Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Prabhas comments about Tollywood Director Puri Jagannadh1
ఆ క్యారెక్టర్‌ గురించి చెప్పగానే పిచ్చెక్కిపోయింది: ప్రభాస్

టాలీవుడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌పై రెబల్ స్టార్ ప్రశంసలు కురిపించారు. బుజ్జిగాడు మూవీకి రాసి క్యారెక్టరైజేషన్‌ చూసి నాకు పిచ్చెక్కిపోయిందని అన్నారు. ఎలా చేయాలిరా బాబు.. నేనెప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదన్నారు. ఆయనలా క్యారెక్టర్‌కు డైలాగ్స్ రాయడం మన ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనూ లేరని ప్రభాస్ కొనియాడారు.ప్రభాస్ మాట్లాడుతూ.. 'పూరి జగన్నాధ్‌లా క్యారెక్టరైజేషన్ రాయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయనలా క్యారెక్టర్ డిజైనింగ్‌ మన ఇండియాలోనే కాదు.. ఈ ప్రపంచంలోనే ఎవరూ రాయలేరు. బుజ్జిగాడు మూవీలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఎవరితో మాట్లాడిన బుజ్జిగాడి గురించే మాట్లాడేవాణ్ని. అంత స్ట్రాంగ్ డైలాగ్స్ రాయడం ఆయనకే సాధ్యం. ఎక్ నిరంజన్‌లో నాకు అది చాలా ఫేవరేట్. ఏంటి మగాళ్లు ఏడుస్తారా? ఏంటి ఎవరైనా ఏడుస్తారని రాయడం నాకు భలే అనిపించింది. ఈ డైలాగ్‌ను హిందీలో దబాంగ్‌ సినిమాలో కూడా అడిగి మరీ వాడుకున్నారు' అని అన్నారు. #PuriJagannadh గారిలా క్యారెక్టరైజేషన్స్ ప్రపంచంలోనే ఎవరూ రాయలేరు! - #PrabhasFull Interview: [https://t.co/tTUZ0qSAFZ] pic.twitter.com/Wo7mcLMdsE— Filmy Focus (@FilmyFocus) February 20, 2026

Tollywood actress Social Media Updates Goes Viral2
కలర్‌ఫుల్ డ్రెస్‌లో నిహారిక.. జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ రమ్య..!

కొత్త లోకా బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లేటేస్ట్ లుక్..కలర్‌ఫుల్ డ్రెస్‌లో టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల..వైట్‌ డ్రెస్‌లో వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా..జిమ్‌లో చెమట్చోడుస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష..శారీలో నటి నిక్కీ గల్రానీ అందాలు.. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Ramya moksha kancharla (@ramya_moksha) View this post on Instagram A post shared by Archana Singh Rajput (@rajput_archanasingh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)

Actor Pramod Shetty says Rashmika not invite her Kirik Party co star 3
విజయ్-రష్మిక పెళ్లి..నాకు ఆహ్వానం అందలేదు: ప్రముఖ నటుడు

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండల వివాహానికి తమను ఆహ్వానిస్తారని వెయిట్ చేయడం లేదని ప్రముఖ నటుడు ప్రమోద్‌ శెట్టి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా రక్షిత్‌ శెట్టిని.. తనను ఆమె వివాహానికి పిలుస్తారని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రక్షిత్ శెట్టి‌ పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రమోద్‌ శెట్టి తెలిపారు. హీరోయిన్‌ రష్మికతో వివాహం కానందుకు రక్షిత్‌ శెట్టి బాధపడడం లేదని వెల్లడించారు.కాగా.. గతంలో రష్మికకు కన్నడ హీరో రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. అంతకుముందు రష్మిక, రక్షిత్ కిరిక్‌ పార్టీ మూవీలో జంటగా నటించారు. రష్మిక ఈ మూవీతోనే కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రమోద్‌శెట్టి కీలక పాత్రలో కనిపించారు.కాగా.. ఈ నెల 26న టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ- రష్మిక వివాహం జరగనుంది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖులు, సన్నిహితులు హాజరు కానున్నారు.

Tollywood director Raghav Omkar Sasidhar Buys Luxury Car4
లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ డైరెక్టర్.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ కొత్త ప్రయాణం చాలా గర్వంగా ఉందన్నారు. నా ఫ్యామిలీలోకి మెర్సిడెజ్ ఈ క్లాస్ కారును సాదరంగా ఆహ్వనిస్తున్నానంటూ పోస్ట్ చేశారు. ఇది కేవలం కారు మాత్రమే కాదు.. ఓర్పు, కృషి, విశ్వాసం ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తాయని గుర్తుచేస్తుందని రాసుకొచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది.కాగా.. రాఘవ్ ఓంకార్ శశిధర్ ది 100 మూవీకి దర్శకత్వం వహించారు. 2024లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు నిర్మించారు. అంతేకాకుండా డైరెక్టర్ శశిధర్.. ఓంకారం, నన్ను క్షమించండి, లడ్డు ఏ స్వీట్ మెమొరీ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar)

Divya Agarwal Shuts Down Separation Rumours With Apurva Padgaonkar5
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నటి

హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 1 ఓటీటీ విన్నర్‌ దివ్య అగర్వాల్‌, భర్త అపూర్వ పడ్‌గోయంకర్‌ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.హ్యాపీ యానివర్సరీ మై లవ్‌నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్‌.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.అసలేమైంది?దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్‌ భవ్య సింగ్‌.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్‌ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్‌ రాగా వాటిని నటి టీమ్‌ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Divyaa Agarwal (@divyaagarwal_official)

Arjun Sarja's Seetha Payanam Movie Collections In Four Days6
అర్జున్ సర్జా కూతురి మొదటి సినిమా.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సీతా పయనం. ఈ చిత్రంలో నిరంజన్, ఐశ్వర్య ‍అర్జున్ జంటగా నటించారు. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.8.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. కేవలం మౌత్ టాక్‌తో ఈ సినిమాకి కలెక్షన్స్ పెరగడం విశేషం. త వారం విడుదలైన చిత్రాల పరంగా చూస్తే సీతా పయనం టాప్‌లో కొనసాగుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఈ మూవీలో అర్జున్, ధృవ్ సర్జాలు సైతం స్పెషల్ కేమియో రోల్స్‌లో మెప్పించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.

Archana Puran Singh Says She and Husband Slept Separately for 7 Years7
ఏడేళ్లు విడివిడిగా నిద్ర.. మా ఇద్దరికీ స్లీప్‌ డివోర్స్‌: నటి

బాలీవుడ్‌ నటి అర్చన పూరణ్‌ సింగ్‌ అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇవేవీ కాకుండా సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో ఫ్యామిలీతో కలిసి వీడియోలు చేస్తోంది. ఎటువంటి మొహమాటం లేకుండా పర్సనల్‌, ప్రొఫెషనల్‌.. అన్ని విషయాలను పంచుకుంటోంది. ఐ లవ్యూ చెప్పుకోవడం కాదుతాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఐ లవ్యూ చెప్పుకోవడంలో కాదు, దాన్ని చూపించడంలో ఉంటుంది. అయితే పెరుగుతున్న వయసును బట్టి ఈ ప్రేమ రూపాలు కూడా మారుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఎదిగిపోయారు. కాబట్టి మరోసారి మేమిద్దరం కలిసి కబుర్లు చెప్పుకునే వీలు దొరికింది. నాకు ఆలస్యంగా పడుకోవడం అలవాటు. తనేమో త్వరగా నిద్రపోతాడు. చిన్న పనులే..అతడికి డిస్టర్బ్‌ అవకూడదని నేను ఎటువంటి శబ్ధాలు చేయను. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకునే పాటలు వింటాను. పొద్దున ఆయన త్వరగా లేస్తాడు. అప్పుడు నేనింకా నిద్రలోనే ఉంటాను కాబట్టి తను కూడా నన్ను డిస్టర్బ్‌ చేయడు. సైలెంట్‌గా తన పనులు తాను చేసుకుంటాడు. ఈ చిన్నచిన్న పనులే ప్రేమను సూచిస్తాయి.ఈ లెక్కన విడాకులైనట్లే!నా భర్తకు గురక అలవాటు ఉంది. నాకేమో చిన్న అలికిడి అయినా చటుక్కున లేస్తాను. మళ్లీ నిద్రలోకి జారుకోవడం చాలా కష్టం. అందుకే భర్త పక్కన నేను పడుకోలేను. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని స్లీప్‌ డివోర్స్‌ అంటారు. ఐదు నుంచి ఏడేళ్లపాటు మేమిద్దరం ఇలాగే విడివిడిగానే నిద్రపోయాం. ఈ లెక్కన విడాకులు తీసుకున్నట్లే! (నవ్వుతూ)జీవితం చాలా చిన్నదిగత 10-15 ఏళ్లలో మా మధ్య ఇగో పూర్తిగా నశించిపోయింది. ముందు నువ్వే సారీ చెప్పాలన్న వాదన అనేదే మా మధ్య లేదు అని చెప్పుకొచ్చింది. అర్చన భర్త, నటుడు పర్మీత్‌ మాట్లాడుతూ.. జీవితం చాలా చిన్నది. ఇంకా ఎన్ని పండుగలు, బర్త్‌డేలు ఉన్నాయని? ప్రతిదానికి గొడవపడుతూ కూర్చుంటే జీవితమే చేజారిపోతుంది. అన్నింటినీ పక్కనపెట్టి సంతోషంగా బతికేయాలి అని చెప్పుకొచ్చాడు.చదవండి: అజిత్‌, విజయ్‌ మధ్య శతృత్వం? క్లారిటీ ఇచ్చిన షాలిని

Sree Vishnu's MrithyuNjay New Release Date Announced8
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. కొత్త రిలీజ్‌ డేట్ ఇదే

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.అయితే అదే రోజు విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం కూడా రిలీజ్ కానుంది. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడమేంటని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంలో ఫ్యాన్స్‌కు క్రేజీ ‍అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా శ్రీవిష్ణు తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్‌ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. మృత్యుంజయ్ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. Release date marindhi, thrillu kaadhu🔥Meet #MrithyuNjay in cinemas from March 6th❤️‍🔥 pic.twitter.com/vrKKwW0Ijo— Sree Vishnu (@sreevishnuoffl) February 20, 2026

Shalini: Vijay and Ajith Kumar Happy for Each Other Success9
అజిత్‌, విజయ్‌ మధ్య శత్రుత్వం? ఎలా ఉంటారో చెప్పిన షాలిని

కోలీవుడ్‌ స్టార్స్‌ అజిత్‌, విజయ్‌ మధ్య పోటీ సంగతేమో కానీ, వారి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఎప్పుడూ మా హీరో గొప్ప, మా హీరో తోపు అని వాదులాడుకుంటూనే ఉంటారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే మాత్రం బాక్సాఫీస్‌ వద్ద రణరంగం లాంటి పరిస్థితే కనిపిస్తుంది.షాలిని ఆసక్తికర వ్యాఖ్యలుహీరోల మధ్య కూడా ఈ శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటోంది అజిత్‌ సతీమణి, నటి షాలిని. తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌లో షాలిని మాట్లాడుతూ.. అజిత్‌, విజయ్‌.. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఒకరి సక్సెస్‌ను చూసి మరొకరు అభినందిస్తుంటారు. ఒకరిపై మరొకరికి సానుకూల అభిప్రాయం ఉంది అని పేర్కొంది. అప్పుడు కూడా వివాదంఇది విన్న అభిమానులు ఇద్దరు హీరోలు మనసున్న మనుషులే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది అజిత్‌ను కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. అప్పుడు విజయ్‌ అజిత్‌కు కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పలేదని వివాదం చెలరేగింది. దీంతో అతడి టీమ్‌ స్పందిస్తూ.. . అజిత్‌ సర్‌కు మొదటి కృతజ్ఞతలు చెప్పినవారిలో విజయ్‌ ఒకరు. సినిమాఇద్దరూ స్నేహపూర్వకంగా మెదులుతారు. అజిత్‌ సర్‌కు విజయ్‌ విషెస్‌ చెప్పలేదనడంలో ఎటువంటి నిజం లేదు అని వివరణ ఇచ్చింది. కాగా విజయ్‌ చివరగా నటించిన సినిమా జన నాయగణ్‌. జనవరిలో విడుదలవాల్సిన ఈ మూవీ సెన్సార్‌ కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అజిత్‌.. ప్రస్తుతం కార్‌ రేసింగ్‌ పోటీల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: తిరుమల గుడిలో అలాంటి అనుభవం.. శివానీ కామెంట్స్‌పై వివాదం

Prasanth Varma and Prabhas Project Shelved is true Details Here10
ప్రశాంత్ వర్మ- ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?.. అసలు నిజమేంటి?

యంగ్ రెబల్ స్టార్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడితో ఫౌజీ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. తన చేతిలో ఏకంగా నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవీ కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ మూవీకి రెబల్ స్టార్ ఓకే చెప్పిన సంగతి తెలిసింది.ఇన్నీ భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రభాస్ చేతిలో ఉండగా.. ప్రశంతా వర్మతో సినిమా చేసేందుకు టైమ్‌ కేటాయిస్తారా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ రద్దైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సిన మూవీ ఆగిపోయిందని టాక్ వినిపించింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌ గురించి తెగ ఆరా తీస్తున్నారు. నిజంగానే ఈ సినిమా ఆగిపోయిందా అని షాకవుతున్నారు.ప్రశాంత్ వర్మ క్లారిటీ..ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందన్న వార్తలపై డైరెక్టర్ స్వయంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటివీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తాయని అన్నారు. ప్రభాస్‌తో ప్రాజెక్ట్ రద్దు కాలేదని.. ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వల్లే ఆలస్యం కానుందని తెలిపారు. స్పిరిట్, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతే తప్ప తమ ప్రాజెక్ట్‌ రద్దు వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. కాగా.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్‌, కల్కి-2 సినిమాలు చేయనున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత, అతను ప్రశాంత్ వర్మతో కలిసి పని చేసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. ఇక రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌ చిల్ అవుతూ అప్‌డేట్స్ కోసం వేచి చూడటమే. జై హనుమాన్‌తో బిజీగా ప్రశాంత్ వర్మమరోవైపు ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో జై హనుమాన్‌ తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెల 22న హంపిలో ప్రారంభం కానుందని సమాచారం. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement
Advertisement