Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood actor abhinav gomatam Latest Movie title revealed1
అభినవ్ గోమటం లేటేస్ట్ మూవీ.. అమెరికాలో టైటిల్ రివీల్

అభినవ్ గోమఠం, స్వాతి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు వేణు నక్షత్రం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై అవంతిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి సినిమా టైటిల్‌ ఆవిష్కరించగా.. టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు హాజరై.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ… 'ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జయంత్ చల్లా, నాగేశ్వర్ రావు పూజారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ మెట్రో ప్రాంత ప్రేక్షకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులు, మాకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రేమతో వందనాలు. ఇలాగే మీ ప్రేమను, ఆశీర్వాదాలను మా మీద కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం' అని అన్నారు.నిర్మాత అవంతిక మాట్లాడుతూ… 'మా మీద నమ్మకం ఉంచి అండగా నిలిచిన 'ఆటాడిన పాట' చిత్రం టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమ, ఆదరణే మా ప్రయాణానికి బలం. త్వరలోనే ‘ఆటాడిన పాట’ మీ ముందుకు వచ్చి, మీ హృదయాలను తాకుతుంది. ప్రతి ఒక్కరి నమ్మకాన్నీ ఈ సినిమా నిలబెడుతుంది. సోషియో- ఫ్యాంటసీ కోవలోని ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని' వెల్లడించారు.

Rashmika Mandanna Reacts On Marriage rumours with vijay devarakonda2
వచ్చేనెలలో విజయ్‌తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే?

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.కాగా.. విజయ్‌ దేవరకొండతో ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ‍అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్‌ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే.

Introducing Satvika Veeravalli in Aakasamlo Oka Tara Movie3
నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి?.. హీరోయిన్‌ ఇంట్రో గ్లింప్స్‌ చూశారా?

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీకి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ను పరిచయం చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. రోడ్డు కూడా సరిగా లేని ఈ ఊరి నుంచి ఆకాశానికి నిచ్చేనేశావా? ముందు ఈ ఊరి పొలిమేర దాటి చూపించు చూద్దాం అనే డైలాగ్ వింటుంటే.. కనీస వసతులు కూడా లేని పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Is Nagarjuna Akkineni First Option Dhurandhar Movie4
గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?

మనది అని రాసుంటే ఎప్పటికైనా అది మన దగ్గరకే వస్తుంది. మనది కాకపోతే చేతుల వరకు వచ్చినా సరే దక్కకుండా చేజారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ ఛాన్స్ నాగ్ అందుకుని ఉంటే ఎలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్ టైంలో ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. టికెట్ పెంపు లాంటివి అసలే లేవు. డిసెంబరు తొలివారంలో బిగ్ స్క్రీన్స్‌పైకి రాగా ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే రూ.1300 కోట్ల మేర వసూలు చేసింది. ఇందులో హీరో పాత్ర కంటే రహమాన్ డకాయిత్ అనే విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్)రహమాన్ డకాయిత్‌గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం నాగార్జునని అనుకున్నారట. స్క్రిప్ట్ కూడా నచ్చింది గానీ అదే సమయానికి కూలీ, కుబేర చిత్రాలతో నాగ్ బిజీగా ఉండటం వల్ల చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆ పాత్రలో అక్షయ్ తప్ప మరొకరిని ఊహించుకోలేరు. అంతలా అదరగొట్టేశారు. అలాంటి పాత్ర నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో మరి?రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య ధర్ దర్శకుడు. 1990ల్లో పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్, అక్కడికి వెళ్లిన ఓ భారత రహస్య ఏజెంట్.. తర్వాత ఏం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. జనవరి 30 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు 'ధురంధర్' సీక్వెల్.. ఈ మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ హిందీ వరకే రిలీజ్ చేయగా.. సీక్వెల్ మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)

Naveen polishetty Shares anaganaga Oka raju Movie Collections5
ప్రతి రోజు ఏడ్చేవాడిని.. వదిలేద్దామనుకున్నా: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్

ఈ సంక్రాంతి టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్‌ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.నవీన్ పొలిశెట్టి తన ట్వీట్‌లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది. నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్‌బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు Thinking about all the auditions in Mumbai. Enno saarlu give up cheseyali anipinchindi. Even with this film I used to cry everyday after my accident wondering how I will write and act. Today #AnaganagaOkaRaju has grossed 100 crores worldwide. 🙏🏻🙏🏻🙏🏻My heart is filled with… pic.twitter.com/2GN9Kxl4FI— Naveen Polishetty (@NaveenPolishety) January 19, 2026

Anchor Rashmi gautam Comments about dogs Issue6
అడ్డుగా ఉన్నారని తల్లిదండ్రులను కూడా చంపేస్తారా?.. యాంకర్ రష్మీ గౌతమ్

టాలీవుడ్ యాంకర్ రష్మీ సైతం కుక్కల సంరక్షణపై మాట్లాడారు. ఇవాళ ప్రెస్‌క్లబ్‌లో ఆమె పాత సంప్రదాయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. మా అమ్మ, అమ్మమ్మ వాళ్లు మిగిలిన ఆహారాన్ని బయట కుక్కలకు పెట్టేవారని తెలిపింది. ఆ సంప్రదాయాలన్నీ మేము మర్చిపోయామని వెల్లడించింది. ఒకప్పుడు ఆవు అనే మన కుటుంబంలో సభ్యురాలిగా ఉండేదని పేర్కొంది. ఇ‍ప్పుడు ఆవుపాలను కూడా కల్తీ చేశామని వాపోయింది.జున్ను పాలు అనేది ఆవు బిడ్డకే అందించాలి.. కానీ మనం మాత్రం జున్ను తింటున్నామని రష్మీ గౌతమ్ తెలిపింది. అది తిన్నా కూడా అరగదని వెల్లడించింది. ఇలాంటి వాటిని ఎవరూ ప్రశ్నించరని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో లెటర్స్ పంపడానికి పావురాలు పెంచుకున్నారు.. కానీ ఇప్పుడేమో ‍అవసరం లేదని చంపేయండి అంటున్నారు. కుక్కలంటే ఒకప్పుడు డ్రైనేజీలో ఉండే ఎలుకలను తినేవి.. అప్పుడు ఎకోలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేదని తెలిపింది. డీ ఫారేస్టేషన్ వల్ల జింకలు కూడా రోడ్లమీదకు వస్తున్నాయని పేర్కొంది. పావురాలు , కుక్కలతో అవసరం లేదని వాటిని చంపుకుంటూ వెళ్తారా?.. అలాగే భవిష్యత్‌లో తల్లిదండ్రులు కూడా అడ్డంకిగా ఉన్నారని చంపేస్తారా? అంటూ రష్మీ ప్రశ్నించింది.ఇదంతా కేవలం కుక్కల గురించి మాత్రమే కాదని రష్మీ గౌతమ్ వెల్లడించింది. ఇదంతా సోషల్ కండీషనింగ్‌ అని తెలిపింది. మేము ఫారిన్ బ్రీడ్స్‌కు బానిసలా తయారయ్యామని యాంకర్ వివరించింది.

Renu Desai Responds on about Her Personal Life comments7
నాపై రూమర్స్‌ ఆపేయండి..నాకు ఆ ఉద్దేశమే లేదు: రేణు దేశాయ్

రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని వాపోయింది. తాను కుక్కల సంరక్షణ కోసమే కృషి చేస్తున్నానని తెలిపింది. కేవలం వాటి గురించే ఈ రోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడానని పేర్కొంది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని రేణు దేశాయి వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ..'నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. ముందు ఇలాంటి రూమర్స్‌ను ఆపేయండి. ప్రస్తుతం నేను చేస్తున్న సామాజిక సేవలో సంతృప్తిగా ఉన్నా. నాపై తప్పుడు థంబునెయిల్స్ రాస్తున్నారు. నేను ప్రెస్‌మీట్‌కు వచ్చేటప్పుడు చాలామంది గట్టిగా అరిచారు. నా పర్సనల్‌ లైఫ్‌పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ విడిచిపెట్టింది. ఇప్పుడు తనకు అర్థమైంది అంటూ నాపై ఎందుకు ఇలా ఏడుస్తున్నారని' ఆవేదన వ్యక్తం చేసింది.ఇంకా మాట్లాడుతూ..' నేను ఎవరి కోసం పోరాడుతున్నాను. నేను కుక్కల కోసం పోరాడటం లేదు. కేవలం మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా. అలాంటి నాపై నీచంగా కామెంట్స్ చేస్తున్నారు. నీ పిల్లలకు కుక్క కరిచి చనిపోతే మీకప్పుడు తెలుస్తుంది అంటున్నారు. నా బిడ్డ ప్రాణాలతో ఎందుకు ముడిపెడుతున్నారు. ఎవరి బిడ్డ ప్రాణాలైనా ఒక్కటే. అది చాలా తప్పు. మీకు ఎక్కడైనా కుక్కలతో సమస్య ఉంటే నా ఎన్జీవోకు లేదా జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వండి. వచ్చి మేమే తీసుకెళ్లిపోతాం. అంతేకానీ నా పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడొద్దు. నేను ఎలాంటి పాలిటిక్స్‌లోకి జాయిన్ అవ్వడం లేదు. నేను ప్రెస్‌ వాళ్ల మీద ఎక్కడా అరవలేదు. వంద కుక్కల్లో ఒక పది మెంటల్‌ కూడా ఉంటాయి. మనుషుల్లోనూ కొందరు మంచి వాళ్లు ఉంటారు. కొందరు చెడ్డవాళ్లు ఉంటారు. అవీ కూడా అంతే' అని రేణు దేశాయ్ వెల్లడించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)

Trimukha Movie Latest Release Update8
రికార్డు స్థాయిలో థియేటర్ విడుదలకు 'త్రిముఖ' రెడీ

ఈనెల 30వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న తెలుగు సినిమా 'త్రిముఖ'. ఇది ఇప్పుడు విడుదలకు ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలురాయిని నమోదు చేయబోతోంది. ఈ చిత్రాన్ని కొత్త హీరోతో తీశారు. అయినా సరే అత్యధికంగా 500 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే మంచి బజ్‌ సొంతం చేసుకున్న 'త్రిముఖ'... ప్రేక్షకుల అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద ప్రభావవంతమైన విజయాన్ని నమోదు చేస్తూ.. ఒక కొత్త హీరోకు ఘనమైన ఆరంభాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో సన్నీ లియోన్, అషూ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Renu Desai Press Meet Latest On Dog Issue9
కుక్కల్ని చంపితే కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: రేణుదేశాయ్

హీరో పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ మీడియా ముందుకొచ్చారు. వీధి కుక్కల్ని చంపేస్తున్న వాళ్లపై మండిపడ్డారు. రీసెంట్‌గా వీధి కుక్కల బెడదని అరికట్టేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగానే రేణు దేశాయ్ ప్రెస్ మీట్ పెట్టారు. దోమకాటుతో ఏడాదికి 10 లక్షల మంది చనిపోతున్నారు. వాళ్లవి ప్రాణాలు కాదా? కుక్క కరిచి ఒక్కరు చనిపోతే అది మాత్రమే ప్రాణమా? అని ప్రశ్నించారు. అలానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'అన్యాయంగా కుక్కల్ని చంపితే కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. కుక్కలన్నీ మంచివే అని నేను చెప్పను. కుక్కల దాడిలో చిన్న బిడ్డలు చనిపోయారు. ఒక తల్లిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐదు కుక్కలు కరిస్తే మిగతా కుక్కలన్నింటినీ చంపేస్తారా? మగాళ్లు రేప్ చేస్తారు, మగాళ్లే మర్డర్లు కూడా చేస్తారు. అంతమాత్రాన మగాళ్లందర్నీ రేపిస్టులు, హంతకులు అంటామా? రేపులు, మర్డర్లు చేసిన మగాళ్లందర్నీ పట్టుకుని చంపేయాలా? బుద్ది ఉందా కొంచెమైనా? ఏడాదికి దోమకాటుతో 10 లక్షల మంది చనిపోతున్నారు. వాళ్లవి ప్రాణాలు కాదా? కేవలం కుక్క కరిచి ఒక్కరు చనిపోతే అది మాత్రమే ప్రాణమా?' అని రేణు దేశాయ్ ప్రశ్నించారు.(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)మీలో ఎంత మంది అనాధ ఆశ్రమానికి వెళ్లారు? ఎంత మంది అన్నదానం చేస్తున్నారు? ఎంత మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు? చేసేది ఏమీ లేదు.. పెద్ద పెద్ద మాటలు మాత్రం మాట్లాడతారు? అని రేణు దేశాయ్ రెచ్చిపోయింది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డుపై అడ్డదిడ్డంగా వైన్ షాప్స్ పెడతారు. ఆల్కహాల్ తాగొచ్చి చాలామంది చిన్నపిల్లల్ని చావులకు కారణమవుతున్నారు. వాటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు. చిన్నారుల జీవితానికి విలువ లేదా? కుక్క కరిస్తేనే అడుగుతారా? లక్షలాది మంది ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక చనిపోతున్నారు. దానికోసం ఎవరూ పోరాడటం లేదు? కుక్కలు కరిస్తేనే పోరాటాలు చేస్తున్నారు అని ఆవేశానికి లోనైంది.ప్రతిరోజూ తాను ఎన్నో కుక్కలని కాపాడుతున్నానని.. అంబులెన్సులు వచ్చి వాటి తీసుకెళ్తున్నాయని.. వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నానని రేణు దేశాయ్ చెప్పారు. కుక్కలు ఇప్పటికే రోజూ యాక్సిడెంట్స్ చాలా చనిపోతున్నాయి. బైక్, బస్, కార్ల వల్ల జరిగే ప్రమాదాల వల్ల కాళ్లు, నడుము విరిగిన కుక్కల్ని చాలాసార్లు కాపాడాను. వాహనదారుల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కుక్కలు వెళ్లి కంప్లైంట్ చేయలేవుగా అని ప్రశ్నించారు.(ఇదీ చదవండి: నా కూతురు తిరిగి కొడుతుందేమోనని భయం: రాణీ ముఖర్జీ)

Mrunal Thakur Do Deewane Seher Mein Movie Teaser10
మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్

గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తెగ ట్రెండ్ అయిపోయింది. తమిళ హీరో ధనుష్‌ని వాలంటైన్స్ డే నాడు పెళ్లి చేసుకోనుందనే పుకార్లే దీనికి కారణం. ఒకటి రెండు రోజుల పాటు అందరూ ఈ వార్త నిజమేనని అనుకున్నారు. ఇదంతా ఫేక్ అని మృణాల్ టీమ్ ఇదంతా ఫేక్ అని చెప్పడంతో అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇదలా ఉండగానే ఓ రొమాంటిక్ మూవీని మృణాల్ రెడీ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)'దో దివానే షెహర్ మైన్' పేరుతో తీసిన ఈ రొమాంటిక్ సినిమాలో మృణాల్ సరసన సిద్ధాంత్ చతుర్వేది నటించాడు. ఫిబ్రవరి 20న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. సిద్ధాంత్-మృణాల్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి? ఎందుకంటే ఈమె గత రెండు చిత్రాలు.. సన్నాఫ్ సర్దార్ 2, ద ఫ్యామిలీ స్టార్.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. చూడాలి మరి ఈసారి ఏం చేస్తుందో?(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

Advertisement
Advertisement