Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Ram Charan Movie: Clarity on the runtime of Peddi movie1
రామ్‌ చరణ్ 'పెద్ది' రన్‌టైమ్‌.. 4 గంటలపైనే?

పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్‌టైమ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్-2 కూడా అంతకుమించిన నిడివితో వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్‌టైమ్‌తో వస్తోందనే ప్రచారం మొదలైంది. సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటలపైనే ఉందని, ఫైనల్ రన్‌టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పెద్ది నుంచి విడుదలైన రెండో పాట 'రయ్ రయ్‌ రారా'పై చర్చ జోరుగా సాగుతోంది. చరణ్ డాన్స్‌ను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో అభిమానుల్లో పెద్ది చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆ డాన్స్ చేస్తున్న సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ ఆపుదామని చెప్పినా వినకుండా జ్వరంతోనే డాన్స్ చేశారని గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం 'రయ్‌ రయ్‌ రారా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. పెద్ది సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాలు నిజం కావని యూనిట్ స్పష్టతనిచ్చింది. అభిమానులు మాత్రం సినిమా ఫైనల్ రన్‌టైమ్‌పై అధికారిక అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Is Tollywood Effected By Iran Israel War2
టాలీవుడ్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అరబ్ దేశాలపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. దీని వల్ల పెట్రోలు, బంగారం ధరలు ఎక్కడ పెరిగిపోతాయోనని భారతీయులు కంగారు పడుతున్నారు. మరోవైపు ఇదే యుద్ధాన్ని చూసి టాలీవుడ్ కూడా భయపడుతోంది. దానికి చాలానే కారణాలున్నాయి. ఇంతకీ అవేంటి? రాబోయే పాన్ ఇండియా మూవీస్‌పై ఈ యుద్ధం ప్రభావం ఎంత ఉండొచ్చు?(ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు)బలమైన మార్కెట్ఒకప్పుడు అంటే తెలుగు సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్‌తో విదేశాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. భారతీయ చిత్రాలకు అమెరికన్ మార్కెట్ ఎంత కీలకమో.. అరబ్ దేశాల్లోని మార్కెట్ కూడా అంతే కీలకం. అరబ్ దేశాల్లో పనుల కోసం వెళ్లే చాలామంది భారతీయులు.. అక్కడ మూవీస్ బాగానే చూస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా అటు థియేటర్లలో మూవీస్ రిలీజులు కష్టమే. ఒకవేళ విడుదల చేసినా జనాలు.. వచ్చి చూడటం కూడా కొంతవరకు అనుమానమే. రాబోయే కొన్నినెలల పాటు అరబ్ దేశాల్లో మన సినిమాలకు మార్కెట్ కాస్త తగ్గొచ్చు.షూటింగ్స్ బంద్మన దేశంలో తీసే చాలా సినిమాలని విదేశాల్లోనూ తెరకెక్కిస్తుంటారు. మరీ ముఖ్యంగా దుబాయితో పాటు మిగతా అరబ్ కంట్రీస్‌లో పాటల షూటింగ్స్ లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఆయా దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల చాలావరకు చిత్రీకరణలు నిలిచిపోయాయి. కొన్నింటిని వేరే ప్రాంతాలకు మారుస్తున్నారు. అయితే అరబ్ దేశాల్లో చాలావరకు షూటింగ్స్‌కి సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది. ఇ‍ప్పుడు మరో చోటకు వెళ్లాలి అంటే ఆయా పరికరాల్ని అన్నింటినీ మరోచోటకు తీసుకెళ్లడం లాంటివి కాస్త కష్టతరమైన విషయమే అని చెప్పొచ్చు.ప్రయాణ ఆంక్షలుఇదే యుద్ధం వల్ల చాలావరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని వేరే వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో నటీనటులు, సాంకేతిక సిబ్బంది, నిపుణులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన పాన్ ఇండియా సినిమాలకు చాలావరకు విదేశాల్లోనే విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తుంటారు. యాక్షన్ సీన్స్ లాంటి వాటికోసం విదేశాల నుంచి సంబంధిత టెక్నీషియన్స్‌ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు యుద్ధం ఆగేంతవరకు ఈ విషయాల్లో సినిమా బృందాలకు ఇబ్బందులు తప్పవు.విడుదల వాయిదాఇదే యుద్ధ ప్రభావం.. రాజమౌళి తీస్తున్న 'వారణాసి', అల్లు అర్జున్-అట్లీ చేస్తున్న సినిమాలతో పాటు పలు చిత్రాల విడుదల తేదీలపై కచ్చితంగా పడే అవకాశమైతే ఉండొచ్చు. ఇరాన్-ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధాన్ని విరమిస్తాయనేది తెలియట్లేదు. ఒకవేళ రాబోయే కొన్నిరోజుల్లో విరమించినా సరే మన పాన్ ఇండియా సినిమాలకు అవసరమయ్యే విదేశీ సాంకేతికత, నిపుణుల విషయంలో కాస్త ఆలస్యం లేదా ఇబ్బందులు తలెత్తొచ్చు. అది పరోక్షంగా విడుదల తేదీలపై పడటం గ్యారంటీ.ఆర్థిక భారంయుద్ధం వల్ల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే సినిమా షూటింగ్ రవాణా ఖర్చులు పెరుగుతాయి. ప్రొడక్షన్ బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగొచ్చు. అదే జరిగితే బడ్జెట్ సమస్యలతో సినిమాల ఇంకాస్త లేటుగా ప్రేక్షకులు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.ఇదే యుద్ధం కారణంగా చాలామంది బాలీవుడ్ నటీనటులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వాళ్లందరూ స్వదేశానికి వచ్చేసినా సరే భయమనేది కొన్నాళ్ల పాటు ఉండిపోతుంది. దీంతో షెడ్యూల్స్, షూటింగ్స్ ఆలస్యం కావొచ్చేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఆయా దేశాలపైనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమపైనా పరోక్షంగా పడింది. రూ.10 వేల కోట్లకు పైనే నష్టం ఉండొచ్చని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)

