Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Kaveri Baruah Comments On Icon Star Allu Arjun Meeting Rules1
'ఐకాన్ స్టార్‌తో షూట్‌.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్‌ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్‌ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే అల్లు అర్జున్‌పై ప్రముఖ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె.. అల్లు అ‍ర్జున్‌ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్‌ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్‌ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.కావేరి బారువా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్‌తో జరిగింది. ఈ సౌత్ స్టార్‌ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్‌కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. ‍అలాగే షేక్ హ్యాండ్స్‌ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‍‍‍అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn— AnandTanniru (@ceoyktv) February 10, 2026

Namrata Shirodkar Emotional Marriage Day Quotes For Mahesh Babu2
ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను.. నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌లో మహేశ్‌ బాబు, నమ్రత జోడి ఒకటి. ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికి 21 సంవత్సరాలు అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. విమానంలో మహేశ్‌బాబుతో కలిసి ఉన్న పాత ఫోటోని షేర్‌ చేస్తూ.. ‘21 వసంతాలు దాటినా ఇప్పటికీ ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫోస్ట్‌ని మహేశ్‌ కూడా తన ఇన్‌స్టా ఖాతాలో రీ షేర్‌ చేశాడు. బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా కామెంట్‌ చేసింది. లవ్, ఫైర్, క్లాపింగ్ ఎమోజీలతో మ్యారేజ్‌ డే విషెస్‌ తెలియజేసింది. కాగా, వంశీ(2000) మూవీ షూటింగ్‌ టైమ్‌లో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఐదేళ్ల తర్వాత 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2006లో గౌతమ్‌, 2012లో సితార జన్మించింది. మహేశ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమాచేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Priyanka Chopra Husband Nick Jonas Comments On SS Rajamouli Varanasi3
'తన కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా'..వారణాసిపై ప్రియాంక భర్త కామెంట్స్

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్‌ అండ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. తొలిసారి వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు డేట్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ గురించి ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత పద్నాలుగు నెలలుగా ప్రియాంక ఓ మూవీ కోసం పనిచేస్తోందని తెలిపారు. ఈ సౌతిండియా ఫిల్మ్‌ను ఆర్ఆర్ఆర్ డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు. ఇది తన కెరీర్‌లోనే అతి పెద్ది సినిమా అని నిక్ జోనాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ అద్భుతంగా ఉండనుందని నిక్ కొనియాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Neena Gupta Opens Up About Tolerating Director Abuse On Set4
కారణం లేకుండా బూతులు తిట్టేవాళ్లు : నటి షాకింగ్ కామెంట్స్

కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అవమనాలు ఎదుర్కొన్నానని, కొంతమంది దర్శకులతో బూతులు కూడా తిట్టించుకున్నానని చెబుతోంది బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీనా గుప్తా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన కొన్ని సంఘటలను పంచుకుంది. ‘చాలా మంది నటీనటులాకే నాకు కూడా కెరీర్‌ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురైయ్యాయి. సెట్‌లో అవమానించేలా మాట్లాడేవారు. కొంతమంది దర్శకులు కారణం లేకుండా బూతులు తిట్టేవారు. అప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. డబ్బులు కావాలి. అందుకే వాళ్లు అసభ్య పదాలతో దూషించినా.. సైలెంట్‌గా ఉండిపోయా. కొన్ని సినిమాలు అయితే కేవలం డబ్బుల కోసమే నటించా. షూటింగ్‌ అయిపోయాక ఈ చిత్రాలను ఎందుకు అంగీకరించానా అని చాలా బాధపడేదాన్ని. అవి విడుదల కావొద్దని దేవుడ్ని కోరుకున్నా. అవకాశాలు రాకపోవడంతో ఆ చిత్రాలను అంగీకరించా. ఒకవేళ ఆ సమయంలో నాకు వేరే చిత్రాలు వచ్చి ఉంటే.. కొన్ని సినిమాలను వదిలేదాన్ని’ అని నీనా గుప్తా చెప్పుకొచ్చింది. సినిమాలతో పాటు సిరియళ్లలోనూ నటించింది నీనా గుప్తా.‘ఇష్క్‌’, ‘ఎలోన్‌’, ‘ముల్క్‌’, ‘83’, ‘డయల్‌ 100’, ‘గుడ్‌బై’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా అలరించింది.

Sankranthi two major hit movies OTT streaming Same day5
ఓకేరోజు రెండు హిట్‌ సినిమాలు.. ప్రేక్షకులకు పండగే

ఈ సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్స్‌గా నిలిచాయి. థియేటర్‌ రన్‌ ముగిసిన ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వెండితెరపై వాటిని మిస్ అయిన వారు, మళ్ళీ చూడటానికి ప్లాన్ చేసుకున్న వారికి ఇప్పుడు శుభవార్త వచ్చింది. రెండు సినిమాలు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో ఈ రాత్రి ఓటీటీలో ప్రీమియర్ కానున్నాయి.అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ ఫిబ్రవరి 11న జీ5(ZEE5)లో విడుదల కానుంది. అంటే నేడు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీ5 పేర్కొంది. ఇందులో మరో హీరో వెంకటేశ్‌ సందడి చేయగా నయనతార తన నటనతో మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 375 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. మరీ ఓటీటీలో కూడా ఈ చిత్రం రికార్డ్‌ స్థాయిలో వ్యూస్‌ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు కూడా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. మారి దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ రాజకీయ హాస్య చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా నేడు అర్ధరాత్రి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో OTTలోకి అడుగుపెడుతుంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది.. రెండు విజయవంతమైన సినిమాలు ఒకే రాత్రి ప్రీమియర్ అవుతుండటంతో, ఇది OTT ప్రేక్షకులకు డబుల్ ట్రీట్‌గా మారుతుంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో చూడతగిన చిత్రాలుగా ఉండనున్నాయి.

Madras High Court Permits Jana Nayagan movie Makers Of Withdraw Petition6
జన నాయగన్‌ 'విజయ్' ఫ్యాన్స్‌కు శుభవార్త

దళపతి విజయ్ అభిమానులకు శుభవార్త. జన నాయగన్ మూవీ నిర్మాతలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్‌ బోర్డుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు మద్రాస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మధ్య జరిగిన చట్టపరమైన వివాదం ముగిసింది. చిత్ర నిర్మాతలకు CBFCపై వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి మద్రాస్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఈ కేసులో KVN ప్రొడక్షన్స్ తరపున వాదిస్తున్న న్యాయవాది విజయన్ సుబ్రమణ్యం చేసిన అభ్యర్థనను జస్టిస్ PT ఆశా అనుమతించారు. కేసును ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ ద్వారా తెలియజేసింది. సినిమాను మరోసారి రివైజింగ్‌ కమిటీకి పంపి సమీక్ష ప్రక్రియను కొనసాగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇకపై చట్టపరమైన చర్యలను కొనసాగించడం లేదని లేఖలో నిర్మాతలు పేర్కొన్నారు. CBFCకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయిపోయింది. ఇప్పటికే జన నాయగన్‌ నిర్మాతలు ఈ చిత్రాన్ని CBFC రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Kiran Abbavaram enter in pan India movie with mythology story7
మైథాలజీ వరల్డ్‌కు కిరణ్‌ అబ్బవరం.. కొత్త సినిమా ప్రకటన

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా పనులు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్‌ కలిసి నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రంలో ఆయన భాగమయ్యారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను నిర్మించేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదే సమయంలో హీరోయిన్ ఎంపికపై బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు వంటి సాంకేతిక యూనిట్‌ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్‌ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Madras High Court Warning to Rajinikanth Kochadaiiyaan Producer8
డబ్బు చెల్లిస్తారా.. జైలుకెళ్తారా రజనీకాంత్‌ నిర్మాతకు కోర్టు ఆదేశాలు

చెక్‌ బౌన్స్‌ కేసులో రజనీకాంత్‌ ‘కొచ్చడైయాన్‌’ సినిమా నిర్మాతకు మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి రూ.2.5 కోట్లు చెల్లిస్తారా.. లేదా జైలుకు వెళ్తారా అనేది తేల్చుకోవాలని చిత్ర నిర్మాతకు కోర్టు హుకూం జారీ చేసింది. రజనీకాంత్‌ హీరోగా 3డీ మోషన్‌ క్యాప్చర్‌ మూవీగా కొచ్చడైయాన్‌ ( Kochadaiiyaan) 2014లో విడుదలైంది. ఈ మూవీకి ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత జె. మురళి మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ఈ సినిమా బడ్జెట్‌ భారీగా పెరిగిపోయింది. చివరి దశలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసేందుకు బెంగుళూరుకి చెందిన యాడ్‌ బ్యూరో అడ్వర్టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఆయన రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిర్మాత మురళి మనోహర్ విఫలం కావడంతో చట్టపరమైన వివాదానికి మూలంగా మారింది. అయితే, కొంత కాలం తర్వాత తిరిగి చెల్లింపులో భాగంగా చిత్ర నిర్మాత కొన్ని చెక్కులు ఇచ్చాడు. అందులో ఒకటి బౌన్స్ అయింది. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశాడు. అనేక సంవత్సరాల పాటు విచారణ తర్వాత, ట్రయల్ కోర్టు నిర్మాతను దోషిగా నిర్ధారించి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన గడవులోపు చెల్లించకపోతే జైలు శిక్షను అమలు చేయవచ్చని కోర్టు పేర్కొంది.

SS Thaman OST Still Missing o Balakrishna Daaku Maharaaj9
'బాలకృష్ణ' ఫ్యాన్స్‌ను పదేపదే నిరాశపరుస్తున్న తమన్‌

సంగీత దర్శకుడు తమన్ కొట్టే బీజీఎమ్‌కు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి.. కొన్ని చోట్ల థియేటర్‌ సౌండ్‌ బాక్స్‌లు బద్దలవుతాయి. డాల్బీ థియేటర్‌ అయితే మరింత కిక్‌ ఇస్తుందని అభిమానులు అంటుంటారు. తమన్‌ కొట్టే మ్యూజిక్‌కు డెసిబుల్ స్థాయి మారిపోతుందని తన వర్క్‌ ఔట్‌పుట్‌ గురించి చెబుతుంటారు. అయితే, తమన్‌ ఏడాది క్రితం బాలకృష్ణ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయాడు. దీంతో బాలయ్య అభిమానులు మరోసారి నిరాశ చెందుతున్నారు.డాకు మహారాజ్ మూవీ OST/BGM విడుదల చేస్తానని సరిగ్గా ఏడాది క్రితం థమన్ అభిమానులకు హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం గడిచిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం గురించి హామీలు ఇచ్చినప్పటికీ, అతను దానిని అమలు చేయలేదు. ఇది బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ, డాకు మహారాజ్ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు సంబంధించిన OSTని కూడా ఆయన విడుదల చేశారు. ఇదీ బాలయ్య ఫ్యాన్స్‌ను మరింత నిరాశ చెందేలా చేసింది. కొద్దిరోజుల క్రితం 2026 జనవరిలో విడుదల చేస్తానని మరోసారి మాట ఇచ్చాడు. ఆ తేదీ కూడా దాటిపోవడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.డాకు మహారాజ్‌లో డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా... ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా'అంటూ సాగిన ఈ సాంగ్‌ చాలా పాపులర్‌ అయింది. దీంతో పాటు 'సర్కారు రా' అంటూ సాగిన ఈ రెండు ఈ పాటలలో తమన్‌ కొట్టిన బీజీఎమ్‌ మరో రేంజ్‌లో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్‌ ఈ ట్రాక్‌ కావాలని చాలాసార్లు కోరుతున్నారు. గతేడాది సంక్రాంతి విడుదలైన ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. కలెక్షన్స్‌ పరంగా పెద్దగా రాబట్టలేకపోయినప్పటికీ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ మూవీ మెప్పించింది. డిక్టేటర్‌, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి వంటి చిత్రాలతో పాటు ‘డాకు మహారాజ్‌’కు తమన్‌ సంగీతం అందించాడు. ఇవన్నీ కూడా ఆదరణ పొందాయి. దీంతో తమన్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా బాలకృష్ణ ఇచ్చిన విషయం తెలిసిందే.

Allu Cinemas multiplex streaming first movie details10
అల్లు అర్జున్‌ మల్టీఫ్లెక్స్‌ ఓపెనింగ్‌ ఫిక్స్‌.. మొదటి సినిమా ఇదే..!

మల్టీఫ్లెక్స్‌ థియేటర్స్‌ నిర్మించడంలో అల్లు అర్జున్‌ దూకుడుగా ఉన్నారు. హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా జోరు చూపిస్తున్నారు. మొదట మహేష్‌ బాబు ఏఎమ్‌బీతో ఈ ట్రెండ్‌ క్రియేట్‌ చేయగా.. ఈ తర్వాత బన్నీ, విజయ్‌ దేవరకొండ, రవితేజ అదే దారిలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా ఏషియన్ గ్రూప్స్‌తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అమిర్‌పేట్‌లో ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్‌ నిర్మించిన అల్లు అర్జున్‌ ఇప్పుడు అల్లు సినిమాస్‌ పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.అల్లు సినిమాస్‌ పేరుతో హైదరాబాద్‌లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. ఈ థియేటర్‌లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్‌ను ఏర్పాటు చేయడంతో హైదరబాద్‌ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, 4 స్క్రీన్‌లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌ను మార్చి 19న ప్రారంభించాలనే ఆలోచనలో అల్లు సినిమాస్‌ టీమ్‌ ఉన్నట్లు సమాచారం. ఇందులో తొలి సినిమాగా 'ధురంధర్ 2, టాక్సిక్‌' ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు పాన్‌ ఇండియా సినిమాలు ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్‌ బ్రాండ్‌ విస్తరిస్తుందని ప్లాన్‌ చేస్తున్నారట. హైదరాబాద్ సినీప్రియులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం అల్లు సినిమాస్‌తో లభించనుంది. విశాఖపట్నంలో కూడా అతిపెద్ద మల్టీఫ్లెక్స్‌ నిర్మాణ పనులను అల్లు అర్జున్‌ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement