ప్రధాన వార్తలు
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ
ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా అంగమ్మాల్. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడు తుని అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది. అయితే కేవలం తమిళ భాషలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.అంగమ్మాల్ కథ విషయానికి వస్తే..జీవితాంతం రవిక అంటే ఏంటో తెలీక బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. చిన్న కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుని సంబంధం మాట్లాడేందుకు అతడి ఊరొస్తామంటారు.పట్నంలో పెరిగిన హైక్లాస్ మనుషులు అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? రవిక లేకుండా చూస్తే నోరెళ్లబెట్టరా? అని ఆలోచించిన చిన్నకొడుకు తల్లిని జాకెట్ వేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ! Her name says it all. Angammal. Angammal From Jan 9th#SunNXT #AngammalOnSunNXT #Angammal@kaarthekeyens @ksubbaraj @njoy_films @stonebenchersWriter: @perumalmurugan_offl@kailasam.geetha @_saranofficial @actor_bharani @thendral_raghunathan @mullaiyarasii @vinodanandr… pic.twitter.com/B3YeHx5zuk— SUN NXT (@sunnxt) January 6, 2026 చదవండి: పెళ్లి చేసుకుంటా: స్త్రీ 2 హీరోయిన్
చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్ అభిమానులతోనూ వీడియో కాల్స్లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్ ఫంక్షన్కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్పై క్లారిటీ!)దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.(చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?)మనశంకర్ వరప్రసాద్(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
వయసు గురించి ఆలోచించనంటున్న చందమామ
అందం ఆనందం.. ఆనందమే మకరందం అన్నారో మహాకవి. సినీతారలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం, అభినయంతోపాటు తళతళ మెరిసే మేని అందం కూడా చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకురాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే అంటోంది.ఎందుకంటే పెళ్లి, బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్.. సినీజీవితాన్ని కూడా సమపాళ్లలో అనుభవిస్తోంది. కథానాయికగా చందమామగా అలరించినా, మగధీరతో అభినయించినా.. అందాలు ఆరబోసినా ఆమెకే చెల్లింది. పాన్ ఇండియా హీరోయిన్గా అలరిస్తున్న కాజల్ అగర్వాల్కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణం సినిమాలో మండోదరిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే ది ఇండియా స్టోరీ అనే మరో మూవీలోనూ హీరోయిన్గా నటిస్తోందట! ఇప్పటికీ మిలమిల మెరిసిపోతున్న కాజల్ తన సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్లని.. సౌందర్యానికి కారణం వర్కవుట్స్, యోగా అంది. తాను నిత్యం వర్కవుట్స్ చేయడంతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటానంది.ముఖ్యంగా ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటానని పేర్కొంది. కాయగూరల్లో ఉండే పౌష్టికాహారాలు, కొబ్బరి నీళ్లు, పళ్లరసాల్లో ఉండే ప్రకృతి సిద్ధమైన తీపి ద్వారా వెంటనే సత్ఫలితాలు అందుతాయని తెలిపింది. అందువల్ల తాను వయసు గురించి ఆలోచించనని పేర్కొంది.
బిగ్బాస్
ఓటీటీలో కొత్త సినిమా స్ట్రీమింగ్.. సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
కల్యాణ్, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్ పంచ్.. వీడియో వైరల్
రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్లో మధుర జ్ఞాపకం: తనూజ
గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
ప్రమోషన్ పొందిన వితికా షెరు
A to Z
బాలయ్య అఖండ-2.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన మరో యాక్షన్ చిత్రం ...
బెట్టింగ్ రాయుళ్ల ఆటకట్టించే యువకుడి కథ.. బ్రాట్ మూవీ రివ్యూ
టైటిల్: బ్రాట్నటీనటులు: డార్లింగ్ కృష్ణ, మనీషా కంద...
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
సినిమా ఇలానే తీయాలి, స్టోరీ ఇలానే ఉండాలి అనేది ఒకప...
బ్లూ డ్రమ్ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి రెడీ
గత కొన్నేళ్ల కాలంలో భర్తల్ని భార్యలు రకరకాలుగా చంప...
భర్తతో హీరోయిన్ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్..'
బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధాన...
సంక్రాంతి కానుకగా శంబాల.. ట్రైలర్ రిలీజ్
ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన మైథలాజికల్ థ్రిల్లర...
అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్న చేతిలో తిట్లు!
బాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్లో శక్తి కపూర్...
ప్రియురాలితో స్టార్ హీరో మేనల్లుడి ఎంగేజ్మెంట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అయాన్...
భయపెడితే భళా.. బాక్సాఫీస్ గలగలా
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ వుడ్ చూసినా హారర...
సైకలాజికల్ థ్రిల్లర్ 'షట్టర్ ఐలాండ్' మూవీ రివ్యూ
ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు క్రేజెక్కువ. అలాంటి ఓ...
జేమ్స్ కామెరూన్ అవతార్-3.. ఇండియాలో క్రేజీ రికార్డ్..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్...
క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' తెలుగు ట్రైలర్ రిలీజ్
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్.. తెలుగు ప్రేక...
తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి!
కమర్షియల్, థ్రిల్లర్, హారర్ సినిమాలు.. దాదాపు ఒక ఫ...
'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. మర...
యశ్ 'టాక్సిక్'లో 5వ హీరోయిన్ ఎంట్రీ
కన్నడ నటుడు యశ్ జోరు పెంచాడు.. ‘కేజీఎఫ్, కేజీఎఫ్...
గత ఏడాది ఆశాజనకంగా లేదు కానీ..: త్రిష
పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ తమ చిత్రాలు విజయవంతం...
ఫొటోలు
‘కార్ల్టన్ వెల్నెస్’ బ్రాండ్ అంబాసిడర్గా మృణాల్ (ఫొటోలు)
తిరుమలలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)
కొత్త సంవత్సరం కొత్త కొత్తగా హీరోయిన్ కృతి శెట్టి (ఫొటోలు)
ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
'కానిస్టేబుల్ కనకం 2' సీజన్ 2 ప్రెస్ మీట్ (ఫొటోలు)
గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు
కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)
ఎ.ఆర్. రెహమాన్ బర్త్డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)
గాసిప్స్
View all
విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా? మాట నిలబెట్టుకుంటాడా?
టాలీవుడ్లో ఒకేరోజు ఈవెంట్ల జాతర
'అఖండ-2' ఫైనల్ కలెక్షన్స్.. బిగ్ లాస్
చరణ్తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది
ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?
సల్మాన్ ఖాన్ రూ.80 కోట్ల ఆస్తి ఆమె పేరిట?
బాలకృష్ణ, గోపీచంద్ల కథ కంచికి.. మేకర్స్ కీలక నిర్ణయం
'వారణాసి' విలన్ మరో తెలుగు సినిమా?
ఆయన కూడా తప్పుకున్నట్లే.. డ్రాగన్ డైరెక్టర్కు ఛాన్స్!
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?
రివ్యూలు
View all
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
2.25
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
2.75
'దండోరా' సినిమా రివ్యూ
3
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
సినీ ప్రపంచం
చాలాకాలంగా సీక్రెట్గా ఉంచా.. మాటలు రావట్లేదు!
తక్కువకాలంలో స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. క్యూట్ ఫేస్తో, అమాయకపు చిరునవ్వుతో అందరినీ బుట్టలో వేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటించిన 'పరాశక్తి' మూవీ సంక్రాంతి పండక్కి (జనవరి 10న) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.మాటలు రావుతను ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న విషయం గురించి తొలిసారి స్పందించింది. శ్రీలీల మాట్లాడుతూ.. పిల్లల ప్రస్తావన వస్తే నాకు మాటలు రావు. వాళ్లు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నాతో కలిసుండకపోయినా నేను వారిని బాగా చూసుకుంటున్నాను. కిస్ (2019) అనే కన్నడ మూవీ సమయంలో దర్శకుడు నన్ను ఓ ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడే ఈ పిల్లలు ఉండేవారు. రహస్యంగానే..మేము ఫోన్లో మాట్లాడేవాళ్లం. వీలు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లేదాన్ని. కానీ, ఈ విషయాన్ని నేను చాలాకాలం రహస్యంగా ఉంచాను. అయితే ఆ ఆశ్రమం వాళ్లు దీన్ని గోప్యంగా ఉంచడం దేనికి? మీరు బయటకు చెప్తేనే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురైనా ముందుకొస్తారు అన్నారు. నిజమే కదా అనిపించింది. నేనేదో గొప్ప చేశానని చెప్పడం లేదు కానీ జనాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది.అమ్మ ప్రేమ పంచుతున్నా..అయితే ఈ జనరేషన్కు నాలాంటివాళ్లు నచ్చకపోవచ్చు. నేను మంచి గర్ల్ఫ్రెండ్ కాకపోవచ్చేమో! అయినా సరే.. నా తల్లి నన్నెంతగా ప్రేమిస్తుందో.. అదే ప్రేమను ఆ పిల్లలకు పంచుతున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా శ్రీలీల 2022లో గురు, శోభిత అని ఇద్దరు దివ్యాంగులను దత్తత తీసుకుంది. 2025లో తన బర్త్డేకు ముందు ఓ పసిపాపను దత్తత తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ చిన్నారి తన మేనకోడలు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది.చదవండి: చావు తప్ప మరో దారి లేదు: బాలీవుడ్ నటి
ఆ డైరెక్టర్ భార్యను కొడితే కోమాలోకి వెళ్లింది: పూనమ్ కౌర్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్కి టచ్లో ఉంటుంది. తనకు నచ్చిన విషయాలనే ఓపెన్గా మాట్లాడడం.. పాలిటిక్స్తో పాటు సినీ ఇండస్ట్రీ విషయాలపై కూడా స్పందించడం పూనమ్కు అలవాటు. ఆమె చేసే పోస్టులు కొన్ని కాంట్రవర్సీగా, చర్చనీయాంశంగానూ మారాయి. పలుమార్లు ఆమెపై ట్రోలింగ్ కూడా నడిచింది. అయినా కూడా పూనమ్ తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్తో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చిత్ర హింసలకు గురి చేశాడంటూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి.(చదవండి: ఎన్నో దారుణాలు చూశా.. నాకు విలువ లేదు.. అందుకే విడాకులు!)తాజాగా పూనమ్(Poonam Kaur ) ఓ యూట్యూబ్ చానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాల గురించి వివరిస్తూ..సోషల్ మీడియాలో చేసే పోస్టులపై గురించి కూడా మాట్లాడింది. 'మన ఇల్లు బాగుండాలని పక్కింటిని కూల్చేయడం సరికాదు. అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అంటూ గతంలో పూనమ్ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా..దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటో ఆమె వివరించింది.‘నేను ఊరికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టను. నా హార్ట్కు టచ్ అయిన విషయాల గురించే మాట్లాడుతుంటాను. మీకు తెలుసా... ఓ డైరెక్టర్, ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అతడు కొట్టడంతో ఆమె ఐదారు రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది. అన్యాయం జరిగినా ఆ మహిళ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాదు ఇదంతా జరిగిన తర్వాత కూడా సినిమా ఈవెంట్లకు భర్తతో కలిసి హాజరైంది. ఆ దర్శకుడి సినీ జీవితం గురించి ఆమె ఆలోచించి.. హీరోయిన్తో పెట్టుకున్న సంబంధం గురించి బయటకు చెప్పలేదు. ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాకయ్యాను. మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను’ అని పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే ఆ దర్శకుడు, హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆమె బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం పూనమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అతను ఎవరా? అనే చర్చ కొనసాగుతోంది.
చావు తప్ప మరో దారి లేదు.. విడాకులిచ్చా: నటి
ఒకరు మన తోడుంటేనే జీవితం పరిపూర్ణం అని చెప్పారు తప్ప నీకు నవ్వు ముఖ్యం.. ఒంటరిగా అయినా సంతోషంగా ఉండగలవు అని ఎవరూ చెప్పలేదు అంటోంది బాలీవుడ్ నటి షెఫాలి షా. హిందీ సినిమాలు, సిరీస్లతో అలరించే షెఫాలికి రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటగా బుల్లితెర నటుడు హర్ష్ చయ్యను పెళ్లాడింది. రెండు పెళ్లిళ్లుకానీ, వీరి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. 2000వ సంవత్సరంలో దంపతులిద్దరూ విడిపోయారు. తర్వాత అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్లాల్ షాను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన మొదటి వైవాహిక జీవితపు తాలూకు చేదు అనుభవాలను నటి గుర్తు చేసుకుంది. ఎన్నో దారుణాలుషెఫాలి మాట్లాడుతూ.. నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి.. ఇలా ఎవరి అవసరమూ లేదు, నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో చెప్పలేదు. ఒకవేళ మీరు మంచి రిలేషన్లోనే ఉంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. కానీ ఆ రిలేషన్షిప్ బాగోలేకపోతే మాత్రం అంతకన్నా నరకం మరొకటి లేదు. ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఆ రిలేషన్ను కొనసాగించాలా? వదిలేయాలా? అన్న అంతర్మథనంలో పడతారు. చావు తప్ప..చివరకు ఒకరోజు వస్తుంది. ఇక సహించడం నా వల్ల కాదనిపిస్తుంది.. దీన్నలాగే వదిలేస్తే రేపు నా ప్రాణాలు పోవచ్చేమో అనిపిస్తుంది. అలాంటి సందర్భం నా జీవితంలోనూ ఎదురైంది.. అది నా ఫస్ట్ మ్యారేజ్ సమయంలో! అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రశ్న అడిగింది. నీ జీవితంలో మళ్లీ నిన్ను ప్రేమించే వ్యక్తి తారసపడకపోతే ఏం చేస్తావ్? రిస్క్ తీసుకుంటావా? లేదా ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తావా? అని అడిగింది. రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపాను.రిస్క్ చేశాఅవసరమైతే నా జీవితాన్ని ఒంటరిగానైనా గడుపుతానన్నాను. అంతేకానీ నాకు విలువ లేని చోట, ఏమాత్రం ఆనందం దొరకని చోట శిలలా బతకలేనని బదులిచ్చాను. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేందుకు నేనేం పిజ్జాను కాదని చెప్పా.. అని గుర్తు చేసుకుంది. షెఫాలి చివరగా ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఛాన్సులు కూడా
హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట
మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు తోపాటు ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు. 'రాజాసాబ్' చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయి వాదనలు వినిపించారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఈ సినిమాలకు వర్తించవని, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.గతంలో సింగిల్ బెంచ్, హోమ్ సెక్రటరీకి ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరల పెంపు మెమో జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్' నిర్మాతలు అప్పీల్ చేశారు. "మేము ఇప్పటికే హోమ్ సెక్రటరీకి టికెట్ ధరల పెంపు కోసం అభ్యర్థన చేశాం. కానీ సింగిల్ జడ్జ్ ఆదేశాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు" అని నిర్మాతల న్యాయవాది వాదించారు.సింగిల్ జడ్జ్ ఆదేశాలు మూడు సినిమాలు - 'పుష్ప 2', 'ఓజీ', 'అఖండ 2', గేమ్ ఛేంజర్ - టికెట్ ధరల విషయంలోనే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవని, అవి 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్'కు ఎలా వర్తిస్తాయని న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ చెంజర్, అఖండ2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఆఫర్లు కూడా పోయాయి!
హీరో ఫ్రెండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మధునందన్. నిన్నే ఇష్టపడ్డాను, సై, ఇష్క్, గీతాంజలి, గుండెజారి గల్లంతయ్యిందే, రభస, లై, వినయ విధేయ రామ.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తాజాగా 'శంబాల' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరవగా అనేక విషయాలు పంచుకున్నాడు.మధునందన్ మాట్లాడుతూ.. గుండెజారి గల్లంతయ్యిందే తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను. అయితే రెండు సినిమాల షూటింగ్ కోసం వరుసగా ఆరునెలలు అమెరికాలోనే ఉండిపోయాను. దాంతో చాలామంది ఏమనుకున్నారంటే.. ఇంకా ఉద్యోగం చేస్తూ యాక్టింగ్ చేస్తున్నాననుకున్నారు. ఉద్యోగం వల్ల సరైన టైం ఇవ్వలేననుకున్నారు. దానివల్ల 10-15 సినిమా అవకాశాలు పోయాయి. కానీ అప్పటికే నేను జాబ్ మానేసి చాలాకాలమైంది.మోసపోయా..నా పక్కనే ఉంటూ నా క్యారెక్టర్లు కొట్టేసిన వ్యక్తితో ఇప్పటికీ స్నేహం చేస్తున్నాను. కాకపోతే జాగ్రత్తగా ఉంటాను. వాళ్లలా ఒకరిని తొక్కి ఎదగడం నాకు చేతకాదు. అలాంటివాళ్లను పెద్దగా పట్టించుకోను. నా వరకు వస్తే ఓకే, కానీ నన్ను దాటి కుటుంబం జోలికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను.కెరీర్ మొదట్లో ఉద్యోగం, సినిమాలు రెండూ చేశాను. ఓపక్క ఉద్యోగం, మరో పక్క సినిమాలు చేస్తూ రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. అలా నాలుగేళ్లపాటు కష్టపడి సంపాదించిన రూ.25 లక్షలు బిజినెస్లో పెట్టాను. అప్పుడు ఓ వ్యక్తి నన్ను నిండా ముంచేశాడు. ఉన్న డబ్బంతా పోయింది అని మధునందన్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే?
సమంత మాస్ లుక్.. సంక్రాంతికి సర్ప్రైజ్
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అందుకుంది. అదే బ్యానర్పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇందులో ఆమే హీరోయిన్. ‘ఓ బేబీ’ తర్వాత సామ్తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే దర్శకురాలు పేరు తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ని పంచుకుంది సమంత. (చదవండి: ఓటీటీలో తమిళ ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే?)సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అంటూ ఆ పోస్టర్కి క్యాప్షన్ రాసుకొచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్తోన్న బ్యూటీ.. ఎప్పుడో మరి!)ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా..సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుఉతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
శ్రీవారి సేవలో 'సంక్రాంతికి వస్తున్నాం' తారలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ దర్శించుకున్నారు. బుధవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం హీరోయిన్లు ఇద్దరూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. జనవరి 14న తాను హీరోయిన్గా నటించిన అనగనగా ఒక రాజు విడుదలవుతోందని తెలిపింది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ ఏడాది మధ్యలో నాగచైతన్యతో నటించిన సినిమా విడుదలవుతుందని వెల్లడించింది. ఐశ్వర్య రాజేశ్.. సంక్రాంతికి విడుదలవుతున్న ప్రతి సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది.ఐశ్వర్య రాజేశ్ తెలుగమ్మాయే అయినా తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్థిరపడింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఇక్కడివారికి దగ్గరైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది.సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే..జనవరి 9న ప్రభాస్ ‘ది రాజా సాబ్’, విజయ్ 'జననాయకుడు' విడుదలవుతున్నాయి. జనవరి 10న శివకార్తికేయన్ 'పరాశక్తి', జనవరి 12న చిరంజీవి 'మన శంకర్ వరప్రసాద్ గారు', జనవరి 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', జనవరి 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగ ఓరాజు', శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' రిలీజవుతున్నాయి.చదవండి: వయసు గురించి ఆలోచించేదే లేదంటున్న చందమామ
ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా అంగమ్మాల్. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడు తుని అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది. అయితే కేవలం తమిళ భాషలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.అంగమ్మాల్ కథ విషయానికి వస్తే..జీవితాంతం రవిక అంటే ఏంటో తెలీక బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. చిన్న కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుని సంబంధం మాట్లాడేందుకు అతడి ఊరొస్తామంటారు.పట్నంలో పెరిగిన హైక్లాస్ మనుషులు అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? రవిక లేకుండా చూస్తే నోరెళ్లబెట్టరా? అని ఆలోచించిన చిన్నకొడుకు తల్లిని జాకెట్ వేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ! Her name says it all. Angammal. Angammal From Jan 9th#SunNXT #AngammalOnSunNXT #Angammal@kaarthekeyens @ksubbaraj @njoy_films @stonebenchersWriter: @perumalmurugan_offl@kailasam.geetha @_saranofficial @actor_bharani @thendral_raghunathan @mullaiyarasii @vinodanandr… pic.twitter.com/B3YeHx5zuk— SUN NXT (@sunnxt) January 6, 2026 చదవండి: పెళ్లి చేసుకుంటా: స్త్రీ 2 హీరోయిన్
శివకార్తికేయన్కు కథ చెప్పిన పార్కింగ్ డైరెక్టర్!
సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి పేరు ఖరారైంది. డాన్ దర్శకుడితో రజనీకాంత్దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్ చిత్రం ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.పార్కింగ్ డైరెక్టర్ఇకపోతే పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్కుమార్ బాలకృష్ణన్ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.చదవండి: ఉస్తాద్ భగత్సింగ్లో ఛాన్స్.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ
సినిమా
చిరంజీవి, విశ్వంభర సినిమాపై నటి మీనాక్షి చౌదరి కామెంట్స్
Actress Meenakshi : లక్కీ భాస్కర్ నా ఆల్ టైం ఫేవరెట్
తెలంగాణ హైకోర్టుకు చిరంజీవి, ప్రభాస్
ఘనంగా AR రెహమాన్ బర్త్ డే సెలబ్రేషన్స్
70 ఏళ్ల వయసులో షేక్ చేసిన చిరు
ట్రైలర్ చూసి రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..
2026..! రచ్చ లేపే సినిమాలు ఇవే..!
సంక్రాంతికి శివాజీ 2 వచ్చేస్తున్నాడు..!
డిసెంబర్ లో రిలీజ్ అయితే..! పాన్ ఇండియా బ్లాక్ బస్టరే
కొత్త సంవత్సరంలో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన షణ్ముఖ్
