Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Sunny Deol Latest Movie BORDER 2 Trailer out now
ఇండో-పాక్ వార్‌.. గూస్‌ బంప్స్‌ తెప్పిస్తోన్న బోర్డర్-2 ట్రైలర్‌

గతంలో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచిన వార్‌ మూవీ బోర్డర్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో వస్తోన్న బోర్డర్‌-2.. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇవాళ సంక్రాంతి కానుకగా బోర్డర్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్‌, దిల్జీత్‌ దొసాంజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

Tollywood icon Star Allu arjun Craze at Pushpa2 the rule vibe in Japan2
జపాన్‌లోనూ తగ్గేదేలే.. పుష్ప-2 డైలాగ్స్‌తో మార్మోగిన థియేటర్

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ మూవీని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 16న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా ఒక రోజు ముందే జపాన్‌లో పుష్ప-2 ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ షోకు ‍అల్లు అర్జున్, రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు. జపాన్ ‍అభిమానుల ముందు బన్నీ డైలాగ్స్ చెప్పి జోష్ పెంచారు. జపాన్‌ భాషలో అల్లు అర్జున్‌ డైలాగ్ చెప్పడంతో థియేటర్ ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియాలో షేర్ చేశారు.The Whistles & VibeAt the #PushpaKunrin premiere...❤️‍🔥#Pushpa2TheRule Icon Star @alluarjun @IamRashmika pic.twitter.com/p9qiVwkG8I— Bunny Vas (@TheBunnyVas) January 15, 2026

Varun Tej Latest Movie VT15 Sankranthi Funny Promo out now3
సత్యతో వరుణ్ తేజ్ కామెడీ.. సంక్రాంతి ఫన్నీ అప్‌డేట్

వరుణ్‌ తేజ్‌ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ జనవరి 19న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.తాజాగా కమెడియన్‌ సత్యతో ఓ ఫన్నీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఏంటి ఇన్నీ డైలాగులు ఉన్నాయి నాకు అంటూ సత్య కంగారుపడుతూ కనిపించారు. ఇందులో కొరియా భాషల్లో ఉన్న డైలాగ్‌ను చూసి కొరియన్స్‌కు వీడియో కాల్‌ చేసిన ఫన్నీ ఆడియన్స్‌కు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వరుణ్‌ సందేశ్‌ ఫోన్ చేసి ఆ డైలాగ్‌ గురించి ఆరా తీస్తాడు. ఈ వీడియో అభిమానులకు ఫుల్ కామెడీని పంచుతోంది.Team #VT15 wishes everyone a #HappySankranthi ❤️Let the celebrations begin with a fun Sankranthi surprise and a twist 😅WHAT IS THIS KOKA??? 😉#VT15TitleGlimpse out on on 19th January ❤️‍🔥@IAmVarunTej @GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy @DirKrish #Vamsi… pic.twitter.com/VADDlJvdAf— UV Creations (@UV_Creations) January 15, 2026

Roshan Champion Movie Gira Gira Gingiraagirey Video Song out now4
'గిర గిర గింగిరాగిరే.. తుర్రు తుర్రు తోకపిట్టవే'.. ఫుల్ వీడియో సాంగ్‌ చూశారా?

కాంత్ తనయుడు రోషన్‌ నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ఛాంపియన్. గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజై సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణలోని బైరాన్‌ పల్లి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్‌లో తన నటనతో రోషన్‌ మంచి మార్కులు కొట్టేశారు.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో ఓ సాంగ్ సినీ అభిమానులను ఊపేసింది. గిర గిర గింగిరాగిరే అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. రామ్‌ మిరియాల ఆలపించిన ఈ పాట సోషల్‌ మీడియాలో ఊపేసింది. తాజాగా ఈ సూపర్ హిట్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రోషన్‌- అనస్వర రాజన్‌ తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.కాగా.. ఈ చిత్రానికి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రియాంక దత్‌, జీకే మోహన్‌, జెమిని కిరణ్‌ నిర్మించారు. ఇందులో సంతోష్‌ ప్రతాప్‌, అవంతిక, కృతి కంజ్‌ సింగ్‌ రాథోడ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజైన మూడురోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Aadhi Pinisetty sequel Movie Maragadha Naanayam 2 Promo out now5
సూపర్ హిట్ మూవీ సీక్వెల్... ఆసక్తిగా ప్రోమో

ఆది హీరోగా వచ్చిన గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మరగద నానయం. ఈ సినిమాకు ఏఆర్‌కే శరవణ్‌ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో మరకతమణి పేరుతో రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఈ కొత్త మూవీకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. పార్ట్‌-1లో నిక్కీ గల్రానీ హీరోయిన్‌గా నటించగా..ఇప్పుడు మాత్రం ప్రియా భవానీ శంకర్‌ కనిపించనుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, నిక్కీ గల్రానీ, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ. అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 Venu Yeldandi Latest Movie Yellamma Glimpse out now 6
బలగం డైరెక్టర్ రెండో సినిమా..ఆసక్తిగా గ్లింప్స్‌

బలగం ఫేమ్ వేణు యెల్దండి తెరకెక్కిస్తోన్న మరో చిత్రం ఎల్లమ్మ. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోగా సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో దేవీశ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడు పర్షి క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో కొమ్ములు తిరిగిన పొట్టేలు మరింత ఆసక్తిని పెంచుతోంది. నది ఒడ్డున వర్షంలో దేవీశ్రీ ప్రసాద్‌ లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Kotha Malupu Movie First Look Released7
సింగర్‌ సునీత కొడుకు హీరోగా ‘కొత్త మలుపు’.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్‌ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్‌ గా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్‌ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. శివ వరప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, రొమాన్స్, సస్పెన్స్‌, వినోదంతో రూపొందించిన చిత్రం ఇది’’ అని చెప్పారు. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు తాటి బాలకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాత: తాటి భాస్కర్, సంగీతం: యశ్వంత్‌.

Bollywood actor Sunil Shetty Praises His son in law kl rahul about century 8
అల్లుడు సెంచరీ.. మామయ్య ఫుల్ ఖుషీ..!

అల్లుడు కేఎల్ రాహుల్‌పై మామయ్య సునీల్ శెట్టి ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ కొట్టడంతో బాలీవుడ్ నటుడు కొనియాడారు. విభిన్నమైన స్థానం.. అదే ప్రశాంతత.. అదే వ్యక్తిత్వం అంటూ అల్లుడిని ఆకాశానికెత్తేశారు. ఆ స్కోర్ బోర్డ్‌లో ఈ సెంచరీ ప్రత్యేకంగా గుర్తుంటుందని అన్నారు. దీని వెనుక ఉన్న క్షణాలను సంయమనాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సునీల్ శెట్టి పోస్ట్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన కేఎల్ ఫ్యాన్స్ సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. కేఎల్ రాహుల్.. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కుతూరు కూడా జన్మించింది. వీరి పెళ్లి వేడుకను సునీల్ తన ఫామ్‌ హౌస్‌లోనే గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ పెళ్లి బాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు క్రికెటర్లు సందడి చేశారు. కాగా.. కేఎల్ సతీమణి అతియా శెట్టి కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. View this post on Instagram A post shared by Suniel Shetty (@suniel.shetty)

Okkadu Clocks 23 Years: Know About Mahesh Babu Movie9
ఒక్కడు: చార్మినార్‌ సెట్‌ ఖర్చు, ఫస్ట్‌ అనుకున్న టైటిల్‌ తెలుసా?

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ కళకళలాడుతోంది. చిరంజీవి 'మనశంకర వరప్రసాద్‌గారు', ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌', నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', రవితేజ 'భర్తమహాశయులకు విజ్ఞప్తి', శర్వానంద్‌ 'నారీనారీ నడుమ మురారి' సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో అన్ని సినిమాల కన్నా 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీ కలెక్షన్స్‌ వద్ద ఎక్కువ దూకుడు చూపిస్తోంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం మహేశ్‌బాబు సినిమా కూడా సంక్రాంతి రారాజుగా నిలిచింది. ఆ మూవీ ఏంటో తెలుసా? ఒక్కడు. 2003 జనవరి 15న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ఆ సినిమా విశేషాలను ఓసారి చూసేద్దాం...పేపర్‌లో చూసి కథచిరంజీవితో గుణశేఖర్‌ తీసిన 'మృగరాజు' బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. ఈ మూవీ తర్వాత గుణశేఖర్‌ కసితో తీసిన సినిమా 'ఒక్కడు'. ఒకరోజు పేపర్‌లో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ ఇంటర్వ్యూ చూశాడు. పుల్లెల గోపీచంద్‌ తండ్రికి క్రీడలంటే ఆసక్తి లేదు, అయినా ఎన్నో కష్టాలు పడి ఛాంపియన్‌గా ఎదుగుతాడు. మొదట అనుకున్న టైటిల్‌దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథ రాసుకున్నాడు. అది మహేశ్‌బాబుకు చెప్పగా వెంటనే ఒప్పుకున్నాడు. నిర్మాతగా రామోజీరావును అనుకున్నాడు. కానీ, ఆయన ఆసక్తి చూపకపోయేసరికి ఎమ్మెస్‌ రాజు చెంతకు చేరింది. టైటిల్‌ విషయంలోనే అంతా మల్లగుల్లాలు పడ్డారు. 'అతడే ఆమె సైన్యం' అన్న టైటిల్‌ పెట్టాలనుకున్నారు. కానీ అది ఆల్‌రెడీ ఎవరో రిజిస్టర్‌ చేయడంతో మరొకటి వెతుక్కున్నారు. చార్మినార్‌ సెట్‌ కోసం'కబడ్డీ' అనుకున్నారు, మళ్లీ ఎందుకో వెనక్కు తగ్గారు. చివరకు 'ఒక్కడు' టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. అందరికీ నచ్చేసింది. మహేశ్‌బాబు హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించగా ప్రకాశ్‌రాజ్‌ విలన్‌గా యాక్ట్‌ చేశారు. అప్పట్లోనే భారీ బడ్జెట్‌తో చార్మినార్‌ సెట్‌ వేసి మూవీ తీశారు. ఈ సెట్‌ కోసం దాదాపు రూ.2 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పాతబస్తీని, ముఖ్యంగా కర్నూల్‌ కొండారెడ్డి బురుజును సినిమాలో హైలెట్‌ చేసి చూపించారు. మాస్‌ & స్టార్‌ ఇమేజ్‌అలా ఒక్కడు రూ.9 కోట్లతో తీస్తే దాదాపు రూ.40 కోట్లు రాబట్టింది. మహేశ్‌బాబు కెరీర్‌లో తొలిసారి మాస్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అతడికి స్టార్‌ హీరో ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. ఈ మూవీ 8 నంది అవార్డులు గెలుచుకుంది. అంతేకాకుండా ఒక్కడు దాదాపు ఎనిమిది భాషల్లో రీమేక్‌ అయింది. ఇప్పటివరకు ఒక్కడు మూవీ ఐదుసార్లు రీరిలీజ్‌ అవడం విశేషం! చదవండి: బక్కచిక్కిపోయిన బుల్లిరాజు.. ఆ కారణం వల్లే

Aadi Saikumar Shambhala Movie Ott Streaming Date announced10
ఓటీటీకి టాలీవుడ్‌ మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఆది సాయి కుమార్ హీరోగా చేసిన మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ శంబాల. డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ గ్రాండ్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాడు. ఇటీవలే జనవరి 9న ఈ మూవీ హిందీలో కూడా విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. జనవరి 22 నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్‌ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ కావడంతో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకుంది.శంబాల చిత్రాన్ని మహీధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్‌ హీరోయిన్‌గా కనిపించింది.ఈ చిత్రంలో స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది.కథేంటంటే... ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్‌(ఆది సాయికుమార్‌) వస్తాడు. చావులోనూ సైన్స్‌ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్‌. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు.ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్‌తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్‌ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్‌) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే శంబాల(Shambhala Review) చూడాల్సిందే. Step into a mystical world where myths come alive and destiny roars.#AadiShambhala Premieres 22nd Jan only on #aha(24hrs early access for aha gold users)@iamaadisaikumar @tweets_archana #RajasekharAnnabhimoju #MahidharReddy @ugandharmuni pic.twitter.com/bHke5Hmu5b— ahavideoin (@ahavideoIN) January 15, 2026

Advertisement
Advertisement