Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Director Maruthi Says I was Get Emotional At The Raja Saab Release Day1
సినిమా చూడలేకపోయా.. ఏడ్చేశా : ‘ది రాజాసాబ్‌’ డైరెక్టర్‌

ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్‌’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 201 కోట్లు కలెక్షన్స్‌ సాధించింది. సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూస్‌ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌కి నైజాంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్‌షోకి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా అనుమతి లభించింది. అర్థరాత్రి వరకు జీవీ రాకపోవడంతో..నైజాం ఏరియాలో ప్రీమియర్స్‌ పడలేదు. మీడియా కోసం హైదరాబాద్‌లోని విమల్‌ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా.. విషయం తెలిసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. గేట్లు బద్దలుకొట్టుకొని మరీ థియేటర్‌లోకి చొరబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి.. అందరిని బయటకు పంచింపిన తర్వాత అర్థరాత్రి 12.45 గంటలకు మీడియాకు షో వేశారు. ఈ విషయం తెలిసి చాలా టెన్షన్‌ పడ్డారట సినిమా దర్శకుడు మారుతి. ఒకవైపు ప్రీమియర్స్‌ షోకి అనుమతి రాకపోవడం, మరోవైపు మీడియా షో ఆలస్యం అవ్వడంతో టెన్షన్‌ భరించలేక కారులో కూర్చొని ఏడ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే మీడియాతో చెప్పారు. రాజాసాబ్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మారుతి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా ది రాజాసాబ్‌ రిలీజ్‌ రోజు ఎలా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన మారుతి సమాధానం చెబుతూ.. ‘నా తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ రిలీజ్‌ రోజు చాలా ఏడ్చేశా. అప్పుడు నాకు ఎదురైన సవాళ్లను చూసి..ఇకపై ఇండస్ట్రీ వైపే రావొద్దనుకున్నా. అలాగే ది రాజాసాబ్‌ రిలీజ్‌ రోజు కూడా చాలా టెన్షన్‌ పడ్డాను. ఒకవైపు నైజాంలో ప్రీమియర్‌ షోకి అనుమతి రాలేదు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షోకి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున​ వచ్చారనే విషయం తెలిసింది. మీడియా వాళ్లు అర్థరాత్రి వరకు వేచి చూశారనే విషయం తెలిసి బాధపడ్డాను. టెన్షన్‌ తట్టుకోలేక కారులో కూర్చొని ఏడ్చేశా. ఫ్యాన్స్‌కి ప్రీమియర్‌ షో వేయలేకపోయామనే బాధతో నేను కూడా సినిమా చూడకుండానే వెళ్లిపోయాను’ అని మారుతి చెప్పుకొచ్చాడు.

Vk Naresh Comments About His Character In movies2
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అండర్‌వేర్‌తో రోడ్డుపై నడుస్తా: టాలీవుడ్ నటుడు

శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు.ఈ మూవీ రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఈ ప్రెస్‌ మీట్‌కు హాజరైన టాలీవుడ్ నటుడు వీకే నరేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఏ క్యారెక్టర్‌ అయినా నేను ఎలాంటి లిమిట్స్ పెట్టుకోనని వీకే నరేశ్ అన్నారు. క్యారెక్టర్‌కు గౌరవం ఇస్తానని.. అందరికీ నచ్చేలా చేయడమే నా పని అన్నారు. గుంటూరు టాకీస్‌లో బాత్‌రూమ్‌లో సీన్‌ పెట్టారు.. అందులో చాలా ఎమోషన్ ఉంది అందుకే ఆ క్యారెక్టర్ చేశానని తెలిపారు. క్యారెక్టర్‌ డిమాండ్ చేస్తే ఆండర్ వేర్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తానని వీకే నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా.. వీకే నరేశ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఒక నటుడిగా ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోను.. పాత్ర కోసం కావాలంటే ఆండర్ వేర్ తో రోడ్డు మీద నిల్చోమన్నా నేను రెడీ - నరేష్#Sharwanand #Samyuktha #SakshiVaidya #NariNariNadumaMurari #AnilSunkara pic.twitter.com/PAvkfJHXVf— Filmy Focus (@FilmyFocus) January 12, 2026

Tamil Nadu Youth Congress demands to ban on Parasakthi movie3
వివాదంలో శివ కార్తికేయన్ పొంగల్ మూవీ..!

