ప్రధాన వార్తలు
రాధిక శరత్కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సమంత నయా గ్లామర్.. 'కోర్ట్' శ్రీదేవి వయ్యారాలు!
గ్లామరస్ పోజులతో సరికొత్త సమంత హంగామాలంగా ఓణీలో అందంగా 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవిదుబాయిలో చిల్ అయిపోతున్న రాయ్ లక్ష్మిక్యూట్ అండ్ స్వీట్ లుక్స్లో ఆషికా రంగనాథ్అందం చూపిస్తూ రచ్చ లేపుతున్న అంజలిరాణీ ముఖర్జీ, రేఖతో కలిసి కీర్తి సురేశ్ ఫొటోలు View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi)
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. అధికారిక ప్రకటన
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భాషకు చెందిన సినిమాలని డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలోనూ రీమేక్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తీసిన చిత్రమే 'ఓం శాంతి శాంతి శాంతిః'. థియేటర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పోస్టర్ కూడా వదిలారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా చేసిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. 2022లో మలయాళంలో వచ్చిన 'జయ జయ జయహే' చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా సరే ఈ సినిమా నిర్మాతలు సాహసం చేశారు. కానీ అది బెడిసికొట్టింది.ఒరిజినల్ సినిమా నుంచి సీన్ టూ సీన్ దింపేశారు. కాస్త నేటివిటీ మార్చినప్పటికీ మరీ స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా థియేటర్లలోకి రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.'ఓం శాంతి శాంతి శాంతిః' విషయానికొస్తే.. మంచిగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి(ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు ఆపేసి ఈమెని ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) అనే చేపల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత కూడా చదువుకోవచ్చనే ఆలోచనతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కానీ అత్తారింట్లో ఊహించనివి జరుగుతాయి. భర్త తన అహంకారాన్ని, కోపాన్ని ఈమెపై చూపిస్తుంటాడు. ప్రతిసారీ చెంపపగలగొట్టేస్తుంటాడు. ఓ రోజు కోపం పట్టలేక ప్రశాంతి, భర్తకు ఎదురుతిరుగుతుంది. భర్తని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. తర్వాత ఏమైంది? భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 8 ఏళ్ల తర్వాత గడ్డం తీసేసిన 'కేజీఎఫ్' యష్.. ఇలా ఉన్నాడేంటి?)
గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్స్పోర్ట్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్ తర్వాత సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. Yuvasamrat @chay_akkineni Cheering for his team #HyderabadBlackBirds at the #GoaStreetRace2026 🔥💨#IndianRacingLeague pic.twitter.com/BB4EZZ4wCa— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026
బిగ్బాస్
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
A to Z
ఓటీటీలోకి ‘ఛాంపియన్’ బ్యూటీ కొత్త సినిమా
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్కుమార్ ఇటీవల ఒ...
10 జంటలతో కపుల్ షో.. కంటెస్టెంట్స్ వీళ్లే!
రియాలిటీ షోలంటే జనాలకు భలే ఇష్టం. రీల్ లైఫ్లో సె...
లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
హీరోయిన్ రష్మిక.. రాబోయే ఓ కొత్త సినిమాలో స్వలింగ ...
ఓటీటీ 'మహాశయులకు విజ్ఞప్తి'.. ఆలస్యానికి కారణం ఇదేనా?
ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా ఇప...
చిల్లిగవ్వ లేక తిండి లేక.. ప్రతిరోజూ ఏడ్చేవాడిని: నటుడు
ఒకప్పుడు తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు చూశానంట...
లైఫే టర్నయ్యిందిలే బుల్బుల్ పిట్ట!
టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాల...
హీరోయిన్ కోసం ప్రభాస్ స్పెషల్ ట్రీట్
డార్లింగ్ ప్రభాస్ భోజనప్రియుడు. ఇంటి భోజనాన్ని ఎ...
అమితాబ్ను చూసేందుకు ఒక్కరూ రాలేదా?
ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటి బయటకు వచ్చి అభిమానులన...
19ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న 'షకీరా'
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీర...
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. క...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ...
నాని 'ది ప్యారడైజ్' టైటిల్ సాంగ్ ప్రోమో
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి టైటిల్ సా...
చిన్న సినిమా కలెక్షన్స్పై ప్రభాస్ ఎఫెక్ట్.. వీడియో వైరల్
ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా సరే తన వారికోసం సమయం కేట...
అజిత్ను కలిసిన మంజువారియర్
నటుడు అజిత్ ఇప్పుడు కార్ రేస్లపై ఎక్కువగా దృష్ట...
ఫొటోలు
'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)
‘కిల్లర్’ మూవీ ఈవెంట్ లో మెరిసిన జ్యోతి రాయ్..(ఫొటోలు)
జ్యోతిరాయ్ 'కిల్లర్' మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)
కొచ్చిలో 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్.. ట్రెండింగ్ ఫోటోలు చూశారా?
లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)
లక్కీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్-1 లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
సరస్వతి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
విశ్వక్ సేన్ కల్ట్ మూవీ టీజర్ లాంఛ్ (ఫొటోలు)
గాసిప్స్
View all
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు”
నానికి హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ?
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
మారుతి కొత్త ప్రాజెక్ట్పై ఆసక్తికర చర్చ
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
రివ్యూలు
View all
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.75
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
సినీ ప్రపంచం
సెలబ్రేషన్స్కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్ను సీక్రెట్గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
రియల్ క్రైమ్ స్టోరీగా వస్తోన్న కాక్రోచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం కాక్రోచ్. ఈ సినిమాకు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ..' సునీల్ కుమార్ రెడ్డితో మా కాంబినేషన్లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుందని' అన్నారు.డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. - 'నేను జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశా. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారా. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని రూపొందించా. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నా. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించా. రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించా. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది' అని. అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, తాటికొండ ప్రసాద్, సునీత, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ కీలక పాత్రల్లో నటించారు.
ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ చిత్రం తాజాగా బాప్టా అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. గతేడాది సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్స్టార్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ గతంలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లోనూ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డులకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే వంటి కీలక విభాగాలలో నామినేట్ అయింది. View this post on Instagram A post shared by JioHotstar International (@jiohotstarinternational)
రాధిక శరత్కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సమంత నయా గ్లామర్.. 'కోర్ట్' శ్రీదేవి వయ్యారాలు!
గ్లామరస్ పోజులతో సరికొత్త సమంత హంగామాలంగా ఓణీలో అందంగా 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవిదుబాయిలో చిల్ అయిపోతున్న రాయ్ లక్ష్మిక్యూట్ అండ్ స్వీట్ లుక్స్లో ఆషికా రంగనాథ్అందం చూపిస్తూ రచ్చ లేపుతున్న అంజలిరాణీ ముఖర్జీ, రేఖతో కలిసి కీర్తి సురేశ్ ఫొటోలు View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi)
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. అధికారిక ప్రకటన
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భాషకు చెందిన సినిమాలని డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలోనూ రీమేక్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తీసిన చిత్రమే 'ఓం శాంతి శాంతి శాంతిః'. థియేటర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పోస్టర్ కూడా వదిలారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా చేసిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. 2022లో మలయాళంలో వచ్చిన 'జయ జయ జయహే' చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా సరే ఈ సినిమా నిర్మాతలు సాహసం చేశారు. కానీ అది బెడిసికొట్టింది.ఒరిజినల్ సినిమా నుంచి సీన్ టూ సీన్ దింపేశారు. కాస్త నేటివిటీ మార్చినప్పటికీ మరీ స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా థియేటర్లలోకి రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.'ఓం శాంతి శాంతి శాంతిః' విషయానికొస్తే.. మంచిగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి(ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు ఆపేసి ఈమెని ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) అనే చేపల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత కూడా చదువుకోవచ్చనే ఆలోచనతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కానీ అత్తారింట్లో ఊహించనివి జరుగుతాయి. భర్త తన అహంకారాన్ని, కోపాన్ని ఈమెపై చూపిస్తుంటాడు. ప్రతిసారీ చెంపపగలగొట్టేస్తుంటాడు. ఓ రోజు కోపం పట్టలేక ప్రశాంతి, భర్తకు ఎదురుతిరుగుతుంది. భర్తని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. తర్వాత ఏమైంది? భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 8 ఏళ్ల తర్వాత గడ్డం తీసేసిన 'కేజీఎఫ్' యష్.. ఇలా ఉన్నాడేంటి?)
గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్స్పోర్ట్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్ తర్వాత సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. Yuvasamrat @chay_akkineni Cheering for his team #HyderabadBlackBirds at the #GoaStreetRace2026 🔥💨#IndianRacingLeague pic.twitter.com/BB4EZZ4wCa— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026
రోడ్డుపై అందరూ కలిసి చితకబాదారు: అక్షయ్ కుమార్
కాలేజీ డేస్లో చాలామంది ప్రేమలో పడతారు. కొందరిది వన్సైడ్ లవ్ అయితే మరికొందరిది టూసైడ్ లవ్. అలా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడట! ఈ విషయాన్ని 'ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్' షోలో వెల్లడించాడు. తాజాగా ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.అమ్మాయి ఇంటి ముందుతన కాలేజీ డేస్లోని లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నాడు. 'ఇది 40 ఏళ్ల కిందట ముచ్చట. అప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను. ఒక అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాను. తనకోసం ప్రత్యేకంగా ఒక పాట నేర్చుకున్నాను. నా ఫ్రెండ్ ఒకరికి గిటార్ వాయించడం తెలుసు. కాబట్టి వాడిని వెంటేసుకుని నేరుగా అమ్మాయి ఇంటి ముందు నిలబడ్డాను. తన్నులు తిన్నాంఅతడు గిటార్ వాయిస్తుంటే నేను పాట పాడటం మొదలుపెట్టాను. నా పాట విని అమ్మాయి వస్తుందనుకుంటే చుట్టుపక్కలవాళ్లు వచ్చి మమ్మల్ని చితక్కొట్టారు. వారి చేతిలో చచ్చామనుకున్నాం. ఎవరినో ఇంప్రెస్ చేద్దామని వెళ్లి మేమే తన్నులు తిని వచ్చాం' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా సినిమాల్లో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న అక్షయ్ ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్లో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను కలిశాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసింది. 2001లో అక్షయ్, ట్వింకిల్ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2002లో కుమారుడు ఆరవ్ జన్మించాడు. 2012లో కూతురు నితారా పుట్టింది.చదవండి: విడాకుల తర్వాత బాధలో.. ఎవర్నీ నమ్మొద్దనుకున్నా..: సమంత
'అతన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు'.. డైరెక్టర్కు స్ట్రాంగ్ కౌంటర్
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం ఈ మూవీపై విమర్శలు చేశారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో ఆయన మాట్లాడారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్తా బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ-2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ స్పందించారు. అనురాగ్కు అన్నింటితో సమస్యలేనని కామాఖ్య నారాయణ ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదేమోనని అన్నారు.కామాఖ్య నారాయణ్ మాట్లాడుతూ..'బహుశా అనురాగ్ మానసిక పరిస్థితి బాగాలేదనుకుంటున్నా. ఆయనకు అన్నింటితో సమస్యే. సమాజంలో ఒక వర్గం ప్రజలతో.. నెట్ఫ్లిక్స్తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీతోనూ ఆయనకు ఇబ్బందులే. అనురాగ్ తాను తీసిన సినిమాల్లో ఇంతకు మించిన సన్నివేశాలను చూపించారు. ఈ ఆధునిక సమాజంలో ఊహకు కూడా అందని వాటిని కూడా చిత్రీకరించారు. ప్రేక్షకులు ఆయన మాటలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని' అన్నారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జీవితంలో ఎవర్నీ నమ్మననుకున్నా.. అలాంటిది రాజ్ వచ్చాక!
'ఏమాయ చేసావె' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టింది సమంత. తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కానీ తర్వాత విభేదాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 2025 డిసెంబర్ 1న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే జీవితంలో మరో వ్యక్తిని నమ్ముతానని అనుకోలేదంటోంది సామ్.అతడి వల్లే ఇలా ఉన్నాతాజాగా వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్నప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాను. భవిష్యత్తులో మరో వ్యక్తిని నమ్ముతానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను. ఎవరి ప్రేమ, స్నేహాన్ని స్వీకరించే పరిస్థితిలో లేను. అలాంటిది నా జీవితంలోకి రాజ్ రావడం సంతోషంగా ఉంది. అతడు వచ్చాకే నాలో తెలియని శక్తి వచ్చింది. రాజ్ వల్లే నేనిప్పుడు బెటర్ పర్సన్గా మారాను. ఈ మధ్యే ఫ్రెండ్ను కలిశా..ఇటీవలే నా పాత ఫ్రెండ్ను కలిశాను. ఆమె నాతో మాట్లాడి వెళ్లిపోయాక నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది. ఒకప్పుడు నువ్వు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడేదానివి. చాలాకాలం తర్వాత మళ్లీ మామూలుగా కనిపిస్తున్నావ్ అని మెసేజ్ పెట్టింది (నవ్వుతూ) అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రాజ్ వచ్చాక తన జీవితం సంతోషకరంగా మారిందంటోంది సామ్. ఈ ఆనందం తనకు జీవితాంతం వెన్నంటే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేక.. ప్రతిరోజూ కన్నీళ్లే: బాలీవుడ్ నటుడు
సినిమా
Ram Charan: మళ్లీ బుచ్చిబాబుతోనే..!
ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్
రవితేజ నా డాన్స్ క్లాస్ మెట్.. సూపర్ జర్నీ నాది
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై హేమ షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి రిసెప్షన్ డేట్ లీక్
హనుమాన్ సీక్వెల్.. “జై హనుమాన్” మొదలైంది.. పూజా కార్యక్రమంలో రిషబ్ శెట్టి
కొచ్చిలో ఘనంగా 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు
కోలీవుడ్ కు షాక్ ఇచ్చిన విక్రమ్
అనుపమ - ధృవ్ మధ్య ప్రేమ నిజమా..? ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు
