Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Andhra King Taluka Movie Result And Collection1
'ఆంధ్ర కింగ్ తాలూకా'.. ఎందుకు ఇలాంటి పరిస్థితి?

టాలీవుడ్‌లో అప్పుడప్పుడు చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి జరిగింది. రామ్ హీరోగా నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. గత వీకెండ్‌లో థియేటర్లలోకి వచ్చింది. సోషల్ మీడియాలో టాక్, మీడియాలో రివ్యూలు పాజిటివ్‌గానే వచ్చాయి. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదు. కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. మరి ఈ మూవీ విషయంలో లెక్క ఎక్కడ తప్పింది? ఇలా జరగడానికి కారణాలేంటి?(ఇదీ చదవండి: 'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో)'ఆంధ్రకింగ్ తాలూకా' విషయంలో ఇలా జరగడానికి ఒకటి రెండు కాదు చాలానే కారణాలే ఉన్నాయనిపిస్తోంది. మొదటగా రిలీజ్ డేట్. సాధారణంగా నవంబరుని అన్-సీజన్ అని అంటుంటారు. చెప్పుకోదగ్గ మూవీస్ ఏం ఈ నెలలో విడుదల కావు. అయినా సరే నిర్మాతలు సాహసం చేశారు కానీ కలిసి రాలేదు. 'అఖండ 2' లాంటి పెద్ద హీరో సినిమా పెట్టుకుని వారం ముందు రిలీజ్ చేయడం కూడా ఓ రకంగా మైనస్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్‌కి రెడీ ఉంటే అంతకు ముందు వారం పదిరోజుల్లో వేరే చిత్రాల గురించి ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితి ఉండదు.మరో కారణం చెప్పుకొంటే ఈ సినిమాలో చూపించింది యూనివర్సల్ కంటెంట్ కాదు. ఓ అభిమాని-హీరో మధ్య సాగే ఎమోషనల్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. కాబట్టి హీరోలని పిచ్చిగా అభిమానించే కొందరికి మాత్రమే నచ్చుతుంది. సగటు ప్రేక్షకుడు ఎప్పుడూ ఏ హీరోని పిచ్చిగా అభిమానించడు, ఆరాధించడు. కాబట్టి ఈ విషయం ఏమైనా మైనస్ అయిందా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్!(ఇదీ చదవండి: సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్‌)ఈ సినిమాలో హీరో రామ్ మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండొచ్చు. హీరోయిన్ భాగ్యశ్రీతో కెమిస్ట్రీ సూపర్‌గా ఉండొచ్చు. అంతమాత్రాన ప్రేక్షకులు తమ సినిమాకు వచ్చేస్తారు అనుకోకూడదు. ఎందుకంటే ఓ హీరో నుంచి సినిమా వస్తుందంటే.. అతడి గత చిత్రాలేంటి? వాటి ఫలితాలేంటి అనేది కూడా ప్రేక్షకుడు ఆలోచిస్తాడు! రామ్ గత మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో రామ్ మార్కెట్ కాస్త డౌన్ అయింది. అలానే ఈ హీరో మాస్ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తీసింది క్లాస్ చిత్రం కావడంతో ఏమైనా తేడా కొట్టిందా అనిపిస్తుంది.ప్రస్తుతం ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే ట్రైలర్ రిలీజైనప్పుడే ఏ సినిమాని థియేటర్‌లో చూడాలి? ఏ మూవీని ఓటీటీలో చూడాలి అనేది ప్రేక్షకుడు ముందే ఫిక్స్ అయిపోతున్నాడు. బహుశా ఈ ట్రెండ్ ఎఫెక్ట్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'పై పడి కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయా అనిపిస్తుంది. ఒకవేళ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాని ఎక్కువమంది చూస్తే మాత్రం ఇది నిజమని ఫిక్స్ అయిపోవచ్చు. భాగ్యశ్రీ కూడా యాక్టింగ్ బాగానే చేస్తున్నప్పటికీ ఈమె మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. లిస్టులోకి ఇప్పుడు ఇది కూడా చేరినట్లే!ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం కూడా మరో కారణం అనుకోవచ్చు. ప్రస్తుతం రొటీన్ ప్రమోషన్స్ చేస్తుంటే జనాలకు పెద్దగా పట్టించుకోవట్లేదు. సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండాలి, కంటెంట్‌ ఏంటో విడుదలకు ముందే ఆడియెన్స్‌కి రీచ్ అయ్యేలా చేయాలి. సినిమా కోసం ఎంత కష్టపడినా మొక్కుబడి ఇంటర్వ్యూలు ఇచ్చేశాం, ఈవెంట్స్ చేసేశాం అంటే కుదరదు. కంటెంట్ ఎలా బాగున్నా సరే ప్రమోషన్స్ కూడా అంతే పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. బహుశా ఈ విషయంలోనూ 'ఆంధ్రకింగ్' వెనకబడ్డాడేమో?ఈ సినిమా విషయంలో ప్రేక్షకుడినో ఇంకెవరినో తప్పుబట్టడానికి ఏం లేదు. ఎందుకంటే సినిమా ఫలితం అనేది చాలా వాటిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు బాగున్న చిత్రాలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఫ్లాప్ అవుతుంటాయి. ఇప్పుడు 'ఆంధ్ర కింగ్ తాలూకా' విషయంలోనూ అదే జరిగినట్లుంది.(ఇదీ చదవండి: ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’ మూవీ రివ్యూ)

Samantha, Raj Nidimoru Wedding: Naga Chaitanya Old Video Goes Viral2
సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్‌

డేటింగ్‌ వార్తలకు తెరదించుతూ సమంత- రాజ్‌ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో యోగ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సామ్‌-రాజ్‌ ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అటు సామ్‌(Samantha)కి, ఇటు రాజ్‌కి ఇది రెండో పెళ్లి. 2017లో సమంత.. నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సామ్‌ మాత్రం ఒంటరిగా ఉంది. రాజ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె స్పందించలేదు. ఇప్పుడు సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది. (చదవండి: సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్‌ వీళ్లే..!)ఇదిలా ఉంటే.. సామ్‌ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే.. సోషల్‌ మీడియా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అయింది. గతంలో ఓ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్‌గా మాట్లాడారు.‘నా జీవితంలో ఏదైనా జరిగింది(విడాకులు).. అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడినే క్రిమినల్‌గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను. వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్‌గా అయిపోయి.. గాసిప్‌లా మార్చేసి.. చివరకు ఆ టాపిక్‌ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా మార్చేశారు. నేను చాలా సార్లు ఆలోచించాను. బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే.. దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్‌ పుడతాయి. అందుకే మాట్లాడలేదు. రాసేవాళ్లే దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలి’ అని చైతూ చెప్పుకొచ్చాడు. The moment he's speaking with a well-disciplined expression I'm came here from a broken family, Naaku thelusu aa pain ento.Hatts off to your Maturity levels 📈 #NagaChaitanya ❤️‍🩹🛐 pic.twitter.com/8aYYqCU9HX— Amoxicillin (@__Amoxicillin_) December 1, 2025

Venkatesh Peddapalem Talk About One By Four Movie3
‘వన్‌ బై ఫోర్‌’.. ఒక్క ఫ్రేమ్‌ కూడా బోర్‌ కొట్టదు: వెంకటేశ్‌ పెద్దపాలెం

వెంకటేశ్‌ పెద్దపాలెం హీరోగా, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరోయిన్లుగా నటించిన యాక్షన్, క్రైమ్‌ డ్రామా చిత్రం ‘వన్‌ బై ఫోర్‌’. ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో రంజన రాజేష్‌ గుంజల్, రోహిత్‌ రాందాస్‌ గుంజల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వెంకటేశ్‌ పెద్దపాలెం మాట్లాడుతూ– ‘‘నాది మదనపల్లి అని గర్వంగా చెప్పుకుంటున్నాను. టంగ్‌ స్లిప్‌ అనే పాయింట్‌తో ఈ క్రైమ్‌ డ్రామా సినిమా తీశాం. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించుకుండా సినిమా తెరకెక్కించారు. డిసెంబర్ 12న వంద శాతం మేం హిట్ కొట్టబోతోన్నామ’ని అన్నారు. ‘‘తెలుగులో సినిమా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ సినిమాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు రంజన రాజేష్‌. ‘‘మా సినిమా బాగా వచ్చింది’’ అని రోహిత్‌ రాందాస్, దర్శకుడు పళని తెలిపారు. అపర్ణ మల్లిక్, హీనా సోని, కొరియోగ్రాఫర్‌ సాగర్‌ వేలూరు మాట్లాడారు.

Ranveer Singh Apology For Kantara Mimicry And Trolls4
'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో

రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1' సినిమా హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. దానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్. ఎందుకంటే 'కాంతార'లో పంజుర్లీ దేవతకు సంబంధించిన విషయాన్ని చూపించారు. దీన్ని రణ్‌వీర్ కామెడీ చేసేలా ప్రవర్తించడం విపరీతమైన విమర్శలకు దారితీసింది.ఏం జరిగిందంటే?కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పంజుర్లీ దేవతని ఆరాధిస్తుంటారు. 'కాంతార 1' రిలీజ్ టైంలోనే కొందరు సదరు దేవత తరహా వేషాలు వేసుకుని వచ్చారు. దీనిపై హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మూవీని గౌరవంగా చూడాలని, దేవుళ్లను అవమానించేలా ప్రవర్తించకూడదని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడేమో గోవా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌వీర్.. పంజుర్లీ దేవతని అవమానించేలా కామెడీ చేశాడు.(ఇదీ చదవండి: పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?)ఈ కార్యక్రమానికి రిషభ్ శెట్టి హజరవగా.. స్టేజీపై రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్‌లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్‌లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్‌వీర్‌ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.'సినిమాలో రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఆ సీన్‌లో ఎలా చేశాడనేది చూపించాలనుకున్నాను. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను' అని రణ్‌వీర్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇ‍క్కడ విశేషం ఏంటంటే రణ్‌వీర్.. కర్ణాటకకు అల్లుడే. ఇతడు పెళ్లి చేసుకున్న దీపికది ఆ రాష్ట్రమే. కానీ ఇప్పుడు వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొన్నాడు.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)Ranveer Singh literally mocking Daiva Chavundi possession in Kantara.How low these movie stars can go for fame, money with zero respect for sacred Tulunad Daivaradhane beliefs🥺Shame.Rishabh is enjoying that mimic?@RanveerOfficial @shetty_rishab pic.twitter.com/F4x0X2rVmA— Vije (@vijeshetty) November 29, 2025

Suma Son Roshan's Mowgli Movie Trailer Out5
యాంకర్ సుమ కొడుకు కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్

యాంకర్ సుమ కొడుకు రోషన్ ఇదివరకే 'బబుల్ గమ్' అనే సినిమా చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని రెండో మూవీతో వస్తున్నాడు. అదే 'మోగ్లీ'. ఈ నెల 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'కలర్ ఫోటో'తో మెప్పించిన సందీప్ రాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. వచ్చే వారమే మూవీ రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)టైటిల్‌కి తగ్గట్లే అడవి నేపథ్యంగా సాగే సన్నివేశాలు, కామెడీ ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో పలు బోల్డ్ చిత్రాలతో మెప్పించిన బండి సరోజ్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సాక్షి అనే అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. (ఇదీ చదవండి: పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?)

Poonam Kaur Indirectly Mock Samantha Raj Wedding6
పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?

టాలీవుడ్‌లో అప్పట్లో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన పూనమ్ కౌర్.. ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌పై గతంలో పలుమార్లు సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతానికి యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ మహిళ గురించి పరోక్షంగా ప్రస్తవించింది.(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)'మన ఇల్లు బాగుండాలని పక్క ఇల్లు కూల్చేయడం సరికాదు. అది కూడా ఓ శక్తిమంతమైన బాగా చదువుకున్న ఎక్కువ ప్రాధాన్యం గల మనిషి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. సరిగ్గా ఈమె ట్వీట్ చేసినప్పుడే సమంత మరో పెళ్లి చేసుకుంది. దీంతో పూనమ్.. సమంతని ఉద్దేశిస్తూనే ఈ ట్వీట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.సమంతకు ఇది రెండో పెళ్లి. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుల్లో ఒకడైన రాజ్ నిడిమోరునే వివాహం చేసుకుంది. రాజ్‌కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలి అనే మహిళతో ఇతడికి పెళ్లి జరిగింది. ఆమెకు మూడేళ్ల క్రితమే విడాకులు ఇచ్చేశాడని అంటున్నారు గానీ దాని గురించి పెద్దగా క్లారిటీ లేదు. అలాంటిది ఇ‍ప్పుడు సామ్-రాజ్.. ఈశా ఫౌండేషన్‌లోని ఓ ఆశ్రమంలో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే బయటపెట్టింది. కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)

Bigg Boss 9 Telugu Day 85 Episode Highlights7
నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?

బిగ్‌బాస్ 9 హౌస్‌లో విజయవంతంగా 12 వారాలు పూర్తయ్యాయి. ఆదివారం ఎపిసోడ్‌లో దివ్య ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోవడం చాలామంది ఊహించిందే. మరకొరు కూడా ఎలిమినేట్ అవుతారేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇకపోతే 13వ వారానికిగానూ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ చిత్రవిచిత్రంగా జరిగింది. అటు సుమన్ శెట్టి, ఇటు తనూజ.. డీమన్‌కి చిన్నపాటి షాక్‌లు ఇచ్చారు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్‌లో ఏమేం జరిగింది? నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక హారర్ సినిమా)ప్రతి సభ్యులు ఇద్దరి సభ్యులకు చెందిన బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. తొలుత ఇమ్మాన్యూయేల్.. రీతూ, పవన్ పేర్లు చెప్పాడు. భరణి వచ్చి.. తన మెడిసన్స్‌తో ప్రాంక్ చేయడం నచ్చలేదని సంజనని, గతవారం సరిగా కనిపించలేదు అని పవన్‌ని నామినేట్ చేశాడు. రీతూ.. సుమన్, సంజనాని నామినేట్ చేసింది. తనూజ అయితే పవన్ పేరు చెప్పింది. కానీ ఈ డ్రామా కాస్త విచిత్రంగా నడిచింది.తనూజ.. తొలుత ఇమ్మూని నామినేట్ చేస్తున్నట్లు చాలాసేపు మాట్లాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి నన్ను నామినేషన్‌లోకి లాగాడు. ఏదో మాట అన్నంత మాత్రాన ఫ్రెండ్‌ని విసిరి పారేశాం అని కాదు. ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ వే. ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పు అని అడిగింది. దీనికి ఇమ్మూ తనవైపు నుంచి సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరూ తమ మధ్య దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు సడన్‌గా డీమన్ పవన్ పేరు చెప్పి తనూజ షాకిచ్చింది. ఇప్పటివరకు నామినేషన్ పాయింట్ చెప్పి మారిస్తే జోక్‌లా అనిపించిందని పవన్ ఆశ్చర్యపోయాడు. అలానే సంజనని కూడా నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)సుమన్ శెట్టి చేసిన నామినేషన్స్ అయితే వేరే లెవల్ కామెడీ అని చెప్పొచ్చు. నువ్వు హౌస్‌లో గట్టి గట్టిగా అరుస్తావ్, నాకు అది డిస్ట్రబెన్స్‌గా ఉందని చెప్పి రీతూని నామినేట్ చేశాడు. దీంతో రీతూ షాకయింది. మిగిలిన వాళ్లకు కూడా ఇబ్బందయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడిగితే.. వాళ్లకు భయమేమో చెప్పలేదు, నాకు భయం లేదు చెప్తున్నా అని వివరణ ఇచ్చాడు. తర్వాత డీమన్ పవన్ పేరు చెబుతూ.. నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కూడా, మాకంటే నువ్వే స్ట్రాంగ్ గనుక ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకో అని కారణం చెప్పాడు. దీనికి ఏమనలో తెలీక పవన్ నవ్వుకున్నాడు.ఇక సంజన.. పవన్, రీతూని నామినేట్ చేసింది. డీమన్ పవన్.. తొలుత ఇమ్మూ పేరు చెప్పి కాస్త నవ్వించి తర్వాత సంజన, తనూజ పేర్లు చెప్పాడు. చివరగా కెప్టెన్ కల్యాణ్.. భరణిని నామినేట్ చేశాడు. అలా ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. వారిలో సంజన, రీతూ, భరణి, పవన్, తనూజ, సుమన్ ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

Rashmika's Thamma Movie OTT Telugu Streaming Now8
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక దెయ్యం సినిమా

రష్మిక నటించిన రెండు సినిమాలు ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్నాయి. అందులో ఒకటి 'ద గర్ల్‌ఫ్రెండ్'. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ బ్యూటీ చేసిన హారర్ మూవీ కూడా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)రష్మిక ఓవైపు తెలుగు, మరోవైపు హిందీ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలా ఈ ఏడాది దీపావళికి 'థామా' అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్‌లోని 'స్త్రీ' యూనివర్స్‌లో భాగంగా వచ్చిన చిత్రమిది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా చేశాడు. ఇందులో రష్మిక.. రక్తం తాగే అమ్మాయి అంటే వ్యాంపైర్ పాత్రలో కనిపించింది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడినప్పటికీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.థియేటర్లలో అక్టోబరు 21న రిలీజైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉచితంగా ఎప్పటినుంచి అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)'థామా' విషయానికొస్తే.. అలోక్‌ గోయల్‌ (ఆయుష్మాన్‌ ఖురానా) ఓ జర్నలిస్ట్‌. ఫ్రెండ్స్‌తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్‌ (నవాజుద్దీన్‌ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది. అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్‌ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్‌తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్‌కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

Samantha Wedding Ring And Engaged In February9
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి

హీరోయిన్ సమంత మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో ఈ శుభకార్యం జరిగింది. ఈ క్రమంలోనే నెటిజన్లు.. ఈ పెళ్లి గురించి తెగ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడివరకు అందరికీ తెలుసు. అయితే సమంతకు చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా? ఆ మేరకు హింట్ కూడా ఇచ్చిందా? అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది.రాజ్‪‌తో సమంత స్నేహం ఇప్పటిది కాదు. 'ద ఫ్యామిలీ మ్యాన్' షూటింగ్ చేస్తున్న టైంలోనే అంటే 2020 నుంచే వీళ్లకు పరిచయముంది. కాకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ల మధ్య బాండింగ్ పెరిగినట్లుంది. మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం సామ్-రాజ్ ఎప్పటికప్పుడు జంటగానే కనిపిస్తూ వచ్చారు. దీంతో వీళ్ల డేటింగ్ గురించి రూమర్స్ చాలానే వచ్చాయి. అయితే ఇలా సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)పెళ్లి తర్వాత ఫొటోలని సమంత.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఒకదానిలో చేతికి డైమండ్ రింగ్ ఉంది. అయితే ఈ రింగ్ గతంలో సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలోనూ కనిపించింది. అది కూడా ఈ ఏడాది వాలంటైన్స్ డేకి ముందు రోజు. అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిపోయిందా? అనే సందేహం వస్తోంది. అప్పుడే చేతికి రింగ్‌తో హింట్ ఇచ్చింది కానీ అభిమానులు పసిగట్టలేకపోయారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.సమంత.. గతంలో తెలుగు హీరో నాగచైతన్యని 2017లో పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా శ్యామోలి అనే మహిళని 2015లో పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీళ్లు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా సామ్, రాజ్.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే కావడం విశేషం.(ఇదీ చదవండి:'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

film Producer Naga Vamsi Comments On Ibomma Ravi10
ఐబొమ్మ రవిగాడిని రాబిన్‌హుడ్‌ చేశారు: నాగవంశీ

సినిమా పైరసీ కేసులో అరెస్ట్‌ అయిన ఐబొమ్మ రవిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజాగా రియాక్ట్‌ అయ్యారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటిస్తున్న తాజా సినిమా ‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’ టైటిల్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. పైరసీ చేసిన అతడిని హీరోని చేసి చూస్తున్న సమాజంలో మనం జీవిస్తున్నామంటూ వంశీ అన్నారు. సినిమాకు రూ.50 టికెట్‌ ధర పెంచితే తమను తప్పుబట్టి కామెంట్లు చేసిన వారున్నారని ఆయన పేర్కొన్నారు. 'ఐబొమ్మ రవినే రాబిన్‌హుడ్‌ చేసిన లోకం ఉన్నాం మనం.. మేమేదో తప్పు చేసినట్టు టికెట్‌ రూ. 50 రూపాయలు పెంచితే మేము తప్పు చేసిన వాళ్లం అయ్యాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.' అని వంశీ అన్నారు.‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటిస్తున్న తాజా సినిమాకి ‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.#NagaVamsi :#Ibomma రవి నే ROBINHOOD చేసిన లోకం లో ఉన్నాం మనం " మేమేదో తప్పు చేసినట్టు, రేటు 50 రూపాయలు పెంచితే, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.#EPIC #News #Tollywood pic.twitter.com/FNEiqVrZ5i— IndiaGlitz Telugu™ (@igtelugu) December 1, 2025

Advertisement
Advertisement