ప్రధాన వార్తలు
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలానే బ్యాడ్ గర్ల్, చిరంజీవ, కిస్, మిత్రమండలి, బారాముల్లా తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ బొమ్మలు.. డిజిటల్గా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు జారన్ అనే సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. వీటితోపాటు ఇప్పుడు మరో రెండు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)కొన్నాళ్ల క్రితం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం హౌస్మేట్స్. జీ5లో అందుబాటులో ఉండేది. ఇప్పటివరకు తమిళంలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దెయ్యమే లేకుండా ఈ హారర్ సినిమా తీయడం విశేషం. ఒకే అపార్ట్మెంట్లో రెండు వేర్వేరు కాలాల్లో రెండు కుటుంబాలు ఉంటాయి. దీంతో ఒకరి గురించి మరొకరు తెలుసుకుని భయపడతారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.మరోవైపు 2023 అక్టోబరులో రిలీజైన 'ధీమహి' అనే తెలుగు సినిమా.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. అమెరికాలో సర్జన్గా కార్తీక్(సాహస్) పనిచేస్తుంటాడు. ఇతడికి మేనకోడలు ధీమహి అలియాస్ మహి(ఆషిక పగడాల) అంటే పంచప్రాణాలు. కొన్నిరోజులకు మహి అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది. తర్వాత చంపేస్తారు కూడా. మేనకోడలు చావుకి తానే కారణమని బాధపడే కార్తీక్.. నెక్రోమాన్సీ అనే పద్దతితో ఆమె ఆత్మతో మాట్లాడి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు)
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఈ వారం తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' మాత్రమే ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది. మరి తొలిరోజు దీనితో పాటు రిలీజైన సినిమాల సంగతేంటి? కలెక్షన్స్ ఎంత వచ్చాయని టాక్ వినిపిస్తుంది? ఇంతకీ వీటిలో ఏయే సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' విషయానికొస్తే.. విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అలా దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.1.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం తొలిరోజు కంటే రెండో రోజు వచ్చేసరికి నాలుగురెట్ల వసూళ్ల పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. బహుశా వీకెండ్ తర్వాత చేస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!)మహేశ్బాబు బావమరిది సుధీర్బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. హీరోతో పాటు కొందరు మాత్రమే తెలుగు నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి కనీస వసూళ్లయినా వస్తాయా అనేది చూడాలి.వీటితో పాటు తిరువీర్ హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందని అంటున్నారు. ఇదొకటి వచ్చిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలీదు. కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చుంటాయి. ఇవి కాకుండా 'ఆర్యన్', 'డీయస్ ఈరే' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే రష్మిక సినిమా మాత్రమే ప్రస్తుతానికి లీడ్లో ఉంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)
వంటగదిలో నిహారిక.. అను 'గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు
వంటగది వీడియో పోస్ట్ చేసిన నిహారికఇంట్లో పెట్ డాగ్తో నమ్రత హ్యాపీనెస్'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాల్లో అను ఇమ్మాన్యుయేల్హీరోయిన్ మానస వారణాసి అడవిలో షికార్లుఉత్తరాది అమ్మాయిలా మారిపోయిన రాశీఖన్నాఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెబుతూ శివానీ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)
ఆ హీరో హోటల్కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని ..: మీనా
