Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Rebel Saab Video song out from The RajaSaab movie1
ఫ్యాన్స్‌ను మెప్పించిన 'రెబల్‌ సాబ్‌' వచ్చేశాడు

ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'ది రాజా సాబ్' నుంచి మరో వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే..అయితే, అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు. ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్న 'రెబల్‌ సాబ్‌' సాంగ్‌ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ ఆడియో వర్షన్‌ విడుదలైన తొలి 24 గంటల్లో ఈ పాటకు దాదాపు 14.92 మిలియన్ వ్యూస్, 335.4K లైక్స్ వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్‌ను సంజిత్ హెగ్డే, బ్లేజ్ ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు.

Chiranjeevi As Father Proud Moment Of Sushmita Konidela Success2
సుస్మితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: చిరంజీవి

మనశంకర వరప్రసాద్‌ గారు మూవీ బ్లాక్‌బస్టర్‌ కావడంతో తాజాగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. చిత్ర యూనిట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. రెండువారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలుగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విజయం అందుకున్నారని చిరు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన కూతురు సుస్మిత ఒక నిర్మాతగా పడిన కష్టం గురించి చిరు పలు విషయాలను పంచుకున్నారు.సుస్మిత గురించి చిరంజీవి ఇలా అన్నారు. 'చరణ్‌ వద్ద సలహా తీసుకున్న తర్వాతే సుస్మిత ఇండస్ట్రీలోకి వచ్చింది. రంగస్థలం మూవీ కోసం కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన ఆమె ఒక నిర్మాతగా మరో అడుగు ముందుకు వేసింది. సుస్మిత అనుకుంటే ఇంట్లో ఉన్న హీరోలతో సినిమాలు చేయవచ్చు. కానీ, ఆమె మొదట వెబ్‌ సీరిస్‌లను నిర్మించి నిర్మాతగా పలు విషయాలను తెలుసుకుంది. ఆ తర్వాతే మరో నిర్మాత సాహు గారపాటితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ప్రయాణంలో ఆమెకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిర్మాతలుగా వారిద్దరే చెరో సగం పెట్టుబడి పెట్టారు. డబ్బు అవసరం అయితే అప్పుగా తెచ్చుకుంది కానీ నన్ను ఎన్నడూ అడగలేదు. పలు దపాలుగా నా రెమ్యునరేషన్‌ కూడా సమయానికి ఇచ్చేశారు. కూతురుగా కాకుండా ఒక నిర్మాతగా చాలా ప్రొఫెషనల్‌గా సుస్మిత పనిచేసింది. ఈ మూవీకి చాలా డబ్బు పెట్టుబడి పెట్టి ఆమె విజయం సాధించడంతో ఒక తండ్రిగా నేను సంతోషిస్తున్నాను.' అని చిరు అన్నారు. ఆపై ‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ గురించి మరిన్ని విషయాలను చిరు పంచుకున్నారు. పూర్తి వీడియోలో చూడండి.

Samantha will be part with simbu and vetrimaaran movie3
ఆ హీరోతో సినిమా.. సమంత ఓకే చెబుతుందా?

కోలివుడ్‌లో సంచలన కథానాయకుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. మంచి విజయాన్ని అందుకుని చాలాకాలమైంనే చెప్పాలి. ఇటీవల కమలహాసన్‌తో కలసి నటించిన థగ్స్‌ లైఫ్‌ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. తాజాగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. వి.క్రియేషన్‌ పతాకంపై కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరసన్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇది ఉత్తర చెన్నై యూనివర్సల్‌లో సాగే ఒక కథతో రూపొందుతున్న చిత్రమని యూనిట్‌ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. కాగా మదురైకి చెందిన ఒక సాధారణ కబడ్డీ క్రీడాకారుడు అనూహ్య పరిస్థితుల్లో చెన్నైకి రావడం, ఆ తర్వాత అక్కడ ఒక డానుగా మారడం వంటి కథాంశంతో సాగే చిత్రం అరసన్‌ అని సమాచారం. దర్శకుడు వెట్రిమారన్, శింబు కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది కావడం గమనార్హం. ఇందులో శింబు యువకుడిగా, మధ్య వయసు్కడిగాను రెండు గెటప్పుల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇకపోతే ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను విజయ్‌ సేతుపతి పోషించనున్నారు. దీంతో ఇది మల్టీ స్టారర్‌ చిత్రంగా మారుతోంది. తాజాగా ఈ చిత్రంలో శింబుకు జంటగా సమంతను కథానాయకిగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. సమంతతో నిర్మాతల వర్గం చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇదే కనుక నిజమైతే శింబు, సమంత కలసి నటించే తొలి చిత్రం కూడా ఇదే అవుతుంది. ఇంతకుముందు విజయ్, సూర్య, విజయ్‌ సేతుపతి, వంటి స్టార్‌ హీరోల సరసన నటించిన సమంత తమిళంలో నటించి కూడా చాలాకాలమైంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం అవుతుందని సమాచారం.

Megastar Chiranjeevi Speech At Mana Shankara Varaprasad Success Meet4
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు.. నాకు కష్టపడటంలోనే ఆనందం: చిరంజీవి

‘మనశంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి హాజరై తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ అన్నం, అమ్మ, సినిమా సక్సెస్ ఎప్పుడూ బోర్ కొట్టదు. వింటేజ్ చిరంజీవితో పాటు ఆ వింటేజ్ షీల్డ్ లు ఈ సినిమా ద్వారా మళ్లీ చూడటం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు. ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరి వర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. కొందరు ఔట్‌డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వెయ్యడం జరుగుతుంది. ఈ సినిమాను 85 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేశాం. సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావడం సంతోషకరం. ఈ సినిమా సక్సెస్ అనంతరం కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ ఫీలింగ్ కలిగించాయి. ఈ వయస్సులో కూడా ఎందుకు కష్టం అంటున్నారు.. నాకు కష్టపడటంలోనే ఆనందం. అందుకు తగ్గ ఉత్సాహం అభిమానుల శ్రేయోబిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుందని అన్నారు. మెగాస్టార్ మాటలు అక్కడి అభిమానులను, చిత్రబృందాన్ని ఉత్సాహపరిచాయి.

Allu Arjun Following Prabhas Movies Strategy Announcing films continuously5
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు

టాలీవుడ్‌లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్‌లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్‌పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్‌ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Nani The Paradise Movie And Antagonists List Latest6
నాని 'ప్యారడైజ్'.. ఇంతమంది విలన్లా?

నాని హీరోగా నటిస్తున్న సినిమా 'ద ప్యారడైజ్'. లెక్క ప్రకారం మార్చి 26న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మే తొలి వారం లేదంటే జూన్ నెలలో రిలీజ్ ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. సరే రిలీజ్ గురించి కాసేపు పక్కనబెడితే ఇదే మూవీ గురించిన ఓ విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'ప్యారడైజ్' మూవీలో నాని.. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో ఆ క్లారిటీ వచ్చేసింది. సీనియర్ నటుడు మోహన్ బాబు.. సికంజా మాలిక్ అనే విలన్‌గా కనిపించబోతున్నాడు. 'కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్ కూడా ఓ విలన్. ఇప్పుడు తనికెళ్ల భరణి కూడా ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టారు. చాన్నాళ్ల తర్వాత విలన్ రోల్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.కెరీర్ ప్రారంభంలో తనికెళ్లి భరణి.. విలన్ రోల్స్ ఎక్కువగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన తర్వాత తండ్రి తరహా పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతినాయక పాత్ర అంటే విశేషమే. ఈ మూవీలోనే సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా ఉన్నారు. ఈయనది కూడా నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. చూస్తుంటే నానితో ఢీ కొట్టేందుకు చాలామంది విలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని ఫ్రెండ్‌ బిర్యానీగా సంపూర్ణేశ్ బాబు నటిస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. ఈ సినిమా కోసం ఒకప్పటి సీనియర్స్‌ని విలన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఏం ప్లాన్ చేశాడనేది మూవీ రిలీజైతే తెలుస్తుంది.(ఇదీ చదవండి: అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి)

Chiranjeevi Gifts Range Rover Sport To Director Anil Ravipudi7
అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవి సినిమాలైతే చేస్తున్నాడు గానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం చిరు ఫుల్ జోష్ చూపించాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే చిరు.. దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)గత పదేళ్ల కాలంలో 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి.. ప్రతి దానితోనూ సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు. 'ఎఫ్ 3'కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇతడి సినిమాల్లో ఉండేది క్రింజ్ కామెడీ అని ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ప్రతిసారి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అనిల్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతూనే ఉంది. ఈసారి కూడా అదే ప్రూవ్ అయింది. దీంతో చిరు ఆనందంతో.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుని అనిల్‌కి గిఫ్ట్ ఇచ్చారు.అనిల్ రావిపూడి బహుమతిగా అందుకున్న ఈ కారు ధర హైదరాబాద్ మార్కెట్‌లో దాదాపు రూ.2 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలని నిర్మాణ సంస్థ.. సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ కాగా, వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ అందించిన పాటలు జనాల్ని బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.(ఇదీ చదవండి: పవన్‌ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్‌ చేసిన హరీష్‌ శంకర్‌!)A MEGA GIFT to the HIT MACHINE 🔥🔥🔥Moments of Megastar @KChiruTweets garu honouring @AnilRavipudi with a surprising gift, a brand-new Range Rover ❤️‍🔥#ManaShankaraVaraPrasadGaru THE ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER 💥💥💥 pic.twitter.com/o3C2DvAoL1— Shine Screens (@Shine_Screens) January 25, 2026

Samyuktha And Mrunal Thakur Latest News8
సంయుక్త మస్తే షేడ్స్.. మృణాల్ అక్కని చూశారా?

అక్కతో కలిసి మృణాల్ థాయ్‌లాండ్ ట్రిప్ఎర్రని చుడీదార్‌లో అందంగా మాళవికమస్త్ షేడ్స్ చూపించేస్తున్న సంయుక్తఖతార్‌లోని ఎడారిలో దివి గ్లామరస్ పోజులుబ్లాక్ డ్రస్ లో మోడ్రన్ గర్ల్‌లా భాగ్యశ్రీ బోర్సేచీరలో ఓరచూపులు చూస్తున్న హీరోయిన్ త్రిష View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

Chiranjeevi, Nagarjuna, Venkatesh in One Frame9
ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్‌ హీరోలు

మా తమ్ముళ్లు జెమ్స్‌ అని చిరంజీవి ఓ సినిమాలో డైలాగ్‌ చెప్తాడు. చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునను ఒకేచోట చూసినప్పుడు అభిమానుల నోట కూడా ఇదే డైలాగ్‌ వస్తుంది. మా ముగ్గురు హీరోలు జెమ్స్‌ అని గొప్పగా చెప్పుకుంటారు. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న స్నేహం వారిది.స్టార్‌ హీరోలు ఒకేచోటఎప్పుడు తారసపడ్డా ఆత్మీయంగా పలకరించుకుంటారు. ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ముగ్గురి ముఖాల్లోనూ వారికి తెలియకుండానే ఓ చిరునవ్వు కనిపిస్తుంది. తాజాగా ఈ స్టార్‌ హీరోలు మరోసారి కలిశారు. మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఇంట్లో ఓ పార్టీ జరగ్గా దానికి ఈ ముగ్గురూ హాజరయ్యారు. వీరితో డాక్టర్‌ గురవారెడ్డి ఓ ఫోటో దిగారు. దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. అదిరిపోయిన సంక్రాంతిఇది చూసిన అభిమానులు వీళ్లు అప్పటికీ.. ఇప్పటికీ.. యంగ్‌గానే కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఇటీవలే సంక్రాంతి పండక్కి 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించాడు. నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లు దాటేసింది.చదవండి: చిరంజీవి, వెంకటేశ్‌ల ఏంటీ బాసూ సంగతి.. పాట రిలీజ్‌

Padma Awards 2026 Telugu Actors Latest Update10
పద్మ అవార్డుల ప్రకటన.. మమ్ముట్టి, ధర్మేంద్రకు ఏమొచ్చాయంటే?

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, క్రీడలు తదితర రంగాల నుంచి మొత్తంగా 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఇందులో 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. అలానే 13 మందికి పద్మభూషణ్ వరించాయి. ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారులు దక్కాయి.హిందీ చిత్రసీమకు విశేష సేవలందించిన దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టిని పద్మభూషణ్ వరించింది. ప్రముఖ నటుడు మాధవన్‌ని పద్మ శ్రీ దక్కించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్.. పద్మశ్రీలుగా ఎంపికయ్యారు.

Advertisement
Advertisement