Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Fitness Trainer Vinod Channa Reveal John Abraham Diet1
కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!

ప్రస్తుతం ఎవరితో మాట్లాడినా సరే ఆరోగ్యం ఉండండి, డైట్ పాటించండి అని చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలకు ఈ విషయంలో పట్టింపులు చాలా ఎక్కువ. స్క్రీన్ పై కనిపించాలి, గ్లామర్‌గా ఉండాలంటే మన తినే చాలా ఆహార పదార్థాలకు వాళ్లు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫేమస్ ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఇప్పుడు అదే చెప్పారు. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్‌ కోచ్‌గా చేసిన ఈయన ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రైనర్ వినోద్ చన్నా.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, డైట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో చెప్పాడు. దాని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. 'జాన్ పాటిస్తున్న డైట్ వల్ల ఆయన శరీరం పూర్తిగా ఆ ఆహార విధానానికి అలవాటు పడిపోయింది. జాన్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. నాలుగు ఫుడ్స్ తినమని చెబితే అవి మాత్రమే తింటాడు. వేరే వాటిని అస్సలు ముట్టుకోడు. అంత కఠినంగా ఉంటాడు'(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)'ఓసారి సినిమా షూటింగ్‌లో జాన్ ఉన్నప్పుడు తైవాన్ రాజకుమార్తె వచ్చారు. డైనింగ్ టేబుల్‌పై ఉన్న ఫుడ్ అంతా అయిపోయిందని నాతో చెప్పింది. కానీ జాన్ ఆ ఆహారాన్ని అస్సలు టచ్ చేయడని, ఆ విషయంలో నాకు వంద శాతం నమ్మకం ఉందని ఆమెతో చెప్పాను. షుగర్(చక్కెర)కు జాన్ చాలా ఏళ్లు దూరంగా ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతైనా తీసుకోమని చెప్పాను. అయినా సరే నో చెప్పాడు''పొరపాటున జాన్ గనుక చక్కెర ఉన్న ఆహారం తీసుకుంటే.. అతడికి దగ్గు వచ్చే అవకాశముంది. ఎన్నో ఏళ్లుగా కఠినమైన డైట్ పాటించడం వల్ల ఇప్పుడు జాన్.. బెండకాయ, వంకాయ లాంటివి తినలేడు. ఒకవేళ తీసుకున్నా సరే అతడి కడుపు వాటిని జీర్ణించుకోలేకపోతోంది. శరీరం ఓ నిర్దిష్ట ఆహారానికి అలవాటు పడితే అకస్మాత్తుగా వచ్చే మార్పులని తీసుకోలేదు. జీర్ణ సమస్యలు వస్తాయి' అని వినోద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ విషయంలో ఫిట్‌నెస్, డైట్ పాటించే వాళ్లమధ్య హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్)

Tollywood Industry Collections Fall Down2
టాలీవుడ్‌ను కాపాడుతున్న 'Gen Z' కిడ్స్‌

భారతదేశంలోని మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడిన సంస్థ MAI.. ఈ సంస్థ ఎప్పటికప్పుడు థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను క్రోడీకరిస్తుంది. గత 5ఏళ్లలో వచ్చిన మార్పులను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంది. వారు ఇప్పటికే అందించిన నివేదిక ప్రకారం కోవిడ్‌ తర్వాత 2020–2022 మధ్య థియేటర్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. కానీ, 2023–2025లో పెద్ద సినిమాల కారణంగా మళ్లీ పెరుగుదల కనిపించిందని పేర్కొంది.ముఖ్యంగా 2025లో Gen Z (13–29 ఏళ్ల వయసు) ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లే వారి సంఖ్య 25% పెరిగింది. వారు సగటున సంవత్సరానికి 6 సార్లు థియేటర్‌కి వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి. అయితే, 30 ఏళ్లకు పైబడిన వారి సంఖ్యతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఏకంగా 41 శాతం వరకు థియేటర్‌వైపు వెల్లడంలేదని తేల్చిచెప్పింది. 2019 వరకు ప్రతి ఏడాది థియేటర్లలో సినిమాలు చూసిన ప్రేక్షకుల సంఖ్య సుమారు 150 కోట్ల వరకు ఉంది. అయితే, 2024కు వచ్చేసరికి కేవలం రూ. 86 కోట్లకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సినిమా టికెట్‌ ధరలతో పాటు క్యాంటీన్‌ రేట్ల కారణంగా థియేటర్‌వైపు వెళ్లాలని ఉన్నప్పటికీ సామాన్యులు దడుసుకుంటున్నారు. దీంతో కొన్ని థియేటర్స్‌ మూతపడుతున్నాయి. ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో థియేటర్స్‌ అవసరం తగ్గింది.థియేటర్స్‌కు ప్రేక్షకులు వెళ్లడం తగ్గించడంతో కలెక్షన్స్‌పై ఆ ప్రభావం పడుతుంది. గత ఐదేళ్లగా భారతీయ సినిమాలన్నీ సాధించిన వసూళ్లులో పెద్దగా మార్పు లేదు. దేశవ్యాప్తంగా 2019లో రూ. 19వేల కోట్లు వస్తే.. 2024లో రూ. 18వేల కోట్లు, 2025లో రూ. 14వేల కోట్లకు పైగానే కలెక్షన్స్‌ వచ్చాయి. 41శాతం ప్రేక్షకులు తగ్గినప్పటికీ ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ రావడానికి ప్రధాన కారణం టికెట్‌‌ రేట్ల పెంపు అని చెప్పవచ్చు. 2025లో సినిమా టికెట్‌ ధరల పెంపు గణనీయంగా పెరిగింది. అదే సమయంలో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా Gen Z (13–29 ఏళ్ల వయసు) వారే థియేటర్‌కు వెళ్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గతేడాదిలో హిందీ పరిశ్రమ కాస్త మెరుగ్గానే ఉంది. హిందీ పరిశ్రమ నుంచి గతేడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కానీ, టాలీవుడ్‌ పాతాళానికి పడిపోయింది. తెలుగులో 274 సినిమాలు తీస్తే రూ. 2500 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ 290 సినిమాలకు గాను రూ. 1,533 కోట్ల గ్రాస్‌తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి. కలెక్షన్స్‌తో పాటు ఓటీటీ వంటి వాటితో నిర్మాతలు కాస్త బయటపడుతున్నారు. లేదంటే కోట్ల రూపాయలు నష్టం భరించాల్సి వచ్చేదని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా టాలీవుడ్‌లో ఈ ఏడాది నుంచి మరింత కఠనంగా పరిస్థితిలు ఉండే ఛాన్స్‌ ఉంది.

Director Atlee Wife Priya Second Pregnancy3
బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్

తమిళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి.. బాలీవుడ్ వరకు వెళ్లి.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న దర్శకుడు అట్లీ.. గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని బయటపెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)తమిళ డైరెక్టర్ శంకర్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన అట్లీ.. 'రాజారాణి' మూవీతో దర్శకుడిగా మారాడు. తర్వాత దళపతి విజయ్‌తో తెరి, బిగిల్, మెర్సల్ లాంటి హ్యాట్రిక్ మూవీస్ తీశాడు. 2023లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో తీసిన 'జవాన్'.. అదిరిపోయే సక్సెస్ అయింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అట్లీ ఓ మూవీ చేస్తున్నాడు.అట్లీ వ్యక్తిగత విషయాలకొస్తే.. నటి ప్రియని 2014లో పెళ్లి చేసుకున్నాడు. 2023లో ఈమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి మీర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ప్రియ మరోసారి తల్లి కానుంది. చూస్తుంటే బన్నీతో మూవీ రిలీజయ్యేలోపే అట్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు ప్రియ బేబీ బంప్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)

Allari Naresh Grandfather Passed Away4
అల్లరి నరేశ్‌ ఇంట విషాదం

టాలీవుడ్‌ హీరో ‘అల్లరి’ నరేశ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి వెంకటరత్నం 2019లో మరణించారు. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011లో మృతి చెందారు. ప్రముఖ నటులు అల్లరి నరేశ్‌, ఆర్యన్‌ రాజేశ్‌ ఆయన కుమారులే. వెంకట్రావు మరణంలో అల్లరి నరేశ్‌ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.

Rashmika Mandanna Opens Up Her Remuneration And Special Song5
అది నిజం కాదు.. కానీ నిజం కావాలి : రష్మిక

‘‘నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను’’ అని హీరోయిన్‌ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) అంటున్నారు. నటిగా తన కథల ఎంపిక, పారితోషికం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రష్మిక. ఆమె మాట్లాడుతూ–‘‘హీరోయిన్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పని. ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా, అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికే ప్రయత్నిస్తుంటాను. కొంతమంది ప్రేక్షకులకు లవ్‌స్టోరీ సినిమాలు ఇష్టం. ఇంకొంతమంది వాణిజ్య చిత్రాలను ఇష్టపడతారు. అందుకే కమర్షియల్, లవ్‌ స్టోరీ, ఉమెన్‌ సెంట్రిక్‌... ఇలా విభిన్న రకాల జానర్స్‌లో సినిమాలు చేస్తున్నాను. (చదవండి: నా ఫోటోలు జూమ్‌ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా')ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం కోసమే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాను. ఇకపై కూడా ఇలానే ముందుకు సాగుతాను. ఇక స్పెషల్‌ సాంగ్స్‌ చేయడంపైనా నాకు ఆసక్తి ఉంది. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్‌ గా ఉండాలి. లేదంటే.. ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు డైరెక్టర్స్‌ సినిమాల్లో మాత్రం లీడ్‌ రోల్‌ కాకపోయినా స్పెషల్‌ సాంగ్‌ చేస్తాను. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అనుకుంటున్నారు.. అయితే ఇది నిజం కాదు. కానీ, అది నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

Raje Yuva Raje video Song From The Raja Saab6
'రాజే యువరాజే' వీడియో సాంగ్‌ విడుదల

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌' నుంచి 'రాజే యువరాజే' వీడియో సాంగ్‌ తాజాగా విడుదలైంది. సినిమాలో నిధి అగర్వాల్‌తో పరిచయం అయిన సమయంలో ఈ పాట ఉంటుంది. తమన్‌ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్‌ లిరిక్స్‌ సమకూర్చారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్‌ మూవీ జనవరి 9న విడుదల అయింది. అయితే, డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆశించినంత రేంజ్‌లో మూవీ మెప్పించలేదు.

Why Black Magic Movies Are Becoming Superhits in India?7
ప్రేక్షకులను.. చేతబడితో కట్టిపారేస్తున్నారు..!

చేతబడి.. బాణామతి.. చిల్లంగి..! పేరు ఏదైనా.. అదో మూఢనమ్మకం, అంధ విశ్వాసం..! అయితే.. ముందెన్నడూ లేనివిధంగా ఇటీవలి కాలంలో చేతబడిపై ప్రజల్లో విశ్వాసం బాగా పెరుగుతోందని తెలుస్తోంది. ఇందుకు కారణం.. చేతబడి సంబంధిత సినిమాలు హిట్ కొట్టడం.. బాణామతికి సంబంధించిన రీల్స్‌కు వ్యూవ్స్ మిలియన్లలో ఉండడమే..! ఇక సందేట్లో సడేమియా మాదిరిగా ప్రజల మూఢవిశ్వాసాన్ని క్యాష్ చేసుకునేందుకు దొంగబాబాలెందరో పుట్టుకొస్తున్నారు. అయితే.. దర్శకనిర్మాతలు కూడా ప్రేక్షకుల్లో చేతబడిపై ఉన్న ఇంట్రెస్ట్‌ను అందిపుచ్చకుంటూ.. హిట్లు ఇస్తున్నారు. అలాంటి సినిమాల విశేషాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..!ప్రతి మనిషిలో ఏదో ఓ మూలన భయం ఉంటుంది. హారర్ సినిమా అభిమానులు మాత్రం భయపడడం కూడా ఓ ఆర్ట్ అంటారు. కథలో మూఢనమ్మకాలు, చేతబడి, బాణామతి వంటి అంశాలు ఉంటే వాటిని మరింత ఆసక్తిగా చూస్తారు. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా.. చేతబడి పేరుతో మనచుట్టూ అనేక ఘోరాలు జరుగుతున్నాయి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజుల్లో ఈ పిచ్చి పీక్‌కు వెళ్తోంది. ఈ కాన్సెప్ట్‌లతోనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకునేందుకు దర్శక, నిర్మాతలు తహతహలాడుతున్నారు. సినిమా స్టోరీల కోసం ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. చేతబడి మూలాల వరకు వెళ్లి మరీ సినిమాలు తీస్తున్నారు. అల్లాటప్పాగా ఏదో ప్రేక్షకులకు చూపించాం అని కాకుండా.. చేతబడి కాన్సెప్ట్‌ను పూర్తిగా అర్థమయ్యేలా వాస్తవ ఘటనలను తమ సినిమాల్లో ఉటంకిస్తున్నారు. గత ఏడాది బాణామతి బ్రాక్‌డ్రాప్‌‌లో చేతబడి అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 1953 గిరిడ అనే గ్రామంలో యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథని సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా దట్టంగా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది..? ఆ గ్రామ ప్రజలకు కలిగిన నష్టం ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు.తెలుగులో చేతబడి సినిమాలు ఇప్పుడు బాగా పెరిగిపోయినా.. తెలుగు సినీ పరిశ్రమకు ఈ తరహా కథలు కొత్తేం కాదు. అప్పట్లో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలల ఆధారంగా సినిమాలొచ్చాయి. వాటిల్లో కాష్మోరా, తులసిదళం పాపులర్ అయిన విషయం తెలిసిందే..! ఇటీవలి కాలంలో ‘మసూద’ సినిమాతో చేతబడి పిచ్చి పీక్‌కు చేరుకుంటోంది. అరుంధతి వంటి సినిమాల్లోనూ ప్రతినాయకుడు పశుపతి, అదే.. సోనూసుద్ క్షుద్ర విద్యలను నేర్చుకోవడం.. అన్వేషణ, రక్ష, ఓదెల-2, పొలిమేర సీక్వెల్, పిశాచి, అమ్మోరు, దహినీ, విరూపాక్ష, లియో, మ్యాన్షన్ 24,మంగళవారం, పిండం వంటి మూవీస్‌ హిట్లు కొట్టాయి. వీటిల్లో చాలా సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగానే మార్కెట్‌ చేశాయి.2008లో విడుదలైన రక్ష.. తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు వచ్చిన చేతబడి చిత్రాలలో అత్యంత భయానకంగా ఉంటుంది. బాలీవుడ్‌ 'ఫూంక్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా 1980 నాటి యండమూరి నవల తులసీదళమే ఆధారం కావడం గమనార్హం..! దెయ్యాల ప్రమేయం లేకున్నా.. కొన్ని చేతబడి సినిమాలు ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించేలా దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఇక షార్ట్‌ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో కూడా ఈ మధ్య కాలంలో చేతబడి, అతీత శక్తులు, ఆత్మలకు సంబంధించిన పారానార్మల్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్-ఎంఎక్స్ ప్లేయర్‌లో అందుబాటులో ఉన్న ‘భయ్’ అనే వెబ్ సిరీస్ పలు భాషల్లో సూపర్‌డూపర్ హిట్ అవ్వడం ఇందుకు నిదర్శనం..! ఏది ఏమైనా.. ప్రేక్షకులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేతబడులు అనేవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే..! సినిమాల్లో దర్శకులు చూపించే అంశాలను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూడాలే తప్ప.. వాటిని గుడ్డిగా నమ్మి, అవే నిజమనే భ్రమలో ఉండకూడదు. -బ్రహ్మయ్య కోడూరు, సాక్షి వెబ్‌ డెస్క్‌

Gaddar Film Awards 2025 Announced by Telangana Govt8
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. ఉత్తర్వులు జారీ

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 ప్రకటన వచ్చేసింది. ఈమేరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన చిత్రాలకు అవార్డ్స్‌ ఇస్తామని దరఖాస్తులను ఆహ్వానించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పరిశ్రమంలోని 17 విభాగాల్లో గద్దర్ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చిన పేర్కొన్నారు. వ్యక్తిగత విభాగంలోనూ గద్దర్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. జనవరి 21 నుంచి 31 వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుందని ప్రకటించారు.

Akshay Kumar SUV And Convoy Car Involved In Road Accident9
అక్షయ్ కుమార్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఆటో నుజ్జునుజ్జు

బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్ కాన్వాయ్‌లోని ఒక కారు ప్రమాదానికి గురైంది. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ట్వింకిల్ ఖన్నాతో ఆయన విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.. తమ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకున్న వారు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రాథమిక కథనాల ప్రకారం.. వేగంగా వస్తున్న మెర్సిడెస్ కారు మొదట ఒక ఆటోను ఢీ కొట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ కాన్వాయ్‌లోని వాహనం అదపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో జుహులోని సిల్వర్ బీచ్ కేఫ్ సమీపంలో వరుసుగా పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అయితే, అక్షయ్ కుమార్, ట్వింకిల్‌ ఖన్నా ప్రయాణిస్తున్న కారు సురక్షితంగానే ఉంది. ప్రమాదం చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అక్షయ్ కుమార్ వెంటనే తన సిబ్బందితో పాటు కారు నుంచి దిగి ప్రమాదంలో చిక్కుకున్న ఆటో డ్రైవర్‌తో పాటు అందులోని ప్రయాణికులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ఆటో తీవ్రంగా నుజ్జునుజ్జు కావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీలచ్చుకున్నారు.#Exclusive: A very dangerous acc!dent has happened… reportedly involving #AkshayKumar ’s security team..!@akshaykumar Hope You Are Fit and Fine Paaji 👍❤️ pic.twitter.com/DZ12n1RiMu— Rizwan Khan (@imrizwankhan786) January 19, 2026

Actress Eesha Rebba Comments on body shamed by a Film Director10
నా ఫోటోలు జూమ్‌ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా'

తెలుగు నటి ఈషా రెబ్బా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకుంది. సోషల్‌మీడియా నుంచి హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ.. ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన తన ఫోటోలను చూసి దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తొలి ఛాన్స్‌ ఇచ్చారు. ఆ తర్వాత అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, ఓయ్‌, సవ్యసాచి, 3 రోజెస్ వంటి ప్రాజెక్ట్‌లతో ఆలరించింది. తాజాగా తన నటించిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ జనవరి 30న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా(Eesha Rebba) తన కలర్‌ గురించి ఎదుర్కొన ఘటనను గుర్తు చేసుకుంది. 'ఒక సినిమా కోసం నేను ఫోటో షూట్‌లో పాల్గొన్నాను. అయితే, దర్శకుడు నా ఫోటోలను చాలా జూమ్‌ చేసి మోచేతులు నల్లగా ఉన్నాయని, మరింత అందంగా ఉండాలని కోరారు.. ఆయన మాటలు నన్ను బాధపెట్టాయి. చాలా నిరూత్సాహం చెందాను.ఆ సమయంలో ఆయనకు ఏ సమాధానం ఇవ్వాలనేది కూడా తెలియలేదు. నా పుట్టుకతో వచ్చిన రంగును ఎలా మార్చుకోగలమని చెప్పాను. పరిశ్రమలో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయని ఆప్పట్లో నాకు తెలీదు. అయితే, ఆయన వ్యాఖ్యలతో నేను కూడా మరింత కలర్‌గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ, వారి కోసం నా కలర్‌ను మార్చుకోలేను కదా.. ఆ సమయం నుంచి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం నేర్చుకున్నాను.' అని గుర్తుచేసుకుంది. View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha)

Advertisement
Advertisement