Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement

బిగ్‌బాస్

Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Drishyam Fame Esther Anil Emotional over her Graduation1
నన్ను చదివించే స్థోమత లేదు, ఇప్పుడు పట్టాతో నిల్చున్నా!

మలయాళ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఎస్తర్‌ దృశ్యం సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. తెలుగు దృశ్యం రెండు భాగాల్లోనూ తనే నటించింది. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూనే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.జోక్‌ అనుకున్నా..కొన్నేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తుండగా నాన్న ఫోన్‌ చేశాడు. నేనో వ్యక్తిని కలిశాను.. అతడి కూతురు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (LSE)లో చదువుతోందట. నువ్వు ఓసారి ఆమెతో మాట్లాడకూడదూ.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తావేమో అన్నాడు. ఏంటి నాన్న జోక్‌ చేస్తున్నావా? అన్నాను. కలలో కూడా అనుకోలేదుఎందుకంటే అక్కడ చదువుకోవడమనేది మామూలు విషయం కాదు. అసలు అక్కడికి వెళ్లి చదవాలని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న పిచ్చివాడు.. ఏవేవో అనవసరమైన కలలు కంటున్నాడు అని మనసులోని నవ్వుకున్నాను. కట్‌ చేస్తే.. ఆయన కూతురిగా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఎదుట గ్రాడ్యుయేషన్‌ పట్టాతో నిల్చున్నాను. నిజంగా జీవితం ఎంత విచిత్రమైనదో కదా!అంత స్థోమత ఎక్కడిది?నాకు లండన్‌లో సీటు వచ్చిందన్న విషయాన్ని మొదట వాళ్లకు చెప్పనేలేదు. ఎందుకంటే అక్కడ చదివించేంత స్థోమత మా వాళ్లకు లేదు. అప్పటికే నా ఇద్దరు సోదరుల కోసం స్టూడెంట్‌ లోన్స్‌ తీశారు. నా దగ్గర ఎలాగో అంత డబ్బు లేదు. ఎలాంటి గ్రాంట్లు, సహాయం లభించినా.. అది సరిపోదు. అందుకే అక్కడ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన విషయమే అనిపించింది.పేరెంట్స్‌ అండగాకానీ ఇంట్లో వాళ్లు నాకిదెంత ముఖ్యం అనేది మాత్రమే ఆలోచించారు. డబ్బు ఎలాగోలా సమకూరుస్తాం.. నువ్వెళ్లి చదువు పూర్తి చేయు అని చెప్పి పంపారు. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు చేసే పనికి వారిపై కోప్పడతాను. కానీ వాళ్లు మాత్రం పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు అది నాకు భయంగా ఉంటుంది. అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా మన తల్లిదండ్రులు పక్కనే నిలబడ్డందుకు సంతోషంగానూ ఉంటుంది.అదే అసలు కష్టంనేను కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు దోహదపడ్డ అమ్మానాన్నకు కృతజ్ఞతలు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ సో మచ్‌. గతవారం ఓ ఇంటర్వ్యూలో నేనేమన్నానంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చేరడం ఒక పెద్ద ఫెయిల్యూర్‌ అన్నాను. కానీ అది నిజం కాదు. అసలు అందులో ‍ప్రవేశం పొందడం కష్టమైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులతో పోటీపడటం.. ముఖ్యంగా మనతో మనం పోటీపడటమే ఎక్కువ కష్టమైన పని. చాలా నేర్చుకున్నా..దీన్ని నేను అధిగమించాను, సాదించాను. అందుకు సంతోషంగా ఉంది. LSE నన్నెంతగానో మార్చేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, విషయాలను లోతుగా ఆలోచించడం.. ప్రతిదాన్ని భిన్న కోణాల్లో చూడటం.. ఇలా చాలా నేర్చుకున్నాను అని ఎస్తర్‌ (Esther Anil) రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ కింద పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Esther (@_estheranil) చదవండి: తొలి మూవీకే చేదు అనుభవం.. డబ్బులివ్వకుండా..: నటి

Aadi Saikumar Injured Shambhala Movie Shooting Time2
‘శంబాల’ చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది

టాలీవుడ్‌ నటుడు ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్‌ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’.. ‘ఏ మిస్టిక్‌ వరల్డ్‌’ అనేది ఉపశీర్షిక. యుగంధర్‌ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ మూవీ షూటింగ్‌లో కొన్ని సంఘటనలలో హీరో ఆది గాయపడ్డారని చిత్ర యూనిట్‌ పేర్కొంది.శంబాల మూవీని విజువల్ వండర్‌గా తీర్చి దిద్దే క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌లతో మేకర్లు ఆడియెన్స్‌ని అబ్బుర పరుస్తున్నారు. హీరోలు సైతం ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్‌ల్ని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటాయి. ఇక ‘శంబాల’ చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్‌లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్‌కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్‌ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.‘శంబాల’ ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. అన్ని రకాల బిజినెస్‌లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్‌లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్‌లో ఉషా పిక్చర్స్ వంటి భారీ సంస్థలు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.

Actress Radhika Apte About her First Movie Experience3
ఫస్ట్‌ సినిమా.. డబ్బులివ్వలేదు, దారుణంగా చూశారు

బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. 2005లో వచ్చిన కామెడీ ఫిలిం 'వాహ్‌ లైఫ్‌ ఓతో ఐసీ'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక సినిమాలు, సిరీస్‌లు చేసింది. రెండు దశాబ్దాలుగా టాలెంటెడ్‌ నటిగా సినీరంగంలో రాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.చేదు అనుభవంరాధికా ఆప్టే మాట్లాడుతూ.. అందరూ తమ ఫస్ట్‌ సినిమా గురించి మంచిగా చెప్పుకుంటారు. కానీ, నాకు మాత్రం నా ఫస్ట్‌ మూవీ భయానక అనుభవాలనే పంచింది. నిర్మాత (సంగీత అహిర్‌) నాకు సరైన వసతి కల్పించలేదు, డబ్బులివ్వలేదు. నేను, అమ్మ.. వారిని సినిమా రెమ్యునరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాం.దారుణంగా..కానీ, వాళ్లేమో.. ఊర్మిళ వంటి పెద్ద నటియే ఏ హామీ అవసరం లేదంది.. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అని దాటవేశారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం చాలా దారుణంగా ట్రీట్‌ చేశారు. అందుకే నా ఫస్ట్‌ సినిమాను ఎప్పుడూ మర్చిపోవాలనుకుంటాను అని తెలిపింది..ఆయనే న్యాయ నిర్ణేతసినిమాలో తొలి అవకాశం ఎలా వచ్చిందన్నదాని గురించి మాట్లాడుతూ.. నేను బ్రెయిన్‌ సర్జన్‌ అనే నాటకం వేశాను. మా టీమ్‌కు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. అయితే మాకు అవార్డు ఇచ్చిన జడ్జి టీమ్‌లో దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ ఉన్నారు. నాటకం అయిపోయిన వెంటనే నన్ను పిలిచి సినిమా ఛాన్స్‌ ఇస్తానన్నాడు. అలా ఆయన డైరెక్షన్‌లోనే తెరంగేట్రం చేశాను. చూస్తుండగానే 20 ఏళ్లు గడిచిపోయాయి అని నటి చెప్పుకొచ్చింది.సినిమాలురాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్‌, లయన్‌ చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్‌, మరాఠి, బెంగాలీ, తమిళ సినిమాల్లోనూ యాక్ట్‌ చేసింది. మేడ్‌ ఇన్‌ హెవెన్‌, సేక్రెడ్‌ గేమ్స్‌, ఓకే కంప్యూటర్‌ వంటి వెబ్‌ సిరీస్‌లలోనూ నటించింది. చివరగా సాలి మొహబ్బత్‌ అనే థ్రిల్లర్‌ సినిమాలో కనిపించింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.చదవండి: భార్యకు విడాకులిచ్చిన దేవి నటుడు

Movie Tree landscape On Godavari River now again blooms4
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం

గోదారి గట్టున సినిమా తీస్తే హిట్‌ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్‌.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్‌లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్‌ జరుగుతూనే ఉండేది. అయితే, ముఖ్యంగా గోదారి గట్టున ఉన్న నిద్ర గన్నెరు చెట్టు చాలామందికి సెంటిమెంట్‌గా ఉండేది. అయితే, గతేడాది వర్షాలకు అది కూలిపోయింది.300 సినిమాలుకొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్‌ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్‌ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్‌ ప్రదేశాలు ఉన్నాయి.కూలిపోయిన చెట్టు.. దర్శకుడు వంశీ భావోద్వేగంసితార, లేడీస్‌ టైలర్, డిటెక్టివ్‌ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి–గోపిక–గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చెట్టు కూలిపోయిందని తెలియగానే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వెళ్లారు. కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు. చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్‌లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్‌లు రాలేదన్నారు.చిగురించిన చెట్టుచెట్టు కూలిపోవడంతో చాలామంది బాధపడ్డారు. ఇక ఆ చెట్టు మళ్లీ చిగురించదని అందరూ భావించారు. అయితే, అక్కడి యువకులు మాత్రం ఆ చెట్టును ఎలాగైనా బతికించాలని అనుకున్నారు. అందుకోసం వారికి తోచిన పద్ధతులను అనుసరించారు. ఎట్టకేలకు ఎవరూ ఊహించలేని విధంగా ఆ చెట్టు మళ్లీ చిగురించింది. ప్రస్తుతం గోదారి గట్టుపై ఉన్న నిద్రగన్నేరు చెట్టు పూర్తిగా ఆకులతో కళకళలాడుతూ కనిపించడంతో స్థానికులు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

Actress Sreeleela Comments On Trolls And Netizens5
శ్రీలీల చేతులు జోడించింది.. ఇకనైనా మారండ్రా బాబూ!

