Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

producer Naga Vamsi about Vijay Deverakonda Kingdom 2 sequel 1
విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌ సీక్వెల్‌... నాగవంశీ ఫుల్ క్లారిటీ

ఈ ఏడాది విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ కింగ్‌డమ్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన కింగ్డమ్‌ మూవీ ఈ ఏడాది జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. ‍అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టడంతో విఫలమైంది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని విజయ్ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. కొన్ని నెలలుగా కింగ్‌డమ్ పార్ట్‌-2పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఆగిపోయిందని చాలాసార్లు సోషల్ మీడియాలో టాక్ వినిపించింది.ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కింగ్‌డమ్-2 సీక్వెల్‌ ఆలోచన తమకు లేదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రకటనతో తమ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేశారు నిర్మాత. అయితే తాము గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం గౌతమ్ మరో మూవీతో బిజీగా ఉన్నారని.. ఆ తర్వాత మాతో కలిసి పనిచేస్తారని నాగవంశీ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ కింగ్‌డమ్‌-2 గురించి ఆశలు వదులుకోవాల్సిందే.ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం 'రౌడీ జనార్ధన మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 2026లోనే విడుదల కానుంది.

Manu Varma Separated to Sindhu Varma after 25 years of marriage2
భార్యతో తెగదెంపులు, మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు

పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరి చేయి మరొకరు జీవితాంతం విడవమని చెప్తుంటారు. కానీ ఇప్పుడంతా రివర్స్‌లో జరుగుతోంది. చాలామంది దంపతులు కొన్ని నెలలకే విడిపోతుంటే మరికొందరు మాత్రం పెళ్లయిన దశాబ్దాల తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. మలయాళ బుల్లితెర జంట మను వర్మ- సింధు వర్మ ఈ కోవలోకే వస్తారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు.మళ్లీ కలిసే ప్రసక్తే లేదుఈ విషయం గురించి మను వర్మ మాట్లాడుతూ.. నేను, నా భార్య కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నాం. చట్టపరంగా విడాకులు ఇంకా మంజూరు కానప్పటికీ మేము మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువ. మళ్లీ జంటగా జీవితాన్ని కొనసాగించే అవకాశం, ఆలోచన ఎంత మాత్రం లేదు. మాకంటే ఎక్కువ ప్రేమించుకున్నవాళ్లు, జంటగా కలిసున్నవాళ్లు కూడా విడిపోయిన సంఘటనలు కోకొల్లలు. లోపించిన సఖ్యతమూడేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమగానే కలిసిమెలిసున్నాం. కానీ కొంతకాలానికే అంతా రివర్స్‌ అయిపోయింది. మా మధ్య సఖ్యత లేనప్పుడు కష్టంగా కలిసుండటం కన్నా విడివిడిగా జీవించడమే మంచిది. విదేశాల్లో దంపతులు విడిపోయినా వారి మధ్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అది కేరళలోనూ అవలంబిస్తే బాగుంటుంది. ముగ్గురు పిల్లలుఇక్కడ విడిపోయిన జంట మళ్లీ తారసపడ్డారంటే ఒకరిని మరొకరు ఎద్దేవా చేసుకుంటూ అవతలి వారి పరువు తీయడానికే ప్రయత్నిస్తుంటారు. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దవాడు అమెరికాలో ఐటీ ఇంజనీర్‌ కాగా రెండో కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. మాకో కూతురుంది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయి అని చెప్పుకొచ్చాడు. సీరియల్స్‌, సినిమాదివంగత నటుడు జగన్నాథ వర్మ కుమారుడే మను వర్మ. మను వర్మ.. కాదమట్టతు కథనార్‌, పోక్కాలం వరవై, కుంకుమచెప్పు వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. అలాగే మమ్ముట్టి 'నీలగిరి', జయరామ్‌ 'నరనాతు తంపురాన్‌' సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. సింధు వర్మ విషయానికి వస్తే ఎటో జన్మ కల్పనయిల్‌, పంచాంగి వంటి సీరియల్స్‌ చేసింది. మమ్ముట్టి 'సీబీఐ 5: ద బ్రెయిన్‌', 'అర్థం' చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది.చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు: నటికి ఆఫర్‌

Chandrabose About Orayyo Song And Sukumar Didn't Like It3
'రంగస్థలం'లో ఆ పాట సుకుమార్‌కి నచ్చలేదు.. ఎవరూ ఏడవకపోవడంతో

'రంగస్థలం'.. రామ్ చరణ్ కెరీర్‌లో మైలురాయి లాంటి సినిమా. అప్పటివరకు ఉన్న ఇమేజీని ఒక్కసారిగా మార్చేసింది. ఎంత మంచి నటుడో అందరికీ తెలిసేలా చేసింది. ఈ మూవీలో క్లైమాక్స్‌ ముందొచ్చే 'ఒరయ్యో' అనే సాంగ్.. ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకునేలా చేసింది. అయితే ఈ పాట, దర‍్శకుడు సుకుమార్‌కి తొలుత అస్సలు నచ్చలేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచయిత చంద్రబోస్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ గీతం వెనకున్న గమ్మత్తయిన సంఘటనల్ని బయటపెట్టారు.''రంగస్థలం' కోసం నాలుగు రోజుల్లో నాలుగు పాటలు సిద్ధం చేశాం. సుకుమార్ మరో పాట కూడా కావాలనేసరికి.. ఇంత వేగంగా వద్దులేండి. మళ్లీ దిష్టి తగులుతుందేమో అని ఆయనతో అన్నాను. లేదు రాయాల్సిందే అని చెప్పడంతో 'ఒరయ్యో..' పాట రాశాను. ఇది మొదట్లో సుకుమార్‌కి నచ్చలేదు. ఈ విషయాన్ని నాకు తెలియనివ్వలేదు. అప్పటికే షూటింగ్ దగ్గర పడింది. దీంతో పాటలో సీన్స్ తీస్తున్నప్పుడు విషాద వాతావరణం ఉండటం కోసం తమిళ, మలయాళ పాటల్ని ప్లే చేశారు. కానీ సెట్‌లో ఒక్కరు కూడా ఏడవలేదు. పైపెచ్చు నవ్వుకున్నారు. ఎంతకీ ఎమోషన్ రాకపోయేసరికి చివరగా 'ఒరయ్యో..' పాట పల్లవిని ప్లే చేశారు. దీంతో అందరికీ దుఖం పొంగుకొచ్చింది. సుకుమార్‌కి ఈ పాటలో విషయం ఉందనేది అర్థమైంది' అని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: పిల్లల్ని కనాలనే ఆలోచన నాకు లేదు: వరలక్ష‍్మి శరత్ కుమార్)'షూటింగ్ చేస్తున్నప్పుడు పల్లవితో మేనేజ్ చేశాం. అయితే పాటంతా రాయడం పూర్తి చేసిన తర్వాత దేవి, సుకుమార్‌కి వినిపించా. ఆ టైంలోనే దేవి తండ్రి, సుకుమార్ తండ్రి చనిపోయారు. దీంతో పాటలో పల్లవి, చరణాలు వినిపిస్తున్నప్పుడు ప్రతిఒక్కరం ఎమోషనల్ అయ్యాం. చివరగా దేవి.. ఈ పాట నన్నే పాడమని అన్నాడు. వద్దులేండి ఎవరైనా ప్రొఫెషనల్ సింగర్‌తో పాడించండి అని చెప్పా. లేదు మీ వాయిస్ బాగుంటుందని నాతో పాడించాడు. 45 నిమిషాల్లో ఈ పాట పాడేశాను. తర్వాత ఇంత తర్వగా పాడటం పూర్తి చేశానేంటి అని ఆశ్చర్యపోయాను' అని చంద్రబోస్ అప్పటి అనుభవాన్ని బయటపెట్టారు.పాట సందర్భం విషయానికొస్తే.. అప్పటివరకు చిట్టిబాబు(రామ్ చరణ్), కుమార్ బాబు(ఆది పినిశెట్టి) సరదాగా ఉంటారు. సడన్‌గా కుమార్ బాబు పాత్ర చనిపోతుంది. సరిగ్గా అప్పుడు ఈ గీతం వస్తుంది. 'ఈ సేతితోనే పాలు పట్టాను.. ఈ సేతితోనే బువ్వ పెట్టాను.. ఈ సేతితోనే తలకు పోశాను.. ఈ సేతితోనే కాళ్లు పిసికాను.. ఈ సేతితోనే పాడే మొయ్యాలా.. ఈ సేతితోనే కొరివి పెట్టాలా.. ఓరయ్యో.. నా అయ్యా..' అనే లిరిక్స్‌తో సాంగ్ ఉంటుంది. సినిమా హిట్ విషయంలో చరణ్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ ఎలాంటి పాత్ర పోషించాయో.. ఈ గీతం కూడా అంతే ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాంటి పాట సుకుమార్‌కి మొదట నచ్చలేదని చంద్రబోస్ చెప్పడం ఆసక్తికకరంగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆది పినిశెట్టి' కొత్త సినిమా.. నెలలోనే స్ట్రీమింగ్‌)

chiranjeevi Mana Shankara VaraPrasad Garu trailer release date4
మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్

మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్‌ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్‌ గారు మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో హిట్‌ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తోన్న మనశంకర వరప్రసాద్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించింది.The much-awaited announcement everyone has been waiting for is finally here💥#ManaShankaraVaraPrasadGaru TRAILER ON JANUARY 4th ❤️‍🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12thMegastar @KChiruTweets Victory @VenkyMama @AnilRavipudi #Nayanthara… pic.twitter.com/5yW8TkN9ut— Shine Screens (@Shine_Screens) January 2, 2026

Director Maruthi Says This The Reason For Some People Wish To The Raja Saab Flop5
అందుకే ‘రాజాసాబ్‌’ ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నారు: మారుతి

ప్రభాస్‌ నటించిన తొలి హారర్‌ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్‌’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి పక్కా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్‌ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్‌తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్‌(The Raja Saab) ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్‌ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్‌కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్‌ హిట్‌ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్‌ వస్తే.. వాళ్లకు అది ఫుడ్‌ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు. ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్‌ వచ్చినా..ఫ్లాప్‌ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్‌తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్‌ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్‌ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు.

120 Bahadur Movie Streaming Now On This OTT6
ఓటీటీలోకి వచ్చిన వార్ బ్యాక్‌డ్రాప్ మూవీ

ఈ వీకెండ్ థియేటర్లలో సైక్ సిద్ధార్థ్, వనవీర, 45 తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యాయి. కానీ వీటిలో ఏది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. క్రిస్మస్‌కి వచ్చిన చిత్రాల్నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరోవైపు న్యూఇయర్ సందర్భంగా చాలా కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఇప్పుడు దానిలోకి మరో వార్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా చేరింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్‌?)బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్.. చాన్నాళ్ల తర్వాత హీరోగా చేసిన సినిమా '120 బహదూర్'. 1962లో భారత్-చైనా మధ్య జరిగిన రెజాంగ్ లా యుద్ధ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలో రిలీజైంది. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడీ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరో రెండు వారాల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.'120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్‌లో ఎలాంటి యుద్ధం చేశాడు. మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్‌గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి.(ఇదీ చదవండి: సాయిపల్లవి కొత్త సినిమా.. స్టార్ హీరో వల్లే ఆలస్యం?)

Malaysian Actress Rejected Offer to become VVIP 3rd Wife with Rs 11 lakh Monthly Allowance7
మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు! నటికి ఆఫర్‌

సెలబ్రిటీలను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కొందరు వెంటపడుతుంటారు. చాలామటుకు తారలు ఈ ప్రపోజల్స్‌ చూసి ఓ నవ్వు నవ్వి వదిలేస్తారు. కొందరు మాత్రం అందులోని తీవ్రతను, పిచ్చిని సోషల్‌ మీడియా వేదికగా ఎండగడతారు. తాజాగా మలేషియాకు చెందిన ఓ నటి, మోడల్‌కు కూడా వింత ప్రపోజల్‌ వచ్చిందట!వింత ప్రపోజల్‌29 ఏళ్ల మోడల్‌ అమీ నుర్‌ టినీ ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనకు వీవీఐపీ (అత్యంత ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి/ప్రముఖుడు) నుంచి ఓ ప్రపోజల్‌ వచ్చిందని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. 'అతడికి మూడో భార్యగా ఉంటే నాకు ఓ బంగ్లా, లగ్జరీ కారు, పది ఎకరాల స్థలం రాసిస్తానన్నాడు. అంతేకాకుండా నా ఖర్చుల కోసం నెలకు రూ.11 లక్షలు ఇస్తానన్నాడు. మూడో భార్యగా ఉండమని..అతడి మాటలు విని షాకయ్యా.. ఈ ఆఫర్‌ తిరస్కరించాను. నేను కార్పొరేట్‌ ఈవెంట్స్‌కు యాంకరింగ్‌ కూడా చేస్తుంటాను. ఆ సమయంలో కొందరు ప్రముఖులు నా ఫోన్‌ నెంబర్‌ అడుగుతారు, ఇంటికి రమ్మని పిలుస్తారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన మూడో భార్యగా ఉండమని కోరాడు. అతడికి దాదాపు నా తండ్రి వయసు ఉంటుంది. అతడి పిచ్చి ప్రపోజల్‌కు నేను వెంటనే నో చెప్పేశా' అని చెప్పుకొచ్చింది.అమ్మ కౌంటర్‌గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి అమీ ప్రస్తావించింది. అందాల పోటీల్లో పాల్గొనేందుకు అతడు సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. కాకపోతే పెళ్లి చేసుకోమని షరతు పెట్టాడు. అప్పుడు మా అమ్మ ఒక్కటే సమాధానమిచ్చింది.. నేను నా కూతుర్ని అమ్మదల్చుకోలేదని గట్టిగా బదులిచ్చింది అని పేర్కొంది.చదవండి: బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసిన సు ఫ్రమ్‌ సో నటి

Malayalam Film Sarvam Maya Movie Collections Trend8
పదేళ్ల తర్వాత స్టార్‌హీరోకు భారీ హిట్‌.. ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్‌

మలయాళ సినిమా 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మలయాళం భారీ కలెక్షన్స్‌ వైపు దూసుకుపోతుంది. ఏకంగా పదేళ్ల తర్వాత నటుడు నివిన్ పౌలీకి భారీ హిట్‌ దక్కింది. దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు. ఓటీటీ సమయంలో తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది.ఈ ఏడాదిలో కొత్త లోక చిత్రం మలయాళం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్‌ దాటింది. 2025 సినిమా కలెక్షన్స్‌ లిస్ట్‌లో టాప్‌లో ఈ చిత్రం ఉంది. అయితే, ఏడాది ముగింపులో విడుదలైన సర్వం మాయ సినిమా కూడా ఇప్పడు జోరు చూపుతుంది. ప్రస్తుతం ఈ మూవీ రూ. 76 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. అయితే, సులువుగా రూ. 150 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.‘సర్వం మాయ’ కథ రొమాంటిక్ కామెడీ-డ్రామాకు కాస్త హారర్ జోడించడం ఆపై ఫాంటసీని కూడా కలపడంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ విజయంలో నివిన్ పాలీ నటన కీలకమైతే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రియా శిబూ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఆకర్షించింది. ఇందులో ఆమె నటనపై రివ్యూవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రియా శిబూకి సినీ రంగంతో బలమైన అనుబంధం ఉంది. ఆమె నిర్మాతగా కూడా రాణిస్తుంది. గతంలో హీరోయిన్‌గా మెప్పించిన రియా ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వీర ధీర శూరన్‌ చిత్రాన్ని నిర్మించిన రియా కోలీవుడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని పంపిణీ చేసింది.

Sai Pallavi Mere Raho Movie Postponed9
సాయిపల్లవి కొత్త సినిమా.. స్టార్ హీరో వల్లే ఆలస్యం?

సాయిపల్లవి.. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేసిన హీరోయిన్. గతేడాది ఫిబ్రవరిలో 'తండేల్'తో ప్రేక్షకుల్ని పలకరించింది. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. బయట కూడా ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతం ఈమె హిందీలో 'రామాయణ' అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. ఇది రాబోయే దీపావళికి థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. దీనికంటే ముందో ఓ హిందీ రొమాంటిక్ మూవీతో రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కావాల్సినప్పటికీ.. స్టార్ హీరో వల్లే ఆలస్యమవుతోందని మాట్లాడుకుంటున్నారు.సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. హిందీలో చేసిన తొలి సినిమా 'మేరే రహో'. సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. ఈ మూవీ షూటింగ్ గతేడాది ఏప్రిల్‌లోనే పూర్తయిపోయింది. లెక్క ప్రకారం అయితే డిసెంబరు రెండో వారంలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ 'ధురంధర్' దెబ్బకు లెక్కలన్నీ మారిపోయాయి. కొడుకు చిత్రం మార్కెటింగ్ అంతా చూసుకుంటున్న ఆమిర్ ఖాన్.. కావాలనే ఈ మూవీ రిలీజ్ వాయిదా వేశాడు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ బాలీవుడ్‌లో బోర్డర్ 2, ధురంధర్ 2, బ్యాటల్ ఆఫ్ గాల్వాన్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇంత పోటీలో వస్తే తమ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రావని భయపడ్డాడో ఏమో గానీ ఆమిర్ ఖాన్.. 'మేరే రహో' చిత్రాన్ని జూలైలో థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే.. 'రామాయణ' రిలీజ్‌కి కొద్ది రోజుల ముందే సాయిపల్లవి హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి బజ్ లేదు.ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇప్పటికే ఓటీటీలో ఓ మూవీ, థియేటర్లలో ఓ సినిమా(లవ్ టుడే రీమేక్) చేశాడు. రెండు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి సాయిపల్లవితో చేసిన చిత్రంతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి?

Sankranthi Movies Pre Bookings very poor In USA Box Office10
పెద్ద హీరోల సినిమాలు.. ఓవర్సీస్‌లో కనిపించని సంక్రాంతి జోరు

సంక్రాంతి సినిమాలకు ఓవర్సీస్‌లో అనుకున్నంత రేంజ్‌లో బజ్‌ లేదని తెలుస్తోంది. చాలా సినిమాలు రేసులో ఉన్నప్పటికీ ప్రీబుకింగ్స్‌లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటికే నార్త్‌ అమెరికాలో ది రాజా సాబ్‌, మన శంకర వరప్రసాద్‌ గారు, జన నాయకన్‌ ప్రీమియర్స్‌ అడ్వాన్స్ టికెట్‌లు ఓపెన్‌ చేశారు. కానీ, ట్రేడ్‌ వర్గాలు అంచనా వేసినంత రేంజ్‌లో ముందస్తు బుకింగ్స్‌ జరగడం లేదు.జనవరి 8న ది రాజా సాబ్‌తో పాటు జన నాయకన్‌ ప్రీమియర్‌లలో విడుదల కానుంది. ఆపై జనవరి 11న మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్స్‌లోకి రానున్నాడు. వీటిలో ది రాజా సాబ్ 342 ప్రదేశాలలో 1,021 స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. అయితే, ఇప్పటికీ కూడా కేవలం 3లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, ప్రభాస్‌ నటించిన మునుపటి చిత్రాలు కల్కి, సలార్ చిత్రాలు వరుసగా 4 మిలియన్లు, 2.5 మిలియన్ల కలెక్షన్స్‌ ప్రీమియర్ బుకింగ్‌ల ద్వారానే వచ్చాయి. కానీ, రాజా సాబ్‌కు అలాంటి పరిస్థితి లేదు. విడుదలకు మరో ఆరురోజులు మాత్రమే వుంది. దీంతో కనీసం 1 మిలియన్‌ మార్క్‌ వరకు చేరుకోవడమే కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఓవర్సీస్‌లో 119 ప్రదేశాలలో 423 స్క్రీన్స్‌లకు సంబంధించిన టికెట్లు ఓపెన్‌ అయ్యాయి. అయితే, ఇప్పటికి లక్ష డాలర్లు మాత్రమే వసూలు చేసి.. 4వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో జన నాయగన్‌ మూవీతో విజయ్‌ దూసుకుపోతున్నాడు. తన నటించే చివరి సినిమా కావడంతో ఓవర్సీస్‌లో ఇప్పటికే 1 మిలియన్‌ మార్క్‌ దాటింది. కారణాలు ఇవే..సంక్రాంతి సినిమాల అమెరికా ప్రీమియర్ ప్రీ-బుకింగ్స్ తగ్గడానికి ప్రధాన కారణాలు సినిమాలపై మిశ్రమ అంచనాలు ఉండటమేనని చెబుతున్నారు. ఆపై టికెట్ ధరలు పెరగడం, ప్రమోషన్లలో పెద్దగా జోరు చూపించకపోవడం ఆపై పెద్ద స్టార్ సినిమాలు ఉన్నప్పటికీ, ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులను బలంగా ఆకర్షించలేకపోయాయి. ఒక్కో టికెట్‌ ధర 30 డాలర్లకు (2,700) మించే ఉండటంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వెనుకడుగు వేస్తున్నారు. మొత్తం మీద, అమెరికాలో సంక్రాంతి సినిమాల ప్రీ-బుకింగ్స్ తగ్గడానికి మార్కెట్ పరిస్థితులతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా ప్రభావం చూపాయి.

Advertisement
Advertisement