Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Vijay About Jana Nayagan Clash with Parasakthi Movie1
జన నాయగణ్‌ Vs పరాశక్తి.. విజయ్‌ రియాక్షన్‌ ఇదే..

శివకార్తికేయన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ పరాశక్తి. డాన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆకాశ్‌ నిర్మించిన ఈ మూవీలో రవిమోహన్‌, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజవుతోంది. అయితే దీనికంటే ఒకరోజు ముందు జనవరి 9న విజయ్‌ కథానాయకుడిగా నటించిన జననాయకన్‌ మూవీ విడుదలవుతోంది.పొంగల్‌కు సినిమా లేకపోవడంతో..దీని గురించి శివకార్తికేయన్‌ స్పందించాడు. శనివారం సాయంత్రం చెన్నైలో పరాశక్తి మూవీ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. పరాశక్తి సినిమాను 2025 అక్టోబర్‌లో లేదా దీపావళికి విడుదల చేద్దామని నిర్మాత ఆకాశ్‌, నేను మాట్లాడుకున్నాం. అయితే విజయ్‌ మూవీ అక్టోబర్‌లో తెరపైకి రానుందని.. దీంతో పొంగల్‌కు వేరే సినిమా లేదని ప్రచారం జరగడంతో మనం పొంగల్‌కు వద్దామని ఆకాశ్‌ చెప్పారు.తీరా అదే సమయంలోఅయితే కొన్ని రోజుల తర్వాత విజయ్‌ నటిస్తున్న జన నాయగణ్‌ మూవీ పొంగల్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే నిర్మాత ఆకాశ్‌కు ఫోన్‌ చేసి మనం రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేద్దామా అని అడిగాను. కానీ, అప్పటికే సినిమా రైట్స్‌ అన్నీ అమ్ముడుపోవడంతో అది కష్టమన్నాడు. తర్వాత నేను విజయ్‌ మేనేజర్‌ జగదీష్‌కు ఫోన్‌ చేసి.. జననాయగణ్‌ రిలీజ్‌ను సంక్రాంతికి మార్చారా? అని అడిగాను. అందుకాయన.. అవును, మార్చాం. అయినా ఏం పర్లేదు, రెండు సినిమాలు విజయం సాధిస్తాయి. మీ సినిమా రిలీజ్‌ చేయండి అన్నారు. విజయ్‌తో మాట్లాడా..అప్పటికీ నాకు మనసు కుదుటపడక విజయ్‌తో అన్ని విషయాలు మాట్లాడాను. పొంగల్‌కు పదిరోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి రెండు సినిమాలు విడుదల చేయొచ్చని చెప్పారు. దీనివల్ల ఎవరి సినిమా ప్రభావితం కాదన్నారు. నాకు, విజయ్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్‌ అన్నాతమ్ముళ్లది. జనవరి 9న జన నాయగణ్‌ మూవీ చూడండి. 33 ఏళ్లుగా మనల్ని ఎంటర్‌టైన్‌ చేసిన వ్యక్తి చివరి సినిమాను ఆదరించండి. ఆ తర్వాతి రోజు విడుదలవుతున్న పరాశక్తిని సైతం ఆదరించండి అని పేర్కొన్నాడు.

Anil Ravipudi Comments On Movie With Ram Charan2
చరణ్‌తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్‌ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టాడు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే కోరికను ఆయన తాజాగా వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రయిలర్ లాంచ్ కార్యక్రమంలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆటోమేటిగ్గా రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని ప్రకటించారు. అదే వేదికపై శంకర వరప్రసాద్ పాట స్టెప్‌ను రావిపూడి రీ క్రియేట్ చేశారు. ట్రయిలర్‌ను మొదటగా రామ్ చరణ్‌కే చూపించిన విషయాన్ని బయటపెట్టారు. మా యూనిట్ కాకుండా ట్రయిలర్ చూసిన తొలి వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి గారి ఇంట్లో చరణ్‌కు చూపించాం. చూసి ఎక్స్‌టార్డినరీగా ఉందన్నారని ఆయన తెలిపారు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని అనీల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా హీరో, కథ అన్నీ సెట్ అయితే ఆటోమేటిగ్గా పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనీల్ రావిపూడి వెల్లడించారు. రామ్ చరణ్‌తో సినిమా ఓకే చేసుకోవడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను అందుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్‌తో అనీల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్‌కు నాంది పలికినట్టే.

Allu Arjun And Lokesh Kanagaraj Movie Is Superhero Film3
ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ ఏడాది అక్టోబరు వరకు ఉండనుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలోకి రావడం దాదాపు వచ్చే ఏడాదే అనమాట. సరే ఈ మూవీ సంగతి పక్కనబెడితే బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడా అనే గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లిస్టులో మరో పేరు వచ్చింది. స్టోరీ ఏంటనేది కూడా టాక్ నడుస్తోంది.అట్లీ తర్వాత త్రివిక్రమ్‌తోనే బన్నీ కలిసి పనిచేయబోతున్నాడని కొన్నిరోజుల ముందు రూమర్స్ వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయిన 'గాడ్ ఆఫ్ వార్' అనే స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందని.. ఈ ఏడాదిలో విషయంపై క్లారిటీ రావొచ్చని కొన్ని రోజుల ముందే మాట్లాడుకున్నారు. ఇది నిజమో కాదో అనే సంగతి పక్కనబెడితే కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్)మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బన్నీ-లోకేశ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని టాక్ అయితే బయటకొచ్చింది. అయితే గతంలో లోకేశ్ రాసుకున్న 'ఇరుంబక్కు మాయావీ' స్క్రిప్ట్‌నే ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మార్పులు చేసి బన్నీతో చేయబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ గతంలో సూర్యతో అనుకున్నారు. కానీ కుదర్లేదు. 'కూలీ' టైంలో దీన్ని ఆమిర్ ఖాన్‌తో లోకేశ్ చేయనున్నాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే బన్నీ పేరు తెరపైకి వచ్చింది. నిజమా కాదా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో తయారు చేసిన చేతిని అమర్చుతారు. దీంతో అతడికి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి? తర్వాత ఏమైంది అనేదే 'ఇరుంబక్కు మాయావీ' స్టోరీ లైన్ అని గతంలోనే లోకేశ్ ఓసారి చెప్పాడు. మరి బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనా కాదా అనేది చూడాలి? దీనికి అనిరుధ్ సంగీతమందించే అవకాశముందని కూడా మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్‌ వచ్చేసింది)

Lavanya Tripathi And Anasuya Latest News4
కొడుకుతో లావణ్య బీచ్ ట్రిప్.. చీరలో అనసూయ

పట్టుచీరలో మెరిసిపోతున్న యాంకర్ అనసూయ2025లో నా బెస్ట్ గిఫ్ట్.. కొడుకు గురించి లావణ్య పోస్ట్బ్లాక్ గౌనులో కాజల్ అగర్వాల్ గ్లామర్ మెరుపులుమాల్దీవులు వెళ్లిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్డిసెంబరు జ్ఞాపకాలతో ముద్దుగుమ్మ మృణాల్దుబాయిలో చిల్ అయిపోతున్న సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Darshan Wife Vijayalakshmi: This Time Trolls Crossed All Limits5
నా హృదయం ముక్కలు.. హద్దులు మీరుతున్నారు: దర్శన్‌ భార్య

వేధింపులను భరించాల్సిన అవసరం లేదంటోంది కన్నడ హీరో దర్శన్‌ భార్య విజయలక్ష్మి. తనపై ఆన్‌లైన్‌ వేధింపులు తీవ్రతరం అవడంతో ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్స్‌ ఎదుర్కోవడం నాకు ఇదేం మొదటిసారి కాదు. నాలుగేళ్ల క్రితం నా ఫోటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. నాకే ఇలా జరుగుతుందంటే..కానీ, ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగింది. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదు. నాకే ఇలా జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఎంతోమంది అమ్మాయిలు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్నారు, అది తల్చుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది.నిశ్శబ్ధాన్ని వీడండితప్పు చేసేవారు భయపడాలి, మనం కాదు! ఎవరికోసమో మీరు మారక్కర్లేదు. ట్రోలర్స్‌ను లెక్క చేయకండి. నిశ్శబ్ధంగా కుమిలిపోకండి, బయటకు రండి, మీపై జరుగుతున్న వేధింపులను నిలదీయండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి. అయితే మహిళా భద్రత విషయంలో సైబర్‌ న్యాయ వ్యవస్థ మరింత కఠినంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.జైలు జీవితంఇకపోతే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ జైలుపాలైన విషయం తెలిసిందే! ప్రియురాలు పవిత్రకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపాడన్న కోపంతో దర్శన్‌ కొందరు మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే దర్శన్‌ జైలు జీవితం గడుపుతున్నాడు.చదవండి: సినిమా ఫ్లాప్‌.. నాకు బాగా కలిసొచ్చింది: బాలీవుడ్‌ నటి

I Do not Care: Elnaaz Norouzi Reacts To Mastiii 4 Movie Trolls6
సినిమా ఫెయిల్‌.. నాకు బాగా కలిసొచ్చింది: నటి

హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్‌ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్‌ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్‌ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.ట్రై చేశా..సినిమా రిజల్ట్‌ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్‌కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్‌ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్‌డ్‌ గేమ్స్‌, అభయ్‌ వంటి ప్రాజెక్టులలో సీరియస్‌ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్‌గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నేనే ధైర్యం తెచ్చుకుని..ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్‌ మన చేతుల్లో ఉండదు.నా లైఫ్‌ నాదిమస్తీ 4 మూవీలోని అడల్ట్‌ జోక్స్‌పై జరిగిన ట్రోలింగ్‌ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్‌ను నా ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్‌ చెప్పుకొచ్చింది. చదవండి: 'మా జీవితాల్లో విలన్‌ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు'

Allu Arjun Wife Sneha Mobbed By Fans Cafe Niloufer7
అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్

ఎప్పటినుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ.. రీసెంట్ టైంలో ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం 'రాజాసాబ్' ప్రమోషన్‌లో భాగంగా ఓ మాల్‌కి నిధి అగర్వాల్ వచ్చింది. వెళ్లే క్రమంలోనే అక్కడున్న జనం ఈమెని చాలా ఇబ్బంది పెట్టేశారు. అందుకు సంబంధించిన మాల్ యాజమాన్యంపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఇలానే అల్లు అర్జున్, అతడి భార్య కాస్త ఇబ్బంది పడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా)ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరిట కొత్తగా పెద్దగా థియేటర్‌ని నిర్మించాడు. దీని లాంచింగ్ తర్వాత తిరిగెళ్లే క్రమంలో హైటెక్ సిటీలోని ఓ కేఫేకి భార్య స్నేహతో కలిసి వెళ్లాడు. దీని నుంచి బయటకొచ్చే క్రమంలోనే వీళ్లని అక్కడున్న జనం చుట్టుముట్టారు. దీంతో బన్నీ, అతడి భార్య కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు కొన్నిరోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత వెళ్లి వస్తున్న టైంలో ఇలాంటిదే జరిగింది. మలేసియాలో 'జన నాయగణ్' ఈవెంట్ ముగించుకుని చెన్నై తిరిగొచ్చిన తర్వాత విమానాశ్రయంలో అయితే హీరో విజయ్‌ని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇతడు దాదాపు కిందపడిపోయేంత ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా ఈ మధ్య సెలబ్రిటీలు బయట తిరగడం చాలా కష్టమైపోతోంది.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్‌ వచ్చేసింది)అల్లు అర్జున్ తన భార్య స్నేహ తో కలిసి హైటెక్ సిటీలోని కేఫ్ నీలోఫర్‌లో కనిపించారు.#AlluArjun #Sneha #HitechCity #CafeNiloufer #Hyderabad pic.twitter.com/L0n1u8EdgC— Everest News (@Everest_News7) January 4, 2026

Mr Work From Home Movie Official Teaser8
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' టీజర్‌ విడుదల

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా టీజర్‌ ఉంది. ముఖ్యంగా ప్రకాష్ చెరుకూరి అందించిన సంగీతం మరింత ఇంపాక్ట్‌ చూపుతుంది.ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి . దీంతో మా అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. టికెట్ ధరలు తక్కువ ఉంటే ఆడియన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి మనమందరం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం.' అని ఆయన అన్నారు.ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. 'ఈ మూవీ మంచి కంటెంట్‌తో పాటు హైలీ ఎంటర్టైన్‌ అందించేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్‌తో పాటు మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.' అని ఆయన అన్నారు.

Parasakthi Movie Trailer Telugu9
శివకార్తికేయన్ 'పరాశక్తి' ట్రైలర్ రిలీజ్

పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నశివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'పరాశక్తి'. శ్రీలీల హీరోయిన్ కాగా రవి మోహన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అధర్వ కీలక పాత్ర చేశాడు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ఈ శనివారం(జనవరి 10న) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు.1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా 'పరాశక్తి' తీశారని ట్రైలర్‪‌తో క్లారిటీ వచ్చేసింది. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్‌తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో మూవీని తెరకెక్కించారు.ప్రధాన పాత్రధారులు వేషధారణ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే తెలుగులో దీనికి ఎంతవరకు ఆదరణ దక్కుతుందో చూడాలి?ఎందుకంటే 'పరాశక్తి' చిత్రాన్ని జనవరి 10న తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తమిళ వరకు అయితే విజయ్ 'జన నాయగణ్' మాత్రమే పోటీలో ఉంది. తెలుగుకు వచ్చేసరికి 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారీ'.. ఇలా ఐదు తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'పరాశక్తి'కి ఏ మేరకు థియేటర్లు లభిస్తాయనేది, సబ్జెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి?

Jay Bhanushali, Mahhi Vij Part Ways after 15 years Marriage10
భర్తతో హీరోయిన్‌ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్‌..'

బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటాం. దారులు వేరుమా పిల్లలు తార, ఖుషి, రాజ్‌వీర్‌లకు తల్లిదండ్రులుగా, బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్‌ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో నోట్‌ షేర్‌ చేశారు.ప్రేమకథజై- మహి ఓ క్లబ్‌లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్‌ పార్ట్‌నర్‌ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్‌వీర్‌, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్‌ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.తెలుగు సినిమా హీరోయిన్‌మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్‌గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్‌కు షిఫ్ట్‌ అయింది. జై భానుషాలి.. హేట్‌ స్టోరీ 2, ఏక్‌ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. అలాగే పలు సీరియల్స్‌లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్‌ బలియే అనే డ్యాన్స్‌ షో సీజన్‌ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.చదవండి: హీరో విజయ్‌ సీఎం అవుతాడు: నటుడు సుమన్‌

Advertisement
Advertisement