ప్రధాన వార్తలు
ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సినీ తారలు మాత్రమే కాదు.. ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులు తిరిగి వస్తే బాగుంటుందని అందరం అనుకుంటాం. కానీ అది జరగదని మనకు కూడా తెలుసు. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగుతాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అక్క జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా తనతో ఉన్న చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే అస్సలు జాన్వీకపూర్ చిన్నప్పుడు ఇలా ఉండేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చాలా క్యూట్ క్యూట్గా కనిపించారు. జాన్వీతో చిన్నప్పటి ఫోటోలు, అమ్మ శ్రీదేవితో ఉన్న పిక్స్ను షేర్ చేసింది. నా సోదరి, నా ప్రాణ స్నేహితురాలు, నా సలహాదారు, నా గురువు, నా క్రైమ్ పార్ట్నర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండి..ఈ రోజు ఒక వ్యక్తిగా మారడానికి నన్ను పెంచడంలో సహాయపడినందుకు ధన్యవాదాలు తెలిపింది. నువ్వు లేకుండా నేను జీరో.. నా జీవితంలో ఎల్లప్పుడు నీతోనే ఉండాలని ఆశిస్తున్నాను.. లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మరో సినిమా చేస్తోంది. రామ్ చరణ్- బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor)
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు.. వీడియో వైరల్
టాలీవుడ్ దంపతులు నాగచైతన్య, శోభిత ధూలిపాల ప్రముఖ ఆలయంలో పూజలు చేశారు. ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ జంట స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే వృషకర్మ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వృషకర్మ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Actor Naga Chaitanya, along with his wife Sobhita Dhulipala, visited the Shree Jagannath Temple at Puri, in Odisha, to seek the blessings of Lord Jagannath.Actor Naga Chaitanya says, "Jai Jagannath" (06.03) pic.twitter.com/VAhPmVmCpw— ANI (@ANI) March 6, 2026 Puri, Odisha : Actor Naga Chaitanyaprays at Shree Jagannath Temple. pic.twitter.com/utech7CQVF— News Arena India (@NewsArenaIndia) March 6, 2026
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026
ఆస్కార్ నుంచి ఆహ్వానం
ప్రియాంకా చోప్రాకు మరోసారి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ నెల మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ ప్రెజంటర్గా పాల్గొననున్నారు ప్రియాంకా చోప్రా. ఆమెతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ అన్నే జాక్వెలిన్ హతావే, గ్వినేత్ పాల్ట్రో, రాబర్ట్ డౌనీ జూనియర్, ఆర్నేట్, పాల్ మెస్కల్ ప్రజెంటర్స్గా పాల్గొననున్నట్లు ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రకటించింది.ఇక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రియాంకా చోప్రా ప్రజెంటర్గా పాల్గొనడం ఇది తొలిసారి కాదు. 2016లో జరిగిన 88వ ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రియాంక తొలిసారి ప్రజెంటర్గా వ్యవహరించారు. ఇప్పుడు పదేళ్లకు ఈ వేదికపై ఆమె మరోసారి విజేతలకు ఆవార్డులను ప్రదానం చేయనున్నారు.వారణాసి సినిమా ఓ గొప్ప అనుభవం: ప్రియాంకా చోప్రా మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చో ప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జార్జియాలో ప్రారంభమైంది. నెక్ట్స్ షెడ్యూల్ను అంటార్కిటికాలో ప్లాన్ చేశారని సమాచారం. కాగా, గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలోని ఫారెస్ట్ లొకేషన్స్లో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.ఆ షూటింగ్ అనుభవాలను ప్రియాంకా షేర్ చేసుకున్నారు. ‘‘కెన్యాలోని అడవుల్లో షూటింగ్ చేయడం గొప్ప అనుభూతి. వేల సంఖ్యలో అడవి జీవులు వలస వెళ్తున్న సమయంలో వాటి మధ్య మేం ఉన్నప్పుడు షూటింగ్ జరిగింది. ఆ జంతువుల ముఖాలను అంత దగ్గరగా చూస్తుంటే ఈ భూమ్మీద అవి ఎన్నో ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయని అర్థమైంది. ప్రకృతి ఎంత శక్తిమంతమైనదో, జీవపరిణామ క్రమం ఎంత గొప్పదో వాటిని చూస్తే తెలిసింది’’ అని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు ప్రియాంకా చోప్రా.
బిగ్బాస్
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు
తనూజ బర్త్డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
ప్రేయసితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
A to Z
OTT: నేటి తరం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది
నాడు రాత్రిపూట మేడ మీద మన తాతలు, అవ్వలు చెప్పిన కథ...
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి...
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వస...
అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి
తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది....
ఇండియా వదిలేస్తా ఇరాన్ వెళ్లిపోతా.. బాలీవుడ్ నటి సంచలన ప్రకటన
దుబాయ్ సహా పశ్చిమాసియాలో చిక్కుకున్న బాలీవుడ్ నట...
ప్రెగ్నెన్సీ కష్టాలు చూశా.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్ నిక...
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా? అంతమాత్రానికే ఇల...
రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ 'సేక్రెడ్ గేమ్స్' నటి
బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే రొమ్ము క్యాన్సర్...
19ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న 'షకీరా'
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీర...
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. క...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?
హీరోయిన్ రష్మిక పెళ్లి తంతు ముగిసింది. వారం-పదిరోజ...
తండ్రి లేకపోయినా ఆయన కల నెరవేర్చిన కూతురు
పిల్లలు ప్రయోజకులైతే చూడాలని ఏ తల్లిదండ్రులు ఆశపడర...
డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ కొత్...
'ఉస్తాద్ భగత్సింగ్' ఫ్యాన్స్కు షాకిస్తున్న బుక్మైషో
‘ఉస్తాద్ భగత్సింగ్’ వారం ముందే ప్రేక్షకుల ముందు...
ఫొటోలు
హైదరాబాద్లో గ్రాండ్గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష సందడి.. ఫోటోలు వైరల్
నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
విరోష్ జంట రిసెప్షన్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
#Virosh Reception: ఘనంగా విజయ్- రష్మిక రిసెప్షన్ (ఫోటోలు)
గాసిప్స్
View all
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్కి ముందు భారీ మార్పులు?
రామ్ చరణ్ 'పెద్ది' రన్టైమ్.. 4 గంటలపైనే?
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
దర్శకుడు మారుతి 'హ్యాపీ పొంగల్'?
నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’.. యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్?
హిట్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకొన్న వెంకటేశ్?
విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!
రివ్యూలు
View all
2.5
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
1.75
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ.. ప్రేక్షకులు సుద్దపూసలు కాదు
2.25
‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
‘సరస్వతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
మూగజీవాల ఎమోషన్స్ చూపించే లక్కీ.. ఓటీటీ మూవీ రివ్యూ
2.75
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.75
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆ మూవీ రీమేక్నా..?
కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య తొలిసారి తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు. లక్కీ భాస్కర్ మూవీ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది జులైలో థియేటర్స్లోకి రానుంది. అయితే, ఈ మూవీ రీమేక్ అంటూ సోషల్మీడియాలో కథనాలు వస్తున్నాయి.పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ యాక్షన్-కామెడీ చిత్రం 'కంగారూ'(Kangaroo)కి రీమేక్ అని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. 2007లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమా రీమేక్గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రాజెక్ట్ను తెరకెక్కించారని ప్రచారం మొదలైంది. అయితే, ఇందులో నిజం లేదని ఇండస్ట్రీకి చెందిన కొందరు చెబుతున్నారు. ఆ మూవీ రైట్స్ ఇప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదని క్లారిటీ ఇస్తున్నారు.విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది వెంకీ అట్లూరి రూపొందించిన స్క్రిప్ట్తోనే తెరకెక్కిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ రీమేక్ టాపిక్పై ఆయన స్పిందించే ఛాన్స్ ఉంది. 45 ఏళ్ల కథానాయకుడిపై ఇరవై ఏళ్ల అమ్మాయి ఇష్టం పెంచుకుంటే.. వారి బంధం ఎలా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎలాంటి భావోద్వేగాలు కనిపిస్తాయనేది ఈ మూవీ కథ అని సమాచారం. ఇందులో మమితా బైజు, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాష్కుమార్ అందించారు.
రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్..
మూడేళ్ల క్రితం వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాసిందో అందరం చూశాం. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా సోదరుడిగా నటించాడు శ్రీనాథ్ మాగంటి.మర్చిపోలేని అనుభవంఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్పై ప్రశంసలు కురిపించాడు. యానిమల్ సినిమాలో నటించడం అస్సలు మర్చిపోలేను. రణ్బీర్ తాత రాజ్కపూర్ పెద్ద స్టార్, తండ్రి రిషి కపూర్ గొప్ప స్టార్,.. రణ్బీర్ కూడా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన అంకిత భావంతో పని చేస్తాడు. సెట్కు భారీ సిబ్బందిని వెంటేసుకుని రాడు. ఒక ప్లేటు నిండా చాక్లెట్స్, చిప్స్తను వచ్చినప్పుడల్లా ప్లేటు నిండా ఆరోగ్యకరమైన చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వెంటపట్టుకుని వస్తాడు. అవన్నీ కేవలం తనకోసమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నవారి కోసం కూడా! ఎవరికి ఆకలైతే వారు తీసుకుని తినవచ్చు. కసారి నేను ఆ ప్లేటులోని స్నాక్ తీసుకుని తిన్నాను. ఇంతలో ఓ వ్యక్తి అది సార్ది అన్నాడు. సర్, ఈ ప్లేటంతా తింటాడా? అని అడిగాను. మా మాటలు విన్న రణ్బీర్.. నన్ను వారించిన వ్యక్తిని మూర్ఖుడా.. అతడిని తిననివ్వు అని చెప్పాడు.సినిమాఅతడిని ఏదో కోపంతో తిట్టలేదు, ప్రేమ, చనువుతోనే అతడిని వారించి నన్ను తినమమన్నాడు అని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రణ్బీర్ రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. దీని తర్వాత యానిమల్కు సీక్వెల్గా తెరకెక్కనున్న యానిమల్ పార్క్లో భాగం కానున్నాడు.చదవండి: ఆస్కార్ నుంచి ఆహ్వానం
టీటీడీ చైర్మన్ వీడియో కంటే మేము చేసింది పెద్ద తప్పా..?
దివ్వెల మాధురి, బిగ్బాస్ ఫేమ్ తనూజపై టీటీడీ చర్యలు తీసుకోనుంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేక్ను తిరుమలకు తీసుకెళ్లడం అక్కడ వేడుకలు చేయడం నిబంధనలకు విరుద్ధమని టీటీడీ పేర్కొంది. కొండపై ఇలాంటి వేడుకలు నిషేధమని తెలిపింది. అయితే, తాజాగా దువ్వాడ శ్రీనివాస్తో పాటుగా ముధురి వివరణ ఇచ్చారు. కొండపై తాము కట్ చేసిన కేక్ ఎగ్లెస్ అని అందుకు సంబంధించిన బిల్ను ఆయన షేర్ చేశారు.తిరుమల కొండపై తనూజ బర్త్డే సందర్భంగా తాము కేక్ కట్ చేసింది వాస్తవమేనని దువ్వాడ శ్రీనివాస్ ఇలా అన్నారు. 'ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో తన పుట్టినరోజు నాడు దర్శనం చేసుకోవాలనుకుంది. దీంతో మాతో పాటుగా తిరుమల వచ్చింది. అయితే, తనకు చెప్పకుండానే మేము కేక్ తిరుపతిలో కొన్నాం. అది పూర్తిగా ఎగ్లెస్ కేక్. మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఆయన పేరు పెట్టుకుని బతికే నేను ఎట్టి పరిస్థితిల్లోనూ తప్పు చేయను. నా మొదటి తలనీలాలు ఎడుకొండలవాడి సన్నిధిలోనే ఇచ్చాను. ఇప్పటికి వందసార్లకు పైగానే స్వామిని దర్శించుకున్నాను. ప్రయాణంలో కూడా మేము తినే ఆహారం పూర్తిగా శాఖాహారమే ఉంటుంది. అయితే, అక్కడ కేక్ కట్ చేయకూడదనే నిబంధనలు నాకు తెలియవు. తెలిసింటే ఆ పొరపాటు చేయం. కానీ, కొన్ని మీడియా ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.' అని ఆయన అన్నారు.బీఆర్ నాయుడి వీడియో సంగతేంటి..?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి వీడియో టాపిక్ను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి విషయాలను హైలెట్ చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మేము కేక్ కట్ చేసినందుకే కేసు పెట్టండని చెబుతున్నారు. మరి బీఆర్ నాయుడు చేసిన పనికి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన వీడియో తానే చూసి ఏ తప్పు కనిపించలేదని అంటున్నాడు. అలాగే తాము కేక్ కట్ చేసిన వీడియోలో ఏం తప్పు ఉందని అన్నారు. మాకు తెలియక కేక్ కట్ చేశాం.. క్షమించమని స్వామిని వేడుకుంటాం. కానీ, నువ్వు చేసిన పనికి ఏం చేస్తావ్.. నీ వీడియో టాపిక్ను డైవర్ట్ చేసేందుకే మాపై కేసులు పెడతావా అంటూ ఆయన ప్రశ్నించారు. View this post on Instagram A post shared by Divvala Madhuri (@madhuri_srinivasduvvada)
వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా.. హీరోయిన్ ఎవరంటే..?
విక్టరీ వెంకటేష్ ఐదవసారి హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో చేతులు కలిపాడు. 2027 సంక్రాంతికి మరో సినిమాతో రానున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో F2 , F3 , సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలు తెరపైకి వచ్చాయి. అయితే, 2027 పొంగల్ రేసులో బరిలోకి దిగబోతున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి వెంకటేష్ (Venkatesh), కల్యాణ్రామ్ (Nandamuri Kalyan Ram) ప్రధాన పాత్రల్లో సినిమా ఉండనుంది. అయితే, హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చర్చగా మారింది.తాజా సమాచారం ప్రకారం వెంకటేశ్ సరసన నటించేందుకు మహానటి కీర్తి సురేష్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై ఆమె సంతకం చేసిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన మరో హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి వెతుకుతున్నాడని చెబుతున్నారు. కీర్తి గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన విజయం లేకపోడంతో కాస్త వెండితెరకు దూరమైంది. మరి అనిల్ రావిపూడి అయినా మహానటికి విజయాన్ని అందిస్తారేమో చూడాలి. భారీ బడ్జెట్తో సిద్ధం అవుతున్న ఈ మూవీకి నిర్మాత ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.
మరోసారి సింగర్గా మెప్పించిన శ్రుతిహాసన్
ఇప్పుడు సినిమా పాటలకు దీటుగా ఇండిపెండెంట్ పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇండిపెండెంట్ పాటలకు ఈ తరం యువతలో ప్రత్యేకత ఏర్పడుతోంది. ఇలాంటి ఇండిపెండెంట్ ఆల్బమ్లతోనే యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సినీ రంగంలో సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్నారు. అదేవిధంగా నటి శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కథానాయకిగా అగ్రస్థానంలో రాణిస్తున్న ఈమెలో మంచి గాయని, సంగీత దర్శకురాలు ఉన్నారన్నది తెలిసిందే. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి చిత్రం కోసం శ్రుతిహాసన్ పాడిన సాహసమే అనే పల్లవితో సాగే పాట శ్రోతలను విపరీతంగా ఆలోచిస్తుంది. తాజాగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్తో కలిసి నటి శ్రుతిహాసన్ పాడిన పవళ మల్లి అనే పల్లవితో సాగే ఇండిపెండెంట్ పాట ఇటీవల విడుదలై విశేష ఆదరణను పొందుతోంది. చక్కని ప్రేమతో కూడిన ఈ పాటలో అంతకుమించిన భావోద్రేకాలు చోటుచేసుకున్నాయి. గీత రచయిత వివేక్ రాసిన ఈ పాటకు సాయ్ అభయంకర్ బాణీలు కట్టారు. ఆయనతో కలిసి నటి శ్రుతిహాసన్ మధురమైన గొంతుతో ఆలపించిన ఈ పాట ఇప్పుడు యువతను ఉర్రూతలూగిస్తోంది.
పెద్ది హీరోయిన్ బర్త్ డే.. కాలి నడకన తిరుమలకు..!
బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. ఈ శుక్రవారం ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారుబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా కనిపిచంనుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)
ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సినీ తారలు మాత్రమే కాదు.. ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులు తిరిగి వస్తే బాగుంటుందని అందరం అనుకుంటాం. కానీ అది జరగదని మనకు కూడా తెలుసు. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగుతాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అక్క జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా తనతో ఉన్న చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే అస్సలు జాన్వీకపూర్ చిన్నప్పుడు ఇలా ఉండేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చాలా క్యూట్ క్యూట్గా కనిపించారు. జాన్వీతో చిన్నప్పటి ఫోటోలు, అమ్మ శ్రీదేవితో ఉన్న పిక్స్ను షేర్ చేసింది. నా సోదరి, నా ప్రాణ స్నేహితురాలు, నా సలహాదారు, నా గురువు, నా క్రైమ్ పార్ట్నర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండి..ఈ రోజు ఒక వ్యక్తిగా మారడానికి నన్ను పెంచడంలో సహాయపడినందుకు ధన్యవాదాలు తెలిపింది. నువ్వు లేకుండా నేను జీరో.. నా జీవితంలో ఎల్లప్పుడు నీతోనే ఉండాలని ఆశిస్తున్నాను.. లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మరో సినిమా చేస్తోంది. రామ్ చరణ్- బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor)
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు.. వీడియో వైరల్
టాలీవుడ్ దంపతులు నాగచైతన్య, శోభిత ధూలిపాల ప్రముఖ ఆలయంలో పూజలు చేశారు. ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ జంట స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే వృషకర్మ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వృషకర్మ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Actor Naga Chaitanya, along with his wife Sobhita Dhulipala, visited the Shree Jagannath Temple at Puri, in Odisha, to seek the blessings of Lord Jagannath.Actor Naga Chaitanya says, "Jai Jagannath" (06.03) pic.twitter.com/VAhPmVmCpw— ANI (@ANI) March 6, 2026 Puri, Odisha : Actor Naga Chaitanyaprays at Shree Jagannath Temple. pic.twitter.com/utech7CQVF— News Arena India (@NewsArenaIndia) March 6, 2026
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026
జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్
పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్కు మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. పెద్ది మూవీ సెట్లో జాన్వీ కపూర్తో ఉన్న స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్ను చెర్రీ పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్లో కనిపిస్తూ సందడి చేశారు. ఆమెకు తన వృత్తి పట్ల ఆమెకున్న మక్కువ, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది.. ఈ ఏడాది తనకి మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ చికిరి చికిరి అభిమానులను ఓ ఊపు ఊపేయగా.. ఇటీవల రిలీజైన రైరై రారా అంటూ సాగే పాట కూడా అదే రేంజ్లో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)
సినిమా
అల్లు వారి పెళ్లి సందడి..
పావలా శ్యామలకు బన్నీ భరోసా..!
పెద్ది మళ్ళీ పోస్టుపోన్..! APR 30 కాదు.. ఎప్పుడంటే..?
విడాకుల వ్యవహారం.. భార్య సంగీతకి రూ.250 కోట్లు ఆఫర్ చేసిన విజయ్!
టాప్ స్టార్ గా రామ్ చరణ్ రికార్డు... లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..?
విరోష్ ప్రేమకథ.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే
విరోష్ రిసెప్షన్లో రాజకీయ నాయకులు
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు
ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న పెద్ది రన్ టైం..!
విరోష్ రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి విజువల్స్
