Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood Movie Son Of Movie Review In Telugu1
తండ్రీ, కొడుకుల ఎమోషనల్ కథ.. సన్ ఆఫ్ మూవీ రివ్యూ

టైటిల్: సన్‌ ఆఫ్దర్శకుడు.. బత్తుల సతీష్ నిర్మాణ సంస్థ.. సైన్మా బ్యానర్విడుదల తేదీ.. ఫిబ్రవరి 27, 2026సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజైంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రిని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు భిన్నంగా ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి లవ్ ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్‌మెంట్‌ టైమ్‌కి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే స్టోరీ.ఎలా ఉందంటే..తండ్రీ కొడుకుల నేపథ్యంలో గతంలో చాలా కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా ప్రేక్షకులకు కొత్తగా చూసిన ఫీలింగ్ కలగదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేసేజ్ ఇచ్చేలా ఉంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగితే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా ఈ కథలో చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరముందనే కాన్సెప్ట్‌తో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం.. హీరో గాలి తిరుగుడు, హీరోయిన్‌తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్‌కి వస్తుంది.కోర్ట్‌లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్‌లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్‌తో కంటతడి పెట్టిస్తాయి. కథ చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలిగేలా చేస్తుంది.ఎవరెలా చేశారంటే..సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని రకాల ఎమోషన్స్‌ పండించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మెప్పించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరు కూడా తమ పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.

Tollywood Movie Purushaha Lyrical song out now 2
పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ.. ఫుల్ మాస్ ఐటమ్‌ సాంగ్ రిలీజ్

పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతోన్న లేటేస్ట్ మూవీ పురుషః. ఈ చిత్రంలో అనైరా గుప్తా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌ను మెప్పించాయి.తాజాగా ఈ చిత్రం నుంచి దేవ నాయకి అంటూ సాగే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్‌ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. ఈ మూవీకి షూటింగ్ ఇప్పిటికే పూర్తి కాగా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ , వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషించారు.

Anchor Udaya Bhanu about Mobile Phone Effects On Kids3
పిల్లలంటే ప్రాణం.. ఆ విషయంలో మాత్రం: ఉదయభాను

ఒకప్పుడు యాంకర్‌గా ఉర్రూతలూగించిన ఉదయభాను ఇప్పుడు సినీ నటిగా అలరిస్తోంది. గతేడాది త్రిబాణధారి బార్బరిక్‌ చిత్రంలో అలరించిన ఈ యాంకర్‌ ఇప్పుడు డాటరాఫ్‌ ప్రసాద్‌రావు: కనబడుట లేదు వెబ్‌ సిరీస్‌లో పోలీస్‌గా కనిపించింది. ఈ సిరీస్‌ జీ 5లో నేడే రిలీజైంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఉదయభాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది.జాగ్రత్త అవసరంఆమె మాట్లాడుతూ.. జెన్‌జీ కిడ్స్‌ వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటున్నారు. తల్లిదండ్రులు వారి పనుల్లో వారు బిజీ.. పిల్లలు అయితే చదువు లేదంటే ఫోన్‌తో బిజీ అయిపోతున్నారు. కానీ, సోషల్‌ మీడియాకు పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే సోషల్‌ మీడియా టాక్సిక్‌.. అక్కడ మంచి కన్నా చెడుయే ఎక్కువగా ఉంది. ఈ ఫోన్‌ పిల్లల్ని క్రిమినల్స్‌గా మార్చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.పిల్లలంటే ప్రాణంనాకు పిల్లలంటే ప్రాణం. వాళ్ల కోసం ఉదయం ఐదుగంటలకే లేచి వంట చేసి పెట్టి షూటింగ్‌కు వెళ్తాను. వారికోసం ప్రత్యేక సమయం కేటాయిస్తాను. ఇకపోతే నేను తొలిసారి మైక్‌ పట్టింది హృదయాంజలి కోసం! అప్పటికి చిన్న చిన్న సీరియల్స్‌ చేశాను. కానీ హృదయాంజలి షోతోనే యాంకర్‌గా నా జర్నీ మొదలైంది అని ఉదయభాను చెప్పుకొచ్చింది.చదవండి: నాన్‌స్టాప్‌ షూటింగ్‌.. ఐదో రోజు ఆస్పత్రిలో హీరోయిన్‌

Vijay And rashmika landed In Hyderabad after Grand wedding at udaypur4
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్

టాలీవుడ్ కొత్త జంట విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్‌ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్‌, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. The lovely couple #VijayDeverakonda & #RashmikaMandanna touch down in Hyderabad post-wedding!❣️✨#VIROSH #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/gY55ei8q5s— Telugu FilmNagar (@telugufilmnagar) February 27, 2026

Prabhas Spirit Movie Villain Role First Look Release5
ప్రభాస్ స్పిరిట్ మూవీ.. విలన్‌ యాక్షన్ మోడ్‌ లుక్‌ చూశారా?

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రానికి యానిమల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ స్టార్స్‌ నటిస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్‌ థ్రిల్లర్‌లో విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు.తాజాగా విలన్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నోటిలో సిగరెట్‌ పెట్టుకుని హై యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే విలన్ రోల్ పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కనిపిచనుంది.ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని మాఫియా నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇప్పటివరకు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ థియేటర్లలో సందడి చేయనుంది. A mystery buried in shadows and eyes that remember the darkest secrets.In Cinemas across the World on March 5th, 2027.#OneBadHabit@InSpiritMode#Prabhas @imvangasandeep @tripti_dimri23 #AishwaryaDesai @rameemusic @sureshsrajan #BhushanKumar @vangapranay #KrishanKumar… pic.twitter.com/jTPiaB2OXw— Vivek Anand Oberoi (@vivekoberoi) February 27, 2026

Isha Koppikar recalls Hospitalisation After Nonstop Working For 5 days6
4 రోజులు ఇంటికెళ్లకుండా షూటింగ్‌.. 5వ రోజు ఆస్పత్రిలో!

సాధారణంగా ఉద్యోగులు 8-9 గంటలపాటు పని చేస్తారు. కానీ సినిమా, బుల్లితెర ఆర్టిస్టులు మాత్రం కొన్నిసార్లు గ్యాప్‌ లేకుండా రోజంతా షూటింగ్‌ చేస్తూనే ఉంటారు. దీనివల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానంటోంది బాలీవుడ్‌ నటి ఇషా కొప్పికర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్‌ మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాళ్లు నొప్పి పుట్టి ఇక నిలబడటం నా వల్ల కాదు అనేవరకు పని చేయించుకుంటూనే ఉంటారు. ఇంటికి వెళ్లేంత తీరిక ఎక్కడిది?నా కెరీర్‌ మొదట్లో వెంటవెంటనే సినిమాలు చేశాను. షూటింగ్స్‌కు గ్యాప్‌ ఉండేది కాదు. కనీసం ఫిలిం సిటీ నుంచి నా ఇంటికి వెళ్లే తీరిక కూడా దొరికేది కాదు. దాంతో నిర్మాతలను షూటింగ్‌ లొకేషన్‌లోనే నాకంటూ ఒక రూమ్‌ వసతి కల్పించమని అడిగేదాన్ని. పొద్దున ఐదింటికి షూట్‌ స్టార్ట్‌ చేస్తే ఐదు గంటల వరకు కొనసాగేది. ఆ తర్వాత మళ్లీ రాత్రి ఏడింటి నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు షూటింగ్‌ అయ్యేది. సినిమాఅలా వరుసగా ఐదు రోజులు జరిగింది. దాంతో ఆరో రోజు నేను సెట్‌లో కాకుండా హాస్పిటల్‌లో పడున్నాను అని గుర్తు చేసుకుంది. దీపికా పదుకొణె అడిగినట్లుగా 8 గంటల పని డిమాండ్‌ సబబే అని వత్తాసు పలికింది. కాగా ఇషా కొప్పికర్‌.. చంద్రలేఖ అనే తెలుగు చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తెలుగులో ప్రేమతో రా, కేశవ సినిమాల్లో నటించింది. హిందీ, తమిళంలో అనేక సినిమాలు చేసింది. చివరగా అయలాన్‌ మూవీలో తళుక్కుమని మెరిసింది.చదవండి: తల్లినవుతా.. కానీ పెళ్లి అవసరం లేదు: హీరోయిన్‌

Rashmika Revealed about Her Marriage at Movie Event Video goes viral7
విజయ్‌తో పెళ్లి.. ముందే చెప్పిన రష్మిక.. వీడియో వైరల్..!

టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విరోష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందే అఫీషియల్‌గా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్‌ కూడా అత్యంత ప్రైవసీ పాటించిన ఈ జంట ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్‌ వెడ్డింగ్‌లో ఒక్కటయ్యారు. ఎక్కడా కూడా తమ రిలేషన్‌షిప్‌ బయట పడకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి దొరికిపోయినప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు.అలా కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్‌ వస్తున్నా వాటిని అస్సలు పట్టింకోలేదు విరోష్ జంట. కేవలం తమ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలా అత్యంత సీక్రెట్‌గా విజయ్- రష్మిక తమ బంధాన్ని కొనసాగించారు. అయితే గతేడాది ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన రష్మిక.. తన పెళ్లి గురించి ముందుగానే చెప్పేసింది. కానీ మనకే ‍అర్థం కాలేదంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం.గతంలో ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన రష్మికను.. అనంద్ దేవరకొండ ఆట పట్టించాడు. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా నన్ను స్పాట్‌లో పెట్టి అడిగితే ఎట్లా అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024లోనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిందని అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 2024 లోనే అర్థం చేసుకోవాల్సింది మనం We did a mistake 😭😭😭😭😭😭#RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/tryvGuCGsF— Swaasthi (@swaasthi) February 26, 2026

Dacoit Movie: Adivi Sesh, Mrunal Starrer Rubaroo Song Released8
డెకాయిట్‌ నుంచి లవ్‌ సాంగ్‌ రిలీజ్‌

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్‌. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తోంది. కెమెరామెన్‌ షానియల్‌ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ యాక్షన్‌ లవ్‌స్టోరీ నుంచి తాజాగా రుబరూ.. అంటూ సాగే లవ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.లవ్‌ సాంగ్‌మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని.. అంటున్నది మనసే.. కాసేపు నువ్వు,నేను కలిసి.. క్షణంలో లోకమంత తెలిసే.. అన్న లిరిక్స్‌తో పాట మొదలైంది. 'మోసం అంటే ఏందో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే.. మోసం చేస్తావని తెలీదు కదా జూలియట్‌.. ఎందుకు నమ్మించినావే..' అంటూ హీరో లవ్‌స్టోరీని పాటలో చూపించారు. అలాగే చివర్లో బ్రేకప్‌ బాధను కూడా చూపించారు.సినిమాఇదివరకు రిలీజైన టీజర్‌లో యాక్షన్‌ను ఎక్కువ హైలైట్‌ చేయగా ఈ పాటలో మాత్రం లవ్‌ టచ్‌ ఎక్కువ జోడించారు. అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

Kerala High Court Big Relief to The Kerala Story 2 Goes Beyond Movie9
ది కేరళ స్టోరీ-2 మేకర్స్‌కు బిగ్ రిలీఫ్

ది కేరళ స్టోరీ-2 మూవీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు తొలగించింది. సింగిల్ బెంచ్‌ ఇచ్చిన స్టేను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. దీంతో ఈ సినిమాకు రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా స్టే వల్ల విడుదల కాలేదు. తాజాగా స్టే ఎత్తివేయడంతో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. కాగా.. గతంలో రిలీజైన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్‌గా 'కేరళ స్టోరీ 2' ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 27న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాపై సింగిల్ బెంచ్ న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెన్సార్‌ బోర్డుపై కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్‌ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.

Vijay and Rashmika Marriage Jewellery Looks Goes Viral10
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. అందరి ఫోకస్ వాటిపైనే..!

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్‌ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్‌ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్‌గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్‌గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్‌ లుక్‌తో వీరిద్దరు తమ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.

Advertisement
Advertisement