Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Daughter of Prasad Rao Kanabadutaledu web series realse date locked1
ఓటీటీలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ప్రకటన

రాజీవ్‌ కనకాల, ఉదయబాను, ప్రధాన పాత్రధారులుగా నటించిన 'డాటరాఫ్‌ ప్రసాద్‌ రావు: కనపడుట లేదు' వెబ్‌ సిరీస్‌ విడుదలపై ప్రకటన వచ్చింది. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ గతేడాదిలోనే స్ట్రీమింగ్‌ కావల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు. దర్శకుడు పోలూరు కృష్ణ తెరకెక్కించిన ఈ సిరీస్‌ ‘జీ 5’(Zee 5)లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ సిరీస్‌లను అందించిన సౌతిండియన్‌ స్ర్కీన్స్‌ దీన్ని రూపొందించింది.తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఈ వెబ్‌ సిరీస్‌(D/O Prasad Rao Kanabadutaledhu )ను తెరకెక్కించారు. నటి వసంతిక ఇందులో రాజీవ్‌ కనకాల కూతురు స్వాతి పాత్రలో నటించింది. ప్రతి కుటుంబానికి కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌తో పాటు ఎన్నో సస్పెన్స్‌ పాయింట్స్‌ను దర్శకుడు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి ఆశయాలకు ఎంతో కష్టపడి ఉద్యోగంలో చేరిన కూతురు ఊహించని రీతిలో అదృశ్యమవుతుంది. ఈ మిస్సింగ్‌ కేసును ఛేదించేందుకు పోలీసు అధికారిణి (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది. స్వాతిని కడ్నాప్‌ చేసింది ఎవరు..? ఆమెను టార్గెట్‌ చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి..? అనేది తెరపై చూడాల్సిందే.

Actor Sarathkumar comments on media2
మీడియా నిజాలు మాత్రమే చెప్పాలి: శరత్‌ కుమార్‌

ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే డిజిటల్‌ మాధ్యమల హవానే కొనసాగుతోంది అనేది నిజం. ఈ ట్రెండ్‌ నానాటికీ పెరుగుతోంది కూడా.. అలా గత 27 ఏళ్లుగా మలేషియాలో ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫారంగా రాణిస్తున్న నంబికై మాధ్యమం ఇప్పుడు చెన్నైలో తన శాఖను వ్యాపింపజేసింది. దీని ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఇందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు అందించారు. శరత్‌కుమార్‌ మాట్లాడుతూ మలేషియాలో ప్రారంభించి ఇప్పుడు చెన్నై వరకు వ్యాప్తి చెందిన నంబికై డిజిటల్‌ మాధ్యమం నిర్వాహకులకు తన అభినందనలు అన్నారు. తన పెదనాన్న ఆదిత్తన్‌ ఎంతో శ్రమపడి ప్రారంభించిన పత్రిక తంది అని పేర్కొన్నారు. ఆ పత్రికలో తన తండ్రి కూడా కొంత కాలం పని చేశారన్నారు. అదేవిధంగా తాను కొంతకాలం పత్రికారంగంలో ఉన్నానని గుర్తు చేశారు. నిజాలు మాత్రమే చెప్పాలి అన్న భావంతోనే పత్రికలను నిర్వహించాలన్నారు. గత 27 ఏళ్లుగా మలేషియాలో నిర్వహిస్తున్న నంబికై డిజిటల్‌ మాధ్యమం ఇప్పుడు ఇండియా, సింగపూర్‌ , దుబాయ్‌కు విస్తరించబోతున్నందుకు, మరిన్ని దేశాలకు విస్తరించి ప్రజల నమ్మకాన్ని పొందాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పాల్గొన్నారు.

Ram Charan Peddhi gets huge digital and audio deal3
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్‌ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి.

Special request from Team Vijay Deverakonda Rashmika Wedding4
సోషల్ మీడియాలో విజయ్- రష్మిక వెడ్డింగ్‌ కార్డ్.. టీమ్ ఆగ్రహం..!

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా విజయ్‌ దేవరకొండ- రష్మిక పెళ్లిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నెల 26న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వెడ్డింగ్ కార్డ్ నెట్టింట తెగ వైరలైంది. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ టీమ్‌ స్పందించింది. వివాహం, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం కరెక్ట్‌ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.'విజయ్‌- రష్మిక పెళ్లి గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెళ్లి, రిసెప్షన్‌ వేదిక వివరాలను వెల్లడిస్తున్నారు. ఇలాంటి వాటితో అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. వీరి పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి వేదికల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం సరైంది కాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్‌ నెంబర్‌ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేస్తే.. అది కూడా పోస్ట్ చేశారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవద్దని' విజయ్‌ టీమ్‌ పేర్కొంది.Special request from Team Vijay Deverakonda & Rashmika !! As many people were posting the marriage details of Vijay & Rashmika including the RSVP contact and venue. The team now are requesting not to post such sensitive information online which could lead to unnecessary fanfare… pic.twitter.com/YESwrwNumE— Filmy Focus (@FilmyFocus) February 18, 2026

Tollywood actresses Latest Social Media Updates Goes Viral 5
పింక్ శారీలో ది రాజాసాబ్ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్‌లో సమంత పోజులు..!

వజ్రాల్లాంటి బ్లాక్ డ్రెస్‌లో సమంత హోయలు..హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్‌ లుక్..సెలయేరు వద్ద హీరోయిన్ ప్రియమణి చిల్..పింక్‌ డ్రెస్‌లో ది రాజాసాబ్ బ్యూటీ అందాలు..పట్టుశారీలో మరింత అందంగా బిగ్‌బాస్ సోనియా...ఎల్లో చీరలో కాయాదు లోహర్‌ బ్యూటీపుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official)

Lavanya Tripathi Sathi Leelavathi Movie Song out Now6
మెగా కోడలి కొత్త సినిమా.. క్రేజీ లవ్ సాంగ్‌ వచ్చేసింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్‌ మోహన్‌ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సతీ లీలావతి మూవీ క్రేజీ లవ్ సాంగ్ విడుదలైంది.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి మధురం అంటూ సాగే లవ్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, చారులత మణి ఆలపించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాట ఆడియన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటించారు.

Priyanka Chopra comments On SS Rajamouli Varanasi Movie7
'వారణాసి నాకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?':ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్

మహేశ్‌ బాబు-రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ సినిమా వారణాసి. ఈ సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది.తాజాగా ప్రియాంక చోప్రా వారణాసి మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను నటించిన ది బ్లఫ్‌ మూవీ ప్రీమియర్‌ షోకు హాజరైన ప్రియాంక ఈ సినిమా గురించి మాట్లాడింది. ఎస్ఎస్ రాజమౌళి సార్ ఇండియాలోనే బెస్ట్‌ డైరెక్టర్ అని కొనియాడింది. ఈ మూవీ తన కెరీర్‌ నిర్ణయించే సినిమా అవుతుందని ప్రియాంక తెలిపింది.కాగా.. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. "#Varanasi will be a career defining movie for me" says Priyanka Chopra during the premiere of her new movie. pic.twitter.com/6AZFJZJj6S— Rick Sulgie (@Aloydinkan) February 18, 2026

This Actress Played Mammootty daughter, girlfriend and mother8
హీరోకు తల్లిగా, భార్యగా, కూతురిగా నటించిన హీరోయిన్‌

హీరోయిన్లు కేవలం హీరోతో జోడీ కట్టడమే కాదు కొన్నిసార్లు అదే హీరోకు తల్లిగా, కూతురిగా కూడా నటించినవాళ్లూ ఉన్నారు. అలా మలయాళ స్టార్‌ మమ్ముట్టికి ఓ స్టార్‌ హీరోయిన్‌ తల్లిగా, కూతురిగా, భార్యగా నటించింది. ఆమె మరెవరో కాదు, అందాల తార మీనా.స్టార్‌ హీరోయిన్‌గా13 ఏళ్ల వయసుకే హీరోయిన్‌గా మారింది మీనా. కథానాయికగా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన మీనా మలయాళ స్టార్‌ మమ్ముట్టికి మాత్రం భార్యగా, కూతురిగా, తల్లిగా నటించింది.మమ్ముట్టికి జోడీగా..ఒరు కొచ్చుకథ ఆరుం పరయత కథ మూవీలో మమ్ముట్టి కూతురిగా నటించింది. 2001లో వచ్చిన రాక్షస రాజవు మూవీలో మమ్ముట్టి ప్రేయసిగా కనిపించింది. ఆ తర్వాత కరుత పక్షికల్‌, కద పరయుంబల్‌ సినిమాల్లోనూ మమ్ముట్టితో కలిసి నటించింది. 2014లో మమ్ముట్టి ద్విపాత్రాభినయం చేసిన మూవీ బాల్యకాలసఖి. ఇందులో మమ్ముట్టి తల్లిగా, భార్యగా మీనా యాక్ట్‌ చేసింది. చదవండి: జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: స్టార్‌ హీరో

Filmmaker Vivek Agnihotri has addressed rumours of Operation Sindoor9
ఆపరేషన్ సింధూర్‌పై మరో సినిమా.. వివేక్ అగ్నిహోత్రి రియాక్షన్‌ ఇదే..!

ఆపరేషన్‌ సిందూర్‌పై మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆపరేషన్‌ పేరుతో ఇప్పటికే ఓ సినిమా ఫిక్సయింది. తాజాగా మరో మూవీ సైతం రానుందని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్‌లో టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.అయితే తనపై వస్తున్న ఈ రూమర్స్‌పై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఆపరేషన్ సిందూర్ ఆధారంగా రూపొందిస్తారని వస్తున్న వార్తలతో తనకు సంబంధం లేదన్నారు. ప్రస్తుతం తాను అతిపెద్ద జాతీయవాద ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ‍అని.. చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు వివేక్ నిరాకరించారు.తాజా న్యూస్ ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి వివేక్ అగ్నిహోత్రి 'ఆపరేషన్ సిందూర్' తెరకెక్కించున్నారని వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తారని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. గతేడాది అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.మరోవైపు ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో దర్శకుడు ఉత్తమ్‌ నితిన్‌ సినిమాని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కాగా.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత సైన్యం ఆపరేషన్‌ సింధూర్ పేరుతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన ఏప్రిల్ 22, 2025న జరిగింది.

Surekha konidela Reveals Ram Charan Favourite 10
'రామ్ చరణ్‌కు అది చాలా ఇష్టం.. వద్దన్నా వినేవాడు కాదు': సురేఖ

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్‌ డే కావడంతో చిరు స్పెషల్ విషెస్ తెలిపారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు.. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉందన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగిందని.. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా మారందని చిరంజీవి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సురేఖ బర్త్‌ డే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేఖ..తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడని తెలిపింది. అస్సలు అల్లరి చేసేవాడు కాదని.. టీనేజ్ వచ్చాక కొంచెం అల్లరి చేసేవాడని వెల్లడించింది. చరణ్‌కు కిల్లీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. కిల్లీ చిన్నపిల్లలు వేసుకోవద్దని చెబితే.. పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్‌గా అక్కడే నిల్చుని తినేవాడని సురేఖ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. Wishing you a Very Happy Birthday Surekha Amma Garu ❤️❤️@AlwaysRamCharan https://t.co/e7nZ2cjUqf pic.twitter.com/cCdfuUUY73— Team Charanism (@TeamCharanism) February 18, 2026

Advertisement
Advertisement