Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tere Ishk Mein Or Amarakavyam Movie Ott Streaming date Locked1
ఓటీటీలో 'ధ‌నుష్' హిట్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ ప్రకటన

కోలీవుడ్‌ నటుడు ధ‌నుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’.. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో నవంబర్‌ 28న హిందీలో రిలీజ్‌ అయింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. థియేటర్‌ రన్‌ ముగిసిని తర్వాత ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత ధనుష్, దర్శకుడు ఆనంద్‌. ఎల్‌. రాయ్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చకున్న ఈ మూవీ టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా మెప్పించింది.ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.రొమాంటిక్‌ డ్రామా కథతో తెరకెక్కిన ‘తేరే ఇష్క్ మే’ (అమర కావ్యం) మూవీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో ఈ నెల 23న విడుదల కానుంది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాలో శంకర్ పాత్రలో ధనుష్‌ బాగా నటించారు. తన కోపం కారణంగా ఎప్పుడూ కాలేజ్‌లో గొడవలు పడుతూ ఉంటాడు. అయితే, కాలేజీ రోజుల్లోనే సాహీ (కృతి సనన్)తో ప్రేమలో పడుతాడు. అయితే, తన కోపం కారణంగా నిజాయితీగా ప్రేమించినప్పటికీ తన ప్రియురాలిని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అతను ఏం చేశాడు..? సాహీ జీవితంపై శంకర్‌ ప్రభావం ఎలా చూపింది..? ఫైనల్‌గా ఈ జోడీ కలిసిందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Sahana Sahana Lyrical Video song out from The Raja Saab2
'రాజాసాబ్‌' హిట్‌ సాంగ్‌ వీడియో విడుదల

ప్రభాస్‌- మారుతి మూవీ ది రాజాసాబ్‌ నుంచి హిట్‌ సాంగ్‌ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్‌, నిధి అగర్వాల్‌ జోడీగా 'సహనా సహనా..' అంటూ మెప్పించిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను విశాల్‌ మిశ్రా పాడారు. రొమాంటిక్‌ కామెడీ హారర్‌ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌ కూడా నటించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 250 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే, సినిమా ఫస్ట్‌ ఆటతోనే భారీగా ట్రోలింగ్‌కు గురికావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది.

Manaswini Bala Bommala Kokoroko Movie Details3
యూత్‌ను మెప్పించిన 'మనస్విని' సినిమాల్లోకి ఎంట్రీ

టాలీవుడ్‌లోకి యంగ్‌ నటి 'మనస్విని బాలబొమ్మల' అడుగుపెడుతుంది. గతంలో భక్తి పాటలతో సింగర్‌గా యువతరంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆమె వెండితెరపైకి 'కొక్కొరొకో' మూవీతో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ కథలో కీలకంగా ఉండనుంది. ఈ మూవీ నుంచి తాజాగా ప్రత్యేకమైన పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తున్న మనస్విని బాలబొమ్మల ఫస్ట్ లుక్‌ గురించి ప్రశంసలు వస్తున్నాయి.యువతరంలో మంచి గుర్తింపు ఉన్న మనస్విని బాలబొమ్మల చాలా టాలెంటెడ్‌.. తెలుగులో 'కొక్కొరొకో' చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది ఆమె సినీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ తన సున్నితమైన, సంప్రదాయాత్మక భావంతో వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్టర్‌పై “Our Bangarraju Family wishes you and your family a Happy Sankranthi. ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అనే సందేశం ఉంచి, చిత్రానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.ఈ సంక్రాంతి పోస్టర్ ద్వారా మనస్విని బాలబొమ్మల తొలి అధికారిక లుక్ కూడా విడుదలైంది. ఆ పోస్టర్‌లో ఆమె సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించారు. ఈ చిత్రంలో ఆమెది అతిథి పాత్ర అయినప్పటికీ, ఇది తెలుగుసినిమాల్లో ఆమెకు అధికారిక ఆరంభంగా నిలవడంతో పాటు, ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి స్పందనను రాబడుతోంది.సినిమాల్లోకి రాకముందే మనస్విని ఒక శిక్షణ పొందిన, బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణిగా తనదైన బలమైన పునాది వేసుకున్నారు. థియేటర్ రంగంలో Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలు పోషించిన అనుభవం ఆమెకు ఉంది. నటనతో పాటు ఆమెకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంది.. కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. భక్తి గీతాల ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పలు పాఠశాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం కూడా ఆమె కళా ప్రయాణంలో భాగమే.. ఇవన్నీ ఆమె స్టేజ్ ప్రెజెన్స్‌ను ప్రతిబింబిస్తాయి.'కొక్కొరొకో' చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఈ సంకలిత చిత్రం, సంప్రదాయ కోడిపందేల నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది. రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్ పతాకంపై 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Manaswini (@mcanutikki)

Buzz Around Director Anil Ravipudi 10th Movie4
సీనియర్‌ హీరోలకు బ్లాక్‌బస్టర్‌.. అనిల్‌ 10వ సినిమా ఎవరితో?

కథలో, దాన్ని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకు పోవడం ఖాయం! కానీ అపజయం అనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. కెరీర్‌లో ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుసగా 9 సూపర్‌ హిట్లు కొట్టేసి శెభాష్‌ అనిపించుకున్నాడు. దీంతో అతడి పదో సినిమా ఎవరితో? ఎప్పుడు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఓసారి చూసేద్దాం..ఫస్ట్‌ సినిమా నుంచే..అనిల్‌ రావిపూడి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా కెరీర్‌ మొదలుపెట్టాడు. 2015లో నందమూరి కల్యాణ్‌ 'పటాస్‌' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. ఆ మరుసటి ఏడాది తీసిన సుప్రీమ్‌ కూడా ఘన విజయం సాధించింది. రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్‌ 3, భగవంత్‌ కేసరి.. ఇలా అన్నీ హిట్లు, సూపర్‌ హిట్లే అందుకున్నాడు. బ్లాక్‌బస్టర్‌ సినిమాలుగతేడాది సంక్రాంతి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. పొంగల్‌ పండగను క్యాష్‌ చేసుకునేందుకు ఈసారి కూడా సంక్రాంతికే బరిలోకి దిగాడు.. కాదు, మెగాస్టార్‌ను బరిలోకి దింపాడు. చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ తీశాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాగా పాజిటివ్‌ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.200 కోట్లు దాటేసింది. సీనియర్‌ హీరోలతో సినిమాలుఈసారైనా అనిల్‌ రావిపూడి దొరుకుతాడేమోనని చూసిన ట్రోలర్స్‌కు భంగపాటే ఎదురైంది. చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణ.. ఇలా అందరు సీనియర్‌ హీరోలతో సినిమాలు చేశాడు అనిల్‌. మరి నాగార్జునతో ఎప్పుడు? అని అతడి ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచి కథ, సమయం కుదిరితే ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హామీ ఇచ్చాడు. చిరంజీవి బంపరాఫర్‌మరోవైపు మెగాస్టార్‌.. తనకు అఖండ విజయాన్ని అందించాడన్న ఆనందంతో ఓ బంపరాఫర్‌ ఇచ్చాడు. అనిల్‌ కథ సిద్ధం చేస్తే.. తాను, వెంకటేశ్‌ కలిసి పూర్తిస్థాయి సినిమా చేస్తామన్నాడు. అవసరమైతే వెంకీ సినిమాలో అతిథి పాత్రలోనైనా కనిపించేందుకు సిద్ధమన్నాడు. ఇంత మంచి ఆఫర్‌ ఇస్తే అనిల్‌ ఎందుకు కాదంటాడు? కానీ, వెంటనే ఒప్పేసుకుని సినిమా చేసే పరిస్థితి లేకపోవచ్చు.రామ్‌చరణ్‌తో సినిమా!మన శంకరవరప్రసాద్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అనిల్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. 'రామ్‌చరణ్‌తో సినిమా తప్పకుండా చేస్తాను. ముందు ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ చేయండి.. వెంటనే రామ్‌చరణ్‌ దగ్గరకు వెళ్లిపోతాను' అన్నాడు. అతడు కోరినట్లుగానే ప్రేక్షకులు సినిమాకు మంచి విజయాన్ని అందించారు. మరి అనిల్‌.. చరణ్‌తో సినిమా చేస్తాడా? అన్నది చూడాలి!పదో సినిమాపై బజ్‌అసలే అనిల్‌ రావిపూడి కెరీర్‌లో 10వ సినిమా.. హిట్‌ స్ట్రీక్‌ పోకుండా మూవీ తీయాలన్న ఒత్తిడి అతడిపై చాలానే ఉంది. కథ, హీరో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అది ఏమాత్రం బెడిసికొట్టినా అనిల్‌ రావిపూడిని ఆడేసుకుంటారు. మళ్లీ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాడంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు. మరి ఆ పదో సినిమా చరణ్‌తోనా? చిరు-వెంకీతోనా? నాగ్‌తోనా? లేదంటే వేరే హీరోతోనా?అన్నది రానున్నరోజుల్లో చూడాలి!

Allu Arjun Next target Tamil Nadu movie Industry And Vijay5
దళపతి రేంజ్‌కు 'అల్లు అర్జున్'.. బిగ్‌ లైనప్‌తో ప్లాన్‌

అల్లు అర్జున్‌ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్‌ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, బన్నీ కూడా అంతే రేంజ్‌లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్‌ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్‌లో తన ఫ్యాన్స్‌ బేస్‌ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్‌ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు తన మార్కెట్‌ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌ మూవీస్‌తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్‌ వర్కౌట్‌ అయితే, తమిళ్‌లో బిగ్‌స్టార్‌గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్‌ దర్శకులతో ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాడనిపిస్తుంది.దళపతి బాయ్స్‌తో అల్లు అర్జున్‌దళపతి విజయ్‌ బాయ్స్‌గా అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌లకు ఇమేజ్‌ ఉంది. బిగిల్‌, మెర్సిల్‌, తేరి చిత్రాలతో విజయ్‌కి అట్లీ హిట్స్‌ ఇస్తే.. లియో, మాస్టర్‌ మూవీస్‌తో లోకేశ్‌ తన మార్క్‌ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్‌తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్‌ ఫ్యాన్స్‌ కన్ను అల్లు అర్జున్‌ మీద పడింది. లోకేశ్‌ తన నెక్ట్స్‌ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్‌ ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. విజయ్‌, అల్లు అర్జున్‌ల ఏఐ ఫోటోలను క్రియేట్‌ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్‌లో బన్నీ తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్‌కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.అల్లు అర్జున్‌కు తమిళనాడులో సానుకూలతప్రస్తుతం అల్లు అర్జున్ చూపు తమిళనాడుపై ఉంది. కోలీవుడ్‌లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్‌ తక్కువగానే ఉండొచ్చు. ఆపై తమిళ మరో బిగ్‌ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి.. కార్‌ రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్‌ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కు టాప్‌ ఇమేజ్‌ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్‌ వర్కౌట్‌ అయితే సౌత్‌ ఇండియాలో బన్నీకి సినిమాలకు బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఏర్పడుతుంది.బిగ్‌ లైనప్‌ సినిమాలతో ప్లాన్‌అల్లు అర్జున్‌ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో పాటు టాప్‌ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌, త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా, సుకుమార్‌ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్‌తో లైనప్‌ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్‌ కొడితే చాలు.. సౌత్‌ ఇండియాలో తన మార్కెట్‌ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్‌లో ఎటూ ఖాన్‌ల మూవీస్‌కు పోటీగా బన్నీ మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా బీహార్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బన్నీ సినిమాలకు భారీ క్రేజ్‌ ఉంది. ఆపై తన ఫ్యూచర్‌ సినిమాల లైనప్‌ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్‌ ఏంటో అల్లు అర్జున్‌ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది.

Kangana Ranaut Glad its not 2016 Anymore6
2016.. నా జీవితమే నరకప్రాయం: కంగనా రనౌత్‌

2026కి వెల్‌కమ్‌ చెప్పే క్రమంలో అందరూ 2025ను ఓసారి రివైండ్‌ చేసుకుంటున్నారు. అయితే ఈసారి కొంత స్పెషల్‌గా ఏకంగా పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016 అంటూ దశాబ్దపు కాలం క్రితం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్‌, ఎంపీ కంగనా రనౌత్‌ 2016ని తన జీవితంలోనే ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఏడాదిగా అభివర్ణించింది.2016ని ఎందుకు మిస్‌ అవుతున్నారో?వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత దారుణ పరిస్థితులను చూశానంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. అందరూ సడన్‌గా 2016ని ఎందుకు మిస్‌ అవుతున్నారో? నాకైతే ఆ ఏడాది ఒక పీడకల. క్వీన్‌, తను వెడ్స్‌ మను సినిమాలతో ఘన విజయాలు అందుకుని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నాకు 2016 జనవరిలో ఓ పెద్ద షాక్‌ తగిలింది. నా సహనటుడు నాకు లీగల్‌ నోటీసులు పంపాడు.సంచలనంఅది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానివల్లే ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్‌, ఔట్‌సైడర్స్‌ అని రెండుగా చీలిపోయింది. విజయం విషపూరితమైపోయింది. జీవితం నరకప్రాయంగా మారింది. ఎన్నో న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చింది. 2026లో ఇలా హ్యాపీగా ఉంటానని.. ఆ వివాదాన్ని కొంతకాలానికే అందరూ మర్చిపోతారని అప్పుడే తెలిసుంటే అంత బాధపడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు 2016లో కాకుండా 2026లో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది.ఏమిటా వివాదం?గతంలో కంగనా రనౌత్‌- హృతిక్‌ రోషన్‌ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ ఎంతోకాలం కొనసాగలేదు. భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో 2016వ సంవత్సరం ప్రారంభంలో కంగనా తన ఇంటర్వ్యూలలో హృతిక్‌ రోషన్‌ను ఎక్స్‌గా పేర్కొంటూ కొన్ని కామెంట్స్‌ చేసింది. దీంతో హృతిక్‌.. కంగనా తనకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోర్టు చుట్టూ తిరగడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. సినిమాల విషయానికి వస్తే.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఏక్‌ నిరంజన్‌ మూవీలో యాక్ట్‌ చేసింది. చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మించింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut)

Sunita Ahuja Breaks Silence On Rumours About Govinda Affairs7
అమ్మాయితో వివాహేతర సంబంధం.. స్టార్‌ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ సీనియర్‌ హీరో గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య గోవిందాపై ఆయన సతీమణి సునీత ఆహుజా(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. గోవిందాకు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత గోవిందా(Govinda) పర్సనల్‌ లైప్‌పై రకరకాల పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం సునీత, గోవిందా వేరు వేరుగా ఉంటున్నారు. విడాకులు కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని స్వయంగా సునీతనే చెప్పింది. అయితే తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనేది వందశాతం నిజమని చెబుతోంది. తాజాగా మిస్‌ మాలినికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అదే విషయంపై మట్లాడారు. ‘చాలా మంది అమ్మాయిలు మీ దగ్గరు వస్తారు. కానీ మీరు తెలివి తక్కువ వారు కాదు. 63 ఏళ్ల వయసు వచ్చింది. టీనా(కూతురు)కి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. యశ్‌(కొడుకు)కి కెరీర్‌ ఉంది. నిన్ను క్షమించే ప్రస్తక్తే లేదు గోవిందా’ అని భర్త గోవిందకు సునీత వార్నింగ్‌ ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నేపాల్‌ అమ్మాయిని. ఖుక్రీ(కత్తి) బయటకు తీస్తే.. అందరూ ఇబ్బంది పడతారు. అందుకే జాగ్రత్తగా ఉండమని అతని చెప్పా’ అని సునీత అన్నారు.కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్‌, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్‌ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు.

Sana Khan Denies she was Brainwashed by her Husband to quit Cinemas8
భర్త వల్లే సినిమాలకు దూరం? హీరోయిన్‌ ఏమందంటే?

