Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tamil Director V Sekar Passed Away at 721
చిత్రపరిశ్రమలో విషాదం.. దర్శకుడు కన్నుమూత

సాక్షి, చెన్నై: సీనియర్‌ దర్శకుడు వి.శేఖర్‌ (72) శుక్రవారం సాయంత్రం చైన్నెలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈయన స్వగ్రామం తిరువణ్ణామలై సమీపంలోని నెయ్‌ వానత్తం. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసిన వి.శేఖర్‌ సినిమాలపై ఆసక్తితో ఎడిటర్‌ లెనిన్‌ వద్ద కొంత కాలం పని చేశారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్‌ శిష్యుడు గోవిందరాజ్‌ వద్ద చేరి కన్ను తొలక్కనుమ్‌ సామి చిత్రానికి సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్‌ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. సినిమా1990లో నిళల్గళ్‌ రవి హీరోగా నటించిన 'నీంగళుమ్‌ హీరోదాన్‌' అనే మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. తరువాత అదే నిళల్గళ్‌ రవిని హీరోగా పెట్టి నాన్‌ పుడిచ్చ మాప్పిళై మూవీ తీశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో మామగారు పేరుతో రీమేక్‌ అయింది. దాసరి నారాయణరావు, వినోద్‌ కుమార్‌, యమున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత పలు కుటుంబ కథా చిత్రాలను రూపొందించారు.అవయవదానంనిర్మాతగానూ కొన్ని హిట్‌ చిత్రాలను నిర్మించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వీ.శేఖర్‌ స్థానిక పోరూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. స్థానిక కోడంబాక్కమ్‌, సుబ్బరాయన్‌ నగర్‌లోని సామియార్‌ మఠంలో నివసిస్తున్న ఈయనకు భార్య తమిళ్‌ సెల్వి, కూతురు మలర్‌కొడి, కొడుకు కారల్‌ మార్క్స్‌ ఉన్నారు. దర్శకుడు వి.శేఖర్‌ అవయవ దానం చేశారు. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని శనివారం ఇంటికి తీసుకు వచ్చారు. వి.శేఖర్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.చదవండి: కోర్టు హీరోయిన్‌కు తమిళ్‌లో మరో ఛాన్స్‌

Nikhil Nair eliminated in Bigg Boss 9 Telugu and remuneration details2
'బిగ్‌బాస్‌' నుంచి నిఖిల్‌ ఎలిమినేట్‌.. భారీగానే రెమ్యునరేషన్‌

బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాక్‌ ఇచ్చారు. వాస్తవంగా ఆదివారం ఎపిసోడ్‌లోనే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. కానీ, ఈసారి కంటెస్టెంట్స్‌కు షాకిస్తూ శనివారం ఎపిసోడ్‌లోనే ఒకరిని ఎలిమినేట్‌ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఆపై ఆదివారం ఎపిసోడ్‌లో మరోకరు ఎలిమినేట్‌ అవుతారని చెప్పారు. ఈ వారంలో 10 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎలిమినేషన్‌ దెబ్బ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది. ఫైనల్‌గా తక్కువ ఓట్లు తెచ్చుకుని నిఖిల్ ఎలిమినేట్‌ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్‌లో గౌరవ్‌ ఎలిమినేట్‌ కావచ్చని తెలుస్తోంది.అక్టోబర్‌ 12న వైల్డ్‌ కార్డ్‌గా హౌస్‌లో నిఖిల్‌ నాయర్‌ బిగ్ బాస్‌ హౌస్‌లోకి వచ్చారు. అయితే, అతడికి వారానికి రూ.2.5 లక్షల మేరకు రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకుగానూ రూ.12.5 లక్షల మేరకు సంపాదించాడు. అతనికి తెలుగు బుల్లితెరపై మంచి ఫేమ్‌ ఉండటంతో రెమ్యునరేషన్‌ బాగానే ఇచ్చారు. గృహలక్ష్మి సీరియల్‌లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ప్రతి ఒక్కరినీ అలరించారు.నిఖిల్‌ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి రాగానే నాగార్జున ప్రశంసించారు. చాలా బాగా ఆడావ్ అంటూ అతని ఆట తీరును ప్రశంసించారు. హౌస్‌మేట్స్ అందరిలో నీకు నచ్చని విషయం ఏమైనా ఉంటే చెప్పాలని నాగ్‌ కోరడంతో నిఖిల్‌ ఇలా చెప్పాడు. తనూజలో ఏడుపు, రీతూలో కన్ఫ్యూజన్, దివ్యలో ఓవర్ కమాండింగ్, భరణిలో సైలెన్స్ తనకు నచ్చవని సింపుల్‌గా చెప్పేశాడు.

Court movie actress Sridevi gets second movie chance in Kollywood3
'కోర్టు' నటి శ్రీదేవికి తమిళ్‌ మరో ఛాన్స్‌

టాలీవుడ్‌లో'కోర్ట్' సినిమాతో నటి శ్రీదేవి పాపులర్‌ అయిపోయింది. అదే ఊపులో తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే సొంతంగా కారు కూడా కొనుక్కుంది. తమిళంలో కేజేఆర్ అనే నటుడు, నిర్మాత తీయబోతున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని కథానాయికగా ఇప్పటికే ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రభుదేవా సహా పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు మన శ్రీదేవి తమిళ్‌లో రెండో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.కోలీవుడ్‌లో వైవిధ్య భరిత కథాచిత్రాలను నిర్మిస్తున్న సంస్థ విజన్‌ సినిమా హౌస్‌. ఈ సంస్థ అధినేతలు డాక్టర్‌ అరుళానందు, మ్యాథ్యు అరుళానందు ప్రతిభావంతులైన నటీనటులను, సాంకేతిక వర్గాన్ని ప్రోత్సహించే విధంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు శ్రీదేవికి వారు సినిమా ఛాన్స్‌ ఇచ్చారు. ఇదే బ్యానర్‌ నుంచి నిర్మించిన జో చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నటుడు 'ఏగన్‌'(Aegan)ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ శీను రామస్వామి దర్శకత్వంలో కోళి పన్నై చెల్లదురై అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించి సక్సెస్‌ తో పాటు ప్రశంసలను అందుకున్నారు.తాజాగా తమ మూడో చిత్రాన్ని నిర్మించడానికి వారు సిద్ధమయ్యారు. ఇందులో జో, కోళిపన్నై చెల్లదురై చిత్రాలతో పాపులర్‌ అయిన నటుడు ఏకన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా ఇందులో కోర్ట్‌ ఫేమ్‌ శ్రీదేవి, మలయాళ చిత్రం బ్రూస్‌ లీ బిజీ ఫెమ్‌ ఫెమినా జార్జ్‌ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆహా కళ్యాణం చిత్రం ఫేమ్‌ యువరాజ్‌ చిన్నస్వామి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Mahesh Babu Speech About Varanasi Movie At Globe Trotter Event4
‘వారణాసి’ చూసి యావత్‌ దేశం గర్వపడుతుంది: మహేశ్‌ బాబు

నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ పాత్ర పోషించాడు. గ్లోబ్‌ ట్రాటర్‌ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో శనివారం ఈ మూవీ టైటిల్‌తో పాటు స్పెషల్‌ వీడియోని రిలీజ్‌ చేశారు.ఈ సందర్భంగా మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్‌ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈ ఈవెంట్‌ కేవలం టైటిల్‌ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్‌) సపోర్ట్‌ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్‌ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్‌ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Mahesh Babu as Lord Rama In Varanasi Movie5
'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. బయటపెట్టిన రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోని 'గ్లోబ్ ట్రాటర్'లో ప్రసారం చేశారు. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ ఉండగా.. అభిమానులు దీన్ని చూసి మైమరిచిపోయారు. ఇదే అనుకుంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబు శ్రీరాముడిగా నటించారని చెప్పి రాజమౌళి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 60 రోజుల పాటు రాముడి ఎపిసోడ్ చిత్రీకరించామని చెప్పారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు 'వారణాసి'.. 2027 వేసవిలో రిలీజ్)'తొలిరోజు ఫొటోషూట్‌లో మహేశ్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫొటోలు తీశాం. అయితే మహేశ్, కృష్ణుడి పాత్రకు బాగా సూట్ అవుతాడని అనుకున్నా. కానీ ఆ రోజు మహేశ్.. నా అంచనా తప్పు అని నిరూపించాడు. దీంతో మహేశ్ రాముడి గెటప్ ఫొటోని నా వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. కానీ ఎవరు చూసేస్తారేమో అనుకుని దాన్ని తీసేశాను. రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. మహేశ్‌ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ తీస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రాముడి ఎపిసోడ్‌ని 60 రోజుల పాటు తీశాం. రీసెంట్‌గానే అది పూర్తయింది. ఇందులో చాలా సబ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్.. నాకు, మహేశ్ కెరీర్‌లోనే మర్చిపోలేని సీక్వెన్స్' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 30 నిమిషాల ఫైట్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్)

Mahesh Babu Varanasi Movie Video6
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమా వీడియో రిలీజ్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు సాగిన ఈ వీడియో అద్భుతమనే రేంజులో ఉంది. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ మతిపోగొట్టేలా కనిపించాయి.వారణాసి 512సీఈ నుంచి మొదలుపెట్టి.. ఆస్టరాయిడ్ శంభవి 2027సీఈ.. అంటార్కిటికా ఆఫ్రికా.. ఉగ్రభట్టి గుహ.. లంకా నగరం త్రేతాయుగం.. వారణాసి మణికర్ణిక ఘాట్.. అంటూ చూపించారు. చివర్లో మహేశ్ బాబు ఎద్దుపై స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలంతో కనిపించారు. చివరలో 'వారణాసి' అనే టైటిల్ పడింది. 3 నిమిషాల 40 సెకన్ల వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా సరే విజువల్ వండర్ అనేలా తీర్చిదిద్దారు.

Mahesh Babu Varanasi Movie Release Date7
మహేశ్ బాబు 'వారణాసి'.. 2027లో రిలీజ్

మహేశ్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ ఒక్క అప్‌డేట్ కూడా రిలీజ్ చేయలేదు. మిగతా యాక్టర్స్ నుంచి కూడా ఒక్కటి కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఎత్తున హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. సినిమా గురించి డీటైల్స్ బయటపెట్టారు.ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మూవీ టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి కూడా చాలా మాట్లాడారు. పనిలో పనిగా మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా చూచాయిగా బయటపెట్టారు.'మహేశ్ బాబు ఫ్యాన్స్.. మీ అందరి హృదయాల్లో పర్మినెంట్‌గా ఉండిపోటానికి ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండోవర్ చేసేసాడు. ప్రొడ్యూసర్ హ్యాపీ. డైరెక్టర్ హ్యాపీ. టైల్స్ ఏత్తన్నారు. మెలోడీ నాదే బీటు నాదే. సమ్మర్ 2027కి గృహప్రవేశం' అని కీరవాణి చెప్పుకొచ్చారు.కీరవాణి చెప్పడమైతే చెప్పారు గానీ 2027 వేసవిలోనే కచ్చితంగా రిలీజ్ అవుతుందా అంటే సందేహమే. ఎందుకంటే రాజమౌళి తీసే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా పలు కారణాల వల్ల ఆలస్యం కావడం, ముందు అనుకున్న విడుదల తేదీ వాయిదా పడటం తెలిసిందే. మరి ఈసారైనా కీరవాణి చెప్పినట్లు 2027 వేసవిలోనే వస్తారా లేదా అనేది చూడాలి?

Vijyendra Prasad About Varanasi Movie Mahesh Action Sequence8
30 నిమిషాల ఫైట్ సీక్వెన్స్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్

దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు మొన్నటివరకు బయటపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ అనేసరికి అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. ప్రస్తుతం వేలాదిమంది సమక్షంలో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మూవీ గురించి, మహేశ్ యాక్టింగ్ గురించి కూడా అద్భుతమైన అప్‌డేట్ వచ్చేసింది.'వారణాసి' కథని రాసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా తాలూకు 30 నిమషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను. అందులో సీజీ లేదు, బీజీఎం లేదు, అయినా కానీ మహేశ్ బాబుని అలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను మంత్రంతో కట్టి పడేసింది. మీరు కూడా అనుభూతి పొందుతారు. మహేశ్ తాలూకు విశ్వరూపం చూసి షాక్ అవుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కానీ కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నారు. ఏం చేయాలో చెబుతూ ఉన్నారు' అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.30 నిమిషాల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా ఇది క్లైమాక్స్ అయి ఉండొచ్చు. విజయేంద్రప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కొంతమేర తీశారు. కాకపోతే దీనికి సీజీ, గ్రాఫిక్స్, బీజీఎం లాంటివి జోడిస్తే ఏ రేంజులో ఉంటుందోనని అభిమానులు అ‍ప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.

Suma Globe Trotter Video And Ashika Latest News9
సుమ 'గ్లోబ్ ట్రాటర్' ప్రిపరేషన్ వీడియో.. రాజకుమారిగా ఆషిక

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ప్రిపరేషన్ వీడియోతో సుమరాజకుమారిగా ఆకట్టుకునేలా ఆషికా రంగనాథ్చుడీదార్‌లో మరింత అందంగా అనుపమ పరమేశ్వరన్దుబాయిలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పార్టీ మూడ్మేకప్ లేకుండానే గ్లామరస్‌గా రుక్మిణి వసంత్బ్లాక్ డ్రస్సులో మరింత హాట్‌గా బిగ్‌బాస్ దివి View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Divi (@actordivi)

iBomma Operator Immadi Ravi Arrest Latest Update10
'ఐ-బొమ్మ' రవి అరెస్ట్‌.. పోలీసుల చేతిలో కీలక ఆధారాలు!

పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ(iBomma ) నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో రవి(Immadi Ravi)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టుకి తరలించారు. రవి నుంచి వైరసీ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. రవి ఆంధప్రదేశ్‌లోని వైజాగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్‌లో అతడి ఫ్లాట్‌ నుంచి హార్డ్‌ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను హోల్డ్‌ చేసినట్టు సమాచారం. రవిని అదుపులోకి తీసుకొని విచారించగా..సంచలన విషయాలు బయటపడ్డాయట. పైరసీ వెబ్‌సైట్‌ని రన్‌ చేస్తున్న మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంతమందిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్‌ యాంటీ పైరసీ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్‌ నిర్వాహకులు పోలీసులకు సవాలు విసిరారు. ఆ ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement