ప్రధాన వార్తలు
హిట్ స్టెప్
ఫస్ట్ స్టెప్ హిట్ స్టెప్ అయితే ఆ ఆనందమే వేరు. 2025లో అలా తొలి అడుగులోనే విజయం సాధించిన దర్శకులు అరడజనుకు పైనే ఉన్నారు. హారర్, కామెడీ, థ్రిల్, ఫ్యామిలీ, లవ్... ఇలా ఒక్కో దర్శకుడు ఒక్కో జానర్ని ఎంచుకుని, హిట్ అయ్యారు. 2025లో ‘హిట్ డైరెక్షన్’లో కెరీర్ ఆరంభించిన ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.⇒ మన చట్టాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, లేకపోతే ఆ చట్టాలను ఆయుధాలుగా చేసుకుని బలహీనులను కొందరు బలవంతులు ఏ విధంగా ఇబ్బందిపెడతారనే అంశంతో రూపొందిన చిత్రం ‘కోర్ట్’.పోక్సో చట్టం నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన హీరో, హీరోయిన్ హర్‡్ష రోషన్, శ్రీదేవికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. లాయర్గా ప్రియదర్శి మంచి మార్కులు కొట్టేశారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలైంది. ⇒ యూత్ఫుల్ మూవీస్ ఆడియన్స్కు నచ్చాయంటే, కలెక్షన్స్కు కొదవే ఉండదు. అందుకు తాజా ఉదాహరణ ‘లిటిల్ హార్ట్స్’. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో దర్శకుడు సాయి మార్తాండ్ బ్లాక్బస్టర్ హిట్ సాధించారు. చదువు పెద్దగా అబ్బని ఓ అబ్బాయి, అమ్మాయి లాంగ్టర్మ్ కోచింగ్లో చేరి, ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్న పాయింట్తో ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తీశారు సాయి మార్తాండ్. ఈ చిత్రంలో మౌళి తనుజ్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్గా నటించారు. ‘90స్’ బయోపిక్ వెబ్సిరీస్తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు ఓ నిర్మాత. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదలైంది. ⇒ కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టైలిస్ట్గా నీరజ కోన పాపులర్ అని తెలిసిందే. ఆమె దర్శకురాలిగా పరి చయం అయిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో సరోగసీ అనే సెన్సిబుల్ పాయింట్ను, ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్స్టోరీని, వారి మానసిక సంఘర్షణను వెండితెరపై బాగా చూపించారు నీరజ. సిద్ధు జొన్నగలడ్డ హీరోగా, రాశీ ఖన్నా, శ్రీ నిధిశెట్టి హీరోయిన్లుగా టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న విడుదలైంది. మహిళా దర్శకుల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో నీరజ కోన పరిచయమై, హిట్ సాధించడం హర్షించదగ్గ విషయం. ⇒ పెద్ద వ్యాపారవేత్త అయిన కృష్ణకి (సాయికుమార్) అల్లర చిల్లరగా తిరిగే మాస్ కొడుకు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ఎంసెట్లో ర్యాంక్ సాధించకపోగా, అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. డొనేషన్ చెల్లించి మరీ కేరళలోని ఓ కాలేజ్లో మెడిసిన్ చదివించేందుకు కొడుకుని చేర్పిస్తాడు తండ్రి. అక్కడ కుమార్, మెర్సీ జాన్ (యుక్తి తరేజా) ప్రేమలో పడతారు. పెద్దలు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపుతారు. అదే సమయంలో మెర్సీకి ఉన్నపోస్ట్ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీఎస్టీడీ) వ్యాధి గురించి కుమార్కి తెలుస్తుంది. ఆ వ్యాధి పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు జైన్స్ నాని. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 18న విడుదలైంది. ఈ కథను నేర్పుగా డీల్ చేసి,ప్రేక్షకులతో చేత శెభాష్ అనిపించుకున్నారు జైన్స్ నాని. ⇒ 2004లో తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ ఘటన నేపథ్యంలో దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డప్పు మేస్త్రీగా పని చేసే రాజు (అఖిల్ రాజ్), అదే ఊరికి చెందిన ప్రభుత్వ ఆస్పత్రి కాంపౌండర్ వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) కూతురు రాంబాయి (తేజస్విని) ప్రేమలో పడతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుడితోనే తన కూతురి పెళ్లి చేస్తానని తేల్చి చెబుతాడు వెంకన్న. రాజు, రాంబాయిల కథ చివరికి ఏమైంది? అనేది ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రకథ. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు నవంబరు 21న విడుదల చేయగా, సూపర్ హిట్గా నిలవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. సున్నితమైన కథని తన టేకింగ్, మేకింగ్ స్టైల్తో సాయిలు కంపాటి అందరి దృష్టినీ ఆకర్షించారు. ⇒ బైరాన్పల్లి సంఘటన ఆధారంగా కాల్పనిక కథతో దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన చిత్రం ‘చాంపియన్’. ఈ కథ గురించి చె΄్పాలంటే... రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు బైరాన్పల్లి ప్రజలుపోరాటం చేస్తుంటారు. మరోవైపు సికింద్రాబాద్లో పుట్టి, పెరిగిన మైఖేల్ సి. విలియమ్స్ (రోషన్) ఫుట్బాల్ ప్లేయర్. ఇంగ్లాండ్ వెళ్లి, ఆడాలనేది అతని కల. అనుకోని పరిస్థితుల్లో బైరాన్పల్లి గ్రామం చేస్తున్నపోరాటంలోకి అడుగుపెడతాడు మైఖేల్. ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్న అతని కల నెరవేరిందా? అనేది కథ. మూడేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా రోషన్ రీ – ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అతనికి ప్లస్ అయింది. ఈ కథని ప్రదీప్ అద్వైతం భావోద్వేగంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదలైంది. ⇒ వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శంబాల ఊరి నేపథ్యంలో 1980 దశకంలో సాగే కథతో ‘శంబాల’ చిత్రాన్ని తెరకెక్కించారు యుగంధర్ ముని. శంబాల ఊరిలో జరిగే అనూహ్యమైన సంఘటనల తాలూకు మిస్టరీని ఛేదించడానికి యువ శాస్త్రవేత్త విక్రమ్ (ఆది) ఆ ఊరికి వెళతాడు. విజ్ఞానం వర్సెస్ శాస్త్రం, దైవ శక్తులు వర్సెస్ మూఢనమ్మకాలు.... వంటి రిస్కీ కథాంశాన్ని ఎన్నుకున్న యుగంధర్ ముని కన్విన్సింగ్గా చెప్పడం అభినందనీయం. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేశారు. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలైంది. ⇒ ‘పెద్దజాతి, చిన్న జాతి అన్న తేడాల్లేవ్... మనందరం ఒక్కటే’ అన్న సందేశాన్ని నినదిస్తూ థియేటర్స్లో ‘దండోరా’ వేశారు దర్శకుడు మురళీకాంత్. జీవితంలో తనకు ఎదురైన అనుభవానికి అక్షరరూపం ఇచ్చి.. అగ్రవర్ణాలు, అణగారిన వర్గాల మధ్య నేటికీ ఉన్న తారతమ్యాలు, కుల వివక్ష, ప్రేమ, పరువు హత్యలు..వంటి అంశాలను మేళవించి ‘దండోరా’ సినిమా తీశారు మురళీకాంత్.అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి, తను చేసిన తప్పును తాను తెలుసుకుని, పశ్చాత్తాప పడితే, ఆ ఆగ్రవర్ణ కులపెద్దలు అతని మరణం పట్ల ఎలాంటి వివక్ష చూపించారు? అనే పాయింట్ను ‘దండోరా’ సినిమాలో చూపించారు. ఇలా తన ప్రతిభను తానే దండోరా వేసుకున్నారు. శివాజీ, నందు, మౌనికా రెడ్డి, నవదీప్, రవికృష్ణ, రాధ్య, బింధు మాధవి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. ము΄్పానేని రవీంద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 25న ఈ చిత్రం విడుదలైంది. ⇒ పంతంగులపోటీ నేపథ్యంతో రూపొందిన తాజా సినిమా ‘పంతగ్’. ఈ యూత్ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ఈ సినిమాలోని లీడ్ రోల్స్లో నటించారు. యూత్పుల్ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ సినిమాను విజయ్కుమార్ అన్నే, సంపత్, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్స్లో విడుదలైంది.⇒ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘రామం రాఘవం’తో ధన్రాజ్, రవితేజ నటించిన ‘మాస్ జాతర’ చిత్రంతో భాను భోగవరపు,‘అల్లరి’ నరేశ్ ‘12ఏ రైల్వేకాలనీ’తో నాని కాసరగడ్డ, రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ ‘పాంచ్ మినార్’తో రామ్ కడుమల, కిరణ్ అబ్బవరం ఇంటెన్స్ లవ్స్టోరీ ‘దిల్ రుబా’తో విశ్వకరుణ్, ప్రియదర్శి ‘ప్రేమంటే..?’తో నవనీత్ శ్రీరామ్ వంటి నూతన దర్శకులు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.
