Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Namitha Wants to do Powerful Role like Neelambari Movie1
గ్లామర్‌కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా చేయాలనుంది!

సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్‌ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.గతంలో తప్పులుతాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్‌ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్‌ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్‌ఫుల్‌ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.అలాంటి పాత్రలు చేయాలనుందిఉదాహరణకు రజనీకాంత్‌ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్‌, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!

Bigg Boss Agnipariksha 2 Getting Massive Hype Before Start2
బిగ్‌బాస్‌ ప్లాన్‌ సక్సెస్‌.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్‌!

బిగ్‌బాస్‌ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్‌ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.అగ్నిపరీక్షఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్‌ చేసి బిగ్‌బాస్‌ టీమ్‌కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్‌ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, ఎగ్జామ్‌ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.అలాంటివారికి నో ఛాన్స్‌వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్‌, బిందుమాధవి, అభిజిత్‌కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్‌ చేసింది. బిగ్‌బాస్‌కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.తొలిసారి ఏడుగురు కామనర్స్‌మిగతావారి టాలెంట్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, నాలెడ్జ్‌.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్‌ ఫైనల్‌ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్‌, పవన్‌, మనీష్‌, హరీశ్‌. వీరిలో కల్యాణ్‌ ఏకంగా టైటిల్‌ విన్నర్‌ కాగా పవన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. సామాన్యుడి చేతికి ట్రోఫీసామాన్యుడు బిగ్‌బాస్‌కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్‌ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్‌ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్‌ సీజన్‌పై పెద్దగా బజ్‌ లేదు. ఇప్పుడు కల్యాణ్‌ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్‌పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. బిగ్‌బాస్‌ ప్లాన్‌ సక్సెస్‌ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్‌ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్‌లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్‌ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్‌ 2026 సెకండాఫ్‌లో ప్రారంభం కానుంది.చదవండి: వినాయకన్‌కు తీవ్ర గాయం.. కాస్త లేట్‌ అయ్యుంటే పక్షవాతం!

Tollywood actresses Social media updates goes viral3
ప్రియా ప్రకాశ్ క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్.. మీరా జాస్మీన్ ఫెస్టివ్ వైబ్స్..!

క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌లో ప్రియా ప్రకాశ్..ఉదయ్‌పూర్ కోటలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్..హీరోయిన్ మెహరీన్ క్రిస్‌మస్ లుక్స్..క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ నటి రవీనా టాండన్..ఫెస్టివల్‌ వైబ్స్‌లో హీరోయిన్ మీరా జాస్మిన్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13)

Tollywood Movie Madham sensor report4
బిగ్‌బాస్ ఇనయా సుల్తానా థ్రిల్లర్‌ మూవీ.. సెన్సార్ పూర్తి..!

హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. ఈ చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. ఈ సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్‌జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్‌కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది.

Venkatesh and Aarthi Agarwal Nuvvu Naaku Nachav 4K Trailer 5
వెంకటేశ్- ఆర్తి ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

వెంకటేశ్‌, ఆర్తి అగర్వాల్‌ హీరో, హీరోయిన్లుగా బ్లాక్‌ బస్టర్‌ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రానికి కె విజయభాస్కర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ కథ, డైలాగ్స్‌ అందించగా.. స్రవంతి రవికిశోర్‌ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్‌ 6న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్‌తో ప్రపంచవ్యాప్తగా రీ రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 4కె వర్షన్‌లో రిలీజైన ట్రైలర్ వెంకీ మామ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రమని నిర్మాత రవికిశోర్‌ అన్నారు. నువ్వు నాకు నచ్చావ్‌. ఇది కేవలం రీ రిలీజ్‌ మాత్రమే కాదని.. నూతన సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అన్నారు.

Vinayakan Discharged from Hospital, Says His Neck Nerve Injured6
'కాస్త లేట్‌ అయ్యుంటే నా శరీరం చచ్చుబడిపోయేది'

మలయాళ నటుడు, జైలర్‌ విలన్‌ వినాయకన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. ఆడు 3 సినిమా కోసం కేరళలోని తిరువనంతపురంలో యాక్షన్‌ సన్నివేశాల షూటింగ్‌ చేస్తుండగా వినాయకన్‌ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన శనివారంనాడు కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా డిశ్చార్జ్‌ అయ్యాడు. తప్పిన ప్రమాదంఈ సందర్భంగా వినాయకన్‌ మాట్లాడుతూ.. నా మెడ నరానికి దెబ్బ తగిలింది. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నరాల డ్యామేజ్‌ను ముందుగానే గుర్తించకపోయుంటే నా శరీరం చచ్చుబడిపోయేది అన్నాడు. డాక్టర్లు ఆయన్ను కనీసం ఆరువారాలపాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఆడు 3 సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.ఆడు 3 మూవీఆడు సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగమే ఆడు 3. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వినాయకన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిధున్‌ మాన్యుల్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026లో మార్చి 19న రిలీజ్‌ చేయనున్నారు. వినాయకన్‌ విషయానికి వస్తే.. ఇతడు 1995లో వచ్చిన మాంత్రికం చిత్రంతో తన యాక్టింగ్‌ జర్నీ ప్రారంభించాడు. సినిమా'కమ్మట్టి పాదం' మూవీలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర అవార్డును గెల్చుకున్నారు. మలయాళంతోపాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆయనకు రజనీకాంత్‌ జైలర్‌ ఊహించని స్థాయి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. కేరళ పోలీస్‌స్టేషన్‌లో, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన గొడవతో.. అలాగే ఓ హోటల్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి వార్తల్లోకెక్కాడు.చదవండి: అమ్మ బిల్డింగ్‌పై నుంచి దూకుతానంది: ఏడ్చేసిన నందు

Tollywood actor VK Naresh Struggles at Indigo Airlines in airport7
సంతలో పశువులు అనుకున్నారా?.. ఇండిగో తీరుపై వీకే నరేశ్ ఆగ్రహం..!

హైదరాబాద్‌ విమానాశ్రయంలో సినీనటుడు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా తీసుకెళ్లడంపై ఆయన మండిపడ్డారు. తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్యపూరిత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌లో ఫోటోలు పంచుకున్నారు.నరేశ్ తన ట్వీట్‌లో రాస్తూ..'ఇండిగో ఎయిర్‌లైన్స్ బస్సు ప్రయాణం చిత్ర హింసకు గురిచేసింది. విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి సాక్ష‍్యమిదే. మమ్మల్ని పశువుల్లా ఒక లారీలో ఎ‍క్కించినట్లు విమానం వద్దకు తీసుకెళ్లారు. అందులో వృద్ధులు, చక్రాల కుర్చీలలో ఉన్న కొందరు నిలబడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎక్కువ మందిని ఎక్కించవద్దని నేనే గట్టిగా అరిచా. బస్సులకు ఒక నిర్దిష్ట పరిమితి ఉండాలి. వృద్ధుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి నా న్యాయ బృందంతో మాట్లాడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో నరేశ్‌ మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.The bus torture chambers of INDIGO airlines are excruciating reminders of the airline monopoly. Thy had loaded us like cattle in a lorry (twice the capacity )with senior citizens , some in wheel chairs struggling to stand ( seen in the back ground ) . I had screamed at the top of… pic.twitter.com/JzcOvsLlul— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 23, 2025

Malayalam Super Star Mohan Lal Vrusshabha Movie Review In Telugu8
మోహన్ లాల్ వృషభ మూవీ రివ్యూ.. ఆడియన్స్‌ను మెప్పించిందా?

టైటిల్: వృషభనటీనటులు: మోహన్ లాల్, సమర్జీత్‌ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్‌ సారిక, అజయ్, నేహా సక్సేనా, అజయ్ తదితరులుదర్శకత్వం: నందకిశోర్‌విడుదల తేదీ..డిసెంబర్ 25, 2025మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ ఏడాది తుడురమ్, ఎంపురాన్-2, హృదయపూర్వం చిత్రాలతో అలరించారు. తాజాగా మోహన్ లాల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓకేసారి తెలుగు, మలయాళ భాషల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.వృషభ కథేంటంటే..గత జన్మలు కూడా ఉన్నాయని ‍మనందరం వింటుంటాం. అయితే ఆ జన్మలో మనం ఎలా పుట్టాం.. అసలేం జరిగింది కేవలం ఊహాజనితమే. అసలు గత జన్మలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. అయితే ఆ రెండు జన్మలను ఓకేసారి చూపిస్తూ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ అందించే చిత్రమే మోహన్ లాల్ వృషభ.ఈ కథ రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు ఓ మహిళ పెట్టే శాపంతో మొదలవుతుంది. గత జన్మలో జరిగిన సంఘటనలతో ఈ కథను ప్రారంభించాడు. బిజినెస్‌లో ఆదిదేవ వర్మ(మోహన్ లాల్) కింగ్. ప్రతి ఏడాది ఉత్తమ బిజినెస్‌మెన్‌గా అవార్డ్ ఆయనకు రావాల్సిందే. అలా ఇది నచ్చని మరో వ్యాపారవేత్త అవార్డ్ బహుకరించే రోజే ఆదిదేవ వర్మపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆది దేవ వర్మ కుమారుడు తేజ్(సమర్జీత్‌ లంకేశ్) ఎంట్రీతో ఆ ప్లాన్ తిప్పికొడతాడు. అలా వర్తమానంలో తండ్రీ, తనయులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తేజ్ పెళ్లి చేసుకోవాలనేది తండ్రి బలమైన కోరిక. ఈ విషయాన్ని పదే పదే తన కొడుకుతో చెబుతుంటాడు.అదే సమయంలో గత జన్మ అనుభవాలతో ఆది దేవ వర్మ సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం మంచి సైక్రియాటిస్ట్‌ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని(నయన్‌ సారిక) అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ‍అలా ఇద్దరు కలిసి ఆదిదేవ వర్మ సమస్యకు పరిష్కారం కోసం బయలుదేరతారు. నాన్నకు ఉన్న ప్రాబ్లమ్‌ గురించి ఇంట్లో పనిచేసే వంటమనిషి పప్పు.. తేజ్‌తో ఓ ఆసక్తికర విషయం చెబుతాడు. ఇది విన్న తేజ్ తండ్రికి చెప్పకుండానే వెంటనే సొంత గ్రామమైన దేవనగరికి బయల్దేరతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అసలు తేజ్‌ ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? తండ్రి కోసం వెళ్లిన తేజ్‌ ఎందుకలా మారిపోయాడు. అసలు తండ్రీ, కొడుకుల మధ్య ప్రతీకారానికి కారణమేంటి? ఆది దేవ వర్మకు గత జన్మలో అసలేం జరిగింది? ఆ జ్ఞాపకాలు ఇంకా ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు ఆ మహిళ పెట్టిన శాపం ఏంటి? అనేది తెలియాలంటే వృషభ చూడాల్సిందే.ఎలా ఉందంటే..మామూలుగా గత జన్మలో ఏం జరిగింది అనేది మొదట చూపించి కథను మొదలెడతాం. అలానే గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు జరిగిన సంఘటనలను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ అసమాన యోధుడిగా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు అయితే వృషభ చేసిన పొరపాటు వల్ల ఓ మహిళ ఆయనకు శాపం పెడుతుంది. అదే శాపం వర్తమానంలోనూ ఆదిదేవ వర్మ(మోహన్ లాల్)ను వెంటాడుతుంది. అయితే కుమారుడి కోసం తాపత్రయ పడుతున్న ఆదిదేవకు..దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌ పాతదే కావొచ్చు. కానీ స్క్రీన్‌ ప్రజెంట్‌ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. తాను అనుకున్నట్లుగానే కథను ప్రేక్షకులను పరిచయం చేశాడు. ప్రారంభంలోనే రాజుకు పెట్టే శాపం రివీల్ చేసి ఆసక్తి క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వర్తమానంలోకి తీసుకెళ్లాడు. తండ్రి, కుమారుల మధ్య బాండింగ్‌.. కొడుకు కోసం తండ్రి.. తండ్రి కోసం కుమారుడు పడే తపన చూపించాడు. అమ్మాయితో పరిచయం కావడం.. వెంటనే ఇద్దరి మధ్య లవ్.. చకాచకా ఓకే చెప్పడం.. అలా కథను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్‌ హాప్ మొత్తం ఆదిదేవ వర్మ(మోహన్ లాల్), సమర్జీత్ లంకేశ్(తేజ్)ల బాండింగ్.. దామినితో లవ్‌లో పడడం అంతా రోటీన్‌గా సాగుతుంది. తేజ్‌ ఎప్పుడైతే తండ్రి సొంత గ్రామమైన దేవనగరి గ్రామానికి వెళ్లాడో అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంది. ఫస్ట్ హాఫ్‌లో కథ ప్రేక్షకుడి ఊహకందేలానే సాగుతుంది. కానీ ‍అలా ప్రేక్షకుడు కథలో లీనమవ్వగానే.. ఇంటర్వెల్‌కు ముందు ఇచ్చే ట్విస్ట్‌ అస్సలు ఊహించలేరు. ఆ బిగ్ ట్విస్ట్‌ థియేటర్లో చూసి సగటు ప్రేక్షకుడు షాకవ్వాల్సిందే. అలా ప్రథమార్థాన్ని వర్తమానంతోనే ముగించాడు. సెకండాఫ్‌లో గత జన్మలో జరిగిన పరిణామాలు.. రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) త్రిలింగ రాజ్యం గురించే ఉంటుంది. ఆ రాజ్యంలో జరిగే సంఘటనలు చుట్టే తిరుగుతుంది. కానీ త్రిలింగ రాజ్యంలోని స్ఫటిక లింగం దొంగతనం చేసేందుకు వచ్చిన హయగ్రీవా(సమర్జీత్ లంకేశ్) వస్తాడు. ఆ తర్వాత వృషభ రాజుకు.. హయగ్రీవాకు మధ్య జరిగే పోరాటం సెకండాఫ్‌లో హైలెట్. ఆ యుద్ధ ఫైట్‌ సీన్‌లో జరిగిన సంఘటన తర్వాతే ఈ కథ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అప్పటిదాకా ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిందే. సెకండాఫ్‌లో అలీ కామెడీ కొద్దిసేపే అయినా నవ్వులు తెప్పించింది. ఇందులో గత జన్మకు.. వర్తమానానికి ముడిపెట్టడం వల్ల ప్రేక్షకుడిని కాస్తా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. గత జన్మ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ కథలో క్లైమాక్స్‌లో ఫుల్ ఎమోషన్‌ క్రియేట్ చేశాడు. తండ్రీ, తనయుల మధ్య పోరాటాన్ని భావోద్వేగానికి ముడిపెడుతూ మలిచిన తీరు ప్రతి ఒక్క ‍ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఈ కథలో ప్రేక్షకుడి ఊహకందని బిగ్‌ ట్విస్ట్‌లు ఇచ్చాడు డైరెక్టర్. కథలో కొత్తదనం లేకపోయినా విజువల్స్, స్క్రీన్ ప్లేతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. ఆడియన్స్‌కు ఎక్కడా బోరింగ్‌ అనిపించకుండా కథను ముందుకు తీసుకెళ్లడం ప్లస్‌. భారీ ఫైట్స్ లేకున్నా..కథకు తగినట్లుగా ప్లాన్ చేశాడు.ఎవరెలా చేశారంటే..మోహన్ లాల్‌ ఆదిదేవ వర్మగా, రాజా విజయేంద్ర వృషభగా రెండు పాత్రల్లో తనలోని టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. సమర్జీత్ లంకేశ్‌ యంగ్‌ హీరోగా అదరగొట్టేశాడు. గత జన్మ హయగ్రీవా పాత్రలో డిఫరెంట్‌గా కనిపించాడు. నయన సారిక తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా, గ‌రుడ రామ్‌, విన‌య్ వ‌ర్మ‌, అలీ, అయ‌ప్ప పి.శ‌ర్మ‌, కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బీజీఎం అంత కాకపోయినా ఫర్వాలేదనిపించింది. సామ్ సీఎస్ నేపథ్యం సంగీతం బాగుంది. కృతి మహేశ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో ఓ డిఫరెంట్‌ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ అవ్వాలంటే వృషభ చూడాల్సిందే.

Mark Movie Actress Deepshikha About Her Experience9
మార్క్‌ క్వీన్‌.. ఎంట్రీయే స్టార్‌ హీరోతో..

నటి దీప్‌శిఖ 'మార్క్‌ మూవీ'తో కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ నేడు (డిసెంబర్‌ 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకుంది. ఇది దీప్‌శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అరంగేట్రానికి ముందే సోషల్‌ మీడియాలో తన పేరు మారుమోగిపోతోంది. సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్‌, ట్రైలర్‌లో దీప్‌శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా..దీంతో అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఇక దీప్‌శిఖ మాట్లాడుతూ.. కిచ్చా సుదీప్‌తో కలిసి పనిచేయడం వల్ల నా కల నెరవేరింది. ఆయన దగ్గరి నుంచి క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. ఇవి నా నటనను మరింత మెరుగుపర్చేందుకు ప్రోత్సహించాయి. అలాగే ప్రతిష్టాత్మక సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌లో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో ప్రేమ ఇలాంటి గొప్ప నిర్మాణ సంస్థతోనే నా కన్నడ ప్రయాణం ప్రారంభం కావడం నా కెరీర్‌కు మరింత విలువ, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ అవకాశం లభించడం నా అదృష్టం. సినిమా విడుదలకంటే ముందే నాపై ఎంతో ప్రేమ చూపించారు. మీ ప్రేమే నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుంది అని పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, సిబ్బంది, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

