ప్రధాన వార్తలు
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన సమంత
మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ కొట్టిన సమంత.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు అఫీషియల్గా ప్రకటించింది. దీంతో తన ఫ్యాన్స్కు డబుల్ బొనాంజా ఇచ్చింది. తాజాగా ఇవాళ ఏర్పాటు చేసిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో ఈ శుభవార్త పంచుకున్నారు. మరోసారి తన సినిమాలకు గ్యాప్ ఇస్తున్నానని తెలిపింది. ఇప్పటి నుంచి మెటర్నిటీ లీవ్లో తీసుకుంటానని సామ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ తారలు సామ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. గత కొద్ది రోజులుగా సమంత ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లతో శారీలో కనిపించండతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఇవాళ సామ్ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజా సామ్ గుడ్ న్యూస్తో అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చింది.సమంత గతేడాది డిసెంబర్లో రెండోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో జరిగింది.
ఓటీటీకి వచ్చేసిన డిటెక్టివ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక వినోదం మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషలో రిలీజైన సరే కంటెంట్ బాగుంటే చాలు డబ్బింగ్ వర్షన్లోనూ తెగ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రియులు సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారంలో కొత్త సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ మిస్టరీ కామెడీ మూవీ సడన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ స్టార్ హ్యూ జాక్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన మిస్టరీ కామెడీ చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా జూన్ 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ రచయిత లియోనీ స్వాన్ రాసిన త్రీ బ్యాగ్స్ ఫుల్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కైల్ బాల్డా దర్శకత్వం వహించారు.ఈ మూవీ కథేంటంటే..డెన్బ్రూక్ అనే చిన్న పట్టణంలో గొర్రెల కాపరిగా పనిచేసే హ్యూ జాక్మాన్ అనుకోని పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. అయితే, ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే కోణంలో కథ ఉండనుంది. దీని కోసం ఆయన మందలోని గొర్రెలే రంగంలోకి దిగడం ఈ చిత్రంలో హైలెట్. గొర్రెలు తమ యజమాని మరణానికి కారణమైన వారిని ఎలా వెతికి పట్టుకున్నాయనేదే ది షీప్ డిటెక్టివ్స్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.
'మగ పిల్లాడి కోసం చిట్కా చెప్పండి సార్'.. సూపర్ సుబ్బు ట్రైలర్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఆపీసర్గా ఓ పల్లెటూరికి వెళ్లిన సందీప్ కిషన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలకు లైంగిక విద్యపై ఎలా అవగాహన కల్పించాడనే కథగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ట్రైలర్లో కామెడీ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.ఈ టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్బాబు కీలక పాత్రలు పోషించారు.
మరో ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తిరువీర్, రాశి, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పాపం ప్రతాప్. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.పాపం ప్రతాప్ కథేంటంటే..ఈ సినిమా కథ 1994-98 మధ్య కాలంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్)కి బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వయసుతో పాటు ఆమెపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ రోజు బుజ్జమ్మనే ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగడంతో..ప్రతాప్ వెంటనే ముహూర్తం పెట్టిస్తాడు. నాన్న రంగయ్య(అజయ్ ఘోష్)కి ఇష్టం లేకపోయినా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. మొదటి మూడు రాత్రులు గడవగానే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్కి సమస్య ఉందని.. అతనితో సంసారం చేయలేనని ఊరిపెద్దలకు చెబుతుంది. ప్రతాప్కి ఉన్న సమస్య ఏంటని అడిగితే మాత్రం బయటకు చెప్పదు. అంతేకాదు తనలోని సమస్యేమిటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెప్పి..పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్కి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యను కనుక్కునేందుకు ప్రతాప్ చేసిన ప్రయత్నాలు ఏంటి? సమస్య తెలుసుకున్నాక..దాన్ని సరిదిద్దుకున్నాడా లేదా? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా లేదా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
బిగ్బాస్
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
తండ్రయిన అవినాష్.. అప్పుడు రోడ్డుపై పిచ్చోడిలా.. ఇప్పుడేమో!
నీ పెళ్లాన్ని సన్నగా చేయ్ అని ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే..: విశ్వ
నేను మంచివాళ్లకే మంచివాడిని, నాలోని రాక్షసుడు బయటకు వస్తే..!
అతడి నుంచి తప్పించుకునేందుకు రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..: నటి
'నీ ముఖానికి గోల్డ్ చైన్ ఉందా'.. తట్టుకోలేకపోయా: నటి
నేనేదో అనుకున్నా.. పెళ్లి అంత ఈజీగా జరగలేదు: పునర్నవి
నా బిడ్డను ఎవరూ ముద్దుపెట్టుకోవద్దు.. ఇది నా రూల్: మెరీనా
ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి.. ఫోటోలు వైరల్
సైలెంట్గా వస్తారు.. స్పెషల్గా ఉండిపోతారు: రవికృష్ణ
A to Z
ఓటీటీలో సేవ్ ది టైగర్స్-3 రికార్డ్.. టాలీవుడ్ డైరెక్టర్ సరికొత్త ట్రెండ్
టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. ఇప్...
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. 'ప్రేమలు' భామ హీరోయిన్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు...
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంద...
ఓటీటీలోకి మరో 'బాహుబలి'.. ఇంకెన్ని దాచారు?
దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్తో పాటు టాలీవుడ్ స్...
శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్
హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సిని...
పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి?
ఈ వీకెండ్ ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమ సినిమాలతో వచ...
తమాషా క్వీన్
మహారాష్ట్రకు చెందిన సుప్రసిద్ధ జానపద నృత్య కళాకారి...
ఫుట్పాత్పై నిద్రించిన స్టార్ కమెడియన్.. వీడియో వైరల్
సినిమా వాళ్ల లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ...
ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు
‘‘సినిమా మేకింగ్లో సాంకేతికత పెరిగినప్పటికీ మనుషు...
వాట్ ఏ మూవీ.. రూ.7 కోట్లతో ఏకంగా రూ.950 కోట్లా..!
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత పెద్ద స్టా...
ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ
ప్రతి వీకెండ్ రాగానే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు ఏమ...
అమ్మ బాబోయ్.. రూ.10 కోట్లు బడ్జెట్ రూ.1000 కోట్ల కలెక్షన్?
'కళామతల్లికి సేవ చేస్తున్నాం' లాంటి మాటలు ఎవరెన్ని...
వెయింటిగ్ ఈజ్ ఓవర్.. సర్దార్-2 వచ్చేస్తున్నాడు..!
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన సీక్వెల్ మూవీ సర్దార్...
ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పె...
విజయ్ ఫ్యాన్స్.. ఎంతకు తెగించార్రా?
సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు ...
డెడ్లీ డాక్టర్గా రజనీకాంత్.. చాలా సెన్సిటివ్ స్టోరీ
గతేడాది 'కూలీ'గా వచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్...
ఫొటోలు
‘సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ముద్దుల కూతురితో బిగ్బాస్ శివజ్యోతి (ఫొటోలు)
సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
కలర్ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)
తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)
'పెద్ది' మెగా బ్లాక్బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)
'వసుదేవసుతం' మూవీ ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)
మా ఇంటి బంగారం టీమ్కు మెగాస్టార్ ప్రశంసలు (ఫొటోలు)
గాసిప్స్
View all
సౌత్ సినీ పరిశ్రమపై తమన్నా విమర్శలు
'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్టాపిక్గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు
విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్
రాజమౌళి-చరణ్ కాంబినేషన్ రిపీట్?
క్రేజీ ప్రాజెక్ట్.. కొడుకును హీరోగా పరిచయం చేయనున్న ధనుష్?
మహేశ్ 'వారణాసి'.. ఇలా అయిందేంటి?
ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!
విజయ్ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!
లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?
నేపాలీ గ్యాంగ్స్పై ఆర్జీవీ కన్ను?
రివ్యూలు
View all
3.25
‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ
3
‘దీవాన’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
1.75
వడ్డే నవీన్ రీఎంట్రీ మూవీ.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
మా ఇంటి బంగారం రివ్యూ.. సమంత ఖాతాలో హిట్ పడిందా?
2.75
‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ
3
'సేవ్ ది టైగర్స్ 3' రివ్యూ.. ఈసారి కూడా నవ్వులే
‘29’ మూవీ రివ్యూ : సాదా సీదా కథే.. చూస్తుంటే కన్నార్పనీయదు
‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
2.75
‘సింగ్ గీతం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
సమంత తన భర్తని ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
సమంత తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా..వీకెండ్లో పుంజుకొని, నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సామ్ నటించి చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక వారి ఆనందాన్ని రెట్టింపు చేసే గుడ్ న్యూస్ చెప్పింది సమంత. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. బుధవారం నిర్వహించిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో ఆమె ఈ విషయాన్ని చెప్పింది. ఇదే ఈవెంట్లో తన భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో కూడా ఆమె చెప్పింది.మా ఇంటి బంగారం చిత్రంలో సమంత తన భర్త అనిరుధ్ని ముద్దుగా హనీ అని పిలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజ నీజ జీవితంలో భర్త అయిన రాజ్ని ప్రేమగా ఏమని పిలుస్తారు అని సక్సెస్ మీట్లో సమంతను అడిగింది యాంకర్. దానికి సమంత సిగ్గు పడుతూ సమాధానం చెప్పింది. ‘రాజ్ని ఇంట్లో వాళ్ల అమ్మ, చెల్లి ప్రేమగా బాబు అని పిలుస్తారు. నేను కూడా అలానే పిలుస్తాను అని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, 2025లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చేస్తున్న సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి..పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
‘ధర్మన్’ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్.. కొత్త సినిమాపై హైప్ పెంచిన రజనీకాంత్
కమల్హాసన్, రజనీకాంత్లది సుమారు 50 ఏళ్ల స్నేహ బంధం. కెరీర్ ఆరంభించిన కొత్తలో వీరిద్దరూ కలిసి 10 చిత్రాలకు పైగా నటించారు. అలాంటిది ఇప్పుడు కమల్హాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంట ర్నేషనల్పై నిర్మిస్తున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండటం విశేషం. బుధవారం ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలోని కమల్హాసన్ కార్యాలయంలో జరిగింది. ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ను ఖరారు చేసి, రజనీకాంత్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు.అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో... ఈ చిత్రానికి ముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారనే వార్త వచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్గా సుందర్ .సీని ఖరారు చేశారు. అయితే ఈ చిత్రం నుంచి సుందర్ తప్పుకున్నారు. దాంతో దర్శకుడిగా శిబి చక్రవర్తి పేరు వినిపించింది. చివరికి యువ దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరును ఖరారు చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘కమల్హాసన్ తన సంస్థలో సినిమా చేయాలని కోరారు. అయితే కథ వినను అన్నారు. నన్నే ఎంపిక చేసుకోమని భారమంతా నాపై పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కథ ఎంపికలో మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పడంతో విన్నారు. ఆ తర్వాత ఈ కథను ఓకే చేశాం. ఇది 5 రూపాయల వైద్యుడి ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం కాదు. స్వొగ్ అనే వైద్యుడి ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇందులో నేను న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే సైంటిస్ట్గా కనిపిస్తాను. ఆఫ్గనిస్థాన్, రష్యాలో షూటింగ్ ప్లాన్ చేశాం. ఇది తీయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే చివరకు అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు’ అని చెప్పారు. కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘నేను, రజనీకాంత్ సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత ఆ కల నిజమవుతోంది. మా సంస్థలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండటం సంతోషంగా ఉంది. దర్శకుడు అశ్వద్ మారిముత్తు, సంగీత దర్శకుడు అనిరుధ్తో పాటు మొత్తం టీమ్పై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు. అశ్వద్ మారిముత్తు మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్గారితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటారు. ఆ చాన్స్ నాకు రావడం హ్యాపీగా ఉంది. రజనీకాంత్గారు నటించిన ‘పడయప్పన్’, కమల్హాసన్గారు నటించిన ‘వేట్టైయాడు విలైయాడు’ చిత్రాల తరహాలో ‘ధర్మన్’ ఉంటుంది’’ అని తెలిపారు.
ఎవరితోనూ రిలేషన్ షిప్లో లేను: శ్రుతి హాసన్
సంచలన నటీమణుల్లో శ్రుతి హాసన్ ఒకరిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు చాలా బోల్డ్ నటి కూడా. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే నటి.ప్రఖ్యాత నటుడు, సినీ వికీపీడియా కమలహాసన్ వారసురాలు అయిన శ్రుతి హాసన్ స్వతంత్ర భావాలు కలిగిన నటి. ఆ మధ్య ప్రేమించిన వ్యక్తిని తన తండ్రికి పరిచయం చేసిన గట్స్ ఉన్న నటి ఈ భామ.హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సంగీత దర్శకులు,గాయని అంటూ పలు శాఖల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇటీవల ఈమె నటుడు రజనీకాంత్తో కలిసి కూలీ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి కి జంటగా నటించిన ట్రైన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కథానాయకిగా బిజీగా లేకున్నా అభిమానులతో తరచూ సోషల్ మీడియా ఇంటరాక్టివ్ అవుతూ తమ భావాలను పెంచుకుంటూ వార్తల్లో ఉంటున్నారు. అలా తాజాగా అభిమానులతో ముచ్చటించారు. అందులో ఒకరు మీరు రిలేషన్ షిప్ లో ఉన్నారా అని అడగ్గా ‘‘ నేను రిలేషన్ షిప్ లో లేనని స్పష్టం చేశారు. అదేవిధంగా మీరు సినీ రంగంలో లేకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు పిల్లల మనోతత్వ వైద్యురాలినన్నే దానిని పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మా సినిమా చూసి మహేశ్ బాబు ఆశ్చర్యపోయాడు
‘‘ఈ రోజుల్లో కొత్తదనం లేకుండా సినిమా చేయడం చాలా కష్టం. ఒక జానర్ హిట్టయిందని అదే తరహాలో మరో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఆడియన్స్కి సరికొత్త అనుభూతినివ్వాలనే సంకల్పంతో ‘రావు బహదూర్’ చిత్రాన్ని నిర్మించాం. మా మూవీ సమర్పకుడు హీరో మహేశ్బాబుగారు ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయారు. ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని ఆయన చెప్పడంతో సినిమా విజయంపై మాకు మరింత నమ్మకం పెరిగింది’’ అని నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. సత్యదేవ్, దీపా థామస్ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్పై చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా చింతా గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాతగా తెలుగులో ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు, యశోద, క, చిదంబరం’, తమిళంలో సముద్ర ఖనితో ‘తిరుమాణిక్యం’ చిత్రాలు చేశాను. ‘రావు బహదూర్’ కథను మొదట నమ్రతగారు విన్నారు. ఆమెకు చాలా నచ్చింది. రావు బహదూర్ పాత్రకు సత్యదేవ్ కరెక్ట్గా సరిపోయారు. భిన్నమైన సినిమాలు చేయాలనుకోవడం వల్లే అనురాగ్, శరత్, నేను ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యాం. కథ, సెట్స్, కాస్ట్యూమ్స్, నిర్మాణ విలువలు చూస్తే ‘బాహుబలి’ తరహా భారీ నిర్మాణ అనుభూతి కలుగుతుంది. మా సినిమా ఆడియన్స్కి ఓ కొత్త అనుభవాన్ని, పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం నేను నిర్మించిన రెండు సినిమాల్లో ఒకటి వినాయక చవితికి, మరొకటి దసరాకు విడుదలవుతాయి’’ అని తెలిపారు.
సినిమాగా మీర్జాపూర్ సిరీస్.. ఆసక్తిగా పోస్టర్స్
మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడే అదే పేరుతో మూవీ రానుంది. మీర్జాపూర్: ది మూవీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మీర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన ‘గద్దీ’, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్లోని అధికారం, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.తాజాగా పోస్టర్ల విడుదలతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మీర్జాపూర్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా.. పునీత్ కృష్ణ కథ అందించారు. ఈ మూవీని రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగు భాషలోనూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన సమంత
మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ కొట్టిన సమంత.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు అఫీషియల్గా ప్రకటించింది. దీంతో తన ఫ్యాన్స్కు డబుల్ బొనాంజా ఇచ్చింది. తాజాగా ఇవాళ ఏర్పాటు చేసిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో ఈ శుభవార్త పంచుకున్నారు. మరోసారి తన సినిమాలకు గ్యాప్ ఇస్తున్నానని తెలిపింది. ఇప్పటి నుంచి మెటర్నిటీ లీవ్లో తీసుకుంటానని సామ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ తారలు సామ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. గత కొద్ది రోజులుగా సమంత ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లతో శారీలో కనిపించండతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఇవాళ సామ్ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజా సామ్ గుడ్ న్యూస్తో అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చింది.సమంత గతేడాది డిసెంబర్లో రెండోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో జరిగింది.
ఓటీటీకి వచ్చేసిన డిటెక్టివ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక వినోదం మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషలో రిలీజైన సరే కంటెంట్ బాగుంటే చాలు డబ్బింగ్ వర్షన్లోనూ తెగ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రియులు సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారంలో కొత్త సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ మిస్టరీ కామెడీ మూవీ సడన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ స్టార్ హ్యూ జాక్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన మిస్టరీ కామెడీ చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా జూన్ 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ రచయిత లియోనీ స్వాన్ రాసిన త్రీ బ్యాగ్స్ ఫుల్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కైల్ బాల్డా దర్శకత్వం వహించారు.ఈ మూవీ కథేంటంటే..డెన్బ్రూక్ అనే చిన్న పట్టణంలో గొర్రెల కాపరిగా పనిచేసే హ్యూ జాక్మాన్ అనుకోని పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. అయితే, ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే కోణంలో కథ ఉండనుంది. దీని కోసం ఆయన మందలోని గొర్రెలే రంగంలోకి దిగడం ఈ చిత్రంలో హైలెట్. గొర్రెలు తమ యజమాని మరణానికి కారణమైన వారిని ఎలా వెతికి పట్టుకున్నాయనేదే ది షీప్ డిటెక్టివ్స్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.
'మగ పిల్లాడి కోసం చిట్కా చెప్పండి సార్'.. సూపర్ సుబ్బు ట్రైలర్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఆపీసర్గా ఓ పల్లెటూరికి వెళ్లిన సందీప్ కిషన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలకు లైంగిక విద్యపై ఎలా అవగాహన కల్పించాడనే కథగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ట్రైలర్లో కామెడీ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.ఈ టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్బాబు కీలక పాత్రలు పోషించారు.
మరో ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తిరువీర్, రాశి, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పాపం ప్రతాప్. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.పాపం ప్రతాప్ కథేంటంటే..ఈ సినిమా కథ 1994-98 మధ్య కాలంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్)కి బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వయసుతో పాటు ఆమెపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ రోజు బుజ్జమ్మనే ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగడంతో..ప్రతాప్ వెంటనే ముహూర్తం పెట్టిస్తాడు. నాన్న రంగయ్య(అజయ్ ఘోష్)కి ఇష్టం లేకపోయినా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. మొదటి మూడు రాత్రులు గడవగానే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్కి సమస్య ఉందని.. అతనితో సంసారం చేయలేనని ఊరిపెద్దలకు చెబుతుంది. ప్రతాప్కి ఉన్న సమస్య ఏంటని అడిగితే మాత్రం బయటకు చెప్పదు. అంతేకాదు తనలోని సమస్యేమిటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెప్పి..పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్కి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యను కనుక్కునేందుకు ప్రతాప్ చేసిన ప్రయత్నాలు ఏంటి? సమస్య తెలుసుకున్నాక..దాన్ని సరిదిద్దుకున్నాడా లేదా? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా లేదా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
తొమ్మిదేళ్ల ప్రేమ.. ఈ రోజుతో ఒక్కటయ్యాం: జబర్దస్త్ ఫైమా సర్ప్రైజ్
జబర్దస్త్ షోతో ఫేమస్ అయినవాళ్లలో ఫైమా ఒకరు. తన కామెడీ పంచ్లతో అభిమానులను ఆకట్టుకుంది. బిగ్బాస్ గత సీజన్లో ఆడే అవకాశం దక్కించుకుని మంచిగా సెటిలైపోయింది. తాజాగా ఫైమా ఫ్యాన్స్కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ను ఫైమా పెళ్లాడింది. తామిద్దరం తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నామని తెలిపింది. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఈ రోజు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టామని ఫైమా సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సహచరులు ఫైమాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫైమా తన ఇన్స్టాలో రాస్తూ..' వారు మమ్మల్ని అనుమానించారు. మమ్మల్ని విమర్శించారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకినీ అధిగమించి బలంగా నిలిచింది. లెక్కలేనన్ని పోరాటాలు. అంతులేని సహనం. వదిలేయడానికి వేయి కారణాలున్నా.. మేము ప్రతిరోజూ ఒకరినొకరు ఎంచుకున్నాం. ఫైనల్గా ఈ రోజు మేము భార్యాభర్తలం అయ్యాం' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas)
సినిమా
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే? గెట్ రెడీ…!
తండ్రిగా కాదు యాక్టర్ గా చెప్తున్నా.. నా బిడ్డకు అవార్డులు అవసరం లేదు
మా బుడ్డది నన్ను కొత్త పేరు తో పిలుస్తుంది.. నేను షాక్ ఏం పేరు అంటే..!
RC17 ఎప్పుడంటే.? సుకుమార్ లీక్స్
ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
సుధీర్ ఎవడు? ఇచ్చిపడేసిన రష్మీ
సమంత, రాజ్ను కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న మెగాస్టార్ చిరంజీవి
TOXIC రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక మాస్ జాతరే
తల్లి కాబోతున్న సమంత ?
మరి ఇంత అహంకారామా? శ్రీలీలను అవమానించిన సీఎం భార్య
