ప్రధాన వార్తలు
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
కేరళలో ఇటీవల విషాదకర ఘటన జరిగింది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి చేసిన వీడియో కారణంగా అతడు తనువు చాలించాడు. ఏ తప్పూ చేయకపోయినా తన పరువు తీసిందని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మలయాళ బిగ్బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీదేవి గోపీనాథ్ స్పందించింది.కఠిన శిక్ష విధించాలి'దీపక్ చావుకు కారణమైన అమ్మాయిని అరెస్టు చేసినందుకు సంతోషంగా ఉంది. తనకు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఒక్క ఘటన కారణంగా ఆడజాతి మొత్తాన్ని తిడుతున్నారు. ఆడవారికి, మగవారికి విడివిడిగా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అట్టముక్కలతో, వైర్లు చుట్టుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందరు మగవాళ్లు చెడ్డవారు కాదు, అలాగే అందరు ఆడవాళ్లు చెడ్డవారు కాదు! ఆడవాళ్లకు రక్షణేది?ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు పదహారేళ్ల అబ్బాయి 14 ఏళ్ల అమ్మాయిని హత్యాచారం చేశాడు. అలా అని దీపక్ చావును నేను తక్కువ చేయడం లేదు. అతడికి జరిగింది మరెవరికీ జరగకూడదు. కానీ ఆడవాళ్లకు కూడా రక్షణ ఎక్కడుంది? తండ్రులు, సవతి తండ్రులు, అంకుల్స్, ఫ్రెండ్స్, సమాజంలోని ఎంతోమంది చేతిలో మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు.ఐదు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు..దీపక్ కేసులో అరెస్టయిన అమ్మాయిని కూడా అత్యాచారం చేయాలని ఓ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాడు. అది అతడి మానసిక స్థితిని తెలియజేస్తుంది. నేను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్త నాపై అత్యాచారం చేశాడు. దయచేసి ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడకండి.. ఏదైనా అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆడవాళ్లందరినీ రాక్షసులుగా చిత్రీకరించకండి' అని శ్రీదేవి కోరింది.చదవండి: 2009లో ఇండస్ట్రీలో.. ఇన్నాళ్లకు నటిగా లాంచ్: స్రవంతి
రాజ్తో పెళ్లి తర్వాత ఫుల్ హ్యాపీగా సమంత.. వీడియో వైరల్!
డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఫుల్ బిజీ అయిపోయింది. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూనే ఉంటోంది. ఇటీవలే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న సామ్.. ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. తాను కలలో ఇక్కడికి వస్తానని ఊహించలేదని రాసుకొచ్చింది. అయితే ప్రస్తుతం సామ్- రాజ్ నిడిమోరుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పికిల్ బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సమంత ఫుల్ హ్యాపీగా మ్యాచ్ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. సామ్- రాజ్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ -2, సిటాడెల్: హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ను నిజం చేస్తూ గతేడాది డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
ఒకే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్లు.. అందరూ తోపులే!
మన దేశంలో వ్యాపార, రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ కొన్ని కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా వరకు నటుల నుంచి నిర్మాతల వరకు, తమ కుటుంబ సభ్యులను సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చి, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు మరే ఇతర భాషా చిత్ర పరిశ్రమలో అయినా వారసుల హవా ఎప్పుటి నుంచో నడుస్తుంది. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.? అంతేకాదు అదే కుటుంబం నుంచి ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ చిత్ర పరిశ్రమను శాసించారంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. తమిళ సినిమాకు 'తొలి డ్రీమ్ గర్ల్'గా పేరొందిన 'టీఆర్ రాజకుమారి' కుటుంబమే దీనికి సాక్ష్యం. ఈ అరుదైన సినీ వంశం గురించి తెలుసుకోవాలంటే, ముందుగా రాజకుమారి నాయనమ్మ గుజ్జలాంబాళ్ నుంచి ప్రారంభించాలి. ఆమె ఒక ప్రసిద్ధ కర్ణాటక గాయని, సంగీత ప్రపంచంలో ఆమెకు గొప్ప పేరుంది. తంజావూరు వారి స్వస్థలం. ఈ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటి వ్యక్తి ‘ఎస్పీఎల్ ధనలక్ష్మి’. 1935లో 'నేషనల్ మూవీ టోన్' అనే నిర్మాణ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం 'పార్వతి కళ్యాణం'లో ధనలక్ష్మి హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఆమె సోదరి తమయంతి కూడా 1930వ దశకంలో కొన్ని చిత్రాలలో హీరోయిన్గా పని చేసింది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో హీరోయినే టీఆర్ రాజకుమారి.ఆమె అసలు పేరు రాజయ.1930లలోప్రముఖ దర్శకుడు కె.సుబ్రమణ్యం ఎస్పీఎల్ ధనలక్ష్మిని కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ధనలక్ష్మి సోదరి కుమార్తె రాజయ కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయిని చూసి వెంటనే తన సినిమాలో హీరోయిన్గా చేయమని సుబ్రమణ్యం అడిగారట. రాజయ పేరును రాజకుమారిగా మార్చి, తన చిత్రం 'కచ్ఛ దేవయాని' (1941)లో ఆమెను నటింపజేశాడు. తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా రాజకుమారి తమిళ సినిమాకు 'డ్రీమ్ గర్ల్'గా తిరుగులేని విజయం సాధించింది.రాజకుమారి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆమె ఫ్యామిలీ నుంచి మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చాయి.వారిలో అత్యంత ముఖ్యమైన వారు టీఆర్ రామన్న. టీఆర్ రామన్న తమిళ సినిమాకు ప్రముఖ దర్శకుడు, నిర్మాతగా పేరుగాంచారు. ఎం.జీ.ఆర్, శివాజీ వంటి దిగ్గజాలతో సినిమా తీసిన ఏకైక నిర్మాత ఆయనే కావడం విశేషం.ఆ తర్వాత టీఆర్ రాజకుమారి కోడలు కుశల కుమారి కూడా 70వ దశకంలో చిత్రాలలో హీరోయిన్గా వెలుగొందింది. కొన్నాళ్ల తర్వాత ఎస్పీఎల్ ధనలక్ష్మి ఇద్దరు కూతుళ్లు కూడా సినిమాల్లోకి వచ్చింది. వాళ్లే జ్యోతి లక్ష్మి, జయమాలిని. ధనలక్ష్మికి మరో సోదరికి పిల్లలు లేకపోవడంతో జ్యోతి లక్ష్మిని వారికి దత్తత ఇచ్చారు. జ్యోతి లక్ష్మి, జయమాలిని ఇద్దరూ తమ గ్లామరస్ పాటలలో నృత్యం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. జ్యోతి లక్ష్మి సుమారు 300 చిత్రాలలో నటించగా, జయమాలిని 500 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించింది.ఈ కుటుంబానికి చెందిన తదుపరి, చివరి తరం జ్యోతి మీనా. 'ఉళ్ళత్తై అళ్లిత' చిత్రంలో కౌండమణి పక్కన నటించిన జ్యోతి మీనా విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కూడా డ్యాన్స్ చేసింది. ఆమె కొన్ని సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేసింది. జ్యోతి మీనా తండ్రి ఒక కెమెరామెన్ కావడంతో, ఈ కుటుంబం నుండి సాంకేతిక రంగంలోకి కూడా ఒక వ్యక్తి వచ్చారు. ఇలా ఒకే కుటుంబం నంచి మొత్తంగా ఏడుగురు హీరోయిన్లు, ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీని శాసించారు.
2009లో ఇండస్ట్రీలోకి.. ఇన్నాళ్లకు నటిగా..: స్రవంతి స్పీచ్
బిగ్బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు యాంకర్గా ఫుల్ బిజీగా ఉంది. ఓపక్క సినిమా ఈవెంట్స్ చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది. తాజాగా ఆమె ఓ సినిమా చేసింది. సుహాస్ హీరోగా నటిస్తున్న హే భగవాన్ మూవీలో స్రవంతి ఓ కీలక పాత్ర పోషించింది. బుధవారం (జనవరి 28న) హే భగవాన్ సినిమా టీజర్ రిలీజైంది. 2009లో ఇండస్ట్రీకి..ఈ సందర్భంగా యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. నటిగా ఇది నా ఫస్ట్ స్పీచ్.. కాబట్టి ముందు నా గురించి చెప్తాను. నా పేరు స్రవంతి చొక్కారపు. అనంతపురం జిల్లాలోని కదిరి నా స్వస్థలం. నటి అవ్వాలన్న ఆశతో 2009లో ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నటి అవడానికి ఇన్నేళ్లు పట్టింది. హే భగవాన్తోనే నటిగా లాంచ్ అవాలని రాసిపెట్టుందేమో!ఆడిషన్ చేయకుండా..దర్శకుడు గోపి ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను సెలక్ట్ చేశారు. నేరుగా షూటింగ్కే పిలిచి ఆయనకు కావాల్సినట్లు నటించేలా చేశారు. ఈ మూవీలో నేనే సర్ప్రైజ్. సుహాస్ చాలా తక్కువగా మాట్లాడతారు. అయితే ఒక సీన్ కోసం నాకు చాలా సపోర్ట్ చేశారు. యాంకర్గా నన్ను ఎలా నిలబెట్టారో నటిగా కూడా అలాగే నిలబెడతారని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. తల్లితో అదే చివరి సంక్రాంతి!
బిగ్బాస్
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
2009లో ఇండస్ట్రీలోకి.. ఇన్నాళ్లకు నటిగా..: స్రవంతి స్పీచ్
బిగ్బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
అటు మోడ్రన్గా.. ఇటు అమ్మవారి వేషంలో..
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
నా క్యారెక్టర్పై నింద.. వాష్రూమ్లో ఏడ్చేదాన్ని: రీతూ
వైల్డ్కార్డ్స్గా రీతూ-పవన్.. నయని విమర్శలు
A to Z
ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చాన్నాళ్లుగా టాలీవుడ్లో ఉంటూ సహాయ నటుడిగా గుర్తిం...
సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ
ప్రేమ గుడ్డిది. రంగు, ఆస్తి, కులమతాలు దానికి కనిపి...
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవ...
ఓటీటీలోకి 'ఛాంపియన్'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
యంగ్ హీరో రోషన్ నటించిన 'ఛాంపియన్' సినిమా ఓటీటీ...
బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నా: బాలీవుడ్ హీరో
కష్టాలు దాటుకుని సక్సెస్ను ఆస్వాదిస్తున్న తారలు ఎ...
బాలీవుడ్పై ప్రకాశ్ రాజ్ విమర్శలు
సౌత్ టు నార్త్.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ...
విడాకులు.. కొత్త కారు కొన్న బుల్లితెర నటి
బుల్లితెర నటి మహి విజ్ ఇటీవలే వైవాహిక జీవితానికి ...
ఆర్జేతో బ్రేకప్.. 'బిగ్బాస్' బ్యూటీతో ప్రేమలో పడ్డ చాహల్?
యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతానికి టీమిండియా తరఫున పెద్...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
ఏడేళ్ల తర్వాత 'తుంబాడ్' దర్శకుడి కొత్త సినిమా.. గూస్ బంప్స్ ట్రైలర్
'తుంబాడ్' సినిమాతో దర్శకుడు రాహి అనిల్ బార్వే దేశ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట...
రాజ్తో పెళ్లి తర్వాత ఫుల్ హ్యాపీగా సమంత.. వీడియో వైరల్!
డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఫుల్ ...
ది గర్ల్ఫ్రెండ్ హీరో కొత్త సినిమా.. ఆసక్తిగా టీజర్
కన్నడ హీరో దీక్షిత్శెట్టి నటిస్తోన్న తాజా చిత్రం ...
ఓం శాంతి శాంతి శాంతిః.. టిక్కెట్లపై వారికి బంపరాఫర్..!
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంట...
ప్రముఖ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ రిటైర్మెంట్ ప్రకటన
ప్రముఖ బాలీవుడ్ సింగర్ తన కెరీర్కు గుడ్ బై చెప...
ఫొటోలు
ఫుల్ గ్లామరస్గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు
బ్లూ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు.. ఫోటోలు
హీరోయిన్ శ్రుతిహాసన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ప్రియాంక చోప్రా జనవరి జ్ఞాపకాలు.. కూతురు, భర్తతో చిల్ మోడ్ (ఫొటోలు)
కొంచెం నాటీ కొంచెం స్వీట్.. లంగా ఓణీలో మీనాక్షి (ఫొటోలు)
ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
యంగ్ లుక్లో హీరోయిన్ సదా పోజులు (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
తెలుగమ్మాయి ఈషా రెబ్బా కొత్త ఫోటోలు అదుర్స్
‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
గాసిప్స్
View all
రామ్ బతికే ఉన్నాడా? సీతారామం సీక్వెల్!
మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!
'కెజియఫ్' రేంజ్ కలలలో కుర్ర హీరో
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
ప్రభాస్ ‘స్పిరిట్’పై క్రేజీ గాసిప్.. గోపీచంద్ కీలక పాత్ర?
మెగా హీరో సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
తర్వాతి రెండు నెలలు డ్రై?
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!
రివ్యూలు
View all
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్..
2.5
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
సినీ ప్రపంచం
బోల్డ్ లుక్లో నటాషా స్టాంకోవిచ్.. ప్రకృతి రాణిలా ప్రగ్యా జైస్వాల్..!
వైట్ డ్రెస్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ అందాలు..బోల్డ్ లుక్లో నటి నటాషా స్టాంకోవిచ్..బెస్ట్ ఫ్రెండ్తో హీరోయిన్ నేహా శెట్టి చిల్..ప్రకృతి ఒడిలో కలిసిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..బ్లూ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ హోయలు.. View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)
క్యాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ కామెంట్స్.. అది సాధ్యమేనా?
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు చూసినా అదే హాట్ టాపిక్. నటీమణుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నామని అంటుంటారు. ఎక్కడా చూసినా అదంతా సాధారణమే అన్నంతగా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. తాజాగా మరోసారి తెరపై తీసుకొచ్చింది. ఇంతకీ అదేంటి అనుకుంటన్నారా? అదేనండి క్యాస్టింగ్ కౌచ్. మన మెగాస్టార్ నోటా ఆ మాట వినిపించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది.మెగాస్టార్ నోటా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం రావడంతో టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఇప్పుడు దీనివైపే చూస్తోంది. మనం కఠినంగా ఉంటే ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉండదని చిరంజీవి అంటున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ తప్పనిసరి చిన్మయి లాంటి వాదిస్తున్నారు. సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని బల్లగుద్ది చెబుతోంది సింగర్ చిన్మయి. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మెగాస్టార్ చేసిన కామెంట్స్పై సైతం చిన్మయి తనదైన శైలిలో స్పందించింది. మెగాస్టార్ను గౌరవిస్తూనే క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని అంటోంది సింగర్.మెగాస్టార్ కామెంట్స్ కరెక్టేనా?మెగాస్టార్ చెప్పిన ప్రకారం మనం కరెక్ట్గా ఉంటే ఎవరూ అవకాశం తీసుకోరని అంటున్నారు. మన ప్రవర్తన ఎలా ఉంటే అలానే జరుగుతుందని చెబుతున్నారు. చిరంజీవి చెప్పిన విషయాన్ని కొంత వరకు అంగీకరించాల్సిందే. మన ప్రవర్తన ఎలా ఉంటే అలానే జరుగుతుంది అనేది వాస్తవమే. కానీ మెగాస్టార్ చెప్పిన మాటలు వంద శాతం నిజమని చెప్పలేం. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నా.. అలాంటి బుద్ధి ఉన్నవారు ఏదో ఒక రూపంలో మనల్ని టార్గెట్ చేస్తారు. పని చేసే చోట ఇబ్బందులు కలిగిస్తారు. అలా మనం కరెక్ట్గా ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితులను కూడా క్యాష్ చేసుకునే వారు కూడా ఉంటారు. ఒకవేళ మెగాస్టార్ చెప్పింది పాటిస్తే.. ఇండస్ట్రీలో అవకాశాలు టాలెంట్ను చూసి ఇచ్చేస్తారా? లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న. మనం ఎంత కరెక్ట్గా ఉన్నప్పటికీ.. ఛాన్స్ అనే పేరుతో ఛాన్స్ తీసుకోరని గ్యారెంటీ ఏంటని పలువురిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మారాలంటే సినీ ఇండస్ట్రీ నుంచే మార్పు వస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం.చిన్మయికే కామెంట్స్కే మద్దతు..ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్పై పోరాటం చేసేవాళ్లలో చిన్మయిని మించిన వారు ఉండరు. కేవల సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడా మహిళలకు అన్యాయం జరిగినా సరే తన గొంతు వినిపిస్తూనే ఉంటోంది. అందుకే మెగాస్టార్ కామెంట్స్పై కూడా సింగర్ స్పందించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని బల్లగుద్ది చెబుతోంది. ఎందుకంటే తాను కూడా బాధితురాలిననే ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఎవరికైనా తాము అనుభవిస్తేనే అందులోని బాధ వారికే ఎక్కువగా తెలుస్తుంది. మెగాస్టార్ వ్యాఖ్యలు కొంతవరకు నిజమే అయినా.