Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood actresses Latest Social Media Updates viral in instagram1
బీచ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ పోజులు.. శారీలో సాక్షి అగర్వాల్ అందాలు..!

లైట్ గ్రీన్ శారీలో హీరోయిన్ సాక్షి అగర్వాల్ గ్లామర్..మరింత గ్లామరస్‌గా సాహితి దాసరి..బీచ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ పోజులు..తేరే ఇష్క్ మే మూడ్‌లో కృతి సనన్..వైట్ డ్రెస్‌లో తాప్సీ పన్ను హోయలు.. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal)

Tollywood producer Chandrashekar warns to Tollywood Hero about movie 2
'ఆ హీరో సంగతి తర్వాత చూస్తా'.. టాలీవుడ్ నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్..!

టాలీవుడ్ నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రెండు సినిమాలలో వేలు పెట్టిన ఆ టాలీవుడ్ హీరో సంగతి తర్వాత చూస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ మూవీ ఫిల్మ్ ఛాంబర్‌ దాకా వెళ్లిందని.. కానీ నేను మాత్రం వెళ్లలేదని తెలిపారు. నా సినిమాకు రూ.1.6 కోట్ల బడ్జెట్ అని చెప్పి.. రూ.4.8 అయ్యేలా చేశారని వెల్లడించారు.మాకు ఈ విషయం చెప్పకుండానే హీరోయిన్ సీన్స్ తీసేయించారని నిర్మాత అన్నారు. హీరోను డామినేట్ చేసేలా ఉన్నాయంటూ దాదాపు 15 నిమిషాల సన్నివేశాలను తీసేశారని ఆయన మండిపడ్డారు. ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్‌గా నటించారని తెలిపారు. దీంతో ఆ తర్వాత సినిమా నుంచి డైరెక్టర్‌ తప్పుకున్నారని నిర్మాత పేర్కొన్నారు. ‍అయితే ఆలా చేసిన ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఇవాళ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు నిర్మాత సమాధానాలిచ్చారు. Producer Chandrasekhar opens up about the hurdles faced during the making of #TejaSajja’s #Adbhutam.#GOAT pic.twitter.com/LiaegRU8Xc— Australian Telugu Films (@AuTelugu_Films) December 2, 2025

Balakrishana Akhanda 2 movie Ticket Price Huge Hike In andhra Pradesh3
బాలయ్య సినిమాకు నజరానా.. భారీగా అఖండ-2 టికెట్ ధరల పెంపు

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో యాక్షన్‌ మూవీ అఖండ-2. ఈ సినిమా రిలీజ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.భారీగా ధరల పెంపు.. అఖండ-2 మూవీకి భారీగా టికెట్ ధరలు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో ఏకంగా రూ.75 పెంచుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టకెట్‌పై అదనంగా రూ.100 పెంపునకు అనుమతులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ టికెట్ ధరలు 10 రోజుల వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వులిచ్చింది. దీంతో పాటు ఎన్నడూ లేనివిధంగా ప్రీమియర్ షోలకు కూడా అనుమతిలిచ్చింది. ఈ నెల 4న ప్రీమియర్‌ షో టికెట్‌ ధర ఏకంగా రూ.600లుగా నిర్ణయించింది. ఇంత భారీ స్థాయిలో టికెట్స్ పెంచడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడంతో భారీగా ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించకునేందుకు ఉత్తర్వులిచ్చారు. భారీగా టికెట్ ధరల పెంపుతో సినీ ప్రేక్షకుల జేబులు గుల్ల కావడం ఖాయంగా కనిపిస్తోంది. #Akhanda2 కి అనుమతి 👍#Akhanda2Thaandavam 🔥 https://t.co/gvFHBdGH3f pic.twitter.com/GdqfNfYdwc— Kakinada Talkies (@Kkdtalkies) December 2, 2025

Sudigali Sudheer latest movie Goat Teaser Out Now4
'అమ్మాయిని ఎత్తుకొస్తే పది లక్షలు'.. నవ్వులు తెప్పిస్తోన్న టీజర్..!

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం గోట్(GOAT). కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.ఇవాళ గోట్ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెళ్లి ఇష్టం లేని అమ్మాయి.. తనను ఎత్తుకొస్తే పది లక్షలు ఇస్తానంది.. ఐదు నీకు.. ఐదు నాకు అంటూ బ్రహ్మజీ చెప్పిన డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ సినిమాను జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Samyuktha Talk About Akhanda 2 Movie5
అంత మాస్‌ సాంగ్‌ నేనెప్పుడు చేయలేదు: సంయుక్త మీనన్‌

అఖండ 2 సినిమాలో ఓ మాస్‌ సాంగ్‌ ఉంటుంది. అది విన్న తర్వాత నాకు నెర్వస్‌గా అనిపించింది. ఇంతవరకు అలాంటి మాస్‌ సాంగ్‌ నేనెప్పుడు చేయలేదు. డ్యాన్స్‌ విషయంలో తగ్గొద్దు అనుకున్నాను. రెండు రోజుల ప్రాక్టీస్‌ చేసిన తర్వాత మోకాలు సహకరించలేదు. దీంతో ఫిజియోథెరపీ తీసుకొని మరీ ఆ పాట పూర్తి చేశాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా స్టైలిష్ ఉంటుంది’ అన్నారు హీరోయిన్‌ సంయుక్త. నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంయుక్త మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ విరూపాక్ష తర్వాత తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేను మాత్రం సెలెక్టెడ్‌గా చేస్తున్నాను. బింబిసారా, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్ ఒకేసారి సైన్ చేశాను. అయితే రిలీజ్ టైమ్స్ డిఫరెంట్ గా అయ్యాయి. తర్వాత స్వయంభు, నారీ నారీ, ఆ తర్వాత అఖండ 2 సైన్ చేశాను. ఆ తర్వాత పూరి గారి సినిమా చేశాను.→ బోయపాటి అఖండ 2 కథ చెప్పగానే చాలా నచ్చింది. డేట్స్ ఉన్నాయో లేదో మా టీం ని అడిగాను. లేవని చెప్పారు. ఎలాగైనా ఈ సినిమా చేయాలని చెప్పడంతో డేస్ట్‌ అడ్జస్ట్‌ చేశారు. బోయపాటి చాలా గ్రేట్ విజన్ తో ఈ సినిమా తీశారు. మన ఊహకి మించి ఉంటుంది.→ బాలయ్య చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ని తొలిసారి ఒక యాడ్ షూట్ లో కలిసాను. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషి లాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ల యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.→ ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పాటలు లార్డ్ శివ కి ట్రిబ్యూట్ లాగా ఉండబోతున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సంస్కృతంలో వినిపించే పదాలు అద్భుతమైన సాహిత్యం ఒక ట్రాన్స్ లో తీసుకెల్తాయి→ కొత్త సినిమాల విషయాలకొస్తే.. స్వయంభులో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వానంద్‌ ‘ నారి నారి నడుమ మురారి’లో చాలా మంచి పాత్ర లభించింది. దీంతో పాటు పూరీ జగన్నాథ్‌ సినిమాలో నటిస్తున్నాను.

Trivikram film with Venkatesh title name Goes viral in Social Media6
త్రివిక్రమ్- వెంకీ కాంబో.. ఆ టైటిల్‌ ఫిక్స్..!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.అయితే మరోవైపు ఈ మూవీ టైటిల్‌పై కూడా టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్‌పై సినీ ప్రియుల్లో చర్చ మొదలైంది.త్రివిక్రమ్ శ్రీనివాస్- వెంకటేశ్ మూవీకి టైటిల్‌ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. 'బంధు మిత్రుల అభినందనలతో' అనే టైటిల్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రం వెంకీ మామ కెరీర్‌లో 77వ సినిమాగా నిలవనుంది. ఈ సినిమా వెంకీతో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. గతంలో నువ్వు నాకు నచ్చవ్, వాసు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ మూవీని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Paisawala Movie Trailer Out7
పసుపు అంటిన పది నోటు ఎక్కడ.. ఆసక్తికరంగా ‘పైసావాలా’ ట్రైలర్‌!

కంటెంట్‌ ఉంటే చాలు హీరోహీరోయిన్లను పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో స్టార్స్‌ని కంటె కంటెంట్‌ని నమ్ముకొని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్‌ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రిలీజ్‌ చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.ట్రైలర్‌ విషయానికొస్తే..‘హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్‌ అయింది. ఆ తర్వాత ఫోన్‌, పర్సు మిస​్‌ అయింది. అందులోనే హవాలా నోటు ఉంది. ఆ పని నీవల్లే అవుతుందంటూ’ ఓ మహిళ..హీరోకి చెప్పే సీన్‌తో ఆసక్తికరంగా ప్రారంభం అయింది. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరగడం.. ఈక్రమంలో బెరిదింపులు, హత్యలు.. కొత్త కొత్త పాత్రల ఎంట్రీతో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. చివరిలో తొమ్మిది పాత్రలను చూపిస్తూ..వీరిలో అపరాధి ఎవరంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రానికి నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు. డిసెంబర్‌ 12న విడుదల కానుంది.

Rajendra Prasad Constructs A Cottage for Piligrims at Tirumala8
వివాదాల రాజేంద్ర ప్రసాద్.. ఆ విషయంలో ఏకైక వ్యక్తిగా ఘనత..!

