Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Collar Ey Etthara  Lyric Video song out from Ustaad Bhagat Singh1
ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ 'కాలరే ఎత్తరా..' సాంగ్‌ విడుదల

పవన్‌ కల్యాణ్‌- హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. తాజాగా ఈ మూవీ నుంచి కాలరే ఎత్తరా ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు.

Allu Cinemas multiplex Grand Launch Event video2
'అల్లు సినిమాస్‌' ప్రారంభోత్సవం.. లైవ్‌ వీడియో

‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్‌, డి సురేష్‌ బాబు, బన్నీ వాస్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్‌కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్‌ పాత్ర ఐకానిక్‌గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్‌-2, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాలు ప్రదర్శించనున్నారు.

Rashmika Mandanna Angry on Mother Leaked Audio Viral, Warns Of Legal Action3
8 ఏళ్లు ఎంత బాధపెట్టినా మౌనంగా భరించా.. ఇకనావల్ల కాదు!

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్‌పూర్‌లో తెలుగు హీరో విజయ్‌దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్‌ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్‌ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్‌ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్నీభరించా..ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్‌ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్‌, రీచ్‌ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతదూరం వెళ్తారు?ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్‌ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్‌, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 24 గంటల్లో డిలీట్‌అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.వివాదం ఏంటి?2016లో కిరిక్‌ పార్టీ మూవీ షూటింగ్‌లో రష్మిక, రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 🙏🏻 pic.twitter.com/DdJwFIjeP3— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026

Actress Radhika Sarathkumar praises Sivakarthikeyan4
రాధికా శరత్‌కుమార్‌ రికార్డ్‌.. తొలి హీరోయిన్‌గా గుర్తింపు

ఇండస్ట్రీలో సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్‌ను బట్టే ఫలితం నిర్ణయిస్తారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బడ్జెట్‌ పేపరుతో టికెట్‌ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరం అవుతున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం వారంలోనే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమకు నచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుతున్నారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీనియర్ నటి రాధిక శ‌ర‌త్ కుమార్ నటించిన తాయి కిళ‌వై చిత్రం తక్కువ టికెట్‌ ధరలతోనే భారీ కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.తను నటించిన కొత్త సినిమా పదిరోజుల కలెక్షన్స్‌పై రాధికా శరత్‌కుమార్‌ ఇలా మాట్లాడారు.. ' రూ. 150 రూపాయల టికెట్ ధరతోనే మా సినిమా రూ. 60 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. స్టార్‌ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ. 1500 నుంచి 2000 వరకు ఉంటున్న విషయం తెలసిందే. అయినప్పటికీ కలెక్షన్స్‌ పెద్దగా వచ్చిన దాఖలు లేదు. ఈ మూవీ కోసం బడ్జెట్‌ రూ. 9 కోట్లు మాత్రమే పెట్టారు.. బాక్సాఫీస్‌ లెక్కలు సరిగ్గా అంచనా వేసుకుంటే స్టార్‌ హీరోల కంటే మేము పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. మంచి కథ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను చూస్తారు.' అని ఆమె చెప్పింది. అధిక టికెట్ రేట్లు లేకుండానే పెద్ద విజయాలు సాధించవచ్చని తమ సినిమా చూపించిందని ఆమె గుర్తు చేశారు.రాధిక చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి. ఆమె మాట్లాడింది నిజమే కదా అంటూ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్‌పై రాధిక ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్‌ ఇచ్చారని భావిస్తున్నారు. బారీ బడ్జెట్‌ సినిమాల పేరుతో టికెట్‌ ధరలు పెంచడంపై ప్రేక్షకులు అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే.తమిళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా, ఒక హీరోయిన్ తాను తీసుకునే రెమ్యునరేషన్‌తో పాటుగా లాభాల వాటాను అందుకున్న నటిగా రాధికా రికార్డ్‌ క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం ఒక రికార్డ్‌గా నిలిచిపోతుంది. అన్ని పరిశ్రమలలో గేమ్-ఛేంజర్ అవుతుందని ఈ విషయంపై రాధికా అన్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు హీరోలకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేదని. తాజాగా తాయి కిళవి కొత్త ట్రెండ్‌కు తెరతీసిందని ఆమె అన్నారు. నిర్మాత శివకార్తికేయన్‌ను అభినందించాలని ఆమె కొనియాడారు.

Mumtaz about Polygamy, Marrying three-four times is Wrong5
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్‌

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా.. ఆ తర్వాత హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది సీనియర్‌ నటి ముంతాజ్‌. ఖిలోనా, దో రాస్తే, ఆప్‌కీ కసమ్‌, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్‌ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది.హిందూ దేవుళ్లంటే ఇష్టంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్‌ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.ఎందుకీ గొడవ?నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి ​కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.అది చాలా తప్పుభార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్‌ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్‌ నొక్కి చెప్పింది.చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్‌.. చెండాలమైన లిరిక్స్‌: నటి

Actress Shabana Azmi Slams Item Songs and their Lyrics6
అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్‌.. చిన్నపిల్లలు కూడా!

సినిమాల్లో ఐటం సాంగ్స్‌ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్‌ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్‌ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్‌ అనగానే హీరోయిన్‌ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్‌ చేస్తున్నారు. అవసరం లేకపోయినా..పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్‌ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్‌లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్‌ సాంగ్స్‌ను కావాలని ఇరికిస్తున్నారు.చిన్నపిల్లలు కూడా..ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్‌ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్‌ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్‌) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. సినిమాఎవరూ ఆ లిరిక్స్‌ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్‌లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్‌, అర్థ్‌, ఖాందార్‌, పార్‌, గాడ్‌ మదర్‌ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో మెరిసింది.చదవండి: పవన్‌ కల్యాణ్‌ డూప్‌గా హరీశ్‌ శంకర్‌? డైరెక్టర్‌ ఏమన్నారంటే?

Jana Nayagan OTT Deal 120 cr canceled because of delay7
'జన నాయగన్‌' రూ. 120 కోట్ల ఢీల్‌ రద్దు

విజయ్‌ నటిస్తున్న ‘జన నాయగన్‌’కు సెన్సార్‌ చిక్కులు చిక్కులు తప్పడం లేదు. ముందుగా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో వడ్డీల రూపంలో నిర్మాత వెంకట్‌ కె.నారాయణకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఓటీటీ ఢీల్‌ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో చట్టపరమైన సమస్యలు రావడంతో ఈ సినిమా గత మూడు నెలలుగా ల్యాబ్‌కే పరిమితమైంది.జన నాయగన్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం సీబీఎఫ్‌సీ రివైజ్‌ కమిటీ మరోసారి సినిమా చూడాల్సి ఉంది. అయితే, ఈ కమిటీలో ఓ సభ్యుడి అనారోగ్య కారణంగా చివరి నిమిషంలో స్క్రీనింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసింది. ఇలా పలు కారణాలతో రివైజ్‌ కమిటీ దాటవేస్తుండటంతో వ్యాపారం పరంగా భారీ నష్టం తప్పడం లేదు. కనీసం ఎప్పుడు చూస్తారో కూడా వారు చెప్పకపోవడంతో విడుదలపై అనిశ్చిత నెలకొంది. దీంతో అమెజాన్‌తో కుదుర్చకున్న ఓటీటీ ఢీల్‌ రూ. 120 కోట్లు రద్దు అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.విజయ్‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో జన నాయగన్‌ చివరి సినిమా అని ప్రకటించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్‌ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా యాక్ట్‌ చేస్తున్నారు. కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాపై బాక్సాఫీస్‌ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి.

Vijay Deverakonda, Rashmika Dance With Anand Devarakonda, Video Goes Viral8
పెళ్లి తర్వాత తొలిసారి విజయ్‌, రష్మిక డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

మొన్నటి వరకు పెళ్లి పనులు, రిసెప్షెన్లతో బిజీగా గడిపిన టాలీవుడ్ స్టార్ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక..ఇప్పుడు రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. షూటింగ్స్‌కి గ్యాప్‌ ఇచ్చి.. ఖాలీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా ఈ జంట..ఆనంద్‌ దేవరకొండ పాటకు డ్యాన్స్‌ చేసింది. పెళ్లి తర్వాత తొలిసారి విజయ్‌, రష్మిక కలిసి డ్యాన్స్‌ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.సరదాగా ‘సంచారమే..’ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ . ఈ మూవీ నుంచి ఇటీవల సంచారమే అనే పాట రిలీజ్ అయింది. ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్న లిరిక్స్‌ అందించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్‌ పెద్ద ఎత్తున ఈ పాటకు రీల్స్‌ చేస్తున్నారు. ఇప్పుడీ ట్రెండీ సాంగ్ ను విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి రీక్రియేట్ చేశారు. ముగ్గురు కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ‘ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది’ అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda)

Actor Siva Ganesh says that viral Spirit look is Mine, Not Prabhas9
స్పిరిట్‌ లుక్‌ వైరల్‌.. అది ప్రభాస్‌ది కాదు నాది!: నటుడు

'స్పిరిట్‌' అన్న పేరు వినిపిస్తే చాలు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎక్కడలేని సంతోషం వస్తుంది. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఇటీవల ప్రభాస్‌ స్పిరిట్‌ లుక్‌ అంటూ ఓ ఫోటో తెగ వైరలయింది. అందులో నటుడి ఫేస్‌ కనిపించకుండా వెనక నుంచి పిక్‌ తీశారు. దీంతో ఆయన ప్రభాస్‌ అని చాలామంది భావించారు.ఫోటో వైరల్‌కానీ ఆయన డార్లింగ్‌ ప్రభాస్‌ కాదని, ఆ ఫోటో తనది అంటున్నాడు నటుడు శివ గణేశ్‌. ఆంధ్ర కింగ్‌ తాలూకా సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన శివ గణేశ్‌ ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్‌లో వెనక నుంచి దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అది కాస్తా ప్రభాస్‌ ఫోటో అని వైరల్‌ అయింది.ఎందుకు వైరల్‌ అయిందో..దీనిపై శివ గణేశ్‌ స్పందిస్తూ.. నేను చేస్తున్న సినిమాలోని మేకింగ్‌ ఫోటో అది. మా డైరెక్టర్‌ ప్రభాస్‌ ఫ్యాన్‌. అలా అని నన్ను ప్రభాస్‌లా చూపించాలనుకోలేదు. కానీ, అది అనుకోకుండా కుదిరింది. మూడురోజుల క్రితం నా ఫ్రెండ్‌ ఒకడు మెసేజ్‌ చేశాడు. ఇది ప్రభాస్‌ ఫోటో అని ట్విటర్‌లో వైరలవుతోంది, నువ్వే కదా? అని అడిగాడు. నేనే అని బదులిచ్చాను. కానీ, ప్రభాస్‌ ఫోటో అని ఎందుకు వైరల్‌ చేస్తున్నారో అర్థం కాలేదు.సినిమానేను భీమవరంలో పుట్టిపెరిగాను. ప్రభాస్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో నన్ను పోల్చినందుకు సంతోషంగా ఫీలయ్యాను అని చెప్పుకొచ్చాడు. ఇతడు పుష్ప 2, ఖుషి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల్లోనూ యాక్ట్‌ చేసినప్పటికీ ఎడిటింగ్‌లో తీసేశారు. ప్రస్తుతం ఇతడు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో నటిస్తున్నాడు.

Vijay Sethupathi Kaattaan Web Series Streaming Details10
ఓటీటీని షేక్‌ చేసేలా విజయ్‌ సేతుపతి వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మణికందన్.. కాకా ముట్టై, కడైసి వివసాయి వంటి సినిమాలతో జాతీయ అవార్డ్స్‌ అందుకున్న ఆయన ‘కాట్టాన్’ (ముత్తు అలియాస్ కాట్టాన్) అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించారు. మార్చి 27న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో హీరోగా విజయ్‌ సేతుపతి నటిస్తున్నడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.జియో హాట్‌స్టార్(JioHotstar) స్పెషల్ సిరీస్‌గా మార్చి 27, 2026న కాట్టాన్‌ (Kaattaan) ప్రీమియర్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ సేతుపతి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించగా.., రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి - మణికందన్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఆండవన్ కట్టలై, కడైసి వివసాయి వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు వచ్చాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా వీరి కాంబినేషన్‌లో వెబ్‌ సిరీస్‌ రానున్నడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ వెబ్‌ సిరీస్‌ రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో విజయ్‌ సేతుపతి పాత్ర గతంలో ఎన్నడూ చూడని అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారని టాక్‌. ఇందులో హింస తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.

Advertisement
Advertisement