ప్రధాన వార్తలు
నాతో నేను పోటీ పడుతుంటాను: సంయుక్త
‘‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్: ది సీక్రెట్ ఏంజెట్, అఖండ 2’.. ఇలా నా కెరీర్లో నటిగా నేను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలే చేస్తున్నాను. భవిష్యత్లో బయోపిక్ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవల హిందీలో ‘హక్’ (యామీ గౌతమ్ నటించారు) అనే సినిమా చూశాను. కొన్ని సన్నివేశాలకు భావోద్వేగానికి గురై ఏడ్చాను.ఈ తరహా పాత్రలూ చేయాలని ఉంది’’ అని చెప్పారు హీరోయిన్స్ సంయుక్త. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో దియా అనే పాత్రలో నటించాను.తోటియాక్టర్స్తో పోలిక పెట్టుకోను. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకోవడానికి నాతో నేను పోటీ పడుతుంటాను. శర్వాగారి నుంచి మంచి కామిక్ టైమ్ను నేర్చుకున్నాను. సాక్షితో మంచి అనుబంధం ఏర్పడింది. రామ్గారు క్లారిటీ ఉన్న డైరెక్టర్. అనిల్గారు ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్. పూరి జగన్నాథ్–విజయ్ సేతుపతిగార్ల సినిమాలో నటించాను. నేను మెయిన్స్ లీడ్లో ‘ది బ్లాక్గోల్డ్’ మూవీ చేస్తున్నాను’’ అని తెలిపారు.
ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు: రవితేజ
‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో తీశారు కిషోర్. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ నెల 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేటర్స్లో కలుద్దాం. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు’’అని హీరో రవితేజ చెప్పారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ–‘‘సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు.కానీ, సినిమాని చాలా ఫ్యాషన్తో చేశారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోర్.. వీరి డైరెక్షన్లో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్ట్స్ శివ నిర్వాణతో చేస్తున్నాను. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోస్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ల. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. డింపుల్, ఆషిక, సునీల్, సత్య, కిషోర్, మురళీధర్, గెటప్ శీను అద్భుతంగా చేశారు. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’అని తెలిపారు.కిషోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. మా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘జనవరి 13న మా బీఎమ్డబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్కి వెళ్లండి.. అదిరి΄ోతుంది’’ అని సుధాకర్ చెరుకూరి తెలిపారు. ‘‘నాకు డైరెక్టర్గా జన్మ, పునర్జన్మ ఇచ్చింది రవితేజగారే. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. ‘‘త్వరలోనే రవితేజగారితో సినిమా చేస్తాను’’ అన్నారు డైరెక్టర్ బాబీ. ‘‘ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు’’ అన్నారు డైరెక్టర్ పవన్.
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. కొత్తగా ఆ సీన్స్..!
ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో కొత్తగా ఎనిమిది నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్స్లో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఉంటుందని అభిమానులకు శుభవార్త చెప్పారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన బ్లాక్బస్టర్ మీట్లో మారుతి క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్లో ప్రభాస్ను కొత్తగా చూపించామని మారుతి అన్నారు.మారుతి మాట్లాడుతూ..' హైదరాబాద్లో షో సరైన టైమ్లో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా చేశారు. ప్రభాస్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించా. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు నచ్చేసింది. ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదంటున్నారు. ప్రభాస్తో నేను సింపుల్గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది. ఒక్క షో, ఒక్కరోజులోనే సినిమాను నిర్ణయించకూడదు' అన్నారు.పదిరోజులు ఆగితేనే సినిమా ఏంటనేది తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అర్థం కానీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. ఓల్డ్ గెటప్లో ఉన్న ప్రభాస్ను టీజర్, పోస్టర్స్లో చూపించాం.. కానీ సినిమాలో కనిపించలేదని అభిమానులు చాలా మంది ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నామని తెలిపారు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం.. వాటికి సెన్సార్ కూడా పూర్తయిందన్నారు. కొత్తగా మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్ అవుతాయని మారుతి వెల్లడించారు. THE ONE YOU ALL HAVE BEEN WAITING FOR 🔥🔥OLD GETUP SEQUENCE is finally adding from today’s evening shows onwards 🤙🏻🤙🏻#TheRajaSaab#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/aOz3n9XsqE— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026
టాక్సిక్లో ఇంటిమేట్ సీన్.. విమర్శలపై డైరెక్టర్ రియాక్షన్..!
కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ విడుదల చేయగా ఫ్యాన్స్ను మాత్రం తెగ మెప్పించింది. అయితే ఆ ఒక్క సీన్తో టీజర్పై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఓ మహిళ దర్శకురాలు ఇలాంటి సీన్స్ పెట్టడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైరయ్యారు.తన మూవీ టీజర్లోని ఇంటిమేట్ సీన్పై విమర్శలు రావడంతో డైరెక్టర్ గీతూ స్పందించింది. తనపై వస్తున్న విమర్శలు చూసి చిల్ అవుతున్నానంటూ కామెంట్స్ చేసింది. ఒక మహిళ డైరెక్టర్ ఇలాంటి సీన్స్ తెరకెక్కించడం కరెక్టేనా అంటూ కొందరు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కాగా.. టీజర్ గ్లింప్స్లో శ్మశానం వద్ద కారులో ఇంటిమేట్ సీన్స్ చూపించారు. ఆ సీన్స్లో నటించిన ఆమెను కూడా పరిచయం చేశారు. ఈ హాలీవుడ్ నటి టీవీ సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్తో గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్ నటించారు. కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.
బిగ్బాస్
ఓటీటీలో కొత్త సినిమా స్ట్రీమింగ్.. సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
కల్యాణ్, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్ పంచ్.. వీడియో వైరల్
రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్లో మధుర జ్ఞాపకం: తనూజ
గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
ప్రమోషన్ పొందిన వితికా షెరు
A to Z
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'రాజాసా...
ఓటీటీలో 'ఫరియా' డార్క్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ప్రకటన
గుర్రం పాపిరెడ్డి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు...
చైతో పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
హీరోయిన్ శోభిత ధూళిపాళ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది...
నాకు చాలా ప్రత్యేకం!
‘‘కానిస్టేబుల్ కనకం 2’ నాకు చాలా ప్రత్యేకం. ఇంత అ...
సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ!
సినిమాకు ప్రమోషన్స్ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట...
23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే!
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇండస్ట్రీలో అడుగ...
కొడుక్కి నామకరణం.. ఆ పేరుతో విక్కీకి ప్రత్యేక అనుబంధం!
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కై...
బాలీవుడ్లో టాప్
హిందీ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ...
మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు! నటికి ఆఫర్
సెలబ్రిటీలను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కొందరు ...
'అవతార్ 3' విలన్ చార్లీ చాప్లిన్ మనవరాలా?
పదిరోజుల క్రితం థియేటర్లలో వచ్చిన హాలీవుడ్ భారీ బడ...
'స్ట్రేంజర్ థింగ్స్ 5' ఫినాలే ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థ...
భయపెడితే భళా.. బాక్సాఫీస్ గలగలా
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ వుడ్ చూసినా హారర...
ధురంధర్ హీరోతో మూవీ.. స్పందించిన సౌత్ హీరోయిన్
మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ 'లోక చాప్టర్...
పరిస్థితి మా చేయి దాటిపోయింది: నిర్మాత భావోద్వేగం
తన సినిమాలతో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నాడు...
'జన నాయగన్'కు కమల్ సపోర్ట్.. సెన్సార్ మారాలి
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’...
ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్'
'నాన్న-పులి' కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఏం చెప్...
ఫొటోలు
'ది రాజా సాబ్' స్పెషల్ మీట్లో సందడిగా చిత్ర యూనిట్ (ఫోటోలు)
తిరుమలలో సినీ నటులు తనికెళ్ల భరణి (ఫోటోలు)
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన.. ఆషికా, డింపుల్ (ఫొటోలు)
'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)
క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)
రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్
ట్రెండింగ్లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?
అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)
'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్లో ఫోటోలు
'అనగనగా ఒక రాజు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సెలబ్రిటీలు (ఫోటోలు)
గాసిప్స్
View all
'మన శంకర వరప్రసాద్' యూనివర్స్పై అనిల్ రావిపూడి క్లారిటీ
'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?
సంక్రాంతి బాక్సాఫీస్: సర్ప్రైజ్ హిట్ కోసం ఎదురుచూపులు
విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా? మాట నిలబెట్టుకుంటాడా?
టాలీవుడ్లో ఒకేరోజు ఈవెంట్ల జాతర
'అఖండ-2' ఫైనల్ కలెక్షన్స్.. బిగ్ లాస్
చరణ్తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది
ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?
సల్మాన్ ఖాన్ రూ.80 కోట్ల ఆస్తి ఆమె పేరిట?
బాలకృష్ణ, గోపీచంద్ల కథ కంచికి.. మేకర్స్ కీలక నిర్ణయం
రివ్యూలు
View all
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్.. ఓటీటీ సినిమా రివ్యూ
2.5
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
2.25
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
2.75
'దండోరా' సినిమా రివ్యూ
3
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్.. ఓటీటీ సినిమా రివ్యూ
ఏదేమైనా థ్రిల్లర్ సినిమాలు తీయడంలో కొరియన్ దర్శకుల తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో టాప్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా వీళ్ల పేర్లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రెగ్యులర్కి భిన్నంగా పార్క్ చాన్ వుక్ అనే దర్శకుడు తీసిన 'నో అదర్ ఛాయిస్' గురించి మాట్లాడుకుందాం. ఇది ఓ షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఇంతకీ ఇదెలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మాన్సు అనే వ్యక్తి, 25 ఏళ్లుగా ఓ పేపర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. భార్య, కొడుకుతో చాలా సింపుల్గా బతికేస్తుంటాడు. ఒకరోజు ఎలాంటి వార్నింగ్ లేకుండా మాన్సుని ఉద్యోగం నుంచి తీసేస్తారు. దీంతో కొత్త ఉద్యోగం కోసం మాన్సు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఎక్కడా జాబ్ దొరకదు. అప్పుడే ఇతడు ఎవరూ ఊహించని ఆలోచన చేస్తాడు. తనతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల్ని చంపేస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుంది కదా అని భావిస్తాడు. మరి తర్వాత ఏం చేశాడు? చివరకు మాన్సుకి ఉద్యోగం దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. కరోనా లాక్ డౌన్ టైంలో చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇప్పటికీ రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు పోతూనే ఉన్నాయి. ఎవరైనా ఉద్యోగం పోతే ఏం చేస్తారు? మరో జాబ్ చూసుకోవడం లేదా డబ్బులుంటే వ్యాపారం చేసుకుంటారు. కానీ తనతో పోటీలో ఉన్న వాళ్లని చంపేస్తే ఉద్యోగం తనకే దక్కుతుందని భావిస్తే.. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు.నిరుద్యోగం ఒక మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో ఈ చిత్రంలో చాలా రా(RAW)గా చూపించారు. మరో దారిలేక ఓ సామాన్యుడు చేసే హింసాత్మక పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. పెట్టుబడీదారి వ్యవస్థకు చెంపదెబ్బ లాంటి మూవీ ఇది.అలానే సినిమా చూస్తున్నంతసేపు 'దృశ్యం' గుర్తొస్తుంది. ఎందుకంటే కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఓ తండ్రి ఏ స్థాయి వరకు వెళ్లాడు? ఈ క్రమంలో హత్యలు చేసేందుకు కూడా వెనుకాడకపోవడం, చివరకు పోలీసులకు దొరకకపోవడం లాంటివి చూసినప్పుడు 'దృశ్యం'తో పోలికలు కనిపిస్తాయి. కానీ రెండు వేర్వురు కాన్సెప్టులు.ప్రారంభంలో డార్క్ కామెడీ టోన్లో ఉంటుంది. కాసేపటికి థ్రిల్లర్ జోన్లోకి మారిపోతుంది. అక్కడి నుంచి ఒక్కొక్కరిని మాన్సు చంపుతుంటే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఇది ముబీ ఓటీటీలో కొరియన్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కుదిరితే ఒంటరిగానే చూడండి.-చందు డొంకాన
ఉంచాలా తీసేయాలా.. ఫస్ట్ నన్ను అడగాలి
కెరీర్లో తొలిసారి రవితేజ.. తన 'మాస్ మహారాజ' అనే ట్యాగ్ తీసేసి, రెమ్యునరేషన్ అందుకోకుండా చేసిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ మంగళవారం(జనవరి 13) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్.. రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత సినిమాతో అలరించలేకపోయాం. ఈసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ తీస్తా అని మాటిచ్చారు.'ఈ సినిమాకు రవితేజ అన్నయ్య.. మాస్ మహారాజ్ టైటిల్ తీసేయండి అని అన్నారట. ఆ టైటిల్ పెట్టింది నేను. దాన్ని పేటెంట్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నీ తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. మాస్ మహారాజ్ అనే పేరు ఉంచాలా తీసేయాలా అనేది అన్నయ్య ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి. అది జరిగే పనికాదు. మిరాపకాయ్ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్నే 'నేనింతే'లో పూరీ జగన్నాథ్ పెట్టారు'(ఇదీ చదవండి: 'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్)'సినిమా ఎలా ఉన్నాసరే ఆడిందా ఊడిందా అనేది రవితేజ ఏం పట్టించుకోడు. తర్వాత రోజు షూటింగ్కి వెళ్లిపోతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు పొంగిపోకురా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకురా' అని అర్థం. ఆయన పరిచయం చేసిన దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ.. ఈరోజు స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. మా గత సినిమా సరిగా ఎంటర్టైన్ చేయలేదు. డిసప్పాయింట్ చేశాం. కానీ మేం అక్కడితో అలా ఆగిపోము. రవితేజతో మళ్లీ బ్లాక్బస్టర్ తీస్తా' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.హరీశ్ శంకర్ కెరీర్ చూసుకుంటే.. ఇరవైళ్లలో ఎనిమిది సినిమాలు తీశాడు. వీటిలో మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ అయ్యాయి. చివరగా 2024లో 'మిస్టర్ బచ్చన్' అనే రీమేక్ మూవీ చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నాడు. ఇది దళపతి విజయ్ 'తెరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. దీని వల్ల మూవీపై అస్సలు బజ్ లేదు. ఈసారి హిట్ కొడితేనే హరీశ్ శంకర్కి ప్లస్ అవుతుంది. మరెం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఏపీలో రవితేజ, నవీన్ సినిమాలకు టికెట్ ధరలు పెంపు)
'ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్లా ఉంటాడు'..మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ఫ్యాన్స్ను పలకరించనున్నారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రవితేజ మాట్లాడారు.రవితేజ మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఆషికా, డింపుల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో వాళ్లతో పాటు నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే దక్కుతుంది. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్తో కలిసి 13 సినిమాలు చేశా. శేఖర్ కంపోజ్ చేసిన మూడు సాంగ్స్ బాగుంటాయి. ఇందులో ఫైట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇక మా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. అతన్ని చూస్తే ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడని అన్నారు. స్టీవ్ వా అనుకుంటా. హిట్తో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి ప్రయాణించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. అలా అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్లతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తా. నా నెక్ట్స్ మూవీ శివ నిర్వాణతో చేస్తున్నా. ఇక ఈ మూవీకి భీమ్స్ అదరగొట్టేశాడు. కిశోర్ తిరుమలతో హిట్ ట్రాక్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.'JAN 13TH - BHARTHA MAHASAYULAKU WIGNYAPTHI - thammullu kaluddham 💥💥💥 '@RaviTeja_offl super confident speech at the #BharthaMahasayulakuWignyapthi grand pre-release event ❤🔥#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026.@RaviTeja_offl @DirKishoreOffl… pic.twitter.com/EHB6UXkmQ9— SLV Cinemas (@SLVCinemasOffl) January 10, 2026
మనశంకర వరప్రసాద్ గారు.. ప్రీమియర్స్ బుకింగ్స్ టైమ్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ నయనతార హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీ రిలీజ్కు ముందు రోజు ప్రీమియర్స్ వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తెలంగాణలోనూ అనుమతులు రావడంతో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు నైజాం ప్రీమియర్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.కాగా.. చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. The stage is set for the Mega Victory Mass Entertainer 🥳❤️🔥#ManaShankaraVaraPrasadGaru NIZAM PREMIERES BOOKINGS Open TOMORROW 9AM🔥Grab your tickets for #MSG exclusively on @district_india 🎫— https://t.co/4IW3XsgR2Z#MSGonJan12th pic.twitter.com/JAlhRdrtOQ— SVC Release (@SVCRelease) January 10, 2026
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. కొత్తగా ఆ సీన్స్..!
ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో కొత్తగా ఎనిమిది నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్స్లో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఉంటుందని అభిమానులకు శుభవార్త చెప్పారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన బ్లాక్బస్టర్ మీట్లో మారుతి క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్లో ప్రభాస్ను కొత్తగా చూపించామని మారుతి అన్నారు.మారుతి మాట్లాడుతూ..' హైదరాబాద్లో షో సరైన టైమ్లో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా చేశారు. ప్రభాస్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించా. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు నచ్చేసింది. ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదంటున్నారు. ప్రభాస్తో నేను సింపుల్గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది. ఒక్క షో, ఒక్కరోజులోనే సినిమాను నిర్ణయించకూడదు' అన్నారు.పదిరోజులు ఆగితేనే సినిమా ఏంటనేది తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అర్థం కానీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. ఓల్డ్ గెటప్లో ఉన్న ప్రభాస్ను టీజర్, పోస్టర్స్లో చూపించాం.. కానీ సినిమాలో కనిపించలేదని అభిమానులు చాలా మంది ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నామని తెలిపారు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం.. వాటికి సెన్సార్ కూడా పూర్తయిందన్నారు. కొత్తగా మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్ అవుతాయని మారుతి వెల్లడించారు. THE ONE YOU ALL HAVE BEEN WAITING FOR 🔥🔥OLD GETUP SEQUENCE is finally adding from today’s evening shows onwards 🤙🏻🤙🏻#TheRajaSaab#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/aOz3n9XsqE— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026
టాక్సిక్లో ఇంటిమేట్ సీన్.. విమర్శలపై డైరెక్టర్ రియాక్షన్..!
కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ విడుదల చేయగా ఫ్యాన్స్ను మాత్రం తెగ మెప్పించింది. అయితే ఆ ఒక్క సీన్తో టీజర్పై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఓ మహిళ దర్శకురాలు ఇలాంటి సీన్స్ పెట్టడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైరయ్యారు.తన మూవీ టీజర్లోని ఇంటిమేట్ సీన్పై విమర్శలు రావడంతో డైరెక్టర్ గీతూ స్పందించింది. తనపై వస్తున్న విమర్శలు చూసి చిల్ అవుతున్నానంటూ కామెంట్స్ చేసింది. ఒక మహిళ డైరెక్టర్ ఇలాంటి సీన్స్ తెరకెక్కించడం కరెక్టేనా అంటూ కొందరు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కాగా.. టీజర్ గ్లింప్స్లో శ్మశానం వద్ద కారులో ఇంటిమేట్ సీన్స్ చూపించారు. ఆ సీన్స్లో నటించిన ఆమెను కూడా పరిచయం చేశారు. ఈ హాలీవుడ్ నటి టీవీ సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్తో గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్ నటించారు. కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.
'మన శంకర వరప్రసాద్' యూనివర్స్పై అనిల్ రావిపూడి క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్లు సృష్టించుకోవడం కొత్తేమీ కాదు. ఒక సినిమాలో పాత హిట్ సినిమాల రిఫరెన్సులు, క్యారెక్టర్లు వాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్గా మారిన విషయం తెలిసిందే. అలాంటి మరో యూనివర్స్ క్రియేట్ చేసే అవకాశం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్లో పెట్టి సినిమా తీసిన ఆయన, ఈ కాంబినేషన్తో యూనివర్స్ సృష్టించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ పోలీస్ పాత్రలో కనిపించారు. కానీ చిరంజీవి సినిమాలో మాత్రం ఆయనను మైనింగ్ డాన్ వెంకీ గౌడగా చూపిస్తున్నట్టు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అంటే ఈ రెండు సినిమాలు ఒకే యూనివర్స్లో లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే భవిష్యత్తులో వెంకటేశ్తో మరో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అందులో తప్పకుండా చిరంజీవి క్యామియో పెట్టే ప్రయత్నం చేస్తాను. అప్పుడు తనకంటూ ప్రత్యేకమైన వరప్రసాద్ యూనివర్స్ను సృష్టిస్తానని ఆయన చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో వెంకీ హీరోగా నటించే సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్గా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఈ ఆలోచన నిజంగా ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇచ్చేలా ఉంది. అభిమానులు కూడా ఆ రోజు త్వరగా రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు.
ఏపీలో 'రవితేజ, నవీన్' సినిమాలకు టికెట్ ధరలు పెంపు
సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ జీఓ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ది రాజాసాబ్. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రాలకు ప్రీమియర్ షోలతో పాటు అదనపు ధరలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.. అయతే, తాజాగా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' రెండు చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుతూ ఏపీ అనుమతి ఇచ్చింది.'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ జనవరి 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా సింగిల్ స్క్రీన్స్లలో రూ. 50, మల్టీఫ్లెక్స్లో రూ.75 పెంచుకునేందుకు ఛాన్స్ దక్కింది. జీఎస్టీతో కలిపి ఈ ధరలు ఉంటాయి. అయితే, జనవరి 14న విడుదల కానున్న అనగనగా ఒక రాజు సినిమాకు కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. అదనంగా పెంచిన ధరలు 10రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, తెలంగాణలో ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలను పెంచలేదు. సాధారణ ధరలతోనే ప్రేక్షకులు సినిమా చూడొచ్చు.
'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్
సినిమాలకు ఫేక్ రివ్యూలు ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నట్లు నిర్మాతలు తరచూ అంటుంటారు. ముఖ్యంగా పెద్ద సినిమాలో ఒకే సమయంలో విడుదలైనప్పుడు వారి అభిమానులు ఇలాంటి ఫేక్ రివ్యూలతో రంగంలోకి దిగుతారు. దీంతో సినిమా పరిశ్రమ దెబ్బతింటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇప్పుడు అలాంటి ఫేక్ రివ్యూలకు కోర్టు ఆర్డర్తో చెక్ పడింది. ఈ ట్రెండ్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతోనే ప్రారంభం అవుతుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు సంబంధించి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్లు , రివ్యూలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 'బుక్ మై షో' తమ పోర్టల్లో పేర్కొంది. సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు కొందరు బాట్లను ఉపయోగించి నకిలీ రేటింగ్లు ఇస్తున్నట్లు గుర్తించారు. దీనిని కట్టడి చేసేందుకు 'BlockBIGG' & 'Aiplex' సంస్థలు రంగంలోకి దిగాయి. ఇక నుంచి బాట్స్ ఉపయోగించి ఆన్లైన్ పోర్టల్లో ఎవరూ ఫేక్ రివ్యూలు ఇవ్వడం కుదరదు. అలా ఎవరైన ప్రయత్నం చేసినా నేరం అవుతుందని పేర్కొంది.తెలుగు సినీ పరిశ్రమలో ఇది సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సినిమాలపై కుట్రపూరితంగా జరిగే నెగెటివ్ రేటింగ్స్, ఫేక్ రివ్యూలకు ఇక నుంచి చెక్ పడనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీకి ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్లో రివ్యూలు, రేటింగ్స్ చట్టబద్ధంగా నిలిపివేయబడ్డాయి.
చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. లిఫ్ట్లో అలా ప్రవర్తించాడు : హీరోయిన్
దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలోని ప్రతి మహిళ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులకు గురవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి మహిళకు ఈ వేధింపుల తప్పడం లేదు. తాజాగా మలయాళ స్టార్ నటి పార్వతి తిరువోత్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి పలు ఘటనలు ఆమెను మానసికంగా కలచివేశాయని చెప్పుకొచ్చారు.ఛాతీపై కొట్టాడు.. నా చిన్నప్పుడు ఒకసారి అమ్మా నాన్నలతో కలిసి రైల్వే స్టేషల్కు వెళ్లాను. ట్రైన్ కోసం పెరెంట్స్తో కలిసి నిలబడితే.. ఒకడు వచ్చి నా ఛాతీపై కొట్టి పారిపోయాడు. అతను కావాలనే అక్కడ టచ్ చేశాడు. ఆ సంఘటన నన్ను చాలా మానసిక క్షోభకు గురిచేసింది. ఆ తర్వాత నేను బయటకు వెళ్తే.. ఎలా ఉండాలో అమ్మ చెప్పేది. మగాళ్ల చేతులను చూస్తూ నడవాలని చెప్పాలి. ఒక తల్లి తన కూతురికి ఇలా నేర్పించాల్సిన పరిస్థితి రావడం దారుణం. ఆ ఒక్క సంఘటననే కాదు. చిన్నప్పుడు నాకు ఇలాంటివి చాలానే ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు ప్రైవేట్ పార్ట్ని చూపిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించా. అతను నన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చమని వేధించాడు. ప్రేమిస్తే.. అనుమతి లేకపోయినా సరే ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనా?లిఫ్ట్లో అలా.. కొట్టేశా19-20 ఏళ్ల వయసులో కూడా ఓ ఘటన జరిగింది. సినిమా కోసం స్నేహితులతో కలిసి మాల్కి వెళ్లాను. అనంతరం లిఫ్ట్లో కిందికి వస్తుంటే..ఒక వ్యక్తి నా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. అతని ప్రైవేట్ పార్ట్ నాకు తగిలినట్లుగా అనిపించింది. లిఫ్ట్ దిగగానే అతన్ని చెంపపై కొట్టాను. సెక్యూరిటీ వచ్చి ఆపారు. పోలీసులకు ఫోన్ చేసి రప్పించాను. చివరికి అతను నా కాళ్ళ మీద పడి, 'నాకు ఇప్పుడే గల్ఫ్లో ఉద్యోగం వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటున్నాను' అనడంతో వదిలేశా. నేను అతన్ని కొట్టినప్పుడు, అందరూ నన్ను అభినందించారు. కానీ అది పెద్ద విజయం అని నేను అనుకోలేదు. నన్ను నేను రక్షించుకోవడం పెద్ద విషయం కాదు’ అని పార్వతి చెప్పుకొచ్చింది. సినిమాలో విషయానికి వస్తే.. 2024లో వచ్చిన ‘ఉల్లోజుక్కు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
సినిమా
మరో బిగ్ సీక్వెల్ కన్ఫర్మ్.. రెబల్ ఫ్యాన్కు పండగే..
బోర్డర్ 2 రిలీజ్... దురంధర్ రికార్డులు బ్రేక్ అవుతాయా?
సూరత్ ఎయిర్ పోర్ట్ లో అమితాబ్ కు తప్పిన ప్రమాదం
మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న హుక్ స్టెప్ సాంగ్
పెళ్లి తరువాత అభిమానులకు సమంత గుడ్ న్యూస్
చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా
ఆస్కార్ కు అడుగు దూరంలో కాంతారా, మహావతార్..
Allu Arjun: పుష్ప టార్గెట్ చేశాడంటే..! నీయవ్వ తగ్గేదేలే
Toxic Movie: టీజర్ తో మెంటలెక్కించాడుగా
జననాయగన్ మధ్యాహ్నం రిలీజ్! మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
