Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Riya Shibu And Trpti Dimri Latest News1
అందంగా 'సర్వం మాయ' డెలులు.. గ్లామరస్ 'స్పిరిట్' బ్యూటీ

కేరళ చీరకట్టులో అందంగా 'డెలులు' రియా షిబుగ్లామర్‌తో మెరిసిపోతున్న 'స్పిరిట్' తృప్తి దిమ్రిజిమ్‌లో తెగ కష్టపడిపోతున్న సంయుక్త మేనన్అద్దం ముందు పొట్టి జీన్ స్కర్ట్‌లో ఈషా రెబ్బాసోయగాలతో రచ్చ లేపుతున్న జాన్వీ కపూర్సిల్క్ చీరలో నవ్వుతూ కావ్య కల్యాణ్ రామ్ View this post on Instagram A post shared by Riya Shibu (@riyashibu_) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

Sapthami Gowda Angry On Photographers Who Unwanted Zooming2
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ మండిపాటు

కొన్నేళ్ల ముందు వరకు పాపారాజీ కల్చర్ ఎక్కువగా ముంబైలో కనిపించేది. కానీ రీసెంట్ టైంలో దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. పాపారాజీ అంటే ఫొటోగ్రాఫర్స్ గుంపుగా కనిపిస్తూ సెలబ్రిటీల ఫొటోలు తీస్తుంటారు. వీళ్లలో కొందరు అనవసరమైన జూమ్ చేస్తూ హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో, యూట్యూబర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల వల్ల హీరోయిన్ల ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడ కూడా ఇప్పుడు అలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొంది. సదరు ఫొటోగ్రాఫర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.(ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)'ఇండస్ట్రీలోని మహిళందరి తరఫున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఈవెంట్స్‌లో మా పని గురించి కాకుండా, మా శరీర భాగాలని అనుచితంగా జూమ్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటంతో పాటు మమ్మల్ని అవమానించడమే అవుతుంది. కొందరు వ్యక్తులు చేస్తున్న ఇలాంటి పనులు ఏ మాత్రం సహించలేం. నటన కోసం, వృత్తి కోసమే ఇక్కడ ఉన్నాం. అలాంటిది హద్దులు దాటి ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. మా హుందాతనాన్ని ఇది దెబ్బతీస్తోంది. మీడియ మిత్రులు ప్రొఫెషనలిజం పాటిస్తూ కనీస గౌరవం ఇవ్వాలని ఆశిస్తున్నాం' అని సప్తమి గౌడ.. ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.తమతో చాలామంది జర్నలిస్టులు గౌరవంతో వ్యవహరిస్తున్నారని చెప్పిన సప్తమి గౌడ.. అలాంటి మీడియా మిత్రులు కూడా ఈ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలవాలని విజ్ఞప్తి చేసింది. మహిళలని ఫొటోలని తీసే విధానంలో దారుణంగా వ్యవహరిస్తున్న కొందరిని అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు.. ఈ తరహా ఫొటోగ్రాఫర్ల తీరుని తప్పుబట్టారు. తమని అసభ్యంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సప్తమి గౌడ విషయానికొస్తే.. 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది. 2022లో రిలీజైన 'కాంతార'లో రిషభ్ శెట్టి సరసన నటించి పేరు తెచ్చుకుంది. ది వ్యాక్సిన్ వార్ అనే హిందీ మూవీ, యువ అనే కన్నడ చిత్రాలు చేసింది. నితిన్ 'తమ్ముడు'తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇ‍చ్చింది. ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ కావడంతో టాలీవుడ్‌లో మరో ఛాన్స్ రాలేదు. ఈమె నటించిన 'ద రైజ్ ఆఫ్ అశోక'.. గతవారమే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే సప్తమికి ఈ చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)

Suma Kanakala Daughter Manaswini At Allu Sirish Reception3
యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే

యాంకర్ సుమ గురించి తెలుసు. భర్త రాజీవ్ కనకాల గురించి తెలుసు. వీళ్ల కొడుకు రోషన్ కూడా రెండు సినిమాలు హీరోగా చేశాడు. ఇతడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొద్దిమందికి తెలుసు. కానీ సుమ కూతురు పెద్దగా బయట కనిపించదు. అలాంటిది ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టిన సుమ.. తర్వాత యాంకర్ అయిపోయింది. ఆ టైంలోనే నటుడు రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకుంది. రాజీవ్ నటుడిగానే అడపాదడపా మూవీస్ చేస్తుంటగా.. సుమ యాంకరింగ్‌తో ఇప్పటికీ బిజీగానే ఉంది. వీళ్లకు కొడుకు రోషన్, కూతురు మనస్విని ఉన్నారు. రోషన్.. బబుల్‌గమ్, మోగ్లీ అనే చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ అవి హిట్ అవ్వలేదు. కూతురు మనస్విని ప్రస్తుతం చదువుకుంటోంది. పెద్దగా సోషల్ మీడియాలోనూ ఎక్కడ కనిపించదు.ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ రిసెప్షన్ వేడుకలో కనిపించడంతో సుమ కూతురు ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. సుమ అంత ఎత్తు కూడా ఉంది. మరి తల్లితండ్రి అన్నలానే ఇండస్ట్రీలోకి వస్తుందా? లేదా మరేదైనా ప్రొఫెషన్ ఎంచుకుంటుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

Actress Sneha Recalls Accident And Bed Rest Mode4
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే

హీరోయిన్ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో హోమ్లీ పాత్రలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ చాలానే మూవీస్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. తనకు గతంలో పెద్ద ప్రమాదం జరిగిందని, 8 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఓ దర్శకుడి వల్లే మళ్లీ ఇలా ఇప్పుడు మీ ముందున్నానని చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ ఈ విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'కెరీర్ పీక్ స్టేజీలో వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఓ ఘోర ప్రమాదం జరిగింది. అందులో నా చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం నిలబడటానికి కూడా ఎనిమిది నెలలు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నరకం అనుభవించాను. కెరీర్ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాను. ఆ టైంలో దర్శకుడు కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' స్టోరీతో నా దగ్గరకు వచ్చారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిసినా సరే నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చనాను. ఆ దశ చాలా కష్టమైనది. కానీ అదే నన్ను మరింత బలంగా మార్చింది' అని స్నేహ ఎమోషనల్ అయింది.తెలుగు కుటుంబానికే చెందిన స్నేహ అసలు పేరు సుహాసిని. ముంబైలో పుట్టి, షార్జాలో పెరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈమెని చూసిన ఓ మలయాళ నిర్మాత.. హీరోయిన్‌గా అవకాశమిచ్చాడు. అలా 2000లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'ప్రియమైన నీకు' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, మధుమాసంతో పాటు చాలానే మూవీస్ చేసింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకుంది. అనంతరం సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. రీసెంట్ టైంలో అయితే దళపతి విజయ్ 'గోట్'లో కనిపించింది.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

Devagudi And Vanchana Movies OTT Streaming Now 5
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

ప్రతివారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా ఓం శాంతి శాంతి శాంతిః, విత్ లవ్, గాంధీ టాక్స్, తన్వి ది గ్రేట్, లాలో కృష్ణ సదా సహాయతే తదితర మూవీస్ స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ రెండు చిత్రాలు ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చాయి?(ఇదీ చదవండి: యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ సినిమా)'వంచన' అనే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. 2024 నవంబరు 8న థియేటర్లలోకి వచ్చింది. ఉమా మహేశ్ హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోకి మంగళవారం నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. ఓ చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురవుతాడు. దీంతో అనుమానితుడిగా ఉన్న అతడి డ్రైవర్‌ని అరెస్ట్ చేస్తారు. అయితే సదరు డ్రైవర్ నిర్దోషి అని నమ్మిన క్రిమినల్ లాయర్ కృష్ణ.. ఈ కేసుని వాదించేందుకు సిద్ధమవుతాడు. దర్యాప్తులో భాగంగా లాయర్ కృష్ణకు ఎదురైన సవాళ్లేంటి? హంతకుడు ఎవరు? అనేదే మిగతా స్టోరీ.అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'దేవగుడి'. జనవరి 30న థియేటర్లలోకి వచ్చింది. చిన్న సినిమా కావడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇది కూడా ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోనే అందుబాటులోకి వచ్చింది. 'దేవగుడి' విషయానికొస్తే.. వీరారెడ్డి(రఘు కుంచె) ఓ ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరుల్లో ఒకరి కొడుకు అయిన ధర్మ(అభినవ్ శౌర్య), తన కొడుకుతో స్నేహంగా ఉండటాన్ని తట్టుకోలేడు. ధర్మతో తన కూతురు శ్వేత(అనుశ్రీ) ప్రేమలో ఉందని తెలిసి అతడిని ఊరి నుంచి గెంటేస్తాడు. తర్వాత కొన్నాళ్లకు వీరారెడ్డి అనారోగ్యానికి గురవడంతో అతడిని శత్రువులు చంపేస్తారు. మరోవైపు శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతని ఎవరు కిడ్నాప్ చేశారు? ధర్మ-ఈమె ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

Vijay and Rashmika Wedding Reception Rules6
విజయ్‌, రష్మిక రిసెప్షన్‌ రూల్స్‌.. సింగిల్‌ ఎంట్రీ కోడ్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక రిసెప్షన్‌ వేడుక గురించి ఒక వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇటీవల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమ ఫ్యాన్స్‌ కోసం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంచారు. ప్రధాన ఆలయాల్లో భోజనాలు పెట్టారు. ఇలా తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అయితే, మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. అందుకోసం పోలీసులు కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ రిసెప్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు చాలామంది సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. దీంతో కార్యక్రమానికి ఎంట్రీ అయ్యే వారికి చాలా కఠినమైన నియమాన్ని విధించింది. రిషెప్షన్‌కు వచ్చే అతిథులు లోపలికి వెళ్లాలంటే ఒకసారి మాత్రమే ఉపయోగించగల QR కోడ్‌ను ఏర్పాటు చేశారు. రోండోసారి ఆ కోడ్‌ పనిచేయదు. ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇస్తే బయటకు వచ్చేందుకు ఛాన్స్‌ వుండదు.రిసెప్షన్‌కు ఆహ్వానం, QR కోడ్‌లు లేని వారు అక్కడికి రావద్దని ఇప్పటికే తెలిపారు. ఇది పూర్తిగా పోలీసుల నిఘాలో ఉన్నందున హాజరు కావద్దని వారు అధికారికంగా ప్రకటించారు. పరిస్థితిని అర్థం చేసుకుని భద్రతా చర్యలకు సహకరించాలని విజయ్‌ టీమ్‌ కోరింది.(ఇదీ చదవండి: సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు)

Tanvi The Great Movie Now Streaming OTT7
ఓటీటీలో 'తన్వి ది గ్రేట్' సినిమా.. సడెన్‌గా స్ట్రీమింగ్‌

బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించి, నటించిన 'తన్వి ది గ్రేట్' (2025) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించిన విషయం తెలిసిందే. ఆటిజంతో బాధపడుతున్నప్పటికీ ఆర్మీలో చేరాలనే ఒక యువతి కల జీవితమే ఈ సినిమా.. ఇందులో శుభంగి దత్తా ప్రధాన పాత్ర పోషించంది. జాకీష్రాఫ్, అరవిందస్వామి, బొమన్‌ ఇరానీ, పల్లవి జోషి, నాజర్‌ వంటి స్టార్స్‌ ఈ మూవీలో నటించారు.‘తన్వి ది గ్రేట్‌’ (Tanvi The Great) మూవీ సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇరవై రెండేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్‌’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించిన అనుపమ్‌ ఖేర్‌.. గతేడాది ‘తన్వీ ది గ్రేట్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం.ఈ చిత్రాన్ని ఎన్‌ఎఫ్‌డీసీతో కలిసి అనుపమ్‌ స్టూడియోస్‌ నిర్మించింది.

Netizens Comments on Vijay Devarakonda Celebrate Party With hometown Peoples8
సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు

సతీమణి రష్మికతో పాటు విజయ్‌ దేవరకొండ తన సొంతూరులో సందడి చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి రావడంతో స్థానికులు సంతోషించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేటలో తమ ఫాంహౌజ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో భక్తిశ్రద్ధలతో గృహ ప్రవేశ పూజలు నిర్వహించారు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే, గ్రామస్థులకు, అభిమానులకు ఏర్పాటు చేసిన విందులో నాన్‌- వెజ్‌ ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్‌ అయింది. సత్యనారాయణ స్వామి వ్రతం సమయంలో అతిథిలకు నాన్‌- వెజ్‌ ఆహారం పెట్టడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, విజయ్‌ ఇచ్చిన విందుకు గ్రామస్తులు ఫిదా అయ్యారు. చాలామంచి భోజనంతో పాటుగా అందరినీ గౌరవంగా పలకరించారని చెబుతున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి పూజలు జరిగిన సమయంలో శాఖాహారం (వెజ్) మాత్రమే అతిథిలకు వడ్డిస్తారు. కానీ, విజయ్ దేవరకొండ వెజ్‌తో పాటు నాన్-వెజ్ కూడా వడ్డించారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే, తెలంగాణ నెటిజన్లు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. హిందూ సంప్రదాయాల అందరూ పాటిస్తారంటూనే ప్రాంతాన్ని బట్టి కొన్ని పద్దతులు మారుతాయని చెబుతున్నారు. తెలంగాణలో భక్తితో పాటు తమ ఆహారం పట్ల ప్రత్యేకమైన శైలి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. విజయ్‌ వారింట్లో పూజ ముగిసిన తర్వాత స్వామివారి పీఠాన్ని జరిపి ఆ కార్యక్రమాన్ని మొదట పూర్తి చేశారని చెబుతున్నారు. ఆ తర్వాతనే మాంసాహార విందును ఏర్పాటు చేశారని తెలుపుతున్నారు. తెలంగాణ‌లోని చాలా కుటుంబాల్లో ఇలాంటి ఆనవాయితీగా వస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. విజయ్‌ ఇంటికి దూరంగానే నాన్‌- వెజ్‌ ఆహారం వడ్డించారని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో పూజ పూర్తయిన సాయంత్రం లేదా మరుసటి రోజు తప్పకుండా విందు ఉంటుందని అందులో మాంసం వడ్డించడం సర్వసాధారణ‌మ‌ని గుర్తుచేస్తున్నారు.సొంతిల్లు కట్టుకున్నా: విజయ్‌స్వగ్రామం తుమ్మన్‌పేటకు మూడు దశబ్దాలుగా దూరంగా ఉన్నప్పటికీ తమ కుటుంబానికి గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందని విజయ్‌ దేవరకొండ తెలిపారు. తన తొలి పుట్టినరోజు కూడా ఇదే గ్రామంలో నిర్వహించినట్లు అమ్మా నాన్న చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. తన తండ్రి కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకున్నానని ఆయన అన్నారు. అందుకే తన వివాహానంతరం వ్రతం చేసి గ్రామస్థులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరు భోజనం చేసి తమను ఆశీర్వదించాలని కోరారు. తుమ్మన్‌పేట పాఠశాలలో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఉపకారవేతనం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అచ్చంపేట పరిధిలోని 44 పాఠశాలల విద్యార్థులకు దీన్ని అమలు చేస్తానన్నారు.ఊరందరికీ వివాహభోజనం పెట్టిన #VijayDeverakondaసొంత ఊర్లో సత్యనారాయణ వ్రతం చేసిన అనంతరం బంధుమిత్రులనదరికీ గ్రామస్తులకు విందు భోజనం పెట్టిన విజయ్ దేవరకొండ..#Virosh ❤️ pic.twitter.com/tojnbgBJcj— Suresh PRO (@SureshPRO_) March 2, 2026

Actor Sivaji Raja Father Passed Away9
నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు(85) అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం ఆయన కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వృద్ధాప్యం కారణంగా చికిత్స కూడా ఆయన శరీరం సహకరించకపోవడంతో హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత శివాజీకి ఫోన్‌ కాల్‌ ద్వారా తన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మాట్లాడి ధైర్యం చెప్పారు.

Om Shanti Shanti Shantihi Movie Now Streaming In OTT10
ఒక్కరోజు ముందే ఓటీటీలో 'ఓం శాంతి శాంతి శాంతిః' స్ట్రీమింగ్‌

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30న విడుదలైన ఈ సినిమా మేకర్స్‌ అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, ఓటీటీ ఫ్యాన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. 2022లో విడుదలైన మలయాళ హిట్‌ సినిమా జయ జయ జయ జయహే రీమేక్‌గా తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్‌ సజీవ్‌ తెరకెక్కించారు.‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ఆహా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 4న స్ట్రీమింగ్‌కు రావాల్సిన ఈ మూవీ గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి వచ్చేసింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో ఈషా రెబ్బా చూపించింది. కథేంటంటే..శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్‌ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది.అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్‌ భాస్కర్‌) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంది. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే.

Advertisement
Advertisement