Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

RRR Movie Anime Confirmed by SS Rajamouli1
బాహుబలి బాటలో RRR.. రాజమౌళి ప్రకటన

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’.. ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్‌ మీడియాకి రాజమౌళి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చివరి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆస్కార్‌ అవార్డ్‌ దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్‌ పేరు వైరల్‌ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. RRR అనిమేషన్‌ చిత్రంగా రూపొందించాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాను అనేక జపనీస్ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నానని ఆయన అన్నారు. అధికారికంగా ఇంకా ఏమీ ప్రారంభం కానప్పటికీ, ప్రస్తుతం ఆయన చేసిన ఈ ప్రకటనపై అనిమేషన్‌ ప్రేమికులు అభినందిస్తున్నారు. బాహుబలి రెండు భాగాలను యానిమేషన్ సిరీస్‌గా ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం 2027 లో విడుదల కానుంది. ఇప్పుడు తెరపైకి ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా చేరడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

Nilave Telugu movie trailer Out Now2
అర్జున్‌ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్‌..

'అర్జున్‌ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా పేరు పెద్ద సెన్సేషనల్‌ అయిపోయింది. ఈ మూవీ టేకింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే, తాజాగా విడుదలైన 'నిలవే' మూవీ ట్రైలర్‌కు ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. ఈ ట్రైలర్‌ను చూసిన నెటిజన్లు చిత్ర దర్శకుడిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడేంటి సందీప్‌రెడ్డి స్టూడెంట్‌లా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్‌లో కట్స్‌, ఎడిటింగ్‌, సంగీతం సూపర్‌ అంటూనే హీరోయిన్‌ పాత్రలో కనిపించిన శ్రేయాసి సేన్ నటన అదుర్స్‌ అంటున్నారు.సౌమిత్‌ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి నిలవే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్‌ కథానాయికగా నటిస్తుంది. రాజ్‌ అల్లాడ, గిరిధర్‌రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి ఆదరణ రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రేయాసి సేన్‌కు మంచి గుర్తింపు వస్తుంది.

Bhatti Vikramarka comments on Gaddar Awards3
గద్దర్‌ అవార్డ్స్‌ రేసులో 90 సినిమాలు.. పరిశ్రమపై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

తెలంగాణ సినీ పరిశ్రమ అత్యున్నత స్థాయికి చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలంగాణ సినీ పరిశ్రమ ఎదగాలని అందుకోసం కార్యాచరణని కూడా సిద్ధం చేశామన్నారు. చిత్ర పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా సరే తెలంగాణ ప్రభుత్వం సాయంగా ఉంటుందని ఆయన తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్‌ సినీ పురస్కారాలు - 2025 స్క్రీనింగ్‌ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు.ప్రజల కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు గద్దర్‌ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ఆయన పేరుపైనే సినీ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో రెండో ఏడాది పురస్కారాల్ని కూడా అందించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈసారి ఉగాది రోజున ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా సరే తమ ప్రభుత్వ తలుపు తట్టొవచ్చని ఆయన భోరస కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను కూడా అందుబాటులో ఉంటామన్నారు. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను చూసకుంటున్నారని చెప్పారు. గద్దర్‌ అవార్డ్స్‌ జ్యూరీ ఛైర్మన్‌ మణిశర్మ కమిటీ ఎలాంటి బేధాలు లేకుండా అవార్డుల ఎంపిక కార్యక్రమాన్ని చేపడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈసారి గద్దర్‌ అవార్డ్స్‌ కోసం 90 సినిమాలు పోటీలో ఉన్నాయని టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు ప్రకటించారు. మార్చి 5లోపు జ్యూరీ సభ్యులు ఈ సినిమాలన్ని చూసి అవార్డుల్ని ఎంపిక చేస్తారని తెలిపారు.

Vikrant Massey comment on his movie retirement4
రిటైర్మెంట్‌ గురించి క్లారిటీ ఇచ్చిన విక్రాంత్ మాస్సే

బాలీవుడ్‌ నటుడు విక్రాంత్ మాస్సే సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అయితే, తాజాగా ఇదే అంశం గురించి ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన రిటైర్మెంట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని మరోసారి వెల్లడించారు. ‘12th ఫెయిల్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత కూడా వరసుగా పలు ప్రాజెక్ట్స్‌లలో పనిచేశారు.ఎక్కువ పని ఒత్తిడి కారణంగా తాను సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు పేర్కొన్నానని ఆయన అన్నారు. కానీ, తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని తక్కువ పదాలలో చెప్పేసరికి చాలామంది మరోలా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. కొంత కాలం విరామం తీసుకుందామనుకున్నానని విక్రాంత్‌ మాస్సే చెప్పారు. శాశ్వతంగా నటనకు దూరమవుతానని తాను చెప్పలేదని గుర్తుచేశారు. రోజులో సుమారు 16 గంటలు పని చేయడం చాలా కష్టంగా అనిపించడం వల్ల జీవితంలో చాలా అలసిపోయానన్నారు. దీంతో కాస్త బ్రేక్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ, తాను సినిమా పరిశ్రమ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని అందులో నిజం లేదని విక్రాంత్‌ పేర్కొన్నారు.బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన విక్రాంత్‌.. 2017లో 'ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్‌ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్‌ అవార్డ్‌తో పాటు 'ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌'గా కూడా గుర్తింపు పొందారు. విక్రాంత్‌, షీతల్‌ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జన్మించగా అతడికి వర్దన్‌ అని నామకరణం చేశారు.

Jana Nayagan movie release date update5
'జన నాయగన్' రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్..?

తమిళ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ విడుదల కానుంది. ఈమేరకు కోలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దేశ రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్‌ వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పేర్కొంది.జన నాయగన్‌ సెన్సార్‌ విషయంలో నెలల తరబడి కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే దిశగా చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి ‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.కోలీవుడ్‌లో వచ్చిన కథనాల ప్రకారం. సెన్సార్ బోర్డు అభ్యంతరం సూచించిన సుమారు 20 నిమిషాల నిడివి గల సీన్స్‌ను తొలగించడంతో పాటు కొన్ని డైలాగ్స్‌ను కూడా మ్యూట్ చేయడానికి నిర్మాతలు అంగీకరించారని సమాచారం. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డ్‌కి కొత్త వర్షెన్ స‌మర్పించి కోర్టు కేసుల‌ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు కోలీవుడ్‌ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రానుందని సమాచారం.హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, రేవతి తదితరులు నటించారు.

Actor Arjun Sarja Comments On His Past Life And Financial Issues6
చాలామంది మోసం చేశారు.. నా బుర్రకే ఎక్కలేదు: అర్జున్

యాక్షన్ కింగ్, నటుడు, దర్శకుడు అర్జున్ సర్జాకు తెలుగులో కూడా భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. మా పల్లెలో గోపాలుడు మూవీతో తెలుగు వారికి పరిచయం అయిన అర్జున్‌.. తన కెరీర్‌లో సుమారు 180కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, తన 46 ఏళ్ల సినీ జీవితంలో చాలామంది తనను మోసం చేశారని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.తన పిల్లల కోసం పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని అర్జున్‌ ఇలా చెప్పారు. 'నేను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. నన్ను చాలామంది మోసం చేశారు. ఇప్పుడు వారి పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఇండస్ట్రీలో నా చుట్టూ ఉండే వాళ్లే.. నాకు ఏమీ తెలియని వయసులో మోసం చేశారు. చిన్న వయసులోనే డబ్బు వస్తోంది.. కానీ, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అప్పుడు తెలియలేదు. నా వాళ్లే నన్ను మిస్‌- యూజ్‌ చేశారు. ఆరోజుల్లో నేను సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు భారీగా ఆస్తులు ఉండేవి. పెట్టుబడుల ఎక్కడ పెట్టాలో శోభన్ బాబు గారు చాలాసార్లు నాకు చెప్పారు. నాతో ఆయన చాలా క్లోజ్‌గా ఉండేవారు. పెట్టుబడులు పెట్టాలని డబ్బు ఎక్కడ వృథాగా పోతుందో చూసుకోమని నాతో చెప్పేవారు. కానీ, ఆ సమయంలో నా బుర్రకు ఎక్కలేదు. ఆయనతో ఒక సినిమాలో కలిసి పనిచేశాను. కేవలం ఒక్క మూవీతోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మా అనుబంధం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట వినిఉంటే బాగుండేది' అని ఇప్పుడు అనిపిస్తుందని అర్జున్‌ గుర్తు చేసుకున్నారు.తెలుగులో కూతురు ఎంట్రీకర్ణాటకలోని మైసూర్ సమీపంలోని మధుగిరిలో జన్మించిన అర్జున్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తనదైన యాక్షన్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు పొందారు. అర్జున్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ ‘సీతా పయనం’ వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వస్తోంది. అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య ఈ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ‘సేవగన్‌’తో 1992లోనే డైరెక్టర్‌గా మారిన ఆర్జున్‌.. తెలుగులో ‘సీతాపయనం’తో తొలిసారి దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లోనే తన కూతురు రాణించాలని ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Tamanna Comment Her Past Decisions In Movies7
నేను ఏదీ అర్థం చేసుకోలేకున్నా: తమన్నా

అందం ఏ ఒక్కరికీ సొంతం కాదు. అయినా ఎవరి అందం వారికి ముద్దే. అదేవిధంగా అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుందంటారు. అలాంటి అందాల్లో తమన్నా అందమే వేరయా అని పేర్కొనవచ్చు. ఈమె ఒక్కో చిత్రంలో ఒక్కో విధంగా తన అందాలను మార్చుకుంటారు. అలా ఏ కోణంలో చూసిన తమన్నా అందంగానే కనిపిస్తారు. అలా తన అందచందాలతో, హావభావాలతో రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కాగా ఈ 36 ఏళ్ల భామ ఇప్పటికీ కథానాయకిగా నాటౌట్‌గా నిలబడడం మరో విశేషం. అదేవిధంగా ఐటం సాంగ్స్‌లోనూ యువతను గిలిగింతలు పెట్టడంలో ఈ బ్యూటీది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. అలా ఒక్క ఐటమ్‌ సాంగ్‌కు రూ.6 కోట్లు డిమాండ్‌ చేస్తున్న నటి తమన్నా. కాగా చిన్న గ్యాప్‌ తర్వాత ఈ అమ్మడు తాజాగా కోలీవుడ్లో విశాల్‌కు జంటగా సుందర్‌.సి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. విజయ్‌వర్మ అనే బాలీవుడ్‌ నటుడితో కొద్దిరోజులు చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అదీ మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. కొంతకాలానికే వీరి మధ్య బ్రేకప్‌ అయ్యింది. ఇటీవల ఇకపై ఐటెం సాంగ్స్‌లో నటించనని పేర్కొన్న తమన్నా మళ్లీ ఇప్పుడు ప్రముఖ హీరోల చిత్రాల్లో అలాంటి పాటల్లో నటించడానికి సిద్ధమే అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తమన్నా లైఫ్‌లో తను తీసుకున్న నిర్ణయాలనే పలుమార్లు మార్చుకుంటూ వెళ్తుందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రశ్నే ఇటీవల ఒక కార్యక్రమంలో ఎదురైన ప్రశ్నకు తమన్నా ఆసక్తికరమైన బదులు చెప్పారు. తనను తానే అర్థం చేసుకోలేకపోతున్నానని, ఇతరులు ఎలా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు.

Director Meher Ramesh Mother In Law No More8
ఒకే తేదీన అమ్మ, అత్తమ్మ.. బాధలో మెహర్ రమేశ్

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇతడి అత్తమ్మ పద్మావతి చనిపోయారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఈ డైరెక్టర్.. చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇన్నాళ్లు అమ్మని తనలో చూసుకున్నానని, ఒకే తేదీన అప్పుడు అమ్మ ఇప్పుడు అత్తమ్మ చనిపోయారని బాధపడుతూ ఈ సంగతి పంచుకున్నాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటోలు కూడా పంచుకున్నాడు.'ఇన్నాళ్లు మా అమ్మ ని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ 'పద్మావతి' శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు.. 2003 ఫిబ్రవరి 7వ తేదీన పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు మా కుటుంబానికి తీరని లోటు' అని మెహర్ రమేశ్.. తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని కన్నడలో రీమేక్ చేసి దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మెహర్ రమేశ్.. 'కంత్రి' మూవీతో టాలీవుడ్‌లో ప్రయాణం మొదలుపెట్టాడు. తర్వాత బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ అంటూ పలు చిత్రాలు చేసినప్పటికీ.. ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. గత కొన్నాళ్లుగా అయితే బయట కూడా మెహర్ రమేశ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు విషాద వార్తని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Meher Raamesh (@meherramesh)

Vaibhavam And Maathru Movies OTT Streaming Now9
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్‌లకి ఓ ప్రొఫెసర్‌కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ.

Jayaram Reveals Telugu Dialogues And Allu Arjun Support10
అల్లు అ‍ర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం

టాలీవుడ్‍‌ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్‌ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు.

Advertisement
Advertisement