ఒకప్పుడు గ్లామర్‌తో అల్లాడించిన హీరోయిన్‌ సనా ఖాన్‌ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. 2020 అక్టోబర్‌లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.నేనే కోరుకున్నా..తాజాగా ఈ రూమర్‌పై సనాఖాన్‌ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే.. అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్‌తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. నా భర్త వల్లే..గతంలో హిజాబ్‌ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్‌ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.అందుకే సినిమాలు వదిలేశా..ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.సినిమాహీరోయిన్‌ సనా ఖాన్‌.. గగనం, కత్తి, మిస్టర్‌ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ 6వ సీజన్‌లో పాల్గొని మరింత పాపులర్‌ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్‌.. నా మతం వల్లేనేమో!

Actress Rukmini Vasanth Dating Rumours in social media9
ప్రేమలో 'రుక్మిణి వసంత్‌'.. అతను ఎవరో తెలుసా..?

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ ‍ప్రేమలో ఉన్నట్లు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈమేరకు పలు వెబ్‌సైట్లు కూడా నిజమేనంటూ పలు ఫోటోలను షేర్‌ చేస్తున్నాయి. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజమనేది తెలియాలంటే ఈ బ్యూటీ వివరణ ఇస్తే తేలుతుంది. నెట్టింట ఇలాంటి వార్తలు సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే, ఫైనల్‌గా వాటిలో కొన్ని నిజం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్‌ లవ్‌ ట్రాక్‌ గురించి ట్రెండ్‌ అవుతుంది.కాంతార సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌కు రుక్మిణి చేరుకుంది. దీంతో యశ్‌ భారీ బడ్జెట్‌ మూవీ టాక్సిక్‌లో కూడా ఆమె భాగమైంది. ఆపై ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ మూవీతో పాటు పలు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రుక్మిణి తన ప్రాణ స్నేహితుడు సిద్ధాంత్‌తో డేటింగ్ చేస్తోందని సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. అతనొక పాపులర్‌ ఫోటోగ్రాఫర్ అని కూడా ప్రచారంలో ఉంది. వారిద్దరి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. కానీ, ఈ అంశం గురించి వారిలో ఎవరూ స్పందించలేదు. సోషల్ మీడియాలో ధృవీకరించని ఇలాంటి పుకార్లు వైరల్‌ అవుతూనే ఉంటాయి. చాలా సార్లు, అవి నిజమవుతున్నాయి. కొన్నిసార్లు, అవి అబద్ధాలుగా మిగిలిపోవచ్చు కూడా.. ప్రస్తుతానికి, కొనసాగుతున్న ఈ రూమర్‌ నిజమో కాదో స్పష్టత లేదు.

Ravi Teja Interesting Comments On Sunil At Bhartha Mahasayulaku Wignyapthi Success Meet10
వెటకారంతో కూడిన బెస్ట్‌ ఫ్రెండ్‌ సునీల్‌: రవితేజ

సునీల్‌ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య కామెడీ వదిలే వేరే జోనర్‌లో వెళ్లాడు. మళ్లీ భర్త మహాశయులు సినిమాతో కామెడీ వైపు వచ్చాడు. సినిమా చూసినవాళ్లు అంతా సునీల్‌ కామెడీ గురించి మాట్లాడుతున్నారు. దుబాయ్‌ శ్రీను తర్వాత బాగా ఎంజాయ్‌ చేసిన సినిమా ఇది. అప్పుడప్పుడైనా సునీల్‌ కామెడీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మాస్‌ మహారాజా రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ నెల 13న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ లభించింది. శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో సినిమా సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్‌తో తనకున్న అనుబంధాన్ని రవితేజ పంచుకున్నాడు. ‘సునీల్‌, నేను మంచి స్నేహితులం. ఓ రకంగా చెప్పాలంటే.. వెతకారంతో కూడిన బెస్ట్‌ ఫ్రెండ్‌ నాకు. మా అమ్మ, వాళ్ల అమ్మ మంచి స్నేహితులు. వాళ్ల నుంచే మాకు వెతకారం వచ్చింది(నవ్వుతూ..) ’ అన్నారు. ఇక సునీల్‌ కూడా రవితేజ గురించి మాట్లాడుతూ.. ‘షూటింగ్‌ లేకున్నా సరే నేను కలిసే ఏకైక హీరో రవితేజ. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎనర్జీ నెక్ట్‌ లెవల్‌’ అన్నారు.

Advertisement
Advertisement