ప్రధాన వార్తలు
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు.
దురంధర్పై ప్రశంసలు.. నన్ను కావాలనే టార్గెట్ చేశారు: అనురాగ్ కశ్యప్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.పాకిస్తాన్ గూడఛార నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై చాలామంది ప్రశంసలు కురిపించారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తనతోతో పాటు చాలామంది సినీ క్రిటిక్స్పై సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయని అన్నారు. ఇలాంటివీ కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తారని విమర్శించారు. ఈ వేధింపులకు గురైన వారిలో తాను ఒకడినని అనురాగ్ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కశ్యప్ ఈ విషయాన్ని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో కొన్ని సమస్యాత్మక అంశాలు ఉన్నప్పటికీ.. సినిమాను నిర్మించేటప్పుడు ఆదిత్య ధర్ ధైర్యాన్ని కూడా తాను గుర్తించానని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పట్ల తనకున్న అభిమానం.. దాని లోపాలను విస్మరించినట్లు కాదని స్పష్టం చేశారు. నాకు ఏదైనా నచ్చితే నా అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు తనకు లేదన్నారు. దురంధర్ను ప్రశంసించినందుకు తనను కూడా ప్రశ్నించారని అన్నారు. ఒక చిత్రనిర్మాతగా ఈ మూవీతో ఆదిత్య ధర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు. అర్జున్ రాంపాల్ నటించిన సీన్ చూసి ఓ డైరెక్టర్గా తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ చిత్రంలో సారా అర్జున్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మనశంకర వరప్రసాద్గారు సీరియల్ బ్యూటీ.. ఫుల్ ట్రెండింగ్లో నటి..!
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.అయితే ఈ చిత్రంలో కనిపించిన అన్ని పాత్రలకు ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు ఓ సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్గా సౌమ్య పాత్రలో మెప్పించింది. మన శంకర వర ప్రసాద్ కారెక్టర్లో చిరంజీవి ఆ సీరియల్ గురించి.. ఆ సీరియల్లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆ నటి కోసం తెగ వెతికేస్తున్నారట.ఈ మూవీలోని సీరియల్లో సౌమ్య పాత్రలో నటించిన ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చింది. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేస్తోంది. ఆ తరువాత యూట్యూబ్లో సిరీస్లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది.రీసెంట్గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం.
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
టైటిల్: అమరావతికి ఆహ్వానంనటీనటులు: శివ కంఠంనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులుదర్శకత్వం: జీవీకేనిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్నిర్మాతలు: కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావుసినిమాటోగ్రఫీ: జె ప్రభాకర్ రెడ్డిసంగీతం: పద్మనాబ్ భరద్వాజ్ఎడిటింగ్: సాయిబాబు తలారివిడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026టాలీవుడ్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్గా తెలుగులోనే వచ్చిన హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అమరావతికి ఆహ్వానం కథేంటంటే..ఈశ్వర్ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్ ఛానెల్ను రన్ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్ ఛానెల్లో దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్తో వీడియోలు షూట్ చేసి.. కంటెంట్ అప్లోడ్ చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది.అయితే సడన్గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విషయాన్ని లైవ్లో నిరూపిస్తానని.. ఈ వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ ఏంటి? సీఐగా ఈశ్వర్ సస్సెండ్ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..దెయ్యాలు అనే కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హారర్ థ్రిల్లర్ సినిమా.అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్ సీన్తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్కు షిఫ్ట్ చేశాడు. ఫస్ హాఫ్లో భార్గవి వీడియోలు షూట్ చేయడం, మహేశ్ (శివ హరీశ్)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్ను భయపెట్టే సీన్స్ పెద్దగా కనిపించవు. ఈశ్వర్ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచేసింది.సెకండాఫ్లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్బ్యాక్ ఎపిసోడ్తో కథనం ఆడియన్స్కు ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్లో హారర్ సీన్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్ వచ్చే ట్విస్ట్ థ్రిల్ చేస్తుంది. హారర్ ఎలిమెంట్స్ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్ థ్రిల్లర్లో సాంగ్స్ ఉంటే కథ సెట్ అవ్వదు. సెకండాఫ్లో ముగ్గురు హీరోయిన్స్తో సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఓ హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్ జీవీకే. తన కథకు తగినట్లుగానే క్లైమాక్స్ డిజైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు. క్లైమాక్స్లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.ఎవరెలా చేశారంటే..ఈశ్వర్, జగదీష్ పాత్రలలో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ ఏస్తేర్. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్ సీన్స్లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్ భరద్వాజ్ బీజీఎం హారర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా తలారి తన ఎడిటింగ్కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
బిగ్బాస్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
A to Z
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళ నటుడు జీవా నటించిన తలైవర్ తంబి తలైమైయిల్ చిత్...
ఓటీటీలోకి వచ్చేసిన ధర్మేంద్ర చివరి సినిమా
బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర.. మూడు నెలల క్రితం అం...
యానిమల్ నటుడి యాక్షన్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తోన్న లేటేస్ట్ మూవ...
ఓటీటీ ట్రెండింగ్లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్
గత కొన్నిరోజులుగా ఎప్స్టీన్ అనే వ్యక్తి పేరు సోషల...
రాజ్కుమార్ హిరాణి హిట్ సినిమా సీక్వెల్ రెడీ
బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్కుమార్ హిరాణి 3 ఇ...
ప్రెగ్నెన్సీ ప్రకటించిన నాగిని బ్యూటీ.. సోషల్ మీడియాలో పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర భామ సురభి జ్యోతి నాగిన్...
యానిమల్ నటుడి యాక్షన్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తోన్న లేటేస్ట్ మూవ...
నాకు జరిగినట్లు నా కూతురికి జరగనివ్వను!
నాలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వనంటున్నాడు బా...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
వారణాసి జానర్పై కన్ఫ్యూజన్.. రాజమౌళి ఫుల్ క్లారిటీ..!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస...
వరుస ఫ్లాఫ్స్.. మాస్ మహారాజా రిస్క్ తీసుకుంటున్నారా?
టాలీవుడ్లో మాస్ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ...
'చికిరి చికిరి' బ్యాట్ స్టెప్ ఐడియా రామ్చరణ్దా?
గతేడాది బాగా హిట్టయిన సాంగ్స్లో 'చికిరి చికిరి' ఒ...
చిన్నతనం నుంచే నాకు గుర్తింపు లేదు: సింగర్
గాయని కెనిషా పేరు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా చ...
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో నరేశ్- పవిత్ర (ఫోటోలు)
డాక్టర్గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)
'మెన్షన్ హౌస్ మల్లేష్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
బ్యూటీ విత్ బ్రెయిన్.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫోటోలు )
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
‘మార్కండేయ’ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
కశ్మీర్ అందాలు ఆస్వాదిస్తోన్న హీరోయిన్ లక్ష్మీరాయ్ (ఫోటోలు)
గాసిప్స్
View all
Mrunal Thakur: ధనుష్తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
రివ్యూలు
View all
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
సినీ ప్రపంచం
రాజాసాబ్లో డూప్? క్లారిటీ ఇచ్చిన మాళవిక
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో 'ది రాజాసాబ్' సినిమా ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. తీరా సినిమా రిలీజయ్యాక కూడా ట్రోలింగ్స్ మరింత పెరిగాయే తప్ప ఆగలేవు. ముఖ్యంగా ప్రభాస్కు చాలాచోట్ల డూప్ ఉపయోగించడంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఓ ఫైట్ సీన్ కోసం హీరోయిన్ మాళవిక మోహనన్కు కూడా డూప్ ఉపయోగించడంతో తనను కూడా ట్రోల్ చేశారు.ట్రోలింగ్పై స్పందించిన హీరోయిన్తాజాగా ఈ వివాదంపై మాళవిక మోహనన్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. ది రాజాసాబ్ సినిమాలో నేనే స్వతాహాగా స్టంట్స్ చేశానని చెప్పుకున్నాను. అయితే నా బాడీ డబుల్ (డూప్) యాక్షన్ సీన్లో ఉన్నట్లుగా ఓ ఫోటో వైరలవుతోంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి స్టంట్ ఆర్టిస్ట్.. అలాగే నా డూప్ కూడా!చిన్నతనం నుంచే..ముందుగా నేను చెప్పొచ్చేదేంటంటే.. నాకు యాక్షన్ అంటే ఇష్టం. ఫైట్ సన్నివేశాల్లో పాల్గొనడాన్ని ఆస్వాదిస్తాను. చిన్నతనం నుంచే నేను స్పోర్టివ్ అమ్మాయిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, శరీరాన్ని ఛాలెంజ్ చేయడం అంటే చాలా ఇష్టం. రెండో విషయం.. సెట్లో ఎప్పుడూ స్టంట్ డబుల్స్ సిద్ధంగా ఉంటారు. నటీనటులు సొంతంగా యాక్షన్ సీన్స్ చేసినా సరే వారు అందుబాటులోనే ఉంటారు.రిస్కీ షాట్స్ మాత్రం..వారు అనుభవజ్ఞులు కాబట్టి.. యాక్షన్ డైరెక్టర్ వారిని ఫైట్ రిహార్సల్స్ చేయమని చెప్తాడు. ఫైనల్ షాట్ మాత్రం మాపై చిత్రీకరిస్తారు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా ప్రమాదకరం అని భావించినప్పుడు నటులకు బదులుగా స్టంట్ డబుల్ను సీన్ పూర్తిచేయమని అడుగుతారు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ అయితే ఏ సమస్యా లేకుండా వాటిని ఈజీగా చేయగలరు.వివరణ అక్కర్లేదుఫైనల్గా.. నేను ఫైట్ సీన్స్ సమర్థవంతంగా చేసేందుకు నా స్టంట్ డబుల్ ఎంతగానో తోడ్పడింది అంటూ వీడియోలు షేర్ చేసింది. ఒక్క ట్వీట్ ద్వారా యాక్షన్ సీన్స్ తానే చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు టాలెంటెడ్ అని మాకు తెలుసు.. నువ్వు ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. Been seeing a lot of tweets and articles about how I claimed to do my own stunts for ‘The Rajasaab’ but a body double did it as there’s a photo circulating online of a stunt artist who was my stunt double on the film.Firstly, I do action because I really enjoy doing action.… pic.twitter.com/9ePwlLpti4— Malavika Mohanan (@MalavikaM_) February 13, 2026 చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి గుడ్న్యూస్ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 12న బేబీ జన్మించగా రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ పోస్ట్కు ఓ అందమైన ఫోటో జత చేసింది. అందులో శివజ్యోతి కుర్చీలో కూర్చుని నవ్వులు చిందిస్తుండగా ఆమె భర్త గంగూలీ బిడ్డను ఎత్తుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 14న) శివజ్యోతి బర్త్డే సందర్భంగా బేబీ రాకను వెల్లడించారు.ఇద్దరి గుండెచప్పుడు ముగ్గురిగా..తనకు ఇంత అందమైన బహుమతిచ్చిన శివజ్యోతికి గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్డే, చిన్ని. నీ 33వ పుట్టినరోజుకు ఎంతో అందమైన బహుమతిని తీసుకొచ్చావ్. మన ఇద్దరి గుండెచప్పుడు ఇప్పుడు ముగ్గురిగా మారింది. మాకు పుట్టింది పాప? బాబు? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : కపుల్ ఫ్రెండ్లీనటీనటులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, యోగిబాబు, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ:యూవీ కాన్సెప్ట్స్సమర్పణ: యూవీ క్రియేషన్స్రచన, దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్సంగీతం: ఆదిత్య రవీంద్రన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్విడుదల తేది: ఫిబ్రవరి 14, 2026సంతోష్ శోభన్.. ప్రతిభ గల నటుడు. కానీ ఆయన ఖాతాలో భారీ హిట్ అనేదే లేదు. ‘ఏక్ మినీ కథ’ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘కపుల్ ప్రెండ్లీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా సంతోష్ హిట్ ట్రాక్ ఎక్కాడా? ఫీల్ గుడ్ కంటెంట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాంకథేంటంటే..నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్ ఆర్కిటెక్ట్. ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్ రైడ్లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్ రిలేషన్ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. జీవిత ప్రయాణం ఎప్పుడు ఎలా ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. రేపటి గురించి ఆలోచించకుండా..ఈ క్షణం మనల్ని ప్రేమించిన వాళ్లతో సంతోషంగా గడుపుతూ.. కొన్ని మధుర జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ద్వారా ఇచ్చిన మంచి సందేశం ఇది. సంభాషలతో కాకుండా కథ రూపంలో ఈ సందేశాన్ని ఇచ్చారు దర్శఖుడు. సినిమా కథ చాలా సరదాగా ప్రారంభమై.. ఎమోషనల్గా ముగుస్తుంది. కథనం నెమ్మదిగా సాగినా... ఎక్కడ బోర్ కొట్టదు. అనుకోకుండా పరిచమై.. ప్రేమలో పడి..పెళ్లికి ముందు హద్దులు దాటి.. చివరకు పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో ఓ షాకింగ్ విషయం తెలియడం.. ఆ ఆర్వాత వీరిద్దర ప్రయాణం ఎలా కొనసాగింది? అనేది తెరపై చాలా మెచ్యూర్డ్గా చూపించాడు దర్శకుడు.హీరో బ్రేకప్ సీన్తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ చెన్నైకి వెళ్తుంది. అక్కడ ఉద్యోగం కోసం శివ పడే ఇబ్బందులను చూపిస్తూనే మరోవైపు మిత్ర పాత్రను పరిచయం చేశారు. ఇద్దరూ కలిసినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మిత్ర సహాయంతో శివ చేతికి ప్రాజెక్టులు రావడం..తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం.. ఈ ప్రయాణంలో మిత్రతో ప్రేమలో పడడం.. ఇదంతా రొమాంటిక్గా సాగుతుంది. ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగినా.. బోర్ మాత్రం కొట్టదు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఎమోషనల్గా సాగుతుంది. సినిమాలోని ట్విస్ట్ తెలిసిన తర్వాత మనకు గీతాంజలి, ఓయ్, సాగరసంగమం లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. సినిమా ప్రారంభంలో చూపించే కేరళ సీన్ల వెనుక ఉన్న అసలు స్టోరీ ద్వితియార్థంలోనే తెలుస్తుంది. క్లైమాక్స్ ఊహకందేలా సాగుతుంది.ఎవరిలా చేశారంటే.. శివ పాత్రలో సంతోష్ శోభన్ జీవించేశాడు. ఎక్కడ అతి చేసినట్లుగా అనిపించదు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. మిత్రగా మానస తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. సంతోష్, మానసల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. మిగతా పాత్రలన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి అంతే. యోగి బాబు ఉన్నా..కామెడీ పండించే స్కోప్ లేదు. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ ఫాదర్గా రాజీవ్ కనకాల తెరపై కనిపించేదేది కాసేపే అయినా.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆదిత్య రవీంద్రన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
స్వయంభూ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. రెడ్ డ్రెస్లో మెగా డాటర్ నిహారిక..!
స్వయంభు స్టిల్స్ షేర్ చేసిన సంయుక్త మీనన్..వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనిఖా సురేంద్రన్..మెగా డాటర్ నిహారిక కొణిదెల లేటేస్ట్ పిక్స్..మెడికల్ గ్రాడ్యుయేషన్ పిక్స్ షేర్ చేసిన శ్రీలీల.. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14)
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు.
దురంధర్పై ప్రశంసలు.. నన్ను కావాలనే టార్గెట్ చేశారు: అనురాగ్ కశ్యప్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.పాకిస్తాన్ గూడఛార నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై చాలామంది ప్రశంసలు కురిపించారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తనతోతో పాటు చాలామంది సినీ క్రిటిక్స్పై సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయని అన్నారు. ఇలాంటివీ కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తారని విమర్శించారు. ఈ వేధింపులకు గురైన వారిలో తాను ఒకడినని అనురాగ్ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కశ్యప్ ఈ విషయాన్ని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో కొన్ని సమస్యాత్మక అంశాలు ఉన్నప్పటికీ.. సినిమాను నిర్మించేటప్పుడు ఆదిత్య ధర్ ధైర్యాన్ని కూడా తాను గుర్తించానని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పట్ల తనకున్న అభిమానం.. దాని లోపాలను విస్మరించినట్లు కాదని స్పష్టం చేశారు. నాకు ఏదైనా నచ్చితే నా అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు తనకు లేదన్నారు. దురంధర్ను ప్రశంసించినందుకు తనను కూడా ప్రశ్నించారని అన్నారు. ఒక చిత్రనిర్మాతగా ఈ మూవీతో ఆదిత్య ధర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు. అర్జున్ రాంపాల్ నటించిన సీన్ చూసి ఓ డైరెక్టర్గా తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ చిత్రంలో సారా అర్జున్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మనశంకర వరప్రసాద్గారు సీరియల్ బ్యూటీ.. ఫుల్ ట్రెండింగ్లో నటి..!
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.అయితే ఈ చిత్రంలో కనిపించిన అన్ని పాత్రలకు ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు ఓ సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్గా సౌమ్య పాత్రలో మెప్పించింది. మన శంకర వర ప్రసాద్ కారెక్టర్లో చిరంజీవి ఆ సీరియల్ గురించి.. ఆ సీరియల్లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆ నటి కోసం తెగ వెతికేస్తున్నారట.ఈ మూవీలోని సీరియల్లో సౌమ్య పాత్రలో నటించిన ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చింది. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేస్తోంది. ఆ తరువాత యూట్యూబ్లో సిరీస్లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది.రీసెంట్గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం.
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
టైటిల్: అమరావతికి ఆహ్వానంనటీనటులు: శివ కంఠంనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులుదర్శకత్వం: జీవీకేనిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్నిర్మాతలు: కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావుసినిమాటోగ్రఫీ: జె ప్రభాకర్ రెడ్డిసంగీతం: పద్మనాబ్ భరద్వాజ్ఎడిటింగ్: సాయిబాబు తలారివిడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026టాలీవుడ్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్గా తెలుగులోనే వచ్చిన హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అమరావతికి ఆహ్వానం కథేంటంటే..ఈశ్వర్ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్ ఛానెల్ను రన్ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్ ఛానెల్లో దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్తో వీడియోలు షూట్ చేసి.. కంటెంట్ అప్లోడ్ చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది.అయితే సడన్గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విషయాన్ని లైవ్లో నిరూపిస్తానని.. ఈ వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ ఏంటి? సీఐగా ఈశ్వర్ సస్సెండ్ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..దెయ్యాలు అనే కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హారర్ థ్రిల్లర్ సినిమా.అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్ సీన్తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్కు షిఫ్ట్ చేశాడు. ఫస్ హాఫ్లో భార్గవి వీడియోలు షూట్ చేయడం, మహేశ్ (శివ హరీశ్)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్ను భయపెట్టే సీన్స్ పెద్దగా కనిపించవు. ఈశ్వర్ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచేసింది.సెకండాఫ్లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్బ్యాక్ ఎపిసోడ్తో కథనం ఆడియన్స్కు ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్లో హారర్ సీన్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్ వచ్చే ట్విస్ట్ థ్రిల్ చేస్తుంది. హారర్ ఎలిమెంట్స్ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్ థ్రిల్లర్లో సాంగ్స్ ఉంటే కథ సెట్ అవ్వదు. సెకండాఫ్లో ముగ్గురు హీరోయిన్స్తో సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఓ హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్ జీవీకే. తన కథకు తగినట్లుగానే క్లైమాక్స్ డిజైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు. క్లైమాక్స్లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.ఎవరెలా చేశారంటే..ఈశ్వర్, జగదీష్ పాత్రలలో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ ఏస్తేర్. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్ సీన్స్లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్ భరద్వాజ్ బీజీఎం హారర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా తలారి తన ఎడిటింగ్కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
ఓటీటీలో మనశంకర వరప్రసాద్గారు.. 24 గంటల్లోనే రికార్డ్
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. ఓటీటీకి వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలోనే కాదు..ఓటీటీలోనూ మనశంకర వరప్రసాద్గారు దూసుకెళ్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వారణాసి జానర్పై కన్ఫ్యూజన్.. రాజమౌళి ఫుల్ క్లారిటీ..!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్ టచ్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్ కానుందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే రాజమౌళి సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు ఉండడం సహజం. ముఖ్యంగా కథపై ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అసలు ఏ జానర్లో మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. అందుకే ఈ మూవీ జానర్ను ఎవరికీ తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది.కొందరు ఈ సినిమాను ఫిక్షన్ అని అంటున్నారు. మరికొందరేమో విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్లుక్ చూసి సైన్స్ ఫిక్షన్ అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్పై ఆడియన్స్లో విపరీతమైన కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీ జానర్పై దర్శకుడు రాజమౌళిని స్వయంగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉంటుందన్నారు. కానీ ఆ జానర్లో తీయడం లేదని.. వారణాసి ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని దర్శకధీరుడు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆడియన్స్ అనుమానాలకు చెక్ పడినట్లైంది. కాగా.. వారణాసిలో మహేశ్బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. విలన్ రోల్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ మెప్పించనున్నారు. ఈ మూవీలో మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
జోరుమీదున్న వెంకీ మామ ఏకంగా లైన్ లో 7 సినిమాలు
Arjun Sarja: రోజుకో గంట మీ శరీరానికి ఇచ్చుకోండి లైఫ్లో ఫిట్గా ఉంటారు
జగపతి బాబుతో మళ్ళీ మూవీ...! ఒకే ఒక్కడు సీక్వెల్...?
నా జీవితానికి పునాదిరాళ్లు పడిన రోజు చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మీ వారణాసి కోసం వెయిటింగ్ సార్
డ్రెస్సింగ్ పై.... హగ్ చేసుకుందాం అనుకున్న కానీ.. చీరలతో వచ్చారు
ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే..
ఇక పై హీరోయిన్ శ్రీలీల కాదు.. డాక్టర్ శ్రీలీల..!
21 ఏళ్ల బంధం.. ఎప్పటికీ మధురమే.. నమ్రత ఎమోషనల్ పోస్ట్..!
బన్నీ గురించి చెబుతూ ఏడ్చేసిన యాంకర్ స్రవంతి
