టి ‘డ్రైవ్‌’ ట్రైలర్‌!

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు."డ్రైవ్" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ప్రజా మీడియా కార్పొరేషన్ సౌతిండియాలో పేరున్న మీడియా సంస్థ. ఈ సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి) తన ఫియాన్సే (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్ లో స్థిరపడేందుకు సిద్ధమవుతుంటాడు. ఇంతలో అతని సంస్థ అక్కౌంట్స్ ను ఓ హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. జే ప్రతి మూవ్ మెంట్ గమనిస్తూ అతన్ని చంపేస్తానని బెదిరిస్తుంటాడు. ప్రజా మీడియా కార్పొరేషన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్ లైన్ లో ఉంచుతూ ఆ సంస్థ పరువు, గౌరవాన్ని రోడ్డున పడేస్తాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ తో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ ఆట కట్టించేందుకు సిద్ధమవుతాడు జే. ఆ హ్యాకర్ ఎవరు, జే అతన్ని పట్టుకున్నాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో "డ్రైవ్" మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది.

Telangana Global Summit 2025: Arjun Kapoor And Rahul Ravindran Talk About Film Industry 9
సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కలిసి పని చేయాలి: అర్జున్‌ కపూర్‌

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌​ సమ్మిట్‌-2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో సినీ, వినోద రంగాల అభివృద్ధి అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ చర్చలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, టాలీవుడ్‌ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ‘గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. విద్యార్థిగా సమ్మిట్‌ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అందరం కలిపి పని చేయాలి. కొత్త ఫిల్మ్‌ సిటీ రావడంతో సినిమా పరిశ్రమను మరింత అభివృద్ది చెందుతుంది’ అన్నారు.రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ.. ‘ గ్లోబల్ సమ్మిట్‌ పానెల్ చర్చలో పాల్గొనడం ఎక్సయిటెడ్ గా ఉంది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి చర్చలు అవసరం. పానెల్ చర్చల ద్వారా నేను మరింత నేర్చుకునే అవకాశం దక్కింది.సినీ పరిశ్రమ అభివృద్ధి మరింతగా జరగాలని అందరం కోరుకుంటున్నాం. ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు’ అన్నారు. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత రితేష్ దేశముఖ్ మాట్లాడుతూ.. నాకు మొదట సినిమాలో అవకాశం ఇచ్చింది తెలుగు నిర్మాతలు.హైదరాబాద్ పెట్టుబడులకు మంచి స్థానం. ప్రశాతంగా ఉన్న దగ్గరికే పెట్టుబడులు వస్తాయి.ఫిల్మ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ మంచి ప్లేస్’ అన్నారు. సదస్సులో ‘తెలంగాణలో సినీ ప్రపంచం’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చొరవ, ప్రణాళికలు, లక్ష్యాలను ప్రదర్శించింది.

Prabhas The Rajasaab Movie Ott Deal value In crores 10
భారీ ధరకు ది రాజాసాబ్‌ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?

ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న హారర్ రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్. ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ది రాజాసాబ్‌ బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేసేందుకు మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ది రాజాసాబ్‌ ఓటీటీ డీల్‌పై అభిమానులతో పాటు ఆడియన్స్‌లోనూ సస్పెన్స్ ఆసక్తి నెలకొంది. ఇటీవలే జియో హాట్‌ స్టార్‌ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మరి ఈ డీల్‌ విలువ ఎంతనే దానిపై ఆడియన్స్‌ ఆరా తీస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ది రాజాసాబ్‌ మూవీ హక్కులను దాదాపు రూ.140 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఫర్మామెన్స్‌ ఆధారంగా ఈ డీల్‌ మరింత పెరగొచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. రిజల్ట్‌ను బట్టి ఈ డీల్‌ విలువ దాదాపు రూ.150 నుంచి 200 కోట్లకు పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాథమికంగా కుదుర్చుకున్న డీల్ కంటే జియో హాట్ స్టార్ అదనంగా మరింత మొత్తాన్ని నిర్మాత‌ల‌కు చెల్లించాల్సి రావొచ్చు.

Advertisement
Advertisement