ఆలస్యమైందని నటుడిపై దాడి.. 70% వినికిడి శక్తి కోల్పోయి!
కూటికోసం కోటి తిప్పలు. కొందరు సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలోకి రాకముందు ఇతరత్రా పనులు చేసినవారే! మలయాళ నటుడు అజీస్ నెదుమంగడ్ కూడా ఒకప్పుడు డ్రైఫ్రూట్ షాప్లో సేల్స్మెన్గా పనిచేశాడు. అది కూడా భారత్లో కాదు, బహ్రెయిన్లో! ఇటీవల బహ్రెయిన్ వెళ్లిన అజీస్ తను పనిచేసిన షాపును గుర్తుపెట్టుకుని మరీ అక్కడకు వెళ్లాడు. 18 ఏళ్ల కిందట..తనతో పాటు పనిచేసిన స్నేహితుడిని అదే షాపులో కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరి బాగోగులను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 18 ఏళ్ల కిందట అదే షాపులో పనిచేసిన అజీస్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.కెరీర్అజీస్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే! దీంతో అతడు ఇంజనీరింగ్ పట్టా చేతికి రాగానే గల్ఫ్ దేశానికి వలస వెళ్లి షాపులో పనిచేశాడు. కానీ, అక్కడ ఎక్కువకాలం ఉండలేక మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. పలు స్టేజీలపై మిమిక్రీ చేస్తూ కామెడీ పండించేవాడు. తర్వాత టీవీ షోలలోనూ పాల్గొనడంతో కమెడియన్గా మంచి గుర్తింపు లభించింది. ప్రాధాన్యమున్న పాత్రలుఅలా 'కుంజలియన్' సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అది చిన్న అవకాశం. తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు, కానీ పెద్దగా చెప్పుకునే పాత్రలైతే కాదు. చేస్తే మంచి క్యారెక్టర్సే చేయాలి... జూనియర్ ఆర్టిస్ట్గా కాదని తీర్మానించుకున్నాడు. అలా యాక్షన్ హీరో బిజు మూవీతో క్లిక్ అయ్యాడు. వాళా, మిన్నాల్ మురళి, కన్నూర్ స్క్వాడ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, జయజయజయహే వంటి సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. దాదాపు 30కి పైగా సినిమాలు చేశాడు.దాడిలో తీవ్రగాయాలుఅయితే అజీస్ (Azees Nedumangad) జీవితంలో ఓ చేదు ఘటన జరిగింది. 2017 ఏప్రిల్లో ఓ స్టేజీ షోకు ఆలస్యంగా వెళ్లాడు అజీస్. అంతే.. అక్కడున్న కొంతమంది ఆగ్రహంతో నటుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అజీస్కు తీవ్రగాయాలయ్యాయి. ఏకంగా 70% వినికిడి శక్తిని కోల్పోవడం బాధాకరం! అవమానాలను సైతం దాటుకుని నేడు మలయాళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు అజీస్. ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ నటుడిగా కొనసాగుతున్నాడు.
గ్లామర్కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్లా చేయాలనుంది!
సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.గతంలో తప్పులుతాజాగా ఓ ఈవెంట్కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్ఫుల్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.అలాంటి పాత్రలు చేయాలనుందిఉదాహరణకు రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
బిగ్బాస్ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.అగ్నిపరీక్షఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్బాస్ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్ చేసి బిగ్బాస్ టీమ్కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.అలాంటివారికి నో ఛాన్స్వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్, బిందుమాధవి, అభిజిత్కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. బిగ్బాస్కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.తొలిసారి ఏడుగురు కామనర్స్మిగతావారి టాలెంట్, ఎక్స్ప్రెషన్స్, నాలెడ్జ్.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్ ఫైనల్ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్, పవన్, మనీష్, హరీశ్. వీరిలో కల్యాణ్ ఏకంగా టైటిల్ విన్నర్ కాగా పవన్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. సామాన్యుడి చేతికి ట్రోఫీసామాన్యుడు బిగ్బాస్కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్ సీజన్పై పెద్దగా బజ్ లేదు. ఇప్పుడు కల్యాణ్ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్పై భారీ హైప్ క్రియేట్ అయింది. బిగ్బాస్ ప్లాన్ సక్సెస్ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్ 2026 సెకండాఫ్లో ప్రారంభం కానుంది.చదవండి: వినాయకన్కు తీవ్ర గాయం.. కాస్త లేట్ అయ్యుంటే పక్షవాతం!
బిగ్బాస్
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
ప్రమోషన్ పొందిన వితికా షెరు
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్బాస్' రివ్యూవర్స్.. ?
టాప్ 2లో నా పక్కన ఇమ్మూ... తనూజతో ఆ బాండ్ లేదు!
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్బాస్ బజ్: కల్యాణ్ పడాల నెక్స్ట్ టార్గెట్ అదే!
బిగ్బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
లేడీ సెలబ్రిటీలు తస్మాత్ జాగ్రత్త.. మీ గతి కూడా ఇంతే!
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
ఛీ కొట్టినవారితో చప్పట్లు.. కల్యాణ్ విజయానికి కారణాలివే!
A to Z
2025కి ముగింపు.. ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు
2025 చివరకొచ్చేసింది. మరోవారం పదిరోజుల్లో కొత్త ఏడ...
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
ప్రతి రంగంలోనూ లోటుపాట్లు ఉంటాయి. వైద్యరంగంలోనూ బయ...
ఓటీటీకి గురిపెట్టిన రివాల్వర్ రీటా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడ...
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
వెతకాలే గానీ ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా మంచి మ...
'ధురంధర్' కలెక్షన్స్లో మాకు వాటా ఇవ్వాలి: పాక్ ప్రజలు
'ధురంధర్' సినిమాని పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప...
రూ.50 కోట్లు నా దగ్గర ఎక్కడివి? మమ్మల్ని వదిలేయ్!
కుమారు సాను విలక్షణమైన సింగర్.. ఈయన తెలుగులో దేవు...
బాక్సాఫీస్ వద్ద దురంధర్ క్రేజ్.. ఆ ట్యాగ్ బాగా కలిసొచ్చిందా?
ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకు...
'ధురంధర్'లో తమన్నా ఉండాల్సింది.. కానీ రిజెక్ట్ చేశారు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ సాధి...
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీ వచ్చేసి...
'స్ట్రేంజర్ థింగ్స్ 5' వాల్యూమ్ 2 ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సిరీస్ల్లో 'స్ట్ర...
'అవతార్' రెండు పార్ట్స్లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?
ఈ శుక్రవారం(డిసెంబరు 19).. హాలీవుడ్ భారీ బడ్జెట్ మ...
స్టార్ దర్శకుడు, భార్య అనుమానాస్పద మృతి!
హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ రాబ్ రైనర్, ఆయన సతీమణి ...
ప్రియా ప్రకాశ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. మీరా జాస్మీన్ ఫెస్టివ్ వైబ్స్..!
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రియా ప్రకాశ్..ఉదయ్ప...
బిగ్బాస్ ఇనయా సుల్తానా థ్రిల్లర్ మూవీ.. సెన్సార్ పూర్తి..!
హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నట...
వెంకటేశ్- ఆర్తి ఎవర్గ్రీన్ క్లాసిక్.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా బ్లా...
'కాస్త లేట్ అయ్యుంటే నా శరీరం చచ్చుబడిపోయేది'
మలయాళ నటుడు, జైలర్ విలన్ వినాయకన్ ఆస్పత్రి నుంచ...
ఫొటోలు
టాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హీరోయిన్ తమన్నా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
శరత్ కుమార్-రాధిక క్రిస్మస్ లంచ్లో కోలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
హృతిక్ రోషన్ కజిన్ పెళ్లి.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
వారణాసి ట్రిప్లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్లో ఫుల్ గ్లామరస్గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్ హెబ్బా పటేల్ (ఫొటోలు)
'దండోరా' మూవీ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ బింధుమాధవి (ఫొటోలు)
మహేష్ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
గాసిప్స్
View all
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?
దృశ్యం 3 నుంచి 'ధురంధర్' నటుడు అవుట్?
రేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!
'ధురంధర్'కి భారీ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
జైలర్ 2లో ఐటం సాంగ్!
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
దిగ్గజ గాయని బయోపిక్లో సాయిపల్లవి?
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
రివ్యూలు
View all
2.75
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
2.75
'దండోరా' సినిమా రివ్యూ
3
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
1.75
‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
టాలీవుడ్ హీరో శాండల్వుడ్ ఎంట్రీ.. పునీత్ రాజ్కుమార్కు నివాళులు..!
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలో సత్తా చాటుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాదిలో పలు సినిమాలతో మెప్పించిన నవీన్ చంద్ర.. శాండల్వుడ్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.ఈ సందర్భంగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించారు. ఆయనకు మొకాళ్లపై కూర్చుని నివాళులర్పించారు. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాకు మీ ఆశీర్వాదాలు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కాగా.. కన్నడ సినీ ఇండస్ట్రీలో నవీనచంద్ర నటించిన తొలి సినిమా మార్క్. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. రిలీజ్కు ముందు వచ్చిన పోస్టర్స్ చూస్తే పవర్ఫుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Naveen Chandra (@naveenchandra212)
'వార్-2' నష్టం ఎంతో ఫైనల్గా చెప్పిన నాగ వంశీ
ఈ ఏడాదిలో బాలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులు భారీగా ఎదురుచూసిన చిత్రం వార్-2.. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీని యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీని తెలుగు రైట్స్ను రూ. 80 కోట్లకు నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా డిజాస్టర్గా మిగిలిపోవడంతో సుమారు రూ. 50 కోట్లు నష్టపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తను క్లారిటీ ఇచ్చాడు. అసలు వార్-2 ఎంత మొత్తానికి కొన్నాడో చెప్పుకొచ్చాడు.'వార్-2 సినిమాలో నేను భారీగా నష్టపోయానని చాలామంది అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. తెలుగు రైట్స్ రూ. 68 కోట్లకు దక్కించుకున్నాను. మూవీ క్లోజింగ్ అయ్యేసరికి రూ. 40 కోట్ల వరకు షేర్ వచ్చింది. అయితే, యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నాకు రూ. 18 కోట్లు రిటర్న్ ఇచ్చింది. బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారు. వార్-2 వల్ల నేను నష్టపోలేదు.' అని మొదటిసారి లెక్కలతో సహా వంశీ చెప్పారు. ఈ లెక్కన తను రూ. 10 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో హృతిక్ రోషన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్పై ప్రభావం పడింది.I Bought Jr Ntr @tarak9999 Garu's & HRX @iHrithik Garu's #War2 Film For 68 Crores + Gst & It Got Theatrical Revenue Nearly For 40 Crores Share & I Met The Team Of @yrf & Spoke With Them & They Returned The Amount Of 18 Cr - @vamsi84 Garu#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/bWL5lkwid1— 𝐓𝐞𝐚𝐦 𝐅𝐨𝐫 𝐓𝐚𝐫𝐚𝐤 (@TeamForTarak) December 25, 2025
రాజ్తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకుంది. రెండో పెళ్లి తర్వాత చేసుకున్న మొదటి క్రిస్మస్ ఇదే కావడంతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పాటు ఈ ఏడాది తన ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి జరిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఏడాదిలో తన మధుర జ్ఞాపకాలను సైతం పోస్ట్ చేసింది. ఇటీవలే సామ్ రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.రాజ్ నిడిమోరుతో ఏడడుగులు..సమంత ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. రూమర్స్ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్లోని ఈశా ఫౌండేషన్లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' పద్దతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
75 ఏళ్ల బామ్మగా ఒకప్పటి స్టార్ హీరోయిన్
వైవిధ్య భరిత కథ చిత్రాలను నిర్మించడంలోనూ, టాలెంటెడ్ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుండే నటుడు శివ కార్తికేయన్.. తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రం తాయ్ కిళవి. ఈ చిత్రం ద్వారా శివ కుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన రాధికా శరత్కుమార్.. ఈ మూవీలో ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు తదితర అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆలస్యమైందని నటుడిపై దాడి.. 70% వినికిడి శక్తి కోల్పోయి!
కూటికోసం కోటి తిప్పలు. కొందరు సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలోకి రాకముందు ఇతరత్రా పనులు చేసినవారే! మలయాళ నటుడు అజీస్ నెదుమంగడ్ కూడా ఒకప్పుడు డ్రైఫ్రూట్ షాప్లో సేల్స్మెన్గా పనిచేశాడు. అది కూడా భారత్లో కాదు, బహ్రెయిన్లో! ఇటీవల బహ్రెయిన్ వెళ్లిన అజీస్ తను పనిచేసిన షాపును గుర్తుపెట్టుకుని మరీ అక్కడకు వెళ్లాడు. 18 ఏళ్ల కిందట..తనతో పాటు పనిచేసిన స్నేహితుడిని అదే షాపులో కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరి బాగోగులను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 18 ఏళ్ల కిందట అదే షాపులో పనిచేసిన అజీస్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.కెరీర్అజీస్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే! దీంతో అతడు ఇంజనీరింగ్ పట్టా చేతికి రాగానే గల్ఫ్ దేశానికి వలస వెళ్లి షాపులో పనిచేశాడు. కానీ, అక్కడ ఎక్కువకాలం ఉండలేక మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. పలు స్టేజీలపై మిమిక్రీ చేస్తూ కామెడీ పండించేవాడు. తర్వాత టీవీ షోలలోనూ పాల్గొనడంతో కమెడియన్గా మంచి గుర్తింపు లభించింది. ప్రాధాన్యమున్న పాత్రలుఅలా 'కుంజలియన్' సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అది చిన్న అవకాశం. తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు, కానీ పెద్దగా చెప్పుకునే పాత్రలైతే కాదు. చేస్తే మంచి క్యారెక్టర్సే చేయాలి... జూనియర్ ఆర్టిస్ట్గా కాదని తీర్మానించుకున్నాడు. అలా యాక్షన్ హీరో బిజు మూవీతో క్లిక్ అయ్యాడు. వాళా, మిన్నాల్ మురళి, కన్నూర్ స్క్వాడ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, జయజయజయహే వంటి సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. దాదాపు 30కి పైగా సినిమాలు చేశాడు.దాడిలో తీవ్రగాయాలుఅయితే అజీస్ (Azees Nedumangad) జీవితంలో ఓ చేదు ఘటన జరిగింది. 2017 ఏప్రిల్లో ఓ స్టేజీ షోకు ఆలస్యంగా వెళ్లాడు అజీస్. అంతే.. అక్కడున్న కొంతమంది ఆగ్రహంతో నటుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అజీస్కు తీవ్రగాయాలయ్యాయి. ఏకంగా 70% వినికిడి శక్తిని కోల్పోవడం బాధాకరం! అవమానాలను సైతం దాటుకుని నేడు మలయాళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు అజీస్. ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ నటుడిగా కొనసాగుతున్నాడు.
గ్లామర్కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్లా చేయాలనుంది!
సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.గతంలో తప్పులుతాజాగా ఓ ఈవెంట్కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్ఫుల్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.అలాంటి పాత్రలు చేయాలనుందిఉదాహరణకు రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
బిగ్బాస్ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.అగ్నిపరీక్షఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్బాస్ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్ చేసి బిగ్బాస్ టీమ్కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.అలాంటివారికి నో ఛాన్స్వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్, బిందుమాధవి, అభిజిత్కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. బిగ్బాస్కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.తొలిసారి ఏడుగురు కామనర్స్మిగతావారి టాలెంట్, ఎక్స్ప్రెషన్స్, నాలెడ్జ్.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్ ఫైనల్ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్, పవన్, మనీష్, హరీశ్. వీరిలో కల్యాణ్ ఏకంగా టైటిల్ విన్నర్ కాగా పవన్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. సామాన్యుడి చేతికి ట్రోఫీసామాన్యుడు బిగ్బాస్కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్ సీజన్పై పెద్దగా బజ్ లేదు. ఇప్పుడు కల్యాణ్ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్పై భారీ హైప్ క్రియేట్ అయింది. బిగ్బాస్ ప్లాన్ సక్సెస్ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్ 2026 సెకండాఫ్లో ప్రారంభం కానుంది.చదవండి: వినాయకన్కు తీవ్ర గాయం.. కాస్త లేట్ అయ్యుంటే పక్షవాతం!
ప్రియా ప్రకాశ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. మీరా జాస్మీన్ ఫెస్టివ్ వైబ్స్..!
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రియా ప్రకాశ్..ఉదయ్పూర్ కోటలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్..హీరోయిన్ మెహరీన్ క్రిస్మస్ లుక్స్..క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బాలీవుడ్ నటి రవీనా టాండన్..ఫెస్టివల్ వైబ్స్లో హీరోయిన్ మీరా జాస్మిన్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13)
బిగ్బాస్ ఇనయా సుల్తానా థ్రిల్లర్ మూవీ.. సెన్సార్ పూర్తి..!
హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. ఈ చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. ఈ సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది.
వెంకటేశ్- ఆర్తి ఎవర్గ్రీన్ క్లాసిక్.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా బ్లాక్ బస్టర్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రానికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించగా.. స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్ 6న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్తో ప్రపంచవ్యాప్తగా రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. 4కె వర్షన్లో రిలీజైన ట్రైలర్ వెంకీ మామ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రమని నిర్మాత రవికిశోర్ అన్నారు. నువ్వు నాకు నచ్చావ్. ఇది కేవలం రీ రిలీజ్ మాత్రమే కాదని.. నూతన సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అన్నారు.
సినిమా
మరోసారి పోకిరి కాంబో.. వారణాసితో పాన్ వరల్డ్ షేక్
మళ్లీ అదే మాట.. శివాజీ నోటి దూల
ఒక్కమాటలో శివాజీకి ఇచ్చిపడేసిన హెబ్బా
ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో
శివాజీ కామెంట్స్ కి RGV ఘాటైన కౌంటర్!
శివాజీకి బిగ్ షాక్.. సీరియస్ యాక్షన్ కు రంగం సిద్ధం
దెబ్బకు దిగొచ్చిన శివాజీ..!
నువ్వు బొట్టు, మెట్టెలు పెట్టుకొని తిరుగు! శివాజీకి చిన్మయి కౌంటర్
17 రోజుల్లోనే కాంతార-2 రికార్డు బద్దలు.. ధురంధర్ కలెక్షన్స్ సంచలనం!
డ్యాన్స్ తో డామినేట్ చేస్తున్న రోషన్