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఉదంతం ఎవ్వరూ మరిచిపోలేరు. తన కుటుంబానికి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన సాయం గురించి బహిరంగంగా చెప్పుకోవడమే ఆమె చేసుకున్న పాపమైంది. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా మారిన కొందరు మార్ఫింగ్‌ ఫోటోలతో.. నీచమైన పోస్టులు పెట్టడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరో ఉదంతంలో.. జగన్‌ టైంలో కాకినాడ జిల్లా బెండపూడి స్టూడెంట్‌ మేఘన అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓర్చుకోలేకపోయారు. అక్కడ మేఘన తల్లిదండ్రులు గట్టిగా నిలబడడంతో.. ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు.. తాజాగా నటి శ్రీలీల చేసిన ఓ పోస్ట్‌కి.. పై రెండు ఉదంతాలకూ ఓ కనెక్షన్‌ ఉందనే విషయం మీకు తెలుసా?.. శ్రీలీల ఏం చెప్పిందంటే.. సోషల్‌ మీడియా వినియోగదారులు అసభ్యతతో కూడిన ఏఐ జనరేటెడ్‌ వీడియోలను ప్రోత్సహంచవద్దని ఆమె కోరింది. గీతాంజలి లాంటి ఘటనలు జరగకూడదనే చేతులు జోడించి శ్రీలీల కోరింది. చేతిలో ఫోన్‌ ఉంది కదా అని మీరు పెట్టే ఒక చెత్త కామెంట్‌కు ఎంతమంది నలిగిపోతుంటారు. ఇలాంటి ఉదంతాలు చూసైనా సరే కాస్త మారండి రా బాబు అనేలా శ్రీలీల షేర్‌ చేసిన పోస్ట్‌ ఉంది. సోషల్‌మీడియాలో ట్రోల్స్‌కు దిగుతున్న వారిని చేతులు జోడించి ఆమె అభ్యర్థించింది. టెక్నాలజీని మంచి కోసం మాత్రమే వాడాలని శ్రీలీల కోరింది. అసభ్యత కోసం వాడి ట్రోలింగ్‌కు దిగకండి అని పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగి అయి ఉంటారని గుర్తుచేసింది. ఆన్‌లైన్‌లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకండి అంటూ శ్రీలీల పేర్కొంది.మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది టార్గెట్‌ చేస్తుంది మహిళలనే.. వీటికిసంబంధించిన కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, సినీ నటి అనసూయ, జర్నలిస్టు తులసీచందు, సింగర్‌ చిన్మయి, హీరోయిన్‌ రష్మిక, నివేధా, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే నెట్టింట ట్రోలింగ్‌‌కు గురైన మహిళల జాబితా చాలా పెద్దగానే ఉంది. నేటి సమాజంలో ప్రతి మహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ.. ఎవరూ చదవలేని రీతిలో కామెంట్లు చేస్తున్నారు.ట్రోల్స్‌ వెనుక ఎవరు..?.. ఫోటో మార్ఫింగ్‌ల బారిన పడుతుంది హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, విద్యార్థిణులు యాంకర్స్‌, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇలా ఒక వర్గం అని చెప్పేందుకు లేదు. చివరకు గృహిణులు కూడా ట్రోలింగ్‌తో పాటు ఏఐ మార్ఫింగ్‌ ఫోటోల దాడిలో నలిగిపోతున్నారు. అందుకే శ్రీలీల కూడా ఈ అంశం గురించి పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగిగా ఉంటారనే అంశాన్ని ట్రోలర్స్‌ మరిచిపోతున్నారని ఆమె పేర్కొంది. ఏఐ మార్ఫింగ్‌ ఫోటోలు, వీడియోలు క్రియేట్‌ చేసి ట్రోల్స్‌ వెనుక దాగివున్నది ఎవరినేది చెప్పడం చాలా కష్టం వీరిపై కేసులు పెట్టినా సరే పట్టుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వారందరూ ఎక్కువగా ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025

Adivi Sesh, Mrunal Thakur Dacoit Movie Teaser Out Now6
'కన్నెపిట్టరో..' సాంగ్‌తో డెకాయిట్‌ టీజర్‌

అడివి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్‌. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్‌. అడివి శేష్‌ నటించిన క్షణం, గూఢచారి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానిల్‌ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.టీజర్‌ రిలీజ్‌నాగార్జున నటించిన 'హలో బ్రదర్‌' మూవీలోని కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో పాటతోనే టీజర్‌ మొత్తం సాగుతుంది. చివర్లో ఓ చిన్నారి డాక్టర్‌వా..? అని హీరోను అడిగితే అందుకతడు దొంగ అని బదులిస్తాడు. మొత్తానికి టీజర్‌ అయితే అదిరిపోయింది. టీజర్‌ డిఫరెంట్‌గా బాగుందంటున్నారు అభిమానులు. ఈ మూవీకి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. డెకాయిట్‌ ఉగాది కానుకగా మార్చి 19న విడుదల అవుతోంది.

Bigg Boss fame, Malayalam Actor Shiju Divorced to wife Preethi7
భార్యకు విడాకులిచ్చిన 'దేవి' నటుడు

మలయాళ నటుడు, 'దేవి' సినిమా ఫేమ్‌ షిజు ఏఆర్‌ విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 'ప్రీతి ప్రేమ్‌-నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. దయచేసి ఎటువంటి పుకార్లు సృష్టించకండి. ఇకపై మేము విడివిడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేశాడు.లవ్‌ స్టోరీషిజు మలయాళంలో హీరోగా నటించిన తొలి చిత్రం 'ఇష్టమను నూరు వట్టం'. కువైట్‌లో 12వ తరగతి చదువుతున్న సమయంలో ప్రీతి ఈ సినిమా చూసింది. ఇందులోని హీరో షిజు ఆమెకు తెగ నచ్చేశాడు. కట్‌ చేస్తే కొన్నేళ్లకు ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీ ఎక్కింది ప్రీతి. అలా ఓసారి చెన్నై ఎయిర్‌పోర్టులో షిజును కలిసింది. అప్పుడే ఇద్దరూ మాట్లాడుకోవడం.. నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగాయి. ఫ్రెండ్స్‌గా బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవారు.ఓరోజు షిజు.. ప్రీతికి ఫోన్‌ చేసి నువ్వంటే నాకిష్టం అన్నాడు. టీనేజీ నుంచి ఇష్టపడుతున్న హీరో తనను ఇష్టపడేసరికి ప్రీతికి నోటమాట రాలేదు. వారం రోజుల్లో షిజు ఆమెకు మరోసారి ప్రపోజ్‌ చేశాడు. అప్పుడు కానీ ప్రీతికి ఓ విషయం గుర్తురాలేదు. అతడు ముస్లిం, తాను క్రిస్టియన్‌ అని! కొంత సమయం కావాలని అడిగింది. ఇంట్లో అడిగితేనేమో ఇద్దరి మతాలు వేరని వ్యతిరేకించారు.మతం కన్నా మనిషి వ్యక్తిత్వమే ముఖ్యమని భావించిన ప్రీతి ఎక్కువ ఆలస్యం చేయదల్చుకోలేదు. మూడు రోజుల్లోనే పెళ్లి చేసుకుందామంది. అలా 2008లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టింది. తర్వాత కూతురి సమక్షంలో మరోసారి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విడిపోయారు.సినిమామలయాళంలో అనేక సినిమాలు చేసిన షిజు (Shiju Abdul Rasheed) 'దేవి' మూవీతో తెలుగువారికి పరిచయమయ్యాడు. సింహరాశి, నువ్వు నాకు నచ్చావ్‌, మనసంతా నువ్వే, గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ, శివరామరాజు, శతమానం భవతి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగులో చివరగా రాబిన్‌హుడ్‌ మూవీలో కనిపించాడు. మలయాళ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొనడమే కాకుండా టాప్‌ 5లో ఒకరిగా నిలిచాడు. ప్రీతి.. ప్రస్తుతం ప్రొఫెషనల్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌గా రాణిస్తోంది. అలాగే ఈమె లాయర్‌ కూడా! View this post on Instagram A post shared by Shiju Abdul Rasheed (@shijuar)

Thanuja Bigg Boss Telugu 9 journey Is Bigg Emotional8
చిచ్చర పిడుగు తనూజ.. భారీ ఎలివేషన్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌ తెలుగు 9 సోషల్‌మీడియాలో ట్రెండిగ్‌ టాపిక్‌.. డిసెంబర్‌ 21న ఫైనల్‌ ఎపిసోడ్‌ జరగనుంది. టాప్‌-5లో తనూజ, కల్యాణ్‌, ఇమ్మన్యుయేల్‌, పవన్‌, సంజనలు ఉన్నారు. ఈ క్రమంలో వారి జర్నీ వీడియోలను బిగ్‌బాస్‌ చూపిస్తున్నారు. ముందుగా ఇమ్మన్యుయేల్‌ ప్రయాణాన్ని చూపించిన బిగ్‌బాస్.. గురువారం ఎపిసోడ్‌లో తనూజ గురించి జర్నీ ఉంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్‌ టీమ్‌ వదిలింది.బిగ్‌బాస్‌లో తన జర్నీ చూసుకున్న తనూజ చాలా ఎమోషనల్‌ అయిపోయింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనూజ కన్నీళ్లు పెట్టుకున్నా, నవ్వినా సరే నటిస్తుంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే, అలాంటి విమర్శలు చేసినవారికి సమాధానంగా బిగ్‌బాస్‌ ప్రోమో ఉంది. బిగ్‌బాస్‌ ఇల్లు నటనకు ఎలాంటి ఆస్కారం లేని చోటు అంటూ క్లారిటీ ఇచ్చారు. కత్తికి రెండువైపులా పదునైన వ్యక్తిత్వంతో హౌస్‌లో కొనసాగారంటూ పేర్కొన్నారు.. క్లిష్టపరిస్థితిలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని చిచ్చరపిడుగులా టాప్‌-5లో చేరారని భారీ ఎలివేషన్‌ ఇచ్చారు.

