Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Prashanth Neel new approach to make Jr Dragon Movie1
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్

ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాల్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ ప్రత్యేకతగా నిలిచింది. వరుసగా మూడు సినిమాలు అదే స్టైల్‌లో రావడంతో ఆయన మరోలా తీయరా అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ ఇప్పుడు ఆ అనుమానాలు తీరిపోయే సమయం వచ్చినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఫుల్ కలర్ ఫుల్‌గా ఉండబోతోందట. ఈసారి గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదని ఓ టాక్‌ నడుస్తోంది. అంటే ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్‌ను ఎంచుకున్నారని చెప్పొచ్చు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నబడ్డ విషయం తెలిసిందే. బయట ఒకటి రెండు సార్లు ఆయనను చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ సినిమాలో మాత్రం ఆయన గెటప్ ఓ లెవెల్‌లో ఉందని అంటున్నారు. చూసిన వాళ్లు అదిరిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూట్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్‌ మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర 2 కూడా లైన్‌లో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కెజిఎఫ్, సలార్ సినిమాల విజయాలతో ప్రశాంత్ నీల్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. డ్రాగన్‌ను గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ కాకుండా కొత్త స్టైల్‌లో తీస్తున్నందుకు అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Manchu Lakshmi Bad Experience Chennai Green Park Hotel2
చెన్నైలో మంచు లక్ష‍్మికి చేదు అనుభవం

టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష‍్మికి చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన ఈమె.. గ్రీన్ పార్క్ అనే హోటల్‌కి వెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది తనతో రూడ్‌గా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.చెన్నైలోని ఈ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్న మంచు లక్ష‍్మి.. తనతో పాటు సిబ్బందిని కూడా తీసుకెళ్లింది. కానీ కెమెరామ్యాన్‌ని మాత్రం లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చింది. చిన్న కెమెరాకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని చెప్పుకొచ్చింది. దీని వల్ల చాలా అసంతృప్తికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు హాస్పిటాలిటీ ఇలా ఉండనేకూడదంటూ పేర్కొంది.గత కొన్నాళ్లుగా యాక్టింగ్ బాగా తగ్గించేసిన మంచు లక్ష‍్మి.. అడపాదడపా మాత్రమే ఒకటి రెండు మూవీస్ చేస్తోంది. గతేడాది 'దక్ష' అనే చిత్రంతో వచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. అలానే ఓటీటీ రియాలటీ షో 'ద ట్రైటర్స్ ఇండియా'లోనూ పాల్గొంది కానీ విజేత కాలేకపోయింది. కాకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.Extremely disappointed with the experience at Green Park Hotels Chennai.No rule was shown to me in writing, and no solution was offered, not even allowing a small camera with one person. This is not what hospitality should look like. pic.twitter.com/TeZRsFkyTu— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 7, 2026

Fact Check: Did Ranveer Singh Ask 3 vanity vans on Dhurandhar set?3
'ధురంధర్‌' సినిమా కోసం 3 కేరవాన్స్‌ అడిగిన హీరో?

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించిన ధురంధర్‌ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్‌ కూడా వచ్చేస్తోంది. ధురంధర్‌: ద రివేంజ్‌ మూవీ మార్చి 19న విడుదల కానుంది.మూడు కేరవాన్స్‌ఇదిలా ఉంటే ధురంధర్‌ సినిమా సెట్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ ఏకంగా మూడు కేరవాన్స్‌ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్‌, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్‌ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు నిజమిదే!ధురంధర్‌ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో షూట్‌ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్‌ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్‌ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్‌ డిమాండ్‌ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్‌ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు. Hamza VanHamza's staff VanHamza's Normal Van 😭😭🙏🏻#RanveerSingh what you actually do with so many vans? #Dhurandhar pic.twitter.com/yQ7oiDKvTY— Bunny (@cinephilesonly) February 1, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్‌

Suriya, Karthi Attend Actress Saranya Daughter Reception4
శరణ్య కూతురి రిసెప్షన్‌.. హాజరైన స్టార్‌ హీరోలు

ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ్య- దర్శకనటుడు పొన్వన్నన్‌ దంపతుల చిన్న కూతురు చాందిని పెళ్లి పీటలెక్కింది. ఫిబ్రవరి 2న వివాహం జరగ్గా శుక్రవారం చెన్నైలో ఎంతో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌కు తమిళ స్టార్‌ హీరోలు ధనుష్‌, కార్తీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇద్దరూ డాక్టర్సే..చాందిని డాక్టర్‌ కాగా, అతడి భర్త ఫిలిప్‌ కూడా డాక్టర్‌ అని తెలుస్తోంది. 2025 డిసెంబర్‌లోనే వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇకపోతే నటి శరణ్య.. తల్లి, అత్తమ్మ పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్‌ హీరోలకు వెండితెరపై అమ్మగా కనిపించింది. గ్యాంగ్‌ లీడర్‌, రఘువరన్‌ బీటెక్‌, 24.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఈవిడ దర్శకుడు పొన్వన్నన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ప్రియదర్శిని, చాందిని సంతానం. కూతుర్లిద్దరూ డాక్టర్స్‌గా స్థిరపడ్డారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026Dhanush at Saranya Ponvannan’s Daughter Wedding Reception💥pic.twitter.com/Ox0Yn0hpgt— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్‌

Actor Prabhakar about Trolling on Chandrahas Gunji Gunji Song5
నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్‌

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ చేసిన ఓ పని వల్ల తీవ్ర విమర్శలపాలయ్యాడు. ప్రమోషన్స్‌ కోసం ఓ పాట పాడటం.. అందులో అసభ్య పదాలు ఉండటంతో హీరోను విమర్శించనివాళ్లు లేరు. ఓపక్క ట్రోలింగ్‌ జరుగుతుండగానే అతడి సినిమా బరాబర్‌ ప్రేమిస్తా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.స్పందించిన ప్రభాకర్‌ఈ క్రమంలో ఈ వివాదంపై నటుడు ప్రభాకర్‌ స్పందించాడు. తన కొడుకు చేసింది తప్పేనని అంగీకరించాడు. అందుకు క్షమాపణలు తెలియజేశాడు. ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గత నాలుగురోజులుగా విపరీతంగా వైరలవుతున్న విషయం.. మా బాబు చంద్రహాస్‌ వాడిన బూతు పదాలు- దానిపై విశ్లేషణలు, అభిప్రాయాలు, వాళ్లు తిరిగి బూతులు అనడాలు.తప్పని చెప్పా..నేనైనా, నా కొడుకైనా, ఎవరైనా సరే పబ్లిక్‌గా బూతులు మాట్లాడటమనేది తప్పు. దాన్ని నేను ఎంకరేజ్‌ చేయను. ఆరోజు నేను ఫంక్షన్‌లో సగం పాటయ్యాక అక్కడికి వెళ్లాను. పాట అయిపోగానే బాబును పక్కకు పిలిచి నాన్నా, ఇలాంటి పదాలు పబ్లిక్‌గా వాడకూడదు అని చెప్పాను. వాడు కూడా సరేనని, ఇంకోసారి పునరావృతం చేయనన్నాడు. అయితే ఆ పాట వీడియో క్లిప్పింగ్స్‌ను ముక్కలుగా కట్‌ చేసి వైరల్‌ చేశారు. అది పెద్ద తప్పుతప్పు చేసినవాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు, కానీ, వినకూడని మాటల్ని ఇంకా ఎక్కువమందికి వినిపించి తప్పు చేస్తున్నారు. ఆ వీడియోలో రెండు, మూడు బూతులుంటే నా కుటుంబం మొత్తాన్ని వందల బూతులు తిడుతున్నారు. అది చేయకుండా ఉంటే బాగుండనిపించింది. ఆ ఈవెంట్‌లో నా భార్య, కూతురు లేరు. వాళ్లు చెన్నై షూటింగ్‌లో ఉన్నారు. ఆ విషయం తెలియకుండా చాలా మంది చాలామాటలన్నారు. అది చాలా పెద్ద తప్పు. పెంపకంపై విమర్శలుఏదైనా తెలుసుకుని మాట్లాడండి. నన్ను కూడా నానామాటలన్నారు. పెంచడం రాదా? పద్ధతి తెలీదా? అని విమర్శించారు. నా పెంపకం, నేర్పించిన సంస్కారం.. ఈ ఒక్క పాటతో డిసైడ్‌ చేయకూడదు. నా బిడ్డ టాలెంట్‌ చూడండి. బరాబర్‌ ప్రేమిస్తా సినిమా చూసినవాళ్లు చంద్రహాస్‌ అద్భుతంగా చేశాడంటున్నారు. ఎంతో మెచ్యురిటీ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అంటున్నారు.ఇబ్బందిపపడితే క్షమించండితప్పుని నేను సమర్థించట్లేదు. తప్పుని ఎత్తిచూపే పనిలో పడి మనం ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో! సమాజానికి హాని చేస్తున్నామేమో! నేను ఒకటే చెప్పదల్చుకున్నా.. మా అబ్బాయి ప్రవర్తన, మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపపడితే క్షమించండి. ఆరోజు ఫంక్షన్‌కు నాపై ప్రేమతో వచ్చిన జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్‌, జయంత్‌ సి. పరంజి గారిని మన్నించమని కోరుతున్నా.. నా ఫంక్షన్‌కు వచ్చినందుకు మీరు మాట పడాల్సి వచ్చింది. చివరగా.. నా బిడ్డ తప్పుల్ని ఎంచారు, ఒకసారి వాడి టాలెంట్‌నూ చూడండి అంటూ బరాబర్‌ ప్రేమిస్తా సినిమా చూడమని ప్రభాకర్‌ కోరాడు. View this post on Instagram A post shared by Prabhakar Podakandla (@prabhakarpodakandla) చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా: చంద్రహాస్‌

Cockroach Movie Censor Report Details6
వేశ్యతో కిరాయి హంతకుడి ప్రేమాయణం.. కాక్రోచ్‌ సెన్సార్‌ పూర్తి

అవార్డు విన్నర్ దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బలమైన సామాజిక థీమ్‌తో కూడిన చిత్రం ‘కాక్రోచ్’. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణలు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ (A) సర్టిఫికెట్ మంజూరు చేసింది.‘సమాజంలోని చీకటి మూలలను, అవినీతి, భ్రష్టుత్వాన్ని కఠినంగా చిత్రీకరించిన ఈ చిత్రం... అడ్డురోడ్లపై జీవనం సాగించే వేశ్యకు, ఒక కిరాయి హంతకుడికి మధ్య ఏర్పడిన స్వచ్ఛమైన ప్రేమ, స్నేహాన్ని చూపిస్తుంది. సమాజం చీత్కరించే మురికి మనుషుల మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ద్వంద్వ విలువలు, విలువల ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తూ... కాక్రోచ్‌ను చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే సమాజ మనస్తత్వాన్ని ఈ చిత్రం ఎండగట్టనుంది’ అని దర్శకుడు తెలిపారు. సున్నిత మనస్కులు మరియు పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి. బాపిరాజు పత్రికా ప్రకటన ద్వారా కోరారు. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ , మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేష్, మల్లిక, ఎఫ్‌ఎమ్ బాబాయ్, రాజు, బాలాజీ, ఎల్‌బీ రమణ, ఆర్‌కే సింగ్, పూజా, పొట్టి మూర్తి, ప్రసాద్, రేలారే రఘు బృందం, జానీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.