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్గా దక్షిణాది ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాను చేసింది. తమిళ, కన్నడలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉండేది. ఒకనొక దశలో ఒకే రోజు మూడు, నాలుగు సినిమాల షూటింగ్లకు హాజరయ్యేదట. ఇలా తెలుగు,కన్నడ,తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసిన మీనా(Meena).. హిందీలో మాత్రం పర్దా హై పర్దా అనే ఒకే ఒక మూవీ చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా..తాను చేయలేదట. ఓ స్టార్ హీరో అయితే పలుమార్లు తనతో సినిమా చేయమని కోరినా.. చేయలేకపోయానని..ఒకనొక దశలో ఆయన ఉన్న హోటల్కి వెళ్లాలంటే భయపడ్డానని అంటోది మీనా. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హీరో గురించి, తాను ఎందుకు బాలీవుడ్ సినిమాలు చేయలేకపోయిందో వివరించింది.తినడానికి కూడా టైం లేదు..తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేశాను. అదే సమయంలో నాకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ చేయలేకపోయాను. ఇక్కడే నాకు తినడానికి, నిద్రపోవడానికి కూడా టైమ్ దొరకలేదు. ఇక బాలీవుడ్ సినిమాలు ఎలా చేస్తా. పైగా అక్కడ టైమ్కి షూటింగ్ పూర్తి కాదని చెప్పారు. బాలీవుడ్లో ఒక్క సినిమా చేసేలోపు సౌత్లో నాలుగు సినిమాలు చేయొచ్చని చెప్పారు.అందుకే నేను బాలీవుడ్పై ఫోకస్ చేయలేదు. పర్దా హై పర్దా తర్వాత ఆఫర్స్ వచ్చినా తిరస్కరించా.మిథున్ చక్రవర్తి అలా అడిగేవాడుఅప్పట్లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేది. సినిమా షూటింగ్స్ అన్నీ అక్కడే జరిగేవి. నా సినిమా షూటింగ్ కోసం అక్కడి వెళ్తే..అదే హోటల్లో ఉండేదాన్ని. అప్పుడు మిథున్ చక్రవర్తి నా దగ్గరకు వచ్చి మరీ..‘నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్’ అని అడిగేవాడు. నాకు చేయాలనే ఉండేది..కానీ డేట్స్ ఖాలీగా ఉండేవి కాదు. నేను వెళ్లిన ప్రతిసారి ఆయన నా గది దగ్గరకు వచ్చి మరీ అడిగేవాడు. నాకేమో డేట్స్ ఖాలీగా ఉండేవి కాదు. ఒకానొక దశలో ఆ హీరో హోటల్కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని. అంత పెద్ద స్టార్ హీరోకి నో చెప్పలేక బాధపడేదాన్ని. ఎప్పుడైనా ఊటీకి వెళితే.. ఆ హోటల్ వద్దు..వేరే హోటల్లో రూమ్ బుక్ చేయమని అడిగేదాన్ని. ఆయనకు నొ చెప్పాలంటే ఏదోలా అనిపించేంది’ అని మీనా చెప్పుకొచ్చింది.
బిగ్బాస్
బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!
బిగ్బాస్ ప్రోమో: అమలతో డ్యాన్స్ చేసిన నాగార్జున..
ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే!
హౌస్లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే!
దివ్య ఇచ్చిన షాక్తో బోరుమని ఏడ్చిన తనూజ.. ఎంతో కష్టపడ్డానంటూ..
నన్ను బెదిరించేవాడే లేడన్న భరణి.. మళ్లీ అతడే కెప్టెన్!
పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!
దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం!
సీక్రెట్ టాస్క్లో ఇరగదీసిన దివ్య.. కల్యాణ్కు అన్యాయం
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
A to Z
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో థ్రిల్లర్ లేదంటే హారర్ సినిమాలని ఎక్కువగా ...
'ది ఫ్యామిలీ మ్యాన్-3' యాక్షన్ ట్రైలర్ విడుదల
'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్కు చాలామంది అభిమ...
శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవార...
ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంట...
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. తప్పిన జ్యోతిషం
బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తల్లిదండ్...
మహిళా క్రికెటర్ కధతో సినిమా... నవంబరు 7న మళ్లీ విడుదల...
కళ అంటే కాసుల్ని మాత్రమే కాదు కలల్ని ఒడిసిపట్టేది ...
ఇండో-చైనా యుద్ధంపై సినిమా.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ ల...
సతీమణి బర్త్ డే.. కేఎల్ రాహుల్ స్పెషల్ విషెస్!
బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టికి ఆమె భర్త, టీమిండియా...
ఇండియాలో అవతార్ ఈవెంట్
‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘అవత...
'ప్రెడేటర్: బ్యాడ్ల్యాండ్స్' సినిమా నవంబర్ 7న రిలీజ్
సైన్స్ ఫిక్షన్ జానర్లో అత్యంత భయానకమైన పాత్రల్ల...
ఆస్కార్లో సందడిగా కనిపించిన రాజ్.. కొత్త మూవీ కోసం శిక్షణ
ఈరోజు మన తెలుగు చిత్రసీమను టాలీవుడ్ అంటున్నామన్నా....
ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)
ఈ వీకెండ్లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంట...
18 ఏళ్లు మరొకరితో ఎఫైర్.. నా భార్యకి అంతా తెలుసు!
పెళ్లయ్యాక కూడా ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నా.. 18 ...
పెద్ది 'చికిరి' బాగుంది.. కానీ, బిగ్ డౌట్
‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అం...
21 ఏళ్ల తర్వాత ఆటోగ్రాఫ్ మళ్లీ వస్తోంది..
ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. దర్శకుడు చ...
ఈ ఫోన్ నంబర్ నాది కాదు: రుక్మిణి వసంత్
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణి వసంత్ పే...
ఫొటోలు
అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)
ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)
'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
టీమిండియా టీ20 మ్యాచ్లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)
ముద్దమందారం అంతా క్యూట్గా బ్రిగిడ (ఫొటోలు)
రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' సినిమా (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో నటి దివి (ఫొటోలు)
Kamal Haasan: బార్బర్ షాపులో పనిచేసి.. విశ్వనటుడిగా ఎదిగి.. (ఫోటోలు)
గాసిప్స్
View all
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
స్పిరిట్లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం!
ఓటీటీలోకి 'డ్యూడ్'.. డేట్ ఫిక్సయిందా?
హీరోగా మరో వారసుడు ఎంట్రీ.. జోడీగా రుక్మిణీ వసంత్
అప్పుడే హీరోగా వద్దనుకున్నా : రాహుల్ రవీంద్రన్
ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?
'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ
14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు!
హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్
అదే ఫార్ములా ఫాలో అవుతున్న చిరు?
రివ్యూలు
View all
40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!
3
Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ
3
'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?
3
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ
2.5
Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ
పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!
ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)
3
‘కె-ర్యాంప్’ మూవీ రివ్యూ
సినీ ప్రపంచం
40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!
టైటిల్: ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi)నటులు: ఆర్.మాధవన్, ఫాతిమా సనా షేక్ (దంగల్ నటి)ఓటీటీ: నెట్ఫ్లిక్స్ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. తమకు నచ్చిన కంటెంట్ను చూసే వీలు దొరికింది. దీంతో భాషతో సంబంధం లేకుండా నచ్చిన కంటెంట్ తెగ చూసేస్తున్నారు. ప్రజెంట్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ట్రెండ్కు తగ్గ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. అలా ప్రస్తుత రోజుల్లో 42 ఏళ్లయినా పెళ్లికానీ ఓ సంప్రదాయ యువకుడి కథే ఈ ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi). ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.కథేంటంటే..