Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement

A to Z

Advertisement

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Shilpa Shirodkar on Becoming Hairdresser Abroad, Even put SSC Fail in Resume1
సినిమాలు మానేసి సెలూన్‌లో పని చేశా.. 10th ఫెయిలైనా..

నమ్రత శిర్కోదర్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తే చెల్లి శిల్ప శిరోద్కర్‌ (Shilpa Shirodkar) బాలీవుడ్‌లో కథానాయికగా అలరించింది. హమ్‌, ఆంఖెన్‌, పెంచన్‌ వంటి సినిమాలతో శిల్ప హిందీలో ఫుల్‌ బిజీ అయింది. అయితే 2000వ సంవత్సరంలో వచ్చిన గజగామిని మూవీ తర్వాత ఆమె వెండితెరకు విరామం ప్రకటించింది. అప్పుడే యూకేకి చెందిన బ్యాంకు ఉద్యోగి అపరేశ్‌ రంజిత్‌ను పెళ్లాడింది. మొదట్లో ఈ దంపతులు నెదర్లాండ్స్‌కు షిఫ్ట్‌ అయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో సెటిలయ్యారు.కోర్సు నేర్చుకున్నా..ఇక హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ చూసిన శిల్ప.. సినిమాలు మానేశాక ఏం పని చేసిందనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఖాళీగా ఉండకుండా బిజీగా గడపాలని న్యూజిలాండ్‌లో హెయిర్‌డ్రెస్సింగ్‌ కోర్సు నేర్చుకున్నాను. ఇందులో మేకప్‌, బ్యూటీ గురించి ఉండటంతో యాక్టింగ్‌కు కనెక్ట్‌ అయి ఉన్నట్లే అనిపించేది. రెండునెలలపాటు సెలూన్‌లో కూడా పని చేశాను. పనిగంటలు సెట్టవకపోవడంతో మానేశాను. పదో తరగతి ఫెయిల్‌ అని రెజ్యూమ్‌కార్పొరేట్‌ సంస్థలో పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఇంకేదైనా చేయాలనుకున్నాను. నా భర్తకు నా రెజ్యూమ్‌ సిద్ధం చేయమని చెప్పాను. అందుకాయన రెజ్యూమ్‌లో ఏమని రాయను? అన్నాడు. అబద్ధాలు చెప్పకుండా నా గురించి ఉన్నది ఉన్నట్లు రాయు. 10th ఫెయిల్‌ అని, అలాగే సినిమాల్లో పని చేశానని కూడా పేర్కొనమని చెప్పాను. ఆశ్చర్యంగా ఒక్కరోజే నాకు రెండు జాబ్‌ ఆఫర్స్‌ వచ్చాయి. డన్‌ అండ్‌ బ్రాడ్‌షీట్‌ కంపెనీలో క్రెడిట్‌ కంట్రోలర్‌గా ఉద్యోగంలో చేరాను.జోక్‌ కాస్తా నిజమైందికానీ ఉద్యోగంలో చేరిన కొంతకాలానికే నాకు అలసటగా అనిపించేది. ఇదే మాట నా స్నేహితురాలికి చెప్తే ప్రెగ్నెంట్‌ అయ్యావేమో అని జోక్‌ చేసింది. ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేసుకుంటే పాజిటివ్‌ అని తేలింది. కానీ ఆ జర్నీ అంత ఈజీగా సాగలేదు. ఇన్సులిన్‌ ఇంజక్షన్లు, బరువు తగ్గేందుకు ప్రయత్నాలు.. ఇలా చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. అలా నాకు కూతురు అనుష్క పుట్టింది. దాంతో సినిమాలకు మరింత దూరంగా ఉండాల్సి వచ్చింది అని శిల్ప శిరోద్కర్‌ చెప్పుకొచ్చింది.చదవండి: అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్‌?!.. అతడితోనే సమంత విందు, విహారం

Police Vaari Hecharika Release Date out2
త్వరలో ‘హెచ్చరిక ’

సన్నీ అఖిల్, అజయ్‌ ఘోష్, రవి కాలే, ‘శుభలేఖ’ సుధాకర్, షాయాజీ షిండే, ‘శంకరాభరణం’ తులసి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘΄పోలీస్‌వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్, నటి ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మేమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జీ మీద ఉన్న గౌరవం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి’’ అన్నారు ‘శుభలేఖ’ సుధాకర్‌. ‘‘ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు సముద్ర నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘మా సినిమాని అందరూ చూసి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు బెల్లి జనార్ధన్‌. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘సినిమాల కోసం పని చేసేవారు తాము చేసిన చిత్రం విడుదలైన ప్రతిసారీ పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తారు. మా ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ని ఆదరించాలి’’ అని పేర్కొన్నారు.

Alia Bhatt Ex Assistant Arrested For Cheating Actor Of RS 77 Lakh3
హీరోయిన్‌ పేరుతో 77 లక్షల మోసం.. మాజీ పీఏ అరెస్ట్‌!

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌(Alia Bhatt ) మాజీ పర్సనల్‌ అసిస్టెంట్‌(పీఏ) వేదికా ప్రకాశ్‌ శెట్టిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హీరోయిన్‌ సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 77 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి, దర్శకురాలు సోనీ సోనీ రజ్దాన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో వేదిక ప్రకాశ్‌శెట్టిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2021 నుంచి 2024 వరకు అలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. ఆ సమయంలో ఆలియాకు సంబంధించిన ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లు, పేమెంట్స్‌, షెడ్యూల్‌ ప్లానింగ్‌లను వేదికనే చూసుకునేది. అదే సమయంలోనే వేదికా నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా సంతకాన్నీ మార్ఫింగ్‌ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐదు నెలల క్రితమే వేదికపై ఆలియా తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సోనియా ముంబై నుంచి పారిపోయింది. రాజస్తాన్‌, కర్ణాటక, పుణెల్లో తిరుగుతూ.. చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్‌ చేసి ముంబైకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Samantha Ruth Prabhu holds Raj Nidimoru Close in Detroit, America4
అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్‌?!.. అతడితోనే విందు, విహారం..

స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) ఇటీవల తానా వేడుకల కోసం అమెరికా వెళ్లింది. మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తూనే ఉన్నారంటూ భావోద్వేగానికి లోనైంది. తెలుగువారికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంది. ఈ వేడుకల అనంతరం సామ్‌ అమెరికాలో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది.రాజ్‌తో అమెరికాలో చెట్టాపట్టాల్‌అమెరికాలోని డెట్రాయిట్‌లో తనకు నచ్చిన ఫుడ్‌ తింటూ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో రెండు ఫోటోల్లో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కూడా ఉండటం విశేషం! ఓ ఫోటో అయితే.. వీరిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రాజ్‌.. ఆప్యాయంగా సామ్‌ భుజంపై చేయి వేశాడు. అతడి సాన్నిహిత్యంలో ఉన్న సామ్‌ నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మరో ఫోటోలో రాజ్‌తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్‌తో లంచ్‌కు వెళ్లింది. ఇది చూసిన అభిమానులు.. సామ్‌.. రాజ్‌తో రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.ఎలా మొదలైంది?రాజ్‌ నిడిమోరు (Raj Nidimoru), తన స్నేహితుడు కృష్ణతో కలిసి ద ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ డైరెక్ట్‌ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది. అప్పుడే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిద్దరూ సిటాడెల్‌: హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌ చేశారు. సమంత చేతిలో ఉన్న రక్త బ్రహ్మాండ్‌: ద బ్లడీ కింగ్‌డమ్‌ ప్రాజెక్టుకు సైతం రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.పర్సనల్‌ లైఫ్‌అయితే రాజ్‌కు ఇదివరకే పెళ్లయింది. అతడికి భార్యతో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్‌.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్‌ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు.

RK Sagar About Mr Perfect, Rangasthalam Movie5
ఆ సినిమా చేయడమే తప్పు.. రంగస్థలం రిజెక్ట్‌ చేశా: ఆర్కే సాగర్‌

మొగలిరేకులు.. అప్పట్లో ఈ సీరియల్‌ ఒక సెన్సేషన్‌. ఇందులో పోలీసాఫీసర్‌ ఆర్కే నాయుడిగా నటించి బుల్లితెర హీరో అయ్యాడు నటుడు సాగర్‌. అప్పటికే చక్రవాకం ధారావాహికతోనూ బోలెడంత పాపులర్‌ అయ్యాడు. ఈ ఫేమ్‌ వల్ల సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అలా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా చేశానని, కానీ రంగస్థలం వదిలేసుకున్నానని చెప్తున్నాడు.నేను చేసిన తప్పుఆర్కే సాగర్‌ (R.K. Sagar) హీరోగా నటించిన తాజా చిత్రం ది 100. సైబర్‌ క్రైమ్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 11న రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు సాగర్‌. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా లైఫ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా చేయడం నేను చేసిన తప్పు. మొగలిరేకులు సీరియల్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ మూవీ (Mr Perfect Movie)లో ఛాన్స్‌ వచ్చింది. 15 రోజులు డేట్స్‌ ఇచ్చా..అందులో సెకండ్‌ లీడ్‌ నాదే అన్నారు. పెద్ద బ్యానర్‌ అని ఒప్పుకున్నాను. అప్పటివరకు నాకు సినిమాలపై పెద్దగా అవగాహన లేదు. సీరియల్‌ టీమ్‌ను ఎలాగోలా ఒప్పించి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ టీమ్‌కు 15 రోజులు డేట్స్‌ ఇచ్చాను. మొదటి మూడురోజులు నాకు షూటింగ్‌ లేదు. అనుమానం వచ్చి డైరెక్టర్‌ దశరథ్‌ను అడిగితే రేపు నీ సీన్‌ ఉంటుందన్నాడు. అలా నాపై రెండు మూడు సీన్లు తీశారు.చాలా డిసప్పాయింటయ్యాసెకండ్‌ లీడ్‌ అని వెళ్తే.. అక్కడంతా రివర్స్‌లో జరుగుతోందనిపించింది. నాకు చెప్పిన క్యారెక్టర్‌ ఇది కాదు కదా అనిపించింది. అదే విషయం నిలదీశాను. అసలు నాది సెకండ్‌ లీడేనా? అని అడిగాను. అందుకాయన.. అప్పుడప్పుడు క్యారెక్టర్లు మారుతుంటాయి. అర్థం చేసుకోండి అన్నారు. చాలా నిరాశచెందాను. నేను చేయాలనుకుంది ఇది కాదు కదా అనిపించి బయటకు వచ్చేశాను.నా సీన్లు లేపేయమన్నానా సీన్లు తీసేయమన్నాను. ఎందుకంటే డబ్బు కోసం సినిమా చేయట్లేదు, వెండితెరపై నా ఎంట్రీ బాగుండాలని చేశానంతే! నా క్యారెక్టర్‌ను తీసేసి వేరే పాత్రను హైలైట్‌ చేసుకోండి అని చెప్పాను. అయినప్పటికీ సినిమాలో నా రోల్‌ అలాగే ఉంచారు. ఆ సినిమా ఇంపాక్ట్‌ నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఆ మూవీ రిలీజయ్యాక చాలామంది అలాంటి రోల్‌ చేశావేంటి? అని అడిగారు. అప్పుడే మంచి సినిమాలు చేయాలని డిసైడయ్యాను.రంగస్థలం రిజెక్ట్‌ చేశా..రంగస్థలం మూవీలోనూ ఆఫర్‌ వచ్చింది. కానీ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా దెబ్బతో మళ్లీ నా పాత్రను ఎటు తిప్పుతారో ఏంటోనని భయపడి వెనకడుగు వేశాను. ఆ తర్వాత హీరో ఆదిగారిని సంప్రదించారని తెలిసింది. ఆయన కూడా ఒప్పుకోలేదు. కొద్దిరోజులకు ఇద్దరం ఒకేసారి ఒప్పుకున్నాం. అప్పటికే ఆది.. సుకుమార్‌కు ఫోన్‌ చేసి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తనను సెలక్ట్‌ చేశారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: హీరోయిన్‌తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్‌

Ranbir Kapoor, Sai Pllavi Ramayana Has Already Earned RS 1000 Crore Just With Its First Look6
సాయిపల్లవి సినిమాకు రూ.1000 కోట్ల లాభం.. అదీ విడుదల కాకుండానే...

సినిమాల లాభాలు సాధారణంగా ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత గానీ లెక్కకు రావు. అరుదుగా కొన్ని సెన్సేషనల్‌ చిత్రాలు మాత్రం బిజినెస్‌ రైట్స్‌ అమ్మకాలు వంటి వాటి ద్వారా ముందే రికార్డ్స్‌ సృష్టిస్తాయి. అయితే వీటన్నింటికీ అతీతంగా హక్కుల అమ్మకాల ద్వారా కాకుండా ఎప్పుడూ ఎవరూ చవిచూడని రీతిలో ఓ సినిమా లాభాలను ఆర్జించి వార్తల్లో నిలిచింది. బహుశా భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా లాభాలు అదీ ఈ స్థాయిలో అందుకున్న తొలిసినిమా ఇదే కావచ్చు. ఆ సినిమా పేరు రామాయణ(Ramayana). భారత దేశంలో హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించే పౌరాణిక గాధ... భారతీయ సినిమాను సైతం శాసించనున్నట్టు ఈ రికార్డ్స్‌ వెల్లడిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నభూతో నభవిష్యత్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.1000 కోట్ల వరకూ అంచనా వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే రూ.1000 కోట్ల లాభాలు ఎలా అర్జించిందీ అంటే...వెయ్యికోట్ల లాభం వెనుక...ఈ భారీ మైథలాజికల్‌ ప్రాజెక్ట్‌ను నమిత్‌ మల్హోత్రా ఆధ్వర్యంలోని ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బిఎస్‌ఇ)లో లిస్టింగ్‌ లో ఉన్న కంపెనీ ప్రైమ్‌ ఫోకస్‌. ఈ ప్రతిష్టాత్మక సినిమా ‘రామాయణ’ తొలి గ్లింప్స్‌ ఈ నెల3న విడుదలైంది. ఆ విడుదలతోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు, ప్రచారం పెరుగుతూ పోతుండడంతో ప్రైమ్‌ ఫోకస్‌ కంపెనీకి స్టాక్‌ మార్కెట్‌లో భారీ లాభాలు రావడం మొదలైంది. ఈ కంపెనీ షేర్లు జూన్‌ 25న రూ113.47 వద్ద ఉండగా, జూలై 1 నాటికి రూ.149.69కి పెరిగాయి. అయితే, జూలై 3న ‘రామాయణం’ ఫస్ట్‌ లుక్‌ విడుదలైన రోజున ఈ షేర్‌ విలువ ఏకంగా రూ.176కి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ జూలై 1న రూ.4638 కోట్ల నుంచి రూ5641 కోట్లకు పెరిగింది. అంటే, కేవలం రెండు రోజుల్లోనే సంస్థకు రూ.1000 కోట్ల వరకూ సంపద పెరిగింది. మార్కెట్‌ ముగిసే సమయానికి షేర్‌ ధర ₹169గా ఉండగా, మొత్తం క్యాప్‌ దాదాపు 5200 కోట్ల వద్ద స్థిరపడింది.భారీ పారితోషికం...హీరోకి కూడా షేర్లు...ఇక ఈ సినిమా హీరో రణబీర్‌ కపూర్‌(Ranbir Kapoor) కూడా నిర్మాణ సంస్థలో పెట్టుబడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ బోర్డు మంజూరు చేసిన 462.7 మిలియన్‌ షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యులో రణబీర్‌ కూడా షేర్లను పొందారని బిజినెస్‌ స్టాండర్డ్‌ వెల్లడించింది. రణబీర్‌ మొత్తం 12.5 లక్షల షేర్లను కలిగి ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రణబీర్‌కు రూ.150కోట్ల వరకూ పారితోషికం చెల్లిస్తున్నట్టు సమాచారం. నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో విడుదల కానుంది.సీతగా సాయిపల్లవి...ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా రావణుడిగా, యష్‌(yash)లు నటిస్తుండగా సీత పాత్రలో దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తుండడం విశేషం. ఇక లక్ష్మణుడిగారవీ దూబే హనుమంతుడిగా సన్నీ డియోల్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఏఆర్‌ రెహ్మాన్, హాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్‌ జిమ్మర్‌ కలిసి సంయుక్తంగా రూపొందించనున్నారు. హాన్స్‌ జిమ్మర్‌కు ఇది బాలీవుడ్‌ లో ఆరంగేట్రం కావడం విశేషం.రామాయణం’ ప్రాజెక్ట్‌తో భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం సాకారమవుతోందని సినీవర్గాలు భావిస్తున్నాయి.

Buzz: Keerthy Suresh Enters Into Politics7
రాజకీయాల్లోకి కీర్తి సురేష్‌.. ఆ పార్టీలో చేరనుందా?

సినీ కథానాయికలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యం కాదు. నటి కీర్తి సురేష్‌ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఒక సమయంలో ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని ఆశ పడ్డారట. ఓ భేటీలో తన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే కథానాయికిగా రంగ ప్రవేశం చేసి పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇదు ఎన్నమాయం చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్‌ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందించింది. ఆ తరువాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్‌ ప్రేక్షకులను బేబీ జాన్‌ చిత్రంతో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల స్నేహితుడిని గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతనో, వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్‌కు అవకాశాలు తగ్గాయి. వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కారం అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్‌గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే..టీవీకే అంటూ నటుడు విజయ్‌ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తిసురేష్‌ నటుడు విజయ్‌కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు. దీంతో కీర్తి సురేష్‌ నటుడు విజయ్‌ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్‌ అయ్యింది. దీనిపై కీర్తి సురేష్‌ స్పందించలేదు. దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్‌ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్‌ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే అంటూ కేకలు పెట్టారు. మరి నటి కీర్తి సురేష్‌ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Shine Tom Chacko Apologizes To Vincy Aloshious8
హీరోయిన్‌తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్‌

‘దసరా’ విలన్‌ షైన్‌ టామ్‌ చాకో(Shine Tom Chacko ) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. డ్రగ్స్‌ ఆరోపణలు, కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదం..ఆ ప్రమాదంలో తండ్రి మరణించడం.. ఇవన్నీ చాకోని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో చేసిన తప్ప్పులను సరిదిద్దుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో తన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డ నటి విన్సీసోనీ అలోషియన్‌(Vincy Aloshious)కి తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కావాలని అలా చేయలేదని.. ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలంటూ మీడియా ముందే ఆమెను కోరారు. చాకో చెప్పిన సారీని విన్సీ అంగీకరించడంతో వివాదానికి ఎండ్‌ కార్డు పడింది.సూత్రధారి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మధ్య విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మలయాళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇదే సినిమా ప్రచారం కోసం వచ్చిన చాకో.. అందరి ముందే విన్సీకి క్షమాపణలు చెప్పాడు. ‘నేను కావాలని మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను సరదాగా చెప్పానంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. నా ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడినందుకు క్షమించాలి’ అని కోరగా.. పక్కనే ఉన్న విన్సీ మైక్‌ తీసుకొని ‘ఆ సమయంలో ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆయన నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. నేను స్పందించిన తీరు ఆయన కుటుంబాన్ని కూడా ఎంతో బాధించింది. ఇప్పుడు ఆయనలో మార్పు కనిపిస్తుంది. తప్పు తెలుసుకున్నాడు. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అని పేర్కొంది. విన్సీ క్షమించడంతో చాకోకు ఒక పెద్ద రిలీఫ్‌ లభించినట్లు అయింది. ఇప్పటికే డ్రగ్స్‌ కేసుతో ఇబ్బంది పడుతున్న చాకో.. సారీ చెప్పి మంచి పనే చేశాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సినిమా షూటింగ్‌లో అయితే వివాదం చెలరేగిందో.. అదే సినిమా ఈవెంట్‌లో దాన్ని పరిష్కరించుకొని ఒక సమస్యను తగ్గించుకున్నాడు.

Tollywood actresses Daily Updates In Social Media went viral9
జిమ్‌లో బిగ్‌బాస్ దివి వర్కవుట్స్.. మాల్దీవుస్‌లో హీరోయిన్ ప్రణీత!

బిగ్‌బాస్ దివి జిమ్‌ వర్కవుట్ పోజులు.చిన్నపిల్లలతో బిగ్‌బాస్ అశ్విని శ్రీ ..మాల్దీవుల్లో హీరోయిన్ ప్రణీత వేకేషన్..శారీలో హీరోయిన్ ప్రియమణి పోజులు..స్విమ్మింగ్‌పూల్‌లో సేదతీరుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by HemaDayal (@hemadayal18) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi)

Ravi Mohan estranged wife Aarti reflects on life in new post about love10
జయం రవితో విడాకుల వివాదం.. ఆర్తి తొలిసారి ఎమోషనల్ పోస్ట్!

కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం గత కొద్దికాలంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల వివాహాబంధానికి ముగింపు పలికేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గతేడాది చివర్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు జయం రవి. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాము విడిపోవడానికి కారణం మూడో వ్యక్తేనని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. పరోక్షంగా సింగర్ కెన్నీషాను ఉద్దేశించి విమర్శలు చేసింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో కోర్టు విచారణకు హాజరవుతున్నారు.అయితే తాజాగా జయం రవి భార్య ఆర్తి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ పెరుగుతూనే ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఇద్దరు పిల్లలు, పెట్‌ డాగ్‌తో ఉన్న వరుస ఫోటోలను షేర్ చేసింది. కొన్ని హృదయాలకు ఎక్కడ ఉండాలో తెలుసంటూ రాసుకొచ్చింది.ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ.. "కొన్ని సాయంత్రాలు, కొన్ని పెరుగుతున్న విషయాల మధ్య సూర్యాస్తమయం.. గట్టిగా పట్టుకునే రెండు చేతులు.. ఎలాంటి మాటలు లేకున్నా దగ్గరగా ఉండే హృదయం.. ప్రతిదీ సంపూర్ణంగా అనిపించేలా చేసే నిశ్శబ్ద ప్రేమ ' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. జయం రవితో విడాకుల వివాదం ప్రేమ, హృదయం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇది చూసిన హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా స్పందించింది. చాలా అందంగా ఉంది.. ఆర్తు అంటూ కామెంట్ చేసింది. కాగా.. 16 ఏళ్ల క్రిత రవి, ఆర్తి పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)

Advertisement
Advertisement