Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Ram Charan Special Wishes To Peddi actress Janhvi Kapoor1
జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్

పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌కు మెగా హీరో రామ్ చరణ్ బర్త్‌ డే విషెస్ తెలిపారు. పెద్ది మూవీ సెట్‌లో జాన్వీ కపూర్‌తో ఉన్న స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా సెట్స్‌ నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్‌ను చెర్రీ పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్‌లో కనిపిస్తూ సందడి చేశారు. ఆమెకు తన వృత్తి పట్ల ఆమెకున్న మక్కువ, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది.. ఈ ఏడాది తనకి మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్‌ డ్రామా పెద్ది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ చికిరి చికిరి అభిమానులను ఓ ఊపు ఊపేయగా.. ఇటీవల రిలీజైన రైరై రారా అంటూ సాగే పాట కూడా ‍అదే రేంజ్‌లో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)

Mension House Mallesh Movie Review And Rating In Telugu2
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించిన ఈ చిత్రం నేడు(మార్చి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే..మల్లేష్‌(శ్రీనాథ్‌ మాగంటి) చిన్నప్పటి నుంచి తాగుడు అలవాటు ఉంటుంది. దానికి కారణం వాళ్ల నాన్న. నాన్న తాగొచ్చ అతన్ని కొట్టడంతో.. ఓ రోజు మల్లేష్‌ కూడా మద్యం సేవించి నాన్నని కొట్టి పారిపోతాడు. కొన్నాళ్ల తర్వాత నాన్న చనిపోయిన విషయం తెలిసి తిరిగి వస్తాడు. ఊర్లోనే టెంట్‌ హౌస్‌ పెట్టి.. వచ్చిన డబ్బులతో తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంటాడు. అతని మేనమామ కొడుకు చిన్న పటేల్‌(రాజేష్‌)తో మల్లేష్‌ ఫ్యామిలీకి గొడవలు ఉంటాయి. తల్లి బలవంతం చేయడంతో జ్యోతి(గాయత్రీ రమణ)ని మల్లేష్‌ పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్‌ నైట్‌ రోజే అతనికి ఓ షాకింగ్‌ విషయం తెలుస్తుంది. అదేంటి? దాని వల్ల మల్లేష్‌కి వచ్చిన సమస్యలు ఏంటి? చిన్న పటేల్‌తో మల్లేష్‌ చేసిన ఛాలెంజ్‌ ఏంటి? జ్యోతి-మల్లేష్‌ల సంసారం ఎలా సాగింది? మందు లేనిదే ఏ పని చేయలేని మల్లేష్‌...చివరకు మద్యానికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ కథలో కామాక్షి భాస్కర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ అడల్ట్‌ కామెడీ చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ సింపులే అయినా.. దాని చుట్టు అల్లిన సన్నివేశాలు బాగున్నాయి. అడల్ట్‌ కామెడీ అయినా.. అందులోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. దారితప్పిన వ్యక్తిని తల్లి, భార్య ఎలా దారికి తీసుకొచ్చారు అనేది చూపిస్తూనే మద్యానికి బానిసైతే ‘సంసార’ జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి.మల్లేష్‌కు చిన్నప్పుడే తాగుడు అలవాటు ఎలా వచ్చింది అనే సన్నివేశాలతో కథను ప్రారంభించాడు దర్శకుడు. మొదటి పది నిమిషాలు రొటీన్‌గానే సాగిపోతుంది. మల్లేష్‌, జ్యోతిల పెళ్లి తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. కానీ ‘కార్యం’ మాత్రం కాదు. ఆ విషయం దాచేందుకు హీరో చేసే ప్రయత్నాలన్నీ నవ్వులు పూయిస్తాయి. మల్లేష్‌కి ‘కార్యం’ కాలేదనే విషయం చిన్నపటేల్‌కి తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఇంటర్వెల్‌ ముందు ఇద్దరు చేసుకునే సవాల్‌.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థం ప్రారంభంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఛాలెంజ్‌ గెలవడం కోసం హీరో చేసే ప్రయత్నాలు.. దాన్ని తిప్పికొట్టేందుకు చిన్న పటేల్‌ చేసే కుట్రలు అన్ని రొటీన్‌గానే ఉంటాయి. తల్లి చనిపోయే సీన్‌ కూడా అనవసరమే అనిపిస్తుంది. పోలీస్‌ స్టేషన్‌లో కామాక్షీ సీన్‌ అదిరిపోతుంది. అయితే ఆ తర్వాత ఆమె పాత్రను అంతే బలంగా చూపిస్తే బాగుండేది. కానీ దర్శకుడు మాత్రం భార్య భర్తల అనుబంధంపైనే ఫోకస్‌ చేశాడు. అవి ఆకట్టుకుంటాయి. అలాగే కార్యం సమయంలో పక్కింట్లోని ముసలాయన రేడియోలో వినే పాత పాటల సీన్లన్నీ థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి. రేడియో సీన్‌ రిపీట్‌ అయిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుతాడు. కానీ కార్యం సీన్‌తో పాటు కొన్ని బూతు డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. క్లైమాక్స్‌ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు తెరపై సాఫ్ట్‌ పాత్రల్లో కనిపించిన శ్రీనాథ్‌.. ఇందులో ఊరమాస్‌ లుక్‌లో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌గా నటించిన గాయత్రి రమణ..తెరపై పక్కింటి తెలుగు అమ్మాయిలా కనిపించడమే కాకుండా నటన పరంగానూ మెప్పించింది. కామాక్షి భాస్కర్ల పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు కానీ.. ఒక్క సీన్‌లో మాత్రం అదరగొట్టేసింది. పటేల్‌గా రాజేశ్‌ బాగానే నటించాడు. మురళీ ధర్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సురేశ్‌ బొబ్బిలి నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్‌గా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టే, సాక్షి వెబ్‌డెస్క్‌

Allu Sirish Knot With Nayanika today at hyderabad in grand wedding3
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్‌ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు శిరీష్‌- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్‌ భార్య షాలినికి నయనిక బెస్ట్‌ ఫ్రెండ్‌ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్‌- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్‌ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ‍అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

Actor Muralidhar Goud Wife Passed Away4
టాలీవుడ్ ప్రముఖ నటుడి ఇంట విషాదం

'డీజే టిల్లు' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈయన భార్య శశికళ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. చికిత్స పొందుతూ గురువారం మరణించారు. దీంతో మురళీధర్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.(ఇదీ చదవండి: నా కథని మానభంగం చేశారు.. టాలీవుడ్ స్టార్ రైటర్ షాకింగ్ పోస్ట్)గతంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన మురళీధర్ గౌడ్.. రిటైర్ అయిన తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేశారు. అలా 2018లో రిలీజైన 'రంగస్థలం'లో చిన్న పాత్ర చేశారు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత బలగం, మేం ఫేమస్, మ్యాడ్, టిల్లు స్కేర్ తదితర చిత్రాలు చేశారు. గతంలో భార్యతో కలిసి పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. శశికళ.. గతంలో రామాయంపేట, పంచాయతీగా ఉన్నప్పుడు వార్డ్ మెంబర్‌గా కూడా పనిచేశారట.(ఇదీ చదవండి: చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?)

Trisha And Ashika Ranganath Latest News5
ట్రెండింగ్‌లో త్రిష.. ముక్కెరతో ఆషికా రంగనాథ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్.. చీరకట్టులో త్రిషముక్కెర(ముక్కుపుడక)తో అందంగా ఆషికాచీరలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ మృణాల్గ్లామర్ చూపించేస్తున్న 'బేబి' వైష్ణవి చైతన్యచుడీదార్‌లో చూడముచ్చటగా ప్రియాంక మోహన్డ్యాన్సుతో అదరగొట్టిన రాజశేఖర్ కూతుళ్లు View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_)

Actress Priyamani about Bikini Suit in Drona Movie6
కరీనా కపూర్‌లా చూపిస్తానన్నాడు.. అందుకే బికినీ ధరించా!

