Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Actress Anjali upset at Filmfare Awards event at kochi1
ఎవరూ పట్టించుకోలేదు.. అంజలి వీడియో వైరల్‌

కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డ్స్‌ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. అల్లు అర్జున్‌, మమ్ముట్టి, కాజల్‌, సాయిపల్లవి, అంజలి, నివేదా థామస్‌ వంటి స్టార్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్న అంజలికి ఆ కార్యక్రమంలో ఇబ్బందికరమైన అనుభవం ఎదురైందని తెలుస్తోంది.గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రంలో నటించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. అవార్డ్‌ అందుకునేందుకు కొచ్చి విమానాశ్రయంలో ఆమె దిగారు. అయితే, ఆమెను రిసీవ్‌ చేసుకునేందుకు ఫిల్మ్‌ఫేర్‌ యూనిట్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు ఎవరూ రాలేదట. దాదాపు ఆమె 40 నిమిషాల పాటు వేచి ఉన్నారని తెలుస్తోంది. నిర్వాహకుల సమన్వయ లోపం పట్ల అంజలి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అంజలితో ఉన్న వ్యక్తి ఒకరు చెబుతున్న వీడియో వైరల్‌ అవుతుంది.సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela ) కూడా ఫిల్మ్‌ఫేర్‌ ఈవెంట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు చిత్రానికి రెండు అవార్డ్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఫిల్మ్‌ఫేర్ టీమ్‌ విఫలమైందని ఆమె తెలిపింది. తొలిసారి అవార్డ్స్‌ అందుకునేందుకు వచ్చిన వారిని స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం తనను చాలా బాధించిందని నిహారిక ఒక పోస్ట్‌ చేసింది. మొదటిసారి వేదికపై వచ్చిన వారికి కనీసం ఒక నిమిషమైన టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడింది. తను నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ పరిచయ దర్శకుడు (యదు వంశీ) ఉత్తమ పరిచయ నటుడు (సందీప్‌ సరోజ్‌) అవార్డ్స్‌ అందుకుంది. Actress #Anjali faced issue while heading to filmfare awards. After half an hour after arriving at the airport, the car did not come to pick her up.#FilmfareAward #Filmfare2026 pic.twitter.com/AjgdYQtF8S— Australian Telugu Films (@AuTelugu_Films) February 23, 2026

Sai Pallavi And Vijay Sethupathi Will Be work with mani ratnam2
మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి.. హీరో ఎవరో తెలుసా?

తాజాగా కోలీవుడ్‌లో ఓ రేర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం గురించి పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. అదే మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, నటి సాయిపల్లవి జంటగా నటించబోతున్నారన్నది. ఇటీవల థగ్‌లైఫ్‌ చిత్రంతో అపజయాన్ని పొందిన మణిరత్నం తాజాగా ఒక ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. కాగా ఇందులో నటుడు ధ్రువ్‌ విక్రమ్, రుక్మిణి వసంత్‌ నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి, నటి సాయిపల్లవి నటించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మణిరత్నంకు చెందిన మెడ్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందించనున్నుట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం నటుడు విజయ్‌సేతుపతి మార్కెట్‌ నావల్‌ అనే చిత్రంలోనూ, నటి సాయిపల్లవి రామాయణ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరిద్దరూ మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్దం అవుతారని సమాచారం. కాగా నటి సాయిపల్లవి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న విసయం తెలిసిందే. ఈమె తమిళంలో ధనుష్‌కు జంటగా ఒక చిత్రంలో నటించనున్నారు. అదే విధంగా తెలుగులోనూ కొత్త చిత్రాల్లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక నటుడు విజయ్‌సేతుపతి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అలాంటిది త్వరలో మణిరత్నం దర్శకత్వంలో ఈ క్రేజీ జంట నటించబోవడం విశేషమే అవుతుంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందోన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Kalki 2898 AD SEQUEL SHOOTING START AT HYDERABAD3
ఫ్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. మొదలైన కల్కి

ప్రభాస్‌- దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ షూటింగ్‌ మొదలైంది.‘కల్కి 2898 ఏడీ 2’ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లిలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్‌లో ఆయనపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మార్చి మొదటివారంలో ప్రభాస్‌ కూడా ఈ చిత్రీకరణలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం. అయితే, కమల్‌హాసన్‌ మార్చి తర్వాత సెట్‌లోకి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఇక్కడ దాదాపు నెల రోజుల పాటు రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‌ కర్ణ, భైరవ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అశ్వత్థామగా అమితాబ్, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ నటిస్తున్నారు. అయితే, పార్ట్‌-1లో దీపిక పదుకొణె చేసిన సుమతి పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రకటన రావాల్సి ఉంది.

Rashmika and Vijay Deverakonda are set to begin their wedding celebrations4
సెలబ్రేషన్స్‌కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..!

టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్‌ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్‌ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్‌లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్‌లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత టాలీవుడ్‌ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

Tollywood movie Cock Roach Ready For Release5
రియల్‌ క్రైమ్ స్టోరీగా వస్తోన్న కాక్‌రోచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్

అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం కాక్‌రోచ్. ఈ సినిమాకు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ..' సునీల్ కుమార్ రెడ్డితో మా కాంబినేషన్‌లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుందని' అన్నారు.డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. - 'నేను జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారా. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని రూపొందించా. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నా. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించా. రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్‌కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించా. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది' అని. అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, తాటికొండ ప్రసాద్, సునీత, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ కీలక పాత్రల్లో నటించారు.

One Battle After Another on OTT Streaming Date Locked6
ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?

హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్‌ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ చిత్రం తాజాగా బాప్టా అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. గతేడాది సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ గతంలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లోనూ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ ఏడాది జరగనున్న ఆస్కార్‌ అవార్డులకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే వంటి కీలక విభాగాలలో నామినేట్ అయింది. View this post on Instagram A post shared by JioHotstar International (@jiohotstarinternational)

Radhika Latest Movie Thaai Kizhavi Official Trailer Out now7
రాధిక శరత్‌కుమార్‌ డిఫరెంట్‌ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్

సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్‌లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్‌ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్‌ పులి, అరుళ్‌ దాస్‌, బాల శరవణన్‌, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Samantha And Court Sridevi Latest News8
సమంత నయా గ్లామర్.. 'కోర్ట్' శ్రీదేవి వయ్యారాలు!

గ్లామరస్ పోజులతో సరికొత్త సమంత హంగామాలంగా ఓణీలో అందంగా 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవిదుబాయిలో చిల్ అయిపోతున్న రాయ్ లక్ష‍్మిక్యూట్ అండ్ స్వీట్ లుక్స్‌లో ఆషికా రంగనాథ్అందం చూపిస్తూ రచ్చ లేపుతున్న అంజలిరాణీ ముఖర్జీ, రేఖతో కలిసి కీర్తి సురేశ్ ఫొటోలు View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi)

Om Shanti Shanti Shantihi Movie OTT Streaming Update9
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. అధికారిక ప్రకటన

ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భాషకు చెందిన సినిమాలని డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలోనూ రీమేక్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తీసిన చిత్రమే 'ఓం శాంతి శాంతి శాంతిః'. థియేటర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పోస్టర్ కూడా వదిలారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా చేసిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. 2022లో మలయాళంలో వచ్చిన 'జయ జయ జయహే' చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా సరే ఈ సినిమా నిర్మాతలు సాహసం చేశారు. కానీ అది బెడిసికొట్టింది.ఒరిజినల్ సినిమా నుంచి సీన్ టూ సీన్ దింపేశారు. కాస్త నేటివిటీ మార్చినప్పటికీ మరీ స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా థియేటర్లలోకి రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.'ఓం శాంతి శాంతి శాంతిః' విషయానికొస్తే.. మంచిగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి(ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు ఆపేసి ఈమెని ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) అనే చేపల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత కూడా చదువుకోవచ్చనే ఆలోచనతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కానీ అత్తారింట్లో ఊహించనివి జరుగుతాయి. భర్త తన అహంకారాన్ని, కోపాన్ని ఈమెపై చూపిస్తుంటాడు. ప్రతిసారీ చెంపపగలగొట్టేస్తుంటాడు. ఓ రోజు కోపం పట్టలేక ప్రశాంతి, భర్తకు ఎదురుతిరుగుతుంది. భర్తని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. తర్వాత ఏమైంది? భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 8 ఏళ్ల తర్వాత గడ్డం తీసేసిన 'కేజీఎఫ్' యష్.. ఇలా ఉన్నాడేంటి?)

Naga Chaitanya Appeareance at Goa Indian Racing Festival10
గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్

టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్‌స్పోర్ట్స్ టీమ్‌ హైదరాబాద్ బ్లాక్‌ బర్డ్స్‌కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్‌లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్‌ తర్వాత సరికొత్త మైథలాజికల్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్‌లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్‌సీ24 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. Yuvasamrat @chay_akkineni Cheering for his team #HyderabadBlackBirds at the #GoaStreetRace2026 🔥💨#IndianRacingLeague pic.twitter.com/BB4EZZ4wCa— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026

Advertisement
Advertisement