Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Telangana government rejected ticket price hike for The Raja Saab Movie1
ది రాజాసాబ్‌ మేకర్స్‌కు బిగ్ షాక్..!

ది రాజాసాబ్‌ మూవీ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సాధారణ ధరలకే తెలంగాణలో ది రాజాసాబ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నిర్ణయంతో ది రాజాసాబ్ నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. కాగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కించిన హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రిద్ధికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.

Prabhas Fans Halchal at Vimal Theatre In hyderabad2
ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత..!

ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. విమల్ థియేటర్‌లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. తెలంగాణలో ప్రీమియర్ షోస్‌కు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా కోసం విమల్‌ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఫ్యాన్స్‌ అక్కడికి చేరుకున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్‌లోకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ప్రెస్‌ షోను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనతో విమల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈనెల 8న ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. కానీ ఏపీలో ఇప్పటికే ‍ప్రీమియర్‌ షోలు పడగా.. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో కేవలం మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.విమల్ థియేటర్ లోకి దూసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ తెలంగాణ లో ప్రీమియర్ షోస్ లేకపోయినా... థియేటర్ కి వచ్చిన అభిమానులుమీడియా కోసం విమల్ లో ప్రత్యేక షో ఏర్పాటుఅభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం తో మీడియా షో తాత్కాలికంగా నిలిపివేత#TheRajasaaab #Prabhas #RajaSaab pic.twitter.com/9Eg9nu8BLF— Anji Shette (@AnjiShette) January 8, 2026

Prabhas The Raja Saab Twitter Review In telugu3
ది రాజాసాబ్‌ ట్విటర్‌ రివ్యూ.. ఫుల్‌ జోష్‌లో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌..!

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ది రాజాసాబ్ వచ్చేశాడు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌ ప్రీమియర్స్‌తో ఫ్యాన్స్‌ ముందుకొచ్చేశాడు. ఏపీలో ది రాజాసాబ్ ప్రీమియర్స్‌తో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఈ మూవీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజయ్‌ దత్ ఎంట్రీ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్‌ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.హీరోయిన్ రిద్ది కుమార్‌ దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తుందని.. నిధి అగర్వాల్ మొదటి 30 నిమిషాల తర్వాతే ఎంట్రీ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి లుక్, నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఎంట్రీ ఆలస్యమైనా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఫస్ట్‌ హాఫ్‌లో చివరి 30 నిమిషాల్లో కనిపించిన మాళవిక ఫైట్ సీన్‌లో అదరగొట్టేసిందని అంటున్నారు. #TheRajaSaab – First Half Review— STORY – #RajaSaab is about the hero’s journey in search of his grandfather.— #Prabhas’ performance is good. Each reaction he gives works well.Prabhas’ intro scene is superb.— #RiddhiKumar appears for about 5 minutes so far. Her look is… pic.twitter.com/Mj8iHpZbc9— Movie Tamil (@_MovieTamil) January 8, 2026 Musk changed like ❤️ button to celebrate 🔥🔥🔥 the release of #TheRajaasaab #TheRajaSaab #Prabhas𓃵 @prabhas pic.twitter.com/OmVMnJVyWS— R A J (@dune1411) January 8, 2026

Sankranti Box Office Waiting for a surprise hit of Telugu Cinema4
సంక్రాంతి బాక్సాఫీస్: సర్‌ప్రైజ్ హిట్ కోసం ఎదురుచూపులు

సంక్రాంతి పండగ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఉత్సాహం. అందుకే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో దర్శక, నిర్మాతలు పండగకి వారి సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడతారు. గతంలో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, హనుమాన్ వంటి సినిమాలు తక్కువ అంచనాలతో వచ్చి భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఈ ఏడాది కూడా అలాంటి సర్‌ప్రైజ్ హిట్ ఏదైనా వస్తుందా అనే ఆసక్తి పెరిగింది. రాజాసాబ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో థియేటర్లలోకి వచ్చి మంచి హైప్ సృష్టిస్తోంది. మన శంకరవరప్రసాద్ భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న మరో పెద్ద సినిమా. అనగనగా ఒక రాజు మోస్తరు అంచనాలతో వస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి తక్కువ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలు. శర్వానంద్ కెరీర్‌లో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా మాత్రమే కాదు, ఒకే ఒక జీవితం కూడా సైలెంట్‌గా వచ్చి విజయాన్ని సాధించింది. అందుకే నారీ నారీ నడుమ మురారి సినిమాను తక్కువ అంచనా వేయడం సరికాదు. రవితేజ వరుస ఫ్లాపుల కారణంగా ఈసారి అంచనాలు తగ్గాయి. అయినప్పటికీ సంక్రాంతి బరిలో ఆయన సినిమా ఏదైనా మేజిక్ చేస్తుందేమో అనే ఆసక్తి ఉంది. ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు, మూడు మిడ్ రేంజ్ సినిమాలు కలిపి బాక్సాఫీస్‌ను రంజుగా మార్చాయి. రాజాసాబ్‌తో సంక్రాంతి సినిమా పండగ మొదలైంది. ఇంకో వారం రోజుల్లో ఎవరు నిజమైన సంక్రాంతి హీరో అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మొత్తానికి 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేసు ప్రేక్షకులకు భలే ఆసక్తికరంగా మారింది. ఒక వైపు పెద్ద సినిమాలు తమ స్థాయిలో పోటీ పడుతుంటే, మరోవైపు చిన్న సినిమాలు సర్‌ప్రైజ్ హిట్ ఇవ్వగలవా అనే ఉత్కంఠను ప్రేక్షకులకు రేపాయి.

Telangana Govt No Benefit Shows And Ticket Price For The Raja saab5
తెలంగాణలో 'ది రాజాసాబ్‌' ఫ్యాన్స్‌కు నిరాశ..

తెలంగాణలో 'ది రాజా సాబ్‌' అభిమానులకు నిరాశ ఎదురైంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్‌ షోలు ఉంటాయని ఎదురుచూసిన ఫ్యాన్స్‌ బాధతో థియేటర్స్‌ నుంచి వెనుతిరుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో షో పడింది. అందుకు సంబంధించిన విజువల్స్‌ కూడా నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని ప్రభాస్‌ అభిమానులు భగ్గుమంటున్నారు.'ది రాజా సాబ్‌' సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే టికెట్‌ ధరల పెంపునకు ఛాన్స్‌ ఇచ్చారు. కానీ, తెలంగాణలో టికెట్ ధరలు, షోల అనుమతిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ బుక్ మై షోలో బుకింగ్ మొదలు కాలేదు. కొన్ని గంటల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా టికెట్ల విక్రయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాస్‌ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ప్రతి సినిమాకు ఇలాగే చివరివరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అంటున్నారు.కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?టికెట్‌ ధరల పెంపు కోసం ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రబాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టులో వారికి భారీ ఊరట లభించింది. టికెట్‌ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Gurram Paapi Reddy Movie ott Streaming Details6
ఓటీటీలో 'ఫరియా' డార్క్‌ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్‌ ప్రకటన

గుర్రం పాపిరెడ్డి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. డార్క్‌ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 19న విడుదల అయింది. అయితే, సినిమా ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్‌ అయిపోయింది.గుర్రం పాపిరెడ్డి(Gurram Paapi Reddy ) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16న జీ5(Zee5) వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించారు. తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మురళీ మనోహర్‌ ఈ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో బ్రహ్మానందం జడ్జ్‌ పాత్రలో ఫుల్‌‌ లెంగ్త్‌ రోల్‌ నటించారు.గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్‌ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్‌ దోపిడీకి పాల్పడతాడు. ‍అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్‌ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.

Bronze statue of Superstar krishna unveiled at Vijayawada Lenin Center7
విజయవాడ సెంటర్‌లో 'కృష్ణ' విగ్రహావిష్కరణ

సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్నారు. విజయవాడతో ఘట్టమనేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కడ అయనకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. జనవరి 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ మనవుడు 'జై కృష్ణ' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.అగ్ని పర్వతం సినిమా విడుదలై 45 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఆదిశేషగిరిరావు తెలిపారు. ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారని చెప్పారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా మే31వ తేదీన సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మహేష్ బాబు, కృష్ణ లాగా తను కూడా అభిమానులను సంపాదించుకుంటారని ఆయన అన్నారు. విజయవాడ సినిమా థియేటర్స్‌ యజమానులతో పాటు నగర ప్రజలతో కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు.సినిమా టికెట్‌ ధరలపై సూచనటాలీవుడ్‌లో సినిమా టికెట్‌ ధరల పెంపు అనేది ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈ అంశంపై తాజాగా ఆదిశేషగిరిరావు స్పందించారు. నిర్మాతలతో పాటు ప్రేక్షకుల కోణంలో ఆయన మాట్లాడారు. ఒక సినిమాకు బడ్జెట్‌ పెరిగిందనే సాకు చూపించి టికెట్‌ ధరలు పెంచాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్‌ పద్ధతి కాదని అయన అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలకు టికెట్‌ ధరలు పెంచడంతో చిన్న సినిమాలు భారీగా దెబ్బతింటున్నాయన్నారు. ఆపై టికెట్‌ ధరల వల్ల సామాన్య ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెద్ద సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు టికెట్‌ భారీ ధరలు ఉంటాయని, ఆ మూడు రోజుల అయిపోగానే ఎటూ రేట్లు తగ్గుతాయన్నారు. టికెట్‌ ధరలు అందుబాటులోకి థియేటర్‌కు వెళ్లాలని ప్రేక్షకులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలని ఆదిశేషగిరిరావు తెలిపారు.

Viral Hub Youtuber Satyamurthy Arrested By Hyderabad police8
మైనర్లతో చెత్త వీడియోలు.. ప్రముఖ యూట్యూబర్‌ అరెస్ట్‌

మైనర్లతో ఇంటర్వ్యూలు చేసిన ఏపీ యూట్యూబర్‌ కంబేటి సత్యమూర్తిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 'వైరల్ హబ్ 007' పేరుతో ఉన్న యూట్యూబ్‌ ఛానల్‌లో చాలారోజులుగా ఆయన పలు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అయితే, అందులో మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 అక్టోబరు 16న తన ఛానల్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం అయినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. దీంతో వారు సుమోటోగా కేసు నమోదు చేశారు.ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్తి రన్‌ చేస్తున్న సదరు యూట్యూబ్‌ ఛానల్‌లో ఎక్కువగా అసభ్యకరమైన రీతులోనే ఇంటర్వ్యూలలో ప్రశ్నలు ఉంటాయని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 15 నుంచి 17ఏళ్ల బాలబాలికలను అసభ్య ప్రశ్నలు అడుగుతూ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇదంతా తన ఛానల్‌లో వ్యూస్ పెంచుకోవడానికి ఆయన ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక ఇంటర్వ్యూలో బాలుడిని ముద్దు పెట్టుకునేలా బాలికను ప్రేరేపించడంతో నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఘటనను హైదరాబాద్‌ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఇతడు బాలల రక్షణ చట్టాలతో పాటు సైబర్‌ చట్టాన్ని కూడా ఉల్లంఘించాడని పోలీసులు తెలిపారు. సైబర్‌ ఏసీపీ శివమారుతి టీమ్‌, ఎస్‌ఐ సురేశ్‌తో కలిసి నిందితుడు సత్యమూర్తిని వైజాగ్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. డిజిటల్ ఎవిడెన్స్‌తో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో, ఐటీ చట్టాల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Deccan Chronicle (@deccanchronicle_official)

Thanuja And Kalyan Padala Again Meet After Biggboss99
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్‌'.. వీడియో వైరల్‌

బిగ్‌బాస్‌ తెలుగు 9 విన్నర్‌ కల్యాణ్‌ పడాల, రన్నర్‌ తనూజ మరోసారి ఒక వేదికపై కలిశారు. ఈ సీజన్‌లో వీరిద్దరి ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.. హౌస్‌లో వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ ఇరువురి అభిమానులు మాత్రం బూతులతో రెచ్చిపోయారు. అయితే, ఈ సీజన్‌ ముగిసిన తర్వాత తనూజ ఎలాంటి ఈవెంట్‌లో కనిపించలేదు. తొలిసారిగా స్టార్‌మా కోసం 'మా సంక్రాంతి వేడుక' కార్యక్రమంలో పాల్గొంది. వీరద్దరూ కలిసి 'ఛాంపియన్‌' సినిమాలోని 'గిర గిర గింగిరాగిరే' అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమం జనవరి 14న మధ్యాహ్నం 12కు ప్రసారం కానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రోమోను వదిలారు. దీంతో నెట్టింట వారిద్దరూ వైరల్‌ అవుతున్నారు.

Chiranjeevi hook step: : Why hook steps Are Dominating Social Media10
చిరంజీవి హుక్‌ స్టెప్, బాలీవుడ్‌లోనూ టాప్‌!

ఇప్పుడు తెలుగు ప్రేక్షక సమూహం హుషారుగా హుక్‌ స్టెప్పులేస్తోంది. మెగా నృత్యాల హోరును అనుసరిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు గా తమని పలకరించేందుకు హుక్‌ స్టెప్పులు వేసుకుంటూ వస్తుండడంతో తెలుగు నాట హుక్‌ స్టెప్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది. మరి ఇంతకీ ఈ హుక్‌ స్టెప్‌ ఏమిటి? దీనికి మన దేశంలో పాప్యులారిటీ ఎలా పెరిగింది?‘హుక్‌ స్టెప్‌ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే ఓ నృత్యం.. సులభంగా కనిపించాలి. అందరూ నేర్చుకునేలా ప్రేరేపించాలి ‘ అని బాలీవుడ్‌లో తౌబా తౌబా అనే పాటకు నృత్యంతో వైరల్‌ అయి సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌ చెబుతున్నాడు. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ నర్తించిన బ్యాడ్‌ న్యూజ్‌లోని తౌబా తౌబా పాట స్టెప్స్‌ ‘ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేస్తారు. ఆ పాట హిట్‌తో‘ హుక్‌ స్టెప్‌ను కొరియోగ్రాఫ్‌ చేయడం ఇప్పుడు తన నృత్య ప్రక్రియలో ఒక భాగమైందని ఆయన చెప్పాడు.పెరిగిన కొరియోగ్రాఫర్‌ ప్రాధాన్యత...‘హుక్‌ స్టెప్‌ కు పెరుగుతున్న ప్రజాదరణ కొరియోగ్రాఫర్‌లను మరింత పాప్యులర్‌ చేసింది. హుక్‌ స్టెప్‌ గొప్పతనం ఏమిటంటే దాని చుట్టూ అల్లుకునే సందడిలో స్టార్‌ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్‌ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తారని అది తమకు చాలా ఉపయుక్తమైన అంశమని కొరియోగ్రాఫర్లు అంటున్నారు. నృత్యం అత్యంత ప్రజాదరణ పొందాడానికి దోహదపడేది సౌలభ్యం మాత్రమే ‘ప్రతి వ్యక్తి పుట్టుకతోనే డ్యాన్సర్‌ కాదు. మైఖేల్‌ జాక్సన్‌ లేదా ప్రభుదేవా లాగా అందరూ నృత్యం చేయలేరు. అవి ప్రజలు చూసి బాగున్నాయంటారు. కానీ అవి సులభమైనవైతే అవి మరింత హిట్‌ కావడం తధ్యం ఎందుకంటే వాటిని అనుసరించడం సులభం అని వారు భావిస్తారు అలాంటివే ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి‘‘ నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు, ప్రభుదేవా లాంటి డ్యాన్స్‌లు అందివ్వాలని అనుకున్నా కానీ ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా మారాయని బోస్కో చెప్పాడు. ‘నువ్వు ఎందుకు అంత కష్టతరమైన పని చేయమని చెబుతున్నావు? దానికన్నా సులభమైన స్టెప్పులు ఎందుకు చేయించకూడదు‘ అని చాలా మంది తనతో అన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.హుక్‌...హిస్టరీ...దీని గురించి బాలీవుడ్‌ మరో కొరియోగ్రాఫర్‌ ముదస్సర్‌ ఖాన్‌ మాట్లాడుతూ, హుక్‌ స్టెప్పు ప్రజాదరణ ‘సల్మాన్‌ ఖాన్, గోవింద మాధురీ దీక్షిత్‌ వంటి నటులతో ప్రారంభమైందన్నాడు. వారికి వారికంటూ స్వంత ప్రత్యేకమైన నృత్య శైలులు ఉన్నాయి‘ అని చెప్పారు. వారి నృత్యాలు పాప్యులర్‌ అవడానికి కారణం గుర్తించిన దగ్గర నుంచీ తాను తన కొరియోగ్రఫీ వర్క్‌లో హుక్‌ స్టెప్పును కూడా చేర్చుకున్నానని ఖాన్‌ చెప్పాడు.‘నేను సల్మాన్‌ ఖాన్‌కు మొదటిసారి కొరియోగ్రఫీ సీక్వెన్స్‌ చూపించడానికి వెళ్ళినప్పుడు, ఆయన కష్టమైన నృత్యాలను ఇష్టపడతాడని అనుకున్నాను. కానీ ఆయనకు హుక్‌ స్టెప్పు అన్నింటికంటే నచ్చింది.‘ అంటూ గుర్తు చేసుకున్నారాయన. ఒక సన్నివేశాన్ని కొరియోగ్రఫీ చేయడంతో పాటు వైరల్‌గా మార్చడం కూడా ఇప్పుడు తమ పనిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ఖాన్‌ అన్నారు. హుక్‌ స్టెప్‌ను రూపొందించడానికి ఏదైనా ఫార్ములా ఉందా అని అడిగితే.... ‘‘ తల గోకడం నుంచీ షూలేసులు కట్టుకోవడం దాకా బెల్ట్‌ బిగించడం నుంచి కర్టెన్లు సరిచేయడం దాకా...ప్రజలు తమ దైనందిన జీవితంలో చేసే రొటీన్‌ పనులనే సంగీతంతో కూడిన నృత్యంగా మార్చగలిగితే అదే హుక్‌ స్టెప్‌’’ అన్నారాయన. ‘‘సంగీతం కూడా హుక్‌ స్టెప్‌ కు థీటుగా ఆకర్షణీయంగా ఉండాలి. సంగీతం యావరేజ్‌గా ఉంటే, ఎంత మంచి హుక్‌ స్టెప్‌ వేసినా, అది ఆకర్షణీయంగా మారదు. సంగీతం కొరియోగ్రఫీతో కలిసిపోవడం వల్లనే హుక్‌ స్టెప్‌ ప్రజాదరణ పొందుతుంది అని అభిప్రాయపడ్డారు.హుక్‌ స్టెప్‌లు దశాబ్దాల క్రితమే ప్రాచుర్యం పొందినప్పటికీ, ఇప్పుడు వాటి శైలి, అవసరం చాలా మారిపోయిందని కొరియోగ్రాఫర్‌ పునీత్‌ జె పాఠక్‌ చెప్పారు. ‘‘గతంలో పెద్దా చిన్నా తేడా లేకుండా వేడుకలలో నృత్యం చేయగలిగే లాంటి హుక్‌ స్టెప్‌ను తయారు చేయండి’ అని అడిగేవారు అయితే ఇప్పుడు ఇన్‌ స్ట్రాగామ్‌లో, రీల్స్‌లో ఉంచే హుక్‌ స్టెప్‌ను తయారు చేసి దానిని వైరల్‌ చేయడం ముఖ్యంగా మారిందని అన్నారాయన. గతంలో ఇది ప్రేక్షకుల ఇళ్లకు చేరుకోవడం గురించిన ఆలోచన ఉండేది అయితే ఇప్పుడు వారి ఫోన్‌లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటూ పేర్కొన్నారు.అయితే రీల్స్‌ ఆధారిత హుక్‌ స్టెప్స్‌ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ల వైరల్‌లో ఉన్న సమస్య వైరల్‌ అనేది స్వల్ప కాలానికే పరిమితం కావడం అని పాథక్‌ అన్నారు. ‘గతంలో ’తౌబా తౌబా’ వైరల్‌ అయింది. దానికి వారం క్రితం ఇంకేదో వైరలైంది. అయితే స్టెప్స్‌ వైరల్‌ అవుతున్నాయి కానీ ఐకానిక్‌గా ఉండడం లేదు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.‘హుక్‌ స్టెప్‌ సవాళ్లలో పాల్గొనడానికి ఇష్టపడతాను అవి సరదాగా ఉంటాయి, అవి నా ప్రేక్షకులతో కనెక్ట్‌ అవ్వడానికి నాకు సహాయపడతాయి నా డ్యాన్స్‌ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తాయి. ‘అంతేకాకుండా, అవి నాకు ట్రెండ్స్‌ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, తాజా సోషల్‌ మీడియా సందడిలో నన్ను భాగంగా మారుస్తాయి’’ అని కంటెంట్‌ క్రియేటర్‌ వృషికా మెహతా చెప్పింది. ఒక ఇన్‌ ఫ్లుయెన్సర్‌గా, తాను ఈ హుక్‌ స్టెప్‌లను ప్రదర్శించడం ద్వారా సినిమాలను ప్రమోట్‌ చేస్తాననీ వాటిని నా ప్రేక్షకులతో పంచుకుని వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహిస్తానని ఆమె వివరించింది.ఇటీవలి కాలంలో కొన్ని హుక్‌ హిట్స్‌...ఈ మధ్య కాలంలో వైరల్‌ అయిన హుక్‌ స్టెప్స్‌లో జాదు‘ (జ్యుయల్‌ థీఫ్‌) పాటలో జైదీప్‌ అహ్లావత్‌ చేసిన నృత్యం, అలాగే ‘తౌబా తౌబా‘ (బాడ్‌ న్యూజ్‌): విక్కీ కౌశల్‌ మూవ్‌ మెంట్స్‌ , ‘జనాబ్‌–ఎ–ఆలీ‘ (వార్‌ 2) చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో హృతిక్‌ రోషన్‌ వేసిన స్టెప్పులు అత్యంత ప్రజాదరణ పొందాయి. అలాగే ‘పెహ్లా తు దుజా తు‘ ( సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2) పాటలో అజయ్‌ దేవగన్‌ స్టైల్‌ వైరల్‌ కాగా,‘ఝూమ్‌ షరాబీ‘ (దే దే ప్యార్‌ దే 2)లో కూడా అజయ్‌ దేవగన్‌ మళ్లీ గ్లాస్‌తో వైరల్‌ స్టెప్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో ‘హుక్‌ స్టెప్‌‘ (మన శంకర వరప్రసాద్‌ గారు): చిరంజీవి స్టెప్స్‌ తోడయ్యాయి.

Advertisement
Advertisement