Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Bellamkonda Sreenivas Kishkindhapuri Theme song Full Video out now1
కిష్కింధపురి మూవీ.. థీమ్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ మూవీ 'కిష్కింధపురి'(Kishkindhapuri). కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్‌ 12న విడుదలైన ఈ చిత్రం రూ. 30 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.తాజాగా ఈ మూవీ నుంచి థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కిష్కింధపురి థీమ్ పేరుతో ఫుల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటకు చైతన భరద్వాజ్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమాను దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి వచ్చేసింది.

Anupama Parameswaran disappointed with Paradha theatrical run2
ఆ సినిమా డిజాస్టర్‌.. తీవ్ర నిరాశకు గురయ్యా: అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్‌ ప్రస్తుతం బైసన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా వస్తోన్న బైసన్ మూవీ తెలుగులోనూ రిలీజవుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం బైసన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన తన మూవీ పరదా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.తెలుగులో తాను నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ రిజల్ట్‌ తనను తీవ్రంగా నిరాశపర్చిందని తెలిపింది. ఇలాంటి ఫలితం తాను ఊహించలేదని వెల్లడించింది. పరదా మూవీ రెస్పాన్స్ చూసి చాలా బాధపడ్డానని పేర్కొంది. ఈ ఏడాది తాను నటించిన ప్రాజెక్టులు ఆశించిన విజయాన్ని సాధించలేదన్నారు. ఈ విషయాన్ని అంగీకరించక తప్పడం లేదని వివరించింది. ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అనుపమ మాట్లాడుతూ..'మనం చేసే ప్రతి చిత్రానికి అది బాగానే వస్తుందని అనుకుంటాం. ప్రేక్షకులందరూ మన సినిమా ఇష్టపడతారని ఆశిస్తున్నాం. అది తప్పనిసరిగా బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయినా.. నేను ప్రతి చిత్రంలో విభిన్న పాత్రలను పోషించడానికి ప్రయత్నిస్తున్నా. కిష్కింధపురి పాత్ర.. బైసన్‌ రోల్‌ ఒకటి కాదు. ఏదైనా నా సినిమా విజయం సాధించినప్పుడు.. మంచి సినిమాలు చేయడానికి.. స్క్రిప్ట్‌లను తెలివిగా ఎంచుకోవడానికి తోడ్పడుతుంది' అని పంచుకుంది. కాగా.. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన పరదా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 1.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని ఈ సినిమాకు..ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సంగీత, దర్శనా రాజేంద్రన్‌, రాగ్ మయూర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మించారు. చాలా కాలంగా ఉన్న ఆచారంలో భాగంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఓ గ్రామానికి చెందిన యువతి కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Prabhas Birthday special story sakshi3
దీపావళి తర్వాత 'ప్రభాస్‌' ఫ్యాన్స్‌కు మరో పండుగ ఇదే..

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే పండుగ ఆయన బర్త్ డే. ఈ నెల 23న ఆయన పుట్టిరోజును ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ కూడా ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు. టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అందరికీ నోటెడ్ అకేషన్‌గా ప్రభాస్‌ బర్త్‌డే మారింది. దేశం నలుమూలలా ప్రభాస్‌కు అభిమానులు ఉన్నారు, ఆయన సినిమాలను ఇష్టంగా చూసేవాళ్లున్నారు. ఓవర్సీస్‌లో యూఎస్, యూకే, జపాన్..ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. తన సినిమాలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేక్‌కు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అందుకే ప్రభాస్ చేసే ప్రతి సినిమా ట్రూ పాన్ వరల్డ్ మూవీ అవుతోంది.తన స్టార్ డమ్, ఛరిష్మా, పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, రికార్డ్ స్థాయి బాక్సాఫీస్ వసూళ్లతో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలను చూస్తుంటాం...టాలీవుడ్‌కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన బర్త్‌డేకు తన బ్లాక్ బస్టర్ మూవీస్ రీ రిలీజ్‌తో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ సందడి చేస్తుంటాయి. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచే మూవీ బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అవుతోంది. బాహుబలి రెండు చిత్రాలు కలిసి ఒకే పార్ట్‌గా విడుదలకు వస్తుండటం మూవీ లవర్స్, ఫ్యాన్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది.తెలుగువారు గర్వపడేలా ప్రభాస్ భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ చేస్తున్న ది రాజా సాబ్ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాజా సాబ్ మూవీలో ప్రభాస్‌ను మనం ఇంతకాలం మిస్ అయిన వింటేజ్ లుక్‌లో రొమాంటిక్ హారర్ కామెడీలో చూడబోతున్నాం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేయబోయో రికార్డులు కళ్లముందు కదలాడుతున్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ప్రభాస్ నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సందీప్ వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ నటించనున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే స్కై రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ క్రేజీ లైనప్‌లో రానున్న సలార్ 2, కల్కి 2 ఎగ్జైట్ చేస్తున్నాయి. ఈ ఏడాది మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేసిన రుద్ర క్యారెక్టర్ ఆ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్ర పాత్రలో ప్రభాస్ చేసిన డివైన్ పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.మచ్చలేని జీవితం, శత్రువు ఎరుగని వ్యక్తిత్వం, చేతికి ఎముకలేని దాతృత్వం, మర్చిపోలేని ఆతిథ్యం...ఇవన్నీ ప్రభాస్‌ను అందరూ ఇష్టపడే డార్లింగ్‌లా మార్చేశాయి. స్టార్‌గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే, అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది. తెలుగు తెరపై వరుస విజయాలతో ప్రభాస్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ గురువారం నాడు ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా సోషల్‌మీడియాలో ఆయన పేరు ట్రెండ్‌ కానుంది.

Dulquer Salmaan Kaantha Movie Ammadive Lyrical Video4
దుల్కర్‌, భాగ్యశ్రీల 'కాంత'.. మెలోడీ సాంగ్‌ విడుదల

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కాంత... తాజాగా ఈ మూవీ నుంచి 'అమ్మాడివే' అంటూ సాగే రెండో సాంగ్‌ విడుదలైంది. ఇప్పటికే వచ్చేసిన పోస్టర్స్‌, టీజర్స్‌ ప్రేక్షకులను మెప్పించగా.. తాజాగా రిలీజ్‌ అయిన సాంగ్‌ మరింత జోష్‌ నింపేలా ఉంది. 1950 మద్రాస్‌ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. స్పిరిట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. నవంబర్‌ 14న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.

Bigg Boss Fame Priya Malik Escapes From Fire Accident at Diwali 2025 Celebrations5
పండగపూట ప్రమాదం.. నా భుజం వరకు మంటలు..: బుల్లితెర నటి

దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ కంటెస్టెంట్‌, బుల్లితెర నటి ప్రియా మాలిక్‌ (Priya Malik) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్‌ అంటుకుంది.ఫోటోలు దిగుతుండగా..క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్‌ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్‌కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్‌ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.నాకే ఆశ్చర్యం!చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్‌ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌ 9తో పాపులర్‌ అయిన ప్రియ మాలిక్‌.. 2022లో ఎంటర్‌ప్రెన్యూర్‌ కరణ్‌ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్‌ జన్మించాడు.చదవండి: నేను, ఎన్టీఆర్‌.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ

Kantara Chapter1 will be released In this Language also6
కాంతార చాప్టర్ 1 మరో ఘనత.. తొలి ఇండియన్‌ చిత్రంగా!

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పలు చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లు రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీపావళి కూడా కలిసి రావడంతో మరిన్ని రికార్డ్స్‌ క్రియేట్ చేయనుంది.ఈ ప్రీక్వెల్‌కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని ఇంగ్లీష్‌లోకి డబ్‌ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్‌ అక్టోబర్ 31 విడుదల చేస్తామని పోస్టర్‌ పంచుకున్నారు. ఈ మూవీ రన్‌టైమ్ రెండు గంటల 14 నిమిషాల 45 సెకన్లుగా ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ భాషల్లో రిలీజైన ఒరిజినల్‌ రన్‌టైమ్ రెండు గంటల 49 నిమిషాలు కాగా.. ఆంగ్ల వర్షన్‌లో ఏకంగా 35 నిమిషాలకు తగ్గించారు. ఇప్పటికే పలు రికార్డ్‌లు సాధించిన ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్‌లోకి డబ్ చేసిన తొలి ఇండియన్ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలవనుంది.కాగా.. కాంతార చాప్టర్-1 ఇ‍ప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా ఘనత దక్కించుకుంది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. A divine saga that resonates beyond borders and languages! 🕉️✨#KantaraChapter1 𝐄𝐧𝐠𝐥𝐢𝐬𝐡 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 releasing in cinemas worldwide from 𝐎𝐜𝐭𝐨𝐛𝐞𝐫 𝟑𝟏𝐬𝐭.Experience the epic journey of faith, culture, and devotion in all its glory ❤️‍🔥#KantaraInCinemasNow… pic.twitter.com/lOwFGoFzKb— Hombale Films (@hombalefilms) October 22, 2025 A divine saga that resonates beyond borders and languages! 🕉️✨#KantaraChapter1 becomes the FIRST INDIAN FILM TO HAVE AN ENGLISH DUBBED VERSION RELEASE 🌍🔥The English Version releases in cinemas worldwide from October 31st.Experience the epic journey of faith, culture, and… pic.twitter.com/845DvoFT6E— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 22, 2025

Mass Jathara: Super Duper Hittu Song Lyrical Video Released7
రవితేజ- శ్రీలీల 'సూపర్‌ డూపర్‌ హిట్టు సాంగ్‌'.. చూశారా?

