Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Gayatri Bhargavi Says Rajeev Kanakala Was Her First Crush1
అసలు అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!

సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన గాయత్రి భార్గవి.. తర్వాత తెలుగులోనూ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. లేటెస్ట్‌గా ఈమె.. 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే వెబ్ సిరీస్ చేసింది. జీ5 ఓటీటీలో ఇది ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రీమియర్ ఈవెంట్ జరగ్గా, ఇందులో మాట్లాడిన నటి గాయత్రి భార్గవి.. నటుడు రాజీవ్ కనకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈయనే నాకు తొలి క్రష్ అని అప్పటి సంగతులని గుర్తుచేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'ఈ అమ్మాయి టీవీకి పనికొస్తుందని అప్రూవ్ చేసింది రాజీవ్ కనకాల ద్వారానే. నాకు బాగా గుర్తు. ఓసారి రాజీవ్, బెన్నం ఓ బైక్‌పై.. నా కాలేజీకి వచ్చారు. నా ఫొటో, నన్ను చూసి వెళ్లిపోయారు. కట్ చేస్తే కొన్నాళ్లకు ఓ యాడ్‌లో నటించే అవకాశం దక్కింది. అప్పటినుంచి రాజీవ్ నాకు తెలుసు. ఈయనే నాకు ఫస్ట్ క్రష్. మేం దూరదర్శన్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చూసిన రాజీవ్.. మా అందరికీ మొదటి క్రష్. అందుకే సుమ అక్క, రాజీవ్ బావగారు అంటాం. అసలు అన్న గిన్న అని మేం పిలవం' అని గాయత్రి భార్గవి చెప్పుకొచ్చింది.అయితే గాయత్రి భార్గవి చెబుతున్నప్పుడు రాజీవ్ కనకాల తెగ సిగ్గుపడిపోయాడు. పక్కనే ఉన్న ఉదయభానుతో సహా అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు. ఇక సిరీస్ విషయానికొస్తే.. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. నటి వాసంతిక టైటిల్ రోల్ చేసింది. రాజీవ్ కనకాల.. ఈమెకు తండ్రిగా నటించాడు. కనిపించకుండా పోయిన కూతురిని వెతికేందుకు తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ఏమైందనే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకప్పటి యాంకర్ ఉదయభాను.. పోలీస్ పాత్ర చేయడం విశేషం.(ఇదీ చదవండి: నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య)

Vijay devarakonda and rashmika age gap2
విజయ్‌ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే..?

టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి తొలిసారి స్పందించారు. తమ బంధం గురించి అభిమానులు పెట్టిన 'విరోష్‌' పేరును గౌరవిస్తున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫ్యాన్స్‌ తమలో ఒక భాగం అంటూ.. వారి కోరిక మేరకు పెళ్లి కార్యక్రమానికి వెడ్డింగ్‌ ఆఫ్‌ విరోష్‌ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, వారిద్దరి వయసు గురించి కొందరు కామెంట్లు చేస్తుండగా... అభిమానులే కౌంటర్‌ ఇస్తున్నారు. వాస్తవంగా ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్‌ గ్యాప్‌ లేదనే విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ (36), రష్మిక(30)ల మధ్య సుమారు ఆరేళ్ల గ్యాప్‌ ఉంది. విజయ్‌​ 1989లో జన్మించగా.. రష్మిక 1996లో జన్మించారు. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెద్దగా ఏజ్‌ గ్యాప్‌ కనిపించదు. దీంతో వారిద్దరిది సరైన జోడీ అంటూ ఫ్యాన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి సుమారు రూ. 80 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తను ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటారని టాక్‌. రష్మికకు సంబంధించి సుమారు రూ. 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తను ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటుందని సమాచారం.గీత గోవిందం మూవీతో పరిచయమైన ఈ జోడీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆపై ‘డియర్‌ కామ్రేడ్‌’ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వారి వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్‌లో మార్చి 4న వివాహ రిసెప్షన్‌ కార్యక్రమం జరగనుంది.

 Tamil Actress Vishnu Priya Father No More3
నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య

తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ(73) హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది. కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అలానే మృతుడి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరం లాంటి విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యారు.సూర్యనారాయణ.. కొడైక్కెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈయనకు అక్కడే ఓ పెద్ద బంగ్లా కూడా ఉంది. అందులో ఆరుముగం, మురళి అనే ఇద్దరు పనివాళ్లు కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం విహారయాత్ర కోసం అని వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. దగ్గరలో బసకు దిగారు. శనివారం రాత్రి, బంగ్లా దగ్గరకు వచ్చిన వ్యక్తులు.. పనిమనుషులని చితకబాదారు. తర్వాత సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు.సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్ట్ డిస్క్‌లు తీసుకుని పరారయ్యారు. కాగా సూర్య 'మాయావి' సినిమాలో సహాయ నటిగా చేసిన విష్ణుప్రియ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. 2018లో ఈమెని ప్రేమించిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు సూర్యనారాయణ హత్యకు.. అప్పటి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Triptii Dimri Turns 32 Years: Know about this Actress4
లైఫే టర్నయ్యిందిలే బుల్బుల్‌ పిట్ట!

టాలెంట్‌ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. కొందరికి ఫస్ట్‌ సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ వస్తుంది. మరికొందరికి ఏళ్లు గడిచాక గుర్తింపు దక్కుతుంది. హీరోయిన్‌ తృప్తి డిమ్రి రెండో కోవకు చెందుతుంది. నేడు (ఫిబ్రవరి 23న) ఈ బ్యూటీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..అనుకోకుండా సినిమాల్లోకి..హీరోయిన్‌ తృప్తి డిమ్రి ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో 1995 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి దినేష్‌ డిమ్రి ఎయిరిండియా ఉద్యోగి. తల్లి గృహణి. తృప్తి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ఆమె సోదరుడి స్నేహితుడు ఫోటోగ్రాఫర్‌. ఒకరోజు ఈమె ఫోటోలు తీసి ఢిల్లీలోని ఇమేజెస్‌ బజార్‌కు పంపించాడు. ఆ ఫోటోలు వారికి నచ్చడంతో ఫోటోషూట్‌కు పిలిపించారు. అలా తృప్తి జర్నీ మొదలైంది. తండ్రి కోరిక నెరవేర్చేందుకుమొదట్లో యూట్యూబ్‌ ఛానల్‌లో పని చేసింది. అక్కడే కెమెరాకు అలవాటు పడటం నేర్చుకుంది. నిజానికి తృప్తి తండ్రికి యాక్టర్‌ అవ్వాలని కోరికట.. దీంతో తండ్రి కోరికను తాను నెరవేర్చాలనుకుంది. బుల్లితెరపై అయినా నటిస్తే చాలనుకుని మొదట్లో మోడలింగ్‌ చేసింది. అక్కడ మంచి పేరు రావడంతో నటి అవ్వాలన్న ఆశతో ముంబైలో అడుగుపెట్టింది. అయితే నటిని అవుతా అని ఇంట్లో చెప్పగానే కుటుంబంసభ్యులు కొంచెం కంగారుపడ్డారట. అవకాశాలు లేనప్పుడు..పైగా బంధువులు కూడా.. ఆమె ఇండస్ట్రీకి వెళ్తే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరు అని భయపెట్టారు. అయినా ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవకాశాలు రాని సమయంలో బాధపడింది. కానీ, వెనకడుగు మాత్రం వేయలేదు. అలా మామ్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ 2017లో పోస్టర్‌ బాయ్స్‌ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ మరుసటి ఏడాది వచ్చిన లైలా మజ్నులోని లైలా పాత్రలో ప్రేక్షకులకు దగ్గరైంది. యూత్‌ క్రష్‌2020లో వచ్చిన హారర్‌ మూవీ బుల్బుల్‌తో ఓటీటీ స్టార్‌గా మారింది. ఆ మూవీ తర్వాత తన దశ తిరిగిపోయింది. 2023లో వచ్చిన సందీప్‌రెడ్డి వంగా యానిమల్‌ సినిమాతో నేషనల్‌ వైడ్‌ గుర్తింపు తెచ్చుకుంది. యూత్‌ అందరికీ క్రష్‌గా మారిపోయింది. బ్లాక్‌బస్టర్‌ మూవీ భూల్‌ భులయ్యా 3లో ద్విపాత్రాభినయం చేసింది. ప్రస్తుతం హిందీలో మా బెహెన్‌, తెలుగులో ప్రభాస్‌ సరసన స్పిరిట్‌ సినిమా చేస్తోంది. తెలుగులో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం!చదవండి: ఫుడ్డుతో చంపేస్తున్న ప్రభాస్‌.. ఏ హీరోయిన్‌కు పంపాడంటే?

Upcoming OTT Movies Telugu Streaming February Last Week 20265
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

2026 మొన్నే వచ్చినట్లుంది. కానీ అప్పుడే ఫిబ్రవరి చివరకొచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి శ్రీ విష్ణు నుంచి 'విష్ణు విన్యాసం' అనే కామెడీ సినిమా రానుంది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి. హిందీలో 'ద కేరళ స్టోరీ 2' ఈ వీకెండ్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ చిత్రాలే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. నవీన్ చంద్ర 'హనీ', 'అక్యూజ్డ్' అనే డబ్బింగ్ మూవీతో పాటు డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఇదే వీకెండ్ రిలీజయ్యే అవకాశముంది. ఇవి కాకుండా ఏమైనా సర్‌ప్రైజు స్ట్రీమింగ్స్ ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వస్తుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు)నెట్‌ఫ్లిక్స్అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్ద సీఈఓ క్లబ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23పాల్ మెక్‌కర్ట్‌నే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 25ద బ్లఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 25ఇక్కీస్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 26హాట్‌స్టార్ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26సంగ్ మర్మర్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 26రోస్లిన్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహాసర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఎమ్ఎక్స్ ప్లేయర్సైకో సయ్యాన్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 25ఆపిల్ టీవీ ప్లస్మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27(ఇదీ చదవండి: 'రంగస్థలం' సినిమా.. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా ఇవ్వలేదు)

The Paradise Aaya Sher Song Promo out now6
నాని 'ది ప్యారడైజ్‌' టైటిల్‌ సాంగ్‌ ప్రోమో

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్‌’ నుంచి టైటిల్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది. ఆయా షేర్‌... అంటూ వందలాదిమంది డ్యాన్సర్లతో నాని వేసిన స్టెప్పులకు అదిరిపోయేలా అనిరుధ్ రవిచందర్ సంగీతం ఉంది. కాసర్ల శ్యామ్ కుమార్ రచించిన ఈ పాటను అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఫిబ్రవరి 24న పూర్తి సాంగ్‌ను విడుదల చేస్తామని ప్రోమోలో ప్రకటించారు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మోహన్‌బాబు, సంపూర్ణేశ్‌బాబు, రాఘవ్‌ జుయల్, సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌, స్పానిష్‌లో ఆగష్టు 21న ఈ మూవీ విడుదల కానుంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని ఒక ప్రేత్యకమైన గెటప్‌లో కనిపించనున్నారు. మొదటి సాంగ్‌ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు ఇప్పటికే తెలిపాయి.

Prabhas Gives Food Treat to Fauzi Movie Actress Imanvi7
హీరోయిన్‌ కోసం ప్రభాస్‌ స్పెషల్‌ ట్రీట్‌

డార్లింగ్‌ ప్రభాస్‌ భోజనప్రియుడు. ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. తను తినడమే కాదు చుట్టూ ఉన్నవారికి సైతం ఫుడ్డు పెట్టి చంపేస్తాడు. ఎక్కడ షూటింగ్‌ ఉన్నా సరే ఇంటి నుంచి తెప్పించి మరీ తోటి నటీనటులకు, చిత్రయూనిట్‌కు భోజనం తినిపిస్తాడు. కొన్నిసార్లు అందరి కోసం ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుంటాడు. అలా ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఏకంగా చెన్నై నుంచి ముంబైకి భోజనం తెప్పించాడు.హీరోయిన్‌ కోసం స్పెషల్‌ ఫుడ్‌తాజాగా ఫౌజీ హీరోయిన్‌ ఇమాన్వికి ఇలాగే ఫుడ్‌ ట్రీట్‌ ఇచ్చాడు. స్టార్టర్‌ దగ్గరినుంచి బిర్యానీ, స్వీట్స్‌ వరకు.. అన్నింటినీ పార్శిల్‌ చేసి పంపించాడు. వాటిన్నింటినీ టేబుల్‌ ముందు పెట్టుకున్న ఇమాన్వి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇంత రుచికరమైన భోజనం పంపింనందుకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెప్పింది.సినిమాఫౌజీ విషయానికి వస్తే.. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. సీతారామం ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 దసరాకి విడుదల కానుంది.చదవండి: బాఫ్టా అవార్డులు.. తొలిసారి భారత్‌ మూవీకి అవార్డ్‌

Prabhas Effect on Couple Friendly movie Collection8
చిన్న సినిమా కలెక్షన్స్‌పై ప్రభాస్‌ ఎఫెక్ట్‌.. వీడియో వైరల్‌

ప్రభాస్‌ ఎంత బిజీగా ఉన్నా సరే తన వారికోసం సమయం కేటాయిస్తాడు. ప్రభాస్‌కు హిట్‌ ఇచ్చిన ‘వర్షం’ డైరెక్టర్‌ శోభన్‌ గుర్తున్నారు కదా.. ఇప్పుడు ఆయన కుమారుడు సంతోశ్‌ నటించిన కొత్త చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ విడుదలైంది. ఆయన మీద గౌరవంతో ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మూవీని ప్రమోట్‌ చేశారు. చిత్ర యూనిట్‌తో ఏకంగా గంట పాటు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తనోక స్టార్‌ హీరో అనే విషయాన్ని కూడా డార్లింగ్‌ పక్కన పెట్టేశాడు. తనకు తొలి విజయాన్ని అందించిన దర్శకుడి కుమారుడు ఎదురుగా కనిపించడంతో ఒక హగ్‌ ఇస్తావా అంటూ అభిమానాన్ని చాటుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.ప్రభాస్‌ దెబ్బతో ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ బ్రేక్‌ ఈవెన్‌సంతోశ్‌ శోభన్‌ - మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’.. దర్శకుడు అశ్విన్‌ చంద్రశేఖర్‌ తెరకెక్కించిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో పి.అజయ్‌ కుమార్‌ రాజు నిర్మించారు. సుమారు రూ. 7 కోట్ల బడ్జెట్‌తో పూర్తి అయిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే రూ. 6.80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుంది. ప్రాస్‌ ఇంటర్వ్యూ తర్వాత ఈ సినిమాకు మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ వీకెండ్‌లో చాలా థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. తెలంగాణలో 400 షోలు, ఆంధ్రాలో 600 షోలు, కర్ణాటకలో 125 షోలు ప్రదర్శించినట్టు ట్రేడ్ రిపోర్ట్. అయితే, ప్రభాస్‌ ఇంటర్వ్యూ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. ఫైనల్‌గా ఈ మూవీ భారీ లాభాలను తెచ్చిపెడుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చూసి ఆ ఫీల్‌ నుంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ (Prabhas) అన్నారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు మరో స్థాయిలో ఉందని ప్రశంసించారు. హీరో సంతోశ్‌ శోభన్‌ అడిగిన వెంటనే అతడికి ఫోన్‌ నంబరు ఇచ్చారు ప్రభాస్‌. తనకు ‘వర్షం’ సినిమాలా.. సంతోశ్‌కి ఈ మూవీ గుర్తుండిపోయేలా అవుతుందని డార్లింగ్‌ చెప్పారు. View this post on Instagram A post shared by ֆʊɖɦɛɛʀ (@_sai_rebel_45)

Amitabh Bachchan regrets Missing Sunday Meet at Jalsa, shares Emotional Note9
అమితాబ్‌ను చూసేందుకు ఒక్కరూ రాలేదా?

ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటి బయటకు వచ్చి అభిమానులను పలకరిస్తుటాడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తనకోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కనిపించడం, పలకరించడం తన కర్తవ్యం అని భావిస్తాడు. అయితే నిన్న (ఫిబ్రవరి 22) మాత్రం అమితాబ్‌ ఇంటి నుంచి బయటకే రాలేదు.కనిపించని అభిమానులుఅందుకు గల కారణాన్ని అమితాబ్‌ తాజాగా తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు. పనెప్పుడూ ఉత్సాహంతోనే సాగుతుంది. కానీ, అది పూర్తవకముందే రోజు ముగుస్తుంది. ఇంతలోనే విరామం, విశ్రాంతి తీసుకునేందుకు ఆదివారం వస్తుంది. దుదరదృష్టవశాత్తూ ఈ ఆదివారం జల్సా (బిగ్‌బీ ఇంటి పేరు) గేటు ముందు ఎవరూ లేరు. కాబట్టి మీరు కూడా ఎవరూ దూర ప్రయాణాలు పెట్టుకోకండి, మీ శక్తిని ఆదా చేసుకోండి.అదేంటి?తర్వాత మనం మళ్లీ కలుద్దాం. అప్పటివరకు ఈ నిశ్శబ్ధపు ఆలోచనల్లోనే ప్రేమను పంచుకుందాం అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. అమితాబ్‌ను చూసేందుకు ఎవరూ రాకపోవడమేంటి? ఆయన చరిష్మా తగ్గిపోయిందా? అని కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా హీరోగా రాణిస్తున్న అమితాబ్‌.. చివరగా వేట్టైయాన్‌ సినిమాలో కనిపించాడు. 120 బహదూర్‌ మూవీకి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. అలాగే రామాయణ: పార్ట్‌ 1లో జటాయు పాత్రకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నాడు.చదవండి: ధోతి స్టైల్‌లో హీరోయిన్‌ డ్రెస్‌.. ధరెంతంటే?

Actress Manju Warrier Meet With Ajit10
అజిత్‌ను కలిసిన మంజువారియర్‌

నటుడు అజిత్‌ ఇప్పుడు కార్‌ రేస్‌లపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొన్న ఈయన త్వరలో మరో కార్‌ రేస్‌లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం దుబాయ్‌లో శిక్షణ తీసుకుంటున్న అజిత్‌ను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మంజువారియర్‌ అజిత్‌ను కలిశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ మలయాళ సంచలన నటి ధనుష్‌ హీరోగా నటించిన అసురన్‌ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత అజిత్‌ హీరోగా నటించిన తుణివు చిత్రంలో నాయకిగా నటించారు. అదేవిధంగా రజనీకాంత్‌కు జంటగా వేట్టయన్‌ చిత్రంలోనూ నటించారు. ప్రస్తుతం మిస్టర్‌ ఎక్స్‌ చిత్రంలో నటిస్తున్నారు. అజిత్‌ ఇంతకు ముందు నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. త్వరలో తన నూతన చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా క్రేజీ స్టార్‌ శ్రీలీల ఈ చిత్రంలో నటింనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో మంజువారియర్‌ మరో ముఖ్యపాత్రలో నటించనున్నారా? అనే ప్రశ్నకు తావిచ్చే విధంగా ఆమె అజిత్‌ను కలసిని సంఘటన చెబుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అజిత్‌ నటించనున్న 64వ చిత్రం ఆయన ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా చాలా ఫ్రెష్‌గా ఉంటుందని దర్శకుడు ఆధిక్‌ రవిచంద్రన్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement