Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Megastar ManaShankara VaraPrasad Garu Movie Serial Actress Fame Viral1
మనశంకర వరప్రసాద్‌గారు సీరియల్ బ్యూటీ.. ఫుల్ ట్రెండింగ్‌లో నటి..!

మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.అయితే ఈ చిత్రంలో కనిపించిన అన్ని పాత్రలకు ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు ఓ సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్‌గా సౌమ్య పాత్రలో మెప్పించింది. మన శంకర వర ప్రసాద్ కారెక్టర్‌లో చిరంజీవి ఆ సీరియల్ గురించి.. ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్‌‌లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆ నటి కోసం తెగ వెతికేస్తున్నారట.ఈ మూవీలోని సీరియల్‌లో సౌమ్య పాత్రలో నటించిన ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేస్తోంది. ఆ తరువాత యూట్యూబ్‌లో సిరీస్‌లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది.రీసెంట్‌గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం.

tollywood movie AmaravathiKi Ahvanam review In telugu2
టాలీవుడ్‌ హారర్ థ్రిల్లర్‌.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?

టైటిల్: అమరావతికి ఆహ్వానంనటీనటులు: శివ కంఠంనేని, ఎస్తేర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులుద‌ర్శ‌క‌త్వం: జీవీకేనిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావుసినిమాటోగ్రఫీ: జె ప్ర‌భాక‌ర్ రెడ్డిసంగీతం: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌ఎడిటింగ్‌: సాయిబాబు తలారివిడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026టాలీవుడ్‌లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్‌ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్‌గా తెలుగులోనే వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్‌ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అమరావతికి ఆహ్వానం కథేంటంటే..ఈశ్వర్‌ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్‌ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను రన్‌ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్‌ ఛానెల్‌లో దెయ్యంతో డే అండ్‌ నైట్‌ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు షూట్‌ చేసి.. కంటెంట్ అప్‌లోడ్‌ చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెల‌బ్రిటీ అయిపోతుంది.అయితే సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విష‌యాన్ని లైవ్‌లో నిరూపిస్తానని.. ఈ వీడియో షూట్‌ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్‌)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్‌ కుటుంబానికి మధ్య ఉన్న లింక్‌ ఏంటి? సీఐగా ఈశ్వర్‌ సస్సెండ్‌ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..దెయ్యాలు అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్‌ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్‌ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా.అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్‌ సీన్‌తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్‌కు షిఫ్ట్‌ చేశాడు. ఫస్‌ హాఫ్‌లో భార్గవి వీడియోలు షూట్‌ చేయడం, మహేశ్ (శివ హ‌రీశ్‌)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్‌ను భయపెట్టే సీన్స్‌ పెద్దగా కనిపించవు. ఈశ్వర్‌‌ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్‌కు ఎండ్‌ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్‌ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేసింది.సెకండాఫ్‌లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌తో కథనం ఆడియన్స్‌కు ఆసక్తికరంగా ‍అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హారర్ సీన్స్‌ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్‌ వ‌చ్చే ట్విస్ట్‌ థ్రిల్‌ చేస్తుంది. హారర్‌ ఎలిమెంట్స్‌ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్‌ థ్రిల్లర్‌లో సాంగ్స్‌ ఉంటే కథ సెట్ అవ్వదు. సెకండాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే ఓ హారర్‌ థ్రిల్లర్‌ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్‌ జీవీకే. తన కథకు తగినట్లుగానే ‌ క్లైమాక్స్‌ డిజైన్ చేయడంలో ద‌ర్శ‌కుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్‌ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు. క్లైమాక్స్‌లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్‌ ఉంటుందని ప్ర‌క‌టించారు.ఎవరెలా చేశారంటే..ఈశ్వర్‌, జ‌గ‌దీష్‌ పాత్రల‌లో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్‌ పిల్లర్‌ ఏస్తేర్‌. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్‌ సీన్స్‌లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్‌, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్‌ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్‌ భరద్వాజ్‌ బీజీఎం హార‌ర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా త‌లారి తన ఎడిటింగ్‌కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.

Megastar ManaShankara VaraPrasad Garu New Record In ott3
ఓటీటీలో మనశంకర వరప్రసాద్‌గారు.. 24 గంటల్లోనే రికార్డ్

మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను ‍అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీకి వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ వ్యూస్‌ సాధించింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలోనే కాదు..ఓటీటీలోనూ మనశంకర వరప్రసాద్‌గారు దూసుకెళ్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

SS rajamouli Clarity On Mahesh Babu Varanasi Movie Genre4
వారణాసి జానర్‌పై కన్‌ఫ్యూజన్.. రాజమౌళి ఫుల్ క్లారిటీ..!

దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్‌ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్‌ టచ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌ కానుందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే రాజమౌళి సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు ఉండడం సహజం. ముఖ్యంగా కథపై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అసలు ఏ జానర్‌లో మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. అందుకే ఈ మూవీ జానర్‌ను ఎవరికీ తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసి టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది.కొందరు ఈ సినిమాను ఫిక్షన్‌ అని అంటున్నారు. మరికొందరేమో విలన్‌ పాత్రధారి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్‌లుక్‌ చూసి సైన్స్ ఫిక్షన్‌ అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్‌పై ఆడియన్స్‌లో విపరీతమైన కన్‌ఫ్యూజన్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీ జానర్‌పై దర్శకుడు రాజమౌళిని స్వయంగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్‌ ఫీల్ ఉంటుందన్నారు. కానీ ఆ జానర్‌లో తీయడం లేదని.. వారణాసి ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని దర్శకధీరుడు క్లారిటీ ఇ‍చ్చారు. దీంతో ఆడియన్స్‌ అనుమానాలకు చెక్ పడినట్లైంది. కాగా.. వారణాసిలో మహేశ్‌బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. విలన్‌ రోల్‌ కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మెప్పించనున్నారు. ఈ మూవీలో మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Funky Movie Result Producer Naga Vamsi Reaction5
'ఫంకీ' సినిమా.. మేం కావాలనే అలా తీశాం

'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన కొత్త సినిమా 'ఫంకీ' థియేటర్లలోకి వచ్చేసింది. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లు కాగా నాగవంశీ నిర్మించాడు. విడుదలకు ముందు కాస్త బజ్ ఉంది. అలానే రిలీజైంది. కానీ తొలి షో నుంచే మిక్స్‌డ్, నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ అంతగా పండలేదని, స్టోరీ కూడా ఏం లేదని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ దీని గురించి ఏమంత పాజిటివ్‌గా మాట్లాడట్లేదు. ఈ క్రమంలోనే బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ పెట్టగా.. నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ విచిత్రంగా అనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ఏమైపోయినట్టు?)'రివ్యూయర్లకి నచ్చదు అని నాకు ముందే తెలుసు. కానీ సాధారణ ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ సరిగ్గా లేదని అంటున్నారు. మేము కావాలనే అలా తీసాం. ఎడిటింగ్ సమస్య కాదది. నేను సాగర సంగమం తీసా అని చెప్పానా? ముందే చెప్పాగా సినిమా సీన్ నుంచి సీన్ ఫ్లో లేకుండా ఉంటుందని. మీరేదో సైంటిస్ట్‌లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడతారు ఏంటి? నేను అన్నీ ముందే చెప్పా. సినిమాకు కావాల్సిన గ్లామర్ అయితే లేదు. అది తెలిసే సినిమా తీశాం'.. ఇలా సాగాయి నాగవంశీ మాటలు.పైన స్పీచ్‌లో ఎక్కడా కూడా ఆడియెన్స్‌కి నచ్చేలా సినిమా తీశాం అనే మాట వినబడలేదు. నవ్వించాలనే ఉద్దేశంతో మాత్రమే తీశానని నాగవంశీ అంటున్నారు. కానీ కొన్నిచోట్ల తప్పితే ప్రేక్షకులు.. మూవీలో సీన్లకు అనుకున్నంతగా నవ్వట్లేదనే విషయాన్ని మాత్రం ఇంకా ఒప్పుకోలేకపోతున్నారా అనిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే యావరేజ్ వచ్చిన మూవీస్ పరిస్థితే థియేటర్ల దగ్గర అంతంత మాత్రంగా ఉంది. అలాంటిది కాస్త నెగిటివ్ టాక్ కూడా వినబడుతున్న 'ఫంకీ'.. వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

tollywood Hero Ravi teja key decision after Movie Flops in a row6
వరుస ఫ్లాఫ్స్.. మాస్ మహారాజా రిస్క్ తీసుకుంటున్నారా?

టాలీవుడ్‌లో మాస్‌ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మాస్ హీరో సక్సెస్ అందుకోలేకపోయారు. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చిన రవితేజకు కొత్త ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. సూపర్ హిట్ కాకపోవడం మాస్ మహారాజా ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు.రవితేజ కీలక నిర్ణయం..సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తగ్గించడం కోసం రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పారితోషికం తగ్గించుకుని మూవీకి వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పుడిదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఉంటోంది. దీంతో మూవీ బడ్జెట్‌ రూ.40 నుంచి 50 కోట్లను దాటిపోతోంది. అదే నిర్మాతలకు భారంగా మారింది. అందువల్లే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రిస్క్‌లో షేర్..మరోవైపు ఓటీటీ రైట్స్ విలువ తగ్గడంతో నిర్మాతలు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇలా నిర్మాతలతో కలిసి రిస్క్ షేర్ చేసుకునే విధానం వైపే రవితేజ ‍అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో నాని, సాయి ధరమ్ తేజ్, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే. రవితేజ కొత్త సినిమా..రవితేజ- శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ ఇరుముడి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్‌.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది.

Chiranjeevi Viswambhara Movie Release Update7
చిరంజీవి 'విశ్వంభర' ఏమైపోయినట్టు?

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్నిసార్లు సినిమా కష్టాలు తప్పవు. చిరంజీవి 'విశ్వంభర' సరిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ ఒకటుందని జనాలు ఇప్పటికే మర్చిపోయారు. మూవీ టీమ్ నుంచి కూడా ఎలాంటి అప్‌డేట్ లేదు. అసలు ఈ చిత్రం ఈ ఏడాదైనా రిలీజ్ అవుతుందా? ఇంతకీ అసలేం జరుగుతోంది?'బింబిసార' లాంటి సక్సెస్ తర్వాత వశిష్ఠ.. చిరంజీవితో కలిసి కొత్త మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడు. 2023లో చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్టుని ప్రకటించారు. అక్టోబరు నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. 2024లో ఎ‍ప్పుడైతే గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. గ్లింప్స్‌పై విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. దెబ్బకు మూవీ టీమ్‌కి సీన్ అర్థమైపోయింది. గతేడాది ఓ పాట, కొత్త గ్లింప్స్ అని మరికొన్ని అప్‌డేట్స్ వచ్చాయి గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. బజ్ రాలేదు.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్)మరోవైపు దీని తర్వాత చాన్నాళ్లకు అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమా ప్రకటించారు. 'మన శంకరవర‍ప్రసాద్' పేరుతో గత నెలలో సంక్రాంతికి రిలీజ్ చేస్తే అద్భుతమైన హిట్ కొట్టింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త మూవీ చేసేందుకు చిరు రెడీ అయిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ కొత్త ప్రాజెక్టు గురించి ఆనందపడిపోతున్నారు. దీని గురించి రూమర్స్ చాలానే వస్తున్నాయి. ఇది కూడా వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా తీస్తున్నారని అంటున్నారు. అదే టైంలో 'విశ్వంభర' గురించి చిన్న సౌండ్ కూడా లేదు.తాజాగా 'విశ్వంభర' నిర్మాతలే తీసిన 'కపుల్ ఫ్రెండ్లీ' విడుదల సందర్భంగా నిర్మాతలు.. చిరు సినిమా గురించి మాట్లాడట్లేదు. 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్‌తో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వశిష్ఠ కూడా 'విశ్వంభర' రిలీజ్ గురించి త్వరలో చెబుతాం అంటున్నాడే తప్ప ఈ ఏడాది వస్తుందా కనీసం వచ్చే ఏడాది వస్తుందా లాంటివి క్లారిటీ ఇవ్వట్లేదు. చూస్తుంటే గ్రాఫిక్స్ విషయంలో ఇంకా సందిగ్దత అలానే కొనసాగుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ రిపేర్లు ఎప్పుడు పూర్తవుతాయో? బొమ్మ ఎప్పుడు బయటకు వస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది?(ఇదీ చదవండి: ఎన్టీఆర్ సినిమా.. నోటిలో నుంచి రక్తమొచ్చింది: జగపతిబాబు)

Funky Movie Review And Rating In Telugu8
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

టైటిల్‌: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్ తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమానిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: అనుదీప్ కె.వి.సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఎడిటింగ్‌: నవీన్ నూలి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026విశ్వక్‌ సేన్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. భారీ అంచనాల మధ్య గతేడాది రిలీజైన ‘లైలా’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ తెరకెక్కించిన చిత్రం కావడంతో ‘ఫంకీ’పై ఓ మోస్తరు అంచనాలు అయితే ఏర్పాడ్డాయి. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఇలా ఈ వారం(ఫిబ్రవరి 13) భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఫంకీతో విశ్వక్‌ సేన్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కోమల్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్‌’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్‌లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్‌(నరేశ్‌) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్‌ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్‌తో నిర్మాత సుదర్శన్‌ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్‌) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్‌ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్‌లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్‌ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్‌ రాజ్‌) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్‌ సినిమాలంటే తెలుగు ఆడియన్స్‌కి ఓ అంచనా ఉంది. కథ గొప్పగా ఉండదు కానీ పంచ్‌ డైలాగ్స్‌తో ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ కథనాన్ని నడిపిస్తాడనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. అయితే గొప్ప కథ లేకపోయినా సరే..చెప్పుకోవడానికైనా కొంత స్టోరీ అయినా ఉండాలి కదా. అలా కాకుండా కేవలం సింగిల్‌ లైనర్స్‌తో పంచ్‌ డైలాగులు పేలిస్తే.. సినిమా ఆడేస్తుందని భావిస్తే అది పొరపాటే. జాతి రత్నాలు కేవలం పంచ్‌ డైలాగ్స్‌ వల్లే ఆడలేదు. అందులో కొంత కథ ఉంటుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటికి తోడుగా పంచ్‌ డైలాగ్స్‌ కూడా ఉండడంతో ఆ సినిమా హిట్‌ అయింది. కానీ ‘ఫంకీ’లో పంచ్‌ డైలాగ్స్‌ తప్ప మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. ఆ డైలాగ్స్‌ కూడా కామన్‌ ఆడియన్స్‌కి పెద్దగా నవ్వు తెప్పించవు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాత్రం నవ్వుకుంటారు. డైలాగ్స్‌ కోసమే సన్నివేశాలు రాసినట్లుగా అనిపిస్తుంది. కథనం మొత్తం సింగిల్‌ పాయింట్‌ చుట్టూనే తిరుగుతూ.. చూసిన సన్నివేశాలే మళ్లీ రిపీట్‌ చేస్తూ విసుగు తెప్పించారు. అసలు ఈ కథని విశ్వక్‌, నాగవంశీ ఎలా ఒప్పుకున్నారనే సందేశం సినిమా చూస్తున్నంతసేపు మన మనసుని వెంటాడుతూనే ఉంటుంది.ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథే లేదు. కథనం ఆసక్తికరంగా సాగదు. ఒక్కో సన్నివేశాన్ని పేర్చుకుంటూ వెళ్లారు. కొన్ని సీన్లు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉండడు. అన్ని విషయాలను లైట్‌ తీసుకునే వ్యక్తిలో కూడా ఎమోషన్లు ఉంటాయని హీరో పాత్ర ద్వారా చెప్పాలకున్నారు. కానీ దాన్ని తెరపై సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. క్లైమాక్స్‌లో మదర్‌ సెంటిమెంట్‌ని కూడా యాడ్‌ చేశారు కానీ అది వర్కౌట్‌ అవ్వలేదు. సినిమా ప్రారంభంలో వచ్చే కామెడీ సన్నివేశాల్లో మొదట్లో కాస్త నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి సీన్లే మళ్లీ మళ్లీ రిపీట్‌ అవ్వడంతో నవ్వు రాకపోగా.. ఒకనొక దశలో చిరాకు అనిపిస్తుంది. కోమల్‌, చిత్ర పాత్రల పరిచయ సన్నివేశాలు బాగుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కథనం కాస్త వేగంగా సాగుతుంది. అనుదీప్‌, కల్యాణ్‌ శంకర్ల గెస్ట్‌ అప్పీయరెన్స్ కూడా పెద్దగా నవ్వులు పంచలేకపోయింది. ఉన్నంతలో మదర్‌ సెంటిమెంట్‌ కాస్త ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే..విశ్వక్‌ సేన్‌ మంచి నటుడే. అయితే అనుదీప్‌ రాసిన ‘కోమల్‌’క్యారెక్టర్‌ అతనికి సరిగా సూట్‌ అవ్వలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఎప్పటిమాదిరే పాత్రలో లీనమైన నటించాడు. కానీ పూర్తిగా నవ్వించలేకపోయాడు. కయాదు లోహర్‌ తెరపై అందంగా కనిపించింది. నరేశ్‌ పాత్ర నిడివి తక్కువే. ఆయనను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సంపత్‌ రాజ్‌ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్‌ చూపించదు. ఈశ్వరీరావు తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్‌ నేపథ్య సంగీతం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ మాత్రం దారుణంగా ఉంది. కొన్ని సీన్లు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Dhurandhar Pirated DVD Being Sold in Pakistan for Rs169
పాక్‌లో ధురంధర్‌ సీడీలు.. ఇంత చీప్‌గా దొరుకుతున్నాయా?

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ గతేడాది ధురంధర్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. దాదాపు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లోనూ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. అక్కడ థియేటర్లలో రిలీజ్‌ అవకుండా బ్యాన్‌ చేసినప్పటికీ ఓటీటీలో మాత్రం తెగ చూసేస్తున్నారు.సీడీల అమ్మకంఅంతేకాదు, పాక్‌లో ధురంధర్‌ మూవీ పైరసీ క్యాసెట్లు కూడా అమ్ముతున్నారు. యూట్యూబర్‌ కార్ల్‌ రాక్‌ షేర్‌ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరాచీలోని రెయిన్‌బో సెంటర్‌ పైరసీ కంటెంట్‌కు పెట్టింది పేరు. అక్కడ ధురంధర్‌ సినిమా సీడీలను 50 పాకిస్తాన్‌ రూపాయలకే ( భారత కరెన్సీలో రూ.16కే) అమ్ముతున్నారు. పాకిస్తాన్‌లో ఇండియన్‌ సినిమాలను నిషేధిస్తారు. కానీ ఇక్కడ నేనేం కనుగొన్నానో చూడండి అంటూ యూట్యూబర్‌ ధురంధర్‌ సీడీ చూపించాడు.అటు బ్యాన్‌.. ఇటు పైరసీఇది చూసిన జనాలు.. పాకిస్తాన్‌ను తిట్టే సినిమాలను అక్కడి ప్రజలే ప్రేమిస్తున్నారు.. ఇది మరీ విడ్డూరం. ఇంకా పైరసీ క్యాసెట్లు అమ్ముతున్నారంటే విచిత్రంగానే ఉంది. ప్రభుత్వం ఏమో ధురంధర్‌పై బ్యాన్‌ విధించింది. వీళ్లేమో ఎంతో సులువుగా పైరసీ చేస్తున్నారు. మరోపక్క మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ధురంధర్‌ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్‌ ఖన్నా, ఆర్‌. మాధవన్‌, సారా అర్జున్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్‌ 2 మార్చి 19న విడుదలవుతోంది. View this post on Instagram A post shared by Karl Rock (@iamkarlrock) చదవండి: అర్జున్‌తో వివాదం.. విశ్వక్‌ ఏమన్నాడంటే?

Jagapathi Babu About Aravinda Sametha Voice And Dubbing Issue10
ఎన్టీఆర్ సినిమా.. నోటిలో నుంచి రక్తమొచ్చింది: జగపతిబాబు

అప్పట్లో హీరోగా మెప్పించిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం 'పెద్ది' లాంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు.. 'అరవింద సమేత' జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నోటిలో నుంచి రక్తం వచ్చిన విషయంపై మరోసారి స్పందించారు. అప్పుడు అసలేమైందనేది చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్)'అరవింద సమేత' సినిమాలో మీ గొంతు విషయంలో స్వరపేటిక కాస్త దెబ్బతిందని విన్నాను నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించగా.. అవుననే సమాధానమిచ్చాడు. 'కాస్త మొరటుగా అనిపించేలా గంటలకొద్ది, రోజుల కొద్దీ డబ్బింగ్ చెప్పడంతో నా గొంతు మొరటుగా మారిపోయింది. ఓ సందర్భంలో నోటి నుంచి రక్తం వచ్చింది. షాకింగ్ వాయిస్ కావాలని అనుకొనే ఇలా చేశాను. ఆ ప్రయత్నంలో అలా జరిగిపోయింది. కాకపోతే మూవీ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆ టైంలో పిచ్చి కసిమీద ఉన్నా. దానికి తగ్గట్లే త్రివిక్రమ్ కూడా అదరగొట్టేశాడు''క్లైమాక్స్ కూడా భలే మార్చాడు త్రివిక్రమ్. ఒరిజనల్‌గా అయితే క్లైమాక్స్‌లో రెగ్యులర్ ఫైటే చేశాం. ఎందుకో షూటింగ్‌లో బ్రేక్ వచ్చింది. ఏంటి శ్రీను, నువ్వు కూడా ఈ క్లైమాక్స్‌లు అని అన్నాను. బోర్ కొడతోంది. నువ్వైనా మార్చవయ్యా క్లైమాక్స్‌లు అని అన్నాను. దీంతో డైరెక్షన్ టీమ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష‍్మణ్ కూర్చుని డిస్కషన్ పెట్టారు. రెండు రోజుల తర్వాత పూర్తిగా క్లైమాక్స్ మార్చేశారు. అదరగొట్టేశారు' అని జగపతిబాబు అన్నారు.ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో 2018లో వచ్చిన సినిమా 'అరవింద సమేత'. పేరుకే మాస్ యాక్షన్ మూవీ అయిప్పటికీ.. కాస్త డిఫరెంట్‌ కాన్సెప్ట్ కావడంతో సూపర్‌హిట్ అయింది. ఇందులో జగపతిబాబు చేసిన బసిరెడ్డి పాత్ర అయితే అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా 'మచ్చల పులి గాం‍డ్రిస్తే ఎట్టా ఉంటదో తెలుసా?' అంటూ వైవిద్యమైన వాయిస్‌తో చెప్పిన డైలాగ్‌కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఆ డబ్బింగ్ వెనక రక్తం వచ్చేంత కష్టముందా అని తెలిసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

Advertisement
Advertisement