సంప్రదాయ కుటుంబానికి చెందిన 42 ఏళ్ల శ్రీరేణు(ఆర్ మాధవన్). అతని పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు ఎన్నో ఏళ్లుగా సంబంధాలు చూస్తూనే ఉంటారు. శ్రీ పెళ్లి వేడుక కోసం ఫ్యామిలీ అంతా ఎదురు చూసేవారు. అసలు అతనికి పెళ్లి యోగం ఉందో లేదో అని జ్యోతిష్యులను అడిగేవారు. కానీ అవన్నీ వర్కవుట్ కాకపోవడంతో శ్రీరేణు మానసికంగా ఇబ్బందులు పడేవాడు.అలా ఇబ్బందులు పడుతున్న శ్రీకి అతని ఫ్రెండ్ ఓ సలహా ఇస్తాడు? అతని సలహా విన్న శ్రీరేణు ఉరకలెత్తే ఉత్సాహంతో మొదలుపెడతాడు? అలా అతను ఊహల్లో తేలుతుండగానే.. మధు బోస్(ఫాతిమా సనా షేక్) అతనికి పరిచయమవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరి మధ్య విభేదాలొస్తాయి. ఇక ఇద్దరికీ సెట్ కాదని శ్రీరేణు భావిస్తాడు. దీంతో ఆమెను దూరంగా పెడతాడు. ఆ తర్వాత మళ్లీ వీరు కలిశారా? అసలు చివరికీ ప్రేమలో పడ్డారా? 40 ఏళ్లు దాటినా శ్రీరేణు పెళ్లి కళ నేరవేరిందా? అనేది తెలియాలంటే ఆప్ జైసా కోయి చూడాల్సిందే.డైరెక్టర్ వివేక్ సోని నేటి సమాజానికి అవసరమైన కథనే ఎంచుకున్నారు. ఈ సోషల్ మీడియా రోజుల్లో వర్జిన్ అన్న పదానికి అర్థం వెతకడం దాదాపు అసాధ్యమే. అలాంటి మైండ్సెట్ ఉన్న నేటి యువతకు ఈ మూవీతో సరైన సందేశం ఇచ్చాడు. ఒక మనిషికి ప్రేమ, నమ్మకం, ఆత్మగౌరవం అనేవి ఎంత ముఖ్యమో ఈ కథతో సరికొత్త నిర్వచనమిచ్చాడు దర్శకుడు. శ్రీ రేణు లాంటి అబ్బాయి.. మధు బోస్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే సన్నివేశాలు నేటి యూత్కు బాగా కనెక్ట్ అవుతాయి. ఒకవైపు ప్రేమ- మరోవైపు నమ్మకం అనే వాటి చుట్టే కథను నడిపించాడు డైరెక్టర్. ఓవరాల్గా చూసే పెళ్లి కానీ 42 ఏళ్ల యువకుడి కథే. కానీ ఈ ప్రేమకథలో తీసుకొచ్చిన ఎమోషన్స్ అద్భుతం. ఆడ, మగను ఎక్కువ, తక్కువ అంటూ చూసే వాళ్ల కళ్లు తెరిపించే ప్రేమకథా చిత్రమే ఆప్ జైసా కోయి. వీకెండ్లో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావాలంటే ఈ మూవీ ట్రై చేయండి.
'మిడిల్ క్లాస్'తో రీఎంట్రీ ఇచ్చిన విజయలక్ష్మి
ఇటీవల మంచి కంటెంట్తో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. మంచి కథ ఉంటే హీరో హీరోయిన్లు ఎవరైనా గానీ చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అలా పలు చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి పాపులర్ అయిన నటులలో మునీష్ కాంత్ ఒకరు. పలు చిత్రాల్లో క్యారెట్ ఆర్టిస్ట్ గానూ మెప్పించిన ఈయన తాజాగా హీరోగా అవతారం ఎత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిడిల్ క్లాస్. కాగా ఇంతకుముందు పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిన నటి విజయలక్ష్మి తాజాగా రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దివంగత నిర్మాత ఢిల్లీబాబుకు చెందిన యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన తాజా చిత్రం మిడిల్ క్లాస్. కిషోర్ ముత్తు రామలింగం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వినోదభరిత కథాచిత్రంగా అనిపించినా , ఒక సందర్భంలో థ్రిల్లర్ బాణీలో సాగుతుందన్నారు. ఇందులో నటుడు మునీష్ కాంత్ తన సొంత ఊరిలో స్థలం కొనుక్కుని సెటిల్ అవ్వాలని ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటాడన్నారు. అయితే ఆయన భార్య మాత్రం సిటీలో జీవించాలని ఆశపడుతుందన్నారు. అలా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తుందన్నారు. ఆ తర్వాత వారి సంతాన జీవితం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో నటుడు రాధారవి, వేల రామమూర్తి ముఖ్యపాత్రలు పోషించినట్లు చెప్పారు.
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలానే బ్యాడ్ గర్ల్, చిరంజీవ, కిస్, మిత్రమండలి, బారాముల్లా తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ బొమ్మలు.. డిజిటల్గా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు జారన్ అనే సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. వీటితోపాటు ఇప్పుడు మరో రెండు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)కొన్నాళ్ల క్రితం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం హౌస్మేట్స్. జీ5లో అందుబాటులో ఉండేది. ఇప్పటివరకు తమిళంలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దెయ్యమే లేకుండా ఈ హారర్ సినిమా తీయడం విశేషం. ఒకే అపార్ట్మెంట్లో రెండు వేర్వేరు కాలాల్లో రెండు కుటుంబాలు ఉంటాయి. దీంతో ఒకరి గురించి మరొకరు తెలుసుకుని భయపడతారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.మరోవైపు 2023 అక్టోబరులో రిలీజైన 'ధీమహి' అనే తెలుగు సినిమా.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. అమెరికాలో సర్జన్గా కార్తీక్(సాహస్) పనిచేస్తుంటాడు. ఇతడికి మేనకోడలు ధీమహి అలియాస్ మహి(ఆషిక పగడాల) అంటే పంచప్రాణాలు. కొన్నిరోజులకు మహి అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది. తర్వాత చంపేస్తారు కూడా. మేనకోడలు చావుకి తానే కారణమని బాధపడే కార్తీక్.. నెక్రోమాన్సీ అనే పద్దతితో ఆమె ఆత్మతో మాట్లాడి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు)
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఈ వారం తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' మాత్రమే ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది. మరి తొలిరోజు దీనితో పాటు రిలీజైన సినిమాల సంగతేంటి? కలెక్షన్స్ ఎంత వచ్చాయని టాక్ వినిపిస్తుంది? ఇంతకీ వీటిలో ఏయే సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' విషయానికొస్తే.. విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అలా దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.1.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం తొలిరోజు కంటే రెండో రోజు వచ్చేసరికి నాలుగురెట్ల వసూళ్ల పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. బహుశా వీకెండ్ తర్వాత చేస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!)మహేశ్బాబు బావమరిది సుధీర్బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. హీరోతో పాటు కొందరు మాత్రమే తెలుగు నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి కనీస వసూళ్లయినా వస్తాయా అనేది చూడాలి.వీటితో పాటు తిరువీర్ హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందని అంటున్నారు. ఇదొకటి వచ్చిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలీదు. కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చుంటాయి. ఇవి కాకుండా 'ఆర్యన్', 'డీయస్ ఈరే' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే రష్మిక సినిమా మాత్రమే ప్రస్తుతానికి లీడ్లో ఉంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)
వంటగదిలో నిహారిక.. అను 'గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు
వంటగది వీడియో పోస్ట్ చేసిన నిహారికఇంట్లో పెట్ డాగ్తో నమ్రత హ్యాపీనెస్'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాల్లో అను ఇమ్మాన్యుయేల్హీరోయిన్ మానస వారణాసి అడవిలో షికార్లుఉత్తరాది అమ్మాయిలా మారిపోయిన రాశీఖన్నాఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెబుతూ శివానీ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)
ఆ హీరో హోటల్కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని ..: మీనా
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్గా దక్షిణాది ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాను చేసింది. తమిళ, కన్నడలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉండేది. ఒకనొక దశలో ఒకే రోజు మూడు, నాలుగు సినిమాల షూటింగ్లకు హాజరయ్యేదట. ఇలా తెలుగు,కన్నడ,తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసిన మీనా(Meena).. హిందీలో మాత్రం పర్దా హై పర్దా అనే ఒకే ఒక మూవీ చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా..తాను చేయలేదట. ఓ స్టార్ హీరో అయితే పలుమార్లు తనతో సినిమా చేయమని కోరినా.. చేయలేకపోయానని..ఒకనొక దశలో ఆయన ఉన్న హోటల్కి వెళ్లాలంటే భయపడ్డానని అంటోది మీనా. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హీరో గురించి, తాను ఎందుకు బాలీవుడ్ సినిమాలు చేయలేకపోయిందో వివరించింది.తినడానికి కూడా టైం లేదు..తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేశాను. అదే సమయంలో నాకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ చేయలేకపోయాను. ఇక్కడే నాకు తినడానికి, నిద్రపోవడానికి కూడా టైమ్ దొరకలేదు. ఇక బాలీవుడ్ సినిమాలు ఎలా చేస్తా. పైగా అక్కడ టైమ్కి షూటింగ్ పూర్తి కాదని చెప్పారు. బాలీవుడ్లో ఒక్క సినిమా చేసేలోపు సౌత్లో నాలుగు సినిమాలు చేయొచ్చని చెప్పారు.అందుకే నేను బాలీవుడ్పై ఫోకస్ చేయలేదు. పర్దా హై పర్దా తర్వాత ఆఫర్స్ వచ్చినా తిరస్కరించా.మిథున్ చక్రవర్తి అలా అడిగేవాడుఅప్పట్లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేది. సినిమా షూటింగ్స్ అన్నీ అక్కడే జరిగేవి. నా సినిమా షూటింగ్ కోసం అక్కడి వెళ్తే..అదే హోటల్లో ఉండేదాన్ని. అప్పుడు మిథున్ చక్రవర్తి నా దగ్గరకు వచ్చి మరీ..‘నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్’ అని అడిగేవాడు. నాకు చేయాలనే ఉండేది..కానీ డేట్స్ ఖాలీగా ఉండేవి కాదు. నేను వెళ్లిన ప్రతిసారి ఆయన నా గది దగ్గరకు వచ్చి మరీ అడిగేవాడు. నాకేమో డేట్స్ ఖాలీగా ఉండేవి కాదు. ఒకానొక దశలో ఆ హీరో హోటల్కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని. అంత పెద్ద స్టార్ హీరోకి నో చెప్పలేక బాధపడేదాన్ని. ఎప్పుడైనా ఊటీకి వెళితే.. ఆ హోటల్ వద్దు..వేరే హోటల్లో రూమ్ బుక్ చేయమని అడిగేదాన్ని. ఆయనకు నొ చెప్పాలంటే ఏదోలా అనిపించేంది’ అని మీనా చెప్పుకొచ్చింది.
బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!
బిగ్బాస్ షోలో వీకెండ్ వచ్చిందంటే చాలు హౌస్ట్ నాగార్జున వచ్చేస్తారు. కాస్త సందడి చేస్తారు. ఈసారి కూడా అలానే 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ, మూవీలో హీరోయిన్-నాగ్ భార్య అమల షోలో సందడి చేశారు. నాగ్-అమల స్టెప్పులు కూడా వేశారు. ఇవన్నీ సరే గానీ వీకెండ్ వస్తే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి బిగ్బాస్కి ఛాన్స్ ఇవ్వకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)9వ సీజన్లో ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. ఈసారి సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ నామినేషన్స్లో ఉన్నారు. సేవ్ చేసేందుకు ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి వరకు ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత చివరి స్థానంలో సాయి శ్రీనివాస్ నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీకెండ్ ఇతడు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్. గత కొన్నాళ్ల నుంచి డల్గా ఉన్న రాము.. సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఐదోవారం వరకు రాము రాథోడ్ బాగానే బండి లాక్కొచ్చాడు గానీ తర్వాత మాత్రం పూర్తిగా డల్ అయిపోయాడు. నామినేషన్స్లో వాదించట్లేదు, పైపెచ్చు తానే నామినేట్ అవుతానని అంటున్నాడు. మరోవైపు గేమ్స్ వేటిలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారని పదే పదే అంటున్నాడు. శనివారం ఎపిసోడ్లోనూ హౌస్ట్ నాగార్జున ఇదే విషయం అడిగారు. దీంతో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్)'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని రాము దీనంగా చెప్పాడు. ప్రోమోలో డ్రామా చూపించినప్పటికీ నిజంగానే రాము బయటకొచ్చేశాడట. శనివారం ఎపిసోడ్లోనే ఈ సెల్ఫ్ ఎలిమినేషన్ ఉండబోతుంది.ప్రతివారం ఒకే ఎలిమినేషన్ ఉంటుందిగా. రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడంతో రెగ్యులర్గా జరగాల్సిన ఉంటుందా లేదా అందరూ అనుకుంటున్నారు. అయితే సాయి శ్రీనివాస్ని కూడా పంపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాలావరకు అయితే రాము మాత్రమే హౌస్ నుంచి బయటకు రావొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: చెల్లి సీమంతం గ్రాండ్గా చేసిన బిగ్ బాస్ వితిక)
విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దీంతో తన చివరిదైన 'జన నాయగణ్' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన తొలి పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'తళపతి కచేరీ' అంటూ సాగే మూవీలోని తొలి పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)అనిరుధ్ ఎప్పటిలానే మరో మాస్ బీట్తో అలరించాడు. దానికి విజయ్, జనాలతో కలిసి వేసిన సింపుల్ స్టెప్పులు.. ఆయన అభిమానులకు కనువిందు చేసేలా ఉన్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. (ఇదీ చదవండి: Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)
హీరో మెటీరియల్ నుంచి హీరోయిన్ బరువు దాకా...
ఇది సోషల్ మీడియా యుగం. కారెవరూ ఫేమస్ అవడానికి అనర్హం అన్నట్టుగా తయారు చేసిన సామాజిక మాధ్యమాల యుగం. ఇవి ప్రతీ ఒక్కరికీ కీర్తి దాహాన్ని పాప్యులారిటీ పిచ్చిని పెంచేస్తున్నాయి. ఉఛ్చనీచాలు, కనీస విలువలను మర్చిపోయేలా చేస్తున్నాయి. అయితే ఆ మైకంలో జర్నలిజం కూడా చిక్కుకుపోవడమే దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలవడానికి ఒకప్పుడు పాత్రికేయులు గొప్ప గొప్ప కధనాలు రాసేవారు. సినిమాలపై అద్భుతమైన సమీక్షలతో ప్రేక్షకులకు మార్గదర్శకత్వం వహంచేవారు. ఇప్పుడు.. దాని కోసం కొందరు ఎంచుకుంటున్న దారులు సినీ జర్నలిస్టులు అంటేనే సెలబ్రిటీలు చీదరించుకునే స్థాయికి దిగజార్చుతున్నాయి.ఆ మధ్య ఓ సినీ జర్నలిస్ట్ నటి మంచులక్ష్మి వస్త్రధారణపై ప్రశ్నించడం ద్వారా తల బొప్పి కట్టించుకున్న వైనం చూశాం. ఐదు పదుల వయసులో ఉన్న మహిళ అయి ఉండీ ఇలాంటి దుస్తులు ధరించడం కరెక్టా? అనే అసంబద్ధమైన ప్రశ్న ద్వారా మంచులక్ష్మి కోపాన్ని నషాళానికి ఎక్కించారాయన. ఇది చిలికి చిలికి చివరకి మా అసోసియేషన్కి మంచులక్ష్మి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.ఆ ఉదంతం ఇంకా మరవకముందే... మరో పాత్రికేయ నారీమణి... తమిళ నటీనటుల సాక్షిగా తెలుగు జర్నలిస్ట్ల పరువు తీసిపారేశారు. ఒక యువ కధానాయకుడు, దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan)ను ప్రశ్నించే క్రమంలో మీరు హీరో మెటీరియల్ కాదు కదా అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్ వివాదం రాజేసింది. దీంతో ఆమెపై నెటిజన్ల నుంచి సినీ జనం దాకా దుమ్మెత్తి పోశారు. సీనియర్ నటుడు శరత్కుమార్ నుంచి మన యువనటుడు కిరణ్ అబ్బవరం దాకా... సదరు జర్నలిస్ట్ ప్రశ్నలోని డొల్లతనాన్ని లేకితనాన్ని ఎత్తిచూపారు.సరే... ఇప్పుడిప్పుడే ఆ సంగతి మరుగునపడుతోంది అనుకునేంతలో... తమిళ నాట మరోసారి మరో సినీ జర్నలిస్ట్ తన నోటికి పని కల్పించాడు. మార్గంకాలి, అనుగ్రహీతన్ అంటోనీ వంటి మళయాళ సినిమాల ద్వారా ప్రతిభావంతురాలైన యువనటిగా పేరు తెచ్చుకుంటున్న యువ కధానాయిక గౌరీ కిషన్(Gouri kishan) ను... తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మీ బరువు ఎంత? అంటూ ప్రశ్నించడం ద్వారా నోటికి ఉండే అన్ని హద్దులనూ చెరిపేశాడు. ఈ ప్రశ్నను ఎదుర్కున్న గౌరీ కిషన్ అదే సమావేశంలో సదరు జర్నలిస్ట్ను పట్టుకుని ఎదురు ప్రశ్నలతో ఉతికి ఆరేయడం వేరే సంగతి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఖుష్బూ, నటి రాధిక, గాయని చిన్మయి... వంటివారు గౌరీ కిషన్కు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు. ఆమె జర్నలిస్ట్ను ఉతికి ఆరేసిన తీరును ప్రత్యేకంగా శభాష్ అంటున్నారు.ఇప్పుడు ఇకనైనా సినిమా జర్నలిజం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి ఈ మూడు సందర్భాల్లోనూ జర్నలిస్ట్లు వేసిన ప్రశ్నలు అత్యంత అసందర్భం, అసంబద్ధం అనేది నిస్సందేహం. అయినప్పటికీ అలా వారు అడగడం వెనుక పాప్యులారిటీ లేదా వైరల్ అవ్వాలనే దురాశ ఉండవచ్చునని అనిపిస్తోంది. వ్యక్తి దురాశ వ్యవస్థకు చేటు కాకూడదు. సినీ జర్నలిజం మొత్తానికి దీని వల్ల కలుగుతున్న, కలగబోతున్న నష్టాన్ని సీనియర్ పాత్రికేయులు, సినిమా పెద్దలు వెంటనే గుర్తించి తగిన మరమ్మతులు చేయడం తక్షణావసరంగా కనిపిస్తోంది.