హీరోయిన్‌ ప్రియమణి సినీ జర్నీ తెలుగు సినిమాతోనే మొదలైంది. ఎవరే అతగాడు (2003) మూవీతో కథానాయికగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. తాజాగా సరస్వతి సినిమాతో పలకరించింది.డైరెక్టర్‌ అడగడంతో..ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది ప్రియమణి. ఈ సందర్భంగా కెరీర్‌ తొలినాళ్లలో బికినీ ధరించిన ఘటన గురించి గుర్తు చేసుకుంది. ప్రియమణి మాట్లాడుతూ.. స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గరకు చీర కట్టుకుని వెళ్లం కదా.. ఏది కంఫర్ట్‌గా ఉంటే ఆ దుస్తులే ధరిస్తాం. ద్రోణ సినిమాలో స్విమ్‌ సూట్‌ వేసుకోమని డైరెక్టర్‌ అడిగాడు. కరీనా కపూర్‌లా..టషన్‌ మూవీలో కరీనా కపూర్‌లా నిన్ను డిఫరెంట్‌గా చూపించాలనుకుంటున్నా అన్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడూ స్విమ్‌సూట్‌ వేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం అని ఓకే చెప్పాను. ఆ తర్వాత చాలా కామెంట్స్‌ వచ్చాయి. ట్రోలింగ్స్‌ జరిగాయి. నటిగా ఉన్నప్పుడు పరిస్థితి డిమాండ్‌ చేస్తే అలాంటి డ్రెస్‌ వేసుకోక తప్పదు. కానీ మన సౌకర్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు అడిగితే మాత్రం నేను కచ్చితంగా చేయనని చెప్పేస్తాను అని ప్రియమణి పేర్కొంది.చదవండి: ఇది కరెక్ట్‌ కాదు.. విజయ్‌పై నటి ఫైర్‌

Sai Madhav Burra Reacts Saraswathi Movie Story Changes7
నా కథని మానభంగం చేశారు.. టాలీవుడ్ స్టార్ రైటర్ షాకింగ్ పోస్ట్

ఆర్ఆర్ఆర్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె తదితర సినిమాలకు రచయిత, డైలాగ్ రైటర్‌గా పనిచేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సాయిమాధవ్ బుర్రా. అడపాదడపా పలు చిత్రాలకు పనిచేస్తున్న ఈయన.. ఇప్పుడు తన సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇష్టమొచ్చినట్లు తన స్టోరీని మార్చేసుకున్నారని, మానభంగం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఈయన మాట్లాడేది ఏ మూవీ గురించి? అసలేంటి విషయం?(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)సాయిమాధవ్ బుర్రా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో శుక్రవారం ఓ పోస్ట్ పెట్టారు. 'నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు. అసలా కథే వేరు' అని రాసుకొచ్చారు. అయితే ఈయన మాట్లాడేది ఈరోజే థియేటర్లలోకి వచ్చిన 'సరస్వతి' మూవీ గురించి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. వరలక్ష‍్మి శరత్ కుమార్ లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించింది. నిర్మాతగానూ వ్యవహరించింది.ఓసారి గతంలోకి వెళ్తే సాయిమాధవ్ బుర్రా దర్శకుడిగా ఓ సినిమాని మొదలుపెట్టారు. అదే 'సరస్వతి'! కొన్ని కారణాల వల్ల ఈయన బయటకు వచ్చేయడంతో మిగతా భాగాన్ని వరలక్ష‍్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించి పూర్తి చేసిందట. అయితే ఈ విషయాన్ని టీమ్ ఎక్కడా చెప్పలేదు. కానీ స్టోరీ విషయంలో ఈయనకు క్రెడిట్స్ ఇచ్చారు. కానీ రెమ్యునరేషన్ మాత్రం ఇంకా ఇవ్వలేదట. ఫోన్ చేస్తున్నా సరే టీమ్ స్పందించడం లేదట. ఈ క్రమంలోనే ఇప్పుడు సాయిమాధవ్ పరోక్షంగా పోస్ట్ పెట్టడంతో.. 'సరస్వతి' గురించేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.'సరస్వతి' విషయానికొస్తే.. లక్ష‍్మి(వరలక్ష‍్మి) ఓ అనాథ. నర్సుగా పనిచేస్తుంటుంది. ఆగస్టు 15న తన కూతురు సరస్వతిని స్కూల్‌లో దిగబెట్టి పనికి వెళ్లిపోతుంది. సాయంత్రం తిరిగొచ్చి చూసేసరికి పాప కనిపించదు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సరస్వతి పేరుతో క్లాసులో ఎవరూ లేరని చెబుతారు. అయితే ఆ పాపని ముగ్గురు అత్యాచారం చేసి చంపేశారని, శవాన్ని పాతిపెట్టారని లక్ష‍్మి.. పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. తర్వాత కోర్టు, కేసులు అంటూ తిరుగుతుంది. తన కూతురి చావుకు కారణమయ్యారని ఓ జడ్జిని, ఐఏఎస్, పోలీస్‌ని లక్ష‍్మి చంపేస్తుంది. తర్వతా ఏమైంది? అసలు లక్ష‍్మి ఎవరు? ఈమెకు నిజంగా కూతురు ఉందా లేదా అనేది మిగతా స్టోరీ. థియేటర్లలో ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ తేలుతుంది.(ఇదీ చదవండి: చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?)

Sanam Shetty Angry over Vijay, Trisha Viral Video8
ఇది కరెక్ట్‌ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్‌పై ఫైర్‌

స్టార్‌ హీరో విజయ్‌- సంగీత విడాకుల వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్లుగా ఓ నటితో ఎఫైర్‌ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్‌లో పేర్కొంది. దీంతో విజయ్‌- సంగీత విడాకులకు హీరోయిన్‌ త్రిష కారణమా? అన్న చర్చ మొదలైంది.విడాకులుఆన్‌స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లోనూ విజయ్‌- త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల పిటిషన్‌ వేసిన తర్వాత విజయ్‌.. దర్జాగా త్రిషను తీసుకుని ఓ పెళ్లికి హాజరయ్యాడు. జంటగా నిల్చుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఇప్పటికే విజయ్‌- సంగీత కలిసుండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసుండే ప్రసక్తే లేదని హింటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్లడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.అవతలివారి బాధను లెక్కచేయరా?ఈ వ్యవహారంపై విజయ్‌ అభిమాని, నటి సనం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్‌, త్రిష పెళ్లికి హాజరైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ఇది కరెక్ట్‌ కాదు.. భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది. ఆమె కామెంట్స్‌ను కొందరు సపోర్ట్‌ చేస్తుండగా మరికొందరు మాత్రం విమర్శించారు.ఎవరీ సనం శెట్టి?కాగా సనం శెట్టి విజయ్‌కు వీరాభిమాని. కరూర్‌ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్‌ తప్పు లేదని బాధితులే చెప్పారంటూ అతడిని వెనకేసుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం భార్య బాధను పట్టించుకోకుండా ఇలా ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సభ్యత కాదని చురకలంటించింది. సనం శెట్టి.. తమిళ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పార్టిసిపేట్‌ చేసింది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం 123 చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.చదవండి: అప్పుడు భార్యను కొట్టి.. ఇప్పుడు అందరి ముందు క్షమాపణలు చెప్పిన మాస్క్‌ మ్యాన్‌

Rakshit Shetty Shares A Photo After Rashmika Wedding9
చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?

హీరోయిన్ రష్మిక పెళ్లి తంతు ముగిసింది. వారం-పదిరోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన ఈమె.. తర్వాత రిసెప్షన్స్‌లో పాల్గొంటూ బాగానే సందడి చేసింది. ఓ వారం గ్యాప్ తీసుకుని 'రణబాలి' షూటింగ్‌లో భార్యభర్తలిద్దరూ పాల్గొంటారు. సరిగ్గా ఈ టైంలోనే రష్మిక మాజీ ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ రష్మిక పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఇలా ఫొటో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'కిరిక్ పార్టీ' సినిమాలో రక్షిత్ శెట్టి, రష్మిక కలిసి నటించారు. రష్మికకు హీరోయిన్‌గా ఇదే తొలి మూవీ. దీని షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ పెళ్లి రద్దు చేసుకున్నారు. అ‍ప్పటి నుంచి కెరీర్ పరంగా ఎవరికి వాళ్లు బిజీ అయిపోయారు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రష్మిక స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా రేంజుకి వెళ్లిపోయింది. అలా విజయ్ దేవరకొండతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.మరోవైపు రక్షిత్ శెట్టి మాత్రం 42 ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయాడు. అప్పుడెప్పుడో 2023లో 'సప్త సాగర ఎల్లో దాచే' అనే సినిమా రెండు భాగాలతో వచ్చాడు. తర్వాత నుంచి కొత్తగా మరో మూవీ చేయలేదు. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇతడు స్నేహితుడు రిషభ్ శెట్టి.. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం రక్షిత్.. అమెరికాలో ఉన్నాడని, కొత్త సినిమా కోసం స్టోరీ రాసుకుంటున్నాడని అన్నాడు. తాజాగా రక్షిత్ శెట్టి.. ఫేస్‌బుక్‌లో తన 'చార్లీ' మూవీకి సంబంధించిన ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో ఇతడి అభిమానులు.. రష్మిక పెళ్లిని లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి రక్షిత్, సోషల్ మీడియాలో కనిపించలేదు. ఉన్నట్లుండి ఇప్పుడీ ఫొటో పెట్టడం చర్చనీయాంశమవుతోంది.రక్షిత్ శెట్టి స్నేహితులైన రిషభ్ శెట్టి 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఛత్రపతి శివాజీ బయోపిక్‍‌లోనూ నటించబోతున్నాడు. మరో స్నేహితుడు రాజ్ బి శెట్టి కూడా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ నటుడిగా పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రక్షిత్ మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించక, నిర్మాతగానూ కొత్త చిత్రాలేం చేయక సైలెంట్ అయిపోవడం అతడి ఫ్యాన్స్‌ని ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)

Bigg Boss Mask Man Harish Apologises to wife Haritha10
భార్యను కొట్టిన మాస్క్‌ మ్యాన్‌.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు

మాస్క్‌ మ్యాన్‌.. బిగ్‌బాస్‌ కంటే ముందే ఈ పేరు బాగా ఫేమస్‌ అయింది. బిగ్‌బాస్‌ 9లో అడుగుపెట్టాలంటే అగ్నిపరీక్ష దాటాలని సామాన్యుల కోసం ఓ షో ఏర్పాటు చేశారు. అందులో మాస్క్‌ మ్యాన్‌ పాల్గొన్నాడు. తన పేరు హరిత హరీశ్‌ అని తెలిపాడు. భార్యపై ఉన్న ప్రేమతో ఇల్లాలి పేరునే తన పేరులో చేర్చుకున్నట్లు తెలిపాడు. అది విని భార్యంటే ప్రేమ, గౌరవం బాగానే ఉందని అందరూ అనుకున్నారు.కోపమొస్తే కొట్టేస్తావా?కానీ, అంతలోనే ఒకసారి భార్యపై చేయి చేసుకున్నానని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కొట్టేస్తావా? ఆడదానిపై చేయెత్తుతావా? అని తిట్టిపోశారు. అలా నెగెటివిటీతోనే బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. తన ముక్కుసూటితనం, మొండితనం, కోపం వల్ల ఎక్కువమందిని ఆకర్షించలేకపోయాడు.కాళ్లు పట్టుకుని క్షమాపణలుఅయితే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి వస్తున్నాడు. మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే షోలో భార్య హరితతో కలిసి హరీశ్‌ పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో మాస్క్‌ మ్యాన్‌ మాట్లాడుతూ.. మగాడు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయత్తడం చాలా తప్పు అంటూ భార్య కాళ్లు నమస్కరించాడు. అలా అప్పటి వివాదానికి ఇలా ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే కపుల్‌ రియాలిటీ షో మార్చి 15న ప్రారంభం అవుతోంది. ఇది మా టీవీతో పాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. చదవండి: తండ్రి మరణించిన పదేళ్లకు ఆయన కల నెరవేర్చిన కూతురు

Advertisement
Advertisement