ప్రధాన వార్తలు
'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవం.. లైవ్ వీడియో
‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్, డి సురేష్ బాబు, బన్నీ వాస్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్-2, ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలు ప్రదర్శించనున్నారు.
రాధికా శరత్కుమార్ రికార్డ్.. తొలి హీరోయిన్గా గుర్తింపు
ఇండస్ట్రీలో సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్ను బట్టే ఫలితం నిర్ణయిస్తారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బడ్జెట్ పేపరుతో టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్కు దూరం అవుతున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం వారంలోనే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమకు నచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుతున్నారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నటించిన తాయి కిళవై చిత్రం తక్కువ టికెట్ ధరలతోనే భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.తను నటించిన కొత్త సినిమా పదిరోజుల కలెక్షన్స్పై రాధికా శరత్కుమార్ ఇలా మాట్లాడారు.. ' రూ. 150 రూపాయల టికెట్ ధరతోనే మా సినిమా రూ. 60 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ. 1500 నుంచి 2000 వరకు ఉంటున్న విషయం తెలసిందే. అయినప్పటికీ కలెక్షన్స్ పెద్దగా వచ్చిన దాఖలు లేదు. ఈ మూవీ కోసం బడ్జెట్ రూ. 9 కోట్లు మాత్రమే పెట్టారు.. బాక్సాఫీస్ లెక్కలు సరిగ్గా అంచనా వేసుకుంటే స్టార్ హీరోల కంటే మేము పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. మంచి కథ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను చూస్తారు.' అని ఆమె చెప్పింది. అధిక టికెట్ రేట్లు లేకుండానే పెద్ద విజయాలు సాధించవచ్చని తమ సినిమా చూపించిందని ఆమె గుర్తు చేశారు.రాధిక చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి. ఆమె మాట్లాడింది నిజమే కదా అంటూ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్పై రాధిక ఇన్డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారని భావిస్తున్నారు. బారీ బడ్జెట్ సినిమాల పేరుతో టికెట్ ధరలు పెంచడంపై ప్రేక్షకులు అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే.తమిళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా, ఒక హీరోయిన్ తాను తీసుకునే రెమ్యునరేషన్తో పాటుగా లాభాల వాటాను అందుకున్న నటిగా రాధికా రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం ఒక రికార్డ్గా నిలిచిపోతుంది. అన్ని పరిశ్రమలలో గేమ్-ఛేంజర్ అవుతుందని ఈ విషయంపై రాధికా అన్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు హీరోలకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేదని. తాజాగా తాయి కిళవి కొత్త ట్రెండ్కు తెరతీసిందని ఆమె అన్నారు. నిర్మాత శివకార్తికేయన్ను అభినందించాలని ఆమె కొనియాడారు.
అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్.. చిన్నపిల్లలు కూడా!
సినిమాల్లో ఐటం సాంగ్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్ అనగానే హీరోయిన్ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా..పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్ సాంగ్స్ను కావాలని ఇరికిస్తున్నారు.చిన్నపిల్లలు కూడా..ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. సినిమాఎవరూ ఆ లిరిక్స్ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్, అర్థ్, ఖాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: పవన్ కల్యాణ్ డూప్గా హరీశ్ శంకర్? డైరెక్టర్ ఏమన్నారంటే?
'జన నాయగన్' రూ. 120 కోట్ల ఢీల్ రద్దు
విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’కు సెన్సార్ చిక్కులు చిక్కులు తప్పడం లేదు. ముందుగా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో వడ్డీల రూపంలో నిర్మాత వెంకట్ కె.నారాయణకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఓటీటీ ఢీల్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో చట్టపరమైన సమస్యలు రావడంతో ఈ సినిమా గత మూడు నెలలుగా ల్యాబ్కే పరిమితమైంది.జన నాయగన్ సెన్సార్ సర్టిఫికెట్ కోసం సీబీఎఫ్సీ రివైజ్ కమిటీ మరోసారి సినిమా చూడాల్సి ఉంది. అయితే, ఈ కమిటీలో ఓ సభ్యుడి అనారోగ్య కారణంగా చివరి నిమిషంలో స్క్రీనింగ్ వాయిదా పడిన విషయం తెలిసింది. ఇలా పలు కారణాలతో రివైజ్ కమిటీ దాటవేస్తుండటంతో వ్యాపారం పరంగా భారీ నష్టం తప్పడం లేదు. కనీసం ఎప్పుడు చూస్తారో కూడా వారు చెప్పకపోవడంతో విడుదలపై అనిశ్చిత నెలకొంది. దీంతో అమెజాన్తో కుదుర్చకున్న ఓటీటీ ఢీల్ రూ. 120 కోట్లు రద్దు అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో జన నాయగన్ చివరి సినిమా అని ప్రకటించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి.
బిగ్బాస్
రూ.50 లక్షల ప్రైజ్మనీ.. మూణ్నెళ్లయినా ముట్టలే!
ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ
నేనెంత లక్కీ.. కన్నీళ్లాగడం లేదు: తనూజ ఎమోషనల్
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు
తనూజ బర్త్డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
A to Z
రణ్వీర్ సింగ్ దురంధర్-2.. ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల...
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్
వచ్చేవారం ఉగాది కానుకగా 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్...
ఓటీటీలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' .. ఎట్టకేలకు ప్రకటన
ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'భర్త మహాశయులకు ...
‘రోస్లిన్’ రివ్యూ : ఊహించని సీన్లు, ఊహకందని ట్విస్టులు
మనిషికి నిద్ర అనేది శారీరక, మానసిక అవసరం. కాని మనక...
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ
హైదరాబాద్లోని కోకాపేట్లో మార్చి 12న కొత్తగా ప్రా...
లేటు వయసులో తండ్రైన హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ హీరో రణ్దీప్ హుడా 50 ఏళ్ల వయసులో తండ్రయ్...
మహేశ్ బాబు మెచ్చిన సినిమా.. 8 నెలల తర్వాత ఓటీటీకి..!
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం...
'జైలర్-2'లో పోలీస్ ఆఫీసర్గా బాలీవుడ్ కింగ్
జైలర్-2 సినిమాలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటి...
19ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న 'షకీరా'
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీర...
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. క...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు: సింగర్
మలయాళ సింగర్ అమృత సురేశ్కు ప్రేమ కలిసి రావడం లేద...
ఇద్దరు బ్యూటీస్తో ఆర్య.. ఇందులో 'బేబి' కూడా
డిఫరెంట్ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తమి...
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ
హైదరాబాద్లోని కోకాపేట్లో మార్చి 12న కొత్తగా ప్రా...
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్క...
ఫొటోలు
వాళ్లిద్దరి వల్లే ట్రిప్ ఎంతో స్పెషల్: మెహరీన్ (ఫోటోలు)
నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్
అడివి శేష్ 'డెకాయిట్' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
'డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు' తెర వెనక ఇలా (ఫొటోలు)
కూతురితో బిగ్బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
విజయ్-రష్మిక మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు
బాక్సర్లా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
సినిమా ఈవెంట్లో మెరిసిన అనన్య నాగల్ల (ఫొటోలు)
'లేచింది మహిళా లోకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
గాసిప్స్
View all
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్
యశ్ వల్లనే 'టాక్సిక్' వాయిదా.. యుద్ధం సాకు మాత్రమేనా?
రీమేక్ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం
పవన్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్!
సినిమాల కౌంట్ ఫుల్.. కలెక్షన్ నిల్
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
రివ్యూలు
View all
ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
1.75
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ.. ప్రేక్షకులు సుద్దపూసలు కాదు
2.25
‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
‘సరస్వతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
మూగజీవాల ఎమోషన్స్ చూపించే లక్కీ.. ఓటీటీ మూవీ రివ్యూ
2.75
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
సినీ ప్రపంచం
నాన్న పిజ్జాలు అడిగి మరీ తెప్పించుకుంటాడు: నాగచైతన్య
టాలీవుడ్ హీరో నాగచైతన్య కొన్నేళ్ల క్రితం షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. ముఖ్యంగా జపనీస్ వంటకాలకు ఇది బాగా ఫేమస్. ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభం నుంచి విజయవంతంగా రన్ అవుతోంది. దాని గురించి తాజాగా చై మాట్లాడుతూ.. జపనీస్ వంటకాలంటే నాకెంతో ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా జపనీస్ వంటకాలనే ఫస్ట్ ఆర్డర్ చేస్తాను. రెస్టారెంట్ అనుకున్నాంఆ వంటకాలను హైదరాబాద్కు తీసుకురావాలనిపించింది. నిజానికి ఏకంగా రెస్టారెంటే ప్రారంభించాలనుకున్నాను. కానీ, కరోనా వల్ల పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. అప్పుడే క్లౌడ్ కిచెన్ ఆలోచన వచ్చింది. కస్టమర్లకు నేరుగా ఇంటికే డెలివరీ చేసే ఆలోచన బాగుందనిపించింది. మా కిచెన్లో కొత్తగా ఏ వంటకం చేయాలన్నా ముందు ఇంట్లో టెస్ట్ చేయాల్సిందే!నాన్నకు పిజ్జా ఇష్టంఇంట్లో వంటపై ప్రయోగాలు చేసినప్పుడు శోభిత దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. మెనూ తయారీలో తన సూచనలు ఉపయోగపడ్డాయి. నాన్నకు షోయూలో సూజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి ఆదివారం పిలిచి.. ఈసారి కొత్తగా ఏం పిజ్జాలు చేశారు? నాకు పంపించు అని అడుగుతూ ఉంటారు అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండగా బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.చదవండి: 8 ఏళ్లుగా భరిస్తున్నా.. నావల్ల కాదు: రష్మిక మందన్నా
కార్మేని సెల్వం టీజర్: అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి!
సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఈ మూవీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్తో టీజర్ మొదలవుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు.. ఇలా నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. రిచ్ కావాలంటే..ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయి. టీజర్ చివర్లో.. “ధవంతుడివి కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకునైనా ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ నేటి మనుషుల పోకడను తెలియజేస్తోంది. సినిమాఈ మూవీని రామ్ చక్రి దర్శకత్వంలో పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఉస్తాద్ భగత్సింగ్ 'కాలరే ఎత్తరా..' సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. తాజాగా ఈ మూవీ నుంచి కాలరే ఎత్తరా ఫుల్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.
'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవం.. లైవ్ వీడియో
‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్, డి సురేష్ బాబు, బన్నీ వాస్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్-2, ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలు ప్రదర్శించనున్నారు.
8 ఏళ్లు ఎంత బాధపెట్టినా మౌనంగా భరించా.. ఇకనావల్ల కాదు!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్పూర్లో తెలుగు హీరో విజయ్దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్నీభరించా..ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్, రీచ్ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతదూరం వెళ్తారు?ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 24 గంటల్లో డిలీట్అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.వివాదం ఏంటి?2016లో కిరిక్ పార్టీ మూవీ షూటింగ్లో రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 🙏🏻 pic.twitter.com/DdJwFIjeP3— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026
రాధికా శరత్కుమార్ రికార్డ్.. తొలి హీరోయిన్గా గుర్తింపు
ఇండస్ట్రీలో సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్ను బట్టే ఫలితం నిర్ణయిస్తారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బడ్జెట్ పేపరుతో టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్కు దూరం అవుతున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం వారంలోనే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమకు నచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుతున్నారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నటించిన తాయి కిళవై చిత్రం తక్కువ టికెట్ ధరలతోనే భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.తను నటించిన కొత్త సినిమా పదిరోజుల కలెక్షన్స్పై రాధికా శరత్కుమార్ ఇలా మాట్లాడారు.. ' రూ. 150 రూపాయల టికెట్ ధరతోనే మా సినిమా రూ. 60 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ. 1500 నుంచి 2000 వరకు ఉంటున్న విషయం తెలసిందే. అయినప్పటికీ కలెక్షన్స్ పెద్దగా వచ్చిన దాఖలు లేదు. ఈ మూవీ కోసం బడ్జెట్ రూ. 9 కోట్లు మాత్రమే పెట్టారు.. బాక్సాఫీస్ లెక్కలు సరిగ్గా అంచనా వేసుకుంటే స్టార్ హీరోల కంటే మేము పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. మంచి కథ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను చూస్తారు.' అని ఆమె చెప్పింది. అధిక టికెట్ రేట్లు లేకుండానే పెద్ద విజయాలు సాధించవచ్చని తమ సినిమా చూపించిందని ఆమె గుర్తు చేశారు.రాధిక చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి. ఆమె మాట్లాడింది నిజమే కదా అంటూ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్పై రాధిక ఇన్డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారని భావిస్తున్నారు. బారీ బడ్జెట్ సినిమాల పేరుతో టికెట్ ధరలు పెంచడంపై ప్రేక్షకులు అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే.తమిళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా, ఒక హీరోయిన్ తాను తీసుకునే రెమ్యునరేషన్తో పాటుగా లాభాల వాటాను అందుకున్న నటిగా రాధికా రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం ఒక రికార్డ్గా నిలిచిపోతుంది. అన్ని పరిశ్రమలలో గేమ్-ఛేంజర్ అవుతుందని ఈ విషయంపై రాధికా అన్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు హీరోలకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేదని. తాజాగా తాయి కిళవి కొత్త ట్రెండ్కు తెరతీసిందని ఆమె అన్నారు. నిర్మాత శివకార్తికేయన్ను అభినందించాలని ఆమె కొనియాడారు.
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
చైల్డ్ ఆర్టిస్ట్గా.. ఆ తర్వాత హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది సీనియర్ నటి ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, ఆప్కీ కసమ్, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించింది.హిందూ దేవుళ్లంటే ఇష్టంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.ఎందుకీ గొడవ?నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.అది చాలా తప్పుభార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్ నొక్కి చెప్పింది.చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్.. చెండాలమైన లిరిక్స్: నటి
అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్.. చిన్నపిల్లలు కూడా!
సినిమాల్లో ఐటం సాంగ్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్ అనగానే హీరోయిన్ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా..పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్ సాంగ్స్ను కావాలని ఇరికిస్తున్నారు.చిన్నపిల్లలు కూడా..ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. సినిమాఎవరూ ఆ లిరిక్స్ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్, అర్థ్, ఖాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: పవన్ కల్యాణ్ డూప్గా హరీశ్ శంకర్? డైరెక్టర్ ఏమన్నారంటే?
'జన నాయగన్' రూ. 120 కోట్ల ఢీల్ రద్దు
విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’కు సెన్సార్ చిక్కులు చిక్కులు తప్పడం లేదు. ముందుగా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో వడ్డీల రూపంలో నిర్మాత వెంకట్ కె.నారాయణకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఓటీటీ ఢీల్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో చట్టపరమైన సమస్యలు రావడంతో ఈ సినిమా గత మూడు నెలలుగా ల్యాబ్కే పరిమితమైంది.జన నాయగన్ సెన్సార్ సర్టిఫికెట్ కోసం సీబీఎఫ్సీ రివైజ్ కమిటీ మరోసారి సినిమా చూడాల్సి ఉంది. అయితే, ఈ కమిటీలో ఓ సభ్యుడి అనారోగ్య కారణంగా చివరి నిమిషంలో స్క్రీనింగ్ వాయిదా పడిన విషయం తెలిసింది. ఇలా పలు కారణాలతో రివైజ్ కమిటీ దాటవేస్తుండటంతో వ్యాపారం పరంగా భారీ నష్టం తప్పడం లేదు. కనీసం ఎప్పుడు చూస్తారో కూడా వారు చెప్పకపోవడంతో విడుదలపై అనిశ్చిత నెలకొంది. దీంతో అమెజాన్తో కుదుర్చకున్న ఓటీటీ ఢీల్ రూ. 120 కోట్లు రద్దు అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో జన నాయగన్ చివరి సినిమా అని ప్రకటించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి.
పెళ్లి తర్వాత తొలిసారి విజయ్, రష్మిక డ్యాన్స్.. వీడియో వైరల్
మొన్నటి వరకు పెళ్లి పనులు, రిసెప్షెన్లతో బిజీగా గడిపిన టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక..ఇప్పుడు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారు. షూటింగ్స్కి గ్యాప్ ఇచ్చి.. ఖాలీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా ఈ జంట..ఆనంద్ దేవరకొండ పాటకు డ్యాన్స్ చేసింది. పెళ్లి తర్వాత తొలిసారి విజయ్, రష్మిక కలిసి డ్యాన్స్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.సరదాగా ‘సంచారమే..’ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ . ఈ మూవీ నుంచి ఇటీవల సంచారమే అనే పాట రిలీజ్ అయింది. ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్న లిరిక్స్ అందించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడీ ట్రెండీ సాంగ్ ను విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి రీక్రియేట్ చేశారు. ముగ్గురు కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ‘ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది’ అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda)
సినిమా
బావతో పెళ్లి ఇష్టంలేక ... కుంభమేళా మోనాలిసా ప్రేమకథ..
రష్మిక కోసం విజయ్ చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా..?
మహేష్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్
AMB Cinemas: విశాఖపట్నంపై మహేష్ బాబు గురి
క్షమాపణ చెప్పు.. లేదంటే.. విశాల్ సీరియస్
విశాఖపట్నంపై మహేష్ బాబు గురి
పూరి జగన్నాథ్ - సూర్య క్రేజీ కాంబినేషన్!
రణవీర్ సింగ్ ధురంధర్ 2 మూవీలో ప్రియదర్శి..
పోసుకునేవాడు.. నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ తంబీలు ఫైర్!
లావణ్య త్రిపాఠికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య
