ప్రధాన వార్తలు
ఫైనల్గా మృణాల్ ఠాకూర్కు జత కుదిరింది
సినిమాలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. ఊహించని కాంబో సెట్ కావచ్చు. ఇందుకు తాజా ఉదాహరణ నటి మృణాల్ ఠాకూర్నే. తెలుగులో సీతారామం అనే ఒక్క చిత్రంతో దక్షిణాదిలో పాపులర్ అయిన ఈ ఉత్తరాది బ్యూటీకి భారీగానే ఛాన్స్లు వచ్చాయి. ఆ తరువాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ.., హాయ్ నాన్న చిత్రం మినహా ఏదీ ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో అవకాశాలు ముఖం చాటేశాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నటించిన డెకాయిట్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇకపోతే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో ఒక నాయకిగా ఈ బ్యూటీ నటిస్తున్నారు. ఆ చిత్రం మాత్రమే చేతిలో ఉంది.హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నా, తమిళంలో అవకాశాలు దోబూసులాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య నటుడు ధనుష్తో ప్రేమాయణం అంటూ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని ఈమె కొట్టి పారేశారు కానీ, ధనుష్కు జంటగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవతున్నారనే ప్రచారం మాత్రం జరిగింది.అయితే అది ఇప్పటి వరకూ ఫైనలైజ్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో సంచలన నటుడు శింబుతో జత కట్టే అవకాశాన్ని అందుకున్నారన్నది తాజా సమాచారం. శింబు ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర చెన్నై నేపధ్యంలో సాగే గ్యాంగ్స్టార్ కథాంశంతో కూడిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. కాగా శింబు మరో చిత్రానికి గ్రీస్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు ముందు ఓ మై కడవులే, డ్రాగన్ వంటి సక్సెస్పుల్ చిత్రాలను తెరకెక్కిన అశ్వద్ మారిముత్తు తాజాగా దర్శకత్వం వహించినున్న చిత్రంలో శింబు నటించనున్నారు. దీన్ని ఏజీఎస్ ఎంటర్ట్రైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. కాగా ఇందులో నటుడు సంతానం ముఖ్య భూమికను పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా ఇందులో నాయకిగా నటి మృణాల్ ఠాకూర్ నటించనున్నారన్నది తాజా సమాచారం. అరసన్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత శింబు ఈ చిత్రంలో నటించడానికి రెడీ అవుతారట. మొత్తం మీద చాలా కాలం పోరాటం తరువాత మృణాల్కు కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యిందన్నమాట.
మనశంకర వరప్రసాద్గారు మరో రికార్డ్.. అదేంటంటే?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్గారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.తాజాగా మనశంకర వరప్రసాద్గారు మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 109 థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు నిర్మాణం సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. హీరో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. 50 DAYS. 109 CENTRES. 🔥Thousands of celebrations 🥳Lakhs of whistles 😍Countless goosebumps ❤️🔥Megastar @KChiruTweets’s ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #ManaShankaraVaraPrasadGaru completes a sensational 50-day theatrical run, rewriting box office history 💥💥💥#MSG… pic.twitter.com/qFr1Pazn3k— Shine Screens (@Shine_Screens) March 2, 2026
'అది చూసి నేనే షాకయ్యా'.. తనికెళ్ల భరణి వీడియో రిలీజ్
సోషల్ మీడియా గురించి టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడారు. తనికెళ్ల భరణి ఆస్తులు చూస్తే మీరంతా షాక్ అని ఒకరు థంబ్నెయిల్ రాసుకొచ్చారు. నిజంగా అది చూశాకా నేనే షాకయ్యా.. ఇంటిముందు అరడజన్ కార్లు కూడా ఉన్నాయని చూపించాడు. అదంతా చూసి మేము నవ్వుకున్నామని తెలిపారు.ఇప్పుడు ఒకదేశంపై యుద్ధం జరుగుతోంది.. నేను ఒక దేశానికి సపోర్ట్ చేస్తున్నట్లు.. ఒక వర్గానికి మద్దతుగా చేస్తున్నట్లు ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తున్నారని తనికెళ్ల భరణి అన్నారు. నేను అన్ని వర్గాలు, మతాలను గౌరవిస్తానని.. ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదని.. భవిష్యత్తులో చేయనని తెలిపారు. ఇవీ చూసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు బాధపడి ఉంటారని వెల్లడించారు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు.. స్పందించవద్దని తనికెళ్ల భరణి కోరారు. సోషల్ మీడియా హద్దులు దాటుతొందా? pic.twitter.com/XKRqbSv2v8— Tanikella Bharani (@TanikellaBharni) March 2, 2026
రాకాస అందర్నీ నవ్విస్తుంది: సంగీత్ శోభన్
సంగీత్ శోభన్ , నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో సంగీత్ శోభన్ మాట్లాడుతూ– ‘‘రాకాస’ సినిమా కొత్తగా ఉంటుంది. అందర్నీ నవ్విస్తుంది. ప్రేక్షకులు ఖర్చుచేసే టికెట్ డబ్బులకు న్యాయం చేసేలా ఉంటుంది.నిహారిక, మానసగార్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో సంగీత్ యాక్టర్గా మరింత షైన్ అవుతాడు. థియేటర్స్కు వచ్చిన ఆడియన్స్ ను నిరాశపరచం’’ అని చెప్పారు నిహారిక కొణిదెల. ‘‘ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశాం. ప్రేక్షకులు మా సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు మానస శర్మ. ఈ కార్యక్రమంలో జీ5 తెలుగు కంటెంట్ హెడ్ దివ్య, సంగీత దర్శకుడు అనుదీప్, నటీనటులు రోహిణి, గెటప్ శ్రీను మాట్లాడారు.
బిగ్బాస్
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
ప్రేయసితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
A to Z
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయ...
మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా...
ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్
ఇప్పుడంతా ఓటీటీ జమానా. ఓ భాషలో అద్భుతమైన సక్సెస్ చ...
ఓటీటీలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మూకీ సినిమా
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నట...
దుబాయ్లో చిక్కుకుపోయా.. నన్ను భారత్కు తీసుకురండి!
ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ...
తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: బాలీవుడ్ నటి
తెలుగు చిత్రం చాణక్యుడుతో వెండితెరకు హీరోయిన్గా ప...
సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!
ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన మమతా కులకర్ణి 2003 త...
తీహార్ జైల్లో 4 నెలలు.. చావు కోసం ఎదురుచూశా: నటి
మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలలపాటు తీహార్ జైలుల...
19ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న 'షకీరా'
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీర...
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. క...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
హిట్ సినిమా దర్శకుడిపై నటి ఫిర్యాదు
మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం వి...
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
తమిళ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గుడ్ ...
ఫ్యామిలీ మ్యాన్గా సూర్య.. టైటిల్ ఏంటో తెలుసా?
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో ఇతర భాషా హీరోలకు ఘ...
'మనశంకర వరప్రసాద్గారు'కి 50రోజులు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్గారు...
ఫొటోలు
సంగీత్ పార్టీలో విరోష్ జోడీ.. ఫోటోలు షేర్ చేసిన విజయ్ (ఫోటోలు)
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ, రాజకీయ ప్రముఖులు ( ఫోటోలు)
’సువర్ణ టెక్ట్స్టైల్స్‘ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
వరలక్ష్మీ శరత్కుమార్ ‘సరస్వతి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సంగీత్ శోభన్ 'రాకాస' మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో బ్రహ్మానందం కొడుకు (ఫొటోలు)
హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)
శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)
గాసిప్స్
View all
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
దర్శకుడు మారుతి 'హ్యాపీ పొంగల్'?
నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’.. యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్?
హిట్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకొన్న వెంకటేశ్?
విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు”
నానికి హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ?
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
రివ్యూలు
View all
మూగజీవాల ఎమోషన్స్ చూపించే లక్కీ.. ఓటీటీ మూవీ రివ్యూ
2.75
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.75
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
సినీ ప్రపంచం
ఓటీటీలో 'తన్వి ది గ్రేట్' సినిమా.. సడెన్గా స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించి, నటించిన 'తన్వి ది గ్రేట్' (2025) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించిన విషయం తెలిసిందే. ఆటిజంతో బాధపడుతున్నప్పటికీ ఆర్మీలో చేరాలనే ఒక యువతి కల జీవితమే ఈ సినిమా.. ఇందులో శుభంగి దత్తా ప్రధాన పాత్ర పోషించంది. జాకీష్రాఫ్, అరవిందస్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి స్టార్స్ ఈ మూవీలో నటించారు.‘తన్వి ది గ్రేట్’ (Tanvi The Great) మూవీ సడెన్గా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇరవై రెండేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించిన అనుపమ్ ఖేర్.. గతేడాది ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం.ఈ చిత్రాన్ని ఎన్ఎఫ్డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ నిర్మించింది.
సొంతూరు ప్రజలకు విందు.. విజయ్పై విమర్శలు
సతీమణి రష్మికతో పాటు విజయ్ దేవరకొండ తన సొంతూరులో సందడి చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి రావడంతో స్థానికులు సంతోషించారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేటలో తమ ఫాంహౌజ్లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో భక్తిశ్రద్ధలతో గృహ ప్రవేశ పూజలు నిర్వహించారు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే, గ్రామస్థులకు, అభిమానులకు ఏర్పాటు చేసిన విందులో నాన్- వెజ్ ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్ అయింది. సత్యనారాయణ స్వామి వ్రతం సమయంలో అతిథిలకు నాన్- వెజ్ ఆహారం పెట్టడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, విజయ్ ఇచ్చిన విందుకు గ్రామస్తులు ఫిదా అయ్యారు. చాలామంచి భోజనంతో పాటుగా అందరినీ గౌరవంగా పలకరించారని చెబుతున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి పూజలు జరిగిన సమయంలో శాఖాహారం (వెజ్) మాత్రమే అతిథిలకు వడ్డిస్తారు. కానీ, విజయ్ దేవరకొండ వెజ్తో పాటు నాన్-వెజ్ కూడా వడ్డించారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే, తెలంగాణ నెటిజన్లు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. హిందూ సంప్రదాయాల అందరూ పాటిస్తారంటూనే ప్రాంతాన్ని బట్టి కొన్ని పద్దతులు మారుతాయని చెబుతున్నారు. తెలంగాణలో భక్తితో పాటు తమ ఆహారం పట్ల ప్రత్యేకమైన శైలి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. విజయ్ వారింట్లో పూజ ముగిసిన తర్వాత స్వామివారి పీఠాన్ని జరిపి ఆ కార్యక్రమాన్ని మొదట పూర్తి చేశారని చెబుతున్నారు. ఆ తర్వాతనే మాంసాహార విందును ఏర్పాటు చేశారని తెలుపుతున్నారు. తెలంగాణలోని చాలా కుటుంబాల్లో ఇలాంటి ఆనవాయితీగా వస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. విజయ్ ఇంటికి దూరంగానే నాన్- వెజ్ ఆహారం వడ్డించారని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో పూజ పూర్తయిన సాయంత్రం లేదా మరుసటి రోజు తప్పకుండా విందు ఉంటుందని అందులో మాంసం వడ్డించడం సర్వసాధారణమని గుర్తుచేస్తున్నారు.సొంతిల్లు కట్టుకున్నా: విజయ్స్వగ్రామం తుమ్మన్పేటకు మూడు దశబ్దాలుగా దూరంగా ఉన్నప్పటికీ తమ కుటుంబానికి గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందని విజయ్ దేవరకొండ తెలిపారు. తన తొలి పుట్టినరోజు కూడా ఇదే గ్రామంలో నిర్వహించినట్లు అమ్మా నాన్న చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. తన తండ్రి కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకున్నానని ఆయన అన్నారు. అందుకే తన వివాహానంతరం వ్రతం చేసి గ్రామస్థులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరు భోజనం చేసి తమను ఆశీర్వదించాలని కోరారు. తుమ్మన్పేట పాఠశాలలో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఉపకారవేతనం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అచ్చంపేట పరిధిలోని 44 పాఠశాలల విద్యార్థులకు దీన్ని అమలు చేస్తానన్నారు.ఊరందరికీ వివాహభోజనం పెట్టిన #VijayDeverakondaసొంత ఊర్లో సత్యనారాయణ వ్రతం చేసిన అనంతరం బంధుమిత్రులనదరికీ గ్రామస్తులకు విందు భోజనం పెట్టిన విజయ్ దేవరకొండ..#Virosh ❤️ pic.twitter.com/tojnbgBJcj— Suresh PRO (@SureshPRO_) March 2, 2026
నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు(85) అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం ఆయన కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వృద్ధాప్యం కారణంగా చికిత్స కూడా ఆయన శరీరం సహకరించకపోవడంతో హైదరాబాద్ మధురానగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత శివాజీకి ఫోన్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఒక్కరోజు ముందే ఓటీటీలో 'ఓం శాంతి శాంతి శాంతిః' స్ట్రీమింగ్
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30న విడుదలైన ఈ సినిమా మేకర్స్ అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, ఓటీటీ ఫ్యాన్స్ను ఈ మూవీ మెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. 2022లో విడుదలైన మలయాళ హిట్ సినిమా జయ జయ జయ జయహే రీమేక్గా తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ సజీవ్ తెరకెక్కించారు.‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ఆహా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 4న స్ట్రీమింగ్కు రావాల్సిన ఈ మూవీ గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి వచ్చేసింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో ఈషా రెబ్బా చూపించింది. కథేంటంటే..శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది.అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్ భాస్కర్) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంది. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే.
రోడ్డు ప్రమాదంలో నటి.. కారు టైర్ పంక్చర్ కావడంతో..
తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదంలో బుల్లితెర నటి దేవి ప్రియ(38) ప్రమాదానికి గురయ్యారు. ఆమె కేవలం సీరియల్స్లలో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నై నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు థేని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెరంబలూర్ వద్ద తన కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేశ్(38) రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తున్న క్రమంలో అటువైపు వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి దేవిప్రియ కారును బలంగా ఢీకొంది. దీంతో కారు డ్రైవర్ ముత్తుగణేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, ఆమె సహాయకుడు దివాకర్ (36) తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్థానికులు పెరంబలూర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
బోయపాటి శ్రీను కొత్త సినిమా.. స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమాలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంటుంది. కానీ, రీసెంట్గా వీరి నుంచి వచ్చిన ‘అఖండ-2’ ఆశించినంత రేంజ్లో మెప్పించలేదు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను తదుపరి చిత్రంపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. భారీ బడ్జెట్ చిత్రాలను చేసేందుకు ఇష్టపడే బోయపాటికి బలమైన మార్కెట్ ఉన్న హీరో దొరకాలి. ఒక సమయంలో అల్లు అర్జున్తో ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అది వర్కౌట్ కాలేదు. దీంతో బోయపాటి తన మనసుమార్చుకుని రానా దగ్గుబాటితో ఒక సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది.ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, బోయపాటి తన రాబోయే చిత్రంలో ప్రధాన పాత్ర కోసం రానా దగ్గుబాటిని సంప్రదించాడని తెలుస్తోంది. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని భావిస్తున్నప్పటికీ, ఇరువైపుల నుండి ఇంకా అధికారికంగా ధృవీకరణ రాలేదు. తన మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్తో రానాను మెప్పించే ప్రయత్నంలో బోయపాటి ఉన్నట్లు సమాచారం. కమర్షియల్ యాక్షన్ చిత్రాల వైపు ఆసక్తి చూపిస్తున్న రానా కూడా.. ఈ ప్రాజెక్ట్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.బోయపాటి శ్రీను కొద్దిరోజుల క్రితం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అట్లీ మూవీ షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ను కలిసి కథ కూడా చెప్పారట. బోయపాటి చెప్పిన కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత త్రివిక్రమ్తో ఒక సినిమాను లాక్ చేశాడు. ఆ వెంటనే పుష్ప-3 ఎటూ ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తి కావలంటే కనీసం 4ఏళ్లు పడుతుంది. అందుకే బోయపాటి మరో కథను రెడీ చేసి రానాకు వినిపించారని తెలుస్తోంది.
ఫైనల్గా మృణాల్ ఠాకూర్కు జత కుదిరింది
సినిమాలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. ఊహించని కాంబో సెట్ కావచ్చు. ఇందుకు తాజా ఉదాహరణ నటి మృణాల్ ఠాకూర్నే. తెలుగులో సీతారామం అనే ఒక్క చిత్రంతో దక్షిణాదిలో పాపులర్ అయిన ఈ ఉత్తరాది బ్యూటీకి భారీగానే ఛాన్స్లు వచ్చాయి. ఆ తరువాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ.., హాయ్ నాన్న చిత్రం మినహా ఏదీ ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో అవకాశాలు ముఖం చాటేశాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నటించిన డెకాయిట్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇకపోతే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో ఒక నాయకిగా ఈ బ్యూటీ నటిస్తున్నారు. ఆ చిత్రం మాత్రమే చేతిలో ఉంది.హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నా, తమిళంలో అవకాశాలు దోబూసులాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య నటుడు ధనుష్తో ప్రేమాయణం అంటూ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని ఈమె కొట్టి పారేశారు కానీ, ధనుష్కు జంటగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవతున్నారనే ప్రచారం మాత్రం జరిగింది.అయితే అది ఇప్పటి వరకూ ఫైనలైజ్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో సంచలన నటుడు శింబుతో జత కట్టే అవకాశాన్ని అందుకున్నారన్నది తాజా సమాచారం. శింబు ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర చెన్నై నేపధ్యంలో సాగే గ్యాంగ్స్టార్ కథాంశంతో కూడిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. కాగా శింబు మరో చిత్రానికి గ్రీస్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు ముందు ఓ మై కడవులే, డ్రాగన్ వంటి సక్సెస్పుల్ చిత్రాలను తెరకెక్కిన అశ్వద్ మారిముత్తు తాజాగా దర్శకత్వం వహించినున్న చిత్రంలో శింబు నటించనున్నారు. దీన్ని ఏజీఎస్ ఎంటర్ట్రైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. కాగా ఇందులో నటుడు సంతానం ముఖ్య భూమికను పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా ఇందులో నాయకిగా నటి మృణాల్ ఠాకూర్ నటించనున్నారన్నది తాజా సమాచారం. అరసన్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత శింబు ఈ చిత్రంలో నటించడానికి రెడీ అవుతారట. మొత్తం మీద చాలా కాలం పోరాటం తరువాత మృణాల్కు కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యిందన్నమాట.
మనశంకర వరప్రసాద్గారు మరో రికార్డ్.. అదేంటంటే?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్గారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.తాజాగా మనశంకర వరప్రసాద్గారు మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 109 థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు నిర్మాణం సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. హీరో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. 50 DAYS. 109 CENTRES. 🔥Thousands of celebrations 🥳Lakhs of whistles 😍Countless goosebumps ❤️🔥Megastar @KChiruTweets’s ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #ManaShankaraVaraPrasadGaru completes a sensational 50-day theatrical run, rewriting box office history 💥💥💥#MSG… pic.twitter.com/qFr1Pazn3k— Shine Screens (@Shine_Screens) March 2, 2026
'అది చూసి నేనే షాకయ్యా'.. తనికెళ్ల భరణి వీడియో రిలీజ్
సోషల్ మీడియా గురించి టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడారు. తనికెళ్ల భరణి ఆస్తులు చూస్తే మీరంతా షాక్ అని ఒకరు థంబ్నెయిల్ రాసుకొచ్చారు. నిజంగా అది చూశాకా నేనే షాకయ్యా.. ఇంటిముందు అరడజన్ కార్లు కూడా ఉన్నాయని చూపించాడు. అదంతా చూసి మేము నవ్వుకున్నామని తెలిపారు.ఇప్పుడు ఒకదేశంపై యుద్ధం జరుగుతోంది.. నేను ఒక దేశానికి సపోర్ట్ చేస్తున్నట్లు.. ఒక వర్గానికి మద్దతుగా చేస్తున్నట్లు ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తున్నారని తనికెళ్ల భరణి అన్నారు. నేను అన్ని వర్గాలు, మతాలను గౌరవిస్తానని.. ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదని.. భవిష్యత్తులో చేయనని తెలిపారు. ఇవీ చూసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు బాధపడి ఉంటారని వెల్లడించారు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు.. స్పందించవద్దని తనికెళ్ల భరణి కోరారు. సోషల్ మీడియా హద్దులు దాటుతొందా? pic.twitter.com/XKRqbSv2v8— Tanikella Bharani (@TanikellaBharni) March 2, 2026
అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు
దుబాయ్లో తాము క్షేమంగానే ఉన్నామని టాలీవుడ్ హీరో మంచు ట్వీట్ చేశారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అప్పుడప్పుడు దూరంలో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ.. అంతా ప్రశాంతంగానే ఉందని వెల్లడించారు. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో క్షేత్రస్థాయిలో అద్భుతమైన చర్యలు తీసుకుంటున్న యూఏఈ నాయకత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. దీంతో దుబాయ్, యూఏఈ గగనతలాన్ని మూసి వేయడంతో అక్కడే ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు. మంచు విష్ణు ఫ్యామిలీ, పీవీ సింధు సైతం ప్రస్తుతం దుబాయ్లోనే ఉండిపోయింది. To everyone concerned about our safety, thank you. 🙏 We are safe in Dubai. The family is safe. Aside from occasional distant sounds, life continues with calm and order.In tense times, what stands out is the quiet efficiency and brilliant preparedness on the ground. Grateful…— Vishnu Manchu (@iVishnuManchu) March 2, 2026
సినిమా
Vijay-Rashmika: శుభవార్త చెప్పిన కొత్త జంట
విజయ్ దేవరకొండ & రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం
అల్లు శిరీష్ & నయనిక ప్రీ వెడ్డింగ్ వీడియోలు
సొంతూరుకు విజయ్ వరాలు... ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తా
టాలీవుడ్ లో విక్రమ్ ఫైనల్ చేసిన నాలుగు కథలు ఇవే..
విజయ్-రష్మిక.. సత్యనారాయణ స్వామి వ్రతం
స్వగ్రామంలో విజయ్, రష్మిక సందడి
మియాపూర్ లో అపోలో ఫార్మసీ 1000వ స్టోర్ ను ప్రారంభించిన ఉపాసన
దురంధర్ 2 రివ్యూ వచ్చేసింది.. నా భర్త ఇరగదీశాడు అంటున్న యామి..!
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. జోర్డాన్ నుంచి డ్రాగన్ టీం ఎస్కేప్..!
