Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Film Director Rajkumar Hirani confirmed 3 Idiots Sequel1
రాజ్‌కుమార్‌ హిరాణి హిట్‌ సినిమా సీక్వెల్‌ రెడీ

బాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి 3 ఇడియట్స్‌’ మూవీ సీక్వెల్‌ ప్రకటించాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయి అని తెలిపాడు. విధు వినోద్‌ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో ఆమిర్‌ఖాన్ హీరోగా, ఆర్‌. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో 3 ఇడియట్స్‌ సీక్వెల్‌ గురించి రాజ్‌కుమార్‌ హిరాణి ఇలా అన్నారు. 3 ఇడియట్స్‌ సీక్వెల్‌ కథ కోసం పనులు ప్రారంభించామన్నారు. స్టోరీ విషయంలో సరికొత్త ఆలోచన వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ప్రేక్షకులు ఎలా రిసీవ​్‌ చేసుకుంటారో అనే ఆలోచన కూడా ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ పనులు మొదలుపెట్టలేదంటూనే దాదాపు అంతా సిద్ధమైందన్నారు. ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్‌’ సీక్వెల​్‌ కథనం సాగుతుందని బాలీవుడ్‌ భోగట్టా. మరోవైపు మున్నాభాయ్‌ సీక్వెల్‌ కూడా కథ పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు.

jeeva Thalaivar Thambi Thalaimaiyil movie OTT Streaming Now2
ఓటీటీలో 'జీవా' హిట్‌ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌

తమిళ నటుడు జీవా నటించిన తలైవర్ తంబి తలైమైయిల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న కేవలం తమిళ్‌లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. కోలీవుడ్‌లో ఈ ఏడాది పొంగల్ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మూవీగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దర్శకుడు నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జీవాకు జోడీగా ప్రార్థన నటించింది. మలయాళంలో 'ఫెలిమి' అనే బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నితీష్‌.. తమిళంలో దర్శకత్వం వహించిన మొదటి సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) కావడం విశేషం.జీవా హిట్‌ సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండానే విడుదల చేయడంతో ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. థియేటర్‌లో కేవలం తమిళ్‌ వర్షన్‌ మాత్రమే రిలీజ్‌ చేసిన మేకర్స్‌ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‌కు తీసుకురావడం విశేషం. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది.

70th Filmfare Awards South 2026 nominations list3
Filmfare Awards 2026: ఫిల్మ్‌ఫేర్‌- 2026.. నామినేషన్స్‌లో ఉన్న సినిమాలివే..

దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2026 ప్రకటన వచ్చేసింది. అవార్డ్‌ రేసులో ఉన్న నటీనటుల లిస్ట్‌తో పాటు చిత్రాలను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకు జరగనుంది. దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన నటీనటులకు అవార్డ్స్‌తో గౌరవిస్తారు. 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2026 (filmfare awards south 2026)లో పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. సౌత్‌ చిత్ర పరిశ్రమల నుంచి అన్ని భాషలకు సంబంధించిన ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈసారి కేరళలో ఈ వేడుక జరగనుంది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డ్స్‌ ఇస్తున్నారు.ఫిల్మ్‌ అవార్డ్స్‌-2026.. పోటీపడుతున్న నటీనటులు, సినిమాల లిస్ట్‌ ఇదే...ఉత్తమ చిత్రంహను-మాన్‌పుష్ప-2కల్కి 2898ADలక్కీ భాస్కర్‌35 చిన్న కథ కాదుకమిటీ కుర్రోళ్లుఉత్తమ దర్శకుడునాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898AD)సుకుమార్‌ (పుష్ప-2)ప్రశాంత్‌ వర్మ (హను-మాన్‌)వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ నటుడుఅల్లు అర్జున్‌ (పుష్ప-2)దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)జూ. ఎన్టీఆర్‌ (దేవర)నాని (సరిపోదా శనివారం)సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్‌)తేజ సజ్జా (హనుమాన్‌)ఉత్తమ నటిఅనుపమ పరమేశ్వరణ్‌ (టిల్లు స్క్వేర్‌)అషికా రంగనాథ్‌ (నా సామిరంగా)మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)నివేథా తామస్‌ (35 చిన్న కథ కాదు)ప్రియాంక మోహన్‌ ( సరిపోదా శనివారం)రష్మిక మందన్న (పుష్ప-2)ఉత్తమ సహాయ నటుడుఅమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898AD)ఫహద్‌ ఫాజిల్‌ (పుష్ప-2)సత్య ( మత్తు వదలరా-2)ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)ధనజయ (జీబ్రా)ఉత్తమ సహాయ నటిఅంజలి (గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి)ఫరియా అబ్దుల్లా ( మత్తు వదలరా-2)రాశి సింగ్‌ నందు ( ప్రసన్న వదనం)శరణ్య ప్రదీప్‌ ( అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)శ్రద్ధా శ్రీనాథ్‌ ( మేకానిక్‌ రాఖీ)వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (హనుమాన్‌)ఉత్తమ సంగీత దర్శకుడుఅనిరుధ్‌ రవిచందర్‌ (దేవర)దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప-2)తమన్‌ (గుంటూరు కారం)జీవీ ప్రకాష్‌ కుమార్‌ ( లక్కీ భాస్కర్‌)చైతన్‌ భరద్వాజ్‌ (హరోం హర)జేక్స్ బెజోయ్ ( సరిపోదా శనివారం)గౌర హరి , అనుదీప్ దేవ్ , కృష్ణ సౌరభ్ (హనుమాన్‌)ఉత్తమ సాహిత్యంరామజోగయ్య శాస్త్రి ( చుట్టమల్లే- దేవర)రామజోగయ్య శాస్త్రి ( ధమ్‌ మసాల- గుంటూరు కారం)రామజోగయ్య శాస్త్రి ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)కృష్ణ కాంత్‌ (ఆ రోజులు మళ్లీ రావు- కమిటీ కుర్రోళ్లు)శ్రీమణి (శ్రీమతి గారు- లక్కీ భాస్కర్‌)ఉత్తమ సింగర్‌అనిరుధ్‌ రవిచందర్‌ (ఫీయర్‌ సాంగ్‌- దేవర)అనురాగ్‌ కులకర్ణి (సుట్టంలా సూసి - గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి)అర్జిత్‌ సింగ్‌ (అణువణువు- ఓం భీమ్ బుష్)గౌర హరి (పూలమ్మే పిల్ల- హనుమాన్‌)రామ్‌ మిరియాల (సుఫియాన- ఆయ్‌)సంజీత్‌ హెగ్డే (ధమ్‌ మసాల- గుంటూరు కారం)శ్రీ కృష్ణ ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)ఉత్తమ సింగర్‌- ఫీమేల్‌శిల్పి రావ్‌ (చుట్టమల్లే- దేవర)మంగ్లీ (గుల్లెడు గుల్లెడు గులాబీలు- మెకానిక్‌ రాఖీ)శ్రెయా ఘోషల్‌ (సూసేకి- పుష్ప-2)ఉషా ఊతప్‌ (లక్కీ భాస్కర్‌ టైటిల్‌ ట్రాక్‌)

Shriya Saran Comment Her Dream role for movies4
ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటి ఉంది: శ్రియ

సినిమాను ప్రేమిస్తే అది కచ్చితంగా ఉన్నత స్థాయిలో కుర్చోపెడుతుంది. ఇందుకు పలువురు ఉదాహరణ. ప్రతిభ, అంతకు మించిన ప్రేమ ఉంటే సినిమా ఎవరినైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చాలా మంది నిరూపించారు. అలాంటి వారిలో నటి శ్రియ ఒకరు అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హిందీ, తమిళం , కన్నడం తదితర భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు. తమిళంలో విజయ్, రజనీకాంత్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో , తెలుగులో చిరంజీవి, నాగార్జున వెంకటేష్‌ వంటి టాప్‌ స్టార్స్‌ తో జతకట్టి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగారు. ఎక్కువగా గ్లామరస్‌ పాత్రల్లోనే ఈమె నటించారన్నది గమనార్హం. ఏదేమైనా గత 25 ఏళ్లుగా నాట్‌ అవుట్‌గా కొనసాగుతున్న శ్రియ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం కథానాయకి పాత్రలు కాకపోయినా నటనకు అవకాశం ఉన్న అక్క,అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో దశ్యం 3 చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి శ్రియ మంచి నృత్య కళాకారిణి అన్నది గమనార్హం. ఇటీవల ఈ భామ ఓ భేటీలో పేర్కొంటూ చాలా భాషల్లో చాలా చిత్రాల్లో నటించానని, అయితే తాను మొదట ప్రేమించేది నాట్యాన్ని అని చెప్పారు. ఇంత వరకు నటించని, నటించాలని ఆశపడే పాత్ర ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. తనకు నాట్య కళాకారిణి పాత్రలో నటించాలనే కోరిక చాలా ఏళ్లుగా ఉండిపోయిందన్నారు. ఒక నాట్యకళాకారిణిగా జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు శ్రియ పేర్కొన్నారు. తన కెరీర్‌ మొత్తంలో ఎవరూ కూడా అలాంటి పాత్ర తమ సినిమాలో ఉందని తనను కలవలేదని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భామ కోరిక నెరవేరే అవకాశం ఏ మేరకు ఉంటుందో చూడాలి.

Dharmendra Ikkis Movie OTT Streaming Now5
ఓటీటీలోకి వచ్చేసిన ధర్మేంద్ర చివరి సినిమా

బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర.. మూడు నెలల క్రితం అంటే గతేడాది నవంబరు చివరలో చనిపోయారు. తర్వాత నెలకు ఈయన నటించిన చివరి సినిమా థియేటర్లలోకి వచ్చింది. సర్వత్రా ప్రశంసలు అందుకున్న ఆ మూవీ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త నంద హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇక్కీస్'. న్యూఇయర్ సందర్భంగా జనవరి 01న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులోనే ధర్మేంద్ర కీలక పాత్ర పోషించారు. జైదీప్ అహ్లవత్ కూడా మంచి రోల్ చేశాడు. 1971 భారత్-పాక్ యుద్ధంలో అమరుడైన అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు వారాల తర్వాత ఉచితంగా అందుబాటులోకి రానుంది.'ఇక్కీస్' విషయానికొస్తే.. బ్రిగేడియర్ ఎంఎల్ ఖేత్రపాల్(ధర్మేంద్ర) ఆర్మీ మాజీ ఉద్యోగి. పాకిస్తాన్‌లోని తన ఫ్రెండ్స్‌ని కలిసేందుకు లాహోర్ వెళ్తారు. అక్కడ ఉన్నన్నీ రోజులు ఈయన బాధ్యతని ఆర్మీ మాజీ ఆఫీసర్ నిస్సార్ అహ్మద్(జైదీప్ అహ్లావత్)పై పడుతుంది. పాకిస్తాన్‌లో తన జ్ఞాపకాలని నెమరవేసుకునేందుకు పలు ప్రాంతాలకు వెళ్లిన ఖేత్రపాల్.. తన కొడుకు అరుణ్ ఖేత్రపాల్ చనిపోయిన ప్రదేశానికి కూడా వెళ్తాడు. ఇంతకీ 1971 భారత్-పాక్ యుద్ధంలో 21 ఏళ్ల సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్(అగస్త్య నంద) చేసిన సాహసమేంటి? యుద్ధభూమిలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? అనేదే మిగతా స్టోరీ.

Lavanya Tripathi Reacts Ram Charan Twins And Mega Trolls6
నేను ఊరుకోను.. మెగా కోడలు స్ట్రాంగ్ వార్నింగ్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. తమ కుటుంబంపై వచ్చిన ట్రోల్స్‌పై మరోసారి స్పందించింది. కొన్నిరోజుల క్రితం రామ్ చరణ్-ఉపాసన దంపతులతు కవలలు పుట్టిన సందర్భంగా కొందరు.. మెగాస్టార్ చిరంజీవిపై దారుణమైన విమర్శలు చేశారు. అప్పుడే సదరు నెటిజన్‌కి ఇచ్చిపడేసిన లావణ్య.. ఇప్పుడు ఆ సందర్భం గురించి మరోసారి మాట్లాడింది.'రామ్ చరణ్‌కి ట్విన్స్ పుట్టిన ఆనందంలో మేం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ సమయంలో అలాంటి ట్వీట్ వేయడం పూర్తిగా తప్పు. మా కుటుంబానికి ఏమైనా అంటే నేను ఊరుకోను' అని లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈమె ప్రధాన పాత్ర చేసిన 'సతీ లీలావతి' వచ్చే నెల 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ఈవెంట్ సందర్భంగానే మెగా ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించింది.గతంలో చిరంజీవి, ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ కుటుంబంలో అందరూ ఆడపిల్లలే ఉన్నారని, మెగా లెగసీని కొనసాగించే మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అయితే చిరు.. ఆడపిల్లల్ని చిన్నచూపు చూస్తున్నారని చెప్పి.. చరణ్‌కి కవలలు పుట్టిన సందర్భంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై ఆ రోజు స్పందించిన లావణ్య.. చిరంజీవి తన కుటుంబంలోని మహిళల్ని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో ఈ విమర్శలు చేసేవారికి అస్సలు అవగాహన లేదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదు అని అప్పుడు కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మాట్లాడుతూ.. ఫ్యామీలీ జోలికొస్తే ఊరుకోనని చెప్పుకొచ్చింది.If anyone says anything about my family, I won’t tolerate it. That’s why I reacted.- #LavanyaTripathi | #Megafamily pic.twitter.com/Rupc5BxdVD— Filmyscoops (@Filmyscoopss) February 11, 2026

Sri Vishnu, Nani, Balakrishna: Two Movies Release At Same Time7
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు

గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు.. మరోసారి హీరో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జండాపై కపిరాజు చిత్రాలకు ఇలాంటి సమస్యనే ఎదురైంది. తమ సినిమాల విడుదల విషయం తమ చేతిలో లేకపోవడం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు శ్రీవిష్ణుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ నెల చివర్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. బాలయ్య రెండు చిత్రాలు ఒకేరోజు (1993 సెప్టెంబర్ 3) విడులైయ్యాయి. అలాగే నాని నటించిన రెండు చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి.అయితే ఇప్పుడు అదే సీన్‌ రిపీట్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. కానీ స్లాట్ ఈ నెలలోనే ఇచ్చింది. అయితే అదే శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఇదే నెలకు డేట్ ఇచ్చింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి కానీ నో యూజ్‌. ఇద్దరూ ఒకే తేదీపై పట్టుబడటంతో నిర్మాతలు, హీరో శ్రీవిష్ణు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెండు సినిమాలు తనవే కావడంతో, రెండింటినీ సమానంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శ్రీవిష్ణుపై పడింది. ఇప్పటికే మృత్యుంజయ్ టీజర్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో విష్ణు విన్యాసం టీజర్ కూడా రానుంది. ఆ వారం ఈ రెండు సినిమాలు తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం శ్రీవిష్ణు అదృష్టమే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్‌మెంట్ లభించనుంది. అయితే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం రెండూ హిట్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శ్రీవిష్ణుకు ఒకవైపు ఎంబ్రాసింగ్, మరోవైపు ఎక్సైటింగ్ కూడా. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు తనవే అని చెప్పుకోవడం అరుదైన విషయం. చూడాలి మరి చివరికి ఏమౌతుందో. విష్ణు విన్యాసం టీజర్‌ రిలీజైతే ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tollywood Hero Mahesh Babu Review On Euphoria Movie8
యూఫోరియా మూవీకి మహేశ్ బాబు రివ్యూ.. ఏమన్నారంటే?

టాలీవుడ్ మూవీ యూఫోరియాపై ప్రిన్స్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఇది తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. గుణశేఖర్ తన కథలను ఎలా ప్రజెంట్ చేస్తారనే దానిలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని.. సినిమా బాగా నచ్చిందని మహేశ్ ట్వీట్‌ చేశారు. గుణశేఖర్, భూమికతో పాటు మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాను గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో భూమిక ప్రధాన పాత్రలో నటించగా.. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. There’s always a distinct pattern in how Gunasekhar garu presents his stories…Enjoyed the film especially the way the climax unfolds…👏🏻👏🏻👏🏻A must watch! Congratulations to Guna Sekhar garu, @bhumikachawlat and the entire team of #Euphoria 🤗🤗🤗@neelima_guna #YukthaGuna…— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2026

Tollywood actresses Latest Posts In Social Media9
శారీలో మెరిసిపోతున్న పాయల్ రాజ్‌పుత్.. జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్..!

శారీలో మెరిసిపోతున్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్..ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక లేటేస్ట్ పిక్స్..టాలీవుడ్ హీరోయిన్ లయ స్మైలీ లుక్స్..పింక్ శారీలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందాలు..బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్‌ పోజులు.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj)

Tollywood Hero Sri Vishnu Mrithyunjay Teaser Out now10
శ్రీ విష్ణు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌.. ఆసక్తిగా టీజర్

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టీజర్‌లో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు.

Advertisement
Advertisement