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలతో వివాదాస్పద దర్శకుడిగా వివేక్ అగ్నిహోత్రి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన చివరి చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్'. 1947లో ఇండియా-పాక్ విభజన బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే చర్చనీయాంశమైన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'ద బెంగాల్ ఫైల్స్' సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివితో దీన్ని తీశారు. తొలి రెండు చిత్రాల్లానే ఇది కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల 21 నుంచి హిందీ భాషలో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'కె- ర్యాంప్'.. అధికారిక ప్రకటన)'ద బెంగాల్ ఫైల్స్' విషయానికొస్తే.. 1947వ సంవత్సరంలో భారత్-పాక్ ఎలా విడిపోయాయి. ఈ విషయంలో గాంధీ ఎలాంటి పాత్ర పోషించారు. అప్పుడు హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు చేలరేగాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు. ఈ అనర్థాలన్నీ ఎందుకు జరిగాయనేది ఈ సినిమా స్టోరీ.ప్రధానంగా భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయే సమయంలో గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాని ఇదంతా వద్దని అంటారు. జిన్నా మాత్రం.. ముస్లింలు ఎప్పుడూ ముస్లింలే, హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు అని అంటాడు. తర్వాత జిన్నా మనుషులు అప్పటి దేశ రాజధాని అయిన కలకత్తాలో మారణహోమం సృష్టిస్తారు. హిందూ స్త్రీలని, మహిళలని, చిన్నపిల్లలని చూడకుండా దారుణంగా కాల్చి చంపేస్తారు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటీషర్లు ఏం చేశారు? ముస్లింలపై భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు? తమని తాము ఎలా కాపాడుకున్నారనే అంశాల్ని ఇందులో చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
సినిమా
రాజమౌళి కొత్త సినిమా నుంచి ప్రమోషన్ స్టార్ట్.. మహేష్ బాబు టైటిల్ ఇదేనా?
పెద్ది పాటలో చరణ్ స్టెప్స్, సలామ్ అనాలిని గుర్తు చేస్తున్నాయా?
సినిమాల వరదలో పుష్పరాజ్..! రాజమౌళి - బన్నీ కాంబినేషన్ పక్కా అవుతుందా?
"పుష్ప ది ఎపిక్" కమింగ్ సూన్..
Disha: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. ప్రభాస్ వల్ల నేను కంట్రోల్ తప్పా..!
ఆ ఒక్క మాటతో బండ్ల గణేష్ కు ఇచ్చి పడేసిన అల్లు అరవింద్..!
అసభ్యకరంగా ట్రోలింగ్.. సీపీ సజ్జనార్ కు సింగర్ చిన్మయి ఫిర్యాదు
Bandla Ganesh: నా ఉద్దేశం అది కాదు.. సారీ విజయ్..
తెలుగు మూవీలో కుంభమేళా పూసల పిల్ల
దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్