Buzz: Nora Fatehi Special Song in Rajinikanth Jailer 2 Movie9
జైలర్‌ 2లో ఐటం సాంగ్‌!

సినిమాలో ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఐటమ్‌ సాంగ్స్‌ తప్పనిసరిగా మారుతోంది. కథ, కథనాలు ఎంత బాగున్నా, ఆ చిత్రాలకు ఎక్కువ మైలేజ్‌ ఇస్తున్నవి ఐటమ్‌ సాంగ్స్‌నే అంటున్నారు సీనీ పండితులు. అలా ఐటమ్‌ సాంగ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారిన అతి కొద్దిమంది స్టార్‌ హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. రజనీ నటించిన జైలర్‌ మూవీలో తమన్నా అందాలు ఆరబోసిన నువ్వు కావాలయ్యా పాట ఎంత హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. జైలర్‌ 2లో ఐటం సాంగ్‌అదేవిధంగా కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్టెప్పేసిన మోనికా సాంగ్‌ కూడా ఈచిత్రానికి కొంత మైలేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా రజనీ నటిస్తున్న జైలర్‌–2 చిత్రంలోనూ ఐటమ్‌సాంగ్‌ ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు బదులుగా బాలీవుడ్‌ బ్యూటీని ఎంపిక చేసే ప్లాన్‌లో ఉన్నారట! ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.స్టెప్పేయనున్న నోరా ఫతేహి?మోడలింగ్‌ రంగంలో రాణించిన ఈ క్రేజీ భామ హిందీ బిగ్‌బాస్‌ రియాలిటి గేమ్‌షోలోనూ పాల్గొంది. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఇప్పుడు జైలర్‌–2 మూవీలో ఐటమ్‌ సాంగ్‌ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!

Singer Chinmayi Slap On Nidhi Agarwal incident10
నిధి అగర్వాల్‌పై చేతులు.. వీళ్లు మగాళ్లు కాదంటూ చిన్మయి ఫైర్‌

ప్రభాస్‌- మారుతిల సినిమా ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రమోషన్స్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని లులూ మాల్‌కు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.నిధి అగర్వాల్‌ కనీసం తన కారు వద్దకు కూడా చేరుకోవడం కష్టమైంది. అయితే, అక్కడ ఉన్న బౌన్సర్లు అక్కడున్నవారిని వెనక్కి నెట్టి చివరకు నిధి అగర్వాల్‌ను కారు ఎక్కించారు. దీంతో నిధి ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను షేర్‌ చేస్తే.. సింగర్ చిన్మయి ఘాటుగానే స్పందిచారు. నిధి అగర్వాల్‌కు ఎదురైన సంఘటన చాలా దారుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులంటూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. జంతువుల కంటే హీనంగా ఉన్నారంటూ చిన్మయి భగ్గుమంది. ఇలాంటి మానవ మృగాలను భూమిపై ఉంచకుండా మరో గ్రహానికి పంపించాలని కోరింది. Pack of men behaving worse than hyenas.Actually why insult hyenas. Put ‘likeminded’ men together in a mob, they will harass a woman like this. Why doesnt some God take them all away and put them in a different planet? https://t.co/VatadcI7oQ— Chinmayi Sripaada (@Chinmayi) December 17, 2025Vultures Disguised As Fans; Prabhas Starrer "The Raja Saab" Actress Nidhhi Agerwal, was literally gets Mobbed and Crushed by Fans at a Song Launch event in Hyderabad on Wednesday.#NidhhiAgerwal #Prabhas‌ #Hyderabad #TheRajaSaab #SahanaSahana pic.twitter.com/omOzynRQcj— Surya Reddy (@jsuryareddy) December 17, 2025

Advertisement
Advertisement