ప్రధాన వార్తలు
ఈత రాదు, గోదావరిలో పడిపోయా.. చనిపోయానని: నటుడు
రన్ రాజా రన్, పటాస్, దోచేయ్, రాజుగారి గది, కుమారి 21 ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడు, మజిలీ, సామజవరగమన.. ఇలా అనేక సినిమాలు చేశాడు నటుడు సుదర్శన్. నెల్లూరు యాసలో చెప్పే డైలాగులతోనే అతడు ఫేమస్ అయ్యాడు. ఎక్కువగా హీరో స్నేహితుడు పాత్రల్లో కనిపించాడు. ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి సినిమాలో కనిపించాడు. చదువు మధ్యలోనే..తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుదర్శన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు క్లాస్ ఫస్ట్. కానీ బీటెక్ మధ్యలోనే ఆపేశాను. చాలా బిజినెస్లు, పని చేసి చివరకు సినిమాల్లోకి వచ్చాను. మూవీ ఇండస్ట్రీ అనగానే ఇంట్లోవాళ్లు భయపడ్డారు. కానీ, నన్ను వెండితెరపై చూసి సంతోషపడ్డారు.గోదావరిలో పడిపోయా..కుమారి 21 ఎఫ్ రిలీజ్కు ముందు ఓ చిన్న సినిమా షూటింగ్ కోసం గోదావరి జిల్లాకెళ్లాను. చిత్రీకరణ సమయంలో నేను గోదావరిలో పడిపోయాను. నాకు ఈత రాదు. నేను చనిపోయానని అందరికీ ఫోన్లు వెళ్లాయి. లోకల్ మీడియా లొకేషన్కు చేరుకుంది. నానాకష్టాలు పడి నన్ను బయటకు లాగారు.బతికే ఉన్నా..నేను బతికే ఉన్నానని తెలుస్తోంది కానీ, కళ్లు తెరవడానికి గంట సేపు పట్టింది. ఈ సంఘటన తర్వాత ఇంట్లోవాళ్లు తిట్టి సినిమాలు వద్దు, ఇంటికి వచ్చేయ్ అన్నారు. నా తొలి మూవీ రన్ రాజా రన్. దీనికి నేను రూ.3500 పారితోషికం అనుకున్నాను. రిలీజైనవి, కానివి కలుపుకుంటే దాదాపు 150 సినిమాలు చేశాను అని సుదర్శన్ చెప్పుకొచ్చాడు.ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో..సుదర్శన్ ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బర్త్డే రోజు నేను, నా స్నేహితుడు హీరో ఇంటికెళ్లాం. ఇంటి గేటు ముందున్న చెట్టు కింద నిల్చున్నాం. ప్రభాస్.. బాహుబలి ప్రీ ప్రొడక్షన్ కోసం కేరళ వెళ్లాడు, లేడని చెప్పినా మేము వినలేదు. అభిమానులు వచ్చి వెళ్లిపోతున్నారు. మేము మాత్రం కదల్లేదు. తిండీ తిప్పలు మానేసి ఉదయంనుంచి అర్ధరాత్రి ఒంటిగంటవరకు ఆ చెట్టు కిందే వర్షంలో తడుచుకుంటూ నిల్చున్నాం. ఇంతలో మమ్మల్ని లోపలకు పిలిచారు. నాతో కేక్ కట్ చేయించి, తినమన్నారు. ప్రభాస్ వచ్చాక ఈ ఫోటోలు చూపిస్తాం.. వెళ్లిపోండి అన్నారు. ప్రభాస్ నిజంగానే లేడని అర్థమైంది. అయినా ఆర్టిస్టులను ఇలా ఇబ్బందిపెట్టడం తప్పని తర్వాత తెలిసొచ్చింది అన్నాడు.చదవండి: పైసా పారితోషికం తీసుకోని తమన్నా..ఎందుకంటే?
దృశ్యం నటి.. ఒకే ఒక్క సీరియల్తో సినిమా ఛాన్స్..!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో దృశ్యం-3 ఒకటి. గతంలో విడుదలైన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ ఫ్రాంచైజీలో వస్తోన్న దృశ్యం 3 ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్ను అలరించనుంది.అయితే ఈ సినిమాలో ఐజీ గీతా ప్రభాకర్ పాత్రలో మెప్పించిన నటి ఆశా శరత్. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందని తెలిపింది. మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుందని పేర్కొంది. ఈ క్లైమాక్స్ చూస్తే మీరంతా కచ్చితంగా షాకవుతారని చెప్పుకొచ్చింది.అసలు ఎవరీ ఆశా శరత్?దృశ్యం ఫ్రాంచైజీలో ఛాన్స్ కొట్టేసిన ఆశా శరత్ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ మొదలైంది. అసలు ఆమె సినిమాల్లో ఎలా వచ్చిందనే దానిపై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తాజాగా ఆశా శరత్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మలయాళ బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఓకే ఒక్క సీరియల్తో మూవీస్లో అడుగుపెట్టింది.స్వతహాగా డ్యాన్సర్ అయినా ఆశా శరత్.. మలయాళంలో 'కుంకుమ పువ్వు' అనే సీరియల్తో నటనారంగ ప్రవేశం చేసింది. ఇందులో లీడ్ రోల్ అయినా ప్రొఫెసర్ జయంతి పాత్ర పోషించింది. ఈ క్యారెక్టర్తోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అలా తనకు కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్నప్పుడే దృశ్యం సినిమాలో అవకాశం వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ఫ్రైడే, కర్మయోధ, అర్ధనారి, జకరియాయుడే గర్భిణికల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ దృశ్యం సినిమానే ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ వెర్షన్లలో కూడా అదే పాత్రను పోషించింది.ఆశా శరత్ మాట్లాడుతూ.. "నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఆందోళన ఉండేది. సీరియల్లో జయంతి పాత్ర అనేది ఎమోషనల్తో కూడుకున్నది. ఒకవేళ ప్రేక్షకులు గీతా ఐపీఎస్ కూడా పోలీసు యూనిఫాంలో ఉన్న జయంతి లాగే ఉందని భావిస్తే ఎలా? అది సినిమాపై, నాపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందా. కానీ వారి స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది. మలయాళీలు చాలా తెలివైనవారు. పాత్రల మధ్య తేడాను ఎలా గుర్తించాలో వారికి బాగా తెలుసు' అని గతంలోనే చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో మోహన్లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు.
అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడి
అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడిటాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేశారు. మెగాస్టార్తో తీసిన మనశంకర వరప్రసాద్గారు బ్లాక్బస్టర్గా నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్.. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశారు.తాజాగా హై టీజర్కు ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడి.. తనతో కలిసి పని చేసిన సాయికృష్ణపై ప్రశంసలు కురిపించారు. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ల నాన్న డ్రీమ్ అని తెలిపారు. కానీ ఆ కల నేరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు విన్నప్పుడు నేను చాలా ఎమోషనల్గా ఫీలయ్యానని అనిల్ రావిపూడి అన్నారు. సాయి బాగా చేస్తాడని తెలుసు.. కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదని కొనియాడారు. ఈ సినిమాలో చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా చేశాడని అనిల్ ప్రశంసించారు. కాగా.. సాయి కృష్ణ, అనన్య శర్మ,ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్ను విడుదల చేశారు.
బాలీవుడ్ మూవీ.. పైసా తీసుకోని తమన్నా, విక్రాంత్!
వాలంటైన్స్ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.స్టార్ అవడానికి ముందే..అయితే విక్రాంత్ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్ తర్వాత అతడు పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. ఉచితంగానే..నేను డైరెక్ట్ చేసిన మఖ్బూల్ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్కు కూడా వచ్చింది అని విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నాడు.చదవండి: సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్
బిగ్బాస్
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
యాక్సిడెంట్తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
A to Z
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించ...
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం...
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంద...
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సిని...
లగ్జరీ ఇల్లు కొన్న బాలీవుడ్ హీరో
'హోంబౌండ్' సినిమా హీరో ఇషాన్ ఖట్టర్ కొత్త ఇల్లు...
తెలుగులో ఏకైక మూవీ.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఒకప్పుడు హీరోయిన్గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర...
దురంధర్కు అదే పెద్ద మైనస్.. అలా జరిగితే భారీ వసూళ్లు: అమిర్ ఖాన్
గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ ద...
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ షో...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడి
అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడిటాలీవుడ...
సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య.. వీడియో వైరల్
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఐశ్వర్య రాజేశ...
బుల్లిరాజు కొత్త సినిమా.. పవర్పుల్గా టీజర్
అనన్య శర్మ, ఎస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న ల...
'నా సూపర్ పవర్ నువ్వే.. సతీమణికి కాంతార హీరో స్పెషల్ విషెస్'
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చ...
ఫొటోలు
‘గాయపడ్డ సింహం’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
‘విప్లవ వీరుడు’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
గ్లామర్తో పడేస్తున్న శ్రద్ధా దాస్.. నెట్టింట ఫోటోలు వైరల్
'ఎర్రచీర' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్, తేజ సజ్జా (ఫోటోలు)
ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
'అమరావతికి ఆహ్వానం' హారర్ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
గాసిప్స్
View all
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
రివ్యూలు
View all
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
2.75
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
ఓటీటీ ట్రెండింగ్లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్
గత కొన్నిరోజులుగా ఎప్స్టీన్ అనే వ్యక్తి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈయన.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి..ఫ్లోరిడా,న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడు. ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2005లో ఎప్స్టీన్ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో.. జైలులోనే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ.. ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్స్టీన్ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా 'జెఫ్రీ ఎప్స్టీన్ : ఫిల్తీ రిచ్' పేరుతో నెట్ఫ్లిక్స్లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు.తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియర్గా ఎప్స్టీన్ ఎలా ఎదిగాడు? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఏంటి? చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల ఏంటనేది చూపించారు.అయితే ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ తదితరుల పేర్లు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది.(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. వీడియో పోస్ట్ చేసిన ఉపాసన)
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.ఇక హీరోయిన్ విషయంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చాడు.ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. చరణ్-సుక్కూ కాంబో మళ్లీ కలిసింది. అనుపమ కూడా ఇంకా లైమ్లైట్లోనే ఉంది. ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్గా మారింది. తన కెరీర్లో అనుపమ కొన్ని మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరుకు స్టార్ హీరోల రేంజ్లో మాత్రం ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో, దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్-సుక్కూ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ.. నటాషా స్టాంకోవిచ్ బోల్డ్ లుక్స్..!
ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ..మరింత హాట్ హాట్గా నటి నటాషా స్టాంకోవిచ్..పాయల్ రాధాకృష్ణ స్టన్నింగ్ వీడియో..గతవైభవ మూవీ జ్ఞాపకాల్లో ఆషిక రంగనాథ్..గోవాలో చిల్ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43)
టాలీవుడ్ ఇండస్ట్రీలో అసమ్మతి.. మళ్లీ మొదలైన వివాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో కథ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో తలెత్తిన సినీ కార్మికుల వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాజాగా టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి లేఖలు రాశారు. దీంతో ముగిసిపోయిందనుకున్న సమస్య మళ్లీ అసమ్మతి సెగలకు కారణమైంది. తమ సమస్యలు ఈ నెలాఖరు లోపు పరిష్కరించాలని కోరుతూ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా వీరి బాటలోనే మరో 11 యూనియన్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని యూనియన్ల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వం, ఛాంబర్ పెద్దలతో చర్చించి మాకు న్యాయం చేయాలని యూనియన్ నాయకులు అంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే మార్చి ఒకటి నుంచి సమ్మెకు దిగుతామని టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు.
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. జనవరి 31న ఓ బాబు, పాపకు వెల్కమ్ చెప్పారు మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ అభిమానులు ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ట్విన్స్కు జన్మనిచ్చిన తర్వాత ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఉపాసన తన పోస్ట్లో రాస్తూ.." ఇది చూసిన ప్రతిసారీ నా హృదయం సంతోషంతో నిండిపోతోంది. మన చుట్టూ ఉన్న ప్రేమ, బలం, సానుకూలతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా. మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం. తేజస్వి గారు.. అపోలో హాస్పిటల్స్ బృందం నిబద్ధతతో మాకోసం పనిచేశారు. రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ మనసు నుంచి వచ్చిందని నాకు తెలుసు. మీరు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని.. వారి భద్రతను గౌరవిస్తారని నేను నమ్ముతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOUMy family is truly blessed.Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్ ఇన్ ఏ మెట్రో, వేకప్ సిద్, ‘మెట్రో ఇన్ దినో’ లాంటి సినిమాల్లో నటించారు. Meera's living her dream life. Will a secret turn it into a nightmare?Watch Accused, starring Konkona Sensharma and Pratibha Rannta, out 27 Feb, only on Netflix. #AccusedOnNetflix pic.twitter.com/J1Nuk2x3f1— Netflix India (@NetflixIndia) February 9, 2026
ఈత రాదు, గోదావరిలో పడిపోయా.. చనిపోయానని: నటుడు
రన్ రాజా రన్, పటాస్, దోచేయ్, రాజుగారి గది, కుమారి 21 ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడు, మజిలీ, సామజవరగమన.. ఇలా అనేక సినిమాలు చేశాడు నటుడు సుదర్శన్. నెల్లూరు యాసలో చెప్పే డైలాగులతోనే అతడు ఫేమస్ అయ్యాడు. ఎక్కువగా హీరో స్నేహితుడు పాత్రల్లో కనిపించాడు. ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి సినిమాలో కనిపించాడు. చదువు మధ్యలోనే..తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుదర్శన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు క్లాస్ ఫస్ట్. కానీ బీటెక్ మధ్యలోనే ఆపేశాను. చాలా బిజినెస్లు, పని చేసి చివరకు సినిమాల్లోకి వచ్చాను. మూవీ ఇండస్ట్రీ అనగానే ఇంట్లోవాళ్లు భయపడ్డారు. కానీ, నన్ను వెండితెరపై చూసి సంతోషపడ్డారు.గోదావరిలో పడిపోయా..కుమారి 21 ఎఫ్ రిలీజ్కు ముందు ఓ చిన్న సినిమా షూటింగ్ కోసం గోదావరి జిల్లాకెళ్లాను. చిత్రీకరణ సమయంలో నేను గోదావరిలో పడిపోయాను. నాకు ఈత రాదు. నేను చనిపోయానని అందరికీ ఫోన్లు వెళ్లాయి. లోకల్ మీడియా లొకేషన్కు చేరుకుంది. నానాకష్టాలు పడి నన్ను బయటకు లాగారు.బతికే ఉన్నా..నేను బతికే ఉన్నానని తెలుస్తోంది కానీ, కళ్లు తెరవడానికి గంట సేపు పట్టింది. ఈ సంఘటన తర్వాత ఇంట్లోవాళ్లు తిట్టి సినిమాలు వద్దు, ఇంటికి వచ్చేయ్ అన్నారు. నా తొలి మూవీ రన్ రాజా రన్. దీనికి నేను రూ.3500 పారితోషికం అనుకున్నాను. రిలీజైనవి, కానివి కలుపుకుంటే దాదాపు 150 సినిమాలు చేశాను అని సుదర్శన్ చెప్పుకొచ్చాడు.ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో..సుదర్శన్ ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బర్త్డే రోజు నేను, నా స్నేహితుడు హీరో ఇంటికెళ్లాం. ఇంటి గేటు ముందున్న చెట్టు కింద నిల్చున్నాం. ప్రభాస్.. బాహుబలి ప్రీ ప్రొడక్షన్ కోసం కేరళ వెళ్లాడు, లేడని చెప్పినా మేము వినలేదు. అభిమానులు వచ్చి వెళ్లిపోతున్నారు. మేము మాత్రం కదల్లేదు. తిండీ తిప్పలు మానేసి ఉదయంనుంచి అర్ధరాత్రి ఒంటిగంటవరకు ఆ చెట్టు కిందే వర్షంలో తడుచుకుంటూ నిల్చున్నాం. ఇంతలో మమ్మల్ని లోపలకు పిలిచారు. నాతో కేక్ కట్ చేయించి, తినమన్నారు. ప్రభాస్ వచ్చాక ఈ ఫోటోలు చూపిస్తాం.. వెళ్లిపోండి అన్నారు. ప్రభాస్ నిజంగానే లేడని అర్థమైంది. అయినా ఆర్టిస్టులను ఇలా ఇబ్బందిపెట్టడం తప్పని తర్వాత తెలిసొచ్చింది అన్నాడు.చదవండి: పైసా పారితోషికం తీసుకోని తమన్నా..ఎందుకంటే?
దృశ్యం నటి.. ఒకే ఒక్క సీరియల్తో సినిమా ఛాన్స్..!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో దృశ్యం-3 ఒకటి. గతంలో విడుదలైన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ ఫ్రాంచైజీలో వస్తోన్న దృశ్యం 3 ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్ను అలరించనుంది.అయితే ఈ సినిమాలో ఐజీ గీతా ప్రభాకర్ పాత్రలో మెప్పించిన నటి ఆశా శరత్. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందని తెలిపింది. మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుందని పేర్కొంది. ఈ క్లైమాక్స్ చూస్తే మీరంతా కచ్చితంగా షాకవుతారని చెప్పుకొచ్చింది.అసలు ఎవరీ ఆశా శరత్?దృశ్యం ఫ్రాంచైజీలో ఛాన్స్ కొట్టేసిన ఆశా శరత్ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ మొదలైంది. అసలు ఆమె సినిమాల్లో ఎలా వచ్చిందనే దానిపై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తాజాగా ఆశా శరత్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మలయాళ బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఓకే ఒక్క సీరియల్తో మూవీస్లో అడుగుపెట్టింది.స్వతహాగా డ్యాన్సర్ అయినా ఆశా శరత్.. మలయాళంలో 'కుంకుమ పువ్వు' అనే సీరియల్తో నటనారంగ ప్రవేశం చేసింది. ఇందులో లీడ్ రోల్ అయినా ప్రొఫెసర్ జయంతి పాత్ర పోషించింది. ఈ క్యారెక్టర్తోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అలా తనకు కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్నప్పుడే దృశ్యం సినిమాలో అవకాశం వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ఫ్రైడే, కర్మయోధ, అర్ధనారి, జకరియాయుడే గర్భిణికల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ దృశ్యం సినిమానే ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ వెర్షన్లలో కూడా అదే పాత్రను పోషించింది.ఆశా శరత్ మాట్లాడుతూ.. "నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఆందోళన ఉండేది. సీరియల్లో జయంతి పాత్ర అనేది ఎమోషనల్తో కూడుకున్నది. ఒకవేళ ప్రేక్షకులు గీతా ఐపీఎస్ కూడా పోలీసు యూనిఫాంలో ఉన్న జయంతి లాగే ఉందని భావిస్తే ఎలా? అది సినిమాపై, నాపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందా. కానీ వారి స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది. మలయాళీలు చాలా తెలివైనవారు. పాత్రల మధ్య తేడాను ఎలా గుర్తించాలో వారికి బాగా తెలుసు' అని గతంలోనే చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో మోహన్లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు.
అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడి
అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడిటాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేశారు. మెగాస్టార్తో తీసిన మనశంకర వరప్రసాద్గారు బ్లాక్బస్టర్గా నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్.. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశారు.తాజాగా హై టీజర్కు ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడి.. తనతో కలిసి పని చేసిన సాయికృష్ణపై ప్రశంసలు కురిపించారు. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ల నాన్న డ్రీమ్ అని తెలిపారు. కానీ ఆ కల నేరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు విన్నప్పుడు నేను చాలా ఎమోషనల్గా ఫీలయ్యానని అనిల్ రావిపూడి అన్నారు. సాయి బాగా చేస్తాడని తెలుసు.. కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదని కొనియాడారు. ఈ సినిమాలో చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా చేశాడని అనిల్ ప్రశంసించారు. కాగా.. సాయి కృష్ణ, అనన్య శర్మ,ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్ను విడుదల చేశారు.
బాలీవుడ్ మూవీ.. పైసా తీసుకోని తమన్నా, విక్రాంత్!
వాలంటైన్స్ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.స్టార్ అవడానికి ముందే..అయితే విక్రాంత్ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్ తర్వాత అతడు పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. ఉచితంగానే..నేను డైరెక్ట్ చేసిన మఖ్బూల్ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్కు కూడా వచ్చింది అని విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నాడు.చదవండి: సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్
సినిమా
ఖైదీ 2 సంగతేంటి..? ఉన్నట్టా..? లేనట్టా...?
ప్రభాస్ స్పిరిట్ లో మెగాస్టార్?
చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?
సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!
మా వాడు మాట్లాడింది రెండు, మూడు బూతులే..! కానీ మీరు చేస్తుందేంటి...
చరణ్, తారక్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. RRR సీక్వెల్ కన్ఫర్మ్.. త్వరలోనే..!
పెళ్ళిలో హీరో సూర్య, కార్తీ తో వైఎస్ జగన్
అట్లీ మూవీకి.. బన్నీ రికార్డ్ రెమ్యునరేషన్
సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు
