Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Rajinikanth Announces PADAYAPPA Movie Sequel1
నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్‌.. సీక్వెల్‌కు ప్లానింగ్‌

రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ సినిమాల్లో నరసింహ (తమిళంలో పడయప్ప) ఒకటి. 1999లో విడుదలైన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. థియేటర్లు కిక్కిరిసిపోయాయి. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ దద్దరిల్లింది. ఈ మూవీలో నరసింహ పాత్రతో పాటు నీలాంబరి పాత్ర కూడా అంతే ఫేమస్‌ అయింది.25 ఏళ్ల తర్వాత రిలీజ్‌ఈ సినిమా 25 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోంది. రజనీకాంత్‌ 75వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 12న రీరిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో రజనీ తన సినిమాకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు. రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ఆడవాళ్లు గేట్లు బద్దలు కొట్టుకుని మరీ థియేటర్‌ వచ్చి నరసింహ చూశారు. ఇలాంటి సంఘటన నా 50 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ చూడలేదు. నరసింహ సీక్వెల్‌జైలర్‌, రోబో వంటి ఎన్నో సినిమాలకు సీక్వెల్స్‌ చూస్తున్నాం.. అలాంటప్పుడు నరసింహకు సీక్వెల్‌ ఎందుకు తీయకూడదు అనిపించింది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. దానికి నీలాంబరి అని టైటిల్‌ పెట్టాలనుకుంటున్నాం. నరసింహకథ నేనే రాశాను. కల్కి రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ నవలలో నందిని పాత్ర ఆధారంగా నీలాంబరి పాత్ర రాసుకున్నాను. నా స్నేహితుల పేర్లతో నిర్మించాను. ఈ సినిమా శాటిలైట్‌ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు. కేవలం ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడాలనేదే నా ఉద్దేశం. ఐశ్వర్యరాయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ఈ మూవీలో నీలాంబరి పాత్ర కోసం ముందుగా ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నాం. తనకోసం రెండుమూడేళ్లైనా ఎదురుచూడాలనుకున్నాం. కానీ ఆమెకు ఆసక్తి లేదని తెలిసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్‌.. ఇలా చాలా పేర్లు అనుకున్నాం. అప్పుడు దర్శకుడు రవికుమార్‌ రమ్యకృష్ణ పేరు సూచించాడు. మొదట్లో తను చేయగలదా? అనుకున్నాను. కానీ చివరకు తను అద్భుతంగా నటించింది. క్లైమాక్స్‌లో మైసూర్‌ వేలాది మందితో సీన్‌ షూట్‌ చేశాం.ఆమె కూడా..జయలలితను ఆదర్శంగా తీసుకుని నీలాంబరి పాత్ర డిజైన్‌ చేసుకున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. దీంతో ఆమె సినిమా చూడాలని ఆశపడింది. అలా తనకోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయగా.. ఆమెకు సినిమా చాలా బాగా నచ్చింది. అప్పటి సీఎం కలైంగర్‌ కరుణానిధి కూడా సినిమా చూశాడు అని రజనీకాంత్‌ (Rajinikanth) చెప్పుకొచ్చాడు.చదవండి: నన్నే టార్గెట్‌ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా

Shriya Saran About Her Beauty Secret2
నా అందానికి రహస్యం వ్యాయామం, ఫుడ్‌ కాదు!

దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన ఉత్తరాది భామల్లో శ్రియ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న ఈ నటిలో మంచి డాన్సర్‌ ఉన్నారు. గ్లామర్‌కు అయితే కొదవ లేదు. పాత్రలకు న్యాయం చేసే నటనా ప్రతిభ కూడా తోడుంది. వీటన్నింటికి తోడుగా అదృష్టం కలిసి రావడంతో తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలతో జత కట్టే అవకాశాలను అందుకున్నారు. అలా దాదాపు రెండు దశాబ్దాలపాటు కథానాయికగా నటించారు. హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా2018లో శ్రియ తన బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కోస్కీవ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ పుట్టింది. పెళ్లి తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. అయితే కథానాయికగా కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదే విధంగా ప్రత్యేక పాటల్లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అలా ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటించారు.అదే నా అందానికి రహస్యంతెలుగు చిత్రం మిరాయిలో ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడీమె వయసు 43 ఏళ్లు. ఈ వయసులోనూ తన అందాలను కాపాడుకుంటూ హోయలొలికిస్తున్నారు. తాజాగా తన బ్యూటీ రహస్యాన్ని ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాయామం, ఆహారపు అలవాట్లు వంటి వాటికంటే మంచిని వినడం, మంచివి చూడడం, మంచి చేయడం వంటి విషయాలతో సౌందర్యం మన నుంచి దూరం కాదు అని పేర్కొన్నారు. సాధారణంగా చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అంటారు. దీనికి నటి శ్రియ కొత్త అర్థాన్ని చెబుతూ దాన్ని అందంతో పోల్చడం విశేషం!

Bigg Boss 9 Telugu: Second Finalist Race Games in BB Show3
నన్నే టార్గెట్‌ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా..

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ కల్యాణ్‌ పడాల ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా అందర్నీ ఈ వారం నామినేషన్‌లో వేశాడు బిగ్‌బాస్‌. వీరిలో ఎవరు ఎక్కువ గేమ్స్‌ గెలిచి లీడర్‌ బోర్డ్‌లో టాప్‌లో ఉంటారో వారికి ఇమ్యూనిటీ గెలిచే ఛాన్స్‌ ఉంది. నిజంగా ఇమ్యూనిటీ గెలిచిన కంటెస్టెంట్‌ నేరుగా ఫైనల్‌ వీక్‌లో అడుగుపెట్టినట్లే లెక్క! మరి ఆ గేమ్స్‌ ఎలా జరిగాయో సోమవారం (డిసెంబర్‌ 8) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..మనీ బాక్స్‌సడన్‌గా బిగ్‌బాస్‌కు ఏమనిపించిందో ఏమో కానీ, ఇంతవరకు కెప్టెన్‌ అవలేదు కదా.. అంటూ భరణిని కెప్టెన్‌ చేశాడు. కాకపోతే ఇమ్యూనిటీ లభించదని నొక్కిచెప్పాడు. తర్వాత గార్డెన్‌ ఏరియాలో బాక్సులు పెట్టారు. అందులో జీరో నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు అంకెలు రాసిపెట్టారు. ఇప్పటివరకు కంటెస్టెంట్ల జర్నీని బట్టి వారికి బాక్సులు ఇవ్వాల్సి ఉందన్నాడు. ఈ పాయింట్స్‌ విజేత ప్రైజ్‌మనీపై ఎఫెక్ట్‌ చూపిస్తాయన్నాడు.సంజనాకు అన్యాయం?అలా డిమాన్‌.. సుమన్‌కు లక్ష ఇద్దామనుకోగా అందుకు అందరూ ఓకే చెప్పారు. తర్వాత భరణి.. తనూజకు రూ.2 లక్షలు ఇచ్చాడు. అనంతరం కల్యాణ్‌ ఇమ్మూకి రూ.2.5 లక్షలు రాసి ఉన్న బాక్స్‌ ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్‌.. సంజనాకు రూ.1.50 లక్షల బాక్స్‌ ఇస్తే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. అనంతరం సుమన్‌.. డిమాన్‌కు రూ.1.50 లక్షలిచ్చాడు. చివరగా భరణి, సంజన మిగిలారు. జైలుకు సంజనాసంజనాకు రూ.50 వేలు రావాలని ఇమ్మూ, పవన్‌ సపోర్ట్‌ చేస్తే మిగిలినవారు భరణికి సపోర్ట్‌ చేశారు. మెజారిటీ అతడివైపే ఉండటంతో భరణికి రూ.50 వేలు దక్కగా.. సంజనాకు జీరో లభించింది. దీంతో బిగ్‌బాస్‌ ఆమెను జైల్లో వేశాడు. తనకు జీరో రావడాన్ని సంజనా తట్టుకోలేకపోయింది. తల్లిలా ఆలోచించి ఎమోషనల్‌ ఫూల్‌ అవుతున్నా.. ప్రతివారం నన్నే టార్గెట్‌ చేస్తున్నారు అంటూ ఏడ్చేసింది.గెలిచేసిన ఇమ్మూతర్వాత ఈవారం ఇమ్యూనిటీ కోసం కొన్ని ఛాలెంజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలిపాడు బిగ్‌బాస్‌. లీడర్‌ బోర్డులో టాప్‌లో ఉండేవారు నామినేషన్స్‌ నుంచి సేవ్‌ అవడంతోపాటు ప్రేక్షకులను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం సంపాదిస్తారు. మొదటి గేమ్‌లో సంజనా పాల్గొనేందుకు వీల్లేదన్నాడు. అలా బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫస్ట్‌ టాస్క్‌ 'స్వింగ్‌ జరా'లో ఇమ్మూ గెలవగా.. భరణి, పవన్‌, తనూజ, సుమన్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మరి తర్వాతి టాస్కుల్లో ఎవరు గెలిచారు? ఎవరు టాప్‌లో ఉన్నారో చూడాలి!

Japan Girl Meet With ram charan In Hyderabad4
రామ్‌ చరణ్‌పై అభిమానం.. జపాన్‌ నుంచి వచ్చిన యువతులు

టాలీవుడ్‌ హీరోలకు జపాన్‌లో ఫ్యాన్స్‌ భారీగానే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఒక యువతి ఏకంగా జపా‌న్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రామ్‌ చరణ్‌ (Ram Charan)పై అభిమానం పెంచుకున్న కొందరు జపాన్‌ ఫ్యాన్స్‌ ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్‌ వారందరినీ ఇంటికి పిలిపించి మాట్లాడారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరదాగా గడపడమే కాకుండా ఫోటోలు దిగారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశామని చాలాబాగా నచ్చిందని వారు చెప్పారు. అయితే, వారందరూ కూడా పెద్ది సినిమా టీషర్ట్స్‌ వేసుకుని కనిపించి మెప్పించారు. వారి అభిమానానికి చరణ్‌ ఫిదా అయ్యారు. వారందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. Ram Charan is one of the few Telugu heroes who enjoys strong fandom in Japan. Today, he met fans who travelled all the way from Japan to see him and spent quality time with them.#Peddi #RamCharan pic.twitter.com/qK6rvh8Ald— Telugu Chitraalu (@CineChitraalu) December 8, 2025Dream for Other Heros Japan God #RamCharan 🇯🇵🛐🔥 !! pic.twitter.com/IzObh6k1ZO— Perfect Wala (@Perfectwala5) December 8, 2025

Superman Telugu movie OTT Streaming details Out5
భారత్‌లో 'సూపర్‌ మ్యాన్‌'.. ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌​ ఇదే

హాలీవుడ్‌ సినిమా ‘సూపర్‌ మ్యాన్‌’ ఓటీటీలోకి రానుంది. తెలుగులో కూడా ఉచితంగానే చూసే అవకాశం రానుంది. డీసీ యూనివర్స్‌లోని ఈ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. 1984 నుంచి ఈ జానర్ మూవీస్ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.ఈ ఏడాది విడుదలైన ‘సూపర్‌ మ్యాన్‌’ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఔట్ సైడ్ ఇండియాలో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌ ఈ సినిమాపై అప్‌డేట్‌ ప్రకటించింది. భారత్‌లో డిసెంబరు 11 నుంచి సూపర్‌ మ్యాన్‌ స్ట్రీమింగ్‌కు రానుందని పేర్కొంది. ఇంగ్లీష్‌తో పాటు, తెలుగు హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 6వేల కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో భారతీయ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్‪‌పూర్‌పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‍‌పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.

Actor Rajasekhar Injured in Movie Shooting6
గాయపడిన సినీ నటుడు రాజశేఖర్‌

ప్రముఖ సినీ హీరో రాజశేఖర్‌ మూవీ షూటింగ్‌లో గాయపడ్డారు. నవంబర్‌ 25న కొత్త సినిమా సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతుండగా ఆయన ప్రమాధానికి గురయ్యారు. మేడ్చల్‌ దగ్గరలో యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయన కాలికి గాయలయ్యాయి. తన కుడి కాలి మడమ దగ్గర గాయమయినట్లు తెలిసింది. అయితే, వెంటనే రాజశేఖర్‌ను ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేయించినట్లు తన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స విజయవంతమైందని సినీ యూనిట్ వెల్లడించింది.రాజశేఖర్ కు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్ మూవీ ‘లబ్బర్ పందు‘లో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగానే రాజశేఖర్‌ గాయపడినట్టు సమాచారం. శర్వానంద్ బైకర్ మూవీలో కూడా ఆయన కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Tamil Movie Industry Faced Financial struggles7
క్లిష్ట పరిస్థితుల్లో తమిళ సినిమా .. అలాంటి నిర్మాతలే లేరు

పెద్ద చిత్రాలు ఆడడం లేదు, చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం లేదని, నిర్మాతలకు పెట్టుబడి కూడా రావడం లేదని, ఓటీటీ సంస్థలు చిత్రాలను కొనుగోలు చేయకపోవడంతో తమిళసినిమా చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ , తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్‌ సుబ్రమణియమ్‌ పేర్కొన్నారు. ఈయన సినిమాల వసూళ్లు, నిర్మాతల పరిస్థితి, థియేటర్ల కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ల భారం తదితర విషయాలపై వాస్తవాలను చెప్పగలిగిన అనుభజ్ఞుడు. ఆయన ఆదివారం తమిళసినిమా పరిస్థతులపై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ల విషయంలో గత రెండు నెలలుగా సినిమా పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో కొన్ని పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయని, ఆ తరువాత శాసన సభ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. ఆపై భారీ చిత్రాలు లేవని, ముఖ్యంగా చిత్ర నిర్మాణ సంఖ్య తగ్గిపోతోందన్నారు. ఇందుకు కారణం నిర్మాతలు తమ చిత్రాలను వెంటనే ఓటీటీకి ఇవ్వడమేనన్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యం బాధింపులకు గురవుతోందన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోందన్నారు. ఒక చిత్రం విడుదలైన 8 వారాల తరువాత ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ చూడండని ఎంతగా చెబుతున్నా ఎవరూ వినడం లేదన్నారు. యాక్టివ్‌ నిర్మాతల సంఘంలోని కొందరి మొండితనం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆ నలుగురైదుగురి కారణంగానే సినిమా పరిస్థితి క్లిష్టంగా మారుతోందన్నారు. అయితే ఇప్పుడు వారి చిత్రాలనే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయని తెలిపారు. ఇతర చిత్ర పరిశ్రమల కంటే తమిళసినిమా పరిస్థితి చాలా దారుణంగా మారుతోందని, ప్రముఖ నటులకు భారీ పారితోషకాలు ఇచ్చే నిర్మాతలు లేరని తెలిపారు. ఎదుగుతున్న నటీనటులు అధిక పారితోషికాలు డిమాండ్‌ చేస్తున్నారని, అందువల్ల చాలా మంది నిర్మాతలు ముఖ్య నగరాల్లోనే తమ చిత్రాలను విడుదల చేస్తున్నారని తెలిపారు. చిన్న గ్రామాలకు సినిమాలు రావడం లేదని, థియేటర్లు మూత బడుతున్న పరిస్థితి ఉందన్నారు. అధిక ప్రింట్స్‌ వేస్తే అధిక ఖర్చు, ఆదాయం రావడం లేదని నిర్మాతలు అంటున్నారని తెలిపారు. ఈ సమస్యలపై చర్చించడానికి మంగళవారం ఆన్‌లైన్‌ మీటింగ్‌ను నిర్వహిస్తున్నామని డి్రస్టిబ్యూటర్‌ తిరుపూర్‌ సుబ్రమణియమ్‌ పేర్కొన్నారు.

Telugu Actress With Ultimate Talents8
తెరపై నటన.. బయట మాత్రం మరో ప్రపంచం

లేడీ యాక్టర్స్ అనగానే అయితే నటిస్తారు లేదంటే పెళ్లి చేసుకుంటారు అని చాలామంది అనుకుంటారు. ఒకప్పుడు పరిస్థితి ఇలానే ఉండేదేమో కానీ ఇప్పుడు చాలా మారింది. ఓ వైపు యాక్టింగ్‌ మరోవైపు పలు విభాగాల్లో ప్రతిభ చూపిస్తూ ఆల్‌రౌండర్స్ అనిపించుకుంటున్నారు. టాలీవుడ్ లో అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? వాళ్ల ఏమేం చేస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం.రీసెంట్‌గా టర్కీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకున్న నటి ప్రగతి.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఓ వయసు దాటిన తర్వాత అవకాశాలు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన ఛాన్స్‌ల్ని వదులుకుని గత రెండు మూడేళ్లుగా పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటుకుంది. మొన్నటివరకు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ గెలిచిన ఈ నటి.. ఇప్పుడు అంతర్జాతీయంగానూ అదరగొట్టేసింది. ఈమెని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరం నటీమణులకు ఎంతైనా ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు చూడాల్సిందే)మెంటల్ మదిలో, చిత్రలహరి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్.. యాక్టింగ్ మాత్రమే చాలా వాటిలో ప్రతిభ చూపిస్తోంది. ట్రాక్‌పై రయ్ రయ్ అంటూ దూసుకెళ్లే కారు రేసింగ్ నేర్చుకుంది. మరోవైపు తమిళనాడులో జరిగిన బ్యాడ్మింటన్‌ పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ చూపించింది. హీరోయిన్స్ అంటే గ్లామర్ మాత్రమే కాదు చాలానే టాలెంట్స్ ఉన్నాయని నిరూపించింది.ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి కూడా ఇండస్ట్రీలోకి రాకముందు పలు విభాగాల్లో ప్రతిభ చూపించింది. డెంటిస్ట్ డాక్టర్ పట్టా అందుకున్న ఈమె.. టీనేజీలో స్టేట్ లెవల్ స్మిమ్మింగ్, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గానూ ప్రతిభ చూపించి విజయాలు సాధించింది. హీరోయిన్ సదా అయితే ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయింది. ఈమె ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అడవుల్లో తిరుగుతూ తీసిన కృూరమృగాల ఫొటోలే దర్శనమిస్తాయి.వీళ్లే కాదు ప్రస్తుత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సమంత, రష్మిక లాంటి హీరోయిన్స్.. ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఫెర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి ఎంటరయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్‌కి అయితే హైదరాబాద్‌లో జిమ్, హోటల్ అంటూ బిజినెస్‌లు చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రస్తుత తరం హీరోయిన్స్.. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా తమ అభిరుచుల్ని చాటుకుంటున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.(ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)

Bigg Boss 8 Telugu Soniya Blessed With Baby Girl9
తల్లయిన బిగ్‌బాస్ సోనియా.. పోస్ట్ వైరల్

ప్రస్తుత బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ఇకపోతే గత సీజన్‌లో పాల్గొని ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. బిగ్‌బాస్ షోలో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. తల్లయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.గత సీజన్‌లో పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీతో సోనియా వ్యవహరించింది. అయితే చివరివరకు ఉంటుందనుకుంటే మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. బయటకొచ్చిన వెంటనే ఎంటర్‌ప్రెన్యూర్ యష్‌తో నిశ్చితార్థం చేసుకుంది. గతేడాది ఇదే టైంకి పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)పెళ్లయిన కొన్ని నెలల తర్వాత సోనియా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఈ రోజు ఈమెకు ఆడపిల్ల పుట్టింది. పాపకు శిఖా అని పేరు కూడా పెట్టినట్లు సోనియా భర్త యష్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు సోనియాకు విషెస్ చెబుతున్నారు.అయితే యష్‌‌కి గతంలోనే పెళ్లయింది. విరాట్ అని ఓ బాబు కూడా ఉన్నాడు. కాకపోతే చాన్నాళ్ల క్రితమే భార్యకు విడాకులిచ్చేశాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. టాలీవుడ్‌లో 'జార్జ్‌ రెడ్డి', 'కరోనా వైరస్‌', 'ఆశా ఎన్‌కౌంటర్‌' చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్) View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni)

Kangana Ranaut Dance BJP MP Jindal Daughter Wedding10
ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్

హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం భాజాపా తరఫున ఎంపీగా ఉన్న కంగనా రనౌత్.. ఈ మధ్య పెద్దగా వార్తల్లో కనిపించట్లేదు. లేదంటే ఎప్పుడో ఏదో విషయమై హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. చాన్నాళ్ల తర్వాత ఈమె గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. దానికి కారణం ఓ పెళ్లిలో ఈమె చేసిన డ్యాన్స్. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)గత కొన్నాళ్లు నుంచి చూసుకుంటే కంగన పేరు చెప్పగానే ఫైర్ బ్రాండ్ అనే మాటనే గుర్తొస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలు చేసింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపైన విరుచుకుపడింది. అవార్డ్ ఫంక్షన్స్‌లో, డ్యాన్సులు చేయడం లాంటి వాటికి ఈమె పూర్తిగా వ్యతిరేకి. అలాంటిది ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సహచర ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె పెళ్లిలో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.స్టేజీపై ఎంపీ నవీన్ జిందాల్‌తోపాటు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్‌సీపీకి ఎంపీ సుప్రియా సులేతో పాటు వేదికగా కంగన కూడా హుషారుగా స్టెప్పులేసింది. అయితే ఈ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూడు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే చోట కలిసి స్టెప్పులేయడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)Supriya Sule and Mahua Moitra dancing along with Kangana Ranaut at BJP MP Naveen Jindal’s daughter’s weddingThis video is for all those supporters who risk their careers and lives for such leaders 🙌 pic.twitter.com/JsgnoVhDs2— Veena Jain (@Vtxt21) December 7, 2025

Advertisement
Advertisement