Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Anaganaga Australia Lo Movie OTT Streaming Update1
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా

ఈ వారం ఓటీటీల్లోకి పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఓం శాంతి శాంతి శాంతిః, దేవగుడి, వంచన తదితర చిత్రాలు ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి రాగా.. మరికొన్ని మూవీస్ వీకెండ్‌లో అందుబాటులోకి రానున్నాయి. వాటిలో గాంధీ టాక్స్, కృష్ణ సదా సహాయతే, విత్ లవ్, తన్వి ది గ్రేట్ తదితర సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు థ్రిల్లర్ చేరింది. దాదాపు ఏడాది తర్వాత ఇది స్ట్రీమింగ్‌లోకి వస్తోంది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోహీరోయిన్లు నిర్మాతలు వస్తూనే ఉంటారు. అలా తీసిన ఓ సినిమా 'అనగనగా ఆస్ట్రేలియాలో'. జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తారకరామ దర్శకత్వం వహించారు. పేరుకు తగ్గట్లే పూర్తిగా ఆస్ట్రేలియాలోనే తీసిన ఈ మూవీ గతేడాది మార్చి 21న థియేటర్లలోకి వచ్చింది. అందరూ కొత్త నటీనటులే కావడంతో ఇదొకటి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడీ చిత్రం ఆహా ఓటీటీలోకి శుక్రవారం (మార్చి 06) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'అనగనగా ఆస్ట్రేలియాలో' విషయానికొస్తే.. హీరో (జ్యోతినాథ్) ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్‌గా చేస్తుంటాడు. హీరోయిన్(సాన్య భట్నాగర్) అక్కడే చదువుకుంటూ ఉంటుంది. మరోవైపు భారత్‌లో ఓ రాజకీయ నేత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పుడు.. ఆస్ట్రేలియా నుంచి ఒకరు ఫోన్ చేసి మీ రహస్యం నా దగ్గరుందని చెప్పి భయపెడతాడు. దీని పని తేల్చాలని సదరు నాయకుడు.. ఓ కిల్లర్‌కి అప్పజెబుతాడు. ఓ రోజు అనుకోకుండా ఆ రహస్యం హీరోయిన్ చేతిలో పడుతుంది. దీంతో కిల్లర్, రాజకీయ నాయకుడు.. ఈ అమ్మాయి వెంట పడతారు. తర్వాత ఏమైంది? మరి హీరోహీరోయిన్ ప్రేమకథ సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఉ‍స్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్‌కి ముందు భారీ మార్పులు?)

Actress Rambha Re Entry With Tamil Movie2
16 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న అందాల భామ

1990 ప్రాంతంలో కురక్రారు కంటికి నిద్ర కరువు చేసిన నటి రంభ. ఈమె నడక చూడడానికే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఈ పదహారు అణాల తెలుగు భామ ఎనిమిది భాషల్లో మొత్తం 100కుపైగా చిత్రాల్లో కథానాయికిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో కథానాయకిగా పరిచయమై , ఆ వెంటనే. మాతృభాషలో (తెలుగు) ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అంతే ఆ తరువాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటి అవసరం రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, బోజ్‌పురి ఇలా ఎనిమిది భాషల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, వెంకటేశ్‌ వంటి స్టార్‌ హీరోలు, అదేవిధంగా తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, కార్తీక్, అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టారు. నిర్మాతగాను అవతారమెత్తిన ఈమె కొన్ని టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. కథానాయకిగా ఫుల్‌ఫామ్‌లో ఉండగా ఇంద్రకుమార్‌ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు. వీరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా వివాహం తరువాత నటనకు దూరంగా ఉన్న రంభ 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నటిగా రీఎంట్రీ కావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల చెన్నైకి చేరుకున్న ఈ భామ సినిమాల్లో అవకాశాల వేట మొదలుపెట్టారు. అందుకుగాను 49 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ శారీరక వ్యాయామాలు చేసి బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకున్నారు. సినిమా అవకాశాలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండకుండా బుల్లి తెర కార్యక్రమంలో పాల్గొంటూ దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొత్తం మీద తెలుగు, తమిళం భాషల్లో ఒక్కో అవకాశం సంపాదించినట్లు తాజా సమాచారం. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అలా అందాల భామ రీఎంట్రీ షురూ అయింది అన్నమాట.

Ayesha Khan was Replaced from Song for Being Fat, revealed Receiving Rape Threats Daily3
నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్‌ నటి

ధురంధర్‌ సినిమాలో యాక్ట్‌ చేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో షరారత్‌ అంటూ సాగే ఐటం సాంగ్‌లోనూ అదిరిపోయే స్టెప్పులతో అలరించి ఫేమ్‌ తెచ్చుకుంది ఆయేషా ఖాన్‌. అయితే గతంలోనూ ఓ సాంగ్‌లో కనిపించాల్సిందని, కానీ లావుగా ఉన్న కారణంతో తనను రిజెక్ట్‌ చేశారని చెప్తోంది. సడన్‌గా తీసేశారుతాజాగా ఓ ఈవెంట్‌లో ఆయేషా ఖాన్‌ మాట్లాడుతూ.. టీ సిరీస్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన ఓ పాటలో నేను సెకండ్‌ హీరోయిన్‌గా చేయాల్సింది. అప్పుడు నేను పన్నెండో తరగతి చదువుతున్నాను. తెల్లారితే షూటింగ్‌ అనగా రాత్రికి రాత్రే నన్ను తీసేశారు. నేను లావుగా ఉన్నానని సాకు చూపించారు. నిజంగా బాధాకరంఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో నా శరీరం గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేను స్కర్ట్‌ వేసుకున్నా, కుర్తా ధరించినా.. ఎలాంటి దుస్తులు ధరించినా తప్పుపడుతూనే ఉంటారు. ఏది పోస్ట్‌ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇది నిజంగా బాధాకరం. ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నచ్చింది పోస్ట్‌ చేయాలనిపిస్తుంది. కానీ వాళ్లు హద్దులు దాటి మరీ కామెంట్స్‌ చేస్తారు.ఫేమస్‌ కాకపోయుంటే..అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు. ఈ బెదిరింపులు నాకు రోజూ వస్తాయి. ఇలాంటి మనుషుల మధ్య ఉన్నందుకు భయంగా ఉంది. ఇలాంటివాళ్లకు ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలన్నంత కోపం వస్తుంది. వాళ్లనే మాటలు కొన్నిసార్లు నా గాయాలను గుర్తు చేస్తాయి. నేను ఇంత ఫేమస్‌ కాకపోయుంటే నిజంగానే అన్నంత పని చేసేవారేమో అని భయమేస్తుంది అని ఆయేషా చెప్పుకొచ్చింది.సినిమాసీరియల్స్‌లో చిన్నాచితకా పాత్రలు చేసింది ఆయేషా ఖాన్‌. హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ముఖచిత్రం మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఓం భీమ్‌ బుష్‌, మనమే సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించింది. హిందీలో జాట్‌, కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌ 2 సినిమాలు చేసింది.చదవండి: విజయ్‌- రష్మిక.. ఎవరు ప్రపోజ్‌ చేశారంటే?

Thaman Works Ustaad Bhagat Singh Movie And Release Date Preponed 4
'ఉ‍స్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్‌కి ముందు భారీ మార్పులు?

టాలీవుడ్ నుంచి ఈ నెలలో రాబోతున్న భారీ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. మార్చి 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. విడుదలకు మరో 20 రోజుల మాత్రమే సమయముంది. సరిగ్గా ఈ సమయంలో కొన్ని భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు: శివాజీ)'గబ్బర్ సింగ్' కాంబో రిపీట్ చేస్తూ పవన్-హరీశ్ శంకర్ మరోసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. తొలుత 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తమిళ మూవీ 'తెరి'కి ఇది రీమేక్ అని అన్నారు. కానీ తర్వాత తర్వాత టైటిల్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అని మారినా సరే రీమేక్ రూమర్స్ మాత్రం ఆగలేదు. దర్శకుడు, మూవీ టీమ్ ఎంతలా ఇది రీమేక్ కాదు బాబోయ్ అని అంటున్నా జనాలు, అభిమానులు కూడా ఎందుకో నమ్మట్లేదు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజయ్యాయి. వీటిలో ఒకటి ఆకట్టుకోగా.. రెండోది దారుణంగా నిరాశపరిచింది. ఇకపోతే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవికి బదులు తమన్ పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు కొన్ని వైరల్ అవుతున్నాయి. అలానే మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' వాయిదా పడడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని 'ఉస్తాద్..' టీమ్ భావిస్తోంది. అనుకున్నట్లు 26న కాకుండా ఓ వారం ముందుకు జరిగి 19వ తేదీన తమ సినిమాని రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ అండ్ టీమ్ అనుకుంటున్నారట. మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది ఒకటి రెండు రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?)

Actor Sivaji About His Real Estate Business Latest Interview5
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు

పదిహేను ఇరవైళ్ల క్రితం హీరో, విలన్, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ.. తర్వాత చాన్నాళ్ల పాటు తెరపై కనిపించలేదు. రాజకీయాలు, బిజినెస్ అంటూ వ్యక్తిగత విషయాల్లో బిజీ అయిపోయాడు. ఎప్పుడైతే బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు. 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తాను గతంలో చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చెబుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో ఛాన్స్.. వెరైటీ బూతులతో నన్ను తిట్టారు)'నేను సినిమాలకు దూరమైన తర్వాత జీవనాధారం కోసం స్థలాలు కొని అమ్మడం చేసేవాడిని. అలా యాదగిరిగుట్టలో రూ.70 వేలకు కొని ఒక్కొ ఎకరం రూ.9 లక్షలకు విక్రయించాను. తర్వాత ఆ స్థలం ధర చాలా పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనూ 18 ఎకరాలు కొని తక్కువ లాభానికి అమ్మేశాను. అక్కడ ఇప్పుడు ఒక్కో ఎకరం రూ.100 కోట్లు పలుకుతోంది. అంటే రూ.1800 కోట్లు. ఒక్క ఎకరం అయినా ఉంచుకోవాల్సింది అని నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను' అని శివాజీ అన్నాడు.రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొని అమ్మేయడం మామూలే అని, ఇప్పటి రేట్లు చూసి నష్టపోయామని అనుకోవడానికి వీల్లేదని కూడా శివాజీ చెప్పుకొచ్చాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఇందులో శివాజీకి జోడీగా లయ నటించింది. బాలనటుడు రోహన్ మరో కీలక పాత్ర చేశాడు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?)

Vijay Deverakonda Reveals Who Proposed First6
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు నూతన గృహప్రవేశం కూడా చేశారు. తర్వాత గ్రామ ప్రజలందరికీ భోజనాలు కూడా విజయ్ పెట్టించాడు. ఈ సందర్భంగానే తన నియోజకవర్గంలలోని 9,10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు స్కాలర్‌షిప్స్ ఇస్తాం, తమ్ముడు ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తామని తదితర విషయాలు పంచుకున్నాడు. ఇప్పుడు తమ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో విజయ్ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)సొంతూరి నుంచి తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసిన విజయ్-రష్మిక.. ఈ రోజు(మార్చి 04) సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇచ్చే రిసెప్షన్‌లో పాల్గొనున్నారు. అంతకు ముందు అనగా మంగళవారం దాదాపు 200 మంది అభిమానులతో కలిసి బంతి భోజనం చేశారు. ఈ సందర్భంగానే పలు విషయాలు మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ.. 'గీతగోవిందం' చేస్తున్నప్పుడు తాము స్నేహితులు మాత్రమేనని, 'డియర్ కామ్రేడ్' చేస్తున్న టైంలో తమ మధ్య ప్రేమ పుట్టిందని, తర్వాత కొన్నాళ్లకు రష్మికనే తనకు లవ్ ప్రపోజ్ చేసిందని విజయ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'గీతగోవిందం'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. 'డియర్ కామ్రేడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ చాలామంది విరోష్ ఫ్యాన్స్‌కి ఇది ఫేవరెట్. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ప్రస్తుతం 'రణబాలి'లో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోతున్న మూవీ ఇదే. ఈ ఏడాది సెప్టెంబరు 11న పాన్ ఇండియా రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తీస్తున్నారు.(ఇదీ చదవండి: విరోష్‌... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్‌ సెట్టర్‌..)Star couple #VijayDeverakonda and #Rashmika arranged banthi bojanalu for 200 of their fans.Served them and had lunch together.👌A special day for all🫶🏽#Virosh pic.twitter.com/ZGUPWMdY5o— Suresh PRO (@SureshPRO_) March 3, 2026

Virosh Wedding Set is a trend setter in celebrity weddings7
విరోష్‌... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్‌ సెట్టర్‌..

ఈ సంవత్సరంలో టాప్‌ హై ప్రొఫైల్‌ సెలబ్రిటీ ఈవెంట్‌ గా విజయ్‌ దేవరకొండ, రష్మిక ల వివాహం ‘ విరోష్‌’ను సినీ పండితులు అభివర్ణిస్తున్నారు అయితే అంతకు మించి విరోష్‌ అర్థవంతమైన వేడుకగా కూడా నిలుస్తోంది. ఇది సెలబ్రిటీ వేడుకలలో మనం ఇకపై చూడబోయే సరికొత్త సంప్రదాయాలకు నాందిగా మారనుంది.స్టార్స్‌లో అరుదుగా కనిపించే మానవత్వాన్ని ప్రదర్శించిన ఈ జంట తమ ఆనందాన్ని ప్రైవేట్‌ ఉత్సవాలకు మించి విస్తరించారు, తమ ప్రయాణంలో తమకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరితో తమ ఆనందాన్ని పంచుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న నవదంపతులకు అందరూ కానుకలు ఇవ్వడం రివాజు. అయితే దీనికి భిన్నంగా ఈ జంట... నిరుపేదలకు తామే కానుకలు పంచి మనసులు గెలుచుకున్నారు.నోరు తీపి చేశారు..గత మార్చి 1న, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్‌తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్‌ బాక్స్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కస్టమ్‌–డిజైన్డ్‌∙కవర్లతో ప్యాక్‌ చేసిన స్వీట్‌ బాక్స్‌లు, కీలకమైన నగరాల మీదుగా అందంగా అలంకరించిన ట్రక్కుల ద్వారా పంపిణీ చేశారు, ప్రత్యేకంగా రూపొందించిన ‘‘వి అండ్‌ ఆర్‌’ ’ టీ–షర్టులు టోపీలు ధరించిన ఆన్‌–గ్రౌండ్‌ బృందాలు ప్రజలకు వ్యక్తిగతంగా స్వీట్లు అందించాయి, ఇది ఓ ప్రైవేట్‌ వేడుక ను పబ్లిక్‌ ఫెస్టివల్‌గా మార్చింది. అంతేకాకుండా ప్రతి స్వీట్‌ బాక్స్‌లో క్యుఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు, దీనిని స్కాన్‌ చేసి నేరుగా నవదంపతులకు ఆశీర్వాదాలు కూడా పంపవచ్చు.ఆలయాల్లో... అన్నదానం...అదే సమయంలో, అన్నదానం – ఆహారాన్ని పవిత్రంగా సమర్పించడం – భారతదేశంలోని అనేక దేవాలయాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సేవ... ఆ దేవుళ్ల ఆశీర్వాదాలను కోరుతూనే తమ వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే రష్మిక విజయ్‌ ల ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతుంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్‌ వంటివి ఉన్నాయి.తమ వివాహాన్ని ఒక ఖరీదైన వేదికకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు విస్తరించడం ద్వారా, ప్రముఖుల వివాహ వేడుక అర్ధాన్ని ఈ జంట పునర్నిర్వచించారు. ఇది కేవలం ఇద్దరు తారల మధ్య కలయిక మాత్రమే కాదు, సామూహిక ఆనందంతో మేళవించిన జాతీయ అనుభవంగా మార్చారు. నేషనల్‌ క్రష్‌ అనే బిరుదును ఆనందించడం మాత్రమే కాదు ఆ స్థాయి ఇచ్చిన వాళ్లను గుర్తుంచుకోవడం కూడా తనకు తెలుసని విజయ్‌ తోడుగా రష్మిక తెలియజెప్పారు. ‘ఈ దేశంలోని అందరు అందమైన ప్రజలకు, మీరు ఎల్లప్పుడూ మా ప్రయాణాలలో మా ప్రేమలో భాగమయ్యారు. మీ అందరికీ సన్నిహితంగా మా వివాహాన్ని జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంటుంది’’ అంటూ వీరు సోషల్‌ మీడియాలో ఇచ్చిన తమ వివాహ ప్రకటన రికార్డులను బద్దలు కొట్టింది, ఆసియాలో అత్యధికులు లైక్‌ చేసిన పోస్ట్‌గా విరాట్‌ కోహ్లీ గత రికార్డును అధిగమించింది.విద్యాదానం...తెలంగాణలోని తుమ్మన పేటలో విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లను ఈ విరోష్‌ జంట ప్రకటించారు. పెళ్లి తర్వాత నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట డివిజన్‌లోని విజయ్‌ స్వస్థలాన్ని ఈ జంట సందర్శించారు, నిరుపేదలకు విద్యాదానం చేయడానికి తమ వంతు సాయం అందించారు.దేవరకొండ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అందించిన ఈ స్కాలర్‌షిప్‌లు, ఈ ప్రాంతంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న టీనేజర్లకు సహాయం చేయడం వారి చదువును కొనసాగించడానికి ప్రోత్సహించడం, ముఖ్యంగా వారు కీలకమైన పాఠశాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారికి ఆసరాగా నిలవడం ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం.తరచుగా ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి కోసం తమ వంతు సాయం చేస్తామ ని ఈ సందర్భంగా ఈ జంట జనం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. స్కాలర్‌షిప్‌ కార్యక్రమం ప్రత్యేకతలను వివరిస్తూ, విజయ్‌ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు జనంలో నుంచి వచ్చిన హర్షాతిరేకాలకు విజయ్‌ దేవరకొండ తల్లి మాధవి పొంగిపోయారు. మరి ఇది కదా పుత్రోత్సాహం అంటే... మార్చి 4న హైదరాబాద్‌లో ఈ జంట రిసెప్షన్‌ వేడుక నిర్వహించనుంది. మరోవైపు సెప్టెంబర్‌లో విడుదల కానున్న ’రణబాలి’ చిత్రంలో రష్మిక విజయ్‌ ఇద్దరూ కలిసి కనిపించనున్నారు. గీత గోవిందం తర్వాత ఇది వారి మూడవ చిత్రం కాగా పెళ్లి తర్వాత వీరు కలిసి నటించిన తొలి చిత్రం కానుంది. తారలంటే తెరమీద నుంచి ఆనందం పంచేవారు మాత్రమే కాదు తమను ఆదరించిన సమాజానికి కృతజ్ఞత పంచేవారు కూడా అని నిరూపించిన వీరిద్దరికీ ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని ఉండాలని కోరుకుందాం.

Srinath Maganti Talk About Mension House Mallesh8
నేను పక్కా తెలుగు యాక్టర్‌ని : శ్రీనాథ్‌ మాగంటి

శ్రీనాథ్‌ మాగంటి హీరోగా బాల సతీష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెన్షన్‌ హౌస్‌ మల్లేష్‌’. ఇందులో గాయత్రీ రమణ, సాయి కామాక్షీ భాస్కర్ల హీరోయిన్లుగా నటించారు. రాజేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనాథ్‌ మాగంటి మాట్లాడతూ– ‘‘ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నప్పటికీ సబ్జెక్ట్‌ యూనివర్సల్‌. దారి తప్పిన మల్లేష్‌ (హీరో పాత్ర) అనే పొగరుబోతుని అతని తల్లి, భార్య కలిసి ఎలా దారిలోకి తీసుకొస్తారన్నదే ఈ సినిమా కథ. ఈ విషయాన్నే సరదాగా చెప్పా. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకునే సినిమా ఇది. సతీష్‌గారు మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. నిర్మాత రాజేష్‌గారు ఈ సినిమాలో నటించడంతోపాటు కొన్ని డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రంలో నటించిన హరి హార్ట్‌ ఎటాక్‌ కారణంగా చనిపోయారు. అయితే తన పాత్ర చిత్రీకరణ అప్పటికే పూర్తయింది. ఈ సినిమా రూపంలో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. ఇక ఈ సినిమాతో యాక్టర్‌గా నన్ను నేను కొత్తగా స్క్రీన్‌పై చూపించుకోవడానికి ఒక చాన్స్‌ లభించింది. అందుకే మల్లేష్‌ క్యారెక్టర్‌ కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను. ‘హిట్, యానిమల్, లక్కీభాస్కర్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించాను. కానీ కొందరు ప్రేక్షకులు నన్ను పరభాషా నటుణ్ణి అనుకుంటున్నారు. నేను పక్కా తెలుగు యాక్టర్‌ని. ఈ సినిమాతోనైనా తెలుగు ప్రేక్షకులు నా పేరు గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సందీప్‌ రెడ్డి వంగాగారు మా సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్‌’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు. మా సినిమాను థియేటర్స్‌లో చూస్తానని చెప్పారు. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్‌’ చిత్రంలో నటిస్తున్నాను. సోలో హీరోగా కొన్ని కథలు వింటున్నాను’’ అని తెలిపారు.

Srinath Maganti Reveals ENE 2 Movie Opportunity9
ఆ సినిమాలో ఛాన్స్.. వెరైటీ బూతులతో నన్ను తిట్టారు

తెలుగులో సర్‌ప్రైజ్ హిట్స్ అయిన సినిమాల్లో 'ఈ నగరానికి ఏమైంది?' ఒకటి. తరుణ్ భాస్కర్ తీసిన ఈ చిత్రం నలుగురు స్నేహితులు, వాళ్ల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తీశారు. ఇప్పటికే చాలామంది యూత్‌కి ఇది ఫేవరెట్ మూవీ. ప్రస్తుతం దీని సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇందులోని లీడ్ రోల్స్‌లో ఒకడైన సుశాంత్ తప్పుకోవడం శ్రీనాథ్ మాగంటికి అవకాశమొచ్చింది. అయితే ఈ విషయం బయటకు రాగానే తనని వెరైటీ వెరైటీ బూతులతో దారుణంగా తిట్టారని శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి)''ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌లో నన్ను తీసుకున్నారని అనగానే.. మెసేజులు కొన్ని వచ్చాయి. అసలు ఇట్లా తిడతారేందిరా మీరు. క్యారెక్టర్లు చేసుకుంటున్నావ్ పోయి అది చేసుకో. వెరైటీ వెరైటీ బూతులతో నన్ను తిట్టారు. దీంతో ఎదుటి మనిషి అవకాశాన్ని పాలిటిక్స్ వాడి గుంజేసుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. నాకు అవకాశమొచ్చింది. ఇది నేను మీకు ఎలారా చెప్పాలి అని అనుకున్నా' అని శ్రీనాథ్ మాగంటి చెప్పుకొచ్చాడు.మరో ఆరు రోజులు షూటింగ్ చేస్తే ఫస్టాఫ్ పూర్తయిపోతుందని చెప్పిన శ్రీనాథ్.. అసలు సెట్‌లో పనిచేస్తున్నామా పార్టీ చేసుకుంటున్నామా అర్థం కాదని కూడా అన్నాడు. అలా ఫ్లోలో వెళ్లిపోతూ ఉంటుంది బండి, అంత సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. హీరోగానే కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. హిట్, యానిమల్, లక్కీ భాస్కర్ తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన 'మెన్షన్ హౌస్ మల్లేష్' మూవీ.. ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగానే ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఈ నగరానికి ఏమైంది 2' సంగతులు చెప్పాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా)

Annagaru Vostaru Movie Telugu Version Streaming Update 10
అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి

తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లే ఇతడి సినిమాలు రెండు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. అయితే గత చిత్రం మాత్రం కేవలం తమిళం వరకే పరిమితమైంది. దానికి చాలానే కారణాలున్నాయి. ఈ మూవీ అటు థియేటర్లలో రిలీజైంది. ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ మళ్లీ ఎందుకు ఓటీటీలో విడుదల చేస్తున్నారు? ఏమైంది?(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)దాదాపు రెండు మూడేళ్లుగా సెట్స్‌పై ఉన్నకార్తీ సినిమా 'వా వాతియర్'. లెక్ ప్రకారం గతేడాది డిసెంబరు 5నే రిలీజ్ కావాలి. కానీ ఓ ఫైనాన్సియర్.. ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కోర్టులో కేసు వేయడంతో వాయిదా పడింది. ఆయనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే మూవీ రిలీజ్ ఉంటుందని, లేదంటే అప్పటివరకు కష్టమే అని కోర్టు చెప్పింది. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బులు కట్టారు. అప్పటికే డిసెంబరు దాటిపోయింది. సంక్రాంతికి రావాల్సిన 'జన నాయగణ్' వాయిదా పడేసరికి ఆదరబాదరాగా జనవరి 14న తమిళనాడులోని థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ తొలి ఆటకే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది.కట్ చేస్తే రెండు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి కూడా 'వా వాతియర్' సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే తమిళ వెర్షన్ కోసం సిద్ధం చేసిన ప్రింట్‌నే తెలుగు వెర్షన్ కోసమూ రిలీజ్ చేశారు. దీంతో తెరపై బొమ్మ ఎమ్‌జీఆర్ కనిపిస్తుంటే.. డైలాగ్స్‌లో మాత్రం ఎన్టీఆర్ అని వినిపించేది. దీంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫొటోలతో ఉన్న ప్రింట్‌ని లేటెస్ట్‌గా ఈ శుక్రవారం(మార్చి 06) నుంచి స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అందరూ దాదాపుగా ఈ మూవీ గురించి మర్చిపోయిన టైంలో దీన్ని తీసుకురావడం వల్ల ఉపయోగం అయితే ఉండకపోవచ్చనే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా)PSA: Anna Gari Aagamanam 📢#AnnagaruVostaruOnPrime, New Movie, March 6 @Karthi_Offl @IamKrithiShetty #NalanKumarasamy @Music_Santhosh @StudioGreen2 @gnanavelraja007 #Rajkiran #Sathyaraj #Anandaraj @GMSundar_ #Karunakaran pic.twitter.com/kWxcY2tCCv— prime video IN (@PrimeVideoIN) March 3, 2026

Advertisement
Advertisement