Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Nupur Sanon says sister Kriti convinced mother about interfaith wedding1
తన వల్లే నా పెళ్లి జరిగింది: నుపుర్ సనన్

బాలీవుడ్ భామ, హీరోయిన్ కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్‌ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడైన స్టీబిన్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. మొదటి క్రిస్టియన్ సంప్రదాయంతో వివాహం చేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలోనూ గ్రాండ్‌గా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఈ పెళ్లిలో ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్‌ సందడి చేసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ముందుండి నడిపించింది.అయితే వీరిద్దరిదీ ఇంటర్‌ క్యాస్ట్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లికి నుపుర్ సనన్ మదర్‌ ఒప్పుకోలేదు. ఆమె ససేమిరా అనడంతో కృతి సనన్‌ రంగంలోకి దిగింది. సిస్టర్‌ కోసం అమ్మను ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించింది ముద్దుగుమ్మ. తాజాగా తన అక్క స్టీబిన్ గురించి తల్లిని ఎలా ఒప్పించిందో కూడా నుపుర్ సనన్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నుపుర్ ఈ విషయాన్ని పంచుకుంది.నుపుర్ సనన్ మాట్లాడుతూ.. "స్టీబిన్ గురించి నేను మొదట చెప్పింది నా సోదరికే. మా ఇద్దరి మధ్య ఐదేళ్ల వయస్సు తేడా ఉన్నప్పటికీ మేము చాలా క్లోజ్‌గా ఉంటాం. అంతేకాదు ప్రాణ స్నేహితులం కూడా. స్టీబిన్ వృత్తిపరంగా ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి కెరీర్ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నేను అతని గురించి ఒక వ్యక్తిగా ఎక్కువగా చెప్పా. తనకు అతని పాట వినిపించా. వెంటనే అతను అపారమైన ప్రతిభ ఉన్నవాడని కృతి చెప్పింది." అని తెలిపింది."కొన్ని నెలల తర్వాత ఈ విషయం మా అమ్మకు చెప్పా. చాలా మంది తల్లులలాగే ఆమె కూడా కొంచెం సంకోచించింది. అప్పుడే నా సోదరి రంగంలోకి దిగింది. నేను స్టీబిన్‌ను కలిశాను.. అతని పాటలు కూడా విన్నాను.. చాలా ప్రతిభావంతుడు.. కష్టపడి పనిచేసేవాడని అమ్మతో చెప్పింది. ‍‍అలా తన మాటలతో అమ్మను మార్చేసింది. అక్కడి నుండి అంతా సజావుగా జరిగిపోయింది" అని పంచుకుంది. కాగా.. నుపుర్ సనన్- స్టీబిన్ పెళ్లి ఉదయపూర్‌ జరిగింది. ఈ వేడుకలకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

Guess The Actress: Once a Lead Actor, Cancer Survivor2
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్‌ హీరోయిన్‌గా, వేశ్యగా..

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌లో అనేక సక్సెస్‌ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.చిన్నతనంలోనే..చిన్నప్పుడు మహారాజు గెటప్‌ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్‌ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సినిమాతక్కువకాలంలోనే స్టార్‌ హీరోయి్‌గా మారింది. 1942: ఎ లవ్‌స్టోరీ, అకేలే, హమ్‌ అకేలే తుమ్‌, ఖామోషి: ద మ్యూజికల్‌, దిల్‌సే, కంపెనీ, తాజ్‌ మహల్‌, భూత్‌ రిటర్న్స్‌ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్‌ (భారతీయుడు), ముదల్వన్‌ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్‌ మూవీ చేసింది.క్యాన్సర్‌పై పోరాటంమనీషా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్‌ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్‌ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' అనే వెబ్‌ సిరీస్‌లో మల్లికాజాన్‌ అనే వేశ్యపాత్రలో యాక్ట్‌ చేసింది. గతేడాది లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రాడ్‌ఫోర్డ్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందింది.చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్‌గా విడాకులు: బాలీవుడ్‌ నటి

Super Hit Series Movie Drishyam 3 Release date announced3
సూపర్ హిట్ సిరీస్‌ మూవీ.. దృశ్యం-3 రిలీజ్‌ ఎప్పుడంటే?

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన దృశ్యం సిరీస్‌ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రెండు పార్ట్స్‌ కూడా బ్లాక్‌ బస్టర్ హిట్ కావడంతో మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాలను తెలుగు, హిందీలోనూ డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో వెంకటేశ్, హిందీ అజయ్ దేవగణ్ ఈ చిత్రాల్లో నటించారు.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తోన్న దృశ్యం-3 రిలీజ్‌ తేదీని ప్రకటించారు. ఓ వీడియోను షేర్ చేసిన మోహన్‌లాల్.. ఏప్రిల్ 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తి కాగా.. ఈ సమ్మర్‌లో సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కాగా.. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరంబవూర్‌ నిర్మించారు. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కించారు. ఈ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేస్తామని గతంలో దర్శకుడు జీతూ జోసెఫ్‌ చెప్పారు.Years passed. The past didn’t.#Drishyam3 | Worldwide Release | April 2, 2026@jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk #MeenaSagar@aashirvadcine@PanoramaMovies @PenMovies @ram_rampagepix @Rajeshmenon1969 @Abh1navMehrotra @drishyam3movie pic.twitter.com/uqEaPvqMyv— Mohanlal (@Mohanlal) January 14, 2026

Mythri Movie makers Official announcement on Allu Arjun lokesh Kanagaraj4
క్రేజీ కాంబో ఫిక్స్.. స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌ మూవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కోలీవుడ్‌ బాటపట్టారు. వరుసగా సినిమాలు అనౌన్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే అట్లీతో జతకట్టిన బన్నీ.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు ఏఏ23 వర్కింగ్‌ టైటిల్‌ను ప్రకటించింది. అల్లు అర్జున్‌.. స్టార్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. తొలిసారి వీరిద్దరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అల్లు అర్జున్‌ కెరీర్‌లో 23వ చిత్రంగా రానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. A Collaboration that will be Eternal in Indian Cinema 🤘🏻🔥💥Icon Star @alluarjun X @Dir_Lokesh X @MythriOfficial X @anirudhofficialSTRIVE FOR GREATNESS🔥 ▶️ https://t.co/AGCi8q89x2Shoot begins in 2026 💥#AALoki #AA23 #LK7 pic.twitter.com/op2vnureqp— Mythri Movie Makers (@MythriOfficial) January 14, 2026

Celina Jaitly Says Husband Served Divorce Notice On Pretext Of Anniversary Gift5
పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ విడాకుల పత్రం..: నటి

పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్‌ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్‌ హగ్‌పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ విడాకులు..సెప్టెంబర్‌ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. వేధింపులు తట్టుకోలేక..అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్‌ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్‌లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.పిల్లలకు దూరంఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్‌ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.శత్రువుగా చిత్రీకరిస్తున్నారుపిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్‌ హగ్‌ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్‌మాల్‌ రిటర్న్స్‌, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్‌ చేసింది.

Manchu Manoj Couple celebrates Bhogi Festival with Childrens6
మంచు మనోజ్ దంపతుల భోగి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పిల్లలతో ఈ పండుగను ఆనందగా జరుపుకున్నారు. ఇంటిముందు భోగి మంటలు వేసి భోగి వైబ్స్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. మంచు మనోజ్ గతేడాది మిరాయ్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా గతేడాది రిలీజైన భైరవం మూవీలోనూ మంచు మనోజ్ కనిపించారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu)

Ranveer Singh Dhurandhar Beats Bahubali 2 Record7
దురంధర్ దూకుడు.. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్..!

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ దురంధర్‌. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రిలీజై 39 రోజులైనా వసూళ్ల పరంగా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1300 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.ఈ క్రమంలోనే మరో క్రేజీ రికార్డును తన సొంతం చేసుకుంది. నార్త్‌ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ రికార్డు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డ్‌ను ధురంధర్ తుడిచిపెట్టేసింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్ల కలెక్షన్‌ రాబట్టింది. అంతకుముందు బాహుబలి-2 20.7 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. గత తొమ్మిది ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.కాగా.. ఇప్పటికే ఈ మూవీ భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ మూవీకి ఆదిత్య ధార్ ధర్శకత్వం వహించారు. పాకిస్తాన్‌ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.

Niharika Konidela Shares Mega Family Bhogi 2026 Celebrations Video8
మెగా ఫ్యామిలీ ఇంట భోగి.. చరణ్‌ ఏం చేశాడంటే?

కుటుంబమంతా ఒకచోట చేరితేనే అసలు సిసలైన పండగ. ఈ విషయం మెగా ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే అంతా కలిసి భోగి పండగను ఎంతో సంతోషంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను మెగా డాటర్‌ నిహారిక కొణిదెల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.దోశలు వేసిన మెగా ఫ్యామిలీఅందులో వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌- లావణ్య, రామ్‌చరణ్‌, సుస్మిత దోశలు వేస్తున్నారు. సాయిదుర్గతేజ్‌ టీ/కాఫీ తాగుతుంటే రామ్‌చరణ్‌ అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయాడు. చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సూపర్‌ హిట్‌ అవడంతో మరింత జోష్‌తో పండగ జరుపుకున్నారు.భోగిలా లేదుఇది భోగిలా లేదు, దోశ రోజుగా ఉంది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే.. మా కుటుంబమంతా ఒక చోట చేరి మన సాంప్రదాయాలను, పండగలను అద్భుతంగా జరుపుకుంటాం అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. గతంలో కూడా భోగి సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఇలా ఒకే చోట చేరింది. చిరంజీవికూడా స్వయంగా దోశలు వేసి వడ్డించేవాడు.సినిమాచిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ "మన శంకరవరప్రసాద్‌గారు". అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్‌ వద్ద దిగ్విజయంగా దూసుకెళ్తోంది. దీంతో చిత్రయూనిట్‌ సంబరాలు చేసుకుంటోంది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) చదవండి: బోరుమని ఏడ్చిన అనసూయ.. అందుకే కన్నీళ్లాగలేదు

Yuzvendra Chahal reacts to reunion rumours with ex wife Dhanashree Verma9
ధనశ్రీ- చాహల్ మళ్లీ కలవబోతున్నారా?.. క్రికెటర్ రియాక్షన్‌ ఇదే..!

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్‌ యుజ్వేందర్ చాహల్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని తమ బంధానికి ముగింపు పలికారు. గతేడాది అఫీషియల్‌గా విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు తమ వర్క్ లైఫ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విడిపోయిన జంటపై నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట మరోసారి కలవబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే మళ్లీ కలిసి జీవించడానికి కాదు.. ఓ రియాలిటీ షో కోసమట. చాహల్- ధనశ్రీ వర్మ ది -50 అనే రియాలిటీ షోలో కనిపించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్రికెటర్‌ చాహల్ స్పందించారు.అయితే తామిద్దరు కలుస్తామన్న వార్తలను చాహల్ కొట్టిపారేశారు. తమ వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని క్రికెటర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్రికెటర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదని.. కేవలం ఊహాజనితం, తప్పుడు సమాచారం అని పేర్కొన్నారు. అయితే ఈ రూమర్స్‌పై ధనశ్రీ వర్మ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. కాగా.. ది -50 అనే రియాలిటీ షో ఫిబ్రవరి 1న ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ షోకు చిత్రనిర్మాత ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Taapsee Pannu Exposes Bollywood Toxic PR Game10
బాలీవుడ్‌ పీఆర్‌ కల్చర్‌పై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి దానికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లలో బాలీవుడ్‌లో పీఆర్‌ (పబ్లిక్‌ రిలేషన్స్‌) వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పీఆర్‌ అంటే మన గురించి, మన సినిమాల గురించి మంచి మాటలు ప్రచారం చేయడం. ఇప్పుడు ప్రమోషన్‌ అనేది ఇతరులను తక్కువగా చూపించే స్థాయికి వెళ్లింది. ఇతరులను కిందికి లాగడానికి కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మన ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడుతున్నారు’’ అని హీరోయిన్‌ తాప్సీ(Taapsee Pannu) పేర్కొన్నారు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీఆర్‌ వ్యవస్థ గురించి మాట్లాడారు. ‘‘నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. రెండేళ్లుగా వర్క్‌లో స్పీడ్‌ తగ్గించాను. ఏడాదిన్నర నుంచి ఇండస్ట్రీలోని పీఆర్‌ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ ప్రతి దానికి డబ్బు చెల్లించాలని గ్రహించాను. ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడతారు. మీ విజయం వేరొకరి వైఫల్యంపై ఆధారపడి ఉంటుందనేలా కొత్త వెర్షన్స్‌ సృష్టించారు. కానీ, నా మనస్తత్వం పూర్తి భిన్నమైనది. మన పనే మన గురించి చెప్పాలనుకుంటాను. అందుకే ఇలాంటి వాటి కోసం డబ్బులు ఖర్చు చేయను. నా ప్రయాణాలు, నా కోసం, నా కుటుంబంపై, నాకు దగ్గరైన వాళ్లపై ఖర్చు చేయడానికే ఇష్టపడతాను. నన్ను ప్రశంసిస్తూ ఆర్టికల్స్‌ రాయడానికి, నన్ను పొగడడం కోసం మాత్రమే సోషల్‌ మీడియా ఖాతాలకు వేలల్లో చెల్లించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు’’ అని స్పష్టం చేశారామె. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తాప్సీ.

Advertisement
Advertisement