Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood actresses Social Media Latets Updates In Instagram viral1
శారీలో ఉప్పెన భామ అందాలు.. బ్లాక్‌ డ్రెస్‌లో మానుషి చిల్లర్‌!

బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర వింటేజ్ లుక్..ఉప్పెన భామ కృతి శెట్టి శారీ అందాలు..ఫ్యామిలీతో చిల్ అవుతోన్న మెహరీన్..బ్లూ శారీలో అనసూయ అందాలు..శాలీ మొహబ్బత్‌ ప్రమోషన్స్‌తో బిజీగా రాధికా ఆప్టే..బ్లాక్ డ్రెస్‌లో బొమ్మలా అందాల భామ మానుషి చిల్లర్..వేకేషన్ ఫోటోలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్.. View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

IMDB Highest Rating Web Series list across The world 2
ఓటీటీల్లో వందలకొద్ది వెబ్ సిరీస్‌లు.. టాప్‌-10లో ఇండియాకు నో ప్లేస్!

ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్‌లకు కొదవే లేదు. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. ఏ భాషలో వచ్చినా సరే డబ్బింగ్‌ చేసి డిజిటల్‌గా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ప్రతి ఏటా వందలకొద్ది చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినీ ప్రియులను వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రిలీజైన ఆదరణ దక్కించుకున్నవి చాలానే ఉన్నాయి.కానీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనూ ప్రతి ఏటా సరికొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌ లాంటి వాటికి మాత్రమే ఆడియన్స్‌ కనెక్ట్ అవుతున్నారు. మర్డర్ మిస్టరీ లాంటి సిరీస్‌లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. సినీ ప్రియుల అభిరుచితి తగ్గట్టుగానే చాలా వెబ్ సిరీస్‌లు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. చాలా వరకు మన దేశ ఆడియన్స్‌ ఆదరిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన కంటెంట్‌ సత్తా చాటలేకపోయింది.ఓవరాల్‌ రేటింగ్‌ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా టాప్‌-10లో మన ఇండియన్‌ వెబ్ సిరీస్‌ ఒక్కటీ కూడా లేకపోవడం గమనార్హం. ఐఎండీబీ ప్రకటించిన టాప్-25 వెబ్ సిరీస్‌లో ఇండియా నుంచి కేవలం నాలుగు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాప్-15లో హర్షద్ మెహతా స్కామ్-1992 కాస్తా ఫర్వాలేదనిపించింది. ఈ లిస్ట్‌లో తొలిస్థానంలో బ్రేకింగ్ బ్యాడ్‌(9.5) అనే వెబ్ సిరీస్ నిలవగా.. బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్(9.4), ప్లానెట్ ఎర్చ్-2(9.4) రెండు, మూడు స్థానాల్లో రేటింగ్ దక్కించుకున్నాయి.టాప్-10 విషాయానికొస్తే నాలుగు నుంచి వరుసగా.. ప్లానెట్ ఎర్త్, ది వైర్, చెర్నోబిల్, ‍అవతార్- ది లాస్ట్ ఎయిర్‌బెండర్, బ్లూ, కాస్మోస్, బ్లూ ప్లానెట్‌-2 నిలిచాయి. ఇక 11 వ ప్లేస్‌లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నిలవగా.. 12లో ది సోప్రానోస్ వెబ్ సిరీస్‌ నిలిచింది. ఇక ఇండియా నుంచి హర్షద్ మోహతా వెబ్ సిరీస్‌ స్కామ్-1992(9.2) ఈ లిస్ట్‌లో 13వ స్థానం దక్కంచుకుంది. ఆ తర్వాత ఆస్పిరెంట్స్, గుల్లక్, టీవీఎఫ్ పిచర్స్ వరుసగా 23, 24, 25 స్థానాల్లో నిలిచాయి. ఓవరాల్‌గా చూస్తే మనదేశం నుంచి ఒక్క వెబ్ సిరీస్‌ కూడా టాప్-10లో రేటింగ్ సాధించలేకపోయింది.

Tollywood Movie Purusha latest Poster Creates Interesting on this Movie3
'మగాళ్లను మొక్కుకుంటూ కాదు తొక్కుకుంటూ పోతాం'..ఆసక్తిగా పురుష పోస్టర్!

పవన్ కళ్యాణ్‌ బత్తులను హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్ పురుష. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారుత్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, క్యాప్షన్స్ చూస్తుంటే ఫుల్‌గా నవ్వించే కథతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా వదిలిన మరో పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతాం అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ ఫుల్‌ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్ర్లలో నటించారు.

Kamal Haasan Comments about South Indian Cinema Industry4
మన సినిమా ప్రాంతీయం కాదు... జాతీయం!.. అగ్ర నటుడు కమల్ హాసన్

అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లోనే అన్ని భాషల, ప్రాంతాల సినిమాలు, సీరియళ్ళు, ఓటీటీలు అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో... ప్రపంచం అక్షరాలా ఓ కుగ్రామమైంది. విభజనలు, సరిహద్దులు చెరిగిపోయి వినోద పరిశ్రమలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు, పార్లమెంటు సభ్యుడు, ‘పద్మభూషణ్’ కమల్ హాసన్ ఆ సంగతే మరోసారి స్పష్టం చేశారు.“ప్రాంతీయ సినిమా ఇవాళ ఎంతో మారిపోయింది. నిజం చెప్పాలంటే, ప్రాంతీయ సినిమా... ఇప్పుడు సరికొత్త జాతీయ స్థాయి సినిమాగా అవతరించింది. అలాగే, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆ ప్రాంతపు మట్టి నుంచి పుట్టి, స్థానిక మూలాలపై తీస్తున్న సినిమా... నూతన అంతర్జాతీయ సినిమాగా మారిపోయింది. ఇవాళ మచిలీపట్నం, మదురై, మళప్పురమ్, మాండ్య... ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో పుట్టిన కథలు సైతం కేవలం ప్రాంతీయ సినిమాలుగా మిగిలిపోవడం లేదు. అవి జాతీయస్థాయి సాంస్కృతిక సంరంభాలుగా మారుతున్నాయి” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.బడ్జెట్ కాదు... నిజాయతీ ముఖ్యం!కర్ణాటకలోని కోస్తా ప్రాంత్రంలోని స్థానిక సంస్కృతికి అద్దంపడుతూ, ‘భూతకోల’ సంప్రదాయం ఆధారంగా అల్లుకున్న ఓ జానపద కథ లాంటి సినిమా ‘కాంతార’ ఇవాళ దేశమంతటినీ ఊపేయడం అందుకు ఓ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. అలాగే, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఓ సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో సాగిన మలయాళ చిత్రకథ ‘దృశ్యం’ భాషలు, ప్రాంతాల సరిహద్దులు దాటేసిన సంగతి కమలహాసన్ గుర్తు చేశారు.‘‘తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘పుష్ప’ లాంటివి ఇవాళ ముంబయ్ నుంచి మలేసియా దాకా ప్రతి ఒక్కరి దైనందిన జీవిత భాషలో భాగమైపోయాయి. తమిళం నుంచి వచ్చిన ‘విక్రమ్’, ‘అమరన్’ లాంటి చిత్రాలు సరిహద్దులు దాటి విజయం సాధించాయి. ఈ విజయాలకి కారణం సింపుల్... కథలు మన మట్టిలో నుండి పుట్టడమే. ఇవాళ బడ్జెట్‌ కాదు... స్థానికతను బలంగా చూపిస్తూనే సార్వత్రికంగా అందరినీ కదిలించే నిజాయతీతో కూడిన కథలు కీలకం. అవే భాషలు, ప్రాంతాల సరిహద్దుల్ని దాటేస్తాయి. ప్రామాణికత అనేది ఎప్పటికీ మురిగిపోని, ఎక్కడైనా చెల్లుబాటయ్యే కరెన్సీ లాంటిదని ఇది నిరూపిస్తోంది’’ అంటూ జాతీయ స్థాయిలో మన దక్షిణాది సినిమా కథలు సృష్టిస్తున్న సంచలనంపై ఆయన తన విశ్లేషణ అందించారు.ఆ తేడా పోయింది..! ఇప్పుడు తెర కాదు... కథ కీలకం!!దక్షిణాది వినోద మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరిస్తూ, ‘జియో – హాట్ స్టార్’ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త సొంత కంటెంట్‌తో ముందుకొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఈ అగ్రేసర దక్షిణాది నటుడు మాట్లాడుతూ, “భారతీయ వినోద రంగం అభివృద్ధి చెందడమే కాదు... ఓటీటీ సహా అనేక వాటితో సమూలంగా మారిపోతోంది. ఇవాళ ఏ కథ, ఏ తెర మీద చూస్తున్నామనే తేడా పోయింది. వినోద రంగంలో తొలిసారిగా ప్రేక్షకులే ఫ్లాట్ ఫాంగా మారుతున్న రోజులివి. కథలనేవి ఇక తెరకు మాత్రమే పరిమితం కాదు. ప్రజలు, ప్రేక్షకులతో కథలు ప్రయాణం చేయాలి. మన మూలాలతో కూడిన కథలను అందరికీ అందించేందుకు కృషి చేయాలి’’ అని కమల్ పేర్కొన్నారు. “అలాగే, తెరపై కథలను అందంగా చెప్పడం ప్రతిభతో ఆగిపోకూడదు. ఈ కథలను అత్యధిక మందికి చేరువ చేయడానికి సరైన నాయకత్వం అవసరం. ఈ విషయంలో జియో -హాట్ స్టార్ కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నాను. వారు దక్షిణాదిని ఒక మార్కెట్ గా కాకుండా, క్రియేటివ్ గ్రావిటీగా చూడడం హర్షించదగ్గ విషయం’’ అని కమల్ అభినందించారు.“ప్రపంచ సినిమా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. మన భారతీయ మూలాలతో కూడిన కథలను ప్రపంచానికి అందించడానికి ఇది సరైన సమయం. యువతకు నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచ సినిమాలో మన కళాకారులు సత్తా చాటాలి. అదే నా కోరిక” అని ఆయన అన్నారు.

Tollywood Singer Shared Childhood Pics Goes Viral5
ఈ ఫోటోలోని సిస్టర్స్.. టాలీవుడ్‌లో ఫేమస్ సింగర్స్.. ఎవరో గుర్తుపట్టారా?

చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులను మళ్లీ వస్తే బాగుండని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. బాల్యం, స్కూల్ లైఫ్ మళ్లీ మళ్లీ రావాలని కోరుకోని వారు ఉండరేమో. అంతటి మధురమైన చిన్ననాటి చిలిపి పనులు తలచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. బాల్యం నాటి మన ఫోటోలు చూస్తే మనమేనా అన్న డౌట్‌ వచ్చేస్తుంది. అలాంటి అరుదైన ఫోటోలు దొరికితే చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది.అలాంటి మధురమైన జ్ఞాపకాలను టాలీవుడ్ స్టార్ సింగర్‌ మంగ్లీ సిస్టర్‌ ఇంద్రావతి చౌహాన్ పోస్ట్‌ చేసింది. చిన్నప్పుడు అక్క మంగ్లీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ రోజులను గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోయింది. ఇది చూసిన అభిమానులు వావ్‌ బ్యూటీఫుల్.. నేచురల్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ.. అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్‌ ఫుల్‌ ట్రెండింగ్ అయింది. మంగ్లీతో పాటే సిస్టర్‌ ఇంద్రావతి చౌహన్‌ జానపద గాయని కావడం విశేషం. ఇద్దరు సిస్టర్స్‌ సింగర్స్‌గా తెలుగు వారిని తమ ‍అలరిస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Indravathi Chauhan (@indravathi__chauhan)

This Friday Ott Release Movies List Gos Viral6
ఫ్రైడే ఓటీటీ మూవీస్ ధమాకా.. ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్..!

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం మొదలైందంటే చాలు అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో సినిమాల సందడే సందడి. ఇక ఈ వారంలో బిగ్ స్క్రీన్‌పై అలరించేందుకు అఖండ-2, మౌగ్లీ చిత్రాలు వచ్చేస్తున్నాయి. గత వారమే రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ రిలీజ్‌ చేయడం లేదు. కేవలం మౌగ్లీ మాత్రమే అఖండతో పోటీ పడనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్‌ చిత్రాలు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ కాంత మాత్రమే ఈ ఫ్రైడే కాస్తా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇది మినహాయిస్తే తెలుగులో 3 రోజేస్ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12వేక్ అప్ డెడ్ మ్యాన్-ఏ నైస్ అవుట్ మిస్టరీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12సిటీ ఆఫ్ షాడోస్(స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 12జియో హాట్‌స్టార్అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ(కామెడీ సిరీస్)- డిసెంబర్ 12టేలర్ స్విఫ్ట్- ది ఎరాస్ టూర్(డాక్యుమెంటరీ)- డిసెంబర్ 12అమెజాన్ ప్రైమ్టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12ఆహా3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12 జీ5సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12సన్ నెక్స్ట్అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12ఆపిల్ టీవీ ప్లస్ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12మనోరమ మ్యాక్స్ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12

Sankranthi 2026 Releases: Sharwanand Daring Step With Nari Nari Naduma Murari7
అటు ప్రభాస్‌..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!

టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్‌. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్‌ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ, విజయ్‌, శివకార్తికేయన్‌ లాంటి స్టార్‌ హీరోలతో నవీన్‌ పోలిశెట్టి, శర్వానంద్‌ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్‌(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్‌ అయ్యే సినిమా కూడా శర్వానంద్‌దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్‌ కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా అసలు డేట్‌ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్‌ ‘ది రాజాసాబ్‌’ జనవరి 9న రిలీజ్‌ కానుంది. అదే రోజు విజయ్‌ చివరి చిత్రం జననాయక్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్‌ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్‌ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్‌ కానుంది. మరోవైపు శివకార్తికేయన్‌ పరాశక్తి, నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్‌ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్‌పుట్‌ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్‌ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్‌ ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్‌ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ, విజయ్‌ లాంటి స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్‌ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్‌ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్‌ హిట్‌ టాక్‌ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి.

People Media Factory Sorry To Sensor Board About Bandi Saroj Comments8
మౌగ్లీ నటుడు కామెంట్స్.. టాలీవుడ్ నిర్మాణ సంస్థ క్షమాపణలు!

టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు కోరింది. నటుడు బండి సరోజ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై సారీ చెబుతూ నోట్‌ రిలీజ్ చేసింది. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని.. దీనికి బాధ్యత వహిస్తూ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు నోట్‌లో పేర్కొంది.మా నటుడు బండి సరోజ్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివరణ ఇచ్చింది. సెన్సార్ ప్రక్రియ పట్ల మాకు అత్యున్నత గౌరవం ఉందని తెలిపింది. బాధ్యత, సమగ్రతతో కంటెంట్‌ను నిర్వహించడంలో బోర్డు పాత్రను మేము గౌరవిస్తామని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డ్‌లో అత్యంత సమర్థులైన నిర్వాహకులు, సీనియర్ పరిశ్రమ నిపుణులు ఉన్నారు.. వారి మార్గదర్శకత్వాన్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది. బండి సరోజ్ వ్యాఖ్యలను తాము వెంటనే ఉపసంహకరించుకుంటున్నామని తెలిపింది. సెన్సార్ బోర్డు వారి నిరంతర సహకారం, మద్దతు కోసం మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేసింది.బండి సరోజ్ ఏమన్నారంటే..బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్‌ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్‌ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెబుతూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.People Media Factory extends its sincere apologies to the Censor Board and the Censor Officer for the unfortunate incident yesterday.An unintended remark was made by our actor, Bandi Saroj, regarding the Censor Board and the Officer’s reactions. We wish to clarify that we hold… pic.twitter.com/rXfqTjqPU3— People Media Factory (@peoplemediafcy) December 11, 2025

Tollywood actress Pragathi Reacts On Her Trolls During Practice power lift9
నాపై దారుణమైన ట్రోల్స్.. వారికి నా సమాధానం ఇదే: ప్రగతి

ఇప్పటి వరకు వెండితెరపై అభిమానులను నవ్వించిన టాలీవుడ్ నటి ప్రగతి(Pragathi) క్రీడల్లోనూ సత్తా చాటుతోంది. సినిమాలను పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ క్రీడాకారిణిగా మారిపోయింది. ఇటీవల పవర్ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా నాలుగు పతకాలు కైవసం చేసుకుంది. దీంతో టాలీవుడ్ మొత్తం ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తోంది. ఆమె టాలెంట్‌ను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.తాజాగా ప్రగతి తెలుగు వెబ్ సిరీస్‌ 3 రోజెస్‌ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆమె పంచుకున్నారు. ఎక్కడ ట్రోల్‌ చేస్తారోననే భయంతో తాను మీడియాకు దూరంగా ఉంటున్నానని ప్రగతి తెలిపారు. పవర్‌ లిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చాలామంది తనను ట్రోల్‌ చేశారని గుర్తు చేసుకున్నారు. జిమ్‌లో నా దుస్తులపై కూడా విమర్శలు వచ్చాయని అన్నారు. జిమ్‌కి చీరలు కట్టుకుని వెళ్లలేం కదా.. అందరూ అలా తిడుతుంటే చాలా బాధపడ్డానని తెలిపింది. నీకు ఈ వయసులో అవసరమా? అని చాలామంది అన్నారని ప్రగతి ఆవేదన వ్యక్తం చేసింది. (ఇది చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్‌.. చాలా బాధపడ్డా!)నాపై ఆ ట్రోల్స్‌ చూసి తప్పు చేస్తున్నానేమోనని భయపడ్డానని.. నా ఎదిగిన కూతురికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని బాధపడ్డానని ప్రగతి తెలిపింది. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగేశానని.. ట్రోల్స్‌ చేసిన వారికి పతకాలతోనే సమాధానం ఇచ్చానని ప్రగతి కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు నా పతకాలను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. మన దేశానికి ఇంత మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉందని అన్నారు. తన నెక్ట్స్ మూవీ తమిళంలో చేస్తున్నానని ప్రగతి వెల్లడించారు.ప్రగతి మాట్లాడుతూ..'నేను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్‌ చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ నేను సినిమాలు ఎప్పటికీ మానేయను. ఎందుకంటే నటించకపోతే నేను బతకలేను. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీనే. నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీని ఎప్పటికీ వదిలుకోను. తుదిశ్వాస వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటా. అలా సెట్‌లోనే కన్నుమూయాలని కోరుకుంటా' అని అన్నారు.

Telangana High Courts Suspends Akhanda 2 Movie Ticket Hike GO10
అఖండ-2 నిర్మాతలకు భారీ షాక్‌..!

అఖండ-2 కు నిర్మాతలకు భారీ షాక్‌ తగిలింది. ఈ సినిమా ప్రీయయర్‌ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణహైకోర్టు సస్పెండ్ చేసింది. అఖండ-2 మూవీ సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షో టికెట్‌ ధరల పెంపు జీవోను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నిర్మాణ సంస్థకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ తాజా నిర్ణయంతో తెలంగాణలో ప్రీమియర్ షోలు రద్దయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్‌ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్‌ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్‌ రేటుకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. తాజాగా హైకోర్ట్ ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపును సస్పెండ్‌ చేసింది. దీంతో అఖండ-2 నిర్మాతలు ప్రీమియర్ షోలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆడియన్స్‌లో సస్పెన్స్ నెలకొంది.

Advertisement
Advertisement