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన చేస్తున్న కామెంట్స్. ఏదైనా ఈవెంట్‌ జరిగినప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. డేవిడ్ వార్నర్ నుంచి బ్రహ్మనందం వరకు రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. దీంతో ఆయనపై పలువురు నెటిజన్స్‌ మండిపడ్డారు. ప్రతిసారి ఇలా నోరు జారడం అలవాటైపోయిందని ఫైరయ్యారు.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్‌ నటుడిగా పేరున్న రాజేంద్ర ప్రసాద్‌ ప్రతిసారి అలా మాట్లాడడం చూస్తుంటే అభిమానులే షాకవుతున్నారు. ఒక్కోసారి అసలు ఆయనకు ఏమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఈవెంట్స్‌లో తప్పుగా మాట్లాడడం.. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏకైక నటుడిగా ఘనత..అయితే ఇటీవల కొద్ది కాలంగా తన మాటలతో ట్రోల్స్‌కు గురవుతున్న రాజేంద్ర ప్రసాద్‌ ఓ మంచిపని కూడా చేశాడు. పవిత్రమైన తిరుమల సన్నిధిలో భక్తుల వసతి కోసం కాటేజీ నిర్మించినట్లు తెలిసింది. టి. సుబ్బరామిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఈ కాటేజీ నిర్మించానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా తిరుమల కొండపై కాటేజీ నిర్మించిన ఏకైక నటుడిగా రాజేంద్ర ప్రసాద్ ఘనతను సొంతం చేసుకున్నారు.

Kamal Haasan breaks Silence On Retirement9
ఆ తర్వాతే నటించడం మానేస్తా : కమల్‌ హాసన్‌

71 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు విశ్వనటుడు కమల్‌ హాసన్‌. యంగ్‌ హీరోలకు ధీటుగా ఏడాదికో సినిమా రిలీజ్‌ చేస్తున్నాడు. ఇటీవల ఆయనను రాజ్యసభ పదవి వరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సీనీ కెరీర్‌పై రకరకాల పుకార్లు వచ్చాయి. ఇక ఆయన సినిమాల్లో నటించబోరనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా ఓ మంచి సినిమా తీసి రిటైర్మెంట్ అవుతానని చెప్పారు. తాజాగా ఆయన నటి మంజు వారియర్‌తో కలిసి కేరళలో అర్ట్‌ అండ్‌ లిటరేచర్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పదవి విరమణపై ఎదురైన ప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు.‘నన్ను రిటైర్‌ అవ్వమని ఎవ్వరూ అడగడం లేదు. కానీ కొన్నిసార్లు నాకే ఇక సినిమాలు ఆపేయాలనిపిస్తుంది. ముఖ్యంగా నా నుంచి వచ్చిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది. కానీ నా శ్రేయోభిలాషులు, అభిమానులు మాత్రం సినిమాలు ఆపోద్దని చెబుతున్నారు. ‘ఒక మంచి సినిమా తీసి సినిమాలు ఆపేయండి’ అని సలహాలు ఇస్తున్నారు. నేను కూడా అలాంటి ఓ మంచి సినిమా కోసమే ఎదురు చూస్తున్నాను’ అని కమల్‌(Kamal Haasan) చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఓ బ్లాక్‌ బస్టర​ సినిమా తీసి సినీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాలని కమల్‌ భావిస్తున్నాడు. మరి ఆ చిత్రం ఎప్పుడొస్తుందో చూడాలి. ఇటీవల ఆయన ‘థగ్‌లైఫ్‌’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం ఆయన చేతిలో కల్కి 2 చిత్రం ఉంది. అలాగే లోకేష్‌ కనగరాజ్‌తో విక్రమ్‌ 2 కూడా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు.

Samantha Ruth Prabhu and Raj Nidimoru Net Worth 2025 after marriage10
సమంత రెండో పెళ్లి.. ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా?

ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు.. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది.అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కొందరేమో వీరి వయస్సుల గురించి చర్చిస్తే.. మరికొందరు డేటింగ్, పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ కావడం.. రాజ్ నిడిమోరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో సామ్-రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి?.. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్‌ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. కొద్ది కాలంలోనే స్టార్‌ హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది సామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్‌గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.సమంత ఆస్తులే ఎక్కువ.. ఇక రాజ్ నిడిమోరు ఆస్తుల విషయానికొస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ దాదాపు రూ.85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాజ్ కంటే సమంతనే 29 శాతం అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్‌ అంచనా వేస్తున్నారు.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ‍ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

Advertisement
Advertisement