ప్రధాన వార్తలు
కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్
భారతదేశంలో దేవుడిపై భక్తి అనేది అత్యంత లోతైన, విస్తృతమైన ఆధ్యాత్మిక భావన. అందుకే సినిమాల రూపంలో చాలా ప్రాజెక్ట్లు వచ్చాయి. విజయం సాధించాయి. ఈ క్రమంలో తాజాగా అఖండ 2 కూడా అదే పాయింట్ మీద వచ్చింది. బాలయ్య అభిమానులు కూడా భక్తి, సనాతన ధర్మం మీద బాలయ్య పోరాటం అంటూ ఎలివేషన్స్ ఇస్తున్నారు. దేవుడిని నిర్మలమైన మనస్సుతో ప్రార్థించడం, మోక్షం కోసం ఆరాధించడం భక్తి యొక్క మూలం. విశ్వాన్ని సృష్టించి నడిపే, శాసించే అజ్ఞాత శక్తే దైవం అని మన శాస్త్రాలు వివరణ ఇస్తున్నాయి. భగవంతుడే సర్వోన్నతుడని భక్తుడు భావించాలి. ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయకూడదు. కానీ ,ఇందులోకి మతం చొచ్చుకు రావడంతో సమాజంలో వైశ్యామ్యాలు ఏర్పడుతున్నాయి. భక్తి అంటే దైవంతో వ్యక్తిగత అనుబంధం, ప్రేమను చూపడం. మతం అంటే దైవాన్ని పూజించే పద్ధతులు, నమ్మకాలు, సంప్రదాయాల వ్యవస్థ అని తెలిసిందే. కానీ, నేటి దర్శకనిర్మాతలు డబ్బు కోసం ఈ రెండిటిని జోడించి సినిమాలుగా తీయడమే అసలు సమస్య వస్తుంది. భక్తి సినిమాలు పెరగడం వల్ల ప్రజల్లో మరింత మానసిక ప్రశాంతత చేకూరుతుంది.భక్తి సినిమాలకు భారీ డిమాండ్భారత్లో భక్తి సినిమాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పురాణాలు, ఇతిహాసాలు, దేవతా కథల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అలాగే ప్రేక్షకులు వీటిని ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. భక్తి సినిమాలు కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. భక్తి సినిమాలు ప్రేక్షకుల ఆధ్యాత్మిక అనుబంధాన్ని తాకుతూ.. బాక్సాఫీస్ వద్ద కూడా బలమైన విజయాలు సాధిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పురాణ, ఇతిహాస ఆధారిత సినిమాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఈ జానర్కు మార్కెట్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.భక్తిని డబ్బుగా మలుచుకుంటున్న సినిమా ఇండస్ట్రీభక్తి సినిమా అంటేనే చాలా ప్రత్యేకం.. అందుకే సినిమా పరిశ్రమ టార్గెట్ భక్తి మార్గమే అయింది. పురాణ కథలను తమకు అనుగుణంగా మార్చడం లేదా తప్పుగా చూపించడం వివాదాలకు దారితీస్తుంది. ఇలాంటి వివాదంలో చాలా సినిమాలు చిక్కుకున్నాయి. భక్తి సినిమాలు ఎప్పటికీ ఆధ్యాత్మికతను, విశ్వాసాన్ని గౌరవించేలా ఉండాలి. అప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. మతసామరస్యం, కులవ్యవస్థ వ్యతిరేకత, ప్రజలకు ఆధ్యాత్మికత చేరువ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, దర్శకులు ముందుకు రావాలి.సినిమా పేరుతో దందాఒకప్పుడు ప్రజల్లో భక్తిని నింపే చిత్రాలు వచ్చేవి.. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు, కన్నప్ప శ్రీ రామ రాజ్యం, దేవుళ్లు, షిరిడి సాయి వంటి సినిమాలకు ఎవరూ పేరు పెట్టరు కూడా.. అయితే, 1990 దశకం ముందు ఎక్కువగా భక్తి చిత్రాలే ప్రేక్షకులను మెప్పించాయి. అప్పట్లో వారు భక్తితో పరవశించారు. అయితే, ఇప్పడు భక్తి పేరుతో వచ్చే సినిమాలు వివాదాలకు తావిస్తున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాలను వక్రీకరించడమే కాకుండా వాటికి కాస్త కల్పితాలను జోడించి నిర్మిస్తున్నారు.అఖండ భక్తి సినిమానేనా.. ఏం చెబుతుంది?రీసెంట్గా మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రేక్షకులకు అందించాడు. తన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాలి. కానీ, పూర్తిగా భక్తితో నిండిన సినిమాను మనోళ్లు పెద్దగా ఆదరించలేదు. ప్రస్తుతం మన సినిమా ట్రెండ్ సనాతన ధర్మం, దేశభక్తి, యాక్షన్ టచ్ ఇలా ఏదో ఒక పాయింట్ ఉంటే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. కానీ, అఖండలో అన్నీ కలిపి కొట్టేశారు. బాలయ్య పాత్ర మొత్తం డివోషినల్గా ఉంటుంది. కానీ, మాస్ ఆడియన్స్ కోసం ఐటమ్ సాంగ్ను ఇందులో చేర్చారు. కేవలం విజిల్స్ కోసమే దేవుడి పేరును ఉపయోగించారు. దేవుళ్లను ఇలా ఎలివేషన్స్ కోసం దర్శకులు ఉపయోగించడం ఏంటి అనే సందేహాలు రావడం సహజం. అఖండ2లో బాలయ్య పాత్ర చాలా బలంగా ఉంటుంది. కానీ, ప్రేక్షకుల చేత విజిల్స్ వేపించేందుకు హనుమాన్ను గ్రాఫిక్స్ చేసి సీన్ క్రియేట్ చేశారు. అక్కడ సీన్లో స్కోప్ లేకున్నా సరే హనుమాన్ను చేర్చడం విడ్డూరంగానే ఉంటుంది. అఖండలో శివుడి పాత్ర అదుర్స్.. తన భక్తురాలి కోసం భగవంతుడే దిగొస్తాడని చూపించిన తీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
రెగ్యులర్ రొటీన్ ప్రేమకథలకు సినిమాల్లో కాలం చెల్లింది. అప్పుడప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీస్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'ఆరోమలే'. గత నెలలో తమిళంలో రిలీజై హిట్ అయింది. రొమాంటిక్ కామెడీ జానర్లో తీసిన ఈ చిత్రంలో కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లు. ఇప్పుడు ఇది హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!)కథేంటి?అజిత్ (కిషన్ దాస్) మిడిల్ క్లాస్ కుర్రాడు. టీనేజీలో ఓ ప్రేమకథా సినిమా చూసి, తనకు కూడా ఇలాంటి లవ్ స్టోరీనే కావాలని ఫిక్స్ అయిపోతాడు. స్కూల్లో ఉన్నప్పుడు స్మృతి, కాలేజీలో మేఘ, పెద్దయ్యాక స్నేహ(మేఘా ఆకాశ్)ని ప్రేమిస్తాడు. కానీ వాళ్లు పట్టించుకోరు. తీరా చదువు పూర్తయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఓ మ్యాట్రిమోనీ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ అంజలి(శివాత్మిక రాజశేఖర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమెనే తనకు టీమ్ లీడర్ అని తెలిసి షాక్ అవుతాడు. ఆమెకు ప్రేమపై పెద్దగా నమ్మకం ఉండదు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారం అనుకునే టైపు. ఇలా ప్రేమ విషయంలో భిన్నమైన ఆలోచనలు ఉన్న వీళ్లిద్దరి జీవితంలో ఏం జరిగింది? ప్రేమలో ఎందుకు పడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమ అనే దానికి సరైన డెఫినిషన్ అంటూ ఏం లేదు. ఎవరికి వాళ్లు స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ అనుభూతిని అర్థం చేసుకోవడం కష్టం. అదే ప్రేమలో ఉన్న మహత్తు. పెళ్లి చేసుకోవద్దని ఎవరైనా చెబితే వింటారేమో గానీ ప్రేమలో పడొద్దని చెబితే ఎవరూ వినరు. అలా ప్రేమ కోసం తపించే ఓ యువకుడి స్టోరీనే ఈ సినిమా.సినిమా గురించి చెప్పాలంటే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెగ్యులర్ ప్రేమకథలతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంది. రెండు గంటల సినిమాలో ప్రేమ, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని ఫెర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు. కాకపోతే క్లైమాక్స్ మాత్రం హీరోహీరోయిన్ కలవాలి అని ఏదో హడావుడిగా ముగించినట్లు అనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే మాత్రం మూవీ మరో లెవల్లో ఉండేది.థియేటర్లో ఓ ప్రేమకథా సినిమా చూసి లవ్ అంటే బయట కూడా ఇలానే ఉంటుందని హీరో అనుకోవడం.. తర్వాత స్కూల్, కాలేజీ లైఫ్లో ప్రేమలో పడటం.. కనీసం వ్యక్తపరిచే అవకాశం రాకుండా అవి ముగిసిపోవడం ఇలా తొలి 20 నిమిషాల్లో చకచకా సీన్లన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే అంజలి పనిచేసే మ్యాట్రిమోనీ కంపెనీలో అజిత్ చేరతాడో అక్కడి నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.ఫస్టాప్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్కి వచ్చేసరికి హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్తో పాటు వీటీవీ గణేశ్ ఎపిసోడ్, హీరో తల్లి గతం ఎపిసోడ్ ఇలా డిఫరెంట్ లేయర్స్ చూపిస్తారు. స్టోరీ నుంచి సైడ్ అవుతున్నారేమో అనిపించినా చివరకొచ్చేసరికి హీరోహీరోయిన్ని కలపాలి కాబట్టి కలిపేశాం అన్నట్లు అనిపించింది. ఇలా ఒకటి రెండు కంప్లైంట్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ చూశాం అనిపిస్తుంది.చెప్పాలంటే ఇది చాలా సింపుల్ కంటెంట్.. బడ్జెట్ పరంగా చూసినా చిన్న సినిమా. కానీ స్టోరీలోని పాయింట్ బాగుంది. తెచ్చిపెట్టుకున్నట్లు కాకుండా సీన్లన్నీ చాలా సహజంగా ఉంటాయి. జీవితంలో ఓదార్చేవాళ్లు ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకడంలో అర్థం లేదనే మెసేజ్ కూడా బాగుంది. పేరుకే ప్రేమకథ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్స్ చేసే కామెడీ కూడా ఆకట్టుకుంది.ఎవరెలా చేశారు?అజిత్ పాత్రలో కిషన్ దాస్ యాక్టింగ్ బాగుంది. అంజలి పాత్రలో శివాత్మిక రాజశేఖర్ బాగా చేసింది. మిగిలిన వాళ్లలో వీటీవీ గణేష్, తులసి పాత్రలు అసలెందుకు ఉన్నాయి అని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. కానీ కథని మలుపు తిప్పే పాత్రల్లో వీళ్లిద్దరూ ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా సెట్ అయింది. పాటల్లో మ్యూజిక్ బాగున్నా సాహిత్యం బాగోలేదు.డైరెక్టర్ సారంగు త్యాగు గురించి చెప్పుకోవాలి. సినిమాటిక్ లిబర్టీ అని ఏది పడితే అది తీసేయలేదు. సాదాసీదాగా ప్రేమ ఎలా ఉంటుందో అలానే చూపించాడు. చాలామంది ఈ పాత్రల్లో తమని తాము చూసుకునేలా తీశాడు. ఇతడికి టెక్నికల్ టీమ్, యాక్టర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ఓవరాల్గా చెప్పుకొంటే ఈ సినిమాని కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)
రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!
ఓటీటీ కారణంగా జనాలు థియేటర్స్ రావడం తగ్గించారు. దానికి తోడు సినిమా టికెట్ల రేట్లు కూడా భారీగా ఉండడంతో సామాన్యుడు థియేటర్స్కి దూరం అయ్యాడు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప..ప్రేక్షకులు థియేటర్స్కి రావడం లేదు. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టికెట్ ధరలను రూ. 99కే తగ్గించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు 'మోగ్లీ 2025'తో మరింత బలపడుతోంది.రాంబాయికి కలిసొచ్చిన 99నవంబర్ 20న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు నుంచే టికెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. మల్టీఫెక్స్లలోనూ రూ. 105కే సినిమాను ప్రదర్శించారు. దీంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా..టికెట్ ధర తగ్గడంతో చాలా మంది సినిమా చూసేందుకు థియేటర్స్కి వెళ్లారు. ఫలితంగా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.రాంబాయి బాటలో మోగ్లీ..రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి టికెట్ల రేట్లు తగ్గించడంతో మంచి ఫలితం వచ్చింది. దీంతో మోగ్లీ చిత్ర నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ రోజు (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను 99 రూపాయలుగా నిర్ణయించారు. పేరుకు చిన్న సినిమానే కానీ బాగానే ఖర్చు చేశారు. అయినా కూడా టికెట్ రేట్ని 99 రూపాయలకే నిర్ణయించడం శుభపరిణామం. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలకు ఇది ఓ కేస్ స్టడీ లాంటింది. పెద్ద సినిమాలకు ఎలాగో టికెట్ల రేట్లను భారీగా పెంచేస్తున్నారు.. కనీసం చిన్న సినిమాలకు అయినా తగ్గిస్తే..సామాన్యుడు థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే పైరసీపై ఆసక్తి!కోవిడ్ తర్వాత ఓటీటీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేందుకు జనాలు అలవాటు పడ్డారు. డిజిటల్ సబ్స్క్రిప్షన్ రూ. 300-500 మధ్య ఉంటుంది. అందులో అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులు కొత్త సినిమాలను థియేటర్స్లో చూడాలని కోరుకుంటారు. కానీ ధరలు భారీగా పెంచడంతో థియేటర్స్కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. సినిమా టికెట్ ధర మల్టీప్లెక్స్లలో రూ. 200-500 ఉంటుంది. ఫ్యామిలీతో ఒక్క సినిమాకు వెళ్తే రూ. 1000-2000 ఖర్చు అవుతుంది. ఇది సామ్యాడికి భారమే. అందుకే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ చెప్పినట్లు టికెట్ల రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు. అప్పుడు విమర్శించి..ఇప్పుడు ఫాలో అవుతున్నారుఅందుబాటు ధరలకే టికెట్లను అందిస్తే.. సామాన్యులు కూడా థియేటర్స్కి వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్స్లలో గరిష్టం రూ. 250, సింగిల్ స్క్రీన్లలో రూ. 20-100 మధ్య ఉండేలా ధరలను ఖరారు చేశారు. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు కొంతమంది నిర్మాతలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండస్ట్రీని నష్టం కగించే నిర్ణయం అంటూ ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలనే అప్లై చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లను తగ్గించే ప్రయత్నం చేసింది. టికెట్ ధరలు రూ. 200కి మాత్రమే పరిమితం చేయాలంటూ సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేస్తే.. మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి.
ఏడాది చివరలో దుమ్మురేపుతున్న బాలీవుడ్..
ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ విజయాల జోరు కొనసాగించింది. 2025లో హిందీ సినిమాలు ఆధిపత్యం కొనసాగించాయి. కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్గానే మిగిలాయి. అయితే, ఈ ఏడాది కాస్త పర్వాలేదు. చాలా సినిమాలు మినిమమ్ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినవే ఉన్నాయి. ఏడాది ప్రారంభంలోనే ఛావా వంటి సినిమాతో ఏకంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సైయారా కూడా రూ. 600 కోట్ల మార్క్ను దాటేసింది. గతంలో అక్కడ టాలీవుడ్ సినిమాలు కల్కి, పుష్ప-2 వంటి సినిమాలు సత్తా చాటాయి. అయితే, ఈసారి మన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు.డిసెంబర్ నెలలో కూడా బాలీవుడ్ చిత్రాలు మెప్పిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే రూ. 300 కోట్ల మేరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం తేరే ఇష్క్ మే మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ఈ మూవీ అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఈ చిత్రం దాదాపు రూ.180 కోట్ల దాకా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కేవలం డిసెంబర్లోనే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇప్పటికే రెండు ఉంటే.. మరోకటి భారీ అంచనాలతో రానుంది.క్రిస్మస్ వీకెండ్లో డిసెంబర్ 31న ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ విడుదల కానుంది. అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రంపై బాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందులో రూమిగా అనన్య, రే పాత్రలో కార్తిక్ కనిపించనున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025లో బాలీవుడ్లో తెలుగు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, సౌత్ నుంచి కాంతార-2 మాత్రమే బాలీవుడ్లో సత్తా చాటింది. 2025లో సౌత్ సినిమాలను వెనక్కి నెట్టిసి తన పట్టును హిందీ సినిమా నిలిబెట్టుకుంది.
బిగ్బాస్
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్ అవడం ఖాయం!
గేమ్లో సడన్గా కిందపడ్డ ఇమ్మూ.. మెడికల్ రూమ్కు!
సెకండ్ ఫైనలిస్ట్గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్!
మీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్తో తనూజ షాక్!
తనూజకు కల్యాణ్ ఫుల్ సపోర్ట్.. అయినా టాప్లో భరణి
'బిగ్బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
కల్యాణ్ డ్యూటీ చేసేది మాతోనే.. తనను తొలగించలేదు!
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి
బిగ్బాస్ హౌస్లో ఆడియన్స్.. టాప్ 5కి చేర్చండి అన్న ఇమ్మూ
పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
A to Z
ఫ్రైడే ఓటీటీ మూవీస్ ధమాకా.. ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవార...
కన్నడ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్
ప్రతివారం ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి....
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ హారర్ థ్రిల్లర్
తెలుగు హీరోల్లో అల్లరి నరేశ్ ఒకడు. అప్పట్లో కామెడీ...
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఈ వారం పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి...
నన్ను సర్జరీ చేయించుకోమన్నారు: ధురంధర్ నటి
స్టార్ నటులు రణ్వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత...
సౌత్ టు నార్త్.. స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
రతి అగ్నిహోత్రి.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ ...
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఐకాన్ స్టార్ రివ్యూ..!
రణ్వీర్ సింగ్ దురంధర్పై ఐకాన్ స్టార్ అల్లు అర్జ...
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఆ దేశాల్లో బ్యాన్..!
రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ...
అప్పటినుంచే 'అవతార్ 3' అడ్వాన్స్ బుకింగ్స్
యానిమేషన్ కథా చిత్రాలకు ప్రపంచస్థాయిలో స్ఫూర్తిదా...
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్.. వేదికలు ఇవే..!
హైదరాబాద్ గ్రాండ్ ఈవెంట్కు వేదికగా నిలవనుంది. ప్...
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ...
ఓటీటీలో హారర్ అడ్వెంచర్ సిరీస్.. కొత్త సీజన్ ట్రైలర్
ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంక...
'మోగ్లీ' కోసం రోషన్ కష్టం.. మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్...
అఖండ-2పై నెగెటివిటీ నిజమే: రామ్ ఆచంట
వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్లోకి వచ...
మమ్ముట్టి డిటెక్టివ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన 'డొమినిక్ అ...
క్యాన్సర్తో పోరాటం.. నటి పరిస్థితి విషమం!
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని...
ఫొటోలు
రజనీకాంత్ బర్త్ డే.. వింటేజ్ జ్ఞాపకాలు షేర్ చేసిన సుమలత (ఫొటోలు)
గ్లామరస్ మెరుపు తీగలా యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
చీరలో ట్రెడిషనల్ లుక్లో అనసూయ.. ఫోటోలు వైరల్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫొటోలు)
#RekhaNirosha : నటి రేఖా నిరోషా బ్యూటిఫుల్ (ఫొటోలు)
'మోగ్లీ' మూవీ రిలీజ్..ట్రెండింగ్లో హీరోయిన్ సాక్షి మడోల్కర్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు (ఫొటోలు)
స్టైలిష్ నిహారిక.. ధగధగా మెరిసిపోయేలా (ఫొటోలు)
నటుడు ధర్మేంద్ర సంతాప సభలో కేంద్ర మంత్రులు (ఫోటోలు)
'కోర్ట్' మూవీ, టీమ్పై అల్లు అర్జున్ ప్రశంసలు (ఫొటోలు)
గాసిప్స్
View all
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు.. ‘స్పిరిట్’ కోసం అన్ని కోట్లా?
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి
నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్కు ముందే సంచలనం!
రివ్యూలు
View all
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
1.75
‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
2
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
సినీ ప్రపంచం
చిరు 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదల తేదీ ప్రకటన
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఏ తేదీన వస్తుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలుత విడుదల ఎప్పుడనేది అధికారికంగా అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 12న మూవీ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ సినిమా షూటింగ్ నిన్నటితో(డిసెంబరు 12) పూర్తయిందని చెప్పాడు. అందుకే ఇవాళ్టి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టామని అన్నాడు. నిన్న చిరంజీవిగారితో చివరి వర్కింగ్ డే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ కాగా వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు.సంక్రాంతి బరిలో ఉన్నవాటిలో తొలుత ప్రభాస్ 'రాజాసాబ్' జనవరి 9న రానుంది. దీని తర్వాత చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 12న అంటే సోమవారం రిలీజ్ అవుతుంది. తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' 14వ తేదీన, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' 14వ తేదీన రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా పోటీలో ఉందని చెప్పారు గానీ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ)
మృణాల్ మెల్టింగ్ లుక్.. రాశీఖన్నా గ్లామర్ చూస్తుంటే
బ్లాక్ డ్రస్లో మృణాల్.. డిసెంబరు జ్ఞాపకాల ఫొటోలుసఫారీ ట్రిప్లో మాళవిక.. గ్లామరస్గా కనిపిస్తూఫిన్లాండ్లో కలర్ఫుల్ ఆకాశంతో 'దృశ్యం' పాపదుబాయి ట్రిప్ వీడియో పోస్ట్ చేసిన కృతిశెట్టిటెన్నిస్ కోర్టులో గ్లామర్ చూపించేస్తున్న యుక్తి'అఖండ 2' షూటింగ్.. దూడపిల్లతో హర్షాలీ మల్హోత్రా View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti)
సామాజిక అసమానతలు ప్రశ్నించేలా 'దండోరా' టైటిల్ సాంగ్
'దండోరా' సినిమా టైటిల్ గీతాన్ని శనివారం విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీతమందించాడు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట చాలా ఎమోషనల్గా ఉంది. తరాలు మారుతున్నాయి. చంద్రుడిపైకి మనిషి అడుగు పెట్టిన ఎన్నో ఏళ్లవుతుంది. అయినా కూడా ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదనేది ఈ పాటలోని భావం.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)కలర్ ఫోటో, బెదురులంక 2012 సినిమాలని నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తీసింది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 23నే ప్రీమియర్స్ ఉండనున్నాయి.(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్)
సరికొత్తగా స్మిత సాంగ్ 'మసక మసక చీకటిలో'..
స్మిత పాడిన "మసక మసక చీకటిలో" పాట ఆమె కెరీర్లో అత్యంత పాపులర్ పాప్ ఆల్బమ్ సాంగ్గా గుర్తింపు పొందింది. - దేవుడు చేసిన మనుషులు (1973) సినిమా నుంచి ఆమె రీమేక్ చేశారు. రీమేక్ వర్షన్ 2000లో విడుదలైంది. అయితే, తాజాగా ఆమె మరోసారి సరికొత్త ప్రయోగం చేశారు. ఇప్పటి యూత్కు నచ్చేలా అదే సాంగ్కు ర్యాప్ జోడించి క్రియేట్ చేశారు. నటుడు, ర్యాపర్ నోయల్తో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించి వీడియో సాంగ్ను విడుదల చేశారు. "మసక మసక చీకటిలో" పాట తెలుగు పాప్ సంగీతానికి కొత్త ఊపిరి ఇచ్చింది. పాత పాటకు కొత్త రీమిక్స్ రూపం ఇచ్చి, యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ పాట ఇప్పటికీ ఆమె సిగ్నేచర్ హిట్గా గుర్తించబడుతోంది. తాజాగా విడుదలైన కొత్త వర్షన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్
పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరూ 'గబ్బర్ సింగ్' చేశారు. అది అప్పట్లో పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ కోసం కలిశారు. ఇప్పటికే పవన్కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో తొలి గీతాన్ని లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత)'దేఖ్ లేంగ్ సాలా' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశారు. బీట్ బాగానే ఉంది కానీ ఎక్కడో విన్నామే ఇది అనిపించేలా మ్యూజిక్ ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో మూవీ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.ఈ సినిమా విషయానికొస్తే.. తమిళ హీరో విజయ్ 'తెరి'కి ఇది రీమేక్ అని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం కొత్త స్టోరీతో చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైతే తప్ప కంటెంట్ ఏంటనేది క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. రీమేక్ అనే రూమర్స్ దీనికి కారణం. అలానే దర్శకుడు హరీశ్ శంకర్ గత కొన్ని చిత్రాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా మరో కారణమని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్)
శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా ట్రైలర్
గుర్రం పాపిరెడ్డి సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. డార్క్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది వద్ద అసిస్టెంట్గా పనిచేసిన మురళీ మనోహర్ ఈ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తెలివి తక్కువవాళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువవాడు తెలివైన పని చేసినా... వారి జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి? అన్నది ప్రధానాంశంగా ఈ మూవీ ఉండనుంది. బ్రహ్మానందం జడ్జ్ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ నటించారు. యోగిబాబు వంటి ఇతర భాషల తారలు కూడా ఈ మూవీలో కనిపించనున్నారు.
అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత
పాప్ సింగర్ స్మిత ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ 2000ల్లో మాత్రం 'మసక మసక చీకటిలో..' అనే ఆల్బమ్ సాంగ్తో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత పలు ఆల్బమ్ గీతాలు చేసింది. కాకపోతే రీసెంట్ టైంలో మాత్రం పెద్దగా బయట కనిపించట్లేదు. తాజాగా 'మసక మసక' అని సాగే కొత్త పాటతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయింది. హైదరాబాద్లో ఈ సాంగ్ లాంచ్.. శనివారం సాయంత్రం జరిగింది.(ఇదీ చదవండి: కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్)ఈ కార్యక్రమంలో మాట్లాడిన స్మిత.. నటిగా ఎందుకు సినిమాలు చేయడం మానేశానో మరోసారి చెప్పుకొచ్చింది. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. 'గాయనిగా నా కెరీర్ పీక్లో ఉన్నప్పుడు వెంకటేశ్ 'మల్లీశ్వరి'లో ఓ పాత్రలో నటించాను. అది మిస్ ఫైర్ అయింది. మనకు చెప్పేది ఒకటి అక్కడ ఉండేది ఒకటి. ఎందుకులే అని అప్పటినుంచి సినిమాలు చేయడం మానేశాను' అని స్మిత చెప్పుకొచ్చింది.స్మిత సింగర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ నటి, యాంకర్, బిజినెస్ఉమన్ గానూ పేరు తెచ్చుకుంది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతానికైతే మళ్లీ సింగర్గా రీఎంట్రీ ఇచ్చే బిజిలో ఉంది. ఈ సాంగ్ ఏ మేరకు జనాల్లోకి వెళ్తుందో చూడాలి?(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ)
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
రెగ్యులర్ రొటీన్ ప్రేమకథలకు సినిమాల్లో కాలం చెల్లింది. అప్పుడప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీస్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'ఆరోమలే'. గత నెలలో తమిళంలో రిలీజై హిట్ అయింది. రొమాంటిక్ కామెడీ జానర్లో తీసిన ఈ చిత్రంలో కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లు. ఇప్పుడు ఇది హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!)కథేంటి?అజిత్ (కిషన్ దాస్) మిడిల్ క్లాస్ కుర్రాడు. టీనేజీలో ఓ ప్రేమకథా సినిమా చూసి, తనకు కూడా ఇలాంటి లవ్ స్టోరీనే కావాలని ఫిక్స్ అయిపోతాడు. స్కూల్లో ఉన్నప్పుడు స్మృతి, కాలేజీలో మేఘ, పెద్దయ్యాక స్నేహ(మేఘా ఆకాశ్)ని ప్రేమిస్తాడు. కానీ వాళ్లు పట్టించుకోరు. తీరా చదువు పూర్తయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఓ మ్యాట్రిమోనీ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ అంజలి(శివాత్మిక రాజశేఖర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమెనే తనకు టీమ్ లీడర్ అని తెలిసి షాక్ అవుతాడు. ఆమెకు ప్రేమపై పెద్దగా నమ్మకం ఉండదు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారం అనుకునే టైపు. ఇలా ప్రేమ విషయంలో భిన్నమైన ఆలోచనలు ఉన్న వీళ్లిద్దరి జీవితంలో ఏం జరిగింది? ప్రేమలో ఎందుకు పడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమ అనే దానికి సరైన డెఫినిషన్ అంటూ ఏం లేదు. ఎవరికి వాళ్లు స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ అనుభూతిని అర్థం చేసుకోవడం కష్టం. అదే ప్రేమలో ఉన్న మహత్తు. పెళ్లి చేసుకోవద్దని ఎవరైనా చెబితే వింటారేమో గానీ ప్రేమలో పడొద్దని చెబితే ఎవరూ వినరు. అలా ప్రేమ కోసం తపించే ఓ యువకుడి స్టోరీనే ఈ సినిమా.సినిమా గురించి చెప్పాలంటే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెగ్యులర్ ప్రేమకథలతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంది. రెండు గంటల సినిమాలో ప్రేమ, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని ఫెర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు. కాకపోతే క్లైమాక్స్ మాత్రం హీరోహీరోయిన్ కలవాలి అని ఏదో హడావుడిగా ముగించినట్లు అనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే మాత్రం మూవీ మరో లెవల్లో ఉండేది.థియేటర్లో ఓ ప్రేమకథా సినిమా చూసి లవ్ అంటే బయట కూడా ఇలానే ఉంటుందని హీరో అనుకోవడం.. తర్వాత స్కూల్, కాలేజీ లైఫ్లో ప్రేమలో పడటం.. కనీసం వ్యక్తపరిచే అవకాశం రాకుండా అవి ముగిసిపోవడం ఇలా తొలి 20 నిమిషాల్లో చకచకా సీన్లన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే అంజలి పనిచేసే మ్యాట్రిమోనీ కంపెనీలో అజిత్ చేరతాడో అక్కడి నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.ఫస్టాప్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్కి వచ్చేసరికి హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్తో పాటు వీటీవీ గణేశ్ ఎపిసోడ్, హీరో తల్లి గతం ఎపిసోడ్ ఇలా డిఫరెంట్ లేయర్స్ చూపిస్తారు. స్టోరీ నుంచి సైడ్ అవుతున్నారేమో అనిపించినా చివరకొచ్చేసరికి హీరోహీరోయిన్ని కలపాలి కాబట్టి కలిపేశాం అన్నట్లు అనిపించింది. ఇలా ఒకటి రెండు కంప్లైంట్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ చూశాం అనిపిస్తుంది.చెప్పాలంటే ఇది చాలా సింపుల్ కంటెంట్.. బడ్జెట్ పరంగా చూసినా చిన్న సినిమా. కానీ స్టోరీలోని పాయింట్ బాగుంది. తెచ్చిపెట్టుకున్నట్లు కాకుండా సీన్లన్నీ చాలా సహజంగా ఉంటాయి. జీవితంలో ఓదార్చేవాళ్లు ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకడంలో అర్థం లేదనే మెసేజ్ కూడా బాగుంది. పేరుకే ప్రేమకథ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్స్ చేసే కామెడీ కూడా ఆకట్టుకుంది.ఎవరెలా చేశారు?అజిత్ పాత్రలో కిషన్ దాస్ యాక్టింగ్ బాగుంది. అంజలి పాత్రలో శివాత్మిక రాజశేఖర్ బాగా చేసింది. మిగిలిన వాళ్లలో వీటీవీ గణేష్, తులసి పాత్రలు అసలెందుకు ఉన్నాయి అని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. కానీ కథని మలుపు తిప్పే పాత్రల్లో వీళ్లిద్దరూ ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా సెట్ అయింది. పాటల్లో మ్యూజిక్ బాగున్నా సాహిత్యం బాగోలేదు.డైరెక్టర్ సారంగు త్యాగు గురించి చెప్పుకోవాలి. సినిమాటిక్ లిబర్టీ అని ఏది పడితే అది తీసేయలేదు. సాదాసీదాగా ప్రేమ ఎలా ఉంటుందో అలానే చూపించాడు. చాలామంది ఈ పాత్రల్లో తమని తాము చూసుకునేలా తీశాడు. ఇతడికి టెక్నికల్ టీమ్, యాక్టర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ఓవరాల్గా చెప్పుకొంటే ఈ సినిమాని కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)
రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!
ఓటీటీ కారణంగా జనాలు థియేటర్స్ రావడం తగ్గించారు. దానికి తోడు సినిమా టికెట్ల రేట్లు కూడా భారీగా ఉండడంతో సామాన్యుడు థియేటర్స్కి దూరం అయ్యాడు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప..ప్రేక్షకులు థియేటర్స్కి రావడం లేదు. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టికెట్ ధరలను రూ. 99కే తగ్గించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు 'మోగ్లీ 2025'తో మరింత బలపడుతోంది.రాంబాయికి కలిసొచ్చిన 99నవంబర్ 20న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు నుంచే టికెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. మల్టీఫెక్స్లలోనూ రూ. 105కే సినిమాను ప్రదర్శించారు. దీంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా..టికెట్ ధర తగ్గడంతో చాలా మంది సినిమా చూసేందుకు థియేటర్స్కి వెళ్లారు. ఫలితంగా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.రాంబాయి బాటలో మోగ్లీ..రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి టికెట్ల రేట్లు తగ్గించడంతో మంచి ఫలితం వచ్చింది. దీంతో మోగ్లీ చిత్ర నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ రోజు (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను 99 రూపాయలుగా నిర్ణయించారు. పేరుకు చిన్న సినిమానే కానీ బాగానే ఖర్చు చేశారు. అయినా కూడా టికెట్ రేట్ని 99 రూపాయలకే నిర్ణయించడం శుభపరిణామం. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలకు ఇది ఓ కేస్ స్టడీ లాంటింది. పెద్ద సినిమాలకు ఎలాగో టికెట్ల రేట్లను భారీగా పెంచేస్తున్నారు.. కనీసం చిన్న సినిమాలకు అయినా తగ్గిస్తే..సామాన్యుడు థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే పైరసీపై ఆసక్తి!కోవిడ్ తర్వాత ఓటీటీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేందుకు జనాలు అలవాటు పడ్డారు. డిజిటల్ సబ్స్క్రిప్షన్ రూ. 300-500 మధ్య ఉంటుంది. అందులో అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులు కొత్త సినిమాలను థియేటర్స్లో చూడాలని కోరుకుంటారు. కానీ ధరలు భారీగా పెంచడంతో థియేటర్స్కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. సినిమా టికెట్ ధర మల్టీప్లెక్స్లలో రూ. 200-500 ఉంటుంది. ఫ్యామిలీతో ఒక్క సినిమాకు వెళ్తే రూ. 1000-2000 ఖర్చు అవుతుంది. ఇది సామ్యాడికి భారమే. అందుకే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ చెప్పినట్లు టికెట్ల రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు. అప్పుడు విమర్శించి..ఇప్పుడు ఫాలో అవుతున్నారుఅందుబాటు ధరలకే టికెట్లను అందిస్తే.. సామాన్యులు కూడా థియేటర్స్కి వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్స్లలో గరిష్టం రూ. 250, సింగిల్ స్క్రీన్లలో రూ. 20-100 మధ్య ఉండేలా ధరలను ఖరారు చేశారు. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు కొంతమంది నిర్మాతలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండస్ట్రీని నష్టం కగించే నిర్ణయం అంటూ ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలనే అప్లై చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లను తగ్గించే ప్రయత్నం చేసింది. టికెట్ ధరలు రూ. 200కి మాత్రమే పరిమితం చేయాలంటూ సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేస్తే.. మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి.
యూట్యూబ్లో అలరిస్తున్న 'మెన్షన్ హౌస్ మల్లేష్' సాంగ్
హిట్, యానిమల్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి ఆకట్టుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి. ఇతడి హీరోగా చేసిన సినిమా 'మెన్షన్ హౌస్ మల్లేష్'. కొన్నాళ్ల క్రితం సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చాయి. థియేటర్లలో మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమాలోని పాట యూట్యూబ్లో ఆకట్టుకుంటోంది.'బంగారి బంగారి' అంటూ సాగే పాట కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేయగా శ్రోతల్ని అలరిస్తూ ఇప్పుడు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఈ సినిమాలో గాయత్రి రమణ హీరోయిన్గా చేస్తోంది. బాల సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతమందించారు. రాజేష్ ఈ సినిమాను నిర్మించారు.
సినిమా
ఇకపై మంచి పాత్రలు చేస్తా
కుటుంబంతో తిరుమల శ్రీవారి సేవలో రజనీకాంత్..
వారణాసిలో మహేష్ బాబు గెటప్స్ తెలిస్తే ఫ్యాన్స్ కు నిద్రపట్టదు భయ్యా !
అఖండ టికెట్ల వ్యవహారంపై కోర్టు ఉత్తర్వులు అంటే మీకు లెక్కలేదా?
అన్నగారు వస్తారుకు అఖండ 2 తరహా కష్టాలు...
బిగ్ బాస్ లో మరో షాకింగ్ ట్విస్ట్.. మిడ్ వీక్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఎవరంటే?
వెంకటేష్ ANR సినిమా టైటిల్ ని ఎందుకు కాపీ చేసాడు?
పెద్ది, ప్యారడైజ్ కి పోటీగా వెంకటేష్ సినిమా
ఇలాంటి సైకోల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి: చిన్మయి
అఖండ-2 నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురు
