Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Vijay Deverakonda Kingdom Movie Sequel Cancelled1
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?

కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు హిట్ అని మేకర్స్ ఘనంగా చెప్పుకొంచారు. కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. అభిమానులు కూడా మా హీరో హిట్ కొట్టేశాడు అని హడావుడి చేస్తారు. తీరా చూస్తే కొన్నిరోజులకు అసలు ఫలితం ఏంటనేది బయటపడుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత చేసిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయాయి. యాక్టింగ్ పరంగా విజయ్‌ని వంకపెట్టడానికి ఏం లేనప్పటికీ సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడంతో చాలావరకు ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఈ ఏడాది విజయ్ నుంచి 'కింగ్డమ్' వచ్చింది. మే చివరలో థియేటర్లలో రిలీజైంది.(ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)విడుదల రోజు.. విజయ్ హిట్ కొట్టేశాడని రష్మిక పోస్ట్ పెట్టింది. తొలిరోజు మూవీ చూసిన చాలామంది కూడా బాగుందనే అన్నారు. కానీ రెండో రోజు నుంచి యావరేజ్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు రూ.130 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. రెండు భాగాలుగా తీయాలని అనుకున్నారు. తొలి భాగంలో కొంత కథ చూపించారు. కాకపోతే పెట్టిన బడ్జెట్‌కి వచ్చిన వసూళ్లకు పొంతన కుదరలేదు. దీంతో ఇప్పుడు రెండో భాగాన్ని పక్కనబెట్టేశారని తెలుస్తోంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్', రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు 'కింగ్డమ్' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా 'మ్యాజిక్' అనే చిన్న సినిమా తీశాడు. దీన్ని విడుదల చేసే పనుల్లో ఉన్నాడు. 'కింగ్డమ్' సీక్వెల్ లెక్క ప్రకారం వచ్చే ఏడాది మొదలవ్వాలి. కానీ అది ఇప్పుడు ఆర్థిక కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయిందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది కొన్ని నెలలు ఆగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు)

December 2nd Week 2025 Telugu Theatre Release Movies2
గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు

టాలీవుడ్‌లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు ఉంటుంది. గతవారం చూసుకుంటే 'అఖండ 2' రిలీజ్ అవుతుందని ఒక్కరంటే ఒక్కరు కూడా వేరే మూవీని విడుదలకు ప్లాన్ చేసుకోలేదు. దీంతో వీకెండ్ పూర్తిగా వృథా అయిపోయింది. ఈ వారం ఏమో ఏకంగా 15 చిన్నా చితకా మూవీస్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడదగ్గవి ఏవి?పేరుకే ఈ వారం 15 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. మూడు మాత్రమే కాస్త చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వాటిలో కార్తి 'అన్నగారు వస్తారు' అనే డబ్బింగ్ చిత్రం ఒకటి కాగా.. యాంకర్ సుమ కొడుకు రోషన్ 'మోగ్లీ', నందు 'సైక్ సిద్ధార్థ్' ఉన్నంతలో చూడొచ్చేమో అనిపిస్తున్నాయి. వీటికి కూడా పెద్దగా గొప్ప హైప్ ఏం లేదు. హిట్ టాక్ వస్తే తప్ప వీటిపై ప్రేక్షకులు దృష్టిపెట్టరు.(ఇదీ చదవండి: హోటల్‌ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)ఈ మూడు కాకుండా విడుదలయ్యే మిగతా సినిమాల విషయానికొస్తే సకుటుంబానాం, ఈషా, నా తెలుగోడు, పైసావాలా, ఫెయిల్యూర్ బాయ్స్, వన్ బై ఫోర్, ఘంటసాల, ఇట్స్ ఓకే గురు, కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్, డ్రైవ్, లాక్ డౌన్, ఎవడి సినిమాకు వాడే హీరో.. ఇలా బోలెడన్ని ఉన్నాయి. అసలు వీటిలో ఎన్ని మూవీస్.. ఈ వారం వస్తున్నాయని ప్రేక్షకులకు తెలుసో లేదో కూడా తెలియదు.ఇలా వస్తే వారంలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. లేదంటే ఒక్కటి కూడా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉంటుంది. ఈ విషయమై టాలీవుడ్ నిర్మాతలు కూర్చుని మాట్లాడుకోకపోతే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకే నష్టం. ఇప్పటికే ఓటీటీల తీరు వల్ల చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ హీరోల సినిమాలని థియేటర్లకు వెళ్లి జనాలు చూడటం చాలావరకు తగ్గించేశారు. ఇలా ఇన్నేసి సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం చేస్తే జనాలయినా ఎందుకొస్తారు చెప్పండి? (ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Pharma Series OTT Trailer Telugu And Streaming Details3
మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

వైద్య రంగంలో చాలా అవకతవకలు జరుగుతుంటాయి. వాటిపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌పై ఓ వెబ్ సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ.. లీడ్ రోల్ చేశాడు. ఇతడు 'ప్రేమమ్' హీరోగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమే. ఈ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)నివిన్ పౌలీ, శ్రుతి రామచంద్రన్, రజిత్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'ఫార్మా' వెబ్ సిరీస్.. వచ్చే శుక్రవారం (డిసెంబరు 19) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది. పీఏ అరుణ్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ ఫార్మా కంపెనీలో కేపీ వినోద్(నివిన్ పౌలీ), మెడికల్ రిప్రెజెంటివ్‌గా చేరతాడు. ప్రారంభంలో సేల్స్ చేయలేకపోతాడు. టార్గెట్స్ అస్సలు సాధించలేకపోతాడు. దీంతో విమర్శలు, అవమానాలు ఎదుర్కొంటాడు. తర్వాత ఈ ఉద్యోగంలో నిలదొక్కుకుంటాడు. 'కైడోక్సిన్' అనే మెడిసన్ సేల్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే ఈ మందు ఎంత ప్రమాదం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో వినోద్.. అతడి సంస్థపై తిరగబడతాడు? తర్వతా ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఎలానూ తెలుగులోనూ స్ట్రీమింగ్‌కి రాబోతుంది కాబట్టి ఈ జానర్ ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: హోటల్‌ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)

Krithi Shetty About Saw Spirit In Her Hotel Room4
హోటల్‌ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి

సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చెప్పే విషయాలు నమ్మాలా వద్దా అనే సందేహాలు రేకెత్తిస్తుంటాయి. 'ఉ‍ప్పెన' సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి.. కొన్నాళ్ల క్రితం తనకు జరిగిన వింత అనుభవం గురించి బయటపెట్టింది. తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం కనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది.'కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత ఆత్మ కనిపించలేదు. మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదంటే నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు. నాకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకముంది. ఎందుకంటే నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని నమ్ముతుంటాం. ఈ సంఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది' అని కృతి శెట్టి చెప్పింది.(ఇదీ చదవండి: ఈ పాపని గుర్తుపట్టారా? తండ్రి స్టార్ హీరో.. తల్లి, అక్క హీరోయిన్సే)కార్తీ హీరోగా ఈమె నటించిన లేటెస్ట్ తమిళ మూవీ 'వా వాతియర్'. దీన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కార్తీ.. పోలీసుగా చేస్తుండగా, కృతిశెట్టి.. ఆత్మలతే మాట్లాడే జిప్సీ తరహా పాత్రలో కనిపించనుంది. అయితే కృతి చెప్పింది చూస్తుంటే ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పినట్లు అనిపిస్తుంది. మరి నిజంగా ఈమెకు ఆత్మ కనబడిందో లేదంటే కల్పించి చెబుతోందా?కృతి కెరీర్ విషయానికొస్తే.. 'ఉప్పెన'తో సూపర్ హిట్ అందుకుంది. కానీ తర్వాత తెలుగులో చేసిన దాదాపు సినిమాలన్నీ ఫెయిల్. దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. కానీ కోలీవుడ్‌లో కూడా ఈమె చేసిన చిత్రాలు పలు కారణాల వల్ల ఆలస్యమైపోయాయి. ఈ మూవీ కూడా రెండు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉండి, ఇప్పుడు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)

Aamir Khan Responds on Movie with Lokesh Kanagaraj was Called Off 5
స్టార్ డైరెక్టర్‌తో సినిమా.. రూమర్స్‌పై స్పందించిన అమిర్ ఖాన్..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూలీ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా.. బాలీవుడ్ నటుడు ‍అమిర్ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అమిర్‌ ఖాన్‌తో మూవీ తెరకెక్కించేందుకు లోకేశ్‌ రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అటు కోలీవుడ్.. ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా రద్దైనట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే స్టోరీని మరో నటుడితో లోకేశ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిర్ ఈ విషయంపై మాట్లాడారు. కాగా.. అమిర్‌తో సినిమా పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీ తెరకెక్కిస్తానని లోకేశ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.మరోవైపు లోకేశ్ కనగరాజ్‌ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా డీసీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వామిక గబ్బి హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా రజనీకాంత్‌- కమల్‌హాసన్‌లతో లోకేశ్‌ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఖైదీ -2 మూవీని ఎప్పుడో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ బిజీగా ఉండడం వల్లే అమిర్‌ ఖాన్‌తో చిత్రంపై రూమర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Akshara Haasan Childhood Pics And Personal Details6
ఈ పాపని గుర్తుపట్టారా? తండ్రి స్టార్ హీరో.. తల్లి, అక్క హీరోయిన్సే

సినీ ఇండస్ట్రీలో వారసులు, నెపోటిజం గురించి మీకు తెలిసే ఉంటుంది. అలా ఈమె కూడా తల్లితండ్రి హీరోహీరోయిన్ కావడంతో సులువుగానే నటి అయిపోయింది. కాకపోతే పట్టుమని ఐదు మూవీస్ చేసిందో లేదో పూర్తిగా మాయమైపోయింది. ప్రస్తుతం తెరపై ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప అక్షర హాసన్. ఈమె తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ చిన్న కూతురు. కమల్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. గతంలో హీరోయిన్ సారికతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వాళ్లే శ్రుతి హాసన్, అక్షర హాసన్. శ్రుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు చేసే రేంజుకి వెళ్లింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)మరోవైపు అక్షర పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా తయారైంది. తల్లిదండ్రుల్లానే అక్షర కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. అలా 2010లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. మణిరత్నం తీసిన 'కడలి' మూవీలో ఈమెనే తొలుత హీరోయిన్ అనుకున్నారు కానీ చివరి నిమిషంలో లెక్కలు మారిపోయాయి. అలా కొన్నాళ్ల పాటు దర్శకత్వం విభాగంలో మెలకువలు నేర్చుకున్న అక్షర.. 2015లో 'షామితాబ్' మూవీతో నటిగా మారింది.తొలి సినిమాలోనే(హిందీ) అమితాబ్ బచ్చన్, ధనుష్ లాంటి స్టార్స్‌తో నటించింది. కానీ ఏం లాభం? ఫస్ట్ మూవీనే ఫ్లాప్ అయింది. తర్వాత హిందీలో మరో మూవీ.. అనంతరం తమిళంలో మూడు చిత్రాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా అక్షరకు ఉపయోగపడలేకపోయాయి. చివరగా 2022లో ఓ సినిమాలో కనిపించిన అక్షర.. తర్వాత నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే తల్లితో కలిసి ముంబైలో ఉంటోంది. తాజాగా తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న తన చిన్నప్పటి ఫొటోలని షేర్ చేసింది. అలా ఇప్పుడు మరోసారి అక్షర హాసన్.. వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: టార్గెట్‌ 'తనూజ'.. బిగ్‌బాస్‌ ఇదేం 'ట్రై యాంగిల్‌') View this post on Instagram A post shared by Aksharaa Haasan (@aksharaa.haasan)

Actresses Latest Updates in social Media goes viral7
ఆదితి రావు హైదరీ బ్యూటీ లుక్.. డిఫరెంట్‌ డ్రెస్‌లో ఆదిపురుష్ భామ..!

డిఫరెంట్‌ డ్రెస్‌లో ఆదిపురుష్ భామ కృతిసనన్..శారీలో బాలీవుడ్ భామ దియా మీర్జా అందాలు..బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌ బ్యూటీఫుల్ లుక్స్..హీరోయిన్ ఆదితి రావు హైదరీ లేటేస్ట్ లుక్..అలాండి డ్రెస్‌లో బాలీవుడ్ నటి ఇషితా దత్తా పోజులు.. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

Netizens Comments On Bigg boss 9 telugu team For thanuja8
టార్గెట్‌ 'తనూజ'.. బిగ్‌బాస్‌ ఇదేం 'ట్రై యాంగిల్‌'

బిగ్‌బాస్‌ తెలుగు 9 చివరిదశకు చేరుకుంది. నేడు జరగనున్న ఎలిమినేషన్‌ తర్వాత టాప్‌-5లో ఉండే కంటెస్టెంట్స్‌ ఎవరు అనేది తేలనుంది. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్‌ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తనూజను కావాలనే బిగ్‌బాస్‌ టీమ్‌ టార్గెట్‌ చేస్తుందని స్టార్‌ మా విడుదల చేస్తున్న ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, బిగ్‌బాస్‌ టీమ్‌ వాటిని కూడా హైడ్‌ చేయడం లేదా తొలగించడం చేస్తున్నట్లు స్క్రీన్‌ షాట్స్‌ కూడా ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు.ట్రై యాంగిల్‌ (త్రిభుజాకారం)తో రచ్చబిగ్‌బాస్‌ గేమ్‌లో భాగంగా ట్రై యాంగిల్‌ ఆకారంలో ఉన్న వస్తువును ఒకే వరుసలో ఉంచాలని, అవన్నీ ఒకే సైజ్‌లో ఉండాలని రూల్‌ పెట్టారు. అయితే, రీతూ ఎంచుకున్న వస్తువు ట్రై యాంగిల్‌లో లేదని మొదట తనూజ పాయింట్‌ పెడుతుంది. దీంతో అదే గేమ్‌లో రీతూతో తలపడి ఓడిపోయిన భరణి ఫైర్‌ అయిపోతాడు. కానీ, తనూజ ఎక్కడా కూడా నోరు జారలేదు. తన సందేహం మాత్రమే చెప్పింది. అదే బిగ్‌బాస్‌కు నచ్చినట్లు లేదు.బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లుట్రై యాంగిల్‌ (త్రిభుజాకారం) పాయింట్‌ గురించి ఈ శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాగార్జున కూడా మాట్లాడారు. అయితే, తనూజను టార్గెట్‌ చేస్తూ బిగ్‌బాస్‌ టీమ్‌ రంగంలోకి దిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తనూజ తప్పులేకున్నా సరే నాగార్జున చేత అనేక మాటలు అనిపించి బిగ్‌బాస్‌ టీమ్‌ రెచ్చిపోయిందని అంటున్నారు. గ్రూప్‌ గేమ్‌ ఆడిన ఇమ్ము, కల్యాణ్‌ల గురించి నాగ్‌ ప్రశ్నించలేదు. రింగ్‌ దాచేసిన రీతూను ఒక్కమాట కూడా అనలేదు. కానీ, తనూజ తప్పులు లేకున్నా సరే ఆమెను బిగ్‌బాస్‌ టార్గెట్‌ చేశారని పోస్టులు చేశారు. దీంతో తనూజ పేరు ఏకంగా ట్రెడింగ్‌లోకి వచ్చేసింది. ట్రై యాంగిల్‌ను తప్పుగా రెడీ చేశారని నాగార్జునే చెప్పారు. అలాంటప్పుడు తనూజను తిట్టడం ఎందుకు అంటూ నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు కూడా భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్‌ రివ్యూవర్లు కూడా తనూజను కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని చెప్పడం విశేషం. ఒక టాస్క్‌లో కల్యాణ్‌ కన్నీళ్లు పెట్టుకుంటే .. చాలా ఎమోషనల్‌ అయ్యావ్‌ ఎందుకు అని నాగార్జున ప్రశ్నిస్తారు. మరి తనూజ కన్నీళ్లు పెట్టుకుంటే అదేదో చాలాతప్పు అన్నట్లుగా నాగార్జున అనడం ఎందుకు అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తనూజ చేసిన చిన్నచిన్న తప్పులను వెతికి మరి బిగ్‌బాస్‌ టీమ్‌ టార్గెట్‌ చేస్తుందని అంటున్నారు. చివరకు ప్రోమోలలో కూడా తనూజను తప్పుగా చూపిస్తారని, ఎపిసోడ్స్‌లో చూస్తే ఏమీ ఉండదని అంటున్నారు. ఇదంతా కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడుతున్నాడని ఫ్యాన్స్‌ అంటున్నారు. Even reviewer fraternity who worked day&night to pull down #ThanujaPuttaswamy is now talking about how she is being targeted by #BiggBossTelugu9 team to help their blue eyed boy #KalyanPadala Audience are watching & they will stand for Thanuja pic.twitter.com/t8myeDDwEC— VMR (@VMR199507) December 6, 2025Biggboss reviewer on How biggboss targeting Thanuja 🤷🙏#BiggBossTelugu9 #BiggBoss9Telugu #Thanuja #demonpavan #KalyanPadala #Reethu #bharani #SumanShetty #sanjana #Emmanuel pic.twitter.com/caO9luSpU7— Common Man (@commonmanfromTG) December 7, 2025https://x.com/phantom242628/status/1994974214286389755?s=20adi reddy about targeted negative promos on Thanuja by bb team finally he addressed it #thanuja #ThanujaPuttaswamy #BiggBossTelugu9 pic.twitter.com/vE0AjCeL0l— phantom (@phantom242628) November 30, 2025We are also seeing how much more bullying you will do. Tanuja is an example of how difficult it is for a woman to rise up in our India.#BiggBossTelugu9 #Thanuja🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹pic.twitter.com/LGr0XnARS0— karthi (@karthi129867) December 6, 2025

Mythri Movie Makers Alert For Casting Call Scams in Social Media9
'అది ఫేక్.. దయచేసి అప్రమత్తంగా ఉండండి'..మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన

మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ సోషల్ మీడియా యుగంలో మోసాలు మరింత ఎక్కువయ్యాయి. సైబర్‌ క్రైమ్స్‌తో పాటు ధనార్జనే ధ్యేయంగా పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్‌ కాల్‌, ఆడిషన్స్ పేరిట ఏదో ఒక చోట ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. అలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని తాజాగా ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాణ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది. నిర్మాత నవీన్ యెర్నేని పేరు మీద ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మా దృష్టికి వచ్చిందని తెలిపింది. దయచేసి అది నకిలీ ఖాతా అని గుర్తించాలని ప్రజలను కోరింది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చే ప్రతి కాస్టింగ్ కాల్ మా అధికారిక హ్యాండిల్ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని తెలిపింది. మా చిత్రాల పేరు చెప్పుకునే వ్యక్తులు లేదా ఏజెన్సీలతో ఎవరూ సంభాషించవద్దని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు పోస్ట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అలాంటి తప్పుదారి పట్టించే ప్రొఫైల్స్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నామని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.Every casting call from Mythri Movie Makers will only be announced through our official handle @MythriOfficial. We request everyone not to engage with any individuals or agencies claiming to cast for our films.Additionally, an Instagram account impersonating Mr. Naveen Yerneni…— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2025

Rahul Ravindran Reply To Rashmika The Girl Friend Movie post10
రష్మిక ముఖంపై అన్ని రంగులెందుకు?.. ది గర్ల్‌ఫ్రెండ్‌ డైరెక్టర్ రిప్లై ఇదే!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. గతనెల థియేటర్లలో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్‌ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగానే రాబట్టింది. దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.అయితే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ బ్రేకప్‌ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీంతో ఈ మూవీకి థియేటర్ల వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ నెటిజన్‌ రష్మిక లుక్‌పై కామెంట్‌ చేశాడు. క్లైమాక్స్‌ సీన్‌లో ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఆమె ముఖం, దుస్తులపై అన్ని రంగులు ఎందుకు? ఇది చాలా పవర్‌ఫుల్‌ మూవీనే.. కానీ అర్జున్ రెడ్డికి, ది గర్‌ఫ్రెండ్‌కి సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించాడు.నెటిజన్ ప్రశ్నకు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఈ మూవీకి ఏ సినిమాతోనూ సంబంధం లేదన్నారు. ఈ రంగులు ఆమెను సిగ్గుపడేలా, అవమానించడానికి విక్రమ్ ఉపయోగిస్తాడు.. అలా వాటిని స్వీకరించడం నేర్చుకుంది. అది ఆమెలో ఇప్పుడొక భాగమని కూడా తెలుసు.. ఆ అంగీకారమే తనను మరింత బలంగా, అజేయంగా చేసిందన్నారు. ఒకప్పుడు ఇంట్రావర్ట్‌గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు కళాశాల అందరి ముందు ఈ రంగులతో నిలబడటానికి ఆలోచించదు.. దాన్ని చెప్పడానికి ఉద్దేశించినదే ఆ రంగుల ఎంపిక. సింపుల్‌గా చెప్పాలంటే మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!అని చెప్పడమేనని రాహుల్ ట్విటర్‌లో రిప్లై ఇచ్చారు. No buddy… it had nothing to do with any other movie. Vikram uses these colours/paint to shame and humiliate her. She has learnt to embrace it now. She knows it’s a part of her now. That acceptance makes her stronger, invincible even. And for someone who starts out as an… https://t.co/jfdcWe3Zh9— Rahul Ravindran (@23_rahulr) December 7, 2025

Advertisement
Advertisement