Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Raju Gari Pelli Ro Full Video song out from Anaganaga Oka Raju1
'రాజు గారి పెళ్లిలో' నవీన్ పొలిశెట్టి-మీనాక్షి స్టెప్పులు

నవీన్ పొలిశెట్టి- మీనాక్షీ చౌదరి నటించిన చిత్రం అనగనగా ఒక రాజు.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'రాజు గారి పెళ్లి రో' అనే వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించగా మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ మూవీని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

Keerthi Bhat Breakup: Vijay Karthik Response On Breakup Issue, Video Viral2
నేను కాదు, ఆమే నన్ను వదిలేసింది: విజయ్‌ కార్తిక్‌ ఎమోషనల్‌ వీడియో

బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్‌, హీరో విజయ్‌ కార్తిక్‌ విడిపోయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. రెండేళ్ల క్రితమే ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంతా భావిస్తే.. విడిపోయిన విషయాన్ని చెప్పి షాకిచ్చింది కీర్తి. ‘విజయ్‌ని నేను భర్తగా చూడలేకపోతున్నా. మా బంధాన్ని స్నేహం వరకు పరిమితం చేయాలని భావిస్తున్నా’ అంటూ బ్రేకప్‌ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో పలువురు నెటిజన్లు విజయ్‌ కార్తీక్‌ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఎంతో కష్టాలను అనుభవించి.. ఈ స్థాయికి వచ్చిన కీర్తిని వదిలేయడం కరెక్ట్‌ కాదంటూ విజయ్‌ని ట్రోల్‌ చేశారు. దీంతో తాజాగా ఈ విషయంపై విజయ్‌ స్పందిస్తూ.. షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. తాను కీర్తిని వదిలేయలేదని.. ఆమే తనను వదిలేసిందని చెప్పాడు. ఆర్థికంగా స్థిరపడలేదనే కారణంతోనే ఆమె బ్రేకప్‌ చెప్పిందన్నాడు. ఈ మేరకు బ్రేకప్‌ ఇష్యూపై స్పందిస్తూ ఓ వీడియోని సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు. ‘హాయ్‌ అండీ..ఈ వీడియో చేయాలని అస్సలు అనుకోలేదు. కానీ నిన్న ఈవినింగ్‌ కీర్తి గారు పోస్ట్ పెట్టిన తరువాత చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. ఫోన్ కూడా చేస్తున్నారు. దయచేసి మీరు కీర్తి గారిని వదిలేయకుండీ.. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి అని చాలామంది కంటిన్యూగా మెసేజ్‌లు పెడుతున్నారు. ఇద్దరి అంగీకారంతోనే విడిపోతున్నాం.. ఫ్రెండ్స్‌ ఉంటాం అని కీర్తి మెసేజ్‌ చేయడంతో..అంతా నాకు కాల్స్‌ చేస్తున్నారు. విడిపోవడం అనేది నా నిర్ణయం కాదు. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదే కోరుకున్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఆమెతో విడిపోవాలని కోరుకుంటాను(చదవండి: హీరోతో ఎంగేజ్‌మెంట్‌.. రిలేషన్‌షిప్‌కు బుల్లితెర నటి ఎండ్ కార్డ్..!)అది నా నిర్ణయం కాదు.. ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం. నేను ఫైనాన్షియల్‌గా స్టేబుల్ కాలేదనే స్ట్రాంగ్ రీజన్ ఆమెకి అనిపించింది. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. తను డిసెంబర్‌లోనే నాకు ఈ మాట చెప్పి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అది ఆమె జీవితం కాబట్టి.. ఆమె నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. ఆమెకి ఆ హక్కు ఉంది. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను చాలా వరకూ ఆమెను కన్విన్స్ చేశాను. కేవలం డబ్బులు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె చాలా క్లియర్‌గా చెప్పింది. నేను కాంప్రమైజ్ అయ్యి బతకడం ఇష్టం లేదని చెప్పింది. తనకి ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని నాకు క్లియర్‌గా చెప్పింది. అందుకే నన్ను వదిలేసింది. అతనితోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని ఆమె నాకు ఆల్రెడీ డిసెంబర్‌లోనే చెప్పారు. ఆమె నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా కన్విన్స్ చేయడానికి చూశాను. వదిలేయొద్దు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. కానీ ఆమె నిర్ణయం తీసుకునే నాకు చెప్పింది. కాబట్టి నేనేం చేయలేకపోయాను. ఆమె చాలా స్ట్రాంగ్‌ నిర్ఱయం తీసుకుని వచ్చి నాతో డిస్కస్ చేశారు.ఆమె విడిపోవాలని అంత బలంగా చెప్పినప్పుడు బలవంతంగా ఆమెతో ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఫోర్స్‌ఫుల్‌గా ప్రేమను పొందలేం. నాతో పాటు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కన్వెన్స్ చేయడానికి చూశాం. ఆమె వినే పరిస్థితిలో లేదు.. మా ప్రయత్నాలు ఫలించలేదు. జరిగింది జరిగిపోయింది.. కాబట్టి.. ఆమె, వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది ఆమె ఫొటోలు డిలీట్ చేసింది కదా.. మీరెందుకు డిలీట్ చేయడం లేదు అని అడుగుతున్నారుకానీ ఒక పోస్ట్ పెట్టడం అనేది చాలా ఈజీ. కానీ ఆ పోస్ట్ పెట్టడం వెనుక చాలా ఎమోషన్ ఉంటుంది. నాకు ఆ పెయిన్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు ఆ పోస్ట్‌లు, పొటోలు డిలీట్ చేస్తాను. నాకు సపోర్ట్‌గా ఉన్న వాళ్లందరికీ థాంక్స్. నేను కూడా ఇంత షార్ట్ టైమ్‌లో మా రిలేషన్ ఎండ్ అవుతుందని ఊహించలేదు. దేవుడు ఇలా రాసిపెట్టి ఉన్నప్పుడు ఏం చేయలేం.దయచేసి అందరు మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. పీఆర్‌ టీమ్‌కు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే.. డబ్బులు ఇస్తున్నారు కదా అని పిచ్చి పిచ్చి కామెంట్స్‌ పెట్టకండి. కామెంట్‌ పెట్టే ముందుకు దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీకు కూడా ఒక లైఫ్‌ ఉంటుంది. మీ జీవితంలోనూ అలా జరిగితే.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుత​ంది. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేయకండి. అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేదు. నాకు సపోర్ట్‌ చేసినవాళ్లందరికి ధ్యాంక్స్‌’ అని కార్తిక్‌ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by THOTA KAARTHEEKK (@its_vijay_karthikeyan)

Chiranjeevi song released from mana sankara vara prasad garu movie3
'పొగరెక్కిన పోటుగాడు కంచె దాటినాడే'.. క్రేజీ సాంగ్‌ వీడియో

చిరంజీవి నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’నుంచి తాజాగా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మూవీలో చాలా ఫన్నీగా సాగిన ఈ గీతాన్ని చిరంజీవినే పాడటం విశేషం. 'ఆ పెద్దిరెడ్డి వీధి మొదలు పెద్ద వదిన గారు' అంటూ సాగే ఈ పాటకు బాగానే విజిల్స్‌ పడ్డాయి. పొగరెక్కిన పోటుగాడు కంచెదాటినాడే అనే చరణం నుంచి చిరు తన గొంతు కలుపుతారు. అందుకే ప్రత్యేకంగా యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో వెంకటేశ్‌ వెంకీ గౌడగా అతిథి పాత్రలో కనిపించి నవ్వులతో​ మెప్పించగా నయనతార తనదైన రీతిలో మంచి నటనతో ఆకట్టుకుంది.The surprise song that made audiences go berserk in theatres ❤️‍🔥#PeddiReddy Video Song out now 💥💥— https://t.co/oU9ofXXXTI#ManaShankaraVaraPrasadGaru is the ALL TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER 🔥#MSG IN CINEMAS NOW 🫶 pic.twitter.com/WZNzcuoUFZ— Gold Box Entertainments (@GoldBoxEnt) January 29, 2026

Prabhas Fans Sent some food orders Maruthi home4
మారుతి ఇంటికి 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆర్డర్స్‌

దర్శకుడు మారుతికి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నుంచి గట్టిగానే ఎదురుదెబ్బ తగులుతుంది. ఇటీవలే ఆయన తెరకెక్కించిన ‘ది రాజాసాబ్‌’ ఫలితం మిశ్రమంగా రావడంతో ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. సోషల్‌మీడియాలో వారి ఎదురుదాడి ఎక్కవకావడంతో నిర్మాత ఎస​్‌కేఎన్‌ పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. తమపై ట్రోలింగ్‌ పెద్ద త‌ల‌నొప్పిగా త‌యారైంద‌ని ఆయన వాపోయాడు. సినిమా విడుదల సమయంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ది రాజా సాబ్’ నచ్చకుంటే కొండాపూర్‌లోని కొల్ల లగ్జరీలో ఉన్న తన ఫ్లాట్‌కు వచ్చేయండి.. అక్కడే మాట్లాడుకుందామని సరదాగా మాట్లాడారు. ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది.దర్శకుడి మాటలను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నారు. సినిమా నచ్చకపోవడంతో మారుతిని కలిసేందుకు నేరుగా ఇంటికి వెళ్లినట్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ, వారిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో వారందరూ తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. దీంతో మారుతి ఇంటి అడ్రస్‌కు పార్శిల్‌ రూపంలో కొన్ని గిఫ్ట్‌లు పంపుతున్నారు. కాక‌పోతే ఇవి ప్రేమ‌తో పంపుతున్న పార్సిల్స్ కావు. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో పాటు పలు ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి వందలాది ఆర్డర్లు ఆయన ఇంటికి పంపారు. కానీ, వాటన్నింటినీ ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) ఆప్షన్‌తో బుక్ చేయడం విశేషం. దీంతో మారుతి ఫ్లాట్‌ వద్ద ఉన్న సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. అక్కడికి వచ్చిన డెలివరీ బాయ్స్‌ను వెనక్కి పంపడం సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది. వింతగా ఉన్న ఈ నిరసన ఇప్పడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

Did Samantha Ruth Prabhu Change Her Name After Marriage5
భర్త కోసం పేరు మార్చుకోనున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా?

సమంత రూత్‌ప్రభు.. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఇటీవల సొంత ప్రొడక్షన్‌ని స్టార్ట్‌ చేసి.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’గతేడాది మేలో రిలీజై మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు హీరోయిన్‌గా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా కూడా చేస్తుంది. ఇలా కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గుడపుపుతోంది.నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న సామ్‌..ఇటీవల బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఎక్కువ సమయం భర్తతో గడిపేందుకు కేటాయిస్తుంది సామ్‌. వీలైనంత వరకు ఇద్దరు కలిసే బయటకు వెళ్తున్నారు. ఏదైనా ఈవెంట్‌ ఉన్నా.. జంటగా హారవుతున్నారు. దాంతప్య జీవితమే కాకుండా ప్రొఫెషనల్‌ లైఫ్‌ని కూడా ఇద్దరు కలిసే షేర్‌ చేసుకుంటున్నారు. సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్‌ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇలా పెళ్లి తర్వాత రాజ్‌ నిడిమోరు- సమంత జంట అటు దాంపత్య జీవితాన్ని, ఇటు ప్రొఫెషనల్‌ లైఫ్‌ని ఆనందంగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో భర్త రాజ్‌ నిడిమోరు కోసం సామ్‌ కీలక నిర్ణయం తీసుకుందంటూ ఓ క్రేజీ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భర్త కోసం తన ఇంటి పేరుని మార్చకోబోతుందట. ఇన్నాళ్లు సమంత రూత్‌ప్రభుగా ఉన్న తన పేరుని..ఇప్పుడు సమంత నిడిమోరుగా మార్చుకోబోతుందట. ‘మా ఇంటి బంగారం’ సినిమాతోనే తన కొత్త పేరుని ఫ్యాన్స్‌కి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్‌ కార్డ్సులో సమంత పేరుని ‘సమంత నిడిమోరు’గా వేయాబోతున్నారట. అంతేకాదు తన సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ ఇదే పేరుని మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగానే పేరు మార్చుకుంటుందా లేదా అనేది తెలియాలంటే.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌ వరకు ఆగాల్సిందే.

Karthi Movie Annagaru Vostaru Final Collection and OTT6
కార్తీ సినిమా ఫైనల్‌ కలెక్షన్స్‌.. ఎవరూ ఊహించలేరు

కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది . సంక్రాంతి కానుకగా తమిళ్‌లో 'వా వాత్తియార్‌' పేరుతో జనవరి 14న విడుదలైంది. కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి కూడా ఈ మూవీ జనవరి 28న వచ్చేసింది. అందుకు ప్రధాన కారణం ఈ మూవీ కలెక్షన్స్‌ అని తెలుస్తోంది. కార్తీ కెరీర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా 'అన్నగారు వస్తారు' నిలిచింది. నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించి ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా తమిళనాట ఎంట్రీ ఇచ్చింది.'అన్నగారు వస్తారు' (వా వాతియార్) భారీ డిజాస్టర్‌గా నిలిచింది. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పనితీరు చాలా దారుణంగా ఉంది. యాక్షన్-కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం కేవలం రూ. 9 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఏకంగా రూ. 40 కోట్ల​ మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో ఈ మూవీ ఉన్నప్పటికీ పెద్దగా రిటర్న్‌ చేయలేదు. కార్తీ వంటి స్టార్‌ హీరోకు ఇలాంటి కలెక్షన్స్‌ రావడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. వారంలోనే ఈ మూవీని తమిళనాడు వ్యాప్తంగా తొలగించేశారు. బాక్సాఫీస్ వద్ద దారుణమైన ప్రదర్శన కారణంగా, నష్టాలను తగ్గించడానికి వా వాతియార్ నిర్మాతలు త్వరగా డిజిటల్ విడుదలను చేశారని తెలుస్తోంది. ఓటీటీ ద్వారా కాస్త నష్టాలను తగ్గించుకునే పనిలో నిర్మాతలు విజయం సాధించారు.

The Raja Saab Movie Collections Effect On Prabhas market7
'ది రాజాసాబ్' రిజల్ట్‌.. ప్రభాస్‌ ఇమేజ్‌పై ట్రోల్స్‌.. తుఫాన్‌లా తిరిగొస్తాడా?

"ది రాజాసాబ్" మూవీకి బాక్సాఫీస్‌ వద్ద సరైన ఫలితం దక్కకపోవడంతో ప్రభాస్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. పాన్‌ ఇండియా రేంజ్‌ హీరో మార్కెట్‌ ఇంతేనా అంటూ కొందరు కామెంట్లు చేశారు. అయితే, వాటిని డార్లింగ్‌ ఫ్యాన్స్‌ బలంగానే తిప్పికొడుతున్నారు. తెలుగు పరిశ్రమ కీర్తిని పాన్‌ ఇండియాకు పరిచయం చేసిందే ప్రభాస్‌ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. ఇప్పటికీ బాహుబలి కలెక్షన్స్‌ రికార్డ్స్‌ పదిలంగానే ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. ఒక్క సినిమాతో డార్లింగ్‌ క్రేజ్‌ ఏంతమాత్రం తగ్గదని అంతే రేంజ్‌లో విరుచుకుపడుతూనే రాబోయే కలెక్షన్ల తుఫాన్‌ గురించి హెచ్చరిస్తున్నారు. తమ అభిమాన హీరో ఫుల్లీ లోడెడ్‌ గన్స్‌తో రానున్నాడని హెచ్చరిస్తున్నారు."ది రాజాసాబ్" మూవీ ఫలితం వల్ల ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కాస్త నిరాశ చెందిన విషయం వాస్తవమే.. దీనిని ప్రభాస్‌ కూడా గుర్తించినట్లు ఉన్నారు. అందుకే తను కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన ఫ్యాన్స్‌ను మళ్లీ సంతోషపెట్టేందుకు వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఫౌజీ, స్పిరిట్‌ సినిమాలతో పాటు కల్కి సీక్వెల్‌ను కూడా లైన్‌లో పెట్టారు. ఇవన్నీ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న విషయం తెలిసిందే. ఏడాది గ్యాప్‌లోనే ప్రభాస్‌ నుంచి రెండు సినిమాలు విడుదల చేయాలని బలంగా ఉన్నారట. అయితే, మొదటగా ఫౌజీ రానుంది. ఆ తర్వాత స్పిరిట్‌ లైన్‌లో ఉంది. ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుంది. పాన్‌ ఇండియాను షేక్‌ చేసే స్థాయిలో ఈ సినిమాలు ఉంటాయని ఇండస్ట్రీ అంచనా వేస్తుంది. ఆపై కల్కీ రంగంలోకి రానుంది. ఇలా బిగ్‌ ప్రాజెక్ట్స్‌ వస్తుండటంతో ప్రభాస్‌ మార్కెట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది సినీ విశ్లేషకుల మాట..‌రాజాసాబ్‌ కలెక్షన్స్‌ నిరాశ పరిచినా.. ప్రబాస్‌ మార్కెట్ ఎట్టిపరిస్థితిల్లోనూ తగ్గిపోలేదు. అతని స్టార్ పవర్ ఇంకా బలంగానే ఉంది. రాబోయే స్పిరిట్‌ సినిమా ప్రభాస్‌ కెరీర్‌లోనే అతిపెద్ద మార్కెట్‌ను క్రియేట్‌ చేసే ఛాన్స్‌ ఉంది. ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదీ ఒక ఫ్లాప్‌తో అది తగ్గిపోదు. రాజా సాబ్‌కు నష్టాలు రావడంతో తన రెమ్యూనరేషన్‌లో 40% తగ్గించుకున్నారని సమాచారం ఉంది. ఆపై స్పిరిట్‌ మూవీ పంపిణీ హక్కులను కూడా ఆ మూవీ నిర్మాతకు అందేలా ప్రభాస్‌ చేయడం విశేషం. ‘ రాజాసాబ్‌’ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మళ్లీ తన సినిమాలను వరుసగా బాక్సాఫీస్‌ వద్దకు తీసుకురావాలని డార్లింగ్‌ కూడా ఫుల్‌ క్లారిటీతో ఉన్నారట.

Actor Vijay Father chandrasekhar comments on jana nayagan movie8
విజయ్‌ భయపడే రకం కాదు.. 'జన నాయగన్‌'పై తండ్రి కామెంట్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’పై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆయన ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ పేరుతో విజయ్‌ని ఇబ్బంది పెడుతున్నారంటూ స్టాలిన్‌ ప్రభుత్వంతో పాటు బీజేపీపై మండిపడుతున్నారు. దశాబ్దాల పాటు అభిమానులను మెప్పించిన విజయ్‌కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని తాము ఆశించామని అభిమానులు ఆకాంక్షించారు. తాజాగా మూవీ విడుదల జాప్యంపై విజయ్‌ తండ్రి, దర్శక, నిర్మాత ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ రియాక్ట్‌ అయ్యారు.జన నాయగన్‌ సినిమాతో విజయ్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నకు ఆయన తండ్రి చంద్రశేఖర్‌ ఇలా అన్నారు. 'విజయ్‌ చాలా ధైర్యవంతుడు.. మొండోడు కూడా.. ఇలాంటి సవాళ్లకు భయపడే రకం కాదు. తన ప్రయాణంలో చాలా అడ్డంకులను దాటుకొని వచ్చాడు. భవిష్యత్‌లో ఇంతకుమించిన చిక్కులు వస్తాయని విజయ్‌కు తెలుసు. ప్రతి అడ్డంకిని ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉన్నాడు. కరూర్‌ ఘటనతో విజయ్‌ను ఆపాలని చూశారు. అక్కడ ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అందులో భాగమే జన నాయగన్‌ సినిమా అంశం కూడా ఉంది. సినిమా ఎందుకు విడుదల కాలేదనేది తమిళ ప్రజలందరికీ తెలుసు. విజయ్‌ ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడో యువత కూడా పాలిటిక్స్‌ గుర్చి మాట్లాడుతుంది. ఇప్పుడు వారికే అన్ని విషయాలు బాగా తెలుసు.' అని ఆయన అన్నారు.విజయ్‌-హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జన నాయగన్‌’ విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ మూవీకి సంబంధించి మద్రాస్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. దీనితో విడుదల మరింత ఆలస్యం అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి జన నాయగన్‌కు సెన్సార్‌ సర్టిఫికెట్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనని హైకోర్టు తెలిపింది.

Rashmika Mandanna Comments On Her Fake news9
డబ్బు కోసమే తప్పుడు వార్తలు రాస్తున్నారు: రష్మిక

మనుషుల మనో భావాలు రక రకాలుగా ఉంటాయి. ఇక సినీ తారల అభిప్రాయలు సందర్భానుసారంగా ఉంటాయని చెప్పవచ్చు. కొందరు తమపై వచ్చే విమర్శలను స్వాగతిస్తున్నామంటారు. మరి కొందరు వదంతులను ఎంజాయ్‌ చేస్తున్నామంటారు. ఇంకొందరు సీరియస్‌గా రియాక్ట్‌ అవుతుంటారు. ఇందుకు మన కథానాయకిలు అతీతంగా కాదు. అలా నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) కూడా వదంతులపై స్పందించారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటించిన తొలి చిత్రం తరువాత నుంచే వివాదాల్లో చిక్కుకున్నారనే చెప్పాలి. ఆ తరువాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ తరువాత ప్రేమ వ్యవహారంలో వైరల్‌ అయ్యారు. విషయం ఏమిటంటే ఇవేవీ ఈ భామ కెరీర్‌కు ఎఫెక్ట్‌ అవ్వలేదు. అదే సమయంలో అవన్నీ ఈమెకు ప్లస్‌ అయ్యాయనే చెప్పాలి. అందుకే శాండిల్‌ వుడ్‌ వైయా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ దాటి బాలీవుడ్‌లోనూ వరుస విజయాలను సాధిస్తూ నేషనల్‌ క్రష్‌గా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలతో పాటూ హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వైరల్‌ అవుతున్న రకరకాల ట్రోలింగ్స్‌పై స్పందించిన రష్మిక మందన్నా అసత్య ప్రచారాలపై ఎందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. అలాంటి విషయాలపై స్పందిస్తే వారిని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. కొందరు డబ్బు కోసమే అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారని అన్నారు. అలాంటి ముఖం తెలియని వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎప్పుడూ ఒకేలా ఉంటున్నానని నటి రషి్మక మందన్నా పేర్కొన్నారు.

Prabhas Kalki-2 Actress Suspense Continues in Tollywood10
సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్

ప్రభాస్ నటిస్తున్న కల్కి-2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి ప్రభాస్ సెట్స్ పైకి అడుగుపెట్టనున్నాడని, దాదాపు 10 రోజుల కాల్షీట్లు కేటాయించాడని సమాచారం. ఈ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. కల్కి ఫ్రాంచైజీ నుంచి దీపికా పదుకోన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె పోషించిన సుమతి పాత్ర కథలో చాలా కీలకమైనది. కల్కి పార్ట్-2 మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. కానీ అలాంటి ముఖ్యమైన పాత్ర నుంచి దీపిక తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట సాయిపల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. కల్కి చిత్ర యూనిట్ కూడా ఆమెను ఈ పాత్రకు అనుకూలంగా భావిస్తోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే నిజంగానే సాయిపల్లవినే ఫైనల్ చేశారా లేదా ఊహించని విధంగా మరో నటిని పరిచయం చేస్తారా అనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది. దాంతో ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. దీపికను పార్ట్-1లో చూసిన ప్రేక్షకులు, అదే పాత్రలో మరో హీరోయిన్‌తో కనెక్ట్ అవ్వగలరా అనేది పెద్ద ప్రశ్న. ఈ సవాల్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Advertisement
Advertisement