Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood actresses Social Media Updates Goes Viral 1
బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న రకుల్.. సాక్షి అగర్వాల్ ఫిట్‌నెస్‌ మంత్ర..!

వైట్‌ డ్రెస్‌లో బాలీవుడ్ భామ కాజోల్ హోయలు..బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..ఫిట్‌నెస్‌ ముఖ్యమంటోన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్..సంక్రాంతి మూడ్‌లో యాంకర్‌ శ్రీముఖి..రెడ్ శారీలో కవ్విస్తోన్న బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్.. View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj)

Child Artist Name and place acts In Mana Shankara VaraPrasad Garu2
చిరంజీవి కుమారుడిగా చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో తెలుసా?

మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ను తెచ్చుకుంటోంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.అయితే ఈ చిత్రంలో అబ్బాయిగా నటించి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది చిన్నారి గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరీ బుజ్జాయి అంటూ తెగ వెతికేస్తున్నారు. ఆమె చిన్నారి పేరు ఊహ కాగా.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన బుజ్జితల్లి ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. సినిమాలపై ఇష్టంతో ఇప్పటికే 20కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవికి కుమారుడిగా నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ తెగ మురిసిపోతోంది. షూటింగ్‌ సెట్‌లో చిరంజీవి తనను ఎంత ప్రేమగా చూసుకునేవారని అంటోంది.

Tollywood Music Director Bheems Ceciroleo about His Journey3
'అసలు నీవల్ల ఏంటి ఉపయోగం అనేవారు'.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మనశంకర వరప్రసాద్‌గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీరిద్దరి కాంబో అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెంకీ మామ కూడా ఈ మూవీలో కనిపించడంతో క్రేజ్ మరింత పెరిగిపోయింది. మూవీకి హిట్ టాక్ రావడంతో మెగా బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్యూ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఆసక్తికర కామెంట్స్ చేశారు.చిన్నప్పుడు మా నాన్న నన్ను తిట్టేవాడని భీమ్స్ సిసిరోలియో అన్నారు. నువ్వు దేనికి రావు రా.. నీవల్ల ఏంటి ఉపయోగం అని అనేవారని గుర్తు చేసుకున్నారు. నాన్న ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను.. నా ముందు అనిల్ రావిపూడి ఉన్నారు.. నా వెనుక చిరంజీవి గారు ఉన్నారని ఎమోషనలయ్యారు. ఇది ఒక మాటతోనో.. చేసిన పాటలతోనో చెప్పుకునేది కాదు.. మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు.. నన్ను తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నారంటూ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. ఈ వేదిక నుంచి చెబుతున్నా.. నీ తల్లిదండ్రులకు, నీకు నా పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.భీమ్స్ మాట్లాడుతూ..' చిన్నప్పుడు నీ వల్ల ఏంటిరా ఉపయోగం అని నాన్న తిట్టేవారు. నాన్నా.. ఇప్పుడు ఇక్కడున్న.. నా ముందు అనిల్‌గారు.. నా వెనుక చిరంజీవిగారు ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా చెప్పినా భీమ్స్‌ ఉంటే బాగుంటుందని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నా కష్టానికి మీరు చూపించిన ప్రేమకు రుణపడి ఉంటా. సినిమా మొదలైనప్పటి నుంచి నాకు ఒక్కటే అనిపిస్తోంది. ఒక సాధారణ కానిస్టేబుల్‌ కొడుకు మెగాస్టార్‌ అయ్యాడు. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కొడుకు గొప్ప దర్శకుడు అయ్యాడు. ఒక సాధారణ రైతు కొడుకునైన నేను వాళ్లతో కలిసి పనిచేశాను. కర్షకుడు, కార్మికుడు, రక్షకుడు.. ఇలా ముగ్గురు కలిసిన త్రివేణి సంగమంలా అనిపిస్తోంది' అని అన్నారు.

Vijay Theri re release postponed amid Jana Nayagan censor issue4
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్.. ఆ సినిమా కూడా వాయిదా..!

దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం జన నాయగణ్. ఈ పొంగల్‌కు రిలీజ్ కావాల్సిన చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. సెన్సార్ వివాదం కాస్తా కోర్టుకు చేరడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు చేస్తోన్న చివరి చిత్రం కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు.అయితే తాజాగా విజయ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ సంక్రాంతి కానుకగా విజయ్ సూపర్ హిట్ మూవీ థేరీ రీ రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీని కూడా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న థేరీ రీ రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. జన నాయగణ్ మూవీ సెన్సార్ బోర్డు వివాదం రీ రిలీజ్‌ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాబోయే చిత్రాల నిర్మాతల అభ్యర్థన మేరకు థేరి విడుదలను వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నామనివి క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్ నటించారు.As per the request from the producers of upcoming releases, we have decided to postpone the release of "Theri".— Kalaippuli S Thanu (@theVcreations) January 13, 2026

Yelelo Lyrical Song Out From Rayudu Gari Thaluka Movie5
‘రాయుడు గారి తాలూకా’ నుంచి రెండో సాంగ్‌ రిలీజ్‌

శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా రూరల్ ఎంటర్‌టైనర్ ‘రాయుడి గారి తాలుకా’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట ‘జాతరొచ్చింది’ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ పొందింది. తాజాగా రెండో పాటను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా విడుదల చేశారు.‘ఏలేలో..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ ట్రాక్‌కు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. జయశ్రీ పల్లెం, సాయి సందీప్ పక్కి మధురమైన స్వరాలతో ఆలపించారు. ఈ పాట ద్వారా సినిమాలోని గ్రామీణ నేపథ్యం, రొమాన్స్ ఎలిమెంట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Director Maruthi Says I was Get Emotional At The Raja Saab Release Day6
సినిమా చూడలేకపోయా.. ఏడ్చేశా : ‘ది రాజాసాబ్‌’ డైరెక్టర్‌

ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్‌’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 201 కోట్లు కలెక్షన్స్‌ సాధించింది. సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూస్‌ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌కి నైజాంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్‌షోకి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా అనుమతి లభించింది. అర్థరాత్రి వరకు జీవీ రాకపోవడంతో..నైజాం ఏరియాలో ప్రీమియర్స్‌ పడలేదు. మీడియా కోసం హైదరాబాద్‌లోని విమల్‌ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా.. విషయం తెలిసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. గేట్లు బద్దలుకొట్టుకొని మరీ థియేటర్‌లోకి చొరబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి.. అందరిని బయటకు పంచింపిన తర్వాత అర్థరాత్రి 12.45 గంటలకు మీడియాకు షో వేశారు. ఈ విషయం తెలిసి చాలా టెన్షన్‌ పడ్డారట సినిమా దర్శకుడు మారుతి. ఒకవైపు ప్రీమియర్స్‌ షోకి అనుమతి రాకపోవడం, మరోవైపు మీడియా షో ఆలస్యం అవ్వడంతో టెన్షన్‌ భరించలేక కారులో కూర్చొని ఏడ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే మీడియాతో చెప్పారు. రాజాసాబ్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మారుతి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా ది రాజాసాబ్‌ రిలీజ్‌ రోజు ఎలా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన మారుతి సమాధానం చెబుతూ.. ‘నా తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ రిలీజ్‌ రోజు చాలా ఏడ్చేశా. అప్పుడు నాకు ఎదురైన సవాళ్లను చూసి..ఇకపై ఇండస్ట్రీ వైపే రావొద్దనుకున్నా. అలాగే ది రాజాసాబ్‌ రిలీజ్‌ రోజు కూడా చాలా టెన్షన్‌ పడ్డాను. ఒకవైపు నైజాంలో ప్రీమియర్‌ షోకి అనుమతి రాలేదు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షోకి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున​ వచ్చారనే విషయం తెలిసింది. మీడియా వాళ్లు అర్థరాత్రి వరకు వేచి చూశారనే విషయం తెలిసి బాధపడ్డాను. టెన్షన్‌ తట్టుకోలేక కారులో కూర్చొని ఏడ్చేశా. ఫ్యాన్స్‌కి ప్రీమియర్‌ షో వేయలేకపోయామనే బాధతో నేను కూడా సినిమా చూడకుండానే వెళ్లిపోయాను’ అని మారుతి చెప్పుకొచ్చాడు.

Vk Naresh Comments About His Character In movies7
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అండర్‌వేర్‌తో రోడ్డుపై నడుస్తా: టాలీవుడ్ నటుడు

శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు.ఈ మూవీ రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఈ ప్రెస్‌ మీట్‌కు హాజరైన టాలీవుడ్ నటుడు వీకే నరేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఏ క్యారెక్టర్‌ అయినా నేను ఎలాంటి లిమిట్స్ పెట్టుకోనని వీకే నరేశ్ అన్నారు. క్యారెక్టర్‌కు గౌరవం ఇస్తానని.. అందరికీ నచ్చేలా చేయడమే నా పని అన్నారు. గుంటూరు టాకీస్‌లో బాత్‌రూమ్‌లో సీన్‌ పెట్టారు.. అందులో చాలా ఎమోషన్ ఉంది అందుకే ఆ క్యారెక్టర్ చేశానని తెలిపారు. క్యారెక్టర్‌ డిమాండ్ చేస్తే ఆండర్ వేర్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తానని వీకే నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా.. వీకే నరేశ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఒక నటుడిగా ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోను.. పాత్ర కోసం కావాలంటే ఆండర్ వేర్ తో రోడ్డు మీద నిల్చోమన్నా నేను రెడీ - నరేష్#Sharwanand #Samyuktha #SakshiVaidya #NariNariNadumaMurari #AnilSunkara pic.twitter.com/PAvkfJHXVf— Filmy Focus (@FilmyFocus) January 12, 2026

Tamil Nadu Youth Congress demands to ban on Parasakthi movie8
వివాదంలో శివ కార్తికేయన్ పొంగల్ మూవీ..!

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన పొంగల్ చిత్రం పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వ వహించారు. జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆది నుంచే వివాదాలు ఎదురయ్యాయి. రిలీజ్‌కు ముందు సెన్సార్‌ సమస్య ఈ సినిమా చివరికి అనుకున్న తేదీకే విడుదలైంది.తాజాగా ఈ మూవీ రిలీజ్‌ తర్వాత మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపించింది.చరిత్రను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. శివకార్తికేయన్‌ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు.. చరిత్రలో జరగని సంఘటనలతో రూపొందించారని అ‍న్నారు. ఈ మూవీలో వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయని తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. కాగా.. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Kriti Sanon at sister Nupur Sanon Hindu wedding in Udaipur9
గ్రాండ్‌గా సిస్టర్‌ పెళ్లి.. సందడి చేసిన ఆదిపురుష్ హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి ‍అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్‌ను పెళ్లాడింది. ఉదయపూర్‌లో జరిగిన వివాహ వేడుకలో కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.నుపుర్ సనన్ సినీ కెరీర్..నుపుర్‌ సనన్‌.. 'టైగర్‌ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్‌ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) Kriti Sanon walks sister Nupur down the aisle as she weds Stebin Ben in dreamy Christian & Hindu ceremonies!#kritisanon #stebin #nupursanon #marriage #ptcpunjabigold pic.twitter.com/hNpgUbEeFo— PTC Punjabi Gold (@PtcGold) January 12, 2026

The Raja Saab Box Office Collection Day 4 Details10
200 కోట్ల క్లబ్‌లో ‘ది రాజాసాబ్‌’

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్‌’మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ వద్ద మాత్ర భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే రూ. 112 కోట్లు వసూలు చేసిన ‘రాజాసాబ్‌’... నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మేరకు మేకర్స్‌ అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ రాబట్టడం చూసి ట్రేడ్‌ వర్గాలు షాకవుతున్నాయి. అయితే ప్రభాస్‌ స్థాయికి ఈ కలెక్షన్స్‌ తక్కువే కానీ.. పోటీలో చిరంజీవి లాంటి సినిమాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో రావట్టడం గొప్ప విషయం.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పిపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీడేస్ సీజన్ లో ఫస్ట్ వీక్ "రాజా సాబ్" హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

Advertisement
Advertisement