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన పొంగల్ చిత్రం పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వ వహించారు. జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆది నుంచే వివాదాలు ఎదురయ్యాయి. రిలీజ్‌కు ముందు సెన్సార్‌ సమస్య ఈ సినిమా చివరికి అనుకున్న తేదీకే విడుదలైంది.తాజాగా ఈ మూవీ రిలీజ్‌ తర్వాత మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపించింది.చరిత్రను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. శివకార్తికేయన్‌ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు.. చరిత్రలో జరగని సంఘటనలతో రూపొందించారని అ‍న్నారు. ఈ మూవీలో వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయని తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. కాగా.. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Kriti Sanon at sister Nupur Sanon Hindu wedding in Udaipur4
గ్రాండ్‌గా సిస్టర్‌ పెళ్లి.. సందడి చేసిన ఆదిపురుష్ హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి ‍అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్‌ను పెళ్లాడింది. ఉదయపూర్‌లో జరిగిన వివాహ వేడుకలో కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.నుపుర్ సనన్ సినీ కెరీర్..నుపుర్‌ సనన్‌.. 'టైగర్‌ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్‌ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) Kriti Sanon walks sister Nupur down the aisle as she weds Stebin Ben in dreamy Christian & Hindu ceremonies!#kritisanon #stebin #nupursanon #marriage #ptcpunjabigold pic.twitter.com/hNpgUbEeFo— PTC Punjabi Gold (@PtcGold) January 12, 2026

The Raja Saab Box Office Collection Day 4 Details5
200 కోట్ల క్లబ్‌లో ‘ది రాజాసాబ్‌’

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్‌’మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ వద్ద మాత్ర భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే రూ. 112 కోట్లు వసూలు చేసిన ‘రాజాసాబ్‌’... నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మేరకు మేకర్స్‌ అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ రాబట్టడం చూసి ట్రేడ్‌ వర్గాలు షాకవుతున్నాయి. అయితే ప్రభాస్‌ స్థాయికి ఈ కలెక్షన్స్‌ తక్కువే కానీ.. పోటీలో చిరంజీవి లాంటి సినిమాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో రావట్టడం గొప్ప విషయం.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పిపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీడేస్ సీజన్ లో ఫస్ట్ వీక్ "రాజా సాబ్" హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

Mana Shankara Vara Prasad Garu Movie ticket Prices effect on collections6
'మన శంకర వరప్రసాద్ గారు' కాస్త తగ్గితేనే మంచిది

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ మూవీని చిత్ర నిర్మాతలు కూడా చాలా దూకుడుగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ డే రూ. 84 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ప్రకటించారు. సినిమా బాగుందని టాక్‌ రావడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, రెండు తెలుగురాష్ట్రాల్లో టికెట్‌ ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటు కలిసి థియేటర్‌కు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ది రాజా సాబ్‌ రీవర్షన్‌ చేయడంతో బాగుందని టాక్‌ వచ్చింది. ఆపై రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్‌లోకి వచ్చేసింది. సినిమా బాగుందని టాక్‌ కనిపిస్తోంది. జనవరి 14న మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి కూడా మంచి టాక్‌ వస్తే.. టికెట్‌ ధరలు తక్కువ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిన్న చిత్రాలవైపే మొగ్గు చూపే ఛాన్స్‌ ఉంది. టికెట్‌ ధరలు తగ్గిన తర్వాత మన శంకర వర ప్రసాద్ గారు చూద్దాంలే అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతలో పండగ సందడి ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరిపనుల్లో వారు పడిపోవడం సహజం. చిరు సినిమాకు మంచి టాక్‌ ఉంది కాబట్టి టికెట్‌ ధరల విషయంలో స్వల్ప సర్దుబాటు చేయడం వల్ల సినిమాకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. టికెట్ ధరలను తగ్గించడం వల్ల సినిమాకు నష్టం వాటిల్లడం కంటే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్‌ ఉందని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.రెండు రాష్ట్రాల్లో టికెట్‌ ధరలు ఇలా..'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి జనవరి 19 వరకు తెలంగాణలో టికెట్‌ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనవరి 22 వరకు అధిక ధరలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలకు అధనంగా సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది.మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️‍🔥❤️‍🔥❤️‍🔥ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review And Rating In Telugu7
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

టైటిల్‌ : భర్త మహాశయులకు విజ్ఞప్తినటీనటులు: రవితేజ, డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌, సత్య, వెన్నెల కిశోర్‌, సునీల్‌ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఎల్‌వి సినిమాస్నిర్మాత: చెరుకూరి సుధాకర్‌దర్శకత్వం: కిషోర్‌ తిరుమలసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: జనవరి 13, 2023ఈ ముగ్గుల పండక్కి టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజ.. తన రూట్‌ మార్చి చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. సంక్రాంతి పండగనే టార్గెట్‌గా పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. మరి ఈ చిత్రంతో అయినా రవితేజ హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ సత్యనారాయణ అలియాస్‌ రామ్‌(రవితేజ) ఓ వైన్‌యార్ట్‌ ఓనర్‌. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్‌ని స్పెయిన్‌లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్‌ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్‌ వెళ్లిన రామ్‌.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్‌)తో ఫిజికల్‌గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్‌ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్‌తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్‌ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్‌ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్‌ ఏం చేశాడు? స్పెయిన్‌లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్‌కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్‌.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్‌ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్‌), సుదర్శన్‌(సునీల్‌)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒకవైవు భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడి కథతో ‘ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు’ తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ కూడా అదే. ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఇరుకున్న ఓ భర్త.. ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు తిరుమల కిషోర్‌ ఎంచుకున్న పాయింట్‌ చాలా రొటీన్‌. కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు మాత్రం ట్రెండ్‌కు తగ్గట్లు ప్రెష్‌గా ఉన్నాయి. మీమ్స్‌ కంటెంట్‌ని బాగా వాడుకున్నాడు. సోషల్‌ మీడియాని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారు కొన్ని సీన్లకు బాగా కనెక్ట్‌ అవుతారు. అయితే ఏ జోనర్‌ సినిమాకైనా ఎమోషన్‌ అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయితేనే.. ఆ కథతో ప్రయాణం చేస్తాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అది మిస్‌ అయింది. మగాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి తన భర్త ఒక రోల్‌ మోడల్‌ అని బాలమణి పదే పదే చెబుతుంది. అయితే అమె అంతలా తన భర్తను నమ్మడానికి గల కారణం ఏంటనేది చూపించలేదు. అలాగే హీరో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతన్నట్లుగా, భార్య దగ్గర దాచినందుకు టెన్షన్‌ పడుతున్నట్లుగా చూపించేందుకు రాసుకున్న సన్నివేశాల్లోనూ బలం లేదు. ఫస్టాఫ్‌లో సత్య, కిశోర్‌ల కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. స్పెయిన్‌ ఎపిసోడ్‌ వరకు చాలా ఎంటర్‌టైనింగ్‌గా కథనం సాగుతుంది. ఎప్పుడైతే హీరో తిరిగి ఇండియాకొస్తాడో.. అక్కడ నుంచి కథనం నీరసంగా సాగుతుంది. హైదరాబాద్‌ వచ్చిన మానస.. భార్య కంట పడకుండా హీరో పడే తిప్పలు కొన్ని చోట్ల నవ్విస్తే..మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. మొత్తంగా పస్టాఫ్‌లో కథ లేకుండా కామెడీతో లాక్కొచ్చి.. బోర్‌ కొట్టకుండా చేశారు. కానీ సెకండాఫ్‌లో మాత్రం ఆ కామెడీ డోస్‌ తగ్గిపోయింది. ఊహకందేలా కథనం సాగడం.. కామెడీ సీన్లు కూడా పేలకపోవడంతో సెకండాఫ్‌లో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్‌ సీన్‌ని కూడా హడావుడిగా ముగించేశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌కి వెళితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కొంతమేర ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. రవితేజకు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లోనూ రామ్‌ లాంటి పాత్రలు పోషించాడు. అందుకే చాలా అవలీలలా ఆ పాత్రను పోషించాడు. ఇక హీరోయిన్లలో ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ పోటీ పడి మరీ అందాలను ప్రదర్శించడమే కాదు.. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్‌, సత్య, సునీల్‌ల కామెడీ ఈ సినిమాకు ప్లస్‌ అయింది. మరళీధర్‌ గౌడ్‌ కూడా తెరపై కనిపించేదే కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. పిన్నీ సీరియల్‌ సాంగ్‌తో సహా పాత సినిమాల పాటలు ఇందులో చాలానే వాడారు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

Allu Arjun Enters Japan With Family For Pushpa 2 Movie Release8
పుష్ప అంటే ఇంటర్నేషనల్‌.. జపాన్‌లో 'అల్లు అర్జున్‌' ఎంట్రీ

అల్లు అర్జున్‌ తన కుటుంబంతో పాటు జపాన్‌లో అడుగుపెట్టారు. తను నటించిన పుష్ప-2 చిత్రం జనవరి 16న 'పుష్ప కున్రిన్‌' పేరుతో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించారు. ఇప్పటికే పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడు జపాన్‌లో ఏంతమేరకు మెప్పిస్తుంది అనేది చూడాల్సి ఉంది.‘పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌’ అంటూ అల్లు అర్జున్‌ కొట్టిన డైలాగ్‌కు ఇప్పుడు కెరెక్ట్‌గా సెట్‌ అయిందని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు. పుష్ప-2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ.. గీక్‌ పిక్చర్స్, షోచికు స్టూడియోలతో కలిసి జపాన్‌లో విడుదల చేస్తుంది. సినిమా రిలీజ్‌ సందర్భంగా అల్లు అర్జున్‌ టోక్యో చేరుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. సినిమాలో జపాన్‌ నేపథ్యం కూడా ఉండటంతో అక్కడి ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జపాన్‌ ప్రజలకు ఎర్రచందనం వుడ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి పుష్ప కలెక్షన్స్‌ పెరగవచ్చని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.Icon star #alluarjun land in Japan welcome 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #Pushpa2TheRule #Pushpa2InJapan pic.twitter.com/lE4O004AGL— Allu shan dhanush (@subramanyams755) January 13, 2026

Hema Malini Comments On With Sunny and Bobby Deol issue9
సన్నీ డియోల్ , బాబీ డియోల్‌తో గొడవలు.. పిన్ని రియాక్షన్‌

దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) మరణం తర్వాత కుటుంబంలో గొడవలు వచ్చాయని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ ద్వారా సన్నీ డియోల్ , బాబీ డియోల్ , అజీతా డియోల్ , విజేతా డియోల్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు. రెండో భార్య హేమా మాలిని ద్వారా ఈషా డియోల్ , అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, ధర్మేంద్ర మరణం తర్వాత ఆస్తి విషయంలో విభేదాలు వచ్చినట్లు బాలీవుడ్‌లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా నటి హేమా మాలిని స్పందించారు.ధర్మేంద్ర మరణం తర్వాత కూడా సన్నీ డియోల్ , బాబీ డియోల్‌ సోదరులు కలిసి ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, తమ పిన్ని హేమ మాలినితో పాటు తన కుమార్తెలు ఇద్దరు హాజరు కాలేదు. అయితే, అదే రోజు హేమ మాలిని తన ఇంట్లో గీతోపదేశం ఏర్పాటు చేసుకుంది. రెండు వారాల తర్వాత, హేమ మాలిని ఢిల్లీలో ప్రత్యేకంగా ధర్మేంద్ర సంతాప సమావేశాన్ని నిర్వహించింది. ఇలాంటి ఘటనల తర్వాత వారి కుటుంబంలో గొడవలు వచ్చాయని వార్తలు వైరల్‌ అయ్యాయి.వివరణ ఇచ్చిన హేమ మాలినిహేమ మాలిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవలకు సంబంధించి మాట్లాడారు. తాము ఎల్లప్పుడూ బాగున్నామని క్లారిటీ ఇచ్చారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చాలా స్నేహపూర్వకంగానే ఉన్నామన్నారు. కానీ, ప్రజలు ఎప్పుడూ కూడా తమ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు కూడా ఎప్పుడూ గాసిప్ వార్తలనే కోరుకుంటున్నారని తెలుస్తోంది. 'అలాంటి వారికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి..? వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా..? ఇది నా జీవితం. నా వ్యక్తిగత జీవితం, మా వ్యక్తిగత జీవితం. మేము పూర్తిగా సంతోషంగా ఉన్నాము. ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నాము. అంతే.. అవసరంలేని విషయాలను మా కుటుంబంలోకి తీసుకురాకండి. దీని గురించి నేను ఇంకేమీ చెప్పలేను. నెటిజన్లు ఎలాంటి కథనాలు అల్లుతున్నారో నాకు తెలియదు. ఇతరులకు సంబంధించిన బాధను ఉపయోగించుకుని కొన్ని వ్యాసాలు రాయడం చాలా బాధాకరం. అందుకే నేను అలాంటి ఊహాగానాలకు సమాధానం చెప్పను" అని హేమ మాలిని అన్నారు.ఢిల్లీలో సంతాప కార్యక్రమం జరపడానికి ప్రధాన కారణం తాను రాజకీయాల్లో ఉండటమేనని హేమ మాలిని అన్నారు. ఆ రంగానికి చెందిన తన స్నేహితుల కోసం మాత్రమే అక్కడ సమావేశం నిర్వహించానని తెలిపారు. ఆపై మధుర తన నియోజకవర్గం కావడంతో వారితో మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. జనపథ్‌లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ధర్మేంద్ర సంతాప సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, ఓం బిర్లాతో పాటు కంగనా రనౌత్, రంజిత్, అనిల్ శర్మ వంటి ఇతర రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Mana Shankara VaraPrasad Garu Movie first day collection out now10
'మన శంకరవరప్రసాద్‌ గారు' ఫస్ట్‌ డే.. భారీ కలెక్షన్స్‌

చిరంజీవి- అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమా ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేశ్‌, నయనతార, కేథరిన్‌ థ్రెసా, సచిన్‌ ఖేడ్కేర్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భోళా శంకర్ వంటి డిజాస్టర్‌ తర్వాత చిరుకు భారీ హిట్‌ పడిందని ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.'మన శంకరవరప్రసాద్‌ గారు' ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్‌ డే భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 84కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్‌ చిత్రంగా 'మన శంకరవరప్రసాద్‌ గారు' నిలబడింది. 'సైరా నరసింహా రెడ్డి' చిత్రానికి మొదటిరోజు రూ. 85 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఖైదీ నంబర్ 150'కి (రూ. 51 కోట్లు), వాల్తేరు వీరయ్య (రూ. 49.10 కోట్లు), గాడ్ ఫాదర్ (రూ. 32.70 కోట్లు), ఆచార్య ( రూ. 52 కోట్లు), భోళా శంకర్ (రూ. 28 కోట్లు) వచ్చాయి. మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️‍🔥❤️‍🔥❤️‍🔥ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026

Advertisement
Advertisement