ప్రధాన వార్తలు
‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. గతవారమే ‘విష్ణు విన్యాసం’తో ప్రేక్షకులను పలకరించిన ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు ‘మృత్యుంజయ్’తో మరోసారి థియేటర్స్లోకి వచ్చాడు. ఈ సారి తన కామెడీ జానర్ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్తో వచ్చాడు. మరి ‘మృత్యుంజయ్’ ఏమేరకు థ్రిల్ని పంచింది? శ్రీవిష్ణు ప్రయోగం ఫలించిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్గా ఉన్న అచ్యుత్రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు. చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.ఇలాంటి సినిమాలకు తర్వాత ఏం జరుగుతుందో తెలియని విధంగా బలమైన స్క్రీన్ప్లేతో పాటు ఆడియన్స్ని కట్టిపడేసేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఈ రెండూ ‘మృత్యుంజయ్’లో ఉన్నాయి.కానీ సినిమా చూస్తున్నంత సేపు కొన్ని ఫారిన్ చిత్రాలతో పాటు ‘అతడు’, ‘జులాయి’లాంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు మన కళ్ల ముందు కదులుతాయి. ఆ చిత్రాల్లోలాగే ఇందులో కూడా హీరో-విలన్ ఇద్దరూ తెలివైనవాళ్లే. ఎత్తుకుపైఎత్తులు వేస్తూ టామ్ అండ్ జెర్రీ దాగుడు మూతలాటలాగా కథనం సాగుతుంది. హీరో-విలన్ ఇద్దర్ని తెలివైనవాళ్లలాగా చూపించి.. లాజిక్స్ని పట్టించకోకుండా కథనాన్ని నడిపించడమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. హీరో పాత్ర ఎంట్రీ మొదలు..ఇన్వెస్టిగేషన్ వరకు ఎక్కడా కూడా నేచురల్గా అనిపించదు. శ్రద్ధాంజలి యాడ్స్ కోసం హీరో గెటప్లు మారుస్తూ వెళ్లడం.. అది కూడా ఒక ప్రముఖ పత్రికలో పని చేస్తూ.. ఇది వినడానికే కాదు తెరపై చూడడానికి కూడా సిల్లీగానే అనిపిస్తుంది. అలాగే సినిమా ప్రారంభంలో జరిగే రెండు హత్యలకు సంబంధించిన క్లూస్ కోసం హీరో చేసే ప్రయత్నాలు కూడా అంతగా మెప్పించవు. కానీ ఆ క్లూస్తో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కొతవరకు ఆసక్తిని పెంచుతుంది.విలన్ని పట్టుకునేందుకు హీరో వేసే ఎత్తులు సినిమాటిక్గా, పేలవంగా ఉన్నాయి. ఆ సీన్లను మరింత బలంగారాసుకొని ఉంటే బాగుండేది. అయితే క్లైమాక్స్లో విలన్ని అంతం చేయడానికి హీరో వేసిన ప్లాన్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్, సుకుమార్ శిష్యుడు కావడంతో.. స్క్రీన్ప్లే కూడా ఆయన సినిమాల్లోలాగే సాగుతుంది. కామెడీ సీన్లు, ఐటెమ్ సాంగులు, లవ్ ట్రాకులను పెట్టకుండా అసలు కథను మాత్రమే చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. ఎక్కడ బోర్ కొట్టదు కానీ.. కొత్త సినిమా చూశామనే ఫిలింగ్ మాత్రం కలగలదు. ఎవరెలా చేశారంటే..కామెడీ.. శ్రీవిష్ణు బలం. కానీ ఈ సారి తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. సీరియస్ క్యారెక్టర్లోనూ నటించగలనని జయ్ పాత్రతో నిరూపించాడు. ఆయన లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, హావభావాలు అన్నీ కొత్తగా ఉంటాయి. విలన్గా వీర్ ఆర్యన్ అదరగొట్టేశాడు. రెబా మోనికాది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. సుదర్శన్, ఐశ్వర్య, రచ్చ రవి, చిన్నా, బాలాదిత్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ నేపథ్య సంగీతం బాగుంది, శ్రీకర్ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
‘సరస్వతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
టైటిల్: ఎస్. సరస్వతినటీనటులు: వరలక్ష్మీ శరత్కుమార్, ప్రకాశ్ రాజ్, జీవా, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమని, సప్తగిరి తదితరులునిర్మాతలు:పూజా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్కథ: సాయిమాధవ్ బుర్రాదర్శకత్వం: వరలక్ష్మి శరత్కుమార్సంగీతం: తమన్సినిమాటోగ్రఫీ: ఎడ్విన్ సకాయ్విడుదల తేది: మార్చి 6, 2026కథేంటంటే..లక్ష్మి(వరలక్ష్మి శరత్కుమార్) సింగిల్ మదర్. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఓ ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. కానీ ‘సరస్వతి’లో అది మిస్ అయింది. సినిమా ప్రారంభం అయినా కాసేపటికే.. పాపకు సంబంధించిన ఓ ట్విస్టు ఈజీగా తెలిసిపోతుంది. అదొక్కటే కాదు.. సైకలాజికల్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా చూసేవాళ్లకి సినిమాలోని ప్రతి ట్విస్ట్ ఊహించొచ్చు. అలాగే కథా నేపథ్యం కూడా వరలక్ష్మి నటించిన ‘శబరి’, ఇటీవల వచ్చిన ‘త్రిభాణధారి బార్బరిక్’ తో పాటు పలు పాత చిత్రాలను గుర్తుకు తెస్తుంది. అయినా కూడా తల్లి కూతుళ్ల ఎమోషన్ మాత్రం కాస్త భావోద్వేగానికి గురి చేస్తుంది. తల్లి కూతుళ్ల బాండింగ్ తెలియజేసే పాటతో సినిమా ప్రారంభం అవుతుంది. పాపను స్కూల్లో డ్రాప్ చేయడం.. సాయంత్రానికి కనిపించకుండా పోవడం..అక్కడ లక్ష్మి చేసే హడావుడి అంతా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే ఎలాంటి సాక్ష్యాలు కనిపించకుండా పోవడంతో అసలు పాప ఉందా లేదా? ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. కానీ కాసేపటికే ఆ ఆసక్తి కాస్త నీరసంగా మారిపోతుంది. ట్విస్టుతో పాటు కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ప్రకాశ్ రాజ్ పాత్ర రంగంలోకి దిగిన తర్వాత మళ్లీ కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు విచారణ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. లక్ష్మి నేపథ్యం.. ఆమెకు జరిగిన అన్యాయం.. ఇవన్నీ కాస్త ఆసక్తిగానే అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ సీన్తో ద్వితియార్థం మొత్తం ఊహించొచ్చు. కమర్షియల్గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ..ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది.ఎవరెలా చేశారంటే.. వరలక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలో అయినా జీవించేస్తుంది. లక్ష్మి పాత్రలో కూడా ఆమె చక్కగా నటించింది. నిజాయితీ గల న్యాయవాధి రామానుజంగా ప్రకాశ్ రాజ్ బాగానే నటించాడు. అయితే కోర్టు రూం డ్రామా సన్నివేశాలు మాత్రం అంతగా రక్తి కట్టించలేదు. ప్రియమణి, కిశోర్ పాత్రలు తెరపై కనిపించేది తక్కువసేపే అయినా గుర్తిండిపోతాయి. నాజర్, రావు రమేశ్, సప్తగిరి, రాధికా శరత్కుమార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
బాలకృష్ణ కొత్త సినిమా.. విలన్గా మంచు హీరో
బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కనుందనే విషయం తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’ మూవీ తర్వాత వీరి కాంబోలో ‘NBK111’(వర్కింగ్ టైటిల్) కొత్త ప్రాజెక్ట్కు లైన్ క్లియర్ అయింది. ఈ మూవీని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రధాన విలన్గా నటించబోతున్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ‘మిరాయి’లో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్కు భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ కథ నచ్చితేనే ఓకే చెబుతున్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో సినిమా ఛాన్స్ రావడం ఆపై స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం.ముంబై నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉంటుందని సమాచారం. మార్చిలో చిత్రీకరణ ప్రారంభకానుంది. బాలయ్య గత చిత్రాల్లా కాకుండా ఇందులో ఆయన ఒకే పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే స్టైలిష్గా కనిపించే విలన్ పాత్ర కోసం మనోజ్ను ఎంపిక చేశారట. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారట. గతంలో మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలకృష్ణ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే.
'ఉస్తాద్ భగత్సింగ్' ఫ్యాన్స్కు షాకిస్తున్న బుక్మైషో
‘ఉస్తాద్ భగత్సింగ్’ వారం ముందే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదటగా ఈ మూవీని ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టాక్సిక్ వాయిదా పడటంతో ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా బుక్మైషోలో ఈ మూవీ స్టోరీకి సంబంధించి పాయింట్స్ను చేర్చి పవన్ కల్యాణ్ అభిమానులకు షాకిచ్చింది.మొదటి నుంచి ఈ సినిమా 'తేరి' రీమేక్ అని పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను అసలు స్క్రిప్ట్తో వచ్చానని స్పష్టం చేశారు. ఇప్పుడు, బుక్ మై షోలో ఉస్తాద్ భగత్ సింగ్ కథా సారాంశం అభిమానులను షాక్కు గురిచేస్తుంది. అందులో స్టోరీ లైన్ ఇలా ఉంది, “ఒక ఐపీఎస్ అధికారి తన కుమార్తెతో కలిసి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే, క్రూరమైన నేరస్థులు హీరో కుటుంబాన్ని నాశనం చేయడంతో కూతురు కోసం అజ్ఞాతంలోకి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత హీరో ఆచూకీ తెలుస్తుంది. అతను తన గతానికి సంబంధించిన శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకు మిగిలి ఉన్న ఏకైక కూతురుని రక్షించడానికి మరోసారి పోరాడుతాడు.” అంటూ కథకు సంబంధించి కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాడు.బుక్మైషో టికెటింగ్ ప్లాట్ఫామ్లో చేర్చబడిన ఈ స్టోరీ లైన్ పూర్తిగా తెరి సినిమాను పోలి ఉంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇది ప్లాట్ఫామ్ లోపమా లేదా ప్రధాన కథాంశం అలాగే ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
బిగ్బాస్
తనూజ బర్త్డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
ప్రేయసితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
A to Z
అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి
తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది....
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ప్రతివారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయ...
ఓటీటీలో 'తన్వి ది గ్రేట్' సినిమా.. సడెన్గా స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించి, నటిం...
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
2026లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింద...
నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి
ధురంధర్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ప్రశం...
మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్
ముంబైలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతా...
తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు
ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ ...
బాలీవుడ్తోనే మొదలైన కెరీర్.. ఫైనలియర్లో ఉన్నప్పుడు!
మరో నాలుగు రోజుల్లో అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్...
19ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న 'షకీరా'
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీర...
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. క...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగ...
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష.. వీడియో వైరల్
కోలీవుడ్ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్, త్రిష క...
సముద్రఖని, గౌతమ్ మీనన్ సినిమా విడుదలపై బిగ్ ప్లాన్
సౌత్ ఇండియా ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో...
విజయ్, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతంటే..?
టాలీవుడ్ కొత్తజంట విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్...
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష సందడి.. ఫోటోలు వైరల్
నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
విరోష్ జంట రిసెప్షన్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
#Virosh Reception: ఘనంగా విజయ్- రష్మిక రిసెప్షన్ (ఫోటోలు)
'పీలింగ్స్..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)
అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)
ఆకుపచ్చ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియమణి (ఫొటోలు)
ఇది నా జర్నీ కాదు మనది.. మంచు మనోజ్-మౌనిక పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
గాసిప్స్
View all
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్కి ముందు భారీ మార్పులు?
రామ్ చరణ్ 'పెద్ది' రన్టైమ్.. 4 గంటలపైనే?
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
దర్శకుడు మారుతి 'హ్యాపీ పొంగల్'?
నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’.. యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్?
హిట్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకొన్న వెంకటేశ్?
విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!
రివ్యూలు
View all
1.75
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ.. ప్రేక్షకులు సుద్దపూసలు కాదు
2.25
‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
‘సరస్వతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
మూగజీవాల ఎమోషన్స్ చూపించే లక్కీ.. ఓటీటీ మూవీ రివ్యూ
2.75
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.75
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
విజయ్, శిరీష్ దారిలో టాలీవుడ్లో మరో హీరో.. ప్రేమ పెళ్లి
గత వారం పదిరోజుల్లోనే హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా ఉదయ్పుర్లో ఈ శుభకార్యం జరగ్గా.. సొంతూరి వాళ్లకు, అభిమానులకు, సినీ-రాజకీయ ప్రముఖులకు వేర్వురుగా రిసెప్షన్స్ ఏర్పాటు చేశారు. ఆ సందడి అంతా అయిపోయింది. ఇకపోతే ఈరోజు అల్లు శిరీష్, నయనిక మెడలో మూడు మూళ్లు వేయనున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పుడు టాలీవుడ్లో మరో హీరో కూడా ప్రేమ వివాహానికి సిద్ధమైపోయాడు.(ఇదీ చదవండి: రీల్స్ పేరుతో ఇలాంటి ఫోటోలా.. రుక్మిణి వసంత్ ఫైర్)నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకు అయిన శ్రీనివాస్.. 'అల్లుడు శీను' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత చాలానే సినిమాలు చేశాడు గానీ 'రాక్షసుడు' తప్పితే మరేవి హిట్ కాలేదు. ప్రస్తుతం హైందవ, టైసన్ నాయుడు తదితర చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇతడు గత కొన్నేళ్లుగా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆదివారం(మార్చి 8) కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది.కావ్య రెడ్డి విషయానికొస్తే ఈమెది హైదరాబాదే. తాత జడ్జి కాదా తండ్రి లాయర్గా చేస్తున్నారు. ఈమెకు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. మరి ఎప్పుడు ఎలా పరిచయమయ్యారో గానీ శ్రీనివాస్-కావ్య ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అనుమతితోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వేసవిలో లేదంటే ఈ ఏడాది చివరలో పెళ్లి ఉండే అవకాశముంది.(ఇదీ చదవండి: క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం)
డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్ గార్డెన్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఉన్న ఏరియాలోనే నయన్ జంట ఈ ఇల్లు కొనడం విశేషం. డూప్లెక్స్ అపార్ట్మెంట్ తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది. ఇది 14,369 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను కలిగి ఉంది. దీని ధర చదరపు అడుగుకు రూ.21,946గా ఉంది. ఈ అపార్ట్మెంట్కు 8 కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. కాగా లేడీ సూపస్టార్ నయనతారకు కేరళలో పూర్వీకుల ఇల్లు ఉంది. సినిమాహైదరాబాద్లోని బంజారాహిల్స్లో రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కేరళలోని ఇతర ప్రాంతాల్లోనూ తనకు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే నయనతార చివరగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అలరించింది. ప్రస్తుతం టాక్సిక్ సహా నాలుగైదు మూవీస్ చేస్తోంది.చదవండి: హీరోయిన్ను అవమానించిన యామీ గౌతమ్?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ.. ప్రేక్షకులు సుద్దపూసలు కాదు
టాలీవుడ్ నటుడు శివాజీ సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గతేడాది కోర్ట్, దండోరా సినిమాలతో విజయాలందుకున్న ఆయన తాజాగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రంతో మార్చి 6న థియేటర్స్లోకి వచ్చారు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీలో లయ, అలీ, ప్రిన్స్, ధన్రాజ్, రిక్కీ, బబ్లూ, రోహన్, షాబుద్దీన్, చిత్రం శ్రీను, కమల్, చమ్మక్చంద్ర, ఇమ్మానుయేల్ తదితరులు నటించారు. ఈ మూవీకి నిర్మాత శివాజీ కావడం విశేషం. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు.కథేంటి..?శ్రీరామ్ (శివాజి) సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తూ.. చాలా నిజాయితీపరుడని పేరు తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోకుండా తన ఉద్యోగ ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వం. భార్య ఉత్తర (లయ), కుమారుడు మిక్కీ (రోహన్) వీరిద్దరూ ఒకేరకమైన మనస్థత్వంతో ఉంటారు. వారిలో అమాయకత్వంతో పాటు అతి తెలివి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా వాళ్ల జోలికెళితే ఏం చేస్తారో వారికే తెలియదు. ఇలా వారి పాత్రలన్నీ టైటిల్కు తగ్గట్లే ఉంటాయి. ఆ కాలనీలోనే వారి ఫ్యామిలీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎంతో సరదాగా వెళ్తున్న వారి జీవితంలోకి ఎస్ఐ విక్రమ్ (ప్రిన్స్) వస్తాడు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. ఒకరోజు శ్రీరామ్తో గొడవ అవుతుంది. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ఫైల్ను శ్రీరామ్ (శివాజి) అడ్డుకుంటాడు. అయితే, ఒకరోజు శ్రీరామ్ లేని సమయంలో ఉత్తరను చూసిన ఎస్ఐ ఇంట్లోకి వెళ్తాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఆ ఇంట్లో ఒక నేరం జరుగుతుంది. దాని నుంచి బయటపడేందుకు హీరో ఏం చేశాడు అనేది పూర్తి సినిమా. శ్రీరామ్ ఇంటికి ఎస్ఐ ఎందుకు వెళ్లాడు..? అక్కడ ఎలాంటి నేరం జరిగింది..? దాని నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో ఎంత దూరం వెళ్తాడు..? ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కథలో ఎక్కువగా దృశ్యం మూవీ సీన్లు గుర్తుకొస్తాయి. కానీ, ఆ మూవీలో ఉన్నంత సీరియస్ ఇందులో కనిపించదు. కథలో కావాల్సినంత విషయంతో పాటు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా తెరకెక్కించే అవకాశం ఉంది. కానీ, కథ నడపడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథలో ఓవర్ ట్విస్ట్లు ఉంటాయి. కానీ, అవన్నీ ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తాయి. ఇందులో (శ్రీరామ్) పాత్ర సాంప్రదాయంగా ఉంటే... ఇంకొకరు( ఉత్తర) సుప్పనాతితనంతో ఉంటారు. ఇంకొకరేమో (మిక్కీ) సుద్దపూసలా కనిపించే దొంగ. ఇలా ప్రతి పాత్ర గమ్మత్తుగా ఉంటుంది. అయితే, వారు ఇచ్చే ట్విస్ట్లే కొంపముంచాయ్. తన ఇంట్లో జరిగిన ఒక నేరం నుంచి బయటపడేందుకు శివాజీ అమలు చేసే ప్లాన్స్ కొన్ని పర్వాలేదనిపిస్తాయి. అయితే, హీరో సమస్యలో పడిన ప్రతిసారీ ఆయనకి అనుకూలంగా ఏదోఒకటి జరగడంతో ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తుంది. ఆపై చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ పాత్ర తికమకగా మరీ తెలివితక్కువగా ఉంటుంది. తన సీన్స్ వచ్చిన ప్రతిసారి ఎప్పుడు అయిపోతుందా అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అమాయకత్వంతో లయ అదరగొట్టేసింది. ఫస్టాఫ్ కాస్త మెప్పించినప్పటికీ.. ఇంటర్వెల్ తర్వాత ఆశించినంత రేంజ్ కథలో విషయం కనిపించదు. కథ ప్రారంభంలో వేసిన చిక్కుముళ్లు సరైన క్రమంలో తొలగించకుంటే ప్రేక్షకుడిని మెప్పించడం కాస్త కష్టమైన పనే అవుతుంది. ప్రేక్షకుడి తెలివికి పరీక్ష పెట్టాలి.., కానీ ఇక్కడ సహనానికి అగ్నిపరీక్ష దర్శకుడు పెట్టాడనిపిస్తుంది.ఒక మంత్రి కోసం ఎమ్మెల్యే (శరత్ లోహితాస్య) పంపిన గిఫ్ట్ చుట్టూ కాస్త స్టోరీ తిరుగుతుంది. ఇందులో హీరో పాత్రకు పెద్దగా బలం కనిపించదు. సినిమా అంతా గిఫ్ట్ కోసం వెతకమని కేకలు పెట్టే ఎమ్మెల్యే చివర్లో కూడా ఆ గిఫ్ట్లో ఏముందో చెప్పడు. ఈ మధ్య ఓటీటీలు వచ్చాకు ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చూసిచూసి ప్రేక్షకులు రాటుదేలి పోయారు. ఓటీటీలు శాసిస్తున్న కాలంలో వాళ్లని సుద్దపూసలనుకుంటే సినిమాకే నష్టం. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పెద్దగా మెప్పించలేదు. ఆలీ ఎపిసోడ్ కాస్త పర్వాలేదు. గుడ్న్యూస్ అంటూ లయ చేసిన సీన్ మెప్పిస్తుంది. శవం ఎపిసోడ్ను దర్శకుడు తను అనుకూలంగా మార్చుకున్నాడు ఏమో అనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..?దాదాపు 20ఏళ్ల తర్వాత లయ, శివాజీ కలిసి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మూవీకి ప్రధాన బలం లయ, శివాజీల నటన మాత్రమే. రోహన్ పాత్ర పెద్దగా కనెక్ట్ అవదు. ప్రిన్స్ ఎస్ఐగా కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ మెప్పించాడు. ఆ తర్వాత ఆలీ, ధన్రాజ్, శరత్ లోహితాస్య, చమ్మక్చంద్ర, ఇమ్మానుయేల్ వారి పరిధిమేరకు మెప్పించారు. సినిమాకు సంగీతం, కెమెరామెన్ పనితీరు మరోక బలం అయ్యాయి. బడ్జెట్ పరంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓటీటీలోనే విడుదల చేసింటే మరింత పేరు వచ్చేదేమో..
బ్యాండ్ మేళం: రామ్ మిరియాల పాడిన బ్రేకప్ సాంగ్ రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.బ్రేకప్ సాంగ్'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్ సాంగ్ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ చేకూర్చగా రామ్ మిరియాల ఆలపించాడు.సినిమాబ్యాండ్ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
కృతీని అవమానించిందా? చిల్లర పనులు చేయనన్న హీరోయిన్
హీరోయిన్ కృతిసనన్పై యామీ గౌతమ్ అసూయతో రగిలిపోతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ ఈవెంట్లో కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' సినిమాకుగానూ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అయితే ఈ విజయాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. లైక్ కొట్టడంతో వివాదంకృతీ సనన్కు బదులుగా హక్ సినిమాకుగానూ యామీ గౌతమ్కు ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని ఓ వీడియో క్రియేట్ చేశారు. అయినా అవార్డు గెలిస్తే మాత్రమే ఉత్తమ నటి అన్న అభిప్రాయాన్ని తాను ఏకీభవించను. ఈ అవార్డులను పట్టించుకోను అంటూ యామీ గతంలో అన్న మాటల్ని ఆ వీడియోలో పొందుపరిచారు. కృతిని విమర్శిస్తున్న ఆ పోస్టుకు యామీ లైక్ కొట్టడంతో వివాదం మొదలైంది. అవమానించనుతాజాగా ఈ వ్యవహారంపై యామీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ఒక నటిని అవమానించేలా ఉన్న వీడియోను నేను లైక్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజు ఎంతోమంది మమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. అలా వాటిని చూసే క్రమంలో పొరపాటున లైక్ పడి ఉండవచ్చు. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా నేను లైక్ చేయలేదు.క్లారిటీనా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి చిల్లర పబ్లిసిటీ స్టంట్లు చేయలేదు. నా పనేంటో నేను చూసుకుని ముందుకు కదిలాను. క్లిక్బైట్ వార్తల కోసం ఇలాంటి చిన్న విషయాల్ని పెద్దది చేయకండి. నాకంటూ మంచి పేరు, గౌరవం ఉందని ఆశిస్తున్నాను. నాకెటువంటి పీఆర్ టీమ్ లేదు. అలాగే అవార్డులపై నా అభిప్రాయాన్ని గతంలోనే వెల్లడించాను. నేను కేవలం నా పనిపైనే దృష్టి పెడతాను అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. The reel Yami is referring to - pic.twitter.com/phE5GTvjUp— Pan India Review (@PanIndiaReview) March 5, 2026చదవండి: క్యూటీ.. నీవల్లే ఇదంతా: అల్లు అర్జున్ పోస్ట
క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం
టాలీవుడ్ స్టార్ జంట అల్లు అర్జున్- స్నేహ నేడు (మార్చి 6న) 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్ధాంగితో దిగిన ఫోటోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. మనది 15 ఏళ్ల బంధం.. నువ్వు లేకపోయుంటే ఈ జర్నీ ఇలా ఉండేదే కాదు అని అందమైన క్యాప్షన్ జోడించాడు. ఇది చూసిన అభిమానులు బన్నీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.లవ్ ఎట్ ఫస్ట్ సైట్సినిమాల్లో లవర్బాయ్గా మెప్పించిన అల్లు అర్జున్ నిజజీవితంలో కూడా తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అమెరికాలో చదువు ముగించుకుని వచ్చిన స్నేహను ఒక స్నేహితుడి పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. మనసులు కలిశాయి. కానీ పెద్దలు ఒప్పుకోలేదు.పెళ్లిఒకరిని విడిచి మరొకరం ఉండలేమని తేల్చి చెప్పేశారు. దాంతో వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. అలా 2010 నవంబర్ 26న అల్లు అర్జున్- స్నేహ నిశ్చితార్థం జరిగింది. 2011 మార్చి 6న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. 2014లో వీరికి కుమారుడు అయాన్ జన్మించగా.. మరో రెండేళ్లకు కూతురు అర్హ పుట్టింది. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. వీలు కుదుర్చుకుని మరీ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తుంటాడు. వారితో కాలక్షేపం చేస్తుంటాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)
‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. గతవారమే ‘విష్ణు విన్యాసం’తో ప్రేక్షకులను పలకరించిన ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు ‘మృత్యుంజయ్’తో మరోసారి థియేటర్స్లోకి వచ్చాడు. ఈ సారి తన కామెడీ జానర్ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్తో వచ్చాడు. మరి ‘మృత్యుంజయ్’ ఏమేరకు థ్రిల్ని పంచింది? శ్రీవిష్ణు ప్రయోగం ఫలించిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్గా ఉన్న అచ్యుత్రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు. చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.ఇలాంటి సినిమాలకు తర్వాత ఏం జరుగుతుందో తెలియని విధంగా బలమైన స్క్రీన్ప్లేతో పాటు ఆడియన్స్ని కట్టిపడేసేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఈ రెండూ ‘మృత్యుంజయ్’లో ఉన్నాయి.కానీ సినిమా చూస్తున్నంత సేపు కొన్ని ఫారిన్ చిత్రాలతో పాటు ‘అతడు’, ‘జులాయి’లాంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు మన కళ్ల ముందు కదులుతాయి. ఆ చిత్రాల్లోలాగే ఇందులో కూడా హీరో-విలన్ ఇద్దరూ తెలివైనవాళ్లే. ఎత్తుకుపైఎత్తులు వేస్తూ టామ్ అండ్ జెర్రీ దాగుడు మూతలాటలాగా కథనం సాగుతుంది. హీరో-విలన్ ఇద్దర్ని తెలివైనవాళ్లలాగా చూపించి.. లాజిక్స్ని పట్టించకోకుండా కథనాన్ని నడిపించడమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. హీరో పాత్ర ఎంట్రీ మొదలు..ఇన్వెస్టిగేషన్ వరకు ఎక్కడా కూడా నేచురల్గా అనిపించదు. శ్రద్ధాంజలి యాడ్స్ కోసం హీరో గెటప్లు మారుస్తూ వెళ్లడం.. అది కూడా ఒక ప్రముఖ పత్రికలో పని చేస్తూ.. ఇది వినడానికే కాదు తెరపై చూడడానికి కూడా సిల్లీగానే అనిపిస్తుంది. అలాగే సినిమా ప్రారంభంలో జరిగే రెండు హత్యలకు సంబంధించిన క్లూస్ కోసం హీరో చేసే ప్రయత్నాలు కూడా అంతగా మెప్పించవు. కానీ ఆ క్లూస్తో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కొతవరకు ఆసక్తిని పెంచుతుంది.విలన్ని పట్టుకునేందుకు హీరో వేసే ఎత్తులు సినిమాటిక్గా, పేలవంగా ఉన్నాయి. ఆ సీన్లను మరింత బలంగారాసుకొని ఉంటే బాగుండేది. అయితే క్లైమాక్స్లో విలన్ని అంతం చేయడానికి హీరో వేసిన ప్లాన్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్, సుకుమార్ శిష్యుడు కావడంతో.. స్క్రీన్ప్లే కూడా ఆయన సినిమాల్లోలాగే సాగుతుంది. కామెడీ సీన్లు, ఐటెమ్ సాంగులు, లవ్ ట్రాకులను పెట్టకుండా అసలు కథను మాత్రమే చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. ఎక్కడ బోర్ కొట్టదు కానీ.. కొత్త సినిమా చూశామనే ఫిలింగ్ మాత్రం కలగలదు. ఎవరెలా చేశారంటే..కామెడీ.. శ్రీవిష్ణు బలం. కానీ ఈ సారి తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. సీరియస్ క్యారెక్టర్లోనూ నటించగలనని జయ్ పాత్రతో నిరూపించాడు. ఆయన లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, హావభావాలు అన్నీ కొత్తగా ఉంటాయి. విలన్గా వీర్ ఆర్యన్ అదరగొట్టేశాడు. రెబా మోనికాది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. సుదర్శన్, ఐశ్వర్య, రచ్చ రవి, చిన్నా, బాలాదిత్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ నేపథ్య సంగీతం బాగుంది, శ్రీకర్ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
‘సరస్వతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
టైటిల్: ఎస్. సరస్వతినటీనటులు: వరలక్ష్మీ శరత్కుమార్, ప్రకాశ్ రాజ్, జీవా, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమని, సప్తగిరి తదితరులునిర్మాతలు:పూజా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్కథ: సాయిమాధవ్ బుర్రాదర్శకత్వం: వరలక్ష్మి శరత్కుమార్సంగీతం: తమన్సినిమాటోగ్రఫీ: ఎడ్విన్ సకాయ్విడుదల తేది: మార్చి 6, 2026కథేంటంటే..లక్ష్మి(వరలక్ష్మి శరత్కుమార్) సింగిల్ మదర్. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఓ ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. కానీ ‘సరస్వతి’లో అది మిస్ అయింది. సినిమా ప్రారంభం అయినా కాసేపటికే.. పాపకు సంబంధించిన ఓ ట్విస్టు ఈజీగా తెలిసిపోతుంది. అదొక్కటే కాదు.. సైకలాజికల్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా చూసేవాళ్లకి సినిమాలోని ప్రతి ట్విస్ట్ ఊహించొచ్చు. అలాగే కథా నేపథ్యం కూడా వరలక్ష్మి నటించిన ‘శబరి’, ఇటీవల వచ్చిన ‘త్రిభాణధారి బార్బరిక్’ తో పాటు పలు పాత చిత్రాలను గుర్తుకు తెస్తుంది. అయినా కూడా తల్లి కూతుళ్ల ఎమోషన్ మాత్రం కాస్త భావోద్వేగానికి గురి చేస్తుంది. తల్లి కూతుళ్ల బాండింగ్ తెలియజేసే పాటతో సినిమా ప్రారంభం అవుతుంది. పాపను స్కూల్లో డ్రాప్ చేయడం.. సాయంత్రానికి కనిపించకుండా పోవడం..అక్కడ లక్ష్మి చేసే హడావుడి అంతా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే ఎలాంటి సాక్ష్యాలు కనిపించకుండా పోవడంతో అసలు పాప ఉందా లేదా? ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. కానీ కాసేపటికే ఆ ఆసక్తి కాస్త నీరసంగా మారిపోతుంది. ట్విస్టుతో పాటు కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ప్రకాశ్ రాజ్ పాత్ర రంగంలోకి దిగిన తర్వాత మళ్లీ కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు విచారణ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. లక్ష్మి నేపథ్యం.. ఆమెకు జరిగిన అన్యాయం.. ఇవన్నీ కాస్త ఆసక్తిగానే అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ సీన్తో ద్వితియార్థం మొత్తం ఊహించొచ్చు. కమర్షియల్గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ..ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది.ఎవరెలా చేశారంటే.. వరలక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలో అయినా జీవించేస్తుంది. లక్ష్మి పాత్రలో కూడా ఆమె చక్కగా నటించింది. నిజాయితీ గల న్యాయవాధి రామానుజంగా ప్రకాశ్ రాజ్ బాగానే నటించాడు. అయితే కోర్టు రూం డ్రామా సన్నివేశాలు మాత్రం అంతగా రక్తి కట్టించలేదు. ప్రియమణి, కిశోర్ పాత్రలు తెరపై కనిపించేది తక్కువసేపే అయినా గుర్తిండిపోతాయి. నాజర్, రావు రమేశ్, సప్తగిరి, రాధికా శరత్కుమార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
బాలకృష్ణ కొత్త సినిమా.. విలన్గా మంచు హీరో
బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కనుందనే విషయం తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’ మూవీ తర్వాత వీరి కాంబోలో ‘NBK111’(వర్కింగ్ టైటిల్) కొత్త ప్రాజెక్ట్కు లైన్ క్లియర్ అయింది. ఈ మూవీని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రధాన విలన్గా నటించబోతున్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ‘మిరాయి’లో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్కు భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ కథ నచ్చితేనే ఓకే చెబుతున్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో సినిమా ఛాన్స్ రావడం ఆపై స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం.ముంబై నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉంటుందని సమాచారం. మార్చిలో చిత్రీకరణ ప్రారంభకానుంది. బాలయ్య గత చిత్రాల్లా కాకుండా ఇందులో ఆయన ఒకే పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే స్టైలిష్గా కనిపించే విలన్ పాత్ర కోసం మనోజ్ను ఎంపిక చేశారట. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారట. గతంలో మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలకృష్ణ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే.
'ఉస్తాద్ భగత్సింగ్' ఫ్యాన్స్కు షాకిస్తున్న బుక్మైషో
‘ఉస్తాద్ భగత్సింగ్’ వారం ముందే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదటగా ఈ మూవీని ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టాక్సిక్ వాయిదా పడటంతో ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా బుక్మైషోలో ఈ మూవీ స్టోరీకి సంబంధించి పాయింట్స్ను చేర్చి పవన్ కల్యాణ్ అభిమానులకు షాకిచ్చింది.మొదటి నుంచి ఈ సినిమా 'తేరి' రీమేక్ అని పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను అసలు స్క్రిప్ట్తో వచ్చానని స్పష్టం చేశారు. ఇప్పుడు, బుక్ మై షోలో ఉస్తాద్ భగత్ సింగ్ కథా సారాంశం అభిమానులను షాక్కు గురిచేస్తుంది. అందులో స్టోరీ లైన్ ఇలా ఉంది, “ఒక ఐపీఎస్ అధికారి తన కుమార్తెతో కలిసి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే, క్రూరమైన నేరస్థులు హీరో కుటుంబాన్ని నాశనం చేయడంతో కూతురు కోసం అజ్ఞాతంలోకి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత హీరో ఆచూకీ తెలుస్తుంది. అతను తన గతానికి సంబంధించిన శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకు మిగిలి ఉన్న ఏకైక కూతురుని రక్షించడానికి మరోసారి పోరాడుతాడు.” అంటూ కథకు సంబంధించి కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాడు.బుక్మైషో టికెటింగ్ ప్లాట్ఫామ్లో చేర్చబడిన ఈ స్టోరీ లైన్ పూర్తిగా తెరి సినిమాను పోలి ఉంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇది ప్లాట్ఫామ్ లోపమా లేదా ప్రధాన కథాంశం అలాగే ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా
విరోష్ ప్రేమకథ.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే
విరోష్ రిసెప్షన్లో రాజకీయ నాయకులు
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు
ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న పెద్ది రన్ టైం..!
విరోష్ రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి విజువల్స్
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
విరోష్ రిసెప్షన్లో సెలబ్రిటీల సందడి
విజయ్ దేవరకొండ & రష్మిక మందన్న రిసెప్షన్ విజువల్స్
శ్రీవల్లి రిసెప్షన్ కు పుష్ప.. గ్రాండ్ ఎంట్రీ
హైదరాబాద్ లో ఘనంగా విజయ్ దేవరకొండ-రష్మికల రిసెప్షన్