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ను అరికట్టాలంటే ముందు అలాంటి వాళ్ల మైండ్ సెట్ మారాలి. అంతే తప్ప క్యాస్టింగ్ కౌచ్ లేదనడం కరెక్ట్ కాదనిపిస్తోంది. చిన్మయి రియాక్షన్..చిరంజీవి కామెంట్స్పై చిన్మయి స్పందిస్తూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనేది పూర్తిగా అబద్ధం. ఇంగ్లీష్లో ‘కమిట్మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అర్థం వస్తుంది.. కానీ, ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు ఉంటుంది. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే ఇండస్ట్రీలో ఛాన్సులు రావు. ఇక్కడ చాలామంది మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం సర్వసాధారణం. లెజెండరీ చిరంజీవి గారి తరం వేరు.. ఇప్పుడు జరుగుతున్నది వేరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు… ప్రస్తుతం పరిశ్రమలో అలాంటి వాతావరణం లేదు. చిరు తరంలో మహిళా కళాకారులతో స్నేహితులుగా తమ కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు. లెజెండ్లతో పనిచేసిన వారందరూ లెజెండ్లే. చిరు నాటి రోజులు ఇప్పుడు లేవు' అని మెగాస్టార్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయింది.
హీరోతో ఎంగేజ్మెంట్.. రిలేషన్షిప్కు బుల్లితెర నటి గుడ్ బై..!
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ (Keerthi Bhat) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన రిలేషన్షిప్కు గుడ్ బై చెప్పేసింది. రెండేళ్ల క్రితం హీరో విజయ్ కార్తీక్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న కీర్తి భట్.. ప్రస్తుతం లివింగ్ రిలేషన్లో ఉన్నారు. తాజాగా కీర్తి తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.కాగా.. కీర్తి భట్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ ఫైనలిస్టుగా నిలిచింది. ఈ షోలో తన లైఫ్ జర్నీ చెప్పి ప్రేక్షకులను ఏడిపించేసింది. యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయింది. తీవ్రంగా గాయపడ్డ తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో వేదన పడింది. ఎవరూ లేని తాను ఓ అనాథ పాపను కూడా దత్తత తీసుకుంది. కానీ బిగ్బాస్కు వెళ్లేముందే ఆ పాప చనిపోయింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసింది. వాటిన్నింటినీ దాటుకుని సీరియల్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial)
అతను కన్నీళ్లు పెట్టుకోవడం అదే మొదటిసారి: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే రివాల్వర్ రీటాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేడీ ఓరియంటేడ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ తోట్టం అనే మూవీలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కీర్తి సురేశ్.. తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి రోజు తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ భావోద్వేగానికి గురయ్యాడని వెల్లడించింది. 15 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవడంతో తాను మరింత ఎమోషనల్ అయ్యాడని తెలిపింది. ఆంటోనీ కన్నీళ్లు పెట్టుకోవడం తాను చూడటం మొదటిసారని అన్నారు.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'మేము ఇలాంటి పెళ్లి గురించి కలలో కూడా ఊహించలేదు, ఎందుకంటే మేము పారిపోయి పెళ్లి చేసుకుందామని అక్షరాలా అనుకున్నాం. కానీ ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ ఊహించలేదు. అది నిజం కావడంతో మాకు మాటలు రాని స్థితిలో ఉండిపోయాం. ఈ క్షణం కోసం 15 ఏళ్లుగా ఎదురుచూశాం. ఇదంతా కేవలం 30 సెకన్లలోనే ముగిసింది. నేను పూర్తిగా శూన్యంలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నాకు తాళి తప్ప అన్నీ శూన్యంగా అనిపించాయి. అది చాలా భావోద్వేగభరితమైన క్షణం. బహుశా అతను కన్నీళ్లు పెట్టుకోవడం కూడా నేను చూడటం అదే మొదటిసారి. ఇది ఒక అందమైన ప్రయాణం' అంటూ చెప్పుకొచ్చింది.కీర్తి సురేష్- ఆంటోనీ తట్టిల్ ప్రేమకథ..కాగా.. కీర్తి సురేశ్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందే ఆంటోనీ తట్టిల్ ప్రేమలో ఉంది. చిన్ననాటి స్నేహితుడైన 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం నడిచింది. ఈ జంట డిసెంబర్ 12, 2024న గోవాలో వివాహం చేసుకున్నారు. మొదట సాంప్రదాయ హిందూ వివాహం.. ఆ తర్వాత మలయాళీ క్రైస్తవ పద్ధతిలో ఒక్కటయ్యారు.
కుమారుడి పేరు రివీల్ చేసిన ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ కమెడియన్ భారతి సింగ్, హర్ష్ లింబాచియా దంపతులు తమ కుమారుడి పేరును రివీల్ చేశారు. డిసెంబర్ 19న రెండో బిడ్డకు జన్మనిచ్చిన భారతి సింగ్ ఇవాళ తన కొడుకు నామకరణ వేడుకను నిర్వహించారు. తమ ముద్దుల కుమారుడికి యశ్వీర్ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేక్ చేశారు. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు నైస్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. వీరికి ఇప్పటికే లక్ష్ అనే కుమారుడు ఉన్నారు. ఈషా సింగ్, కరిష్మా తన్నా, అదా ఖాన్, కిష్వర్ మర్చంట్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.కాగా.. నటి, కమెడియన్ భారతి సింగ్ పలు సీరియల్స్తో పాటు రియాలిటీ షోస్లోనూ పాల్గొంది. ది కపిల్ శర్మ షో, ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి షోలలో మెరిసింది. ఇటీవల ప్రసవం తర్వాత వెంటనే లాఫ్టర్ చెఫ్స్ ఫన్ అన్లిమిటెడ్ సీజన్- 3 సెట్స్లో కనిపించింది. ఈ దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు లక్ష్ సింగ్ లింబాచియా ఉన్నాడు. వీరికి 2022లో మొదట కుమారుడు జన్మించాడు. ఈ జంట కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Bharti Siingh (@bharti.laughterqueen)
చెప్పుతో వాడి మూతి మీద కొట్టాలి: తరుణ్ భాస్కర్
సినిమా రిజల్ట్ను ఒక్కముక్కలో తేల్చేయడం ఈజీయేమో కానీ సినిమా తీయడం మాత్రం చాలా కష్టం. దాని వెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. దర్శకుడు, హీరో దగ్గరి నుంచి సెట్ బాయ్ వరకు అందరి కష్టం దాగుంటుంది. అయితే కొందరు ఇక్కడిలా తీయాలి.. అక్కడ అలా చేస్తే బాగుండేదని లేనిపోని సలహాలు ఇస్తుంటారు.అడగకపోయినా సలహాలుఅలాంటి వారిపై తన అభిప్రాయాన్ని చెప్పాడు డైరెక్టర్ కమ్ హీరో తరుణ్ భాస్కర్. అతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. మలయాళ హిట్ మూవీ 'జయజయజయహే'కి రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. సినిమాలో ఇలా చేస్తే బాగుంటుంది, అది ఇది అని కొందరు అడగకపోయినా సలహాలు ఇస్తుంటారు. దర్శకుడికే తెలుసుప్రతి దర్శకుడికి కచ్చితంగా ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. సినిమా మీద ఉత్సాహం, ప్రేమతో వారు సలహాలిస్తారు. అయితే వాళ్లు చెప్పేది కేవలం ఆ సన్నివేశం వరకే బాగుండొచ్చు. ఓవరాల్గా సినిమాలో అదెంతవరకు అవసరమనేది దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉంచితే బెటర్.చెప్పుతో కొట్టాలనిపించేదిచాలామంది సెట్కు గెస్టులా వస్తుంటారు. వచ్చీరాగానే హాయిగా కూర్చుని ఆ సీజన్ క్లోజప్ పడితే బాగుంటుంది అని చెప్తారు. వాళ్లలా అన్నప్పుడు నా చెప్పు నీ మూతి మీద పడితే బాగుంటుందని రిప్లై ఇవ్వాలనిపించేది. కానీ అదంతా మనసులోనే అనుకుని పైకి మాత్రం కూల్గా ఓకే అనేవాడిని అని చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగు బుల్లితెర నటి ఇంట విషాదం
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
కేరళలో ఇటీవల విషాదకర ఘటన జరిగింది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి చేసిన వీడియో కారణంగా అతడు తనువు చాలించాడు. ఏ తప్పూ చేయకపోయినా తన పరువు తీసిందని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మలయాళ బిగ్బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీదేవి గోపీనాథ్ స్పందించింది.కఠిన శిక్ష విధించాలి'దీపక్ చావుకు కారణమైన అమ్మాయిని అరెస్టు చేసినందుకు సంతోషంగా ఉంది. తనకు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఒక్క ఘటన కారణంగా ఆడజాతి మొత్తాన్ని తిడుతున్నారు. ఆడవారికి, మగవారికి విడివిడిగా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అట్టముక్కలతో, వైర్లు చుట్టుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందరు మగవాళ్లు చెడ్డవారు కాదు, అలాగే అందరు ఆడవాళ్లు చెడ్డవారు కాదు! ఆడవాళ్లకు రక్షణేది?ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు పదహారేళ్ల అబ్బాయి 14 ఏళ్ల అమ్మాయిని హత్యాచారం చేశాడు. అలా అని దీపక్ చావును నేను తక్కువ చేయడం లేదు. అతడికి జరిగింది మరెవరికీ జరగకూడదు. కానీ ఆడవాళ్లకు కూడా రక్షణ ఎక్కడుంది? తండ్రులు, సవతి తండ్రులు, అంకుల్స్, ఫ్రెండ్స్, సమాజంలోని ఎంతోమంది చేతిలో మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు.ఐదు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు..దీపక్ కేసులో అరెస్టయిన అమ్మాయిని కూడా అత్యాచారం చేయాలని ఓ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాడు. అది అతడి మానసిక స్థితిని తెలియజేస్తుంది. నేను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్త నాపై అత్యాచారం చేశాడు. దయచేసి ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడకండి.. ఏదైనా అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆడవాళ్లందరినీ రాక్షసులుగా చిత్రీకరించకండి' అని శ్రీదేవి కోరింది.చదవండి: 2009లో ఇండస్ట్రీలో.. ఇన్నాళ్లకు నటిగా లాంచ్: స్రవంతి
ఓ యువకుడి ప్రేమకథా చిత్రం.. ఆసక్తిగా ట్రైలర్
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన తాజా చిత్రం శ్రీ చిదంబరం గారు. ఈ సినిమాకు వినయ్రత్నం దర్శకత్వం వహించారు. ఈ మూవీకి చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు.తాజా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరు వదిలి విదేశాలకు వెళ్లాలనుకున్న యువకుడికి ఓ యువతి పరిచయం కావడంతో ఏం చేశాడనే ఆసక్తికర కథనంతో ఈ మూవీ తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 'తల దించుకుని నడిచి నడిచి మెడ లాగేస్తోందమ్మా.. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొనీయమ్మా' అనే డైలాగ్ ఎమోషనల్ వింటే ఎమోషనల్గా స్టోరీగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హారర్ థ్రిల్లర్గా ‘హ్రీం’ .. షూటింగ్ పూర్తి
పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కిస్తున్నారు. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. వరంగల్ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్ హెచ్యంటీ కాలనీలోని ఫారెస్ట్ లొకేషన్స్లో సెకండ్ షెడ్యూల్ని పూర్తి చేసుకుంది చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కీలక పాత్రల్లో ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్ (శుబోదయం సుబ్బారావు), త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి తదితరులు నటించారు.
ఒకే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్లు.. అందరూ తోపులే!
మన దేశంలో వ్యాపార, రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ కొన్ని కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా వరకు నటుల నుంచి నిర్మాతల వరకు, తమ కుటుంబ సభ్యులను సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చి, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు మరే ఇతర భాషా చిత్ర పరిశ్రమలో అయినా వారసుల హవా ఎప్పుటి నుంచో నడుస్తుంది. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.? అంతేకాదు అదే కుటుంబం నుంచి ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ చిత్ర పరిశ్రమను శాసించారంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. తమిళ సినిమాకు 'తొలి డ్రీమ్ గర్ల్'గా పేరొందిన 'టీఆర్ రాజకుమారి' కుటుంబమే దీనికి సాక్ష్యం. ఈ అరుదైన సినీ వంశం గురించి తెలుసుకోవాలంటే, ముందుగా రాజకుమారి నాయనమ్మ గుజ్జలాంబాళ్ నుంచి ప్రారంభించాలి. ఆమె ఒక ప్రసిద్ధ కర్ణాటక గాయని, సంగీత ప్రపంచంలో ఆమెకు గొప్ప పేరుంది. తంజావూరు వారి స్వస్థలం. ఈ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటి వ్యక్తి ‘ఎస్పీఎల్ ధనలక్ష్మి’. 1935లో 'నేషనల్ మూవీ టోన్' అనే నిర్మాణ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం 'పార్వతి కళ్యాణం'లో ధనలక్ష్మి హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఆమె సోదరి తమయంతి కూడా 1930వ దశకంలో కొన్ని చిత్రాలలో హీరోయిన్గా పని చేసింది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో హీరోయినే టీఆర్ రాజకుమారి.ఆమె అసలు పేరు రాజయ.1930లలోప్రముఖ దర్శకుడు కె.సుబ్రమణ్యం ఎస్పీఎల్ ధనలక్ష్మిని కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ధనలక్ష్మి సోదరి కుమార్తె రాజయ కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయిని చూసి వెంటనే తన సినిమాలో హీరోయిన్గా చేయమని సుబ్రమణ్యం అడిగారట. రాజయ పేరును రాజకుమారిగా మార్చి, తన చిత్రం 'కచ్ఛ దేవయాని' (1941)లో ఆమెను నటింపజేశాడు. తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా రాజకుమారి తమిళ సినిమాకు 'డ్రీమ్ గర్ల్'గా తిరుగులేని విజయం సాధించింది.రాజకుమారి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆమె ఫ్యామిలీ నుంచి మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చాయి.వారిలో అత్యంత ముఖ్యమైన వారు టీఆర్ రామన్న. టీఆర్ రామన్న తమిళ సినిమాకు ప్రముఖ దర్శకుడు, నిర్మాతగా పేరుగాంచారు. ఎం.జీ.ఆర్, శివాజీ వంటి దిగ్గజాలతో సినిమా తీసిన ఏకైక నిర్మాత ఆయనే కావడం విశేషం.ఆ తర్వాత టీఆర్ రాజకుమారి కోడలు కుశల కుమారి కూడా 70వ దశకంలో చిత్రాలలో హీరోయిన్గా వెలుగొందింది. కొన్నాళ్ల తర్వాత ఎస్పీఎల్ ధనలక్ష్మి ఇద్దరు కూతుళ్లు కూడా సినిమాల్లోకి వచ్చింది. వాళ్లే జ్యోతి లక్ష్మి, జయమాలిని. ధనలక్ష్మికి మరో సోదరికి పిల్లలు లేకపోవడంతో జ్యోతి లక్ష్మిని వారికి దత్తత ఇచ్చారు. జ్యోతి లక్ష్మి, జయమాలిని ఇద్దరూ తమ గ్లామరస్ పాటలలో నృత్యం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. జ్యోతి లక్ష్మి సుమారు 300 చిత్రాలలో నటించగా, జయమాలిని 500 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించింది.ఈ కుటుంబానికి చెందిన తదుపరి, చివరి తరం జ్యోతి మీనా. 'ఉళ్ళత్తై అళ్లిత' చిత్రంలో కౌండమణి పక్కన నటించిన జ్యోతి మీనా విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కూడా డ్యాన్స్ చేసింది. ఆమె కొన్ని సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేసింది. జ్యోతి మీనా తండ్రి ఒక కెమెరామెన్ కావడంతో, ఈ కుటుంబం నుండి సాంకేతిక రంగంలోకి కూడా ఒక వ్యక్తి వచ్చారు. ఇలా ఒకే కుటుంబం నంచి మొత్తంగా ఏడుగురు హీరోయిన్లు, ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీని శాసించారు.
సినిమా
వారణాసిలోకి దీపికా ఎంట్రీ..! జక్కన్న మాస్టర్ ప్లాన్
2030 వరకు సందీప్ వంగా వైల్డ్ ఫైర్
జపాన్ అభిమాని దెబ్బకు బిత్తరపోయిన పుష్ప..
పిచ్చి పిచ్చిగా ప్రేమించా కానీ..బ్రేకప్ పై దివ్య భారతి షాకింగ్ కామెంట్స్
విజయ్ సినిమాకు హైకోర్టు షాక్ జననాయగన్ విడుదల డౌటే..!
చిరంజీవి చెప్పింది తప్పు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్
థ్రిల్లింగ్ ట్విస్ట్ కు వెంకీ రెడీ!
ధనుష్, మృణాల్ పెళ్లి..! ఇదిగో క్లారిటీ
అనిల్ రావిపూడికి చిరు కార్ గిఫ్ట్.. ధర ఎంతో తెలుసా..!
ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!
