ప్రధాన వార్తలు
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్ ప్యాకేజ్ మీల్లా ఉండేది. బిగ్బాస్ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. అందరికీ నచ్చేది ఒక్కరేఓన్లీ లవ్ ట్రాక్స్ అంటే యూత్కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్ ఉంటుంది. బిగ్బాస్లో కామెడీ అంత ఈజీ కాదు!మరి బిగ్బాస్లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్బాస్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్. నాలుగో స్థానం..కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్ రోహిణి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. నువ్వే రియల్ విన్నర్అతడి విషయంలో బిగ్బాస్ టీమ్, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. బిగ్బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్టైనర్స్కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్బాస్కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది.
'బిగ్బాస్' తెలుగు విన్నర్ను ప్రకటించిన వికీపీడియా
బిగ్బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్బాస్ విజేత తనూజ అని, రన్నర్గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్బాస్ టీమ్తో ఉండవు.
టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్
టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టికెట్ల రేట్ల అంశమే. పెద్ద సినిమాలు రిలీజైన ప్రతిసారి దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. రీసెంట్గా 'అఖండ 2' వచ్చినప్పుడు కూడా రేట్ల పెంపుపై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరే ఈ విషయం వదిలిస్తే ఇప్పుడు టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి.. ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్నారని చెప్పుకొచ్చారు.'ఓటీటీల రాకతో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన కంటెంట్ వాటిలో దొరుకుతోంది. డబ్బున్నవాడు ఓటీటీలో మూవీస్ చూస్తుంటే.. డబ్బులేనివాడు టీవీలో చూస్తున్నాడు. ఒకప్పుడు సినిమా అనేది ఏకైక ఎంటర్టైన్మెంట్ సాధనం. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులోనూ సినిమా.. చాలా ఖరీదైన ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి గారు అప్పట్లో టికెట్ రేట్లు తగ్గిస్తే వీళ్లందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాస్తవానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు.. ఆ రేట్లే బెటర్ సర్, కనీసం జనాలు థియేటర్లకు వచ్చేవారు అని నాతో అన్నారు''ఈ రోజుల్లో సరసమైన ధరలకు తక్కువ రేట్లకు సినిమా చూపిస్తామని చెప్పుకోవడం పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. ఇంకొన్నాళ్లకు 1+1 ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని.. జంటగా వచ్చి సినిమా చూడొచ్చని, గర్ల్ఫ్రెండ్తో కలిసి సినిమా చూడొచ్చని బోర్డులు పెట్టినా పెట్టొచ్చు. మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి వచ్చేసింది' అని బీవీఎస్ రవి తన అభిప్రాయాన్ని చెప్పారు.ఈయన చెప్పినది చూస్తే జరుగుతున్నది, జరగబోయేది ఇదే కదా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో రిలీజైన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు రూ.99 టికెట్ అనే ప్రచారం చాలా ప్లస్ అయింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు టికెట్ రేట్ల విషయంలో పునారాలోచన చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రేక్షకుడు.. థియేటర్కి పూర్తిగా దూరమయ్యే అవకాశముంది.
అవసరమా ‘అఖండ’ కావరం?
‘ఎవర్ని చూసుకునిరా ఆ పొగరు.. అని అడుగుతుంటారు. కానీ నన్ను చూసుకునే నాకు ఆ పొగరు’’ అన్నారు ఇటీవల సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖండ తాండవం బాక్సాఫీస్ వద్ద తానాశించినట్టుగా తాండవమాడకపోవడం అనే నిజం నుంచి ఆయన ఏం గ్రహిస్తున్నారో తెలీదు కానీ... ఆయన గుర్తించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అంటున్నారుసినీ పండితులు. వాళ్లు చెబుతున్న ప్రకారం...బాలకృష్ణ ఏమీ స్వయంకృషితోనో, ఏ వారసత్వం లేకుండానో ఎదిగిన నటుడు కాదు. ఇప్పటికీ ఆయన ప్రతీ చోటా స్మరించే తండ్రి పేరు... ఎవరి పుణ్యాన తాను హీరోగా నిలబడగలిగాడో చెప్పకనే చెబుతుంది. మరి బాలకృష్ణకు ఎందుకు ఉండాలి పొగరు? తన సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్...వీళ్లెవరికీ లేని ప్రత్యేకత ఆయనలో ఏముందని తనను తాను చూసుకోవాలి? తల పొగరు ఉండాలి? తండ్రి వారసత్వంతో పాటు తెలుగు నాట ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం, అలాగే తమ కులమే అన్ని రంగాల్లో ముందుండాలనే కులోన్మాదం కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశాల్లో ఒకటి. అవే ఆయన తన నటనా ప్రతిభకు మించిన స్థాయిని ఆయనకు కట్టబెట్టాయనేది బహిరంగ రహస్యం. ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నోరు జారినా ఎంతమందిని తూలనాడినా ఆయనపై అదే స్థాయిలో ఎవరూ తిరగబడకపోవడానికి ఆయన నటనా ప్రతిభో లేక తిరుగులేని స్టార్డమ్మో కారణం కాదనీ ఆయన వెనుక ఉన్న సామాజిక వర్గ బలమేననేది తలపండిన ఆ విళ్లేషకుల మాట.దాదాపుగా కొన్ని దశాబ్ధాల పాటు అటు నటనలో గానీ, ఇటు అభిమానధనంలో గానీ చిరంజీవి మెగా స్థాయి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బాలకృష్ణ... ఇటీవల తన వయసు 60 దాటాక కొన్ని చెప్పుకోదగ్గ విజయాలు దక్కించుకోగలిగారు. దానికి ఆయన సంతోషించవచ్చు... ప్రేక్షకుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. అంతే గానీ ఈ స్వల్పకాలపు విజయాలకే తనకెవరూ సాటిలేరన్నట్టు మిడిసిపాటు తగదు. అది ఇతరుల కన్నా ఆయనకే ఎక్కువ చేటు చేస్తుందని ఆయన గ్రహించాలి. తనను తాను గొప్పగా చెప్పుకుని చెప్పుకునే స్వోత్కర్షల్లో ప్రమాదం ఏమిటంటే.. నిజంగానే తాను గొప్ప అనే భ్రమల్లోకి వెళ్లిపోవడం అదే ఆయన అఖండ తాండవానికి చావు దెబ్బ కొట్టింది.సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమా అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాప్ హీరోలు అందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, అదే సమయంలో విడుదలైన అఖండ(Akhanda 2) సినిమా గురించి బాలకృష్ణ మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం... ‘‘నా సినిమాలకు రేట్లు పెంచనవరం లేదు. పెంచకపోయినా నష్టం రాదు’’ అంటూ చెప్పారాయన. అయితే అదే బాలకృష్ణ రెండవ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి తనను తాను బాక్సాఫీస్ కింగ్ లాగో, పాన్ ఇండియా హీరోగానో భ్రమించారనీ. అవసరానికి తన స్థాయికి మించి నిర్మాతల చేత భారీ పెట్టుబడులు పెట్టించారనేది సినీ పండితుల వ్యాఖ్య. దాంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే జనం ఎగబడి చూస్తారని అనవసర అపోహలు ఏర్పరచుకున్నారంటున్నారు. అయితే సీనియర్ తెలుగు హీరోల్లో అంతో ఇంతో నాగార్జునని తప్ప మరెవరినీ ఉత్తరాది ప్రేక్షకులు పట్టించుకోరు అనే నిజం బాలకృష్ణకి తప్ప అందరికీ తెలుసు. ఆ నిజం ఆయనకు కనపడనీయకుండా తల పొగరు కళ్లు మూసేసింది. ఆ ఫలితమే ఉత్తరాదిలో అఖండ తాండవం తాలూకు ఘోర పరాజయం. ఇకనైనా బాలకృష్ణ తన భజనపరుల, కులోన్మాదులను కాక వాస్తవ డిమాండ్ను స్థాయిని గుర్తించి మసలుకుంటే... గతంలో నిర్మాతలకు అందుబాటులో హీరోగా ఆయనకు ఉన్న ఇమేజ్ అయినా కాపడుకుంటారని సినీ మార్కెట్ నిపుణులు అంటున్నారు..
బిగ్బాస్
బిగ్బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్కు తన్నుకొచ్చిన దుఃఖం
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
'బిగ్బాస్' తెలుగు విన్నర్ను ప్రకటించిన వికీపీడియా
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్దే గెలుపు!
కల్యాణ్ పడాల తలకు కట్టు... అతడికేమైంది?
'బ్లాక్ అండ్ వైట్ బోర్'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్ బర్డ్స్
బిగ్బాస్ 9కి ప్రాణం పోసింది.. సంజనా రియల్ గేమర్!
సల్మాన్ ఒక్క ఎపిసోడ్కు అందుకునేది.. నాగ్కు మొత్తం సీజన్కు అందుతుంది..
విన్నర్ రేంజ్ ఎలివేషన్...మీసం మెలేసిన కల్యాణ్
నా భార్య 4 రోజులు తినకుండా ఏడ్చింది: సుమన్
A to Z
టాప్ ఓటీటీలో AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ స్ట్రీమింగ్
నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాగా కనెక్ట...
ఫ్రైడే మూవీ లవర్స్కు పండగే.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవార...
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హర్షవర్ధన్ రాణే,సోనమ్ బాజ్వా జంటగా నటించిన చిత్రం ...
ఓటీటీకి సంతాన ప్రాప్తిరస్తు.. ఓకేసారి రెండింటిలో రిలీజ్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన...
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కమెడియన్
ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ రెండో బిడ్డకు జన్మని...
'దక్షిణాది నిర్మాత హోటల్కు రమ్మన్నాడు'..: క్యౌస్టింగ్ కౌచ్పై బిగ్బాస్ బ్యూటీ
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పదం ఎక్కువగా విన...
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హర్షవర్ధన్ రాణే,సోనమ్ బాజ్వా జంటగా నటించిన చిత్రం ...
ఫస్ట్ సినిమా.. డబ్బులివ్వలేదు, దారుణంగా చూశారు
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఇండస్ట్రీలో అడుగుపెట...
స్టార్ దర్శకుడు, భార్య అనుమానాస్పద మృతి!
హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ రాబ్ రైనర్, ఆయన సతీమణి ...
ఓటీటీల్లో వందలకొద్ది వెబ్ సిరీస్లు.. టాప్-10లో ఇండియాకు నో ప్లేస్!
ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్లకు కొదవే లేదు...
నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఢీల్.. మనకు 'సినిమా'నేనా..?
హాలీవుడ్కు పునాది లాంటి వార్నర్ బ్రదర్స్తో నెట్...
భారత్లో 'సూపర్ మ్యాన్'.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’ ఓటీటీలోకి రానుం...
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
వెతకాలే గానీ ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా మంచి మ...
పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే?
నాని హీరోగా వస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ ది ప్యారడై...
సెట్లో నేనొక్కదాన్నే మహిళని.. 'సైజ్' అని ఇబ్బంది పెట్టారు: రాధిక ఆప్టే
ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు.. చాలా విషయాల్లో...
ప్రముఖ నటుడు మృతి.. పృథ్వీరాజ్ సంతాపం
మలయాళ చిత్రసీమలో నటుడిగా, రచయితగా, చిత్రనిర్మాతగా ...
ఫొటోలు
బ్యాంకాక్ ట్రిప్లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
శ్రీలంక ట్రిప్లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)
రెడ్ రోజ్లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
కలర్ఫుల్ చీరలో కృతి శెట్టి.. ఫ్యాన్స్ కోసం ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా ‘సోగ్గాడు’ స్వర్ణోత్సవం (ఫొటోలు)
‘మోగ్లీ 2025’ థ్యాంక్స్ మీట్..ముఖ్య అతిథిగా హీరో సాయిదుర్గా తేజ్ (ఫొటోలు)
అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రం టీజర్ లాంచ్ (ఫొటోలు)
‘ఛాంపియన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పారిస్లో చిల్ అవుతోన్న మన్మధుడు హీరోయిన్ అన్షు.. ఫోటోలు
గాసిప్స్
View allరేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!
'ధురంధర్'కి భారీ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
జైలర్ 2లో ఐటం సాంగ్!
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
దిగ్గజ గాయని బయోపిక్లో సాయిపల్లవి?
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు.. ‘స్పిరిట్’ కోసం అన్ని కోట్లా?
రివ్యూలు
View all
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
1.75
‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
2
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
సినీ ప్రపంచం
తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?
'తిన్నమా పడుకున్నామా తెల్లరిందా' ఈ డైలాగ్ చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది సాయాజీ షిండే. 'పోకిరి' మూవీలో పోలీస్ పాత్రలో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో స్టార్డమ్ తెచ్చుకున్న ఇతడు.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, కన్నడ భాషల్లో గత మూడు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాడు. తండ్రి, పోలీస్, విలన్.. ఇలా రకరకాలుగా మనందరికీ పరిచయమే. కానీ సాయాజీలో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా.స్వతహాగా నటుడే అయినప్పటికీ సాయాజీ షిండే.. ప్రకృతిని విపరీతంగా ప్రేమిస్తారు. ఎంతలా అంటే తల్లికి ఇచ్చిన చివరిమాట కోసం లక్షలాది చెట్లు నాటారు. ఇప్పటికీ నాటుతూనే ఉన్నారు. ఓసారి తెలుగు యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ 97 ఏళ్లు బతికింది. ఆమెకు 93 ఏళ్ల వయసున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ పేరుపై ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. త్రాసులో ఓవైపు అమ్మని కూర్చోబెట్టి.. మరోవైపు ఆమె బరువుకు సరితూగినన్నీ విత్తనాలతో ప్రపంచమంతా మొక్కలు నాటాలనుకున్నాను. ఎప్పుడైతే అవి చెట్లుగా మారి పూలు, పళ్లు వస్తే.. అందులో అమ్మని చూసుకోవచ్చని ఈ కార్యక్రమం చేపట్టాను. నాకు కన్నతల్లి, భూమాత ఇద్దరూ ఒకటే. ఎందుకంటే తల్లి మనల్ని నవమాసాలు కనిపెంచుతుంది. చెట్టు మనకు ప్రాణవాయువు ఇచ్చి బ్రతికిస్తుంది. కాబట్టి చెట్లకంటే సెలబ్రిటీలు ఎవరూ ఉండరు అని నేను నమ్ముతా అని అన్నారు.సాయాజీ షిండే.. తల్లి మరణానంతరం ప్రకృతి ప్రేమికుడిగా మారారు. 'సహ్యాద్రి దేవరాయి' అనే సంస్థని 2015లో స్థాపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే 29 ప్రాంతాల్లో ఏకంగా ఆరున్నర లక్షల వరకు విత్తనాలు, చెట్లు నాటినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి నాసిక్లో డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా 1800 చెట్లని కొట్టేందుకు సిద్ధమవగా షిండే విపరీతంగా పోరాడారు. చివరగా ఇందులో విజయం సాధించారు కూడా.అలానే విద్యార్థుల్లోనూ పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా 'ఓ విద్యార్థి ఓ చెట్టు' అనే నినాదంతో పారశాలల్లో పిల్లలకు తన సంస్థ ద్వారా ప్రకృతి, చెట్ల పెంపకంపై షిండే అవగాహన కలిగిస్తున్నారు. ఏదేమైనా నటుడిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. రాబోయే తరాల కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుండటం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి చాలామందికి తెలియదనే చెప్పొచ్చు.
బిగ్బాస్-9 ఫైనల్.. లైవ్ అప్డేట్స్..
బిగ్బాస్లో 105 రోజుల రణరంగం.. చివరి అంకానికి చేరింది. ఈరోజు ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం రాత్రి 10గంటల సమయంలోపు బిగ్బాస్ తెలుగు 9 ట్రోఫీ విజేత ఎవరు అనేది తేలిపోతుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన ఉన్నారు. వీరిలో విజేత ఎవరు..? సూటుకేసు తీసుకునేది ఎవరు..? అనేది తేలిపోతుంది. అయితే, తనూజ- కల్యాణ్లలో ఎవరో ఒకరు విజేతగా నిలవనున్నారని తెలిసిందే..
సమంతలో కొత్త పెళ్లికూతురి కళ.. కల్యాణి గ్లామర్!
సమంత ఫేస్లో కొత్త పెళ్లికూతురి కళగ్రీన్ డ్రస్లో మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్డ్యాన్స్ చేస్తూ మాయ చేస్తున్న 'ఫౌజీ' ఇమాన్వీ'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ వీకెండ్ ట్రిప్జిగేలుమనేలా దడపుట్టించేస్తున్న సంయుక్తబ్యాంకాక్ ట్రిప్లో సీరియల్ బ్యూటీ నవ్వస్వామి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol)
'ఛాంపియన్' మరో సాంగ్.. ఈ బాలనటిని గుర్తుపట్టారా?
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ వీకెండ్ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్, పాటలతో బజ్ తీసుకొచ్చే కాస్త బజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మూవీలోని ఐ యామ్ ఛాంపియన్ అంటూ సాగే టైటిల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ బాలనటి కనిపించడం విశేషం. మరి ఈమెని గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)ఛాంపియన్ మూవీలో రోషన్తో పాటు ఓ పాటలో కనిపించిన ఈ బాలనటి పేరు అవంతిక వందనపు. తెలుగు మూలాలున్నప్పటికీ అమెరికాలో పుట్టి పెరిగింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైంది. తర్వాత తెలుగులో ప్రేమమ్, ఆక్సిజన్, బాలకృష్ణుడు, మనమంతా, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో బాలనటిగా చేసింది. తర్వాత ఇంగ్లీష్లోనూ పలు సినిమాలు, సిరీస్లు చేసింది. మళ్లీ ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత తెలుగులో 'ఛాంపియన్'లోని స్పెషల్ సాంగ్లో మెరిసింది.వైజయంతీ మూవీస్ నిర్మించిన 'ఛాంపియన్' చిత్రంతో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్.. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వాతంత్ర్య బ్యాక్ డ్రాప్లోని పీరియాడికల్ కాన్సెప్ట్తో ఈ సినిమాని తెరకెక్కించారు. రోషన్ గతంలో 'పెళ్లి సందD'లో హీరోగా నటించాడు. అది అంతంత మాత్రంగానే ఆడింది. ఇదొచ్చిన మూడేళ్లకు ఇప్పుడు 'ఛాంపియన్' అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)
బిగ్బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్కు తన్నుకొచ్చిన దుఃఖం
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్కు మరికొద్ది గంటల్లో శుభం కార్డు పడనుంది. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఎంతోమంది గెస్టులు బిగ్బాస్ స్టేజీపైకి రానున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో మంగ్లీ, పాయల్ రాజ్పుత్ వంటి పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్తో అల్లాడించారు. అలాగే ఛాంపియన్, అనగనగా ఓ రాజు సినిమా హీరోహీరోయిన్లు కూడా సందడి చేశారు.బిగ్బాస్ హౌస్లో శ్రీకాంత్హీరో శ్రీకాంత్ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లి ఒకర్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి టీషర్ట్పై అన్సేఫ్ అని రాస్తారో వారు ఎలిమినేట్ అయినట్లు లెక్క! ఇక్కడ అందరికంటే ఎక్కువ కల్యాణ్ భయపడ్డాడు. తాను వెళ్లిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడు. కానీ కొంత షూటింగ్ నిన్ననే అయిపోవడంతో ఫస్ట్ సంజనా ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. రోబో ఎలిమినేట్!తర్వాత రోబోను పంపించగా ఆ రోబో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఓపక్క టెన్షన్, మరోపక్క ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్ దేశంలోనే టాప్ 1లో ఉందన్నారు నాగార్జున. బిగ్బాస్ 9 ట్రోఫీని చూపించేటప్పుడు మగువా మగువా.. పాట బీజీఎమ్ వేశారు. అంటే తనూజ గెలుస్తుందని ఏమైనా హింట్ ఇచ్చారా? అని నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ ప్రోమో మీరూ చూసేయండి..&
'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ గానీ దక్షిణాదిలోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే రిలీజై రెండున్నర వారాలు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ గురించి అస్సలు సౌండ్ లేదు. ఇంతకీ మన దగ్గర రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు?పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ మూవీస్ ఒరిజినల్ వెర్షన్తో పాటు డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి తక్కువే. కొన్ని సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఫీలవుతుంటారు.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' మూవీ రిలీజైంది. తొలుత హిందీలో తీసుకొచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా సరే తెలుగులో రిలీజ్ చేశారు. తొలి వారం దాటేలోపే ఇది చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత రీచ్ ఉండేదనేది చాలామంది అభిప్రాయం. దీని విషయంలో చేసిన తప్పే ఇప్పుడు 'ధురంధర్' విషయంలోనూ మేకర్స్ చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్'.. బ్లాక్బస్టర్ హిట్ అయింది. చాలామంది తెలుగు మూవీ లవర్స్ దీన్ని ఒరిజనల్ వెర్షన్ చూసేశారు. మిగిలిన వాళ్లలో చాలామంది మాత్రం తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.గత శుక్రవారమే(డిసెంబరు 19) ఇది తెలుగులో రిలీజ్ అయిపోతుందని సోషల్ మీడియాలో చాలా హడావుడి నడిచింది. తీరా చూస్తే అది రూమర్ అని తేలిపోయింది. ఈ వారమూ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఛాంపియన్, దండోరా, శంబాల, వృషభ, పతంగ్, ఈషా, బ్యాడ్ గర్ల్జ్, మార్క్.. ఇలా లైన్లో చాలానే థియేటర్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు వస్తే 'ధురంధర్'కి స్పేస్ దొరకడం కష్టం.మైత్రీ మూవీ మేకర్స్.. 'ధురంధర్' తెలుగు డబ్బింగ్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1వ తేదీని చూస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే మాత్రం తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి వచ్చాక చూసుకోవాల్సిందే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. (ఇదీ చదవండి: టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్)
ట్రిమ్ చేసిన వెర్షన్కూ స్పందన బాగుంది
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘నిన్న (శుక్రవారం) మ్యాట్నీ షోస్ నుంచే 90 శాతం థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. కొన్ని ల్యాగ్ సీన్స్, సాంగ్స్ ట్రిమ్ చేశాం. ఆ ట్రిమ్ అయిన వెర్షన్కూ రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతూ నవ్వుకుంటున్నారు. చిన్న సినిమాకు నిర్మాణ విలువలు బాగుంటే, ఎంత మంచి క్వాలిటీతో సినిమా స్క్రీన్ మీదకు వస్తుందనే విషయానికి ‘గుర్రం ΄ాపిరెడ్డి’ ఓ ఉదాహరణ’’ అని చెప్పారు. ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం వల్ల మా సినిమా మార్నింగ్ షోస్ కాస్త స్లోగా మొదలయ్యాయి. సాయంత్రానికి 90శాతం ఆక్యుపెన్సీతో మా సినిమా ప్రదర్శితం కావడం హ్యాపీ’’ అని చెప్పారు మురళీ మనోహర్. ‘‘థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఇంకొంత సపోర్ట్ చేసి, మా సినిమాను హిట్ చేయాలి’’ అని కోరారు వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, యాక్టర్స్ జీవన్ కుమార్, రాజ్కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోసిగి, మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడారు.
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్ ప్యాకేజ్ మీల్లా ఉండేది. బిగ్బాస్ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. అందరికీ నచ్చేది ఒక్కరేఓన్లీ లవ్ ట్రాక్స్ అంటే యూత్కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్ ఉంటుంది. బిగ్బాస్లో కామెడీ అంత ఈజీ కాదు!మరి బిగ్బాస్లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్బాస్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్. నాలుగో స్థానం..కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్ రోహిణి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. నువ్వే రియల్ విన్నర్అతడి విషయంలో బిగ్బాస్ టీమ్, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. బిగ్బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్టైనర్స్కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్బాస్కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది.
'బిగ్బాస్' తెలుగు విన్నర్ను ప్రకటించిన వికీపీడియా
బిగ్బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్బాస్ విజేత తనూజ అని, రన్నర్గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్బాస్ టీమ్తో ఉండవు.
టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్
టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టికెట్ల రేట్ల అంశమే. పెద్ద సినిమాలు రిలీజైన ప్రతిసారి దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. రీసెంట్గా 'అఖండ 2' వచ్చినప్పుడు కూడా రేట్ల పెంపుపై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరే ఈ విషయం వదిలిస్తే ఇప్పుడు టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి.. ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్నారని చెప్పుకొచ్చారు.'ఓటీటీల రాకతో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన కంటెంట్ వాటిలో దొరుకుతోంది. డబ్బున్నవాడు ఓటీటీలో మూవీస్ చూస్తుంటే.. డబ్బులేనివాడు టీవీలో చూస్తున్నాడు. ఒకప్పుడు సినిమా అనేది ఏకైక ఎంటర్టైన్మెంట్ సాధనం. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులోనూ సినిమా.. చాలా ఖరీదైన ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి గారు అప్పట్లో టికెట్ రేట్లు తగ్గిస్తే వీళ్లందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాస్తవానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు.. ఆ రేట్లే బెటర్ సర్, కనీసం జనాలు థియేటర్లకు వచ్చేవారు అని నాతో అన్నారు''ఈ రోజుల్లో సరసమైన ధరలకు తక్కువ రేట్లకు సినిమా చూపిస్తామని చెప్పుకోవడం పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. ఇంకొన్నాళ్లకు 1+1 ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని.. జంటగా వచ్చి సినిమా చూడొచ్చని, గర్ల్ఫ్రెండ్తో కలిసి సినిమా చూడొచ్చని బోర్డులు పెట్టినా పెట్టొచ్చు. మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి వచ్చేసింది' అని బీవీఎస్ రవి తన అభిప్రాయాన్ని చెప్పారు.ఈయన చెప్పినది చూస్తే జరుగుతున్నది, జరగబోయేది ఇదే కదా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో రిలీజైన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు రూ.99 టికెట్ అనే ప్రచారం చాలా ప్లస్ అయింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు టికెట్ రేట్ల విషయంలో పునారాలోచన చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రేక్షకుడు.. థియేటర్కి పూర్తిగా దూరమయ్యే అవకాశముంది.
సినిమా
హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!
ఈ సంక్రాంతికి రవితేజ మార్క్ మూవీ
స్పిరిట్ కోసం సందీప్ వంగా మాస్
బొమ్మ వెనుక ప్రహ్లాద్?
పుష్ప సిరీస్ దారిలో అల్లు అర్జున్ - అట్లీ చిత్రం?
జపాన్ లో పుష్ప రచ్చ రచ్చ..
పాన్ ఇండియాకి వణుకు పుట్టే కాంబినేషన్
ఎంత పనైంది..? అవతార్ 3కి బిగ్ షాక్..
వారిద్దరిది లవ్ కాదు
అమ్మ, నాన్నల తరపున ANR కళాశాలకు నాగార్జున భారీ విరాళం
