ప్రధాన వార్తలు
పోలీస్ ఆఫీసర్గా కార్తీ.. వివాదంలో సినిమా..!
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం వా వాతియార్. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీస్ అధికారి పాత్రలో కార్తీ నటించారు. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. అన్నగారు వస్తారు అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా ఈ చిత్రం ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత జ్ఞానవేల్రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్ అర్జున్లాల్ సుందర్దాస్ చెన్నై హైకోర్ట్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం వావాతియార్ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. రూ.21.78 కోట్ల రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిలీజ్పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Interim Ban on ‘#VaaVaathiyaar’The Madras High Court has issued an interim stay on the release of the film Vaa Vaathiyaar, starring #Karthi and produced by Studio Green.In a case filed by Arjunlal Sundardas against Gnanavel Raja, the court ordered that the film should not be… pic.twitter.com/tOo456lm1I— Movie Tamil (@_MovieTamil) December 4, 2025
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు. మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే. గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్లో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.ఈ నేపధ్యంలోనే నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్గా మారింది. మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది. అలాగే ఫిట్నెస్ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.ఇప్పటికీ సమంత కి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్ నుంచి రిలేషన్స్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది. విడాకుల తరువాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్ అట్రాక్షన్గా మారింది. సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది. ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి.
బాలయ్య అఖండ-2.. తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరల పెంపు
బాలయ్య మూవీ అఖండ-2 సినిమా టికెట్ల పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే ఏపీలో భారీగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించగా.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అనుమతులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.100 ఒక్కో టికెట్పై పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడు రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 4న ప్రదర్శించే ప్రీమియర్స్కు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ ఒక్క షోకు ఏకంగా రూ.600 వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా ఇష్టమొచ్చినట్లుగా టికెట్ ధరలకు అనుమతులు ఇవ్వడంపై సగటు సినీ ప్రియులు మండిపడుతున్నారు. ఏపీలో భారీగా ధరల పెంపు.. ఏపీలో ఇప్పటికే అఖండ-2 మూవీ టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. సింగిల్స్ స్క్రీన్స్లో రూ.75, మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు.. ఏకంగా రూ.600 లుగా టికెట్ ధరలను నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సగటు సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'పుష్ప' ఘటన.. 'శ్రీతేజ్' గురించి మాట్లాడిన బన్ని వాస్
‘పుష్ప2’ సినిమా ప్రీమియర్స్ నాడు జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ గురించి తాజాగా నిర్మాత బన్ని వాస్ మాట్లాడారు. ప్రస్తుతం అతని కుటుంబానికి అందుతున్న సాయం గురించి ఆయన చెప్పుకొచ్చారు. 'ఈషా' సినిమా గ్లింప్స్ విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.శ్రీతేజ్కు అందుతున్న సాయం గురించి బన్నివాస్ను మీడియా ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు. బాబు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. దిల్రాజు వంటి ఇతర పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉంచాలి..? ఆస్పత్రి ఖర్చుల కోసం ఎంత ఉపయోగించాలి..? వారి కుటుంబం నెలవారీ ఖర్చులకు ఎంత అవసరం వంటి వాటిపై వ్యవస్థీకృతంగా ఒక విధానం నడుస్తోంది. బాబు కోసం ఇచ్చిన డబ్బు సరిపోకపోవడం వంటి అంశపై ఏమైనా మాట్లాడాలంటే వాళ్లు వచ్చి మాతో మాట్లాడవచ్చు. మావైపు నుంచి ఏవైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీతేజ్ విషయం చర్చించడానికి మధ్యలో పెద్దలు ఉన్నారు. వారి సమక్షంలోనే మంచి చేస్తాం. అని అన్నారు.
బిగ్బాస్
టికెట్ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!
ఛాలెంజ్ చేసిన పవన్ను ఓడించిన భరణి
సుమన్ చేతిలో ఓటమి.. తనూజకు ఏడుపే దిక్కు!
రీతూ పరువు పాయే.. దుమ్ము దులిపేసిన ఇమ్మూ, తనూజ
నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?
బిగ్బాస్ 9.. ట్రెండింగ్లో కల్యాణ్ పడాల
ఆ రెండు తప్పుల వల్లే దివ్య ఎలిమినేట్!
భరణి ఉగ్రరూపం.. నామినేషన్స్లో ఆరుగురు
తనూజను ఎత్తుకుని తిరిగితే నీకేంటి సమస్య? ఏడ్చేసిన దివ్య
దివ్య ఎలిమినేట్.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన భరణి
A to Z
ఓటీటీలో వరుణ్ సందేశ్ కొత్త వెబ్ సిరీస్.. రిలీజ్ ఎప్పుడంటే?
కొత్తబంగారు లోకం హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలో ఎంట్ర...
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'అఖండ 2' మాత్...
లవ్ ఫెయిల్... సరదాగా నవ్వించే మూవీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి...
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'ది గర్ల్ఫ్రెండ్'
ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్ కలిస్తే జనం చప్పట్ల...
అయ్యర్తో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన మృణాల్
'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠా...
'తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు'.. జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్ ఆసక్తికర కామెంట్స...
నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు ...
డ్రాగన్లో..?
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో అనిల్ కపూర్ భాగమయ్...
మైఖేల్ డేట్ ఫిక్స్
పాప్ మ్యూజిక్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధా...
రూ. 7వేల కోట్ల సినిమా.. ఓటీటీలో ఉచితంగానే స్ట్రీమింగ్
హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ (Jura...
తెరపై తండ్రి కూతురు.. నిజజీవితంలో ఆమెపై వేధింపులు
ఓటీటీలో 'స్ట్రేంజర్ థ్రింగ్స్' అనే వెబ్ సిరీస్ మన ...
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఇండియాలోనూ రిలీజ్
హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ఇండియన్ అభిమానులను...
బాలయ్య అఖండ-2.. తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరల పెంపు
బాలయ్య మూవీ అఖండ-2 సినిమా టికెట్ల పెంచుకునేందుకు త...
ఏడాది తర్వాత పెళ్లి వీడియోను షేర్ చేసిన 'శోభిత ధూళిపాళ్ల'
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్...
ఇటువంటి పెళ్లి నేను చూడలేదు, రాజ్ ఎలాంటివాడంటే?
హీరోయిన్ సమంత, ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పారె...
పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించిన 'రష్మిక'
పెళ్లి వార్తల గురించి నటి రష్మిక స్పందించారు. విజ...
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)
చలికాలం స్వింగ్లో పూజా హెగ్డే.. స్పెషల్ ఫోటోలు చూశారా..?
'అఖండ 2 తాండవం' హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)
పిక్నిక్ వెళ్లిన ద ఫ్యామిలీ మ్యాన్ టీమ్! (ఫోటోలు)
చైతు-శోభిత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ప్రత్యేక ఫోటోలు
సమంత రెండో పెళ్లి.. కొత్త ఫోటోలు వైరల్ (ఫొటోలు)
కజిన్ వెడ్డింగ్లో మెరిసిన దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ దంపతులు (ఫొటోలు)
బీచ్లో కుమారుడితో ఎంజాయ్ చేస్తోన్న అగ్ర నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)
ఐఎండీబీ 2025 పాపులర్ స్టార్స్ వీళ్లే (ఫొటోలు)
గాసిప్స్
View all
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి
నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్కు ముందే సంచలనం!
మహేశ్ 'వారణాసి'.. సమస్య పరిష్కారమైందా?
'స్పిరిట్' సినిమా.. డైరెక్టర్ సందీప్ షాకింగ్ డెసిషన్!
దీపికా పదుకొణె చెల్లి పెళ్లి.. ఈమె కూడా సినీ ఫ్యామిలీలోకే!
'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!
రివ్యూలు
View all
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
2
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
3
‘కాంత’ మూవీ రివ్యూ
2.5
'జిగ్రీస్' మూవీ.. నలుగురి స్నేహితుల కథ (రివ్యూ)
సినీ ప్రపంచం
ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద హడావుడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంటాయి. ఈ వారం టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ-2 బాక్సాఫీస్ సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ దురంధర్ రిలీజవుతోంది. రెండు కూడా అగ్ర హీరోలు కావడంతో సినీ ప్రియుల్లోనూ అదేస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు.. థియేటర్ మూవీస్తో పాటు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్కు వచ్చేస్తుంటాయి. అలా ఈ శుక్రవారం పలు సూపర్ హిట్ మూవీస్ రెడీ అయిపోయాయి. వీటిలో రష్మిక ది గర్ల్ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వీటితో పాటు ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్, డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్ స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ద గర్ల్ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05 జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05 స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05 ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05 ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్ట్మస్-2-డిసెంబరు 05ది బ్యాడ్ గాయ్స్- బ్రేకింగ్ ఇన్- (యానిమేషన్ సిరీస్)- డిసెంబర్ 06ఆహా ధూల్పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05జియో హాట్స్టార్ డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05జీ5 ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05 ఘర్వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05 బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05 పరియా(బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్)- డిసెంబరు 05సోనీ లివ్ కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05సన్ నెక్స్ట్ అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05ఆపిల్ టీవీ ప్లస్ ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05
నిర్మాత కన్నుమూత.. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రముఖ నిర్మాత శరవణన్ పార్థీవదేహనికి నివాళులర్పించిన ఆయన.. తనలోని బాధను ఆపుకోలేకపోయారు. శరవణన్ మృతిని తలచుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దిగ్గజ నిర్మాతగా శరవణన్.. నిర్మాత శరవణన్ మృతితో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 వందల సినిమాలను నిర్మించారు. ఏవీఎం ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ లాంటి బ్లాక్బస్టర్స్ అందించారు. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్లతో వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు.ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. #WATCH | Tamil actor Suriya paid his respects to veteran producer AVM Saravanan at AVM Studio in Vadapalani. Suriya had worked in two of his hit films, Perazhagan and Ayan, under the AVM banner. Saravanan, who shaped generations of Tamil cinema, passed away at the age of 86.… pic.twitter.com/nAvEEnhEnQ— The Federal (@TheFederal_News) December 4, 2025
‘అఖండ- 2’ ప్రీమియర్ షోలు రద్దు
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అఖండ 2:తాండవం ప్రీమియర్స్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రిమియర్స్ పడాల్సింది. కానీ సాంకేతిక కారణంగా ప్రీమియర్స్ షోలని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ 2(Akhanda 2) . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతు వచ్చిన ఈ చిత్రం రేపు(డిసెంబర్ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీలీజ్కి ఒక్క రోజు ముందే అంటే డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఏపీలో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్స్ బాలయ్య బొమ్మ పడుతుందని ఆశించిన అభిమానులకు చివరి నిమిషంలో మేకర్స్ షాకిచ్చారు. “ఈరోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్” అంటూ నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది. అయితే ఓవర్సీస్లో మాత్రం యాథావిధిగా ప్రీమియర్స్ షోలు ఉంటాయని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. #Akhanda2 Premieres scheduled for today are canceled due to technical issues. We've tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
సడన్గా ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
వైభవ్ కీలక పాత్రలో నటించిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'రణం అరం తవరేల్'. ఈ సినిమాకు షరీఫ్ దర్శకత్వం వహించారు. గతేడాది ఫిబ్రవరిలో తమిళంలో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంది. తమిళంలో హిట్ కావడంతో తెలుగులో ది హంటర్: చాప్టర్-1 పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది జూన్లో రిలీజైన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ను మెప్పించింది.తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారు ది హంటర్: చాప్టర్-1 చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక నగరంలో జరిగిన వరుసగా హత్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఆ వరుస హత్యల వెనకున్న ప్రధానమైన కారణం ఏమిటి? అనేది అసలు కథ.
టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. టీజర్ వచ్చేసింది..!
ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ డ్రైవ్. ఈ మూవీకి జెనూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి ఆనంద ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఇవాళ రిలీజైన టీజర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సీన్స్ చూస్తే ఫుల్ గ్రిప్పింగ్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ను తలపించేలా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ యోహాన్ కురువిల్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఓషో వెంకర్ సంగీతమందించారు.
ఇళయరాజాతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్ చేసుకుందా..?
సంగీత దర్శకుడు ఇళయరాజా, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన డ్యూడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలను ఉపయోగించారు. దీంతో కాపీరైట్స్ వివాదం తలెత్తింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఇళయరాజా పాత పాటలను తన అనుమతి లేకుండా ఉపయోగించారని అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఇళయరాజాతో మైత్రీ మూవీస్ సయోధ్య కుదుర్చుకున్నట్లు సోషల్మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆయన పాటలను ఉపయోగించినందుకు గాను రూ.50 లక్షలు చెల్లించడానికి మైత్రీ మూవీస్ అంగీకరించినట్లు సమాచారం. అందుకోసం ఇళయరాజాకు సంబంధించిన న్యాయవాధిని వారు సంప్రదించారట. అయితే, ఈ అంశంపై అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.
పోలీస్ ఆఫీసర్గా కార్తీ.. వివాదంలో సినిమా..!
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం వా వాతియార్. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీస్ అధికారి పాత్రలో కార్తీ నటించారు. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. అన్నగారు వస్తారు అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా ఈ చిత్రం ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత జ్ఞానవేల్రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్ అర్జున్లాల్ సుందర్దాస్ చెన్నై హైకోర్ట్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం వావాతియార్ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. రూ.21.78 కోట్ల రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిలీజ్పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Interim Ban on ‘#VaaVaathiyaar’The Madras High Court has issued an interim stay on the release of the film Vaa Vaathiyaar, starring #Karthi and produced by Studio Green.In a case filed by Arjunlal Sundardas against Gnanavel Raja, the court ordered that the film should not be… pic.twitter.com/tOo456lm1I— Movie Tamil (@_MovieTamil) December 4, 2025
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు. మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే. గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్లో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.ఈ నేపధ్యంలోనే నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్గా మారింది. మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది. అలాగే ఫిట్నెస్ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.ఇప్పటికీ సమంత కి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్ నుంచి రిలేషన్స్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది. విడాకుల తరువాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్ అట్రాక్షన్గా మారింది. సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది. ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి.
బాలయ్య అఖండ-2.. తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరల పెంపు
బాలయ్య మూవీ అఖండ-2 సినిమా టికెట్ల పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే ఏపీలో భారీగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించగా.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అనుమతులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.100 ఒక్కో టికెట్పై పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడు రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 4న ప్రదర్శించే ప్రీమియర్స్కు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ ఒక్క షోకు ఏకంగా రూ.600 వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా ఇష్టమొచ్చినట్లుగా టికెట్ ధరలకు అనుమతులు ఇవ్వడంపై సగటు సినీ ప్రియులు మండిపడుతున్నారు. ఏపీలో భారీగా ధరల పెంపు.. ఏపీలో ఇప్పటికే అఖండ-2 మూవీ టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. సింగిల్స్ స్క్రీన్స్లో రూ.75, మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు.. ఏకంగా రూ.600 లుగా టికెట్ ధరలను నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సగటు సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'పుష్ప' ఘటన.. 'శ్రీతేజ్' గురించి మాట్లాడిన బన్ని వాస్
‘పుష్ప2’ సినిమా ప్రీమియర్స్ నాడు జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ గురించి తాజాగా నిర్మాత బన్ని వాస్ మాట్లాడారు. ప్రస్తుతం అతని కుటుంబానికి అందుతున్న సాయం గురించి ఆయన చెప్పుకొచ్చారు. 'ఈషా' సినిమా గ్లింప్స్ విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.శ్రీతేజ్కు అందుతున్న సాయం గురించి బన్నివాస్ను మీడియా ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు. బాబు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. దిల్రాజు వంటి ఇతర పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉంచాలి..? ఆస్పత్రి ఖర్చుల కోసం ఎంత ఉపయోగించాలి..? వారి కుటుంబం నెలవారీ ఖర్చులకు ఎంత అవసరం వంటి వాటిపై వ్యవస్థీకృతంగా ఒక విధానం నడుస్తోంది. బాబు కోసం ఇచ్చిన డబ్బు సరిపోకపోవడం వంటి అంశపై ఏమైనా మాట్లాడాలంటే వాళ్లు వచ్చి మాతో మాట్లాడవచ్చు. మావైపు నుంచి ఏవైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీతేజ్ విషయం చర్చించడానికి మధ్యలో పెద్దలు ఉన్నారు. వారి సమక్షంలోనే మంచి చేస్తాం. అని అన్నారు.
సినిమా
బేబీ కాంబో ఎపిక్
జపాన్ లోకి ఎంట్రీ ఇస్తోన్న పుష్పరాజ్
ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
Andhra King Taluka: సినిమా హిట్టే... మరీ ఏంటి ఇది?
సమంత, నాగ చైతన్య, శోభిత కలిసి నటించారా..! ఆ సినిమా ఏదంటే..?
కాంతార కాంట్రవర్సీకి చెక్.. సారీ చెప్పిన రణవీర్ సింగ్
Samantha Ruth Prabhu: వివాహ బంధం ఎలా స్టార్ట్ అయిందంటే
సమంత రెండో పెళ్లి ఫోటోలు వైరల్..
Coimbatore: 30 మంది అతిథుల సమక్షంలో.. సమంత రెండో పెళ్లి!!
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత
