ప్రధాన వార్తలు
నవ్వులపాలైన చోటే పవన్కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్బాస్. అయితే బిగ్బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది. ఏ గేమ్ ఇచ్చినా ఈజీగా గెలిచేస్తున్నాడు.. అందరితో సరదాగా కలిసిపోయి జోకులేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్లోనూ అదే జరిగింది. ఆ విశేషాలు ఓసారి చూసేద్దాం..అదరగొట్టేసిన పవన్బిగ్బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పవన్ను పక్కకు తప్పించి మిగతా అందరూ గేమ్ ఆడారు. ఈ ఆటలో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఎక్కువ గేమ్స్ గెలిచిన పవన్ను హౌస్మేట్స్ ప్లేయర్ ఆఫ్ ది డేగా ప్రకటించారు. దీంతో అతడి అన్న వీడియో మెసేజ్ వచ్చింది. అగ్నిపరీక్షలో నిన్ను చూసి ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని పవన్ ఉప్పొంగిపోయాడు.తనూజ గెలుపుమరుసటి రోజు పిక్ ద బోన్ అనే గేమ్ ఇచ్చాడు. ఇందులోనూ మళ్లీ పవనే గెలిచాడు. దీంతో అతడికి మళ్లీ ఓ స్టార్ వచ్చింది. అంతేకాకుండా.. మటన్ ఫ్రాంకీ పంపడంతో పవన్ ఆవురావురుమని ఆరగించాడు. అనంతరం బిగ్బాస్ టవర్ గేమ్ పెట్టాడు. ఈ ఆటలో ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరిలో తనూజ గెలిచి ఓ స్టార్ అందుకుంది. అలాగే తనకోసం బిగ్బాస్ పంపిన డ్రైఫ్రూట్ రబిడీని ఆరగించింది.తనూజకు చెల్లి పెళ్లి ఫోటోఅనంతరం ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. గతంలో ఈ టాస్క్లోనే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా కింద పడిపోయాడు పవన్. అప్పుడందరూ పగలబడి నవ్వారు. కానీ, ఈసారి మాత్రం అందరికంటే ఎక్కువ హైట్లో (ఏడున్నర అడుగులు) తన చెప్పును కాలితో అతికించి శెభాష్ అనిపించుకున్నాడు. ఒక స్టార్, తందూరీ చికెన్ గెలుపొందాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డేగా తనూజను ప్రకటించారు. దీంతో ఆమెకు ఇంటినుంచి చెల్లి పెళ్లి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో తనూజను కూడా ఎడిట్ చేసి పెట్టారు. అది చూడగానే తనూజ కుటుంబాన్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
నేను పెళ్లి చేసుకోలేదు: మెహరీన్
‘‘నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు’’ అంటూ హీరోయిన్ మెహరీన్ స్పష్టం చేశారు. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’(2016) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు మెహరీన్. ఆ తర్వాత ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నారు మెహరీన్. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనుకున్నారంతా.ఆ తర్వాత ఆ నిశ్చితార్థం రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మెహరీన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ న్యూస్పై మోహరీన్ స్పందించి, సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నానంటూ కొన్ని ఆంగ్ల వెబ్సైట్స్లో ఆర్టికల్స్ వచ్చాయి. అందులోనూ నాకు తెలియని, ఎప్పుడూ కలవని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని రాశారు.నా వికీపీడియా పేజీని ఎవరో హ్యాక్ చేసి, ‘రెండు నిమిషాల పాపులారిటీ’ కోసం ప్రయత్నించిన ఒక నీచుడి పని ఇది. నా వివాహం విషయంలో రెండేళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ, ఈసారి వేధింపులు హద్దులు దాటడంతో నిజం చెప్పక తప్పలేదనిపించింది. నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు.. నన్ను నమ్మండి. భవిష్యత్తులో పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెబుతాను.. ప్రామిస్’’ అంటూ పేర్కొన్నారు మెహరీన్. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
ఈ హీరో 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే!
అరుణ్ విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం రెట్ట తల. సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించిన ఇందులో తాన్యా రవిచంద్రన్, హరీష్ పేరడీ, యోగేష్ స్వామి, జాన్ విజయ్, బాలాజీ మురుగదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బీటీజీ యూనివర్సల్ పతాకంపై బాబీ బాలచందర్ నిర్మించిన ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ క్రిష్ తిరుకుమరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు.ప్రీరిలీజ్ ఈవెంట్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్, వడివళగన్, ముత్తయ్య, కిషోర్ ముత్తుస్వామి, బాలాజీ వేణుగోపాల్, గోకుల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నా శిష్యుడేఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు తన శిష్యుడని.. గజిని, తుపాకీ చిత్రాలకు పనిచేశారని పేర్కొన్నారు. ఈ మూవీ టైటిల్ కూడా తనదేదని, తనను అడగ్గానే ఇచ్చానని చెప్పారు. నటుడు అరుణ్ విజయ్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆయన శ్రమజీవి అని.. మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు.ఛాలెంజింగ్ పాత్రఅరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తనను బాగా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో ఇందులో నటించడం ఛాలెంజ్గా అనిపించిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్లైమాక్స్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇందులో హీరో ధనుష్ ఒక పాట పాడటం విశేషమని పేర్కొన్నారు.
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
రవి మోహన్ కథానాయకుడిగా నటించిన కోమాలి చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే హీరోగా మారాడు. స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్టుడే సినిమా చేశాడు. యూత్ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. నాలుగు సినిమాలకేఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్రాగన్ మూవీ సంచలన విజయం అందుకుంది. అలాగే ఈయన హీరోగా నటించిన డ్యూడ్ కూడా బ్లాక్బస్టర్గా నిలిచింది. అలా దర్శకుడిగా, హీరోగా అపజయం అనేదే లేకుండా నాలుగు సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఏంటి?దీంతో ఈయన నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రదీప్.. మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈయన కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నాడట! దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిరోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
బిగ్బాస్
నవ్వులపాలైన చోటే పవన్కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
నా కుటుంబం కన్నా తెలుగు ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ!: తనూజ
టాప్ 5 ఛాన్స్ మిస్.. భరణి ఎలిమినేషన్కు కారణాలివే!
నేనంత దుర్మార్గుడిని కాదు, నువ్వే కప్పు గెలవాలి: భరణి
అత్యధిక రెమ్యునరేషన్తో 'బిగ్బాస్' నుంచి భరణి ఎలిమినేట్..
ఇది సుమన్కు మాత్రమే సాధ్యం.. మళ్లీ జరగదు, జరగబోదు!
'బిగ్బాస్ తెలుగు 9' ప్రైజ్ మనీ ప్రకటించిన నాగార్జున
బిగ్బాస్ 'సుమన్ శెట్టి' ఎలిమినేట్.. ఆల్టైమ్ రికార్డ్గా రెమ్యునరేషన్
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్ అవడం ఖాయం!
A to Z
ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లో పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వీటి...
మరో ఓటీటీలో 'శశివదనే' స్ట్రీమింగ్
‘పలాస 1978’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్...
థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్లో కాజల్
కొన్నేళ్ల క్రితం తెలుగులో స్టార్ హీరోయిన్గా వరస స...
మమ్ముట్టి డిటెక్టివ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన 'డొమినిక్ అ...
'ధురంధర్' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురి...
'బోర్డర్ 2' సినిమా టీజర్ రిలీజ్
భారత్- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యం కథతో తీసిన సిని...
హిందీ మార్కెట్లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్
తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ను శాసించే రేంజ...
మన సికింద్రాబాద్లో పుట్టిన డైరెక్టర్.. ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు..!
డైరెక్టర్ శ్యామ్ బెనగళ్ ఈ పేరు ఇప్పటి తరానికి అం...
ఓటీటీల్లో వందలకొద్ది వెబ్ సిరీస్లు.. టాప్-10లో ఇండియాకు నో ప్లేస్!
ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్లకు కొదవే లేదు...
నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఢీల్.. మనకు 'సినిమా'నేనా..?
హాలీవుడ్కు పునాది లాంటి వార్నర్ బ్రదర్స్తో నెట్...
భారత్లో 'సూపర్ మ్యాన్'.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’ ఓటీటీలోకి రానుం...
‘జింగిల్ బెల్ హీస్ట్’ మూవీ రివ్యూ.. సూపర్ రాబరీ!
దొంగతనాల కథాంశం సినిమాలలో మహా గమ్మత్తుగా, థ్రిల్లి...
రాజుగా మోహన్ లాల్.. వృషభ ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ స్టార్ మోహన్లాల్, తెలుగు యంగ్ హీరో రోషన్...
కొత్త కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర నటి
టాలీవుడ్ బుల్లితెర నటి అన్షు రెడ్డి తన కోరికను నెర...
'నాకు ఎవరితోనూ పెళ్లి కాలేదు'.. రూమర్స్పై టాలీవుడ్ హీరోయిన్ ఆగ్రహం
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా గురించి తెలుగు ...
డేంజర్ జోన్లో 'రామ్ పోతినేని' కెరీర్!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సరైన విజయం కోసం ఏడేళ...
ఫొటోలు
హ్యాపీ బర్త్ డే మై హార్ట్బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)
తిరుమలలో నటి స్వాతి దీక్షిత్ (ఫోటోలు)
భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)
బాబీ సింహా,హెబ్బా పటేల్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
లావణ్య బర్త్ డే.. భర్త వరుణ్ తేజ్ లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
సింహాచల పుణ్యక్షేత్రంలో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ, యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు
మరాఠీ స్టైల్లో మృణాల్ ఠాకుర్.. చీరలో నిండుగా (ఫొటోలు)
దిల్ రాజు కూతరు మేకప్ స్టూడియో.. చీఫ్ గెస్ట్గా అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)
గాసిప్స్
View all
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
దిగ్గజ గాయని బయోపిక్లో సాయిపల్లవి?
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు.. ‘స్పిరిట్’ కోసం అన్ని కోట్లా?
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!
రివ్యూలు
View all
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
1.75
‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
2
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
2.75
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
1.75
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
2.5
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
సినీ ప్రపంచం
పేరెంట్స్గా ప్రమోషన్.. లావణ్య నుంచి సోనియా ఆకుల వరకు!
ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు. కానీ తరాలు మారుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసి చూడు, పిల్లల్ని కని చూడు అంటున్నారు. ఆ రేంజ్లో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఎంత బిజీగా ఉన్నా సరే చిన్నపాపాయి నవ్వు చూస్తే ఆ ఒత్తిడి అంతా మటాష్ అయిపోతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు కెరీర్లో సెటిల్ అవగానే పేరెంట్హుడ్ గురించి ఆలోచిస్తున్నారు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందరు. ఆ జాబితాను చూసేద్దాం....వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠికొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నవీరిద్దరు గతేడాది పెళ్లి చేసుకున్నారు.సెప్టెంబర్ 10న పెళ్లిపీటలెక్కారు.ఇటీవలే తాము తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.వశిష్ట సింహ- హరిప్రియవశిష్ట సింహ- హరిప్రియ 20203 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు ఈ జంటకు మగబిడ పుట్టింది. పెళ్లిరోజునే బాబు పుట్టడం మరో విశేషం!విక్కీ కౌశల్- కత్రినా కైఫ్హీరో విక్కీ కౌశల్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఓపక్క ఛావా విజయం, మరోపక్క పుత్ర సంతానంతో గాల్లో తేలుతున్నాడు. విక్కీ- కత్రినా దంపతులలకు నవంబర్ 7న బాబు పుట్టాడు.సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీసిద్- కియారా చాలాకాలం ప్రేమలో మునిగి తేలారు. 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్లోని జైసల్మీర్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు జూలై 15న తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వచ్చినట్లు ప్రకటించారు. పాపకు సరాయా అని నామకరణం చేశారు.పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దాహీరోయిన్ పరిణీతి చోప్రా- నాయకుడు రాఘవ్ చద్దా 2023లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అక్టోబర్ 19న పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ చిన్నోడికి నీర్ అని పేరు పెట్టారు.అర్బాజ్ ఖాన్- షురా ఖాన్బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు ఈ ఏడాది అక్టోబర్5న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ కూతురికి సిపారా ఖాన్ అని నామకరణం చేశారు.రాజ్కుమార్ రావు- పాత్రలేఖసినిమాలతో బిజీ ఉండే రాజ్కుమార్- పాత్రలేఖ.. ఇద్దరూ పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది తల్లిదండ్రులుగా ఒక స్టెప్ ముందుకు వేశారు. నవంబర్ 15న తమ మూడో పెళ్లి రోజునాడే పాప పుట్టిందని ప్రకటించారు.కేఎల్ రాహుల్- అతియా శెట్టిక్రికెట్ క్రీడాకారుడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి ఈ ఏడాది మార్చిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు ఎవారా అని నామకరణం చేశారు. దీనర్థం దేవుడు పంపిన బహుమతి.వీళ్లే కాకుండా బుల్లితెర నటులు సాయికిరణ్- స్రవంతి, మహాతల్లి జాహ్నవి జంట, బిగ్బాస్ సెలబ్రిటీలు సుదీప్, సోనియా ఆకుల కూడా తొలిసారి పేరెంట్హుడ్కు స్వాగతం పలికారు. బాలీవుడ్లో జైద్ దర్బార్- గౌహర్ ఖాన్, మాళవిక రాజ్- ప్రణవ్ బగ్గ, షీనా బజాజ్ - రోహిత్ పురోహిత్, షీనా బజాజ్ రోహిత్ పురోహిత్, జహీర్ ఖాన్- సాగరిక, నవరాజ్ హన్స్- అజిత్ కౌర్.. ఇలా పలు జంటల ఇళ్లలో చంటిబిడ్డల నవ్వులు వినిపించాయి.
'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ
'అవతార్' సినిమాలో మీకు నచ్చిన విషయం ఏంటంటే చాలామంది చెప్పే మాట గ్రాఫిక్స్(వీఎఫ్ఎక్స్). నీలం రంగు మనుషులు, వాళ్లు ఉండే ప్రదేశం, వింత వింత ఆకారాలు.. ఇలా ఒకటేమిటి మూవీలోని ప్రతిదీ కూడా ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనదే. వీటన్నింటిని వందలాది మంది ఏళ్లకు ఏళ్లు కష్టపడి సృష్టించారు. అయితే పండోరా ప్రపంచాన్ని సృష్టించడంలో, వీఎఫ్ఎక్స్ విభాగాన్ని దగ్గరుండి నడిపించడంలో ఓ భారతీయ మహిళ కీలక పాత్ర పోషించిందని మీలో ఎంతమందికి తెలుసు?ప్రపంచంలో ఏ రంగంలో చూసినా భారతీయుల ఆధిపత్యం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకెళ్తున్నారు. తాజాగా బయటపడిన ఓ సంగతి.. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రపంచ సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాల్లో 'అవతార్' ఒకటి. ఇప్పటికే రెండు భాగాలు రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం మూడో పార్ట్ థియేటర్లలోకి రానుంది.జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తీసిన ఈ అద్భుతమైన సినిమాల్లో వీఎఫ్ఎక్స్ టాప్ నాచ్లో ఏ మాత్రం వంకపెట్టడానికి వీల్లేని విధంగా ఉంటాయని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వెటా ఎఫ్ఎక్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. ఇందులో పావనీ రావు బొడ్డపాటి అనే భారతీయ మహిళ.. వీఎఫ్ఎక్స్ టీమ్ని లీడ్ చేస్తోంది. తాజాగా ఈమె.. తన గురించి, ఈ మూవీస్ కోసం తాము ఎంతలా కష్టపడ్డామనే విషయాన్ని చెప్పుకొచ్చింది.ఢిల్లీలో పుట్టి పావని రావు.. తల్లిదండ్రులు, నానమ్మ-తాతయ్యతో కలిసి పెరిగింది. తన నానమ్మ స్వతహాగా ఆర్టిస్ట్ అని, కనిపించిన ప్రతి పేపర్పైన ఏదో ఒక బొమ్మ వేస్తూనే ఉండేవారని.. ఆమె ద్వారా ఇటువైపు ఆసక్తి పెరిగిందని.. అలా తొలిసారి 2009లో 'అవతార్' కోసం లైటింగ్ టీడీగా పనిచేశానని.. అప్పటినుంచి పండోరా ప్రపంచంలో ఓ భాగమైపోయానని ఈమె చెప్పింది.పావని రావు విషయానికొస్తే.. ఢిల్లీలో పెరిగిన ఈమె.. ఇక్కడే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్లో బీఆర్క్ పట్టా పొందింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంఎఫ్ఏ, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో భర్తతో కలిసి నివసిస్తోంది. 2009లో తొలిసారి 'అవతార్' కోసం పనిచేసిన ఈమె.. ఇప్పుడు రాబోతున్న మూడో భాగానికి కూడా పనిచేసింది.తొలి భాగంలో ఈమె పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ.. 2022లో రిలీజైన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కోసం దాదాపు 3000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్, అవి కూడా ఎక్కువ భాగం నీటి అడుగున ఉన్నవి పావన్ టీమ్ సృష్టించారు. ఇప్పుడు అవతార్ 3( 'ఫైర్ అండ్ యాష్') కోసం అగ్ని, బూడిద తదితర వీఎఫ్ఎక్స్ షాట్స్ రూపొందించారు. మరి ఇవి ఎలా ఉండబోతున్నాయనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనా 'అవతార్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్లో వీఎఫ్ఎక్స్ లాంటి కీలకమైన విభాగాన్ని భారతీయ మహిళ దగ్గరుండి నడిపించడం అంటే చాలా విశేషం.
ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు విరాళం
ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో హీరో నాగార్జున సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నారు. కాలేజీ కోసం రూ.2 కోట్లని విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద కళాశాల విద్యార్థులకు రూ.2 కోట్ల స్కాలర్షిప్ని నాగార్జున ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. నాన్నగారు స్థాపించిన ఏ సంస్థ అయిన నాకు ఎంతో ప్రత్యేకం. గుడివాడ రావడం భావోద్వేగంగా ఉంది. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగానూ ఉంది. మనుషులు శాశ్వతం కాదు వారు చేసే పనులే శాశ్వతం. తాను చదువుకో లేకపోయినా వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం నాగేశ్వరరావు కళాశాల స్థాపించారు.రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు చదువు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సినిమాకు రూ. 5 వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో లక్ష రూపాయలని కళాశాలకు విరాళంగా ఇచ్చారు. ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున ప్రతియేటా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాను. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అని నాగార్జున చెప్పుకొచ్చారు.అక్కినేని నాగేశ్వరరావు విషయానికొస్తే.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు 255కు పైగా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 'ధర్మపత్ని' (1941)తో ప్రారంభించి 'సీతారామ జననం' (1944)లో తొలి హీరోగా మారి, 'దేవదాసు' (1953)తో స్టార్డమ్ అందుకున్నారు, పౌరాణిక, జానపద, సామాజిక పాత్రలతో పాటు 'నవరాత్రి'లో తొమ్మిది పాత్రలు పోషించారు, 'అన్నపూర్ణ స్టూడియోస్' స్థాపించి, 'మనం' (2014) చిత్రంలో చివరగా నటించారు. తెలుగు సినిమాను మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.ఏఎన్నార్ తర్వాత నాగార్జున హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం నాగ్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది 'కుబేర', 'కూలీ' చిత్రాల్లో నాగ్ వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు.
తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగార్జున ఆన్సరిదే!
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాత కాబోతున్నాడంటూ గత కొన్నినెలలుగా ప్రచారం ఊపందుకుంది. మొదట్లో నాగచైతన్య- శోభిత పేరెంట్స్ కాబోతున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ, అదంతా ఉట్టిదేనని శోభిత టీమ్ కొట్టిపారేసింది. కొన్నిరోజులుగా అఖిల్-జైనబ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఖిల్ కానీ, అతడి ఫ్యామిలీ కానీ స్పందించలేదు.టైం వచ్చినప్పుడు చెప్తా..ఈ క్రమంలో ఓ హెల్త్ ఈవెంట్కు వచ్చిన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవుతున్నారని కథనాలు వస్తున్నాయి.. నిజమేనా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకాయన చిరునవ్వుతో.. సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని పేర్కొన్నాడు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.15 ఏళ్లుగా సమస్యఇకపోతే ఇదే ఈవెంట్ అనంతరం నాగార్జున తన మోకాలి నొప్పి గురించి మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా మోకాలినొప్పితో బాధపడుతున్నాను. సర్జరీ చేయించుకోవాలనుకోలేదు. కాకపోతే మోకాలు బెటర్ అయ్యేందుకు లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ వాడాను. వైద్యులు పీఆర్పీ (ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా) చేశారు. ఒక్కోసారి నాకు నొప్పి లేకపోయినా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు ఉదయం మోకాలి కోసం ప్రత్యేకంగా వ్యాయామం చేశాను. దాన్ని అసలు వదిలేయలేదు. అలా మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు.
స్టార్ హీరోయిన్, ఆమె భర్తపై ఫ్రాడ్ కేసు
ముంబైకి చెందిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్తని మోసం చేశారనే అభియోగాలపై కొన్ని నెలల క్రితం నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. ఈ మేరకు జుహు పోలీసులు దీనిని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా.. దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. రూ.60 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై శిల్పాశెట్టితో పాటు ఈమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 420 సెక్షన్ పెట్టారు.అసలేం జరిగింది?2015- 2023 వరకు ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం దీపక్ కొఠారి అనే వ్యక్తి.. శిల్పాశెట్టి దంపతులకు రూ.60.48 కోట్లు ఇచ్చాడు. కానీ వీళ్లు ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించుకున్నారు. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి శిల్పా-రాజ్ కుంద్రా డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా వీళ్లదే. 2016 ఏప్రిల్లో శిల్పా శెట్టి తనకు వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ చెప్పారు.అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే శిల్పా శెట్టి.. డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని దీపక్ కొన్నాళ్ల క్రితం చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. శిల్పా, ఈమె భర్త రాజ్ కుంద్రాపై ఫ్రాడ్ కేసు నమోదు చేశారు.మరోవైపు శిల్పా శెట్టికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ 'బాస్టియన్' వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్లో ఇది ఉంది. అనుమతించిన టైమ్ కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచడం, అర్ధరాత్రి పార్టీలకు పర్మిషన్ ఇచ్చి నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను బెంగళూరు పోలీసులు ఈ రెస్టారెంట్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక పోలీస్ చట్టంలోని సెక్షన్ 103 కింద సుమోటో ఫిర్యాదుల ఆధారంగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఆస్కార్ షార్ట్ లిస్ట్లో 'హోంబౌండ్'
ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం "హోమ్ బౌండ్". నీరజ్ ఘెవాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. అలాగే 2026లో జరగనున్న ఆస్కార్ అవార్డుల పోటీకి 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం' కేటగిరీలో ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే! ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఆస్కార్ ఎంపికలో అతి ముఖ్యమైన షార్ట్లిస్ట్ జాబితాలో స్థానం సంపాదించుకుంది.ఫైనల్ షార్ట్లిస్ట్ అప్పుడే..ఈ విషయాన్ని హోంబౌండ్ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా 12 విభాగాల్లో పోటీపడుతున్న సినిమాల షార్ట్లిస్ట్ను అకాడమీ ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో మొత్తం 15 సినిమాలను తాజాగా షార్ట్లిస్ట్ చేశారు. అందులో హోంబౌండ్ చోటు దక్కించుకోవడంతో సినీప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుది జాబితాలో ఈ సంఖ్యను ఐదుకి తగ్గించనున్నారు. ఈ ఫైనల్ జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. అప్పుడు కూడా హోంబౌండ్ మరోసారి షార్ట్లిస్ట్ అవుతుందని ఆశిద్దాం..హోంబౌండ్ కథేంటి?షోయబ్, చందన్ కుమార్ అనే ఇద్దరు మిత్రుల కథే హోంబౌండ్. అట్టడుగు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వీరిద్దరూ చిన్ననాటి నుంచే పోలీస్ కానిస్టేబుల్ అవాలని కలలు కంటారు. ఓపక్క పోలీస్ ఉద్యోగం కోసం కష్టపడుతూ మరోపక్క చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ, ఊరు విడిచి నగరానికి చేరుకున్నాక.. దేశంలో వేళ్లూనుకుపోయిన వివక్ష వారికి అనుభవంలోకి వస్తుంది. మరి వీరి కల నెరవేరిందా? వీరి ప్రయాణం ఎక్కడివరకు సాగిందనేదే కథ. ఈ సినిమాను కరణ్ జోహార్, అదర్ పూనావాలా నిర్మించారు. #Homebound has been shortlisted for Best International Feature Film at the 98th Academy Awards! @TheAcademy We’re deeply grateful for the extraordinary love and support we've received from around the world. pic.twitter.com/2dgXjh57Wx— Neeraj Ghaywan (@ghaywan) December 16, 2025
ఈ హీరో 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే!
అరుణ్ విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం రెట్ట తల. సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించిన ఇందులో తాన్యా రవిచంద్రన్, హరీష్ పేరడీ, యోగేష్ స్వామి, జాన్ విజయ్, బాలాజీ మురుగదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బీటీజీ యూనివర్సల్ పతాకంపై బాబీ బాలచందర్ నిర్మించిన ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ క్రిష్ తిరుకుమరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు.ప్రీరిలీజ్ ఈవెంట్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్, వడివళగన్, ముత్తయ్య, కిషోర్ ముత్తుస్వామి, బాలాజీ వేణుగోపాల్, గోకుల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నా శిష్యుడేఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు తన శిష్యుడని.. గజిని, తుపాకీ చిత్రాలకు పనిచేశారని పేర్కొన్నారు. ఈ మూవీ టైటిల్ కూడా తనదేదని, తనను అడగ్గానే ఇచ్చానని చెప్పారు. నటుడు అరుణ్ విజయ్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆయన శ్రమజీవి అని.. మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు.ఛాలెంజింగ్ పాత్రఅరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తనను బాగా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో ఇందులో నటించడం ఛాలెంజ్గా అనిపించిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్లైమాక్స్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇందులో హీరో ధనుష్ ఒక పాట పాడటం విశేషమని పేర్కొన్నారు.
నవ్వులపాలైన చోటే పవన్కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్బాస్. అయితే బిగ్బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది. ఏ గేమ్ ఇచ్చినా ఈజీగా గెలిచేస్తున్నాడు.. అందరితో సరదాగా కలిసిపోయి జోకులేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్లోనూ అదే జరిగింది. ఆ విశేషాలు ఓసారి చూసేద్దాం..అదరగొట్టేసిన పవన్బిగ్బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పవన్ను పక్కకు తప్పించి మిగతా అందరూ గేమ్ ఆడారు. ఈ ఆటలో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఎక్కువ గేమ్స్ గెలిచిన పవన్ను హౌస్మేట్స్ ప్లేయర్ ఆఫ్ ది డేగా ప్రకటించారు. దీంతో అతడి అన్న వీడియో మెసేజ్ వచ్చింది. అగ్నిపరీక్షలో నిన్ను చూసి ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని పవన్ ఉప్పొంగిపోయాడు.తనూజ గెలుపుమరుసటి రోజు పిక్ ద బోన్ అనే గేమ్ ఇచ్చాడు. ఇందులోనూ మళ్లీ పవనే గెలిచాడు. దీంతో అతడికి మళ్లీ ఓ స్టార్ వచ్చింది. అంతేకాకుండా.. మటన్ ఫ్రాంకీ పంపడంతో పవన్ ఆవురావురుమని ఆరగించాడు. అనంతరం బిగ్బాస్ టవర్ గేమ్ పెట్టాడు. ఈ ఆటలో ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరిలో తనూజ గెలిచి ఓ స్టార్ అందుకుంది. అలాగే తనకోసం బిగ్బాస్ పంపిన డ్రైఫ్రూట్ రబిడీని ఆరగించింది.తనూజకు చెల్లి పెళ్లి ఫోటోఅనంతరం ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. గతంలో ఈ టాస్క్లోనే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా కింద పడిపోయాడు పవన్. అప్పుడందరూ పగలబడి నవ్వారు. కానీ, ఈసారి మాత్రం అందరికంటే ఎక్కువ హైట్లో (ఏడున్నర అడుగులు) తన చెప్పును కాలితో అతికించి శెభాష్ అనిపించుకున్నాడు. ఒక స్టార్, తందూరీ చికెన్ గెలుపొందాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డేగా తనూజను ప్రకటించారు. దీంతో ఆమెకు ఇంటినుంచి చెల్లి పెళ్లి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో తనూజను కూడా ఎడిట్ చేసి పెట్టారు. అది చూడగానే తనూజ కుటుంబాన్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న డ్రాగన్ హీరో!
రవి మోహన్ కథానాయకుడిగా నటించిన కోమాలి చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే హీరోగా మారాడు. స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్టుడే సినిమా చేశాడు. యూత్ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. నాలుగు సినిమాలకేఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్రాగన్ మూవీ సంచలన విజయం అందుకుంది. అలాగే ఈయన హీరోగా నటించిన డ్యూడ్ కూడా బ్లాక్బస్టర్గా నిలిచింది. అలా దర్శకుడిగా, హీరోగా అపజయం అనేదే లేకుండా నాలుగు సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఏంటి?దీంతో ఈయన నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రదీప్.. మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈయన కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నాడట! దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిరోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
బ్యాడ్ గాళ్స్.. ఫుల్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. లేలో అంటూ సాంగే ఫుల్ రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా.. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్ అని దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి అన్నారు.
సినిమా
చికిరి చికిరి 100M వ్యూస్..
మరో వివాదంలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి
ఎన్టీఆర్ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ అదిరిపోయే స్కెచ్
దీపికా కంటే ప్రియాంక మరీ.. అందుకే కల్కి 2లో..!
అప్పుడే 2027 పొంగల్ పై..! కన్నేసిన సీనియర్ హీరోస్
దూసుకుపోతున్న దురంధర్.. పుష్ప 2 రికార్డు అవుట్
రంగంలోకి నమ్రతా..! మహేష్ బాబు, వంగా కాంబో ఫిక్స్
ఇకపై మంచి పాత్రలు చేస్తా
కుటుంబంతో తిరుమల శ్రీవారి సేవలో రజనీకాంత్..
వారణాసిలో మహేష్ బాబు గెటప్స్ తెలిస్తే ఫ్యాన్స్ కు నిద్రపట్టదు భయ్యా !
