ప్రధాన వార్తలు
వారి హృదయంలో హనుమ ఉంటారు: మంచు మనోజ్
‘‘ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేదు. కంటెంట్ బాగుండే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాగున్న ప్రతి సినిమా భాషలకు అతీతంగా ఇండియన్ సినిమా అయ్యింది. సాయం చేసే ప్రతి ఒక్కరి హృదయంలో హనుమ(ఆంజనేయస్వామి) ఉంటారు. అవినాశ్, అతని టీమ్ కష్టపడి చేసిన ‘వానర’ సినిమా సక్సెస్ కావాలి’’ అని మంచు మనోజ్ అన్నారు. అవినాశ్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వానర’. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించగా, నందు విలన్ గా పాత్రపోషించారు.శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజ్కి సిద్ధం అవుతోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన మనోజ్ మాట్లాడుతూ–‘‘అవినాశ్ ఫాదర్ హనుమంతరావుగారు హీరో కావాలనుకున్నారు. కానీ,పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్లారు. ఆయన తన కలను కొడుకు అవినాశ్ ద్వారా నిజం చేసుకున్నారు’’ అని చెప్పారు.‘‘వానరుడిలాంటి హీరో బైక్ని రావణుడిలాంటి విలన్ తీసుకెళ్లిపోతే, ఆ బైక్ను తిరిగి తెచ్చుకునేందుకు ఎలాంటిపోరాటం చేశాడు? అన్నదే ఈ చిత్ర కథ’’ అని అవినాశ్ తిరువీధుల తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శంతను పత్తి. డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, నటులు శివాజీ రాజా, హర్ష, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, స్టోరీ– స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్, కెమెరామెన్ సుజాత సిద్ధార్థ్, క్రియేటివ్ డైరెక్టర్ జానకీరామ్ మాట్లాడారు.
అఖండ 2 ప్రేక్షకులను అలరిస్తుంది: బోయపాటి శ్రీను
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమ్. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న రిలీజ్ కానుంది. ‘అఖండ 2’లో బాలకృష్ణ వినియోగించిన వాహనాన్ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ–‘‘ఒక పవర్ ఉన్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఈ వెహికల్ కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది.ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో ఈ వెహికల్ని ఎంత అద్భుతంగా చూపించామో థియేటర్స్లోనే చూడాలి. ఈ వెహికల్ డిజైన్ కోసం అమర్ చాలా కష్టపడ్డారు.. అందుకు ఆయన్ను అభినందించాలి. ‘అఖండ 2’ భారతదేశ ఆత్మ. ప్రేక్షకులు, అభిమానులందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘అఖండ 2’లాంటి సినిమాకి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వెహికల్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేస్తుంది’’ అని చెప్పారు అమర్.
నా కెరీర్లో శివ ప్రత్యేకం: నాగార్జున
‘‘నా కెరీర్లో ‘శివ’ సినిమా చాలా ప్రత్యేకం. అలాగే ‘గీతాంజలి’ చిత్రం కూడా. ‘శివ’ లాంటి సినిమా మళ్లీ ఇప్పుడు వస్తుందా? అంటే చెప్పలేను. అప్పట్లో జరిగిపోయిందంతే’’ అని హీరో నాగార్జున చెప్పారు. గోవా వేదికగా జరుగుతున్న 56వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా నటించిన ‘శివ, గీతాంజలి’ సినిమాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పెషల్ స్క్రీనింగ్ అయ్యాయి. ‘ప్రిజర్వింగ్ ది క్లాసిక్స్: ది జర్నీ ఆఫ్ శివ’ కార్యక్రమంలో భాగంగా నాగార్జున గోవా వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ –‘‘శివ’ 36 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటి సినిమాలానే ఉంటుంది.కేవలం యాక్టింగ్ పరంగానే కాదు.. సౌండ్ డిజైన్ , కెమెరా వర్క్, లైటింగ్ ఫ్యాట్రన్ , డైరెక్షన్ బ్రిలియన్సీ... ఇలాంటి అంశాలు ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తాయి. ఇలా టెక్నికల్ పరంగానూ ఈ సినిమా ఇప్పటికీ రిలవెంట్గానే ఉంటుంది. ఇది నా ప్రామిస్. ‘శివ 4కె’ వెర్షన్ స్క్రీనింగ్ కోసం వచ్చిన మీ అందరికీ (వీక్షకులను ఉద్దేశిస్తూ...) ధన్యవాదాలు’’ అన్నారు. దివంగత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వైకుంఠ్ బాబ్ శత జయంతి వేడుకలు ‘ఇఫీ’లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పేరిట ఓపోస్టల్ స్టాంప్ని విడుదల చేశారు.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్కు కేంద్రం గుడ్న్యూస్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)కు కేంద్ర హోంశాఖ గుడ్న్యూస్ తెలిపింది. సుమారు 27 ఏళ్లుగా ఛారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్తో పాటు ఐ బ్యాంకు కూడా చిరంజీవి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)ను ఎఫ్సీఆర్ఏ కింద నమోదుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకనుంచి విదేశీ విరాళాలు తీసుకునే వెసులుబాటును ట్రస్టుకు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్సీఆర్ఏ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ అనుమతి కోసం కేంద్రాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆమోద ముద్రవేసినట్టు తెలుస్తోంది.
బిగ్బాస్
ఓవర్ చేసిన యావర్.. అతడే చిట్టచివరి కెప్టెన్!
దండం పెడ్తా, నీ కాళ్లు మొక్కుతా.. అడుక్కున్న సోహైల్
నీకో దండం దివ్య.. చేతులెత్తి మొక్కిన భరణి
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్కు ఛాన్సే లేదు!
ప్రేరణ ఎంట్రీ.. ధైర్యంగా ముందుకొచ్చి బొక్కబోర్లా పడ్డ తనూజ
కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోపోయా.. భరణి భావోద్వేగం
బిగ్బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
ఇదేమైనా చిన్నపిల్లల ఆటనా?: తనూజను నామినేట్ చేసిన భరణి
A to Z
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్
ఓటీటీల్లో ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు ఉండొచ్చు....
ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ కామెడీ థ్రిల్లర్
అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్...
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా
రీసెంట్ టైంలో ప్రేమకథలతో సినిమాలు తీస్తున్నప్పటికీ...
ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన
హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన హిట్...
వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు
సడన్గా బోలెడంత పాపులారిటీ వస్తే ఏ సెలబ్రిటీ సంతోష...
'తీవ్ర మానసిక వేదన అనుభవించా'.. విదేశీ భర్తపై నటి ఫిర్యాదు.!
బాలీవుడ్ నటి, హీరోయిన్ సెలీనా జైట్లీ కోర్టును ఆశ్ర...
ధర్మేంద్ర తొలి సినిమా పారితోషికం.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ శకం ముగిసింది. దిగ్గజ నటుడు...
వంద ఎకరాల ఫామ్ హౌస్.. లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర ఆస్తులివే!
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇవాళ కన...
మైఖేల్ డేట్ ఫిక్స్
పాప్ మ్యూజిక్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధా...
రూ. 7వేల కోట్ల సినిమా.. ఓటీటీలో ఉచితంగానే స్ట్రీమింగ్
హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ (Jura...
తెరపై తండ్రి కూతురు.. నిజజీవితంలో ఆమెపై వేధింపులు
ఓటీటీలో 'స్ట్రేంజర్ థ్రింగ్స్' అనే వెబ్ సిరీస్ మన ...
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఇండియాలోనూ రిలీజ్
హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ఇండియన్ అభిమానులను...
చిరు కంటే ఆయనే బెస్ట్ డ్యాన్సర్.. కీర్తి సురేశ్ క్లారిటీ.!
కీర్తి సురేశ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అభిమానులను ...
ఆంధ్ర కింగ్ తాలూకా.. ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే చాలు..!
రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఆంధ్ర క...
బోల్డ్ సీన్.. ఆ విషయం డైరెక్టర్ ముందే చెప్పారు.. కానీ..: ఆండ్రియా జెరెమా
సింగర్గా మాత్రమే కాదు.. నటిగా, హీరోయిన్గా తనకంటూ...
మరో సినిమాకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ నటి రేణు దేశాయ్.. రవితేజ మూవీ టైగర్ నాగేశ...
ఫొటోలు
సింపుల్గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)
అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)
Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం (ఫొటోలు)
దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)
రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)
జెనీ ప్రొడక్షన్ నంబర్ 1 సినిమా ప్రారంభం (ఫొటోలు)
‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
గాసిప్స్
View all
రజనీకాంత్ సినిమాలో సాయిపల్లవి?
సిక్స్ప్యాక్తో హీరో సెకండ్ ఇన్నింగ్స్..
ఫ్యామిలీ మ్యాన్-3.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
హిట్ మూవీ దర్శకుడితో సాయిపల్లవి మరోసారి?
రవితేజతో సమంత.. ఓ క్రైమ్ థ్రిల్లర్!
'వారణాసి' ఈవెంట్కి అన్ని కోట్లు ఖర్చయిందా?
ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!
న్యూయార్క్లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?
ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్
'గర్ల్ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?
రివ్యూలు
View all
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
3
‘కాంత’ మూవీ రివ్యూ
2.5
'జిగ్రీస్' మూవీ.. నలుగురి స్నేహితుల కథ (రివ్యూ)
40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!
3
Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ
సినీ ప్రపంచం
సౌత్లో విలన్లుగా బాలీవుడ్ హీరోలు.. నచ్చట్లేదు!
కొంతకాలంగా సౌత్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ విలన్గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఆఫర్ చేయడం సబబు కాదంటున్నాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. నాకు సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. నచ్చట్లే..కానీ ఇక్కడేం జరుగుతుందంటే మాకు నెగెటివ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెప్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్ దర్బార్లోనూ నెగెటివ్ రోల్ చేశాను. కాకపోతే రజనీ సర్తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నాను. కంటెంటే కింగ్ఈ మధ్యే 'జై' అనే తుళు సినిమా చేశాను. ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అందులో యాక్ట్ చేశా.. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్ ఒక్కటే కింగ్. కంటెంట్ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్ శెట్టి చివరగా కేసరి వీర్, నడానియన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్, హెరా ఫెరి 3 మూవీస్ చేస్తున్నాడు. ఈయన తెలుగులో మోసగాళ్లు, గని సినిమాలు చేశాడు.చదవండి: తనూజతో అతి చేసిన యావర్.. చివరి కెప్టెన్ ఎవరంటే?
కామెడీ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలోకి..
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాల తర్వాత కానీ ఓటీటీలోకి రావు. కానీ ఓ తెలుగు మూవీ మాత్రం కేవలం వారానికే ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఆ సినిమాయే పాంచ్ మినార్. రాజ్తరుణ్ హీరోగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మించారు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ గత సినిమాలకంటే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్ సర్ప్రైజ్గా స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు.కథేంటంటే..కిట్టు (రాజ్ తరుణ్) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్కాయిన్ స్కామ్ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్ బుక్ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! చదవండి: బిగ్బాస్ హౌస్ చివరి కెప్టెన్ ఎవరంటే?
ఓవర్ చేసిన యావర్.. అతడే చిట్టచివరి కెప్టెన్!
యోధులొస్తున్నారు.. రణరంగంలోకి దిగండి, గెలిచి చూపించండి అని వీర లెవల్లో బిల్డప్ ఇచ్చాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). మొదటిరోజు నిజంగానే గట్టి పోటీనిస్తూ ఆడారు. కానీ తర్వాత వచ్చినవాళ్లంతా హౌస్మేట్స్ను గెలిపించడానికే ఓడిపోయినట్లుగా కనిపించింది. మరికొందరేమో ఈ ఆటలన్నీ మా వాళ్ల కాదు, చిల్ అవడానికే వచ్చామన్నట్లుగా ఉన్నారు. ఇంతకీ హౌస్లో ఏం జరిగిందో గురువారం (నవంబర్ 27వ) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..అతి చేసిన యావర్బిగ్బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ వచ్చాడు. వచ్చీరావడంతోనే తనూజ నీకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడా? అని సూటిగా అడిగాడు. ఆమె లేదని చెప్పగానే తనతో కలిసి రొమాంటిక్ పాటకు స్టెప్పులేశాడు. కాకపోతే సాల్సా డ్యాన్స్ చేసి తనను ఇబ్బందిపెట్టినట్లుగానే కనిపించింది. ఆ తర్వాత ఆమె కోసం ప్రేమ పాట పాడాడు. అనంతరం ఇమ్మాన్యుయేల్తో కలిసి గేమ్ ఆడాడు. ఈ ఆటలో ఇమ్మూ గెలిచాడు.భరణి వర్సెస్ దివ్యకొన్నివారాలుగా తన ఆట కనిపించడం లేదని నామినేట్ చేసేసరికి బాగా హర్టయింది సంజన (Sanjana Galrani). అందరికీ కనిపించాలి, అంతేగా.. అని భరణి ట్యాబ్లెట్లు దొంగిలించేసింది. దొంగతనాలు సంజనాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి.. తీస్తే ఇచ్చేయండి అని వెళ్లి ఆమెనే అడిగాడు భరణి. ఇమ్మాన్యుయేల్ కూడా ఇది సరదా విషయం కాదని చెప్తే ఆమె మాత్రం ఏం పర్లేదంది. మధ్యలో దివ్య కలగజేసుకుని సంజనా ఎలాగో వినది.. ఇమ్మాన్యుయేల్ పడుకో, లైట్ తీసుకో అంది.శోభాపై గెలిచిన దివ్యదీంతో భరణి.. దివ్యపై అరిచాడు. మధ్యలో ఎందుకు మాట్లాడతావ్? ఆరిందలా దిగుతావ్.. అన్నాడు. అలా ఇద్దరూ గొడవపడ్డారు. అప్పటికీ అదంతా సైలెంట్గా చూస్తూ ఉండిపోయిన సంజనా.. ఉదయానికి టాబ్లెట్స్ ఇచ్చేసింది. అనంతరం బిగ్బాస్ 7 కంటెస్టెంట్ శోభా శెట్టి హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. శోభాతో పోటీపడి దివ్య గెలిచి కంటెండరయింది. తర్వాత బిగ్బాస్ 4 ఫైనలిస్ట్ సోహైల్ అడుగుపెట్టాడు. అతడి ఎంట్రీతో హౌస్లో కొత్త ఎనర్జీ వచ్చింది.అతడే చివరి కెప్టెన్కిలో చికెన్, రెండు పాల ప్యాకెట్స్, కాఫీ పౌడర్ పంపించమని బిగ్బాస్కే ఆర్డరేశాడు సోహైల్. కాసేపు అతడిని ఆటాడుకున్నప్పటికీ చివరకు సోహైల్ అడిగినవన్నీ పంపించాడు. తర్వాత రీతూ, సంజనాతో కలిసి సోహైల్ గేమ్ ఆడాడు. ఈ ఆటలో సంజన, రీతూ గెలిచారు. అలా చివరి కెప్టెన్సీ కోసం కల్యాణ్, పవన్, దివ్య, ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ పోటీపడనున్నారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం కెప్టెన్సీ గేమ్లో చివరి రౌండ్లో పవన్, ఇమ్మాన్యుయేల్ నిలిచారు. ఇమ్మూని ఓడించి డిమాన్ పవన్ చిట్టచివరి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ సినిమాలో సాయిపల్లవి?
తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. రజనీ హీరోగా, కమల్ నిర్మాతగాఅయితే దీనికంటే ముందు కమల్హాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.సాయిపల్లవి?పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్కు కేంద్రం గుడ్న్యూస్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)కు కేంద్ర హోంశాఖ గుడ్న్యూస్ తెలిపింది. సుమారు 27 ఏళ్లుగా ఛారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్తో పాటు ఐ బ్యాంకు కూడా చిరంజీవి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)ను ఎఫ్సీఆర్ఏ కింద నమోదుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకనుంచి విదేశీ విరాళాలు తీసుకునే వెసులుబాటును ట్రస్టుకు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్సీఆర్ఏ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ అనుమతి కోసం కేంద్రాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆమోద ముద్రవేసినట్టు తెలుస్తోంది.
'ప్రేమలో రెండోసారి' త్వరలో ఓటీటీలో విడుదల
సిద్ధా క్రియేషన్స్ బ్యానర్పై రమణ సాకే, వనితా గౌడ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ప్రేమలో రెండోసారి'. సాకే రామయ్య సమర్పించిన ఈ చిత్రాన్ని సత్య మార్క దర్శకత్వం వహించారు. నీరజ లక్ష్మి నిర్మించారు. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి, సతీష్ సారేపల్లి, చిరంజీవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. రెస్పాన్స్ బాగుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చిన్న సినిమాగా విడుదలైన మా చిత్రానికి రోజూ థియేటర్లు పెరుగుతున్నాయి. అందుకు కారణం పాజిటివ్ టాకే. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తీశాం. త్వరలోనే మా చిత్రం ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని తెలిపారు.
పైరసీ ఎప్పుడు మొదలైంది? ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు?
పైరసీ.. పైరసీ.. పైరసీ.. దీని గురించి చాలామందికి తెలుసు. కానీ గత కొన్నిరోజుల నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మెయిన్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం 'ఐ బొమ్మ' రవి అరెస్ట్. అతడు చేసింది తప్పా ఒప్పా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతకీ పైరసీ అంటే ఏంటి? ఏళ్లకు ఏళ్లుగా వైరస్లా పెరిగిపోతున్నా సరే దీన్ని పోలీసులు ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి?పైరసీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. వ్యక్తిగత కంప్యూటర్ల వాడకం అంటే 1990-2000ల కాలంలో ఇది మొదలైంది. మొదట్లో ఫ్లాపీ డిస్క్ల్లో సమాచారాన్ని కాపీ చేసుకునేవారు. తర్వాత వీసీడీలు, డీవీడీల ట్రెండ్ మొదలైంది. వీటిల్లో వినేందుకు పాటలు కాపీ చేసేవారు. థియేటర్ ప్రింట్ రూపంలో సినిమాలని కూడా కాపీ చేసి ఇళ్లలో చూసుకునేవారు. 2000 తర్వాత కాలంలో వీటి వాడకం ఎక్కువైంది. 2010 వచ్చేసరికి మెమొరీ కార్డ్స్ వచ్చాయి. 2020 వచ్చేసరికి స్మార్ట్ ఫోన్, పెన్ డ్రైవ్ ఇలా చాలా సదుపాయాలు వచ్చేశాయి. ప్రస్తుతానికైతే పైన చెప్పిన వాటి కంటే ఆన్లైన్లో ఉండే కొన్ని వెబ్సైట్స్లోకి వెళ్లి సినిమాని ఉచితంగా చూసేయొచ్చు. కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే.పైరసీ చూడటం కరెక్టేనా అంటే అస్సలు కాదు. మొబైల్లో ఉచితంగా చూపిస్తున్నాడు కదా అని వీటిని చాలామంది చూస్తున్నారు. కానీ తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలు వాడికి అప్పగించేస్తున్నారు! ఎలా అంటే? మీ స్మార్ట్ఫోన్లో సదరు పైరసీ సైట్ని ఓపెన్ చేసినప్పుడు, అప్పటికే మొబైల్లో మీ మొయిల్ ఐడీతో లాగిన్ అయ్యింటారు కదా. హ్యాకర్లు కావొచ్చు, సైట్ నిర్వహకులు కావొచ్చు.. మీ వివరాలని మీకు తెలియకుండానే స్టోర్ చేసుకుంటారు. మరి వాటితో ఏం చేస్తారు అంటే చాలా చేయొచ్చు. డార్క్ వెబ్లో మీ వివరాలని ఎవరికైనా అమ్మేస్తే.. దానితో వాళ్లు ఏమైనా చేయొచ్చు. అప్పుడప్పుడు మీకు తెలియని వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీ పేరు సహా కొన్ని వివరాలని వాళ్లు చెబుతుంటారు. వాళ్లకు మీ గురించి ఎలా తెలిసిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచిస్తే మీకు ఇప్పుడు చెప్పిన విషయం కచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి పైరసీ సైట్లని గానీ, అనుమతి లేని లింక్స్ గానీ ఓపెన్ చేసేముందు తస్మాత్ జాగ్రత్త.పైరసీ అనేది రకరకాల పద్ధతుల్లో చేస్తారు. అప్పట్లో థియేటర్కి వెళ్లి రహస్యంగా మొబైల్ ఫోన్తో లేదంటే కెమెరాతో రికార్డ్ చేసేవారు. తర్వాత దాన్ని డీవీడీలు లేదా మెమొరీ కార్డ్లో కాపీ చేసి పైరసీ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఎంతలా అంటే సర్వర్లు హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్స్ డౌన్లోడ్ చేసేంతలా! 'ఐ బొమ్మ' రవి కేసునే తీసుకుందాం. సినిమా రిలీజ్కి ముందే వాటిని లోడ్ చేసి ఉంచిన సర్వర్లని హ్యాక్ చేసి మరీ సినిమాలని తస్కరించేవాడు. ముందే పైరసీ సైట్లలో పెడితే ఎక్కడ అనుమానం వస్తుందోనని.. సరిగ్గా సినిమా విడుదల రోజు.. సైట్లలో అప్లోడ్ చేసేవాడు. మన దగ్గరే ఉంటే దొరికిపోతాడు కాబట్టి నైజీరియన్ దేశాల్లో ఉంటూ ఇదంతా చేసేవాడు.నైజీరియన్ దేశాలతో పాటు చైనా, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ సైబర్ మాయగాళ్లు తిష్టవేసి.. పైరసీ సైట్లని నడుపుతున్నారు. పైరసీలో మనం సినిమా ఫ్రీగా చూస్తాం కదా వాడికి ఎలా డబ్బులొస్తాయి అని మీరు అనుకోవచ్చు. సినిమా ప్లే అవుతున్నప్పుడు పైనో దిగువనో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తుంటాయి. వాటి నిర్వహకులు సదరు పైరసీ చేసిన వాడికి డబ్బులిస్తుంటారు. కొందరు సినిమా చూసి వదిలేస్తారు. మరికొందరు మాత్రం బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.పైరసీ వల్ల భారతీయ సినీ పరిశ్రమ 2023లో రూ.22,400 కోట్లు నష్టపోయింది. అందులో థియేటర్లు కోల్పోయింది రూ.13,700 కోట్లు కాగా ఓటీటీల వాటా రూ.8,700 కోట్లు. ఆ ఏడాది మీడియా, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆదాయంతో పోలిస్తే పైరసీ వల్ల కలిగిన నష్టం అందులో నాలుగో వంతుగా తేలింది. పైరసీ వల్ల గతేడాది ఒక్క టాలీవుడ్ రూ.3,700 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. గత పదేళ్లలో తీసుకుంటే ఆ నష్టం రూ.20 వేల కోట్లకు పైమాటే!ఇంతా జరుగుతున్నా పోలీసులు ఎందుకు పైరసీ సైట్లని ఆపలేకపోతున్నారు అని అనుకోవచ్చు. ఒకదాన్ని బ్లాక్ చేస్తే, రావణాసురుడి తలలా చాలా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కి పైగా వెబ్సైట్లు తెలుగు సినిమాలని అక్రమంగా చూసేందుకు అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో పోలీసులని.. సదరు పైరసీ చేస్తున్నవారిని పట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది. పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం పైరసీ చేశారని తేలితే.. మూడేళ్ల జైలుశిక్ష, మూడు లక్షల రూపాయల నుంచి నిర్మాణ వ్యయంలో అయిదు శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా సరే పైరసీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది.
పింఛం పట్టుకున్న నిధి.. చీరలో నిహారిక గ్లామర్
వైట్ అండ్ వైట్ డ్రస్లో రకుల్ హొయలుచీరలో మరింత అందంగా అనసూయనిహారిక గోవా ట్రిప్.. ఎర్రచీరలో గ్లామర్తోకెన్యా ట్రిప్లో హీరోయిన్ చాందినీ చౌదరినెమలి పింఛంతో నిధి అగర్వాల్ క్యూట్నెస్కొడైకెనాల్లో చిల్ అవుతున్న మానస చౌదరి View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine)
సింగర్గా నవీన్ పొలిశెట్టి.. హుషారెత్తించే పాట రిలీజ్
'జాతిరత్నాలు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మరో హిట్ అందుకున్నాడు. దీని తర్వాత మరో మూవీ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే చిత్రం చేస్తున్నాడు. రాబోయే సంక్రాంతికి దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఇప్పటికే దసరా, దీపావళికి ప్రమోషనల్ వీడియోలు వదిలిన నవీన్.. ఇప్పుడు తొలి పాటని రిలీజ్ చేశారు. 'భీమవరం బల్మా' అంటూ సాగే ఈ గీతాన్ని.. భీమవరంలోనే ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లోనే గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. పాట కలర్ఫుల్గా ఉంది. నవీన్-మీనాక్షి కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి మారి దర్శకుడు.(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?)
'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం 'చికిరి చికిరి' అని సాగే తొలి పాట రిలీజైంది. వెంటనే సంగీత ప్రియులకు నచ్చేసింది. అప్పటినుంచి రీల్స్, షార్ట్స్.. ఇలా ప్రతిచోట ఈ పాట వీడియోలే కనిపించాయి. తాజాగా ఈ గీతం అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్ప్రైజ్ వచ్చింది. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఈ వీడియోలో టీమ్ అంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్కి చేరుకున్నారు. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో 'చిరుత' గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది.అసలు విషయానికొస్తే.. 'చికిరి' పాటని నిజమైన లొకేషన్లో తీశారు. మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ (Savlya Ghat) అనే ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన 'చికిరి చికిరి' పాట షూటింగ్ చేశారు. దీనిపై ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మూవీ టీమ్ అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష్మీ)
సినిమా
టాలీవుడ్ సరికొత్త సంక్రాంతి సుందరి - మీనాక్షి చౌదరి..
పొంగల్ మూవీతో అయినా మాస్ రాజా ఫ్లోప్స్ కు బ్రేక్ పడుతుందా?
సిద్దు WOMANIZER AHH..? బ్రదర్ రియాక్షన్
సల్మాన్ ఖాన్ రంజాన్ సెంటిమెంట్.. మళ్లీ మ్యాజిక్ జరుగుతుందా?
దివ్య-భరణిలపై ట్రోల్స్ ఆపండి..! భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
హీరోయిన్ మెసేజ్ చేసిందా? అయితే జాగ్రత్త
Horror Movie: గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి!
Dharmendra : బాలీవుడ్ దిగ్గజ నటుడు కన్నుమూత
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న iBOMMA రవి
iBOMMA One రవిది కాదు..! కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు
