Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Allu Ayaan Martial Arts Video Latest1
అల్లు అయాన్ కూడా మొదలుపెట్టేశాడు.. వీడియో వైరల్

అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూడా మరికొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని, అల్లు స్నేహ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇదికాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మహేశ్ అభిమానులకు సారీ చెప్పిన హరీశ్ శంకర్)అల్లు అర్జున్ సంతానంలో కొడుకు అయాన్ పెద్దోడు కాగా కూతురు అర్హ చిన్నది. అర్హ ఇదివరకే 'శాకుంతలం' మూవీలో నటించేసింది. పర్లేదు ఓకే ఓకే అనిపించింది. అయితే అయాన్.. ఏ సినిమాలోనూ కనిపించనప్పటికీ సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయాన్ మోడల్ అనే ట్యాగ్‌తో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాడు కూడా. మరి తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎప్పుడొస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)Future star in training!Allu Ayan, son of Allu Arjun, has started martial arts training as he begins learning discipline, strength and focus at a young age. 💥#AlluArjun #AlluAyan pic.twitter.com/DYYsJA4siN— Rathnam News (@RathnamNews) March 11, 2026 View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Ustaad Bhagat Singh Director Harish Shankar Apologizes Mahesh Babu Fans2
టాలీవుడ్‌లో మరో వివాదం.. సారీ చెప్పిన డైరెక్టర్

పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తీసిన దర్శకుడు హరీశ్ శంకర్.. హీరో మహేశ్ బాబు అభిమానుల్ని హర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం అంతా ట్విటర్‌లో ఈ విషయం గురించే చర్చ నడిచింది. ఇప్పుడు ఇది కాస్త సీరియస్ అయ్యేసరికి సదరు డైరెక్టర్.. మహేశ్ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్)అసలేం జరిగింది?మంగళవారం సాయంత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'ని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. బాబు రికార్డులు లేపేయాలని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా 'తథాస్తు' అని రీట్వీట్ చేశాడు. సెకన్ల వ్యవధిలో విషయం అర్థమై హరీశ్ శంకర్.. తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ మహేశ్ బాబు అభిమానులు మాత్రం హరీశ్ శంకర్‌ని ఘోరంగా ట్రోల్ చేశారు. 'ఉస్తాద్..' మూవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. దీంతో ఇప్పుడు హరీశ్ శంకర్.. మహేశ్ అభిమానులకు సారీ చెప్పాడు.హరీశ్ ఏమన్నాడు?'సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పనులతో నిన్నంతా బిజీగా గడిచింది. అదే టైంలో జర్నలిస్టులు, అభిమానుల మెసేజులకు రిప్లై ఇస్తూ ఆ హడావుడిలో ఓ ట్వీట్‌ని పూర్తి చదవకుండానే రీట్వీట్ చేశాను. నా టీమ్ అలెర్ట్ చేయగానే నిమిషం లోపే ట్వీట్ డిలీట్ చేశాను. మహేశ్ బాబుపై నాకు ఎంతో గౌరవముంది. 'పోకిరి' గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. 'వారణాసి'తో ఆయన పేరుమీద మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నాను''ఆయనని కానీ ఆయన అభిమానులని కానీ బాధపెట్టాలని ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. సినిమా మరో 10 రోజుల్లో విడుదలయ్యే ఈ టైంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఓ సినిమా రికార్డులు సృష్టించాలనే అందరి హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని హరీశ్ శంకర్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)

Rukmini Vasanth To Act With Dhanush New Tamil Movie3
చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్

తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. సొంత భాషలో హిట్స్ ఉన్నప్పటికీ తెలుగు, తమిళంలో చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. అయితే తమిళంలో చేసిన మూవీస్ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు రుక్మిణి మరో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)వరుస సినిమాలతో అలరిస్తున్న తమిళ హీరో ధనుష్.. ప్రస్తుతం విఘ్నేశ్ ‌రాజా దర్శకత్వంలో 'కర' మూవీ చేశాడు. మమిత బైజు హీరోయిన్. వచ్చే నెల 30న థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'అమరన్' తీసిన రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలోనూ ధనుష్‌ ఓ సినిమా చేస్తున్నాడు. డీ55 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్. సాయి‌ అభయంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీని తర్వాత ధనుష్‌ మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 'లబ్బర్‌ పందు' ఫేమ్‌ తమిళసన్‌ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నట్లు టాక్.ఇందులోనే దక్షిణాది క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్‌.. ధనుష్ సరసన నటించనుందట. ఇదే నిజమైతే వీళ్లిద్దరి కాంబోలో రూపొందే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ ‍ప్రాజెక్టుకి అనిరుధ్‌ సంగీంతమందించనున్నాడట. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్‌ కుమార్‌ నటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.(ఇదీ చదవండి: తార‍కరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)

Tamil Actor Arya New Movie Vaishnavi Chaitanya And Nikhila Vimal4
ఇద్దరు బ్యూటీస్‌తో ఆర్య.. ఇందులో 'బేబి' కూడా

డిఫరెంట్ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు ఆర్య. ఇంతకు ముందు నాన్‌ కడవుల్‌, మద్రాసు పట్టణం, మహాముని, టెడ్డీ, సార్పట్ట పరంపరై తదితర మూవీస్ చేశాడు. ప్రస్తుతం పా.రంజిత్‌ దర్శకత్వంలో 'వెట్టవన్‌'లో నటిస్తున్నాడు. దీని తర్వాత 'సార్పట్ట పరంపరై 2'లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు. తన 40వ చిత్రాన్ని జీవశంకర్‌ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో నిఖిలా విమల్‌, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)నిఖిల్‌ మురళి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 12న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఆర్యతో హీరోయిన్లు నిఖిలా విమల్‌, వైష్ణవి చైతన్య జిమ్‌లో కలిసి వర్కౌట్స్ చేస్తున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం.. రొమాంటిక్‌ ప్రేమకథగా ఉండనుందని తెలుస్తోంది. 'బేబి' మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్యకు ఇదే తమిళంలో తొలి మూవీ.(ఇదీ చదవండి: తార‍కరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)

Lockdown Movie 2026 OTT Streaming Now Telugu5
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ బోలెడన్ని సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్.. గతేడాది అర డజను మూవీస్ చేసింది. వాటిలో దాదాపు మూడు నాలుగు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. కొత్త ఏడాదిలోనూ ఓ థ్రిల్లర్‌తో వచ్చింది. ఇప్పుడా సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ')అనుపమ లీడ్ రోల్ చేసిన తమిళ థ్రిల్లర్ మూవీ 'లాక్ డౌన్'. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులో దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకనో వాయిదాల మీద వాయిదాలు పడింది. ఎట్టకేలకు ఈ జనవరి 30న రిలీజైంది. కానీ ఫ్లాప్ అయింది. లాక్‌డౌన్ అనేది ముగిసిన కాన్సెప్ట్. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూపించాలనుకున్నారు. అస్సలు వర్కౌట్ కాలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.'లాక్‌డౌన్' విషయానికొస్తే.. చదువు పూర్తి చేసిన అనిత(అనుపమ పరమేశ్వరన్) ఉద్యోగం ప్రయత్నాల్లో ఉంటుంది. ఓ రోజు స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంది. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీనిని ఇంట్లో వాళ్ల నుంచి దాచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ రావడంతో వైద్య సహాయం అందక ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఆదాయం కోల్పోయిన కుటుంబం, ఊరికి వెళ్లలేక చిక్కుకున్న కార్మికుడు, ప్రాణాలని లెక్కచేయకుండా పనిచేసే వైద్యులు, ఒంటరితనంతో బాధపడే యువత, విరహ వేదలో ఉన్న ప్రేమ జంటలు కూడా ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాయి. చివరకు అనిత జీవితం ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Couple Friendly Movie OTT Streaming Update6
ఓటీటీలో తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన

గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చి హిట్ అయిన తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ఏ మాత్రం అంచనాల్లేకుండా గత నెలలో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఓ వారం తర్వాత ప్రభాస్‌తో మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూ చేసింది. తర్వాత నుంచి వసూళ్లు కాస్త పికప్ అయ్యాయి. ఓవరాల్‌గా డీసెంట్ నంబర్లతో థియేట్రికల్ రన్ ముగించుకుంది. గత నెల 14న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(మార్చి 13) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కపుల్ ఫ్రెండ్లీ' విషయానికొస్తే.. శివ(సంతోష్ శోభన్)ది నెల్లూరు. ఉద్యోగ అవకాశాల కోసం చెన్నై వెళ్తాడు. కానీ ఎంతకీ జాబ్ దొరక్క పార్ట్ టైమ్ బైక్ రైడర్‌గా పనిచేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఓ రోజు మిత్ర(మానస వారణాసి) పరిచయమవుతుంది. ఆమెది శివ లాంటి కథే. దీంతో ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని అబద్ధాలు చెబుతూ చెన్నైలో బతికేస్తుంటుంది. అనుకోని పరిస్థితుల్లో మిత్ర కూడా శివతో కలిసి ఉండాల్సి వస్తుంది. మరి పెళ్లికి ముందే కలిసున్న శివ-మిత్ర జీవితాలు చివరకు ఎలా మారాయి? ఈ ప్రేమకథ సుఖాంతమైందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తార‍కరత్న చివరి గుండె చప్పుడు విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)

Interesting discussion on Allu Cinemas ticket rates7
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ

హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్‌ ఒక సినిమా హాల్‌ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ మరో లెవెల్లో ఉండనుంది.ఈ మల్టీప్లెక్స్‌లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్‌లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది. పూణేలోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్‌లో రూ. 900 వరకు ఉంటాయి. ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్‌కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం. తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్‌లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్‌కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు ప్రదర్శించబడుతాయి.

Alekhya First Interview About Taraka Ratna Last Days Latest8
తార‍కరత్న చివరి గుండె చప్పుడు విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో

టాలీవుడ్ హీరో తారకరత్న.. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. 2023 ఓ పాదయాత్రలో పాల్గొన్న ఈయన.. డీహైడ్రేషన్‌కి గురై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తే.. దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడినప్పటికీ ఫలితం లేదు. ఈయన మరణం తర్వాత భార్య అలేఖ్య పెద్దగా బయట కనిపించలేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు భర్తని తలుచుకుని పోస్టులు పెట్టేవారు. అయితే ఆస్పత్రిల్లో ఉన్న తారకరత్న చివరి రోజులు ఎలా గడిచాయి? అప్పుడు ఏమేం జరిగిందనేది అనే విషయాల్ని తొలిసారి ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)‍'పాదయాత్రలో పాల్గొనేందుకు జనవరి 25నే వెళ్లాలి. కానీ అనుకోకుండా రెండు రోజుల తర్వాత వెళ్లారు. ఆ రోజు ఉదయమే ఫోన్ చేశారు. సాయంత్రానిక‍ల్లా వచ్చేసి పిల్లలతో కలిసి సినిమా చూస్తానని కూడా చెప్పారు. కానీ కాసేపటికే తారక్‌కి డీహైడ్రేషన్ అయిందని చెప్పి ఫోన్ వచ్చింది. మా అమ్మ కాల్ చేసి బాల బాబాయ్‌కి ఫోన్ చేయమంటే చేశా. ఆయన కూడా అదే చెప్పారు. తర్వాత విజయ్ సాయిరెడ్డి బాబాయ్ కాల్ చేసి.. నిష్క(తారకరత్న పెద్ద కూతురు)ని తీసుకుని కుప్పం వెళ్లమన్నారు. అప్పుడు చంద్రబాబు ఫోన్ చేశారు. అంతా బిజీగా ఉండే ఆయన కూడా ఫోన్ చేసేసరికి ఏదో సీరియస్ అని అర్థమైంది. దీంతో కుప్పం వెళ్లాను. అక్కడ తారకరత్నని బెడ్‌పై చూసి కుప్పకూలిపోయాను''బాల బాబాయ్ నా దగ్గరుండి అన్ని చూసుకున్నారు. మా అన్నయ్య బెస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అంటే బెంగళూరు తీసుకెళ్లాం. అలా 23 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. చాలా పోరాడారు. నా కోసమే నాకు సమయం ఇచ్చేందుకే అన్ని రోజులు పోరాడారా అనిపించింది. నా కోసం అందరూ ఆస్పత్రిలోనే ఉన్నారు. నేను అందరినీ వెళ్లిపోమని చెప్పా. డాక్టర్స్ వచ్చి అంతా అయిపోయింది అని చెప్పగానే మొదట బాల బాబాయ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తర్వాత అందరికీ చెప్పాను. తారకరత్నతో చివరి నిమిషం వరకు ఉన్నాను. ఆయనతో పాటు బెడ్‌పై పక్కనే పడుకుని చివరి గుండె చప్పుడు కూడా విన్నాను. చాలా నెలల వరకు ఆయన లేరని నిజాన్ని అంగీకరించలేకపోయాను' అని అలేఖ్య అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకుంది. తారకరత్న విషయానికొస్తే.. 2002లో హీరోగా కెరీర్ ప్రారంభించారు.2023 వరకు అడపాదడపా మూవీస్ చేశారు గానీ సక్సెస్ కాలేకపోయారు. అయితే అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్యని ప్రేమించి 2012లో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు అంగీకరించకపోయినా సరే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లకు 2013లో ఓ పాప పుట్టగా.. తర్వాత ట్విన్స్ అయిన బాబు, పాప పుట్టారు.(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)

Ustaad Bhagat Singh Movie Censor And Run Time Details9
'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తొలుత ఈ నెల 26న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఓ వారం ముందే వచ్చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఉగాది సందర్భంగా 19వ తేదీన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి.ఈ క్రమంలోనే రన్ టైమ్ ఎంతనేది కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)'ఉస్తాద్..' చిత్రానికి విడుదలకు 9 రోజుల ముందే సెన్సార్ చేసేశారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈమేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సెన్సార్ సభ్యులు.. ఎలాంటి కట్స్ చెప్పలేదట. అలానే 2 గంటల 34 నిమిషాల నిడివితో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రీ మూవీస్ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ పనిచేస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. అయితే ఇది తమిళ సినిమా 'తెరి'కి రీమేక్ అని చాలారోజులుగా ప్రచారం నడిచింది. మూవీ టీమ్ మాత్రం పదే పదే వీటిని ఖండించింది. సెన్సార్ ముగించారు. ట్రైలర్ కూడా వదిలితే సినిమా కంటెంట్ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Mark K Robin Won Gaddar Award Tollywood10
గద్దర్ అవార్డుల్లో సత్తా చాటిన యంగ్ మ్యూజిక్‍ డైరెక్టర్

'అ!' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్.. టాలీవుడ్‌లో మంచి పేరుని సంపాదించుకున్నాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతడు.. తన సంగీతంతో ఆకట్టుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్ ఇతడికి దక్కింది. 'దండోరా' చిత్రానికిగానూ మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ పురస్కారం అందుకున్నాడు. సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి మరీ ముఖ్యంగా "దండోరా" టైటిల్ సాంగ్ ప్రేక్షకులని కదిలించాయి.టాలీవుడ్ లో మల్లేశం, జాంబీ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తదితర సినిమాలకు కూడా ఇతడే సంగీతమందించాడు. ఇప్పటివరకు దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.చిన్నప్పటి నుంచి గద్దర్ పాటలు అంటే ఇష్టమని, ఆయన పాటలు వింటూ పెరిగిన తనకు ఇప్పుడు గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు.

Advertisement
Advertisement