మాస్‌ మహారాజ రవితేజ (Ravi Teja), హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ధమాకా' మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. మూడేళ్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న లేటెస్ట్‌ మూవీ మాస్‌ జాతర (Mass Jathara Song). ధమాకాకు బ్లాక్‌బస్టర్‌ ఆల్బమ్‌ ఇచ్చిన భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు సాంగ్‌ వచ్చాయి. తూ మేరా లవ్వరు, ఓలే ఓలే.., హుడియో హుడియో.. సాంగ్స్‌ రిలీజ్‌ చేశారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగో పాట రిలీజ్‌ చేశారు.సూపర్‌ డూపర్‌ హిట్టు సాంగ్‌అదే సూపర్‌ డూపర్‌ హిట్టు సాంగ్‌! ఈ పాటకు రిథమ్‌ లేదు.. కదం లేదు, పదం లేదు.. అర్థం లేదు.. పర్థం లేదు అంటూ సాగే ఈ పాట సూపర్‌ హిట్టని లిరిక్స్‌లోనే చెప్తున్నారు. రోహిణి‌, భీమ్స్‌ సిసిరోలియో ఆలపించిన ఈ పాట సూపర్‌ హిట్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్‌ జాతర విషయానికి వస్తే.. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్‌ 31న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చదవండి: నటి గ్లామర్‌ పిక్స్‌ షేర్‌ చేసిన ఉదయనిధి స్టాలిన్‌.. ఎంత పనైపోయింది?

 Prashanth Neel and jr ntr movie shoot stopped for this reason goes viral8
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్‌ మూవీ ఆగిపోయిందా?.. అసలు నిజమెంత?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్‌నీల్‌ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ పాన్ ఇండియా చిత్రంపై నెట్టింట కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్‌ సృజనాత్మక విషయంలో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్‌ రావడంతోనే ఈ మూవీ ఆగిపోయిందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్‌ కానీ.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్‌ అనే టైటిల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 జూన్‌ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే వెల్లడించారు. Who’s the culprit behind spreading fake news on #NTRNeel ?Some Paid Agenda working behind.... https://t.co/q16nhnWksa— prashanth Neel (@Prashant_neell) October 21, 2025

Actor Raj Dasireddy will upcoming movie plan9
ఆస్కార్‌లో సందడిగా కనిపించిన రాజ్‌.. కొత్త మూవీ కోసం శిక్షణ

ఈరోజు మన తెలుగు చిత్రసీమను టాలీవుడ్ అంటున్నామన్నా... హిందీ ఇండస్ట్రీని "బాలీవుడ్", కన్నడ పరిశ్రమను "శాండల్ వుడ్", మలయాళంను "మల్లువుడ్", తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని "కోలీవుడ్"గా పిలుచుకుంటున్నామంటే... దానికి ప్రేరణ "హాలీవుడ్" అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పతాక గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్నా.... మన దేశంలో రూపొందిన ఏదైనా సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కితే... దానిని "హాలీవుడ్ స్థాయిలో రూపొందిన చిత్రంగా అభివర్ణించడం ఇప్పటికీ సర్వసాధారణం. అంతేకాదు... సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారం "ఆస్కార్"ను అందించేది కూడా హాలివుడ్డే. అందుకే "RRR" చిత్రం ఆస్కార్ అందుకోవడాన్ని మన దేశం మొత్తం గర్వాతిశయంతో సెలబ్రేట్ చేసుకుంది.ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... ఇంతటి ప్రతిష్టాత్మక ఆస్కార్ సంబరాల్లో (97వ అకాడమీ అవార్డ్స్ లో) ఈ ఏడాది మన తెలుగు హీరో సందడి చేశాడు. చాలా అరుదుగా మాత్రమే లభించే ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్న ఆ తెలుగు నటుడి పేరు "రాజ్ దాసిరెడ్డి".. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో "భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు" చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన రాజ్ దాసిరెడ్డి... ఆస్కార్ - 2025 వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకొని, అక్కడకు వెళ్లడంతోపాటు, "హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్" "న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ - 2025"లోనూ సందడి చేశాడు. యాక్షన్ ఎంటర్టైర్‌గా తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. . అందుకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నాడు.

Kollywood hero Pradeep Ranganathan Dude Movie Collections10
సెంచరీకి చేరువలో డ్యూడ్‌.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్(Dude Collections). కోలీవుడ్ హీరో నటించిన ఈ సినిమాకు తెలుగులోనూ రిలీజైంది. లవ్ టుడే, డ్రాగన్‌ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న థియేటర్లలో విడుదలైంది.అయితే తొలి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ సాధించింది. గతంలో రిలీజైన డ్రాగన్‌ కంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.83 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే సెంచరీకి చేరువలోకి వచ్చేసింది. వరల్డ్‌ వైడ్‌గా ఐదు రోజుల్లో రూ.95 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వసూలు చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పోస్టర్ ద్వారా వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా కనిపించగా.. ఆర్‌. శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించారు. DUDE continues the festivities at the box office 💥💥✨#DUDE grosses over 95 CRORES in 5 days worldwide ❤‍🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n⭐ing 'The Sensational' @pradeeponelife🎬 Written and… pic.twitter.com/Jo9f1ukrW8— Mythri Movie Makers (@MythriOfficial) October 22, 2025

Advertisement
Advertisement