Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood Hero Naveen chandra taken puneeth rajkumar blessings1
టాలీవుడ్ హీరో శాండల్‌వుడ్ ఎంట్రీ.. పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులు..!

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినీరంగంలో సత్తా చాటుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్‌ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాదిలో పలు సినిమాలతో మెప్పించిన నవీన్ చంద్ర.. శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.ఈ సందర్భంగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్‌ సమాధిని సందర్శించారు. ఆయనకు మొకాళ్లపై కూర్చుని నివాళులర్పించారు. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాకు మీ ఆశీర్వాదాలు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కాగా.. కన్నడ సినీ ఇండస్ట్రీలో నవీనచంద్ర నటించిన తొలి సినిమా మార్క్. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్‌ మూవీ క్రిస్‌మస్‌ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. రిలీజ్‌కు ముందు వచ్చిన పోస్టర్స్‌ చూస్తే పవర్‌ఫుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Naveen Chandra (@naveenchandra212)

Movie Producer Naga Vamsi Comments on war 2 collection2
'వార్‌-2' నష్టం ఎంతో ఫైనల్‌గా చెప్పిన నాగ వంశీ

ఈ ఏడాదిలో బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు భారీగా ఎదురుచూసిన చిత్రం వార్‌-2.. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీని తెలుగు రైట్స్‌ను రూ. 80 కోట్లకు నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో సుమారు రూ. 50 కోట్లు నష్టపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తను క్లారిటీ ఇచ్చాడు. అసలు వార్‌-2 ఎంత మొత్తానికి కొన్నాడో చెప్పుకొచ్చాడు.'వార్‌-2 సినిమాలో నేను భారీగా నష్టపోయానని చాలామంది అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. తెలుగు రైట్స్‌ రూ. 68 కోట్లకు దక్కించుకున్నాను. మూవీ క్లోజింగ్‌ అయ్యేసరికి రూ. 40 కోట్ల వరకు షేర్‌ వచ్చింది. అయితే, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నాకు రూ. 18 కోట్లు రిటర్న్‌ ఇచ్చింది. బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారు. వార్‌-2 వల్ల నేను నష్టపోలేదు.' అని మొదటిసారి లెక్కలతో సహా వంశీ చెప్పారు. ఈ లెక్కన తను రూ. 10 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. ఇందులో హృతిక్‌ రోషన్‌, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్‌ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్‌2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.I Bought Jr Ntr @tarak9999 Garu's & HRX @iHrithik Garu's #War2 Film For 68 Crores + Gst & It Got Theatrical Revenue Nearly For 40 Crores Share & I Met The Team Of @yrf & Spoke With Them & They Returned The Amount Of 18 Cr - @vamsi84 Garu#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/bWL5lkwid1— 𝐓𝐞𝐚𝐦 𝐅𝐨𝐫 𝐓𝐚𝐫𝐚𝐤 (@TeamForTarak) December 25, 2025

samantha Shares Latest Christmas Celebrations photos in social media3
రాజ్‌తో పెళ్లి తర్వాత తొలి క్రిస్‌మస్‌.. ఫోటోలు పంచుకున్న సమంత..!

టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరుపుకుంది. రెండో పెళ్లి తర్వాత చేసుకున్న మొదటి క్రిస్‌మస్‌ ఇదే కావడంతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పాటు ఈ ఏడాది తన ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని సంతోషం ‍వ్యక్తం చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌ నిడిమోరుతో పెళ్లి జరిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఏడాదిలో తన మధుర జ్ఞాపకాలను సైతం పోస్ట్ చేసింది. ఇటీవలే సామ్ రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.రాజ్‌ నిడిమోరుతో ఏడడుగులు..సమంత ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. రూమర్స్‌ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' పద్దతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Radhika Sarathkumar as 75years old women role in movie4
75 ఏళ్ల బామ్మగా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌

వైవిధ్య భరిత కథ చిత్రాలను నిర్మించడంలోనూ, టాలెంటెడ్‌ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుండే నటుడు శివ కార్తికేయన్‌.. తన ఫ్యాషన్‌ స్టూడియోస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రం తాయ్‌ కిళవి. ఈ చిత్రం ద్వారా శివ కుమార్‌ మురుగేశన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటి రాధిక శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన రాధికా శరత్‌కుమార్‌.. ఈ మూవీలో ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు తదితర అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Malayalam Actor Azees Nedumangad lost 70 Percentage Hearing loss an Attack5
ఆలస్యమైందని నటుడిపై దాడి.. 70% వినికిడి శక్తి కోల్పోయి!

కూటికోసం కోటి తిప్పలు. కొందరు సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలోకి రాకముందు ఇతరత్రా పనులు చేసినవారే! మలయాళ నటుడు అజీస్‌ నెదుమంగడ్‌ కూడా ఒకప్పుడు డ్రైఫ్రూట్‌ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. అది కూడా భారత్‌లో కాదు, బహ్రెయిన్‌లో! ఇటీవల బహ్రెయిన్‌ వెళ్లిన అజీస్‌ తను పనిచేసిన షాపును గుర్తుపెట్టుకుని మరీ అక్కడకు వెళ్లాడు. 18 ఏళ్ల కిందట..తనతో పాటు పనిచేసిన స్నేహితుడిని అదే షాపులో కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరి బాగోగులను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 18 ఏళ్ల కిందట అదే షాపులో పనిచేసిన అజీస్‌ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో టాప్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.కెరీర్‌అజీస్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే! దీంతో అతడు ఇంజనీరింగ్‌ పట్టా చేతికి రాగానే గల్ఫ్‌ దేశానికి వలస వెళ్లి షాపులో పనిచేశాడు. కానీ, అక్కడ ఎక్కువకాలం ఉండలేక మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించాడు. పలు స్టేజీలపై మిమిక్రీ చేస్తూ కామెడీ పండించేవాడు. తర్వాత టీవీ షోలలోనూ పాల్గొనడంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు లభించింది. ప్రాధాన్యమున్న పాత్రలుఅలా 'కుంజలియన్‌' సినిమాలో నటించే ఆఫర్‌ వచ్చింది. అది చిన్న అవకాశం. తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు, కానీ పెద్దగా చెప్పుకునే పాత్రలైతే కాదు. చేస్తే మంచి క్యారెక్టర్సే చేయాలి... జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కాదని తీర్మానించుకున్నాడు. అలా యాక్షన్‌ హీరో బిజు మూవీతో క్లిక్‌ అయ్యాడు. వాళా, మిన్నాల్‌ మురళి, కన్నూర్‌ స్క్వాడ్‌, ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌, జయజయజయహే వంటి సినిమాలతో మరింత పాపులర్‌ అయ్యాడు. దాదాపు 30కి పైగా సినిమాలు చేశాడు.దాడిలో తీవ్రగాయాలుఅయితే అజీస్‌ (Azees Nedumangad) జీవితంలో ఓ చేదు ఘటన జరిగింది. 2017 ఏప్రిల్‌లో ఓ స్టేజీ షోకు ఆలస్యంగా వెళ్లాడు అజీస్‌. అంతే.. అక్కడున్న కొంతమంది ఆగ్రహంతో నటుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అజీస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఏకంగా 70% వినికిడి శక్తిని కోల్పోవడం బాధాకరం! అవమానాలను సైతం దాటుకుని నేడు మలయాళ ఇండస్ట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు అజీస్‌. ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌ నటుడిగా కొనసాగుతున్నాడు.

Namitha Wants to do Powerful Role like Neelambari Movie6
గ్లామర్‌కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా చేయాలనుంది!

సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్‌ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.గతంలో తప్పులుతాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్‌ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్‌ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్‌ఫుల్‌ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.అలాంటి పాత్రలు చేయాలనుందిఉదాహరణకు రజనీకాంత్‌ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్‌, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!

Bigg Boss Agnipariksha 2 Getting Massive Hype Before Start7
బిగ్‌బాస్‌ ప్లాన్‌ సక్సెస్‌.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్‌!

బిగ్‌బాస్‌ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్‌ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.అగ్నిపరీక్షఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్‌ చేసి బిగ్‌బాస్‌ టీమ్‌కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్‌ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, ఎగ్జామ్‌ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.అలాంటివారికి నో ఛాన్స్‌వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్‌, బిందుమాధవి, అభిజిత్‌కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్‌ చేసింది. బిగ్‌బాస్‌కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.తొలిసారి ఏడుగురు కామనర్స్‌మిగతావారి టాలెంట్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, నాలెడ్జ్‌.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్‌ ఫైనల్‌ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్‌, పవన్‌, మనీష్‌, హరీశ్‌. వీరిలో కల్యాణ్‌ ఏకంగా టైటిల్‌ విన్నర్‌ కాగా పవన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. సామాన్యుడి చేతికి ట్రోఫీసామాన్యుడు బిగ్‌బాస్‌కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్‌ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్‌ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్‌ సీజన్‌పై పెద్దగా బజ్‌ లేదు. ఇప్పుడు కల్యాణ్‌ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్‌పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. బిగ్‌బాస్‌ ప్లాన్‌ సక్సెస్‌ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్‌ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్‌లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్‌ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్‌ 2026 సెకండాఫ్‌లో ప్రారంభం కానుంది.చదవండి: వినాయకన్‌కు తీవ్ర గాయం.. కాస్త లేట్‌ అయ్యుంటే పక్షవాతం!

Tollywood actresses Social media updates goes viral8
ప్రియా ప్రకాశ్ క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్.. మీరా జాస్మీన్ ఫెస్టివ్ వైబ్స్..!

క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌లో ప్రియా ప్రకాశ్..ఉదయ్‌పూర్ కోటలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్..హీరోయిన్ మెహరీన్ క్రిస్‌మస్ లుక్స్..క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ నటి రవీనా టాండన్..ఫెస్టివల్‌ వైబ్స్‌లో హీరోయిన్ మీరా జాస్మిన్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13)

Tollywood Movie Madham sensor report9
బిగ్‌బాస్ ఇనయా సుల్తానా థ్రిల్లర్‌ మూవీ.. సెన్సార్ పూర్తి..!

హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. ఈ చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. ఈ సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్‌జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్‌కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది.

Venkatesh and Aarthi Agarwal Nuvvu Naaku Nachav 4K Trailer 10
వెంకటేశ్- ఆర్తి ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

వెంకటేశ్‌, ఆర్తి అగర్వాల్‌ హీరో, హీరోయిన్లుగా బ్లాక్‌ బస్టర్‌ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రానికి కె విజయభాస్కర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ కథ, డైలాగ్స్‌ అందించగా.. స్రవంతి రవికిశోర్‌ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్‌ 6న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్‌తో ప్రపంచవ్యాప్తగా రీ రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 4కె వర్షన్‌లో రిలీజైన ట్రైలర్ వెంకీ మామ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రమని నిర్మాత రవికిశోర్‌ అన్నారు. నువ్వు నాకు నచ్చావ్‌. ఇది కేవలం రీ రిలీజ్‌ మాత్రమే కాదని.. నూతన సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అన్నారు.

Advertisement
Advertisement