Vishwaksen, Anudeep Funky Movie Trailer Released7
ఫంకీ ట్రైలర్‌: పంచులే పంచులు!

గతేడాది 'లైలా' సినిమాతో బొక్కబోర్లా పడ్డాడు హీరో విశ్వక్‌సేన్‌. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కామెడీ జానర్‌ ఎంచుకున్నాడు. జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేశాడు. డ్రాగన్‌ బ్యూటీ కయాదు లోహర్‌ కథానాయికగా నటించింది. శనివారం (ఫిబ్రవరి 7న) ఫంకీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.ట్రైలర్‌ నిండా పంచులేట్రైలర్‌ ప్రారంభం నుంచే పంచులతో, కామెడీతో అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన్‌ చేయాలంటే నాకు రాదు డాక్టర్‌ అన్న డైలాగ్‌తో వీడియో మొదలైంది. ఓనర్‌కు రెంట్‌ కట్టుడు వంటివన్నీ నాకు గలీజ్‌ అనిపిస్తయ్‌ అంటాడు హీరో. ట్రైలర్‌ ముగింపు వరకు పంచులకు లోటే లేకుండా కట్‌ చేశారు. మొత్తానికి ట్రైలర్‌తోనే మంచి హైప్‌ ఇచ్చారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలవుతోంది.

Actress Sai Dhanshika Says She once Beat a Drunk Man8
ఆవేశంతో చితక్కొట్టా.. దర్శకుడు, హీరో ఆపారు: విశాల్‌ ప్రేయసి

సెట్‌లో ఒకసారి ఓ వ్యక్తిని చితకబాదానంటోంది హీరోయిన్‌ సాయి ధన్సిక. ఆవేశం పట్టలేక అతడిని కొడుతూ ఉంటే అది చూసి దర్శకుడు, హీరో తనను ఆపారంటోంది. సాయిధన్సిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా యోగి డా. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ తమిళ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.ఫోటో అడిగితే..అందులో సాయి ధన్సిక మాట్లాడుతూ.. కేరళలో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఓ వ్యక్తి నాతో ఫోటో దిగాలని మా అంకుల్‌(నా పర్యవేక్షకుడు)ని అడిగాడు. అయితే అతడు తాగి ఉన్నాడని గమనించి ఫోటో ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ తాగుబోతు మా అంకుల్‌ను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదంతా చూసి నాలో కోపం కట్టలు తెచ్చుకుంది.చితకబాదా..ఆత్మరక్షణ కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ టాలెంట్‌ అంతా అప్పుడు ఉపయోగించాను. వాడ్ని పరిగెత్తి వెళ్లి మరీ పట్టుకుని చితకబాదాను. పదినిమిషాలు కొడుతూనే ఉన్నాను. డైరెక్టర్‌, హీరో నా చేతులు పట్టుకుని నన్ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే విచక్షణారహితంగా కొట్టాను అని సాయి ధన్సిక చెప్పుకొచ్చింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో షికారు సినిమాలో నటించింది.పెళ్లిఇకపోతే సాయిధన్సిక, హీరో విశాల్‌ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే! గతేడాది ఆగస్టు 29న (విశాల్‌ పుట్టినరోజున) వీరి వివాహం జరగాల్సింది. కానీ నడిగర్‌ సంఘం భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుని ఎంగేజ్‌మెంట్‌తో సరిపెట్టుకున్నారు. మరి ఈ ఏడాది ఆగస్టు 29కైనా సాయి ధన్సిక మెడలో విశాల్‌ మూడు ముళ్లు వేస్తాడో, లేదో చూడాలి!చదవండి: నా సినిమా ఎఫెక్ట్‌ అవుతుందని భయపడ్డా: ఏడ్చేసిన చంద్రహాస్‌

Actress Surekha Vani Daughter Supritha About her Mother Wedding9
చాలాసార్లు ఏడ్చా.. అమ్మకు మళ్లీ పెళ్లి చేస్తా: సుప్రిత

తల్లికి మళ్లీ పెళ్లి చేస్తానంటోంది టాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖావాణి కూతురు సుప్రిత. ఈమె 'చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి' మూవీతో వెండితెరపై కథానాయికగా పరిచయం కావాల్సింది. కానీ దానికంటే ముందు అమరావతికి ఆహ్వానం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. ఈ హారర్‌ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్‌ కానుంది.కుంకుమ పెట్టుకోవద్దా?తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సుప్రిత మాట్లాడుతూ.. అమ్మ కుంకుమ పెట్టుకున్నందుకు సురేఖావాణికి మళ్లీ పెళ్లంట అని ఏవేవో రాశారు. నా బలవంతం వల్లే అమ్మ కుంకుమ పెట్టుకుంది. నాన్న (టీవీ షోల డైరెక్టర్‌ సురేశ్‌ తేజ) చనిపోయే సమయానికి అమ్మకు 35 ఏళ్లుంటాయి. అప్పుడే అంత వైరాగ్యం చూడాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్‌అందుకే కుంకుమ పెట్టుకోమన్నాను. అందరూ ఏమనుకుంటారని మొదట ఒప్పుకోలేదు. నా బలవంతం వల్ల తనకు కుంకుమ ధరించడం అలవాటైపోయింది. అమ్మ, నేను కలిసి విహారయాత్రలకు వెళ్తుంటే కూడా ట్రోల్‌ చేస్తున్నారు. మా డబ్బుతో మేము బయటకు వెళ్లడం కూడా తప్పేనా? ఈ నెగెటివిటీ చూసి మొదట్లో ఏడ్చేసేదాన్ని.కాలు కింద పెట్టనివ్వకూడదుకానీ, వాళ్ల మాటలు పట్టించుకుని ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే జీవితం ముందుకు కదలదని అర్థమైంది. అలా వాటిని లైట్‌ తీసుకుంటున్నాను. అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. తనకంటూ ఓ తోడుండాలి. నేను పెళ్లి చేసుకునే సమయానికి అమ్మకు వివాహం చేయాలన్నది నా కోరిక. అమ్మకు తగిన వ్యక్తి దొరకాలి. అతడు నా తల్లిని చాలా బాగా చూసుకోవాలి. కాలు కింద పెట్టనివ్వకూడదు.బిగ్‌బాస్‌ షో ఇష్టంనాకు బిగ్‌బాస్‌ రియాలిటీ షో అంటే చాలా ఇష్టం. ఇంతవరకు ఒక్క ఎపిసోడ్‌ మిస్‌ అవకుండా అన్ని సీజన్లు చూశాను. ఏడో సీజన్‌లో ఫోన్‌ కాల్‌ వస్తే వెళ్లిపోదామనుకున్నాను. కానీ దగ్గరివాళ్లు వద్దనడంతో ఆగిపోయాను. ఓ సీజన్‌లో అమ్మను, నన్ను జంటగా రమ్మని పిలిచారు. కానీ, వెళ్లలేదు. ఇక మీదట కూడా వెళ్లనేమో! అని సుప్రిత చెప్పుకొచ్చింది.చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్‌

Ventarnar Nepali Actor Sunil Thapa Passed Away10
గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

నేపాల్‌ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సునీల్ థాపా (68) కన్నుమూశారు. శనివారం(ఫిబ్రవరి 7) ఉదయం గుండెపోటుకి గురికావడంతో వెంటనే ఖాట్మండ్‌లోని థాపాతలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఉదయం 7.44 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.నేపాల్‌లోని డాంగ్‌లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగారు. నేపాలీ, బాలీవుడ్‌, భోజ్‌పూరితో పాటు మొత్తం పలు భాషల్లో 300లకు పైగా సినిమాల్లో నటించాడు. సునీల్ థాపా మరణం పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కార్కీతో పాటు ‘మిరాయ్‌’ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించింది.

Advertisement
Advertisement