Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Madhapur police case filed on actor Chandrahass1
యాటిట్యూడ్ కాదది అహంకారం.. చంద్రహాస్‌పై కేసు

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదైంది. తను నటించిన బరాబర్ ప్రేమిస్తా అనే మూవీలో బూతు పాటపై సోషల్‌మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్‌ పాడిన పాట వివాదాలకు కారణమైంది. అందులో అసభ్య పదాలు ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్‌ అశోక్‌కుమార్‌ తప్పబడుతూ ఒక వీడియో​ పోస్ట్‌ చేశారు. పాటలో చంద్రహాస్‌ ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకంగా ఉందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయిన చంద్రహాస్‌ కౌంటర్‌గా సదరు జర్నలిస్టును బెదిరిస్తూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్‌ చేశారు. దీంతో అశోక్‌కుమార్‌ మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తండ్రిగా ప్రభాకర్ వైఫల్యం.. చంద్రహాస్‌పై సైకాలజిస్ట్ విశేష్ కామెంట్‌సినిమా సక్సెస్ కోసం సభ్యతాసంస్కారాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయారన్నది ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న వికృత చేష్టలు చూస్తుంటే అర్థమవుతోంది.ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వికృత ప్రవర్తన అందుకు తాజా ఉదాహరణ. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అది కుళ్ళిపోతున్న సామాజిక ధోరణికి నిదర్శనం.'తప్పుడు' ప్రయాణంపిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే, సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పడం ముఖ్యం. వేదికపై మహిళలు ఉన్నారనే కనీస జ్ఞానం లేకుండా బూతు పదాలతో పాట పాడటం 'యాటిట్యూడ్' కాదు, సంస్కారహీనత. తండ్రి వెనక ఉండి నడిపిస్తున్నాడా? లేక కొడుకు దారి తప్పుతుంటే మౌనంగా చూస్తున్నాడా? కారణం ఏదైనా, పక్కనే ఉండి అసభ్యతను ప్రోత్సహించడం "తండ్రిగా పేరెంటింగ్ వైఫల్యమే." సైకాలజీ ఏం చెబుతోంది?సైకాలజీ పరిభాషలో దీనిని 'Attention Seeking Narcissism' అంటారు. అంటే, మంచిగా గుర్తింపు రానప్పుడు, అసభ్యతతోనైనా సరే వార్తల్లో ఉండాలనే పైశాచిక ఆనందం. "నేను సారీ చెప్పను" అనడం మొండితనం కాదు, తనలోని ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి 'అహంకారం' అనే ముసుగు వేసుకుంటున్నాడు.విమర్శలను స్వీకరించలేని వాడు విజ్ఞుడవ్వలేడు, ప్రజాదరణ పొందిన నటుడవ్వలేడు.షార్ట్ కట్ సక్సెస్... లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్వైరల్ అవ్వడం అంటే విజయం సాధించడం కాదు. నెగటివ్ పబ్లిసిటీతో సినిమాను గట్టెక్కించవచ్చు ఏమో కానీ, వ్యక్తిగా ప్రజల గుండెల్లో గౌరవాన్ని కోల్పోతే దాన్ని సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు. జెడి చక్రవర్తి వంటి సీనియర్ల అసహనం చూసైనా మారాలి.'యాటిట్యూడ్ స్టార్' కాదు... 'అజ్ఞాన స్టార్'స్టార్‌డమ్ అనేది ప్రవర్తనలో ఉండాలి, పిచ్చి చేష్టల్లో కాదు. సభ్యత నేర్వని విద్య, సంస్కారం లేని కళ రెండూ వ్యర్థమే. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు... కానీ మనిషిగా ఓడిపోకూడదు. ఇప్పటికైనా ఆ తండ్రీ కొడుకులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే, ప్రేక్షకులు ఇచ్చే తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది.

Actress Jayavahini passed away2
ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి

టాలీవుడ్‌లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్‌ పద్మక్క అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన వైద్యం కోసం రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను జత చేశారు కూడా.. ఆయితే, దాతల నుంచి సరైన సాయం అందకపోవడంతో వాహిని మరణించడం బాధాకరం.ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వాహిని బుధవారం సాయంత్రం (2026 ఫిబ్రవరి 4న) తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని నటి కరాటే కల్యాణి తెలిపారు. తనను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశానని బాధతో ఆమె పోస్ట్‌ చేశారు. తన సొంత ఊరు విజయనగరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కళ్యాణి చేసిన పోస్ట్, సినీ అభిమానులను, నెటిజన్లని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.ఎవరీ వాహిని?విజయనగరంలో జన్మించిన వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్‌ అయింది. చివరగా పోలీస్‌ వారి హెచ్చరిక సినిమాలో నటించింది. నరేశ్, విజయకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందింది.కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారని తనకు ఆర్థిక సాయం చేయాలని కరాటే కల్యాణి కోరారు. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదని కల్యాణి చెప్పుకొచ్చారు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు ఇవ్వాలని కల్యాణి కోరారు. కానీ, సరైన సమయంలో ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడంతో మరణించారు. కేవలం డబ్బు కారణంగా వాహిని మరణించారని తెలుసుకున్న నెటిజన్లు బాధతో పోస్టులు పెడుతున్నారు.

Sandeep Reddy Vanga announced Animal Park movie schedule3
'యానిమల్‌' సీక్వెల్‌పై ఆప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌రెడ్డి

రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా మూవీ ‘యానిమల్‌’ భారీ విజయం అందుకుంది. దీంతో సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ‘యానిమల్‌’ వచ్చి సుమారు 3ఏళ్లు కావస్తుంది. కానీ, సీక్వెల్‌ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు సందీప్‌రెడ్డి పార్ట్‌-2 గురించి పలు విషయాలు పంచుకున్నారు.ఫిబ్రవరి 13న యానిమల్‌ సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. జపాన్‌ అభిమానులతో సందీప్‌ మాట్లాడుతూ ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. 2027లో షూటింగ్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. 2028లో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో రణ్‌బీర్‌ హీరోగా, విలన్‌గా నటించనున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్ట్ స్పిరిట్‌ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుందని సందీప్‌ వెల్లడించారు. ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత దూకుడుగా ఉంటుందని పేర్కొన్నారు. 2023లో విడుదలైన యానిమల్‌ మూవీ ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలుంటాయని గతంలో రణ్‌బీర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Sarvam Maya movie OTT streaming and story4
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు

జాగ్రత్త....ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సినిమా. అయినా కంగారుపడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటే దెయ్యం, అస్థిపంజరం, స్మశానం... ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తరుణంలో దర్శకుడు అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా ఇష్టపడేటట్టు చేశాడు. నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సర్వం మాయ ఓ మళయాళ సినిమా.ఈ సినిమాలో కథానాయకుడైన ప్రబేందు స్వతహాగా నాస్తికడైనా కుల వృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రబేందు మంచి గిటారిస్టు కూడా. ప్రబేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఇక అక్కడ నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాషా దెయ్యం కాదు. ఆ దెయ్యాన్ని చూస్తే ప్రేక్షకులు కూడా తమకూ అలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండును అని అనుకోక మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఓ పేరు కూడా ఉంటుంది అదే డెలలూ. ఈ కథలో ప్రబేందును కలిసిన ఆ డెలలూ చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డెలలూ తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యం అయిందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రబేందుని పట్టుకుంటుంది. మరి ఆ డెలలూ ఆచూకీ కనిపెట్టడంలో ప్రబేందు డెలలూకి సాయపడతాడా, అలాగే ఆ డెలలూ వల్ల ప్రబేందుకి కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. ఏది ఏకమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలూ కోసం ఓ సారి చూడాల్సిందే. ఇంకెందుకాలస్యం వీకెండ్ హాట్ స్టార్ ట్యూన్ చేసి డెలలూ తో జత కట్టండి.

Parasakthi movie telugu OTT streaming details5
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్‌ డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌

సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్‌ మూవీ ‘పరాశక్తి’ కోలీవుడ్‌లో విడుదలైంది. తెలుగులో థియేటర్స్‌ కొరత కారణంగా ఇక్కడ రిలీజ్‌ కాలేదు. అయితే, డైరెక్ట్‌గా తెలుగు వర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. సినిమా విషయంలో పలు విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్‌ పరంగా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది.పరాశక్తి(Parasakthi) సినిమా జనవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్‌ కూడా విడుదల కానుంది. టాలీవుడ్‌లో శివకార్తికేయన్‌కు భారీ క్రేజ్‌ ఉండటంతో పరాశక్తి చిత్రాన్ని చూసేందుకు తెలుగు ఫ్యాన్స్‌ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇదే సినిమాతో నటి శ్రీలీల హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అయిన విషయం తెలిసిందే.1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ గొడవల సమయంలో ఇద్దరు సోదరులు, చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనేది కథ యొక్క ముఖ్యాంశం. ఇందులో బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ప్రీ-క్లైమాక్స్ లో రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, డాలీ ధనంజయ కీలకమైన అతిధి పాత్రలో కనిపిస్తారు.

Simbu and Vetrimaaran movie will be confirmed6
శింబు కొత్త చిత్రం షురూ!

లిటిల్‌ స్టార్‌ నుంచి లిటిల్‌ సూపర్‌స్టార్‌ వరకు ఎదిగిన నటుడు శింబు. ఈయన నటించే నూతన చిత్రం ప్రారంభం కాబోతోందంటేనే అభిమానులకు పండగ. అది హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా బాధ పడరు. శింబు కొత్త చిత్రంలో నటించడమే చాలు అభిమానులకు. కాగా ఈయన మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కమలహాసన్‌తో కలసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్స్‌ లైఫ్‌ చిత్రం డిజాస్టర్‌గా మారింది. ప్రస్తుతం వెట్రిమారన్‌ దర్శకత్వంలో అరసన్‌ అనే గ్యాంగ్‌స్టర్స్‌ కథా చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ రేర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అరసన్‌ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా శింబు కథానాయకుడిగా నటించనున్న చిత్రం షురూ అయ్యింది. దీన్ని డ్రాగన్‌ చిత్రం ఫేమ్‌ అశ్వద్‌ మారిముత్తు తెరకెక్కించనున్నారు. వరుస విజయాలతో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు గాంచిన ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మంగళవారం శింబు పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం శింబు నటిస్తున్న అరసన్‌ చిత్రం పూర్తి అయిన తరువాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందని మీడియాకు విడుదల చేసిన ప్రకనటనలో యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. కొద్ది రోజులు ఆగండి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని దర్శకుడు అశ్వద్‌ మారిముత్తు ఎక్స్‌ మీడియాలో పేర్కొన్నారు. కాగా తన 43వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న శింబుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన అభిమానులు అయితే పుల్‌ ఖుషీ అవుతున్నారు.

Rajamouli, Mahesh Babu, Varanasi Hot talk about OTT deal7
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్‌

దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్‌స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్‌లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్‌లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్‌ సాధ్యపడొచ్చని అంచనా.650 కోట్ల రేంజ్‌లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది. ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్‌ అని చెప్పొచ్చు.

Mana Shankara VaraPrasad Garu Movie Ott Release date Revealed8
ఓటీటీకి మనశంకర వరప్రసాద్‌గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది

మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.బాక్సాఫీస్‌ వద్ద హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీకి రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మనశంకర వరప్రసాద్‌గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‌కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో టాలీవుడ్ సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి మూవీ స్ట్రీమింగ్ డేట్‌ కూడా తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Attitude star chandrahas Reacts about His Song at Pre Release Event9
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్

బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్‌లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్‌ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్‌లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదునేను ఎవరికీ సారి చెప్పనుఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదుమూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారుఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026

The first look poster of the film o Torture Prema has been revealed10
ఓ టార్చర్ ప్రేమ కథా చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

సన్నీ మాదాల, మౌనిక జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ మూవీకి శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మాదాల రంగారావు మనవడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మౌనిక సైతం ఈ చిత్రం ద్వారానే హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ' మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల మూడోతరం హీరో పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు కీలక పాత్రలు పోషించారు.

Advertisement
Advertisement