Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood Hero Vishwak Sen Comments about Tharun Bhascker1
ఎవరో కూడా తెలియని టైమ్‌లో నా కోసం నిలబడ్డాడు: విశ్వక్ సేన్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. నేను ఎవరో కూడా తెలియని సమయంలో తరుణ్ నా కోసం నిలబడ్డాడని కొనియాడారు. తరుణ్ భాస్కర్ నటించిన ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఈ కామెంట్స్ చేశారు.తరుణ్ నాకు పరిచయం లేకపోయినా కూడా నాకోసం నిలబడ్డారని విశ్వక్ సేన్ అన్నారు. నాకు ఫోన్‌ చేయగానే ఈవెంట్‌కు వచ్చానని తెలిపారు. ఈరోజు నన్ను గెస్ట్‌ అని అంటున్నారని.. ఎందుకంటే ఇది నా కుటుంబ ఫంక్షన్‌ అని అన్నారు. కాగా.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. మలయాళంలో తెరకెక్కించిన జయ జయ జయహే మూవీకి రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

Chhaava To Border 2 Movie, Patriotic Movies Shakes Of Bollywood Box Office2
దేశభక్తి టచ్ చేస్తే చాలు.. కాసుల పంట పండాల్సిందే!

బాలీవుడ్ ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'నేషనలిజం' ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వెండితెరపై త్రివర్ణ పతాకం కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. 'ఉరి', 'గదర్ 2' నుంచి మొదలైన ఈ ఊపు, ఇప్పుడు 'ధురంధర్', 'బోర్డర్ 2' వరకు కొనసాగుతోంది. సామాన్యుడిలో ఉండే దేశభక్తిని భావోద్వేగంతో కలిపి వెండితెరపై చూపించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన దేశభక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.450 కోట్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక వీరగాథలకు దేశభక్తి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది.రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక స్పై థ్రిల్లర్‌గా వచ్చి, దేశభక్తిని అద్భుతంగా పండించిన ఈ చిత్రం కేవలం ఏడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,285 కోట్లకు పైగా వసూలు చేసి 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది.ఇక గతవారం (జనవరి 23) రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' ప్రస్తుతం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. 1971 ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్కును చేరుకుంది. నిన్న ఒక్క రోజులోనే ఇండియాలో ఈ చిత్రం రూ.59 కోట్లు రాబట్టిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇలానే కొనసాగితే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. .సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రానికి అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. 1971 ఇండో - పాక్‌ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్‌(1997) చిత్రానికి సీక్వెల్‌ ఇది.

Musician Sri Oruganti Anand Mohan has passed away3
సంగీత విద్వాంసుడు శ్రీ ఓరుగంటి ఆనంద్ మోహన్ కన్నుమూత

ప్రముఖ సంగీతజ్ఞులు, 'సంగీత క్షీరసాగరం' వ్యవస్థాపకులు విద్వాన్ శ్రీ ఓరుగంటి ఆనంద్ మోహన్ (90) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు సంతానం ఉన్నారు. సంగీతమే శ్వాసగా..1956 నుంచి 1977 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో లలిత సంగీత కళాకారుడిగా సేవలందించిన ఆనంద్ మోహన్.. వృత్తిరీత్యా ఢిల్లీలోని కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ కార్యాలయం లోనూ కాగ్ (CAG) కార్యాలయంలో పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని సంగీతానికే అంకితం చేశారు. తన గురువు ఉప్పలపాటి అంకయ్య స్మరణార్థం 2002లో 'సంగీత క్షీరసాగరం' సభను స్థాపించి, సప్తపర్ణి సహకారంతో ఇప్పటివరకు 699 కచేరీలను నిర్వహించారు. ఎవరి వద్ద ధనసహాయం ఆశించకుండా తన పెన్షన్ డబ్బులే ఖర్చు చేస్తూ నిస్వార్థంగా ఈ కచేరీలు నిర్వహించడం విశేషం.అందుకున్న పురస్కారాలు..శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన కృషికి గాను 2012లో కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా గౌరవం పొందారు. 2013లో చెన్నైలో జ్ఞాన సరస్వతీ పీఠ పురస్కారాన్ని అందుకున్నారు. 1966-67 మధ్య కాలంలో శ్రీ త్యాగరాయ గాన సభ వ్యవస్థాపక కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. యువ కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆయన మృతి పట్ల పలువురు సంగీత విద్వాంసులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

Meenakshi Chaudhary And Tamannaah Movie news4
మీనాక్షి కొంటె చూపు.. తమన్నా ఊహించని లుక్!

కొంటె చూపులతో ఫన్నీ పోజులిచ్చిన మీనాక్షి చౌదరిజ్యూవెలరీతో హీరోయిన్ తమన్నా ఊహించని లుక్స్జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న హాట్ బ్యూటీ కేతిక శర్మఎయిర్‌పోర్ట్‌లో అనన్య నాగళ్ల సందడే సందడిడ్యాన్స్ అదరగొట్టిన 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్విబాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రుహానీ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

Bhartha Mahasayulaku Wignyapthi Vaammo Vaayyo Full Video song release5
'వామ్మో.. వాయ్యో..' ఫుల్ వీడియో సాంగ్‌ చూసేయండి

రవితేజ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో ఓ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వామ్మో వాయ్యో అనే పాట అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ మహారాజా ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి.

Bha Bha Ba Movie OTT Telugu Streaming Details6
మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ

రీసెంట్ టైంలో ఓటీటీ సంస్థలు.. ఏ భాషా చిత్రాలకైనా తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా భాషల్లో హిట్ అయిన మూవీస్‪‌కి తెలుగు వెర్షన్ అందుబాటులోకి తెస్తున్నాయి. రీసెంట్‌గా 'సిరై' అనే తమిళ చిత్రానికి ఇలానే చేశారు. ఇప్పుడు మలయాళంలో బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న ఓ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన దాదాపు 10 రోజులకు తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)మలయాళంలో ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా చెలామణీ అయిన దిలీప్.. 2017లో హీరోయిన్ భావనపై అత్యాచారం చేయించాడనే ఆరోపణలతో మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటన తర్వాత నుంచి దిలీప్ పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. గత నెల అంటే 2025 డిసెంబరులో ఈ కేసు నుంచి దిలీప్‌కి పూర్తిగా రిలీఫ్ దక్కింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి దిలీప్ పేరు తొలగించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే దిలీప్ కొత్త మూవీ 'భా భా భా' థియేటర్లలోకి వచ్చింది.కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించాడు. డిసెంబరు 18న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి టాక్ పాజిటివ్‌గానే వచ్చింది. ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కొన్నిరోజుల క్రితం ఈ చిత్రం జీ5 ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు మలయాళం మాత్రమే రాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

Anaganaga Oka Raju Movie Bhimavaram Balma Video Song7
డ్యాన్స్ అదరగొట్టిన మీనాక్షి.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' కూడా ఒకటి. నవీన్ పొలిశెట్టి.. చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన మూవీ ఇది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‪‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇకపోతే ఇందులో ఇద్దరూ కలిసి భీమవరం బల్మా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ పాట పూర్తి వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మీనాక్షి డ్యాన్స్ అదరగొట్టేసింది.ఈసారి పండగకు రిలీజైన వాటిలో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' లీడ్ తీసుకోగా.. నవీన్ పొలిశెట్టి సినిమా కూడా ఉ‍న్నంతలో బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. కథ పరంగా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కామెడీ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు బాగానే చూశారు. నిర్మాణ సంస్థ అయితే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించారు. రిలీజై దాదాపు రెండు వారాలుపైనే అయిపోయింది. అయినా సరే హీరో నవీన్ పొలిశెట్టి.. అమెరికా వెళ్లి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నాడు.

CAT First Look Launched By Buchibabu Sana8
CAT కథ వినూత్నంగా అనిపించింది: పెద్ది డైరెక్టర్‌ బుచ్చిబాబు

జీవీ నాయుడు, వీజే బాలు, లావణ్య, కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాట్‌’(CAT). వీఆర్‌జీఆర్‌ మూవీస్ బ్యానర్ పై వై. గంగాధర్ ఐపీఎస్‌ సమర్పణలో, రజని గొంగటి నిర్మించిన ఈ చిత్రానికి జీవీ నాయుడు దర్శకత్వం వహించారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. దర్శకుడు కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, క్యాట్‌ స్టోరీ కూడా నాకు చెప్పాడు.ఈ కథ వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికి పేరు తీసుకురావాలని, త్వరలొ విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’అన్నారు. డ్రామా, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి రాజా సంగీతం అందించగా, పంకజ్‌ తొట్టాడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Balakrishna stunt video goes viral In social Media9
ఆ హీరోలా స్టంట్ చేయబోయి.. నవ్వుల పాలైన బాలయ్య.. వీడియో వైరల్

నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తుంటారు. అంతేకాకుండా తన కోపంతో అభిమానులపై చేయి కూడా చేసుకుంటారు. ‍అలా చాలాసార్లు వేదికలపై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా సినిమాల్లో లాగా ఓ స్టంట్ చేయబోయి నవ్వుల పాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంతమ స్టైల్లో అద్దాలను గాల్లోకి ఎగరేశాడు బాలయ్య. కానీ అది వర్కవుట్ కాలేదు. అద్దాలు కాస్తా కింద పడిపోవడంతో వెంటనే తీసుకుని జేబులో వేసుకోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారుఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే గతేడాది అఖండ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. పాపం బాలయ్య..!మరో స్టంట్ చేయబోయి.. అవమానంపాలైన నటుడు రజినీకాంత్ స్టైల్ లో అద్దాలను గాల్లో ఎగరేసి, జేబులో వేసుకోవడానికి ప్రయత్నం కానీ, అది కిందపడిపోవడంతో దిక్కులు చూస్తూ మౌనం pic.twitter.com/NdITjxsFay— PulseNewsBreaking (@pulsenewsbreak) January 27, 2026

Director Tharun Bhascker Responds On Rumours with Eesha Rebba10
హీరోయిన్‌ ఈషాతో రూమర్స్..‍ తరుణ్ భాస్కర్‌ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌ ప్రస్తుతం హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. ఈ సినిమాలో హీరోయిన్‌గా‌ ఈషా రెబ్బా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా..తరుణ్ సైతం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరయ్యారు తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషాతో రిలేషన్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. మీపై వస్తున్న రూమర్స్‌పై ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. తాను ఒక ఫ్రెండ్‌ కంటే ఎక్కువని తెలిపారు. ఇది నా పర్సనల్‌ కాబట్టి.. టైమ్ వచ్చినప్పుడు అన్ని చెప్తా అన్నారు. నేను ఏదైనా చెప్తే.. దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడడం తనకు ఇష్టం లేదన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే గుడ్‌ న్యూస్ చెప్తానని తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఇది మలయాళ మూవీ జయ జయ జయహేకి రీమేక్‌గా తెరకెక్కించారు.(ఇది చదవండి: తరుణ్‌తో డేటింగ్‌? తొలిసారి స్పందించిన హీరోయిన్‌)తర్వాత చెప్తా: ఈషా రెబ్బాఇటీవల సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన ఈషా రెబ్బాకు సైతం తరుణ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. తెరపై జంటగా నటించిన తరుణ్‌- ఈషా.. రియల్‌ లైఫ్‌లోనూ జోడీయేనా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. 'ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉంటే నేనే అందరికీ చెప్తాను' అని బదులిచ్చింది. వీరిద్దరి రిలేషన్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisement
Advertisement