Actor Nandu Once Wanted Leave this Country with Geetha Madhuri10
దేశం విడిచి వెళ్లాలనుకున్నాం.. ఏడ్చేసిన నందు

తెలుగు నటుడు, యాంకర్‌ నందు ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ తనకు సరైన సక్సెస్‌ లేదు. ఆ ఒక్క విజయం కోసం ఏళ్లకొద్దీ పరితపిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సెకండ్‌ హీరోగా చేసిన నందు తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంచి విజయం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడితడు సైక్‌ సిద్దార్థ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉన్నచోటే ఆగిపోయా..ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందు తన కష్టాల్ని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. నందు మాట్లాడుతూ.. నాతో కలిసి నటించిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రియదర్శి, విజయ్‌ దేవరకొండ.. వీళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారు. నేను మాత్రం ఉన్నచోటే ఉండిపోయాను. లోపం నాలోనే ఉంది. అది ఈ మధ్యే తెలుసుకున్నాను.లోపం నాలోనే..కథలో లోపాలున్నాయని తెలిసినా సరే.. డబ్బు వస్తుందన్న ఆశతో సినిమాలు ఒప్పేసుకునేవాడిని. అలా నన్ను నేనే మోసం చేసుకున్నాను. దానివల్ల వీడి సినిమాలన్నీ ఇంతేరా.. అన్న మార్క్‌ పడిపోయింది. దాన్నుంచి బయటకు రావడానికే మూడునాలుగేళ్లు సమయం తీసుకుని మంచి సినిమా చేశాను.చేదు సంఘటనలుసవారి మూవీ తర్వాత పెద్ద బ్యానర్‌లో హీరోగా సినిమా ఆఫర్‌ చేశారు. అనుపమ హీరోయిన్‌ అన్నారు. అంతా ఓకే అనుకున్నాక సడన్‌గా నా స్థానంలో మరొకర్ని తీసుకున్నారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరో సంఘటనలో ఏం జరిగిందంటే.. ఒక పెద్ద నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి మూవీ తీశారు. హీరోతోపాటు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర నాకిచ్చారు. పైసా తీసుకోకుండా రెండున్నర నెలలు షూటింగ్‌ చేేశాను. ఘోర అవమానంతీరా ఓ డిస్ట్రిబ్యూటర్‌ మూవీ చూసి నాకెందుకు అంత ప్రాధాన్యతనిచ్చారని అడిగారట! దాంతో నాకు ఒక్కమాటైనా చెప్పకుండా నా సీన్స్‌ అన్నీ ఎత్తేశారు. అది తెలియక ఆడియో లాంచ్‌కు పిలవకపోయినా వెళ్లాను. అక్కడికి వెళ్లాక కనీసం నేను ముందు వరుసలో కూర్చునేందుకు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను.తల్లితోడుగా చెప్తున్నా..అనవసరమైన విషయాల్లో నా పేరు ఇరికించినప్పుడైతే కుమిలిపోయాను. తల్లితోడుగా చెప్తున్నా.. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామా? అని గీత, నేను అనుకున్నాము. వేరే దేశం వెళ్లి ఏదైనా హోటల్‌లో పని చేసుకుందాం అని గీతయే ముందుగా అడిగింది. తను సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ సింగర్‌.. అయినా సరే నాకోసం తన కెరీర్‌ వదిలేసి, వేరే దేశం వెళ్లి హోటల్‌లో పనిచేసుకుందామంది. అది ఇప్పుడు తల్చుకున్నా ఏడుపొస్తుంది. ఏడ్చేసిన నందునేను ఈ ఫీల్డ్‌లో లేకపోతే నాపై అలాంటి రూమర్సే రావు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చినవారిని బలిపశువును చేస్తారు. ఈ విషయం జనాలకు తెలియదు. లేనిపోనివాటిలో నన్ను ఇరికిస్తే బిల్డింగ్‌ పై నుంచి దూకేస్తానంది అమ్మ. అలా నేను చేయని తప్పుకు వార్తల్లో నా పేరు రావడం చూసి ఇంట్లో అందరూ నలిగిపోయారు అని చెప్తూ నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Advertisement
Advertisement