ప్రధాన వార్తలు
హీరోగా పెద రాయుడు బాలనటుడు ఎంట్రీ.. ఆసక్తిగా టీజర్
మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం
గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. అయితే, ముఖ్యంగా గోదారి గట్టున ఉన్న నిద్ర గన్నెరు చెట్టు చాలామందికి సెంటిమెంట్గా ఉండేది. అయితే, గతేడాది వర్షాలకు అది కూలిపోయింది.300 సినిమాలుకొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి.కూలిపోయిన చెట్టు.. దర్శకుడు వంశీ భావోద్వేగంసితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి–గోపిక–గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చెట్టు కూలిపోయిందని తెలియగానే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వెళ్లారు. కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు. చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్లు రాలేదన్నారు.చిగురించిన చెట్టుచెట్టు కూలిపోవడంతో చాలామంది బాధపడ్డారు. ఇక ఆ చెట్టు మళ్లీ చిగురించదని అందరూ భావించారు. అయితే, అక్కడి యువకులు మాత్రం ఆ చెట్టును ఎలాగైనా బతికించాలని అనుకున్నారు. అందుకోసం వారికి తోచిన పద్ధతులను అనుసరించారు. ఎట్టకేలకు ఎవరూ ఊహించలేని విధంగా ఆ చెట్టు మళ్లీ చిగురించింది. ప్రస్తుతం గోదారి గట్టుపై ఉన్న నిద్రగన్నేరు చెట్టు పూర్తిగా ఆకులతో కళకళలాడుతూ కనిపించడంతో స్థానికులు ఫోటోలు తీసి సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు.
నన్ను చదివించే స్థోమత లేదు, ఇప్పుడు పట్టాతో నిల్చున్నా!
మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఎస్తర్... "దృశ్యం" సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. రెండు తెలుగు భాగాల్లోనూ తనే నటించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.జోక్ అనుకున్నా..కొన్నేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తుండగా నాన్న ఫోన్ చేశాడు. నేనో వ్యక్తిని కలిశాను.. అతడి కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో చదువుతోందట. నువ్వు ఓసారి ఆమెతో మాట్లాడకూడదూ.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఆ ఇన్స్టిట్యూట్కు వెళ్తావేమో అన్నాడు. ఏంటి నాన్న జోక్ చేస్తున్నావా? అన్నాను. కలలో కూడా అనుకోలేదుఎందుకంటే అక్కడ చదువుకోవడమనేది మామూలు విషయం కాదు. అసలు అక్కడికి వెళ్లి చదవాలని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న పిచ్చివాడు.. ఏవేవో అనవసరమైన కలలు కంటున్నాడు అని మనసులోని నవ్వుకున్నాను. కట్ చేస్తే.. ఆయన కూతురిగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎదుట గ్రాడ్యుయేషన్ పట్టాతో నిల్చున్నాను. నిజంగా జీవితం ఎంత విచిత్రమైనదో కదా!అంత స్థోమత ఎక్కడిది?నాకు లండన్లో సీటు వచ్చిందన్న విషయాన్ని మొదట వాళ్లకు చెప్పనేలేదు. ఎందుకంటే అక్కడ చదివించేంత స్థోమత మా వాళ్లకు లేదు. అప్పటికే నా ఇద్దరు సోదరుల కోసం స్టూడెంట్ లోన్స్ తీశారు. నా దగ్గర ఎలాగో అంత డబ్బు లేదు. ఎలాంటి గ్రాంట్లు, సహాయం లభించినా.. అది సరిపోదు. అందుకే అక్కడ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన విషయమే అనిపించింది.పేరెంట్స్ అండగాకానీ ఇంట్లో వాళ్లు నాకిదెంత ముఖ్యం అనేది మాత్రమే ఆలోచించారు. డబ్బు ఎలాగోలా సమకూరుస్తాం.. నువ్వెళ్లి చదువు పూర్తి చేయు అని చెప్పి పంపారు. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు చేసే పనికి వారిపై కోప్పడతాను. కానీ వాళ్లు మాత్రం పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు అది నాకు భయంగా ఉంటుంది. అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా మన తల్లిదండ్రులు పక్కనే నిలబడ్డందుకు సంతోషంగానూ ఉంటుంది.అదే అసలు కష్టంనేను కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు దోహదపడ్డ అమ్మానాన్నకు కృతజ్ఞతలు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ సో మచ్. గతవారం ఓ ఇంటర్వ్యూలో నేనేమన్నానంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చేరడం ఒక పెద్ద ఫెయిల్యూర్ అన్నాను. కానీ అది నిజం కాదు. అసలు అందులో ప్రవేశం పొందడం కష్టమైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులతో పోటీపడటం.. ముఖ్యంగా మనతో మనం పోటీపడటమే ఎక్కువ కష్టమైన పని. చాలా నేర్చుకున్నా..దీన్ని నేను అధిగమించాను, సాదించాను. అందుకు సంతోషంగా ఉంది. LSE నన్నెంతగానో మార్చేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, విషయాలను లోతుగా ఆలోచించడం.. ప్రతిదాన్ని భిన్న కోణాల్లో చూడటం.. ఇలా చాలా నేర్చుకున్నాను అని ఎస్తర్ (Esther Anil) రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కింద పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Esther (@_estheranil) చదవండి: తొలి మూవీకే చేదు అనుభవం.. డబ్బులివ్వకుండా..: నటి
‘శంబాల’ చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది
టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’.. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ మూవీ షూటింగ్లో కొన్ని సంఘటనలలో హీరో ఆది గాయపడ్డారని చిత్ర యూనిట్ పేర్కొంది.శంబాల మూవీని విజువల్ వండర్గా తీర్చి దిద్దే క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్లతో మేకర్లు ఆడియెన్స్ని అబ్బుర పరుస్తున్నారు. హీరోలు సైతం ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్ల్ని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటాయి. ఇక ‘శంబాల’ చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.‘శంబాల’ ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజ్కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. అన్ని రకాల బిజినెస్లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్లో ఉషా పిక్చర్స్ వంటి భారీ సంస్థలు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
బిగ్బాస్
#Demonpavan: పోరాడి గెల్చావ్.. అసలైన యోధుడివి
ఇమ్మూని ఆకాశానికెత్తిన బిగ్బాస్.. ఇది కదా జర్నీ అంటే!
నవ్వులపాలైన చోటే పవన్కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
నా కుటుంబం కన్నా తెలుగు ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ!: తనూజ
టాప్ 5 ఛాన్స్ మిస్.. భరణి ఎలిమినేషన్కు కారణాలివే!
నేనంత దుర్మార్గుడిని కాదు, నువ్వే కప్పు గెలవాలి: భరణి
అత్యధిక రెమ్యునరేషన్తో 'బిగ్బాస్' నుంచి భరణి ఎలిమినేట్..
ఇది సుమన్కు మాత్రమే సాధ్యం.. మళ్లీ జరగదు, జరగబోదు!
'బిగ్బాస్ తెలుగు 9' ప్రైజ్ మనీ ప్రకటించిన నాగార్జున
A to Z
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీ వచ్చేసి...
'స్ట్రేంజర్ థింగ్స్ 5' వాల్యూమ్ 2 ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సిరీస్ల్లో 'స్ట్ర...
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్లో విజయం దక్కించుకున్న థామా సినిమా ఓటీటీల...
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో హాలీవుడ్ మూవ...
ఆస్కార్ షార్ట్ లిస్ట్లో 'హోంబౌండ్'
ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధ...
ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ డియోల్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూ...
దురంధర్ క్రేజ్.. మూవీని వీక్షించిన టీమిండియా
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్ల...
ఇకపై కాంతార, ఛావా కాదు.. దురంధర్ పేరు రాసుకోండి..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట...
స్టార్ దర్శకుడు, భార్య అనుమానాస్పద మృతి!
హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ రాబ్ రైనర్, ఆయన సతీమణి ...
ఓటీటీల్లో వందలకొద్ది వెబ్ సిరీస్లు.. టాప్-10లో ఇండియాకు నో ప్లేస్!
ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్లకు కొదవే లేదు...
నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఢీల్.. మనకు 'సినిమా'నేనా..?
హాలీవుడ్కు పునాది లాంటి వార్నర్ బ్రదర్స్తో నెట్...
భారత్లో 'సూపర్ మ్యాన్'.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’ ఓటీటీలోకి రానుం...
8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ
తమిళసినిమా: ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగద...
ఓటీటీకి సంతాన ప్రాప్తిరస్తు.. ఓకేసారి రెండింటిలో రిలీజ్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన...
లిటిల్ హార్ట్స్ బ్యూటీ గ్లామరస్ లుక్.. సెల్ఫీ పోజులతో ఉప్పెన భామ కృతి శెట్టి!
మరింత హాట్హాట్గా లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని.....
డేవిడ్ రెడ్డి గ్లింప్స్.. అదంతా కల్కి బుజ్జి టీమ్ వాళ్లే: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న పీరియాడికల్ మూ...
ఫొటోలు
ఫుడ్.. షాపింగ్.. ఇంకేం కావాలంటున్న రెజీనా! (ఫోటోలు)
ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు.. ఈవెంట్ ఫోటోలు
ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు (ఫోటోలు)
'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్.. గ్లింప్స్ వేడుకలో యూనిట్ ( ఫోటోలు)
హీరోయిన్ రష్మిక.. గర్ల్స్ గ్యాంగ్తో శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)
హ్యాపీ బర్త్ డే మై హార్ట్బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)
తిరుమలలో నటి స్వాతి దీక్షిత్ (ఫోటోలు)
భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)
బాబీ సింహా,హెబ్బా పటేల్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
గాసిప్స్
View all
జైలర్ 2లో ఐటం సాంగ్!
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
దిగ్గజ గాయని బయోపిక్లో సాయిపల్లవి?
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు.. ‘స్పిరిట్’ కోసం అన్ని కోట్లా?
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
రివ్యూలు
View all
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
1.75
‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
2
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
సినీ ప్రపంచం
నటి బ్లౌజుపై వెకిలి కామెంట్.. హీరోలనూ వదల్లేదు!
ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.సినిమా ఈవెంట్స్లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...ఛీ కొట్టే ప్రశ్న'తెలుసు కదా' ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!హీరో మెటీరియల్ కాదా?దీనికంటే ముందు డ్యూడ్ సినిమా ప్రమోషన్స్లో కూడా.. ప్రదీప్ రంగనాథన్ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ అంటే అది హార్డ్ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్ కుమార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.బుద్ధి చెప్పిన మంచు లక్ష్మిహీరో మెటీరియల్ కాదని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్కు లింక్ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.స్లీవ్లెస్ బ్లౌజ్ గురించి వెకిలి కామెంట్ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.మీ బరువెంత?గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్ ఈవెంట్లో హీరోయిన్ గౌరీ కిషన్ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్మీట్లో ఓ విలేకరి.. హీరోయిన్కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే! మరి వీళ్లంతా వైరల్ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో!
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హర్షవర్ధన్ రాణే,సోనమ్ బాజ్వా జంటగా నటించిన చిత్రం ఏక్ దీవానే కీ దీవానీయత్'. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. దేశీ మూవీస్ ఫ్యాక్టరీ బ్యానర్పై అన్షుల్ గార్గ్, దినేష్ జైన్ నిర్మించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందని జీ5 అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో షాద్ రంధావా, సచిన్ ఖేడేకర్, అనంత్ నారాయణ్ మహాదేవన్, రాజేష్ ఖేరా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. దాంపత్య జీవితంలో భార్య, భర్తల మధ్య ఆధిపత్య ధోరణి, వాటివల్ల వచ్చే ఎదురయ్యే సమస్యల ఆధారంగా రూపొందించారు. This Holiday Season, har gulaab mein ishq dikhega, aur uske kaanton mein Ek Deewane Ki Deewaniyat! 🥀 #EkDeewaneKiDeewaniyat Premieres 26th December, only on #ZEE5#EkDeewaneKiDeewaniyatOnZEE5 pic.twitter.com/IYyhLPACda— ZEE5Official (@ZEE5India) December 18, 2025
'మనశంకర వరప్రసాద్ గారు'.. మేకింగ్ వీడియో చూశారా?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'మనశంకరవరప్రసాద్ గారు'. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాద సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. కేథరిన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.మూవీ రిలీజ్కు ఇంకా కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే మనశంకరవరప్రసాద్ గారు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్స్లో అంతా నవ్వుల సందడే కనిపిస్తోంది. ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చిరంజీవి హవాభావాలు, నయనతార నవ్వులు ఫ్యాన్స్ను అలరించేలా ఉన్నాయి.ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో సూపర్ హిట్ కోసం రెడీ అవుతున్నారు.
#Demonpavan: పోరాడి గెల్చావ్.. అసలైన యోధుడివి
బిగ్బాస్ ఫైనల్ వీక్ అంతా పిక్నిక్ హాలీడేలా సాగిపోతుంది. ఫైనలిస్టుల జర్నీ వీడియోలతో కాస్త ఎమోషనల్గానూ ఉంటుంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్లో ఇమ్మాన్యుయేల్ జర్నీ చూపించారు. నేడు తనూజ, పవన్ జర్నీ చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా పవన్ కోసం ఓ ప్రోమో వదిలారు.యోధుడిగా నిలబడ్డావ్'మీరు ఎవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం.. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. చెమటోడ్చి, చివరి వరకు పోరాడి గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా టాప్ 5లో నిలబడ్డారు' అని పొగిడాడు. సీజన్ అంతా తిట్టు పడ్డ పవన్.. ఎట్టకేలకు బిగ్బాస్ నోటితో పొగడ్తలు అందుకుని శెభాష్ అనిపించాడు. అతడి ఫుల్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే!
హీరోగా పెద రాయుడు బాలనటుడు ఎంట్రీ.. ఆసక్తిగా టీజర్
మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
నన్ను చదివించే స్థోమత లేదు, ఇప్పుడు పట్టాతో నిల్చున్నా!
మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఎస్తర్... "దృశ్యం" సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. రెండు తెలుగు భాగాల్లోనూ తనే నటించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.జోక్ అనుకున్నా..కొన్నేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తుండగా నాన్న ఫోన్ చేశాడు. నేనో వ్యక్తిని కలిశాను.. అతడి కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో చదువుతోందట. నువ్వు ఓసారి ఆమెతో మాట్లాడకూడదూ.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఆ ఇన్స్టిట్యూట్కు వెళ్తావేమో అన్నాడు. ఏంటి నాన్న జోక్ చేస్తున్నావా? అన్నాను. కలలో కూడా అనుకోలేదుఎందుకంటే అక్కడ చదువుకోవడమనేది మామూలు విషయం కాదు. అసలు అక్కడికి వెళ్లి చదవాలని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న పిచ్చివాడు.. ఏవేవో అనవసరమైన కలలు కంటున్నాడు అని మనసులోని నవ్వుకున్నాను. కట్ చేస్తే.. ఆయన కూతురిగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎదుట గ్రాడ్యుయేషన్ పట్టాతో నిల్చున్నాను. నిజంగా జీవితం ఎంత విచిత్రమైనదో కదా!అంత స్థోమత ఎక్కడిది?నాకు లండన్లో సీటు వచ్చిందన్న విషయాన్ని మొదట వాళ్లకు చెప్పనేలేదు. ఎందుకంటే అక్కడ చదివించేంత స్థోమత మా వాళ్లకు లేదు. అప్పటికే నా ఇద్దరు సోదరుల కోసం స్టూడెంట్ లోన్స్ తీశారు. నా దగ్గర ఎలాగో అంత డబ్బు లేదు. ఎలాంటి గ్రాంట్లు, సహాయం లభించినా.. అది సరిపోదు. అందుకే అక్కడ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన విషయమే అనిపించింది.పేరెంట్స్ అండగాకానీ ఇంట్లో వాళ్లు నాకిదెంత ముఖ్యం అనేది మాత్రమే ఆలోచించారు. డబ్బు ఎలాగోలా సమకూరుస్తాం.. నువ్వెళ్లి చదువు పూర్తి చేయు అని చెప్పి పంపారు. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు చేసే పనికి వారిపై కోప్పడతాను. కానీ వాళ్లు మాత్రం పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు అది నాకు భయంగా ఉంటుంది. అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా మన తల్లిదండ్రులు పక్కనే నిలబడ్డందుకు సంతోషంగానూ ఉంటుంది.అదే అసలు కష్టంనేను కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు దోహదపడ్డ అమ్మానాన్నకు కృతజ్ఞతలు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ సో మచ్. గతవారం ఓ ఇంటర్వ్యూలో నేనేమన్నానంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చేరడం ఒక పెద్ద ఫెయిల్యూర్ అన్నాను. కానీ అది నిజం కాదు. అసలు అందులో ప్రవేశం పొందడం కష్టమైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులతో పోటీపడటం.. ముఖ్యంగా మనతో మనం పోటీపడటమే ఎక్కువ కష్టమైన పని. చాలా నేర్చుకున్నా..దీన్ని నేను అధిగమించాను, సాదించాను. అందుకు సంతోషంగా ఉంది. LSE నన్నెంతగానో మార్చేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, విషయాలను లోతుగా ఆలోచించడం.. ప్రతిదాన్ని భిన్న కోణాల్లో చూడటం.. ఇలా చాలా నేర్చుకున్నాను అని ఎస్తర్ (Esther Anil) రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కింద పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Esther (@_estheranil) చదవండి: తొలి మూవీకే చేదు అనుభవం.. డబ్బులివ్వకుండా..: నటి
‘శంబాల’ చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది
టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’.. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ మూవీ షూటింగ్లో కొన్ని సంఘటనలలో హీరో ఆది గాయపడ్డారని చిత్ర యూనిట్ పేర్కొంది.శంబాల మూవీని విజువల్ వండర్గా తీర్చి దిద్దే క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్లతో మేకర్లు ఆడియెన్స్ని అబ్బుర పరుస్తున్నారు. హీరోలు సైతం ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్ల్ని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటాయి. ఇక ‘శంబాల’ చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.‘శంబాల’ ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజ్కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. అన్ని రకాల బిజినెస్లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్లో ఉషా పిక్చర్స్ వంటి భారీ సంస్థలు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
ఫస్ట్ సినిమా.. డబ్బులివ్వలేదు, దారుణంగా చూశారు
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. 2005లో వచ్చిన కామెడీ ఫిలిం 'వాహ్ లైఫ్ ఓతో ఐసీ'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక సినిమాలు, సిరీస్లు చేసింది. రెండు దశాబ్దాలుగా టాలెంటెడ్ నటిగా సినీరంగంలో రాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.చేదు అనుభవంరాధికా ఆప్టే మాట్లాడుతూ.. అందరూ తమ ఫస్ట్ సినిమా గురించి మంచిగా చెప్పుకుంటారు. కానీ, నాకు మాత్రం నా ఫస్ట్ మూవీ భయానక అనుభవాలనే పంచింది. నిర్మాత (సంగీత అహిర్) నాకు సరైన వసతి కల్పించలేదు, డబ్బులివ్వలేదు. నేను, అమ్మ.. వారిని సినిమా రెమ్యునరేషన్కు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాం.దారుణంగా..కానీ, వాళ్లేమో.. ఊర్మిళ వంటి పెద్ద నటియే ఏ హామీ అవసరం లేదంది.. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అని దాటవేశారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం చాలా దారుణంగా ట్రీట్ చేశారు. అందుకే నా ఫస్ట్ సినిమాను ఎప్పుడూ మర్చిపోవాలనుకుంటాను అని తెలిపింది..ఆయనే న్యాయ నిర్ణేతసినిమాలో తొలి అవకాశం ఎలా వచ్చిందన్నదాని గురించి మాట్లాడుతూ.. నేను బ్రెయిన్ సర్జన్ అనే నాటకం వేశాను. మా టీమ్కు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. అయితే మాకు అవార్డు ఇచ్చిన జడ్జి టీమ్లో దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఉన్నారు. నాటకం అయిపోయిన వెంటనే నన్ను పిలిచి సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అలా ఆయన డైరెక్షన్లోనే తెరంగేట్రం చేశాను. చూస్తుండగానే 20 ఏళ్లు గడిచిపోయాయి అని నటి చెప్పుకొచ్చింది.సినిమాలురాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, మరాఠి, బెంగాలీ, తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. మేడ్ ఇన్ హెవెన్, సేక్రెడ్ గేమ్స్, ఓకే కంప్యూటర్ వంటి వెబ్ సిరీస్లలోనూ నటించింది. చివరగా సాలి మొహబ్బత్ అనే థ్రిల్లర్ సినిమాలో కనిపించింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.చదవండి: భార్యకు విడాకులిచ్చిన దేవి నటుడు
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం
గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. అయితే, ముఖ్యంగా గోదారి గట్టున ఉన్న నిద్ర గన్నెరు చెట్టు చాలామందికి సెంటిమెంట్గా ఉండేది. అయితే, గతేడాది వర్షాలకు అది కూలిపోయింది.300 సినిమాలుకొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి.కూలిపోయిన చెట్టు.. దర్శకుడు వంశీ భావోద్వేగంసితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి–గోపిక–గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చెట్టు కూలిపోయిందని తెలియగానే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వెళ్లారు. కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు. చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్లు రాలేదన్నారు.చిగురించిన చెట్టుచెట్టు కూలిపోవడంతో చాలామంది బాధపడ్డారు. ఇక ఆ చెట్టు మళ్లీ చిగురించదని అందరూ భావించారు. అయితే, అక్కడి యువకులు మాత్రం ఆ చెట్టును ఎలాగైనా బతికించాలని అనుకున్నారు. అందుకోసం వారికి తోచిన పద్ధతులను అనుసరించారు. ఎట్టకేలకు ఎవరూ ఊహించలేని విధంగా ఆ చెట్టు మళ్లీ చిగురించింది. ప్రస్తుతం గోదారి గట్టుపై ఉన్న నిద్రగన్నేరు చెట్టు పూర్తిగా ఆకులతో కళకళలాడుతూ కనిపించడంతో స్థానికులు ఫోటోలు తీసి సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు.
శ్రీలీల చేతులు జోడించింది.. ఇకనైనా మారండ్రా బాబూ!
ఆంధ్రప్రదేశ్లో గతేడాది తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఉదంతం ఎవ్వరూ మరిచిపోలేరు. తన కుటుంబానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన సాయం గురించి బహిరంగంగా చెప్పుకోవడమే ఆమె చేసుకున్న పాపమైంది. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా మారిన కొందరు మార్ఫింగ్ ఫోటోలతో.. నీచమైన పోస్టులు పెట్టడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరో ఉదంతంలో.. జగన్ టైంలో కాకినాడ జిల్లా బెండపూడి స్టూడెంట్ మేఘన అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓర్చుకోలేకపోయారు. అక్కడ మేఘన తల్లిదండ్రులు గట్టిగా నిలబడడంతో.. ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు.. తాజాగా నటి శ్రీలీల చేసిన ఓ పోస్ట్కి.. పై రెండు ఉదంతాలకూ ఓ కనెక్షన్ ఉందనే విషయం మీకు తెలుసా?.. శ్రీలీల ఏం చెప్పిందంటే.. సోషల్ మీడియా వినియోగదారులు అసభ్యతతో కూడిన ఏఐ జనరేటెడ్ వీడియోలను ప్రోత్సహంచవద్దని ఆమె కోరింది. గీతాంజలి లాంటి ఘటనలు జరగకూడదనే చేతులు జోడించి శ్రీలీల కోరింది. చేతిలో ఫోన్ ఉంది కదా అని మీరు పెట్టే ఒక చెత్త కామెంట్కు ఎంతమంది నలిగిపోతుంటారు. ఇలాంటి ఉదంతాలు చూసైనా సరే కాస్త మారండి రా బాబు అనేలా శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ ఉంది. సోషల్మీడియాలో ట్రోల్స్కు దిగుతున్న వారిని చేతులు జోడించి ఆమె అభ్యర్థించింది. టెక్నాలజీని మంచి కోసం మాత్రమే వాడాలని శ్రీలీల కోరింది. అసభ్యత కోసం వాడి ట్రోలింగ్కు దిగకండి అని పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగి అయి ఉంటారని గుర్తుచేసింది. ఆన్లైన్లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకండి అంటూ శ్రీలీల పేర్కొంది.మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది టార్గెట్ చేస్తుంది మహిళలనే.. వీటికిసంబంధించిన కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, సినీ నటి అనసూయ, జర్నలిస్టు తులసీచందు, సింగర్ చిన్మయి, హీరోయిన్ రష్మిక, నివేధా, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే నెట్టింట ట్రోలింగ్కు గురైన మహిళల జాబితా చాలా పెద్దగానే ఉంది. నేటి సమాజంలో ప్రతి మహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ.. ఎవరూ చదవలేని రీతిలో కామెంట్లు చేస్తున్నారు.ట్రోల్స్ వెనుక ఎవరు..?.. ఫోటో మార్ఫింగ్ల బారిన పడుతుంది హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, విద్యార్థిణులు యాంకర్స్, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇలా ఒక వర్గం అని చెప్పేందుకు లేదు. చివరకు గృహిణులు కూడా ట్రోలింగ్తో పాటు ఏఐ మార్ఫింగ్ ఫోటోల దాడిలో నలిగిపోతున్నారు. అందుకే శ్రీలీల కూడా ఈ అంశం గురించి పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగిగా ఉంటారనే అంశాన్ని ట్రోలర్స్ మరిచిపోతున్నారని ఆమె పేర్కొంది. ఏఐ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి ట్రోల్స్ వెనుక దాగివున్నది ఎవరినేది చెప్పడం చాలా కష్టం వీరిపై కేసులు పెట్టినా సరే పట్టుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వారందరూ ఎక్కువగా ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025
సినిమా
జపాన్ లో పుష్ప రచ్చ రచ్చ..
పాన్ ఇండియాకి వణుకు పుట్టే కాంబినేషన్
ఎంత పనైంది..? అవతార్ 3కి బిగ్ షాక్..
వారిద్దరిది లవ్ కాదు
అమ్మ, నాన్నల తరపున ANR కళాశాలకు నాగార్జున భారీ విరాళం
జైలర్ 2.. కావాలయ్యా 2.0 మాస్ అప్డేట్!
చికిరి చికిరి 100M వ్యూస్..
మరో వివాదంలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి
ఎన్టీఆర్ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ అదిరిపోయే స్కెచ్
దీపికా కంటే ప్రియాంక మరీ.. అందుకే కల్కి 2లో..!
