Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Anaganaga Oka Raju OTT Streaming Date Locked1
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్‌ ప్రకటన

నవీన్‌ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.థియేటర్‌ రన్‌ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‌ కానుందని యాప్‌లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్‌ పొలిశెట్టి కామెడి పంచ్‌లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్‌ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్‌ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్‌ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్‌) బాగా రిచ్‌ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్‌గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్‌ పొన్నప్ప)తో నవీన్‌కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Assi actor Kani Kusruti Once Quit Acting, Reason is Inside2
అడ్జస్ట్‌మెంట్‌ తప్పదు.. అమ్మతో చెప్పేసరికి!: స్పైడర్‌ నటి

మలయాళ నటి కని కుస్రుతి సొంత భాషతో పాటు తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో స్పైడర్‌ మూవీలో విలన్‌ తల్లిగా యాక్ట్‌ చేసింది. తాజాగా ఈ నటి అస్సి అనే హిందీలో సినిమా యాక్ట్‌ చేసింది. ఇందులో అత్యాచార బాధితురాలిగా కనిపించనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.అంత ఈజీ కాదుఅయితే కుస్రుతి ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకుంది. గతంలో ఈ విషయం గురించి కని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్‌ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. తీరా ఇక్కడికి వచ్చాక అదంత ఈజీ కాదని తెలుసుకున్నాను. కొందరు దర్శకనిర్మాతలు లైంగిక వాంఛలు తీర్చితే అవకాశాలిస్తామన్నారు. ఓపక్క అడ్జస్ట్‌ అవమని ఒత్తిళ్లు, మరోపక్క నటిగా పరిమితులు విధించేవారు. అమ్మతోనూ అదేమాటకొందరైతే నేరుగా మా అమ్మతో మాట్లాడారు. ఫలానా సినిమాలో మీ కూతురు కనిపించాలంటే తను అడ్జస్ట్‌ అవ్వాల్సిందే అన్నారు. ఇవన్నీ భరించలేకపోయాను. ఈ ఇండస్ట్రీలో బతకడం కష్టమని వెనక్కు వచ్చేశాను. థియేటర్‌ డ్రామాలు చేసుకుంటూ పోయాను. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.సినిమాకని కుస్రుతి సినిమాల విషయానికి వస్తే.. 2003లో అన్యర్‌ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిర్యానీ, కేరళ కేఫ్‌, గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌, ఆల్‌ వి ఇమాజిన్‌ ఆజ్‌ లైట్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. కిల్లర్‌ సూప్‌, పోచర్‌, నాగేంద్రాస్‌ హనీమూన్‌ వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది.చదవండి: నా కొడుకు దుబారా ఖర్చు చేస్తున్నాడా? బిల్లు చూపించు: సునీల్‌ శెట్టి

Suniel Shetty Slams Rumours That Linking Sanki delay to Ahan Shetty Entourage3
నా కొడుకు భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడా? ఏదీ బిల్లు తీసుకురా..

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "సంకీ". సాజిద్‌ నజియావాలా నిర్మించిన ఈ సినిమా 2025లో రిలీజ్‌ అవ్వాల్సింది. కానీ, ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. దీనికి హీరో అహాన్‌ శెట్టియే కారణమంటూ రూమర్స్‌ మొదలయ్యాయి. అతడి మితిమీరిన ఖర్చుపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాత సినిమాను అర్ధాంతరంగా ఆపేశాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌ను సునీల్‌ శెట్టి ఖండించాడు. బిల్లు చూపించండిఆయన మాట్లాడుతూ.. నా కొడుక్కి అతడి పరిమితులేంటో తెలుసు. దాన్ని దాటి ఎప్పుడూ ఖర్చు చేయడదు. ఇదంతా ఉట్టి ప్రచారమే.. ఒకవేళ అహాన్‌ భారీగా ఖర్చు చేస్తున్నాడంటే నిర్మాత అందుకు సంబంధించిన బిల్లును తీసుకురమ్మనండి. దాని సంగతేంటో నేనూ చూస్తాను. వారి బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి అవతలివారిపై నిందలు వేయడం సమంజసం కాదు. ఇది మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు అహాన్‌ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంటి నుంచే భోజనంనేను సెట్‌కు వెళ్లినప్పుడు కూడా నా భోజనం, నీళ్లు నేనే తెచ్చుకుంటాను. నా సిబ్బందిని సెట్‌లో పెట్టిన ఆహారమే తినమని చెప్తాను. ఒకవేళ బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకుంటానంటే ఆ బిల్లు నేనే కడతాను, నిర్మాత కాదు! నా సిబ్బందే కాదు అహాన్‌ స్టాఫ్‌ (మేకప్‌ ఆర్టిస్ట్‌, హెయిర్‌ స్టయిలిస్ట్‌, ఇతరత్రా) కూడా ఇదే పాటిస్తారు. వాడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. అలాంటివాడిపై కావాలనే ఇలాంటి నిందలేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహాన్‌ శెట్టి 2021లో వచ్చిన తడప్‌ సినిమాతో నటుడిగా కెరీర్‌ ఆరంభించాడు. అతడు నటించిన రెండో చిత్రమే సంకీ. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. అహాన్‌ చివరగా బోర్డర్‌ 2 సినిమాలో నటించాడు.

Meenakshi Chaudhary reach Tirumala by Alipiri4
కాలినడకన తిరుమలకు నటి మీనాక్షి చౌదరి (వీడియో)

కలియుగదైవం తిరుమల శ్రీవారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. రీసెంట్‌గా తాను నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం విజయం అందుకోవడంతో ఆమె స్వామివారి ఆశీస్సులను తీసుకునేందుకు అలిపిరి కాలినడకన కొండకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ మూవీ విడుదల సమయంలో కూడా శ్రీవారిని ఆమె దర్శించుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో మీనాక్షి పాల్గొన్నారు. దర్శన అనంతరం మీనాక్షికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు.

Kick 2 movie actor Rajpal Yadav surender at tihar jail5
చెక్‌బౌన్స్‌ కేసులో తీహార్‌ జైలుకు కిక్‌-2 నటుడు

కిక్‌-2 సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్ యాదవ్ తీహార్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్‌బౌన్స్‌ కేసులో నటుడికి ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. కానీ, గడుపు పెంచాలని పలుమార్లు కోరుతూ కొంత కాలంగా ఆయన కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో కోర్టు ఆగ్రహం చేయడంతో తప్పనిపరిస్థితిల్లో తీహార్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ 2017లో చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టింది. రాజ్‌పాల్ యాదవ్‌ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్‌ చెక​్‌లు కూడా బౌన్స్‌ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్‌పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్‌పాల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్‌ అయింది. తీహార్‌ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది.

TV Actor Nakuul Mehta says his first Telugu film never released6
నా ఫస్ట్‌ మూవీ తెలుగులో.. ఇంతవరకు రిలీజవ్వలేదు

తెలుగు సినిమాతోనే తన ప్రయాణం మొదలైందంటున్నాడు బాలీవుడ్‌ నటుడు నకుల్‌ మెహతా. కానీ తెలుగులో నటించిన తొలి సినిమా ఇంతవరకు రిలీజవలేదని చెప్తున్నాడు. నకుల్‌ మాట్లాడుతూ.. తెలుగు మూవీతోనే నా కెరీర్‌ మొదలైంది. హైదరాబాద్‌ వెళ్లి మూడు నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడు హీరోయిన్‌ శ్రియా పేరు బాగా వినిపించింది. ఖాళీగానే ఉన్న సమయంలో తన సినిమాలు చూసేవాడిని. నా సినిమా ముందుకు కదల్లేదుతన కెరీర్‌ కూడా అప్పుడప్పుడే మొదలైంది. కానీ ఆరంభం నుంచే సక్సెస్‌ఫుల్‌గా రాణించింది. నా సినిమా మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో నేను మళ్లీ ముంబై వచ్చేసి యాడ్స్‌ చేసుకుంటూ నా దారి నేను చూసుకున్నాను. నటుడినవ్వాలన్న కోరిక మొదట్లో అంత బలంగా లేదు. కాకపోతే నా చుట్టూ ఉంండేవారంతా నన్ను యాక్టింగ్‌ వైపు వెళ్లమని చెప్పేవారు. నాక్కూడా అందరినీ ఎంటర్‌టైన్‌ చేయడం అంటే ఇష్టం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా..అలా తెలుగు సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకున్నాను. కానీ ఆ భాష నాకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అయితే మన చుట్టూ ఉన్న మనుషులు సరిగా ఉంటే అన్నీ సర్దుకుపోవచ్చనిపించింది. ఈ అనుభవం నాకు బాగానే పనికొచ్చింది. కెమెరా ముందు నటించడాన్ని మరింత ప్రేమించాను. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి పర్ఫామెన్స్‌ ఇచ్చేందుకు నావంతు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అదే సక్సెస్‌శ్రియా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఎంతో సక్సెస్‌ను చూసింది, స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. నా దృష్టిలో సక్సెస్‌ అంటే జనం మనల్ని ప్రేమించడమే! కాగా నకుల్‌.. ఇష్క్‌బాజ్‌ సీరియల్‌తో గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో అభిమాని (2005) సినిమాలో యాక్ట్‌ చేశాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఫుల్‌ యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. చివరగా స్పేస్‌ జెన్‌: చంద్రయాన్‌ అనే సిరీస్‌లో యాక్ట్‌ చేశాడు.చదవండి: ధురంధర్‌ 2లో దర్శకుడి సతీమణి

Parasakthi Telugu trailer and OTT streaming details7
హిందీ వాళ్లపై కోపం లేదు.. 'పరాశక్తి' తెలుగు ట్రైలర్‌

సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్‌ మూవీ ‘పరాశక్తి’ తమిళ్‌లో మాత్రమే విడుదలైంది. తెలుగులో థియేటర్స్‌ కొరత కారణంగా కనీసం ట్రైలర్‌ కూడా ఆ సమయంలో రిలీజ్‌ చేయలేదు. అయితే, కోలీవుడ్‌లో థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత డైరెక్ట్‌గా తెలుగు వర్షన్‌ను కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను జీ5 వేదికగా పంచుకున్నారు. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే మూవీతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.పరాశక్తి(Parasakthi) సినిమా ఫిబ్రవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్‌ కూడా విడుదల కానుంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో పేర్కొన్నారు. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఇందులో చూపించారు.

Euphoria Movie Review In Telugu And Rating8
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్‌ మెప్పించారా?

టైటిల్‌: యుఫోరియానటీనటులు: భూమిక, సారా అర్జున్, విఘ్నేశ్‌ గవిరెడ్డి, గౌతమ్‌ మేనన్, రోహిత్, ఆదర్శ్‌ బాలకృష్ణ, నాజర్, రవి ప్రకాశ్, నవీన రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: గుణ టీమ్‌ వర్క్స్‌నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా ముఖి, రాగిణి గుణరచన-దర్శకత్వం: గుణశేఖర్‌సంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె పోతన్ఎడిటర్‌: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఫిబ్రవరి 06, 2026తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల జాబితాలో గుణశేఖర్‌ పేరు ఉంటుంది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తెరకెక్కించారు. ఒక్కడు, రుద్రమదేవి, రామాయణం వంటి చిత్రాలతో చరిత్రాత్మక, సామాజిక, యాక్షన్‌ జానర్లలో తన ప్రత్యేక ముద్ర వేశారు. అయితే, గత కొన్నేళ్లుగా గుణశేఖర్‌కు సరైన విజయం దక్కలేదు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో 'యుఫోరియా' మూవీని తెరకెక్కించారు. యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో నేటి త‌రానికి కనెక్ట్‌ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించారు.కథచైత్ర (సారా అర్జున్) చదువులో టాపర్‌.. ఐఏఎస్‌ కావాలనే కోరికతో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి కూడా .. ఒకరోజు తన స్నేహితురాలు పిలుపుమేరకు ఓ పబ్‌కు వెళ్తుంది. అక్కడ చైత్రకు పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లలో వికాశ్‌ (విఘ్నేశ్‌ గవిరెడ్డి) ఆమెపై కన్నేస్తాడు. డ్రగ్స్‌ మత్తులో ఉన్న వారందరూ చైత్రను నమ్మించి కారులో తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. చైత్ర ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్‌ జయదేవ్‌ (గౌతమ్‌ మేనన్‌) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.అయితే, చైత్రను అత్యాచారం చేసిన ఐదుగురు కుర్రాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌ చాలా బలంగా ఉంటుంది. వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. ఇలాంటి క్లిస్టసమయంలో కమిషనర్‌ జయదేవ్‌ కేసును ఎలా ఛేదించారు..? ఈ కేసులో​ నేను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) ఎంట్రీ ఇస్తుంది.. ఇంతకీ ఈ నేరంతో​ ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? తనకు శిక్ష విధించాలని హైకోర్టును ఎందుకు కోరుతుంది..? ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనర్‌ జయదేవ్‌కు వింధ్య చేసిన సాయం ఏంటి..? తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వింధ్య ఎలాంటి సాహసం చేసింది..? తెలియాలంటే యుఫోరియా మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..2022 మే 28న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్‌రేప్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనలో 6 మంది యువకులు (వారిలో 5 మంది మైనర్లు) పాల్గొన్నారు. ఈ ఘటనతో పాటు మరికొన్ని కీలక సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు గుణశేఖర్‌ యుఫోరియా కథను వెండితెరపై చూపించారని అర్థమౌతుంది. నేటి యువతరం విచ్చలివిడిగా తమ ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిస‌లై ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో ఈ మూవీలో చూపించారు. ఈ క్రమంలో తమ కన్నవాళ్ల జీవితాలు కూడా నరకంగా మారుతున్నాయని ఈ కుర్రాళ్ల కథ చెబుతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకు మనం రెగ్యులర్‌గా న్యూస్‌లో చూసిన విధంగానే పలు అత్యాచార సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే ఘటనలు విన్న ప్రతిసారి మనలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి సీన్స్‌ పదేపదే కనిపించడంతో మూవీలో ఉన్న ఆసక్తి కాస్త తగ్గుతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్‌ అనిపించదు. సినిమా ప్రారంభంలోనే చైత్రపై వికాశ్‌ గ్యాంగ్‌ చేసిన అత్యాచార ఘటన చాలా భయాందోళనగా కనిపిస్తుంది. ఈ కేసులో​ వెంటనే కదలిక రావడం ఆపై భూమిక తెరపైకి కనిపించడం వంటి సీన్లు కథపై పట్టును కోల్పోనియదు. కమిషనర్‌ జయదేవ్‌ విచారణ శైలి మెప్పిస్తుంది. సమాజంలో ఇలాంటి కేసులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.అలాంటి సమయంలో పోలీసులు కేసును ఎలా ఛేదిస్తారనేది ఆసక్తిగా చూపించారు. మైనర్లపై అత్యాచారం సంఘటనల్లో పోక్సో చట్టం ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో గుణశేఖర్‌ సక్సెస్‌ అయ్యాడు. చైత్ర కేసులో కొడుకు చేసిన తప్పుకు తల్లిగా భూమిక అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందో అందరినీ కదిలిస్తుంది. కొడుకు చేసిన తప్పు వల్ల ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుమారుడు చేసిన తప్పును తనపై వేసుకుని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఇలాంటి సీన్లు అన్నీ కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. అయితే, సెకండాఫ్‌లో కథ కాస్త గాడితప్పింది. కొడుకు, తల్లి మధ్య చూపించిన బంధం బాగున్నప్పటికీ దానిని సరైన రీతిలో ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా చూపించలేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. 'యుఫోరియా' కథలో ప్రధాన బలం సారా అర్జున్‌దే అని చెప్పాలి. చైత్రగా ఆమె చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో మెప్పించింది. అత్యాచార బాధితురాలు సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతుందో తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆపై వింధ్య వేములపల్లిగా భూమిక అదరగొట్టింది. చైత్ర తర్వాత భూమిక లీడ్‌రోల్‌లో కనిపిస్తుంది. కొడుకు తప్పు చేసినా సరే చట్టం ముందు శిక్ష పడాల్సిందేనని న్యాయవ్యవస్థ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని చూపుతూ... మరోపైపు కొడుకు జీవితం గురించి తల్లడిల్లిపోయే ఒక తల్లిగా భూమిక జీవించింది. వికాశ్‌ పాత్రలో విఘ్నే, జయదేవ్‌ పాత్రలో గౌతమ్‌ మేనన్‌ తమ పరిదిమేరకు మెప్పించారు. కాల భైరవ సంగీతం బాగుంది. నేటి యువతరం చూడాల్సిన సినిమాగా 'యుఫోరియా' కథ ఉంటుంది. సినిమాలో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ సమాజానికి చాలా అవసరమైన మూవీని గుణశేఖర్‌ తీశారని చెప్పొచ్చు.

Yami Gautam to play key role in Dhurandhar movie9
'ధురంధర్‌-2'లో దర్శకుడి సతీమణి..

బాలీవుడ్‌ సినిమా 'ధురంధర్‌' భారీ హిట్‌ అందుకుంది. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్‌ సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు. పార్ట్‌-2 మార్చి 19న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో జియో స్టూడియోస్‌ నిర్మిస్తుంది. తాజాగా సీక్వెల్‌ టీజర్‌ను విడుదల చేశారు. అయితే, ధురంధర్‌-2లో ప్రముఖ నటి యామి గౌతమ్‌ నటిస్తుందని తెలుస్తోంది. గౌరవం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌తో కూడా భారీగా పాపులర్‌ అయింది. దర్శకుడితో పెళ్లి తర్వాత కూడా హిందీలో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి ఇప్పుడు ధురంధర్‌-2లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.'ధురంధర్‌' దర్శకుడు ఆదిత్య ధర్‌ను నటి యామి గౌతమ్‌ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ధురంధర్‌: ది రివెంజ్‌’లో ఒక కీలకమైన పాత్రలో యామి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో కూడా ఆమె వారం రోజుల పాటు పాల్గొన్నారట. సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా యామి పాత్ర ఉండబోతుందని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. కాగా యామీ గౌతమ్‌ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో రీసెంట్‌గా ఆమె నటించిన హక్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది.

Sivakarthikeyan Visit Trichy Temple With Family10
అభిమానానికి ధన్యవాదాలు: శివకార్తికేయన్‌

ప్రముఖ హీరో శివకార్తికేయన్‌ ఇటీవల నటించిన చిత్రాలన్నీ కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అదే సమయంలో మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలకు తన నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తూ చేయూతనిస్తున్నారు. శివ కార్తికేయన్‌ తాజాగా కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రం కమర్షియల్‌ గా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. చేతిలో ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు కమలహాసన్‌ నిర్మించనున్న మరో ప్రాజెక్ట్‌ ఉంది. వాటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళుతుందో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుచ్చిలోని కుమారస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శివ కార్తికేయన్‌ మీడియాతో ముచ్చటించారు. 14 ఏళ్ల సినిమా జీవితం తనకు చాలా అందించిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలతో పాటు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు వాటన్నింటినీ మరిచిపోయేలా చేసింది. నా కుటుంబంపై అలాంటి అభిమానాన్ని కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని శివకార్తికేయన్‌ పేర్కొన్నారు. కాగా తిరుచ్చిలో కుమారస్వామి ఆలయంలో దిగిన ఫొటోలను ఆయన సతీమణి ఆర్తి ఎక్స్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
Advertisement