Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Abishan Jeevinth With Love Movie OTT Release Date Ott1
ఓటీటీలో హిట్‌ సినిమా.. విత్‌ లవ్‌ రిలీజ్‌ ఎప్పుడంటే?

దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్‌ అయ్యాడు అభిషన్‌ జీవింత్‌. ఇతడు టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్‌ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్‌ డైరెక్టర్‌ హీరోగా మారాడు. విత్‌ లవ్‌ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.ఓటీటీలో విత్‌ లవ్‌అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్‌ జంటగా నటించిన ఈ మూవీకి మదన్‌ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్‌ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్‌ లవ్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్‌ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.కథేంటంటే?సత్య (అభిషన్‌ జీవింత్‌) ఆర్కిటెక్ట్‌.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్‌లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్‌). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదివామని, ఇద్దరూ సీనియర్‌- జూనియర్‌ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! #WithLove will be streaming from March 6 on NETFLIX. pic.twitter.com/IoSzc2TXwW— Christopher Kanagaraj (@Chrissuccess) March 1, 2026 చదవండి: దుబాయ్‌లో చిక్కుకున్నా.. నన్ను భారత్‌కు తీసుకురండి: బాలీవుడ్‌ నటి

Jr Ntr Movie Dragon Team escaped from iran and Israel and USA war2
ముందుగానే అంచనా వేశారు.. ఎస్కేప్ అయ్యారు.!

ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా జోర్డాన్‌ దేశంలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్,మాస్ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్‌ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు.తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్, ‍అమెరికా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్‌ టీమ్‌ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన టీమ్ ముందుగానే ఇండియాకొచ్చేసింది. వాస్తవానికి ఈ షెడ్యూల్‌ మార్చి మొదటి వరకు కొనసాగాల్సి ఉంది. కానీ కాస్తా తొందరగానే అక్కడి పరిస్థితులు అంచనా వేసిన డ్రాగన్‌ టీమ్‌ ఫిబ్రవరి 22 నాటికే షూటింగ్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. దీంతో ఈ దాడుల నుంచి ఎన్టీఆర్- నీల్ టీమ్ తృటిలో తప్పించుకుంది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ షూటింగ్ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు యూనిట్ సభ్యులు చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని టాలీవుడ్ సినీ వర్గాలు అభిప్రాయం ‍వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు.

Sonal Chauhan stranded in Dubai, Seeks Help to Get Back Home’3
దుబాయ్‌లో చిక్కుకుపోయా.. నన్ను భారత్‌కు తీసుకురండి!

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌, ఖతర్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లలో ఉన్న భారతదేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దుబాయ్‌లో టాలీవుడ్‌ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్‌ నటి సోనాల్‌ చౌహాన్‌ కూడా చిక్కుకుపోయింది. విమాన రాకపోకలు నిలిపివేయడంతో తిరిగొచ్చే దారి కనిపించడం లేదని సోషల్‌ మీడియాలో వాపోయింది.సాయం చేయండిగౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీగారు.. ప్రస్తుత సంక్షభ పరిస్థితుల్లో నేను దుబాయ్‌లో చిక్కుకున్నాను. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఇండియాకు ఎలా రావాలో తెలియడం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది సోనాల్‌.సినిమాసోనాల్‌ చౌహాన్‌ మోడల్‌, సింగర్‌, హీరోయిన్‌. జన్నత్‌ చిత్రంతో హిందీలో, రెయిన్‌బో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్‌, పండగ చేస్కో, షేర్‌, సైజ్‌ జీరో, డిక్టేటర్‌, ఎఫ్‌ 3, ద ఘోస్ట్‌ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో చివరగా ఆదిపురుష్‌ మూవీలో మండోదరిగా యాక్ట్‌ చేసింది. చివరగా దర్ద్‌ (2024) అనే ద్విభాషా చిత్రంలో తళుక్కుమని మెరిసింది.చదవండి: తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: ఇషితా దత్తా

Manchu Manoj Tweet On Iran and usa war about dubai 4
దుబాయ్‌లో మంచు విష్ణు.. యుద్ధంపై మనోజ్ ట్వీట్

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. యుద్ధం అనేది మానవత్వాన్ని ఎప్పటికీ చూపదని అన్నారు. ఈ దాడుల్లో ఎంతోమంది అమాయకుల జీవితాలు నాశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎవరూ కూడా సరిదిద్దలేరని పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక పరిస్థితుల్లో దుబాయ్‌లో చిక్కుకుపోయిన అమాయక ప్రజలం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంచు మనోజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రపంచమంతా శాంతించాలని కోరుకుంటున్నట్లు ఫోటోను షేర్ చేశారు.కాగా.. ఇరాన్‌పై దాడి తర్వాత దుబాయ్‌ మిస్సైల్స్ వర్షం కురుస్తోంది. ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్‌ మిస్సైల్స్‌తో దుబాయ్‌పై దాడులు మొదలెట్టింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో పలువురు ప్రముఖులు చిక్కుకుపోయారు. మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం దుబాయ్‌లో ఉన్నానని మిస్సైల్స్‌ పడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు సైతం దుబాయ్‌లో ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ ఆడేందుకు వెళ్లి ఆక్కడే చిక్కుకున్నారు. War has never elevated our humanity.When innocent lives suffer and fear replaces normalcy, no justification can make it right.Praying for the safety of innocent people in Dubai and everywhere affected by violence.#WorldWar3#Peace #humanity#Dubai #dubaiattack pic.twitter.com/nCBfkptaSy— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 1, 2026

Ram Charan as producer of Young Hero Nikhil Movie5
నిర్మాతగా రామ్ చరణ్‌.. స్వయంగా ప్రకటించిన టాలీవుడ్ హీరో

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ స్వయంభు. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన విజువల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ విజువల్స్ బాహుబలి రేంజ్‌లో ఉన్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఈ చిత్రానికి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సమ్మర్‌ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన హీరో తన కొత్త సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాలు చేస్తున్నట్లు ప్రకటించారు. స్వయంభుతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు. స్వయంభు తర్వాత ఇండియా హౌస్‌ అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వా కార్తికేయ-3 కూడా వస్తుందని నిఖిల్ ఫ్యాన్స్‌కు గూస్ ‍బంప్స్‌ తెప్పించేలా మాట్లాడారు. కాగా..స్వయంభు చిత్రంలో సంయుక్తమీనన్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తుండగాయ.. రవి బస్రూర్‌ సంగీతమందించారు. గ్లోబల్ స్టార్ మెగా పవర్ రామ్ చరణ్ - ఇండియా హౌస్ మూవీ ప్రొడ్యూసర్ #RamCharan #Nikhil #Swayambhu #Peddi pic.twitter.com/R9Q4rjvKkn— NAVEEN CHERRY 😎🤏 (@naveenpari2) February 28, 2026

Actress Ishita Dutta Says Mom Life is Messy6
తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: బాలీవుడ్‌ నటి

తెలుగు చిత్రం చాణక్యుడుతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఇషితా దత్తా. తర్వాత మాత్రం బాలీవుడ్‌లోనే సెటిలైంది. దృశ్యం, దృశ్యం 2, దేదే ప్యార్‌ దే 2 వంటి హిందీ చిత్రాల్లో తళుక్కుమని మెరిసింది. రిష్తాన్‌ కా సౌధాగర్‌: బాజీగర్‌ సీరియల్‌ చేసే సమయంలో నటుడు వస్తల్‌ సేత్‌తో ప్రేమలో పడింది. 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో బాబు జన్మించగా 2025లో పాప పుట్టింది.తల్లి జీవితం ఇంతే..తల్లయ్యాక తన జీవితమే మారిపోయిందంటోంది ఇషితా దత్తా. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. చిక్కుల జుట్టు, ఇంట్లో ఎక్కడపడితే అక్కడ బొమ్మలు.. ఎప్పటికీ పూర్తవని పనులు.. అవి కాకుండా సంబంధం లేని ప్రదేశాల్లో కూడా స్టిక్కర్లు.. తల్లి జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఇందులో స్వచ్ఛమైన ఆనందం దాగి ఉంది అని రాసుకొచ్చింది. ఇకపోతే ఇషిత తన పిల్లల ఆటలు, అలకలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది.చదవండి: సన్యాసం తీసుకున్న హీరోయిన్‌.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

Vijay Deverakonda, Rashmika, Chiranjeevi Trisha, On Screen Success Pair Repeat7
విజయ్‌, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్‌

వెండితెరపై ఓ హీరో, హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ కుదిరి, ఆ సినిమా హిట్‌ కూడా అయితే అప్పుడు ‘హిట్‌ పెయిర్‌’ అనిపించుకుంటారు. ఆ హిట్‌ పెయిర్‌ కాంబినేషన్‌కి ఓ స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కొన్ని జోడీలు రిపీట్‌ అవుతున్నాయి. తొలిసారి జోడీగా నటించి, సక్సెస్‌ సాధించిన ఈ జంటకు సక్సెస్‌ రిపీట్‌ కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. ఇక... రిపీట్‌ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. రెండోసారి... ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ‘బింబిసార’ మూవీ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష మెయిన్‌ హీరోయిన్‌గా, ఆషికా రంగనాథ్‌ సెకండ్‌ హీరోయిన్‌గా నటించారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్‌ ’. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్‌ అవుతోంది. ‘‘స్టాలిన్‌’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి–త్రిష జోడీ ‘విశ్వంభర’తో రెండోసారీ అలరించనుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందింది. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ఫై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న విడుదల చేసిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘‘వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్‌ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ ‘విశ్వంభర’. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది... వినోదపరుస్తుంది. ఈ వేసవికి ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. వందో చిత్రంలో... హీరో నాగార్జున, హీరోయిన్‌ టబు జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. వీరి పేరు చెప్పగానే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా గుర్తొస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొదటిసారి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న రిలీజైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తమదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు నాగార్జున–టబు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ మరోసారి సందడి చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించలేదు. కానీ, ‘సిసింద్రి’ (1995) సినిమాలో మాత్రం ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌ 100’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ మూవీకి తమిళ డైరెక్టర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో మరోసారి ఆయనకి జోడీగా టబు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ మైసూర్‌లో జరుగుతోంది. మూడోసారి... హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నా జోడీకి పాన్‌ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. విజయ్‌–రష్మిక కాంబినేషన్‌ లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు విజయ్‌–రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. విజయ్‌ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్‌ మూవీ తెరకెక్కించిన రాహుల్‌ సంకృత్యాన్‌ ‘రణబాలి’కి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టీ సిరీస్‌ ఫిలింస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారి లైఫ్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. రీల్‌ లైఫ్‌లో జోడీగా నటించిన విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్నా రియల్‌ లైఫ్‌లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి కాంబోలో రానున్న ‘రణబాలి’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్‌ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్‌ కానుంది. సెకండ్‌ టైమ్‌ హీరో శర్వానంద్, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ లది హిట్‌ జోడీ. ‘శతమానం భవతి’ మూవీలో ఫస్ట్‌ టైమ్‌ జోడీగా నటించిన ఈ జంట సెకండ్‌ టైమ్‌ ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా, డింపుల్‌ హయతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు శర్వానంద్‌–అనుపమ. వీరిద్దరూ ఫస్ట్‌ టైమ్‌ నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ మూవీ 2017 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో క్యూట్‌ జోడీగా ఆకట్టుకున్నారు శర్వా, అనుపమ. ఈసారి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’లో నటిస్తున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.ఈసారి భయపెడతారు ‘సామజ వరగమన’ సినిమాతో ప్రేక్షకులకు కడుపుబ్బా వినోదాలు పంచారు హీరో శ్రీవిష్ణు, హీరోయిన్‌ రెబా మోనికా జాన్‌. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్‌ 29న విడుదలై, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ‘సామజవరగమన’ వంటి హిట్‌ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్‌ నటించిన సెకండ్‌ మూవీ ‘మృత్యుంజయ్‌’. హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ కోసం రెండోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు–రెబా. తొలి చిత్రంలో ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ జంట ‘మృత్యుంజయ్‌’లో మాత్రం భయపెట్టనున్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సాంగ్స్, కామెడీ లేకుండా హానెస్ట్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మృత్యుంజయ్‌’. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా నటన కూడా సరికొత్తగా ఉంటుంది’’ అంటూ ఇటీవల శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ రిలీజ్‌ అవుతుండటంతో ఈ నెల 6కి ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేశారు. బేబీ హిట్‌తో... ‘బేబీ’ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్స్‌ అయిపోయారు హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవీ చైతన్య. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి వీరి జోడీపై యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ నెలకొంది. ‘బేబీ’తో హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న ఆనంద్‌– వైష్ణవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్‌’. ‘90స్‌’ (ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌) వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. కాగా ఎపిక్‌– ఫస్ట్‌ సెమిస్టర్‌ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్‌ దేవరకొండ చెప్పిన డైలాగ్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘బేబీ’ మూవీతో సూపర్‌హిట్‌ జోడీ అనిపించుకున్న ఆనంద్‌–వైష్ణవి కలిసి నటిస్తున్న ‘ఎపిక్‌’ మూవీపై మంచి క్రేజ్‌ నెలకొంది. రెండోసారి... ‘కోర్ట్‌’ సినిమాతో హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు హర్ష్‌ రోషన్, శ్రీదేవీ అపల్లా. ఈ ఇద్దరూ పరిచయమైన తొలి చిత్రం ‘కోర్ట్‌’. ఇప్పుడు రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్‌ మేళం’. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్‌’. రామ్‌ జగదీష్‌ దర్శకత్వం వహించారు. నాని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా 2025 మార్చి 14న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జోడీగా నటించిన హర్ష్‌ రోషన్‌–శ్రీదేవి హిట్‌ పెయిర్‌గా నిలిచారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆడియన్స్‌లో వీరి జోడీకి ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్‌ మేళం’. సతీష్‌ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఫుల్‌ బజ్‌ నెలకొంది.

vijay rahmika fans conducted annadanam at temple after wedding8
ఫ్యాన్స్ అన్నదానం.. విజయ్- రష్మికపై వెల్లువిరిసిన అభిమానం

టాలీవుడ్ కొత్త జంట విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే వీరి పెళ్లిని అభిమానులు కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అభిమానుల కోసం విరోష్ జంట అన్నదానం..కాగా.. తమ అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్‌ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మిఠాయిలు మార్చి 1వ తేదీన పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఆదివారం అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.VDFC JAGITYAL - Dharmapuri❤️❤️#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda #ViRoshWedding pic.twitter.com/jQNFuTENir— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda pic.twitter.com/jcR3130HNM— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026

Mamta Kulkarni Excitement About Making First TV Appearance In 25 Years9
సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్‌.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!

ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన మమతా కులకర్ణి 2003 తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి విదేశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ రాకెట్‌లో పేరు వినిపించడంతో వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్‌కు వచ్చిన ఆమె సన్యాసిగా మారింది. కిన్నెర అఖాడాలో చేరి మహా మండలేశ్వర్‌ పదవి అందుకుంది. బుల్లితెరపై రీఎంట్రీఅయితే కొన్ని వారాల క్రితమే ఆ హోదా నుంచి తప్పుకుంది. తాజాగా ఆమె బుల్లితెరపై కనిపించనుంది. హిందీలో ప్రసారమవుతున్న లాఫ్టర్‌ చెఫ్‌ మూడో సీజన్‌లో అతిథిగా అలరించనుంది. ఈ రియాలిటీ షో సెట్‌ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీరు గమించారో, లేదో కానీ టీవీలో కనిపించక 25 ఏళ్లవుతోంది. అది కూడా ముఖ్యమేరెండున్నర దశాబ్దాల తర్వాత బుల్లితెరపై మళ్లీ కనిపించబోతున్నాను. చాలా ఎగ్జయిట్‌ అవుతున్నాను. అందరూ లైఫ్‌లో బిజీ అవడంతో పాటు సీరియస్‌గా ముందుకు వెళ్తున్నారు. మధ్యమధ్యలో హాయిగా నవ్వుకోవడం కూడా ముఖ్యమే.. ఇలాంటి షోలు అందుకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: తీహార్‌ జైల్లో నాలుగు నెలలు.. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రావొద్దు: నటి

Sai Simhadri Talk About Son Of Movie At Success Meet10
‘స‌న్ ఆఫ్‌’ వ‌స్తోన్న రెస్పాన్సే నా స‌క్సెస్ : సాయి సింహాద్రి

సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘సన్‌ ఆఫ్‌’. బత్తుల సతీష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో సాయి సింహాద్రి మాట్లాడుతూ–‘‘యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఉన్న నేను సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. ఏడాదిన్నర పాటు ఇక్కడే ఉంటూ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సినిమాను పూర్తి చేశాను. ‘సన్‌ ఆఫ్‌’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే నా సక్సెస్‌’’ అని చెప్పారు.హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ ‘మంచి ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉన్న ‘స‌న్ ఆఫ్’లో తండ్రీ కొడుకుల మ‌ధ్య క‌నెక్టింగ్ చేసే మంచి రోల్‌లో న‌టించ‌టం న‌టిగా నాకు మంచి గుర్తింపునిచ్చింది’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషనల్‌ బాండింగ్, సంఘర్షణ కాన్సెప్ట్‌ నాకు నచ్చడంతో రిలీజ్‌కి ముందుకు వచ్చాను’’ అని చెప్పారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శోభారాణి.

Advertisement
Advertisement