Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

The Rajasaab Movie First Day Collections1
'ది రాజా సాబ్' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. అధికారిక ప్రకటన

ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజే డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్‌ గత సినిమాల కంటే కాస్త తక్కువగానే కలెక్షన్స్‌ వచ్చాయి. రాజా సాబ​్‌‌ సినిమా విషయంలో దర్శకుడు మారుతిపై విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ సినిమాలో చూపించలేదంటూనే.. అవసరం లేకున్నా సరే ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజా సాబ్‌ సక్సెస్‌మీట్‌లో దర్శకుడు మారుతితో పాటు హీరోయిన్స్‌ మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ రాజా సాబ్‌ మొదటిరోజు కలెక్షన్స్‌ రూ. 112 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. సినిమాపై డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ టికెట్ల బుకింగ్‌ భారీగా జరుగుతుందన్నారు. చాలామంది తమ కుటుంబంతో పాటుగా థియేటర్‌కు వెళ్తున్నారని గుర్తుచేశారు. హరర్‌, ఫాంటసీ చిత్రాలకు సంబంధించి ఫస్ట్‌ డే ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ రావడం ఇదే తొలిసారి అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

Director Maruthi Says Sorry at The Raja Saab Movie Blockbuster Success Meet2
ఇలా జరుగుతుందనుకోలేదు, సారీ..: మారుతి

ప్రభాస్‌ తొలిసారి హారర్‌ జానర్‌లో నటించిన చిత్రం ది రాజాసాబ్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వింటేజ్‌ ప్రభాస్‌ను చూసి కొందరు ఖుషీ అవుతుంటే మరికొంతమంది మాత్రం కథ అంతా గందరగోళంగా ఉందని నిరాశకు లోనవుతున్నారు. థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటున్న ఈ సినిమా.. బ్లాక్‌బస్టర్‌ అంటూ సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టింది చిత్రయూనిట్‌.బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌'రాజాసాబ్‌.. కింగ్‌ సైజ్‌ బ్లాక్‌బస్టర్‌' అంటూ శనివారం (జనవరి 10న) సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, హీరోయిన్లు నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారుతి.. విమల్‌ థియేటర్‌లో ప్రీమియర్స్‌ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావించాడు. సారీఆయన మాట్లాడుతూ.. విమల్‌ థియేటర్‌ వద్ద మీడియా మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్ధరాత్రి 1.30 వరకు కూడా ప్రెస్‌ షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు చాలా చాలా సారీ.. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. హాయిగా నిద్రపోయే సమయానికి సినిమా చూపించాం. అయినా అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకు రివ్యూ ఇచ్చారు. థాంక్యూ సోమచ్‌.మూడేళ్ల కష్టంనెక్స్ట్‌.. నాకు అవకాశాన్నిచ్చిన ప్రభాస్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. తొమ్మిది నెలలకే సినిమా పూర్తి చేసే నేను రాజాసాబ్‌ను మూడేళ్లపాటు కష్టపడి, ఇష్టపడి తీశాను. ప్రభాస్‌కు నచ్చేవిధంగా, అభిమానులు మెచ్చేవిధంగా తెరకెక్కించాను. క్లైమాక్స్‌ కొత్తగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.ఒక్కరోజులో డిసైడ్‌ చేయొద్దుసినిమా రిజల్ట్‌ అనేది ఒక్కరోజునే తేల్చలేం.. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుంది. ఎందుకంటే కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదు. కాస్త సమయం పడుతుంది. సినిమాలో కొన్ని సీన్స్‌ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారు, అర్థం కానివాళ్లు తిడుతున్నారు. కాబట్టి.. అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకండి.రియల్‌ రాజాసాబ్‌ట్రైలర్‌లో ప్రభాస్‌ ఓల్డ్‌ గెటప్‌ చూపించాం. థియేటర్‌లో అది లేకపోయేసరికి చాలామంది నిరాశపడ్డారు. అందుకనే సెకండాఫ్‌లో ఆ సీన్స్‌ జత చేస్తున్నాం. ఎక్కడైతే సీన్స్‌ సాగదీతగా ఉన్నాయన్నారో వాటిని షార్ప్‌ చేశాం. ఈరోజు నుంచి రియల్‌ రాజాసాబ్‌ను చూపించబోతున్నాం అని మారుతి అన్నాడు.చదవండి: మాట మీద నిలబడ్డ మెగాస్టార్‌ చిరంజీవి

Chiranjeevi Gifts Rs 5 Lakh Check to Blind Singer Varunavi3
మాట నిలబెట్టుకున్న మెగాస్టార్‌.. వరుణవి కోసం..

చిన్నారి వరుణవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ అనే సింగింగ్‌ రియాలిటీ షోలో ఈ చిన్నారి పాల్గొంది. పాపకు కళ్లు లేనప్పటికీ.. కమ్మనైన మాటలు, పాటలతో అందరినీ ఫిదా చేస్తుంటుంది. అందుకే తనను అందరూ ఎంతో స్పెషల్‌గా ట్రీట్‌ చేస్తుంటారు. ఎలిమినేషన్‌ అనేది లేకుండా గ్రాండ్‌ ఫినాలే వరకు వరుణవిని తీసుకొచ్చారు.మాటిచ్చిన మెగాస్టార్‌ఈ షోకి సుధీర్‌ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌, సింగర్‌ శైలజ జడ్జిలుగా ఉన్నారు. ఇటీవలే అనిల్‌ రావిపూడి.. వరుణవి కోరిక మేరకు ఆమెను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చిన్నారి గాత్రానికి, మాటలకు తెగ మురిసిపోయాడు మెగాస్టార్‌. తనకు ఎటువంటి సహాయం చేయడానికైనా రెడీ అని మాటిచ్చాడు.మాట నిలబెట్టుకున్న చిరంజీవిఇప్పుడా మాటను నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ గ్రాండ్‌ ఫినాలేకు చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత హాజరైంది. మెగాస్టార్‌ పంపించిన రూ.5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందించింది. ఈ డబ్బును వరుణవి పేరుపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయబోతున్నట్లు తెలిపింది.చదవండి: నాచే నాచే కాపీనా? రాజాసాబ్‌కు ఏకంగా చెప్పు చూపించాడా?

Telugu Movies Premiere And Ticket Hike Issue Details4
తెలుగు సినిమాలకు 'ప్రీమియర్ షోలు' అవసరమా?

టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిన్నా పెద్దా సంబంధం లేదు. దాదాపు ప్రతి సినిమాకు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. వీటి వల్ల చిన్న సినిమాలకు కాస్త ప్లస్ అవుతోంది గానీ పెద్ద చిత్రాలకు మాత్రం మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే ఊహించని దానికంటే మైనస్ అవుతుంది. ఏ చిత్రమైనా సరే ప్రీమియర్ షోలు వేయడం నిజంగా అవసరమా?పది పదిహేనేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలోనూ ఒకటో రెండో థియేటర్లు ఉండేవి. ప్రతివారం చిన్నా పెద్దా సినిమాలు అందులో రిలీజయ్యేవి. టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉండేది కాదు. స్టార్ హీరోల మూవీస్‌ అయినా చిన్న హీరోల చిత్రాలైనా ఒకటే రూల్. కాకపోతే పేరున్న హీరోల సినిమాలకు కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చేవి. అప్పట్లో టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు లాంటి హంగామా ఉండేది కాదు. అంతా ప్రశాంతం. అప్పట్లో కథలు కూడా ప్రేక్షకులు తమని తాము సినిమాల్లోని ఆయా పాత్రలతో పోల్చి చూసుకునేలా ఉండేవి.కానీ ఇప్పుడు నగరాల్లో తప్ప ఊళ్లలో థియేటర్లు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. సిటీల్లో అయినా గ్రామాల్లో అయినా వీకెండ్ వస్తేనే చాలా తక్కువ మంది ప్రేక్షకులు.. థియేటర్ వైపు చూస్తున్నారు. మరీ బాగుంది అనిపిస్తే తప్పితే సినిమాకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. టికెట్ ధరల్లోనూ చిన్న పెద్ద సినిమాలకు బోలెడంత వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రీమియర్ షోలు అని చెప్పి ముందు రోజు రాత్రి లేదంటే వేకువజామున షోలు వేస్తున్నారు. వీటి వల్ల బోలెడంత నెగిటివిటీ ఏర్పడుతోంది.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్‌గా 'రాజాసాబ్')మనసు ప్రశాంతంగా ఉంటేనే సినిమాని ఆస్వాదించగలం. రాత్రివేళల్లో దాదాపు అందరూ నిద్రపోయే సమయాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. థియేటర్‌కి వచ్చి చూసే ప్రేక్షకుల్లోనూ చాలామందికి అది నిద్రపోయే టైమ్ అయ్యిండొచ్చు. వాళ్లు మూవీని నిద్ర మబ్బుతో చూడటం, సినిమాలో అది బాగోలేదు ఇది బాగోలేదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, రివ్యూలు చెప్పడం వల్ల మరింత చేటు జరుగుతోంది. అదే రిలీజ్ రోజు ఉదయాన్నే సినిమా చూస్తే బాగలేకపోయినా మూవీ కూడా పర్లేదు ఒక్కసారి చూడొచ్చు అని అనిపించే అవకాశముంది.కానీ గత కొన్నాళ్ల నుంచి తొలి వీకెండ్ అయ్యేసరికి పెట్టిన బడ్జెట్ ఎలాగైనా రాబట్టేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుంటున్నారు. వందల వందల రూపాయల టికెట్ ధరలకు అదనంగా పెంచేస్తున్నారు. దీనివల్ల సినిమాలు రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుడు.. థియేటర్‌కి వెళ్తాడేమో గానీ సగటు మధ్య తరగతి ప్రేక్షకుడు.. ఇంతింత ఖర్చు చేసి ఇప్పుడు వెళ్లడం అవసరమా? ఓటీటీలోకి వచ్చాక చూసుకుందాంలే అని తనలో తానే అనుకుంటున్నాడు. ఇదేదో ఒకటి రెండుసార్లు జరిగితే పర్లేదు. అలవాటు అయిపోతే మాత్రం అలాంటి ప్రేక్షకుడిని తిరిగి థియేటర్‌కి తిరిగి రప్పించడం కష్టం. ప్రస్తుతం అలానే చాలామంది థియేటర్లకు దూరమైపోయారు. ప్రీమియర్ షోలే ఇలాంటి వాటికి ప్రధాన కారణమవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రీమియర్ షోలు వేయాలి, టికెట్ ధరలు పెంచేయాలని అనుకుంటున్నారు తప్పితే సరైన కంటెంట్‌తో వద్దాం. సాధారణ ధరలకే టికెట్స్ అమ్ముదాం అని మాత్రం ఆలోచించట్లేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'దండోరా' సినిమా.. మూడు వారాల్లోపే స్ట్రీమింగ్)

The Raja Saab Movie: Is Thaman Composed Nache Nache Song Copy from Hollywood5
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్‌'కు చెప్పు చూపించిన డీజే

ట్యూన్స్‌ కాపీ కొడతాడని మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌పై ఓ అపవాదు ఉంది. కొన్ని పాటలైతే.. వాటిని ఎక్కడో విన్నట్లుందే అని ప్రేక్షకులే అనుమానపడతారు. కానీ ఈసారి ట్యూన్‌ కాపీ కొట్టి.. ఒరిజినల్‌ కంపోజర్‌కే దొరికిపోయాడు. తమన్‌ లేటెస్ట్‌గా ది రాజాసాబ్‌ సినిమాకు సంగీతం అందించాడు. ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుంది. అదే 'నాచే నాచే'. ఇందులో ప్రభాస్‌.. ముగ్గురు హీరోయిన్లయిన నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్‌తో కలిసి స్టెప్పులేశాడు.కాపీ కొట్టాడా?అయితే ఈ పాట ఒరిజినల్‌ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్‌.. తన ఒరిజినల్‌ సాంగ్‌ అలమేయో పాటను ప్లే చేశాడు. ఆ వెంటనే రాజాసాబ్‌లోని నాచే నాచే పాటను ప్లే చేశాడు. అది మక్కీకి మక్కీ అలాగే ఉండటంతో అతడి కోపం నషాళానికి అంటింది. ఆవేశంతో చెప్పు చూపిస్తూ వీడియో పెట్టాడు. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజాసాబ్‌ రిలీజ్‌ఇది చూసిన అభిమానులు ఈ సాంగ్‌ కూడా కాపీ కొట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పోనీలే.. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్‌ విషయానికి వస్తే.. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ హారర్‌ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. తమన్‌ సంగీతం అందించాడు. జనవరి 9న విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటోంది. View this post on Instagram A post shared by Vidojean (@vidojean) చదవండి: నావాడిని కలిసానోచ్‌.. రోహిణి

Dhandoraa Movie Ott Streaming Latest Update6
ఓటీటీలోకి 'దండోరా' సినిమా.. మూడు వారాల్లోపే స్ట్రీమింగ్

నటుడు శివాజీ.. కొన్నిరోజుల క్రితం హీరోయిన్లు వేసుకునే దుస్తుల గురించి చిల్లరగా మాడ్లాడాడు. ఇదంతా కూడా 'దండోరా' అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగానే జరిగింది. తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా డబ్బులు రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా మూడు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.పరువు హత్య, అగ్ర-బలహీన వర్గాల మధ్య ఆధిపత్యం లాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'దండోరా' సినిమా తీశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న థియేటర్లలోకి వచ్చింది. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకుడిగా ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇప్పుడీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రాబోతుంది. పోస్టర్ కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)దండోరా విషయానికొస్తే.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ దగ్గర తుళ్లూరు అనే గ్రామం. అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి దహనం చేస్తుంటారు. ఇదే గ్రామంలో శివాజీ (శివాజీ) ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఇతడు మరణిస్తాడు. కుల పెద్దలు మాత్రం శివాజీ శవాన్ని ఊరి శ్మశానంలో తగలబెట్టడానికి వీల్లేదని తీర్మానిస్తారు. అసలు శివాజీని వాళ్ల కులమే ఎందుకు బషిష్కరించింది? ఇతడి గతమేంటి? శివాజీతో కన్న కొడుకు విష్ణు(నందు) ఎందుకు ఏళ్లుగా మాట్లాడటం మానేశాడు? ఇతడితో వేశ్య శ్రీలత (బిందుమాధవి)కి సంబంధమేంటి అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమాలు)

Mana Shankara Vara Prasad Garu Movie Ticket Hike Telangana7
తెలంగాణలోనూ చిరంజీవి సినిమా టికెట్ ధరల పెంపు

ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రానికి తెలంగాణలో టికెట్ ధరలు పెంచినందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కి పెంపు ఉంటుందా లేదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'రాజాసాబ్'లానే దీనిపై కూడా ఎవరైనా న్యాయవాది పిటిషన్ వేసే అవకాశముంది. కాకపోతే ఈ రెండు రోజుల కోర్టు సెలవులు కాబట్టి సోమవారం నాడు ఇలాంటిది ఏమైనా ఉండే అవకాశముంది.'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ సంగీతమందించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్‌గా 'రాజాసాబ్')ఏపీలో జారీ చేసిన జీవో విషయానికొస్తే ముందు రోజు వేసే స్పెషల్‌ ప్రీమియర్‌ టికెట్‌ ధరని జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయి.ఆపై తొలి పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.

Bigg Boss Rohini Shares Boyfriend Photo, but here is a Twist8
నావాడిని కలిసానోచ్‌.. ఫోటో షేర్‌ చేసిన రోహిణి!

సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలుపెట్టింది నటి రోహిణి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. నటిగా, కమెడియన్‌గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. నావాడిని కలిశా..మత్తు వదలరా, బలగం, హను-మాన్‌ వంటి సినిమాలతో పాటు సేవ్‌ ది టైగర్స్‌, ఎల్‌జీఎమ్‌ (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌) వెబ్‌సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది. మధ్యలో తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆటతో, మాటతో, కామెడీతో ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా రోహిణి ఓ అబ్బాయితో క్లోజ్‌గా ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఫైనల్లీ.. నావాడిని కలిశాను అంటూనే ఓ ట్విస్ట్‌ ఇచ్చింది. షాకయ్యారా?ఇంతమంచి హ్యాండ్సమ్‌ అబ్బాయిని ఇచ్చిన చాట్‌జీపీటీకి థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఫస్ట్‌ ఈ ఫోటో చూడగానే అభిమానులే కాదు బుల్లితెర సెలబబ్రిటీలు కూడా రోహిణి ప్రియుడు అని పొరబడ్డారు. తర్వాత క్యాప్షన్‌ చూసి ఏఐ (కృత్రిమ మేధ) మాయాజాలమా.. అని నోరెళ్లబెడుతున్నారు.నిజమైతే బాగుండు యాంకర్‌ అరియానా అయితే సీరియస్‌గా అక్కా.. ఒక్క క్షణం నిజమే అనుకున్నా.. చాలా సంతోషంగా ఫీలయ్యా అంది. అందుకు రోహిణి స్పందిస్తూ.. నిజమైతే బాగుండు అని రిప్లై ఇచ్చింది. సింగర్‌ గీతామాధురి.. ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికేద్దాం అని ఫన్నీగా కామెంట్‌ పెట్టింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) చదవండి: అది సవాల్‌గా అనిపించింది: ఆషికా రంగనాథ్‌

Jaya Krishna Ghattamaneni First Look Srinivasa Mangapuram Movie9
హీరోగా అన్న కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేశ్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా ఇప్పుడు మహేశ్ చేతుల మీదుగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలానే చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)మహేశ్ కుటుంబం నుంచి త్వరలో చాలామంది వారసులు.. ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. వాళ్లలో తొలుత జయకృష్ణ లాంచ్ కాబోతున్నాడు. ఇతడు మహేశ్ అన్న రమేశ్ బాబు కొడుకు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తీస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడు. రషా తడానీ హీరోయిన్. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలు కాగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బులెట్‌పై గన్ పట్టుకుని ఉన్న లుక్ బాగుంది.ఇందులోనే మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే రూమర్ కొన్నిరోజుల క్రితం వచ్చింది గానీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంటివి వస్తే ఆయన ఉన్నారా లేదా అనేది క్లారిటీ రానుంది. ఈ ఏడాదిలో మూవీ థియేటర్లలోకి రానుంది. ఎప్పుడు ఏంటనేది త్వరలో చెబుతారు. జయకృష్ణ కాకుండా మహేశ్ కొడుకు గౌతమ్, కూతురు సితార. అలానే రమేశ్ బాబు కూతురు భారతి. మహేశ్ సోదరి మంజుల కుమార్తె జాన్వీ కూడా త్వరలో తెరంగేట్రం చేయనున్నారు.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్‌గా 'రాజాసాబ్')Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026

Ashika Ranganath And Dimple Hayathi Talks About Bhartha Mahasayulaku Wignyapthi10
అది సవాల్‌గా అనిపించింది : ఆషికా రంగనాథ్‌

‘‘రవితేజగారు అద్భుతమైన నటుడు. ఆయనతో కలసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించడం హ్యాపీగా ఉంది. వినోదం, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ మూవీలో మానస శెట్టిగా ఈ తరం అమ్మాయిలు రిలేట్‌ అయ్యే క్యారెక్టర్‌ చేశాను. నా పీఏ క్యారెక్టర్‌లో సత్య కనిపిస్తారు. రవితేజ, సునీల్‌గార్లు, వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌ శ్రీను... అందరూ అద్భుతమైన కామెడీ టైమింగ్‌ ఉన్న నటులు. వాళ్ల టైమింగ్‌ని మ్యాచ్‌ చేయడం సవాల్‌ అనిపించింది’’ అని ఆషికా రంగనాథ్‌ తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతి విలేకరులతో మాట్లాడారు. ఆషికా రంగనాథ్‌ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘నా సామి రంగ’లోని ΄ాత్రతో పోల్చుకుంటే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్‌ 2, అది నా పిల్లరా’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. డింపుల్‌ హయతి మాట్లాడుతూ– ‘‘కిశోర్‌ తిరుమలగారు ఈ కథ చెప్పగానే రవితేజగారి భార్య బాలామణి పాత్ర చేయాలనుకున్నాను. ‘ఖిలాడి’ మూవీ తర్వాత రవితేజగారితో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్‌గారు ప్రతిదీ నటించి, చూపించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్‌ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement