Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Ashu Reddy comments on Vikram on Duty Press Meet1
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్‌ చేస్తే తీసేస్తారు!

టిక్‌టాక్‌ ద్వారా జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్‌ స్మాష్‌, రీల్స్‌తో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లోనూ పాల్గొని మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.ఇప్పటివరకు ఎన్నో చేశా..ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ విన్నర్‌ నిఖిల్‌ మళయక్కల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. తాజాగా విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ ప్రెస్‌మీట్‌లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్‌ పర్ఫామెన్స్‌లు, క్యారెక్టర్‌ రోల్స్‌, హోస్టింగ్‌.. ఇలా అన్నీ చేశాను. హీరోయిన్‌ అంటుంటే..తొలిసారి హీరోయిన్‌గా చేశాను. షూటింగ్‌లో అందరూ హీరోయిన్‌గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్‌ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్‌గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.ఏమాత్రం ఓవరాక్షన్‌ చేసినా..అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్‌ చేసినా ప్రొడక్షన్‌ హౌస్‌ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్‌లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్‌ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్‌కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్‌ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే?

Allu Sirish Wedding And Emotional Note Wife Nayanika Late Father2
మిమ్మల్ని కలిసే ఛాన్స్ రాలేదు.. ఆ ప్రేమని జీవితాంతం కొనసాగిస్తూ

అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.(ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)

Shannu Latest Interview Reacts Breakup And His Engagement ‍3
నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా

సోషల్ మీడియా, యూట్యూబ్ చూసేవాళ్లకు షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయం అక్కర్లేదు. 'వైవా' అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మొదలైన ఇతడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా చేసేంత వరకు వచ్చాడు. అయితే తోటి యూట్యూబర్ దీప్తి సునైనాతో ప్రేమ-బ్రేకప్, బిగ్‌బాస్ 5వ సీజన్‌లో సిరి హనుమంతుతో చేసిన రచ్చ, ఓసారి డ్రగ్స్‌తో దొరికిపోవడం.. ఇలా చాలాసార్లు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడు. గత కొన్నేళ్లుగా పెద్దగా కనిపించని షన్ను.. కొన్నిరోజుల క్రితం వైష్ణవి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. గతంలో తనకు జరిగిన చేదు సంఘటనలు, బ్రేకప్, బిగ్‌బాస్ అనుభవం, వైష్ణవితో ప్రేమ-నిశ్చితార్థం ఇలా చాలా విషయాలు గురించి మాట్లాడాడు. మిగతా వాటి సంగతేమో గానీ తనని తాను.. బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని అని చెప్పుకోవడం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. బ్రేకప్ (దీప్తి సునైనాతో) తర్వాత నిజంగా బాధపడ్డారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సంగతులు చెప్పుకొచ్చాడు. ఒక టీవీ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని బిగ్‌బాస్ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.'అవును బ్రేకప్ తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాను. నా వల్ల తనకు, ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకున్నాను. పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు నడిచాను. కానీ ఎందుకు బ్రేకప్ చెప్పావ్? నాకు సమాధానం చెప్పు అని ఒత్తిడి చేయలేదు. చెప్పాలంటే నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని. బ్రేకప్ తర్వాత ఒక్కరిని కూడా టార్చర్ చేసింది లేదు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఫోన్ తీసి ఫొటోలు చూసుకోవడమే తప్పితే.. ఇది చేస్తా అది చేస్తా అనే బ్యాచ్ కాదు' అని షన్ను చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: గద్దర్‌ అవార్డ్స్‌-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య)'బ్రేకప్ తర్వాత తనకు ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయింది. అలాంటి టైంలో తన జీవితంలోకి వైష్ణవి వచ్చిందని షన్ను చెప్పాడు. ఈమెకు చాలా దైవభక్తి. ఎప్పటికప్పుడు దేవాలయాలకు వెళ్తూనే ఉంటుంది. అలానే మాకు పరిచయమైంది. తొలుత హనుమాన్ చాలీసా లాంటివి వాట్సాప్‌లో పంపించుకునేవాళ్లం. హనుమాన్ జయంతి సందర్భంగా కరుంగళి మాలతో పాటు హనుమాన్ చాలీసా లాంటివి వైష్ణవి పంపింది. నేను కూడా రామకోటి లాంటివి శ్రీరామనవమి టైంకి పంపించాను. అలా స్నేహితులుగా ఉన్నవాళ్లం కాస్త తర్వాత స్టేజీకి వెళ్లాం''అయితే ప్రేమలాంటివి కాకుండా డైరెక్ట్‌గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. నా గురించి అన్ని తెలిసి కూడా వైష్ణవి, వాళ్ల అమ్మ ఒప్పుకోవడం గొప్ప విషయం. ఇక నా చేతిపై పచ్చబొట్టు గురించి వైష్ణవి చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అది మీకో మెమొరీ. ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఎప్పుడు తీసేయాలన్నా సరే మీ ఇష్టం అని నాతో చెప్పింది. అది కాదండీ, ఇలా మాట్లాడండి అని పిలవడం తప్పితే ఇప్పటివరకు నన్ను షన్ను అని పిలవలేదు' అని షన్ను.. తనకు కాబోయే భార్య వైష్ణవి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హీరోగా 'ప్రేమకు నమస్కారం' సినిమా చేస్తున్నాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య)

Dhurandhar 2 To Have Paid Preview Shows On March 18, Runtime Details4
‘ధురంధర్‌2’కి పెయిడ్‌ ప్రీమియర్స్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ ఆ అంచనాలు డబుల్‌ చేసింది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్‌ బద్దలు అవ్వడం ఖాయమని రణ్‌వీర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్‌ షో నుంచే ‘ధురంధర్‌2: ది రివెంజ్‌’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్‌మై షో, డిస్ట్రిక్ట్‌ యాప్‌ల ద్వారా టికెట్‌ బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్‌ ప్రీమియర్స్‌కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. హైదరాబాద్‌లోని వివిధ మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే టికెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్‌ ప్రీమియర్స్‌కి టికెట్‌ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్‌ 2కి మాత్రం ప్రీమియర్స్‌కి కూడా నార్మల్‌ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం కోసమే మేకర్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీ రన్‌టైమ్‌..ధురంధర్‌ 2 మూవీ రన​్‌టైమ్‌పై మొన్నటి వరకు సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్‌ టైమ్‌తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు. ప్రేక్షకుడిని ఎంగేజ్‌ చేసే కంటెంట్‌ ఉంది కాబట్టే.. రన్‌టైమ్‌ విషయంలో మేకర్స్‌ భయపడడం లేదట. మరి ధురంధర్‌ 2 ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Trisha Krishnan: a look at Acress Past Relationship5
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?

హీరోయిన్‌ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్‌ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్‌ సరసన గిల్లిలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసి స్టార్‌ స్టేటస్‌ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్‌తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్‌, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్‌ కంటే ముందు వేరే హీరోలతో లవ్‌లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..హీరోలతో లవ్‌త్రిష తమిళంలో పలువురు స్టార్స్‌తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్‌ దానంతటవే ఆగిపోయాయి.ప్రకంపనలు రేపిన సుచీలీక్స్‌అనంతరం త్రిష టాలీవుడ్‌ హీరో రానాకు క్లోజ్‌ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్‌ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్‌ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్‌- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లి క్యాన్సిల్‌వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్‌ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్‌తో త్రిష అంత క్లోజ్‌గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నాడని అంటుంటారు.విజయ్‌తో లవ్‌ఇప్పుడు మరోసారి విజయ్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్‌- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్‌ కౌంటర్‌

Rj Surya Marries RJ Sourya Latest News6
సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య

ఆర్జేగా కొందరికి తెలిసిన సూర్య.. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని మరింతగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు శుక్రవారం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ నటి సుధీర చెల్లి, ఆర్జే శౌర్యతో సూర్య ఏడడుగులు వేశాడు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశాడు. చిన్నప్పటి నుంచి పలు పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వచ్చాడు. ఓ అమ్మాయి బ్రేకప్ చెప్పిన బాధలో ఉన్నప్పుడు ఆర్జేగా ఆఫర్ రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల గొంతులని మిమిక్రీ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆర్జేగా ఫేమస్ అయిన ఇతడు.. బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని 8 వారాల పాటు హౌసులో ఉన్నాడు. తర్వాత తన తోటి కంటెస్టెంట్ ఫైమాతో కలిసి బీబీ జోడీ తొలి సీజన్(డ్యాన్స్ కాంపిటీషన్) లో పాల్గొని విజేతగానూ నిలిచాడు. తన తోటి ఆర్జే, సీరియల్ నటి సుధీర చెల్లి శౌర్యతో ప్రేమలో పడ్డ సూర్య.. గతేడాది అక్టోబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు సీరియల్ బ్యూటీస్ అన్షు, ఆషికా తదితరులు వచ్చారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.(ఇదీ చదవండి: విజయ్‌తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత)

Rashmika Mandanna React on Telangana Gaddar Awards 20257
రాహులా.. మనం సాధించాం: రష్మిక ట్వీట్‌ వైరల్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 జాబితాను శనివారం ప్రకటించారు. అందులో ఉత్తమ నటి అవార్డు స్టార్‌ హీరోయిన్‌ రష్మికను వరించింది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికి గానూ రష్మికకు ఈ అవార్డు లభించింది. ఈ విషయాన్ని దర్శకుడు ఎక్స్‌ వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. రాహుల్‌ ట్వీట్‌పై రష్మిక కూడా స్పదించింది. ఆయన పోస్ట్‌ని రీట్వీట్‌ చేస్తూ.. ‘రాహులా.. మనం సాధించాం’ అని రాసుకొచ్చింది. దానికి రాహుల్‌ రిప్లై ఇస్తూ..‘ఈ అవార్డుకి మీరు అర్హులు. థ్యాంక్యూ రష్మిక’ అని కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం రష్మిక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా, రష్మిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న తన ప్రియుడు, స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండను పెళ్లి చేసుకుంది. ఈ నెల 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Rahullaaaaaaa!! @23_rahulr 🥹🥹🥹🥹❤️We did it! ❤️❤️ https://t.co/kSHQ79P07p— Rashmika Mandanna (@iamRashmika) March 7, 2026

Varalakshmi Sarathkumar Respond on Sai Madhav Burra Allegations8
ఆయనలా దిగజారను.. సాయిమాధవ్‌కు వరలక్ష్మి కౌంటర్‌

వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్వీయదర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సరస్వతి. సాయిమాధవ్‌ బుర్ర కథ అందించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను ఇష్టమొచ్చినట్లు మార్చేశారని సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు సాయిమాధవ్‌. సరస్వతి సినిమా పేరు ప్రస్తావించకుండా ఓ పోస్ట్‌ పెట్టాడు. నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. హర్టయిన సాయి మాధవ్‌ఒక్కమాటైనా చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మార్చేశారు. కథను మానభంగం చేశారు. నాది రివేంజ్‌ డ్రామా కాదు, నా సోల్‌ వేరు, అసలా కథే వేరు అని పేర్కొన్నాడు. ఈ వివాదంపై తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్‌‌ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరి కథను దొంగతనం చేయలేదు. కాంట్రాక్ట్‌ వేసి డబ్బులు ఇచ్చాకే ఆ కథ (సరస్వతి) నాదయింది. ఆయనపై గౌరవంతో క్రెడిట్స్‌లో తన పేరును పొందుపరిచాం. అందుకే మార్చాంకానీ, ఆయన ఆ గౌరవాన్ని మిగుల్చుకోలేదు. ఒకవేళ నా పేరు పెట్టుంటే ఇంకా సంతోషపడేదాన్ని. నాకే సమస్య లేదు! అసలేమైందంటే.. ఆయన చెప్పిన కథ విన్న ప్రతివాళ్లు సాగదీసినట్లుగా ఉందన్నారు. పెద్ద స్టార్స్‌ ఉన్నప్పుడు ఆ కథను యథాతథంగా ముందుకు తీసుకువెళ్లగలమేమో! కానీ మేము మంచి నటులం తప్ప పెద్ద స్టార్స్‌ కాదు! కాబట్టి ఆ కథను జనంలోకి ఎలా తీసుకెళ్లాలి? అని ఆలోచించాం.కథ డెవలప్‌ చేసుకున్నా..దానిపై చాలా వర్క్‌ చేశాం. ఆ సమయంలో ఆయన ఒక్కసారి కూడా స్టోరీ సిట్టింగ్‌కు రాలేదు. తను పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. సరేలే, బిజీగా ఉన్నారని అర్థం చేసుకున్నాను. నేనే కథను డెవలప్‌ చేసుకున్నాను. కనీసం ఫోన్‌లో అందుబాటులోకి వచ్చినా కథ మార్చామని చెప్పగలిగేవాళ్లం. అప్పుడేమో ఆయనే అలా చేసి ఇప్పుడలాంటి కామెంట్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు. దిగజారనుఅందులోనూ కథను మానభంగం చేశారని పెద్ద పెద్ద వ్యాఖ్యలు మీలాంటి వ్యక్తి నోటి నుంచి రాకూడదు. ఇది సభ్యత అనిపించుకోదు. సెన్సిటివ్‌ టాపిక్‌పై ఎలాంటి పదాలు వాడుతున్నామనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే బాగుండేది. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నాకు కావాలంటే చాలా కథలు బయటకు తీసేదాన్ని, కానీ నేనలాంటి మనిషిని కాదు. నేను అందర్నీ గౌరవిస్తాను, మర్యాదిస్తాను. ఆయనలా దిగజారి నేను మాట్లాడను వరలక్ష్మి కౌంటర్‌ ఇచ్చింది.చదవండి: సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్‌

TVK Vijay Wife Sangeetha Again Petition in court9
విజయ్‌తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత

తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌కి ఆయన సతీమణి సంగీత షాక్‌ ఇచ్చింది. తాజాగా కోర్టులో ఆమె మరో పిటిషన్‌ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్‌తో పాటుగా ఉండేందుకు అనుమతి కావాలని పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగీత విడాకులు కేసు ముగిసే వరకు విజయ్‌ ఇంట్లోనే ఉంటానని పేర్కొనడం విశేషం.విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ కొద్దిరోజుల క్రితం సంగీత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో గత నెల 24న ఆమె పిటిషన్‌ వేసింది. 2021లో ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడటం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఏప్రిల్‌ 20న వారి విడాకుల పిటిషన్‌ విచారణకు రానుంది. ఆ రోజు కోర్టుకు విజయ్‌ హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే నోటీసు ఇచ్చింది.

Actor Rajendra Prasad Refuses to Give Selfie, Video Goes Viral10
సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్‌

సెలబ్రిటీలన్నాక కూసింత ఓర్పు, సహనం ఉండాలి. అందులోనూ నలుగురిలో ఉన్నప్పుడు వీలైనంతవరకు శాంతంగా ఉండాలి, చిరునవ్వుతోనే కనిపించాలి. అభిమానంతో ఎవరైనా సెల్ఫీ అడిగినప్పుడు కుదిరితే ఇవ్వాలి.. లేదంటే వినమ్రంగా తిరస్కరించాలి. కానీ, అసహనం ప్రదర్శించారంటే మాత్రం ఇదిగో ఇలా రాజేంద్రప్రసాద్‌లా విమర్శలపాలు కావాల్సి వస్తుంది.సెల్ఫీ అడిగితే..అసలే కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్నాడు నటుడు రాజేంద్రప్రసాద్‌. తాజాగా ఈయన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ కుర్రవాడు రాజేంద్రప్రసాద్‌ను చూసి ఆతృతతో సెల్ఫీ అడిగాడు. కానీ, ఆయన ఆ పిల్లాడిని అసహనంతో పక్కకు తోసేసి హడావుడిగా ముందుకు వెళ్లిపోయాడు. వీడియో వైరల్‌ఆ సమయంలో రాజేంద్రప్రసాద్‌ ముఖకవళికలు ఆ పిల్లాడిని చీదరించుకున్నట్లుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఎందుకింత పొగరు చూపిస్తున్నాడు. ఒక్క సెల్ఫీ ఇస్తే ఏమవుతుంది? అసలు ఇలాంటి వాళ్లకు అటెన్షన్‌ ఇవ్వడం మానేయాలి అని విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం.. ఆయనేదో బిజీలో ఉన్నట్లున్నారు, వదిలేయండి అని సమర్థిస్తున్నారు. మరి ఇంత బలుపు అవసరమా ?మనుషులని పురుగులు లాగా చూడటం ఏంటి ? తోస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ కవళికలు చూడండి 👇😡 pic.twitter.com/4jS5UG7X2l— Hungry కుక్క 🐕 (@Truth_Exposer__) March 6, 2026 చదవండి: భార్యాభర్తలిద్దరూ పని చేస్తామంటే కుదరదు: కరీనా కపూర్‌

Advertisement
Advertisement