Sunny Leone Daughter Nisha Latest Invention3
తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు

ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్.. చాన్నాళ్ల క్రితమే వాటిని పక్కనబెట్టేసింది. ఓ వైపు ఫ్యామిలీ, మరోవైపు సినిమాలు చేస్తూ బతికేస్తోంది. రీసెంట్ టైంలో అయితే సన్నీ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వీడియోలో కనిపించింది. సన్నీ ఇంటికి వెళ్లిన ఫరా ఖాన్.. చాలాసేపు ముచ్చటించింది. మిగతా వాటి సంగతేమో గానీ తన కూతురు గురించి సన్నీ లియోన్ చెప్పిన ఓ విషయం మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.(ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)డేనియల్ వెబర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత సన్నీ లియోన్.. లాతుర్‌కి చెందిన నిషా అనే పాపని దత్తత తీసుకుంది. తర్వాత సన్నీ దంపతులకు కవల అబ్బాయిలు పుట్టారు. నిషాకి ఇప్పుడు తొమ్మిదేళ్లు. అయితే ఈ వయసులోనే తన కూతురు.. బూ బాక్స్ అనేదాన్ని కనిపెట్టిందని సన్నీ బయటపెట్టింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నామని స్పష్టం చేసింది.సన్నీ లియోన్ మాట్లాడుతూ.. 'బూ బాక్స్' అనేది టూ ఇన్ వన్ టిష్యూ హోల్డర్. సాధారణంగా టిష్యూని ఉపయోగించిన తర్వాత ఓ డస్ట్ బిన్‌లో పడేస్తాం. లేదంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. ఇది గమనించిన నిషా.. టిష్యూ బాక్స్ పక్కనే చిన్న చెత్త బుట్ట కలిపి ఉండేలా దీన్న డిజైన్ చేసింది. అంటే టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే ఉన్న బిన్‌లో పడేయొచ్చు. దీంతో శ్రమ తగ్గుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది.అయితే దీన్ని తయారు చేయడం వెనక ఓ కారణముంది. ముంబైలోని దుమ్ము వల్ల నిషాకు ఎప్పటికప్పుడు అలర్జీ వచ్చేది. దానికోసం టిష్యూలు వాడి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పడేసేసరికి తిట్టేదాన్ని. అప్పుడు నిషాకు ఈ ఆలోచన వచ్చింది. ఓ టిష్యూ బాక్స్‌కు ప్లాస్టర్‌తో డిస్పోజబుల్ కప్ అతికించి నాకు చూపించింది. అదే ఇప్పుడు ఓ కమర్షియల్ ప్రొడక్ట్‌గా మారి నిషాకు డబ్బులు కూడా తెచ్చిపెడుతోంది. చిన్న వయసులోనే స్వశక్తి డబ్బు సంపాదిస్తోంది అని సన్నీ లియోన్ గర్వంగా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)

Riya Shibu And Trpti Dimri Latest News4
అందంగా 'సర్వం మాయ' డెలులు.. గ్లామరస్ 'స్పిరిట్' బ్యూటీ

కేరళ చీరకట్టులో అందంగా 'డెలులు' రియా షిబుగ్లామర్‌తో మెరిసిపోతున్న 'స్పిరిట్' తృప్తి దిమ్రిజిమ్‌లో తెగ కష్టపడిపోతున్న సంయుక్త మేనన్అద్దం ముందు పొట్టి జీన్ స్కర్ట్‌లో ఈషా రెబ్బాసోయగాలతో రచ్చ లేపుతున్న జాన్వీ కపూర్సిల్క్ చీరలో నవ్వుతూ కావ్య కల్యాణ్ రామ్ View this post on Instagram A post shared by Riya Shibu (@riyashibu_) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

Sapthami Gowda Angry On Photographers Who Unwanted Zooming5
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ మండిపాటు

కొన్నేళ్ల ముందు వరకు పాపారాజీ కల్చర్ ఎక్కువగా ముంబైలో కనిపించేది. కానీ రీసెంట్ టైంలో దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. పాపారాజీ అంటే ఫొటోగ్రాఫర్స్ గుంపుగా కనిపిస్తూ సెలబ్రిటీల ఫొటోలు తీస్తుంటారు. వీళ్లలో కొందరు అనవసరమైన జూమ్ చేస్తూ హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో, యూట్యూబర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల వల్ల హీరోయిన్ల ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడ కూడా ఇప్పుడు అలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొంది. సదరు ఫొటోగ్రాఫర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.(ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)'ఇండస్ట్రీలోని మహిళందరి తరఫున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఈవెంట్స్‌లో మా పని గురించి కాకుండా, మా శరీర భాగాలని అనుచితంగా జూమ్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటంతో పాటు మమ్మల్ని అవమానించడమే అవుతుంది. కొందరు వ్యక్తులు చేస్తున్న ఇలాంటి పనులు ఏ మాత్రం సహించలేం. నటన కోసం, వృత్తి కోసమే ఇక్కడ ఉన్నాం. అలాంటిది హద్దులు దాటి ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. మా హుందాతనాన్ని ఇది దెబ్బతీస్తోంది. మీడియ మిత్రులు ప్రొఫెషనలిజం పాటిస్తూ కనీస గౌరవం ఇవ్వాలని ఆశిస్తున్నాం' అని సప్తమి గౌడ.. ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.తమతో చాలామంది జర్నలిస్టులు గౌరవంతో వ్యవహరిస్తున్నారని చెప్పిన సప్తమి గౌడ.. అలాంటి మీడియా మిత్రులు కూడా ఈ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలవాలని విజ్ఞప్తి చేసింది. మహిళలని ఫొటోలని తీసే విధానంలో దారుణంగా వ్యవహరిస్తున్న కొందరిని అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు.. ఈ తరహా ఫొటోగ్రాఫర్ల తీరుని తప్పుబట్టారు. తమని అసభ్యంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సప్తమి గౌడ విషయానికొస్తే.. 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది. 2022లో రిలీజైన 'కాంతార'లో రిషభ్ శెట్టి సరసన నటించి పేరు తెచ్చుకుంది. ది వ్యాక్సిన్ వార్ అనే హిందీ మూవీ, యువ అనే కన్నడ చిత్రాలు చేసింది. నితిన్ 'తమ్ముడు'తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇ‍చ్చింది. ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ కావడంతో టాలీవుడ్‌లో మరో ఛాన్స్ రాలేదు. ఈమె నటించిన 'ద రైజ్ ఆఫ్ అశోక'.. గతవారమే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే సప్తమికి ఈ చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)

Suma Kanakala Daughter Manaswini At Allu Sirish Reception6
యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే

యాంకర్ సుమ గురించి తెలుసు. భర్త రాజీవ్ కనకాల గురించి తెలుసు. వీళ్ల కొడుకు రోషన్ కూడా రెండు సినిమాలు హీరోగా చేశాడు. ఇతడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొద్దిమందికి తెలుసు. కానీ సుమ కూతురు పెద్దగా బయట కనిపించదు. అలాంటిది ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టిన సుమ.. తర్వాత యాంకర్ అయిపోయింది. ఆ టైంలోనే నటుడు రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకుంది. రాజీవ్ నటుడిగానే అడపాదడపా మూవీస్ చేస్తుంటగా.. సుమ యాంకరింగ్‌తో ఇప్పటికీ బిజీగానే ఉంది. వీళ్లకు కొడుకు రోషన్, కూతురు మనస్విని ఉన్నారు. రోషన్.. బబుల్‌గమ్, మోగ్లీ అనే చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ అవి హిట్ అవ్వలేదు. కూతురు మనస్విని ప్రస్తుతం చదువుకుంటోంది. పెద్దగా సోషల్ మీడియాలోనూ ఎక్కడ కనిపించదు.ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ రిసెప్షన్ వేడుకలో కనిపించడంతో సుమ కూతురు ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. సుమ అంత ఎత్తు కూడా ఉంది. మరి తల్లితండ్రి అన్నలానే ఇండస్ట్రీలోకి వస్తుందా? లేదా మరేదైనా ప్రొఫెషన్ ఎంచుకుంటుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

Actress Sneha Recalls Accident And Bed Rest Mode7
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే

హీరోయిన్ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో హోమ్లీ పాత్రలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ చాలానే మూవీస్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. తనకు గతంలో పెద్ద ప్రమాదం జరిగిందని, 8 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఓ దర్శకుడి వల్లే మళ్లీ ఇలా ఇప్పుడు మీ ముందున్నానని చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ ఈ విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'కెరీర్ పీక్ స్టేజీలో వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఓ ఘోర ప్రమాదం జరిగింది. అందులో నా చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం నిలబడటానికి కూడా ఎనిమిది నెలలు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నరకం అనుభవించాను. కెరీర్ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాను. ఆ టైంలో దర్శకుడు కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' స్టోరీతో నా దగ్గరకు వచ్చారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిసినా సరే నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చనాను. ఆ దశ చాలా కష్టమైనది. కానీ అదే నన్ను మరింత బలంగా మార్చింది' అని స్నేహ ఎమోషనల్ అయింది.తెలుగు కుటుంబానికే చెందిన స్నేహ అసలు పేరు సుహాసిని. ముంబైలో పుట్టి, షార్జాలో పెరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈమెని చూసిన ఓ మలయాళ నిర్మాత.. హీరోయిన్‌గా అవకాశమిచ్చాడు. అలా 2000లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'ప్రియమైన నీకు' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, మధుమాసంతో పాటు చాలానే మూవీస్ చేసింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకుంది. అనంతరం సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. రీసెంట్ టైంలో అయితే దళపతి విజయ్ 'గోట్'లో కనిపించింది.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

Devagudi And Vanchana Movies OTT Streaming Now 8
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

ప్రతివారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా ఓం శాంతి శాంతి శాంతిః, విత్ లవ్, గాంధీ టాక్స్, తన్వి ది గ్రేట్, లాలో కృష్ణ సదా సహాయతే తదితర మూవీస్ స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ రెండు చిత్రాలు ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చాయి?(ఇదీ చదవండి: యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ సినిమా)'వంచన' అనే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. 2024 నవంబరు 8న థియేటర్లలోకి వచ్చింది. ఉమా మహేశ్ హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోకి మంగళవారం నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. ఓ చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురవుతాడు. దీంతో అనుమానితుడిగా ఉన్న అతడి డ్రైవర్‌ని అరెస్ట్ చేస్తారు. అయితే సదరు డ్రైవర్ నిర్దోషి అని నమ్మిన క్రిమినల్ లాయర్ కృష్ణ.. ఈ కేసుని వాదించేందుకు సిద్ధమవుతాడు. దర్యాప్తులో భాగంగా లాయర్ కృష్ణకు ఎదురైన సవాళ్లేంటి? హంతకుడు ఎవరు? అనేదే మిగతా స్టోరీ.అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'దేవగుడి'. జనవరి 30న థియేటర్లలోకి వచ్చింది. చిన్న సినిమా కావడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇది కూడా ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోనే అందుబాటులోకి వచ్చింది. 'దేవగుడి' విషయానికొస్తే.. వీరారెడ్డి(రఘు కుంచె) ఓ ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరుల్లో ఒకరి కొడుకు అయిన ధర్మ(అభినవ్ శౌర్య), తన కొడుకుతో స్నేహంగా ఉండటాన్ని తట్టుకోలేడు. ధర్మతో తన కూతురు శ్వేత(అనుశ్రీ) ప్రేమలో ఉందని తెలిసి అతడిని ఊరి నుంచి గెంటేస్తాడు. తర్వాత కొన్నాళ్లకు వీరారెడ్డి అనారోగ్యానికి గురవడంతో అతడిని శత్రువులు చంపేస్తారు. మరోవైపు శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతని ఎవరు కిడ్నాప్ చేశారు? ధర్మ-ఈమె ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

Vijay and Rashmika Wedding Reception Rules9
విజయ్‌, రష్మిక రిసెప్షన్‌ రూల్స్‌.. సింగిల్‌ ఎంట్రీ కోడ్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక రిసెప్షన్‌ వేడుక గురించి ఒక వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇటీవల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమ ఫ్యాన్స్‌ కోసం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంచారు. ప్రధాన ఆలయాల్లో భోజనాలు పెట్టారు. ఇలా తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అయితే, మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. అందుకోసం పోలీసులు కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ రిసెప్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు చాలామంది సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. దీంతో కార్యక్రమానికి ఎంట్రీ అయ్యే వారికి చాలా కఠినమైన నియమాన్ని విధించింది. రిషెప్షన్‌కు వచ్చే అతిథులు లోపలికి వెళ్లాలంటే ఒకసారి మాత్రమే ఉపయోగించగల QR కోడ్‌ను ఏర్పాటు చేశారు. రోండోసారి ఆ కోడ్‌ పనిచేయదు. ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇస్తే బయటకు వచ్చేందుకు ఛాన్స్‌ వుండదు.రిసెప్షన్‌కు ఆహ్వానం, QR కోడ్‌లు లేని వారు అక్కడికి రావద్దని ఇప్పటికే తెలిపారు. ఇది పూర్తిగా పోలీసుల నిఘాలో ఉన్నందున హాజరు కావద్దని వారు అధికారికంగా ప్రకటించారు. పరిస్థితిని అర్థం చేసుకుని భద్రతా చర్యలకు సహకరించాలని విజయ్‌ టీమ్‌ కోరింది.(ఇదీ చదవండి: సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు)

Tanvi The Great Movie Now Streaming OTT10
ఓటీటీలో 'తన్వి ది గ్రేట్' సినిమా.. సడెన్‌గా స్ట్రీమింగ్‌

బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించి, నటించిన 'తన్వి ది గ్రేట్' (2025) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించిన విషయం తెలిసిందే. ఆటిజంతో బాధపడుతున్నప్పటికీ ఆర్మీలో చేరాలనే ఒక యువతి కల జీవితమే ఈ సినిమా.. ఇందులో శుభంగి దత్తా ప్రధాన పాత్ర పోషించంది. జాకీష్రాఫ్, అరవిందస్వామి, బొమన్‌ ఇరానీ, పల్లవి జోషి, నాజర్‌ వంటి స్టార్స్‌ ఈ మూవీలో నటించారు.‘తన్వి ది గ్రేట్‌’ (Tanvi The Great) మూవీ సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇరవై రెండేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్‌’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించిన అనుపమ్‌ ఖేర్‌.. గతేడాది ‘తన్వీ ది గ్రేట్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం.ఈ చిత్రాన్ని ఎన్‌ఎఫ్‌డీసీతో కలిసి అనుపమ్‌ స్టూడియోస్‌ నిర్మించింది.

Advertisement
Advertisement