ప్రధాన వార్తలు
షూటింగ్ పోదాం చలో చలో...
ఓ వైపు నూతన సంవత్సరం జోరు. మరోవైపు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగలా భావించే సంక్రాంతి సందడి... ఈ సంక్రాంతికి విడుదలైన ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలన్నీ ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతున్నాయి. థియేటర్లలో సంక్రాంతి పండగ సందడి ఇంకా కనిపిస్తోంది.ఈ పండగకి చిన్న విరామం తీసుకున్న మన హీరోలు సంక్రాంతి ముగియగానే ‘షూటింగ్ పోదాం చలో చలో’ అంటూ సెట్స్లో వాలిపోయారు. తమ సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కొందరు హీరోలు విదేశాల్లో తమ మూవీ షూటింగ్స్లో జాయిన్ కాగా... వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్చరణ్, నాని, విజయ్ దేవరకొండ, సాయిదుర్గా తేజ్ వంటి పలువురు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జోరుగా హుషారుగా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.... వెంకటేశ్ బేగంపేటలో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, సక్సెస్పుల్ డైరెక్టర్గా పేరు సం పాదించుకున్న త్రివిక్రమ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని బేగంపేట చిరాగ్ పోర్ట్లో జరుగుతోంది.వెంకటేశ్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి’ కి త్రివిక్రమ్ మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ మూవీస్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. ఫ్యామిలీ హీరోగా వెంకటేశ్కి ఉన్న ఇమేజ్, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.మహేశ్బాబు గండిపేటలో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రియాంకా చో్ర పా హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడు కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్కి మంచి స్పందన వచ్చింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.అక్కడ ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారట రాజమౌళి. ఈ షెడ్యూల్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం మహేశ్బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. మహేశ్బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు. గత నవంబరులో హైదరాబాద్లో నిర్వహించిన ‘వారణాసి’ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరేలా చేసింది.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని హాలీవుడ్కి ఏ మాత్రం తగ్గని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారట రాజమౌళి. ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పక్కా డేట్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ అప్డేట్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు త్వరలోనే ఒక తీపి కబురు అందనుందని ఫిల్మ్నగర్ టాక్.‘వారణాసి’ విడుదల తేదీని ఈ ఏడాది శ్రీరామ నవమి (మార్చి 26న) సందర్భంగా ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాపై మహేశ్బాబు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ‘‘వారణాసి’ నా కలల ్ర పాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో మహేశ్బాబు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ఎఫ్సీలో... ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్నగర్ టాక్. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతోంది. అక్కడి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఈ సెట్లోనే జరిగిన గత షెడ్యూల్స్లో ఓ నైట్ సాంగ్ని, ఓ యాక్షన్ సీక్వెన్స్ను కూడా చిత్రీకరించారని తెలిసింది. ప్రస్తుత షెడ్యూల్లో ఎన్టీఆర్పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ జనవరి ఆఖరు వరకు సాగుతుందట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట... సుమారు పదిహేను కోట్ల రూ పాయలతో వేసిన ఎన్టీఆర్ ఇంటి సెట్... ఇలా అన్నీ హైలెట్గా మారాయి. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ‘కేజీఎఫ్, సలార్, మార్కో’ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రామ్చరణ్ అజీజ్నగర్లో... రామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది.రామ్ చరణ్తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట బుచ్చిబాబు. ‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ‘పెద్ది’ చిత్రంలోనూ ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు రామ్చరణ్. ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్ను ఈ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్కు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో చరణ్ చేస్తున్న క్యారెక్టర్ తన కెరీర్లోనే ఇంట్రస్టింగ్ అని టాక్.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్ శరవేగంగా సాగుతోందని టాక్. అయితే ఓ వైపు షూటింగ్ జరగుతుండటం, మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతుండటంతో అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చనే ప్రచారం ఫిల్మ్నగర్లో జరుగుతోంది. కానీ ముందుగా ప్రకటించిన మార్చి 27నే ‘పెద్ది’ విడుదలవుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు రామ్చరణ్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి...’ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్థన’. ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభని నిరూపించుకున్న రవికిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, కీర్తీ సురేష్లపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రవికిరణ్ కోలా. ‘‘రౌడీ జనార్థన’ కథ 1980 దశకం నేపథ్యంలో సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం విజయ్ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో డైలాగులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ని ఆయన చేయలేదు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరులో ‘రౌడీ జనార్థన’ విడుదల కానుంది. సాయిదుర్గాతేజ్ తుక్కుగూడలో..‘విరూ పాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను–మాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో సాయిదుర్గా తేజ్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు.ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా 2025 అక్టోబరు 15న ‘అసుర ఆగమన’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం సాయిదుర్గా తేజ్ కండలు తిరిగిన దేహంతో, గుబురు గెడ్డంతో ఫుల్గా మేకోవర్ అయ్యారు. ఈ మూవీకి బి.అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. నాని ముచ్చింతల్లో.. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. జనవరి నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశముందని తెలిసింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది.నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే మార్చి 27న రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ మూవీ రిలీజ్ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఈ విషయాలపై చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పష్టత ఇచ్చారు. ‘‘ది ప్యారడైజ్’ చిత్రీకరణ 60 శాతం పూర్తయింది. సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నింటినీ పూర్తి చేశాం. పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయ్యాయి. అయితే టాకీ పార్ట్ మాత్రమే పూర్తవ్వాల్సి ఉంది. అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం. అయితే ‘పెద్ది’ సినిమాతో పోటీ పడి మా ‘ది ప్యారడైజ్’ని విడుదల చేయం. రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయకుండా వేర్వేరు తేదీల్లో రిలీజ్ చేసే ΄్లాన్ చేసే ఆలోచన కూడా ఉంది’’ అని సుధాకర్ చెరుకూరి తెలి పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిన్న, పెద్ద సినిమాలు కూడా హైదరాబాద్లో, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్
టాలీవుడ్లో ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్లో ప్రతి సీజన్కి ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ఉంటుంది. ఒకప్పుడు హారర్ కామెడీ చిత్రాలు వరుసగా వచ్చాయి. అంతకంటే ముందు ప్రేమకథలు హవాను కొనసాగించాయి. ఇటీవల వరకూ యాక్షన్ సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ కథలు సిల్వర్ స్క్రీన్పై ఆధిపత్యం చెలాయించాయి.అయితే ఇప్పుడు పరిస్థితి మరోసారి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలను గమనిస్తే ప్రేక్షకుల అభిరుచి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘రాజాసాబ్’ మినహా మిగతా అన్ని సినిమాల్లో ప్రధాన ఎలిమెంట్ కామెడీనే. మన శంకరవరప్రసాద్,అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఈ సినిమాలన్నింటిలోనూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నా థియేటర్లలో ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసినవి కామెడీ పోర్షన్లే. ఇది కేవలం సంక్రాంతి సినిమాల వరకే పరిమితమా? లేక టాలీవుడ్ ట్రెండ్ నిజంగానే మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరో 2-3 కామెడీ సినిమాలు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ పూర్తిగా కామెడీ వైపు మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ప్రేక్షకులు కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతార, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తారనే భావన ఉండేది. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని అనుకునేవారు. ఆ విషయాన్ని పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా బహిరంగంగానే అంగీకరించారు. ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా భారీ యాక్షన్ కథలనే ఎంచుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకు ఏడాది పైగా సమయం పడుతోంది. కానీ కామెడీ ట్రెండ్ బలపడితే మాత్రం ఇది శుభపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల స్టార్ హీరోల సినిమాల సంఖ్య పెరుగుతుంది. పాన్ ఇండియా హంగులు తగ్గుతాయి. నిర్మాతలకు భారీ బడ్జెట్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. టాలీవుడ్లో కామెడీ చిత్రాల ట్రెండ్ మొదలైనట్లు సంక్రాంతి సినిమాలు సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్ బలపడితే, ఇండస్ట్రీలో కొత్త మార్పులు తప్పవు.
శోభిత లేటేస్ట్ మూవీ.. సతీమణితో కలిసి చైతూ ప్రమోషన్స్..!
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా చీకటిలో. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో శోభిత క్రైమ్ యాంకర్ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్గా పనిచేసినా.. తర్వాత జాబ్ నచ్చలేదని మానేసి పాడ్కాస్ట్ ప్రారంభించింది. ఆ పాడ్కాస్ట్కు చీకటిలో అన్న టైటిల్ ఖరారు చేసింది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీ అయిపోయింది శోభిత. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైంది. ఈ ప్రమోషన్ ఈవెంట్కు ఆమె భర్త నాగ చైతన్య కూడా వచ్చారు. తన సతీమణితో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఈ మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. #TFNExclusive: The beautiful couple Yuvasamrat #NagaChaitanya & #SobhitaDhulipala snapped together at a movie event 📸✨#SoChay #TeluguFilmNagar pic.twitter.com/pojTTChD9l— Telugu FilmNagar (@telugufilmnagar) January 20, 2026
ఏనుగు దత్తత తీసుకున్న స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్ జూ పార్క్లోని ఏనుగును దత్తత తీసుకున్నారు. ఆరునెలల పాటు ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను హీరోనే చూసుకోనున్నారు. ప్రకృతి అనే పేరు గల ఏనుగు సంరక్షణను శివ కార్తికేయన్ పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అఫీషియల్గా ప్రకటించారు. ఇది చూసిన హీరో ఫ్యాన్స్.. అన్న గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. శివ కార్తికేయన్ ఇటీవలే పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పొంగల్ కానుకగా ఈ మూవీ రిలీజైంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీపై కొందరు విమర్శలు చేశారు. ఈ సినిమాను పాలిటిక్స్తో లింక్ చేయడంతో వివాదానికి దారితీసింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా కనిపించింది. Actor Thiru.D.Sivakarthikeyan has adopted an elephant named Prakruthi in #AAZP for a period of six months. #ArignarAnnaZoologicalPark #AAZPChennai #VandalurZoo #AnimalAdoption #ZoologicalPark@Siva_Kartikeyan pic.twitter.com/5v33XghiDM— Vandalur Zoo @Arignar Anna Zoological Park Chennai (@VandalurZoo) January 20, 2026
బిగ్బాస్
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
అటు మోడ్రన్గా.. ఇటు అమ్మవారి వేషంలో..
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
నా క్యారెక్టర్పై నింద.. వాష్రూమ్లో ఏడ్చేదాన్ని: రీతూ
వైల్డ్కార్డ్స్గా రీతూ-పవన్.. నయని విమర్శలు
కూతురి ఫస్ట్ బర్త్డే.. బిగ్బాస్ జంట ఎమోషనల్
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్
ఇది ప్రారంభం మాత్రమే.. బిగ్బాస్ విన్నర్ గుడ్న్యూస్
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
A to Z
ఓటీటీలో 'సుదీప్' యాక్షన్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హ...
నెట్ఫ్లిక్స్లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది.. ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యే...
మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి..
కన్నడ స్టార్ హీరోలు శివరాజ్కుమార్, ఉపేంద్ర, రాజ...
సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఒక్కరోజే ఓటీటీకి 15 సినిమాలు
సంక్రాంతి పండుగ ముగిసింది. ఈ ఏడాది టాలీవుడ్లో ఏకం...
క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే
హీరోయిన్ పూజా హెగ్డేకి అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి...
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫా...
సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక
గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్...
నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్
కొన్నిసార్లు మన అభిప్రాయాలు ఇతరులకు తప్పుగా అర్థమయ...
ఆస్కార్ బరిలో మొట్టమొదటి మరాఠి సినిమా!
మరాఠి సినిమా దశావతార్ (2025) అరుదైన ఘనత సాధించింద...
మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు! నటికి ఆఫర్
సెలబ్రిటీలను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కొందరు ...
'అవతార్ 3' విలన్ చార్లీ చాప్లిన్ మనవరాలా?
పదిరోజుల క్రితం థియేటర్లలో వచ్చిన హాలీవుడ్ భారీ బడ...
'స్ట్రేంజర్ థింగ్స్ 5' ఫినాలే ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థ...
సినిమా టికెట్ ధరల పెంపు... హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులపై హైక...
'తెరి' వాయిదా.. కృతజ్ఞతలు చెప్పిన నిర్మాతలు
నటుడు విజయ్ చిత్రం విడుదలవుతోందంటే దాని ప్రభావం ఆ...
బ్లూ డ్రెస్లో ఐశ్వర్య రాజేశ్.. సావిత్రి బేబీ బంప్ లుక్..!
బ్లూ డ్రెస్లో ఐశ్వర్య రాజేశ్ అందాలు..టాలీవుడ్ నటి...
మనశంకర వరప్రసాద్గారు.. ఆ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్..!
మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర్ ...
ఫొటోలు
ట్రెండింగ్లో హీరోయిన్ అసిన్ (ఫొటోలు)
గ్లామరస్ అను ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు ఏం చేస్తోంది? (ఫొటోలు)
నిర్మాత రమేష్ తౌరానీ బర్త్ డే సెలబ్రేషన్స్...మెరిసిన తారలు (ఫొటోలు)
సీతాకల్యాణం చేసిన 'బిగ్బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
వాఘా బోర్డర్లో 'ధురంధర్' బ్యూటీ (ఫొటోలు)
సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న పూజిత పొన్నాడ -ఎంత బాగుందో! (ఫొటోలు)
అల్లు అర్జున్ ఫ్యామిలీ.. జపాన్ ట్రిప్లో ఇలా (ఫొటోలు)
టిల్లుగాని పోరీ.. మతిపోయే గ్లామరస్గా (ఫొటోలు)
'శుభకృత్ నామ సంవత్సర' మూవీ ఈవెంట్లో పవిత్ర, నరేష్ (ఫోటోలు)
గాసిప్స్
View all
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్
టాలీవుడ్లో ట్రెండ్ మారుతోందా?
మెగా హీరోతో మారుతి కొత్త సినిమా!
గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?
ప్రభాస్ vs సల్మాన్ ఖాన్.. బాక్సాఫీస్ పోటీ?
మార్చి రిలీజ్లపై సందేహాలు.. ఏవి వస్తాయి? ఏవి వాయిదా?
సీనియర్ హీరోలకు బ్లాక్బస్టర్.. అనిల్ 10వ సినిమా ఎవరితో?
ప్రేమలో 'రుక్మిణి వసంత్'.. అతను ఎవరో తెలుసా..?
'మన శంకర వర ప్రసాద్గారు' ఓల్డ్ సాంగ్స్ ఖర్చు ఎంతో తెలుసా?
రివ్యూలు
View all
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
3
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్..
2.5
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
2.25
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!
హిట్ కొట్టడం ఈజీనే. కానీ దాన్ని కొనసాగిస్తూ సినిమాలు చేయడం, అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. చాలా కొద్దిమంది హీరోహీరోయిన్లకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అవును ఇదంతా హీరోయిన్ కృతిశెట్టి గురించే. 'ఉప్పెన'తో హీరోయిన్గా బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. తర్వాత చాలానే మూవీస్ చేసింది గానీ సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇప్పుడు మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్పై విమర్శలు!)ప్రస్తుతం 'మన శంకరవరప్రసాద్' చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి.. త్వరలో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నారు. ఇదివరకే దర్శకుడు బాబీతో చిరు మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ కానుందని, మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలోనే కృతిశెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. చాలామంది హీరోయినా అని అనుకుంటున్నారు. కానీ చిరు కుమార్తె పాత్రలో కృతి కనిపించనుందని టాక్.గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో తొలి హిట్ అందుకున్న చిరు-బాబీ.. ఇప్పుడు బెంగాల్ బ్యాక్ డ్రాప్లో సాగే కూతురు సెంటిమెంట్ కాన్సెప్ట్తో మూవీ చేయనున్నారని టాక్. మలయాళ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారని టాక్. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా పలువురు పేర్లు అనుకుంటున్నప్పటికీ ప్రియమణిని ఫైనల్ చేశారని అంటున్నారు. అలానే ఏఆర్ రెహమాన్ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. మరి ఈ విషయాల్లో ఎంత నిజముందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్సుంది.(ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?)
మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్పై విమర్శలు!
'కమిటీ కుర్రోళ్లు', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాల్లో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి టీనా శ్రావ్యపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మేడారం జాతరకి వెళ్లిన ఈమె.. మొక్కు చెల్లించుకోవడమే దీనికి కారణం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర.. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు అంటే నాలుగు రోజుల పాటు భారీ ఎత్తున జాతర జరగనుంది. దీనికి లక్షలాది మంది భక్తులు రానే వస్తారు. అయితే జాతరకు రెండు వారాల ముందు నుంచే మేడారంలో ఆచార వ్యవహారాలు మొదలవుతాయి. చాలామంది తమ బరువంతా బెల్లం(బంగారాన్ని)ని దేవతలకు మొక్కుగా చెల్లిస్తారు.టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య కూడా ఇలానే తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి.. సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియోపై సోషల్ మీడియలో డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఈమె చేసిన పనికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. భక్తులు, ఆదివాసీ దేవతలను అవమానించడమేనని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీనా తల్లి మాత్రం మొక్కులో భాగంగానే ఇలా చేశామని సమర్థించుకున్నారు.(ఇదీ చదవండి: 14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్) View this post on Instagram A post shared by Teena sravya.kundoju (@teena_sravya_mom)
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్
సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల వెల్లడించింది. చిన్న వయసులోనే మద్యం సేవించడం ప్రారంభించినప్పటికీ, ఆ అలవాటును పూర్తిగా విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను 14 ఏళ్ల వయసులోనే తొలిసారి మద్యం సేవించాను. ఆ సమయంలో ఫ్రెండ్స్తో కలిసి తాగడం సరదాగా అనిపించేది. అప్పట్లో అది ఫన్గా అనిపించింది. కానీ కాలక్రమేణా మద్యం నాకు సరిపడదని అర్థమైంది. తాగిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా కూడా అనిపించేది.ఆ అనుభవాలే నన్ను ఆలోచనలో పడేశాయి. చివరకు మద్యం పూర్తిగా మానేయాలనే నిర్ణయం తీసుకున్నాను. నేను చివరిసారి మద్యం తాగి దాదాపు ఆరేళ్లు పూర్తయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆలస్యంగా అయినా గ్రహించాను. నా శరీరం కూడా ఆల్కహాల్ను అంగీకరించడం లేదని అర్థమైంది. అందుకే వెంటనే మానేశాను.ప్రస్తుతం పార్టీలకు వెళ్లినప్పటికీ మద్యం జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే దాని బదులు గ్రీన్ టీతో ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్లో కొంతమంది ఆల్కహాల్ తాగుతారు. కానీ నేను మాత్రం తాగను. మద్యం లేకుండానే పార్టీల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చని నిధి స్పష్టం చేసింది.
టాలీవుడ్లో ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్లో ప్రతి సీజన్కి ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ఉంటుంది. ఒకప్పుడు హారర్ కామెడీ చిత్రాలు వరుసగా వచ్చాయి. అంతకంటే ముందు ప్రేమకథలు హవాను కొనసాగించాయి. ఇటీవల వరకూ యాక్షన్ సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ కథలు సిల్వర్ స్క్రీన్పై ఆధిపత్యం చెలాయించాయి.అయితే ఇప్పుడు పరిస్థితి మరోసారి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలను గమనిస్తే ప్రేక్షకుల అభిరుచి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘రాజాసాబ్’ మినహా మిగతా అన్ని సినిమాల్లో ప్రధాన ఎలిమెంట్ కామెడీనే. మన శంకరవరప్రసాద్,అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఈ సినిమాలన్నింటిలోనూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నా థియేటర్లలో ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసినవి కామెడీ పోర్షన్లే. ఇది కేవలం సంక్రాంతి సినిమాల వరకే పరిమితమా? లేక టాలీవుడ్ ట్రెండ్ నిజంగానే మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరో 2-3 కామెడీ సినిమాలు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ పూర్తిగా కామెడీ వైపు మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ప్రేక్షకులు కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతార, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తారనే భావన ఉండేది. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని అనుకునేవారు. ఆ విషయాన్ని పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా బహిరంగంగానే అంగీకరించారు. ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా భారీ యాక్షన్ కథలనే ఎంచుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకు ఏడాది పైగా సమయం పడుతోంది. కానీ కామెడీ ట్రెండ్ బలపడితే మాత్రం ఇది శుభపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల స్టార్ హీరోల సినిమాల సంఖ్య పెరుగుతుంది. పాన్ ఇండియా హంగులు తగ్గుతాయి. నిర్మాతలకు భారీ బడ్జెట్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. టాలీవుడ్లో కామెడీ చిత్రాల ట్రెండ్ మొదలైనట్లు సంక్రాంతి సినిమాలు సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్ బలపడితే, ఇండస్ట్రీలో కొత్త మార్పులు తప్పవు.
శోభిత లేటేస్ట్ మూవీ.. సతీమణితో కలిసి చైతూ ప్రమోషన్స్..!
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా చీకటిలో. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో శోభిత క్రైమ్ యాంకర్ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్గా పనిచేసినా.. తర్వాత జాబ్ నచ్చలేదని మానేసి పాడ్కాస్ట్ ప్రారంభించింది. ఆ పాడ్కాస్ట్కు చీకటిలో అన్న టైటిల్ ఖరారు చేసింది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీ అయిపోయింది శోభిత. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైంది. ఈ ప్రమోషన్ ఈవెంట్కు ఆమె భర్త నాగ చైతన్య కూడా వచ్చారు. తన సతీమణితో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఈ మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. #TFNExclusive: The beautiful couple Yuvasamrat #NagaChaitanya & #SobhitaDhulipala snapped together at a movie event 📸✨#SoChay #TeluguFilmNagar pic.twitter.com/pojTTChD9l— Telugu FilmNagar (@telugufilmnagar) January 20, 2026
ఏనుగు దత్తత తీసుకున్న స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్ జూ పార్క్లోని ఏనుగును దత్తత తీసుకున్నారు. ఆరునెలల పాటు ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను హీరోనే చూసుకోనున్నారు. ప్రకృతి అనే పేరు గల ఏనుగు సంరక్షణను శివ కార్తికేయన్ పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అఫీషియల్గా ప్రకటించారు. ఇది చూసిన హీరో ఫ్యాన్స్.. అన్న గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. శివ కార్తికేయన్ ఇటీవలే పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పొంగల్ కానుకగా ఈ మూవీ రిలీజైంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీపై కొందరు విమర్శలు చేశారు. ఈ సినిమాను పాలిటిక్స్తో లింక్ చేయడంతో వివాదానికి దారితీసింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా కనిపించింది. Actor Thiru.D.Sivakarthikeyan has adopted an elephant named Prakruthi in #AAZP for a period of six months. #ArignarAnnaZoologicalPark #AAZPChennai #VandalurZoo #AnimalAdoption #ZoologicalPark@Siva_Kartikeyan pic.twitter.com/5v33XghiDM— Vandalur Zoo @Arignar Anna Zoological Park Chennai (@VandalurZoo) January 20, 2026
నవీన్ చంద్ర సైకలాజికల్ థ్రిల్లర్.. భయపెడుతోన్న టీజర్
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా వస్తోన్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హనీ. ఈ చిత్రంలో దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.హనీ టీజర్ చూస్తుంటే క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్తోనే ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అనే ఎలిమెంట్స్తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందించారు. Silence carries the loudest fear.Some secrets demand silence.Some demand sacrifice.This Year’s Most Devastating Ritual Starts From NOW 🔥Watch Teaser Now 👇https://t.co/rvG68XlA3GHoney Movie - Worldwide Grand Release In Theaters From Feb 6th 🐈⬛ 🔴 @Naveenc212… pic.twitter.com/o9toWlbEqq— Actor Naveen Chandra (@Naveenc212) January 20, 2026
మనశంకర వరప్రసాద్గారు..ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలే..!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్గారు. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.300 కోట్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమాలో 'ఫ్లై.. హై' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా అలరించింది. అయితే ఈ సాంగ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పాట పాడింది స్వయానా చిరంజీవి మేనకోడలు నైరా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. మెగాస్టార్ సోదరి మాధవి గారి కుమార్తె అని వెల్లడించారు. మనశంకర వరప్రసాద్గారు సినిమాలోని ఈ పాటను అద్భుతంగా పాడిందని కొనియాడారు. ఇది కేవలం నైరాకు ప్రారంభం మాత్రమేనని.. తనకు సుదీర్ఘమైన కెరీర్ ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #Naira is the niece of our Megastar @KChiruTweets garu ( Daughter of his Sister Madhavi garu )🤗She has wonderfully sung the #FlyingHigh song from #ManaShankaraVaraPrasadGaru 👏🏻👏🏻👏🏻With a long journey ahead of her, this is just a beautiful beginning… https://t.co/PZEPN1t3ox— Anil Ravipudi (@AnilRavipudi) January 20, 2026
మాళవిక మోహనన్ సింగారం.. సంయుక్త వయ్యారం
చీరలో మాళవిక మోహనన్ సింగారంపట్టుచీరలో సిగ్గుపడిపోతున్న సంయుక్తజిమ్లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన నభావియాత్నాం ట్రిప్లో హీరోయిన్ మేఘా ఆకాశ్టెంపుల్ మార్నింగ్స్ వీడియోతో కావ్య కల్యాణ్ రామ్విదేశాల్లో చక్కర్లు కొట్టేస్తున్న ప్రియాంక జవాల్కర్ View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Priyanka Jawalkar ★ (@jawalkar) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__)
బలగం వేణు ఎల్లమ్మ మూవీ.. దేవీశ్రీతో సుదీర్ఘ చర్చ.!
బలగం మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తన రెండో సినిమా టైటిల్ను ప్రకటించిన వేణు.. హీరోను కూడా పరిచయం చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే ఎల్లమ్మ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా టాలీవుడ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు డీఎస్పీ హీరోగా అరంగేట్రం చేయనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో వేణు మరో హిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవీశ్రీ ప్రసాద్కు హీరోగా మొదటి సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథపై ఏకంగా 8 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.తాజాగా డైరెక్టర్ వేణు యెల్దండి తన ట్వీట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. డీఎస్పీతో ఫస్ట్ మీటింగ్.. ఇది 8 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అంటూ పోస్ట్ చేశారు. ఎల్లమ్మ కథపై వీరిద్దరి మధ్య ఏకంగా 8 గంటల పాటు చర్చ సాగిందని దర్శకుడే స్వయంగా వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమాపై వీరిద్దరు ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో డీఎస్పీ పర్శీ అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తన సినిమాకు డీఎస్పీనే సంగీతం అందిస్తున్నారు. The first meeting with @ThisIsDSP Sir….it was 8hours long discussion👌🤗🥰🙏🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼#YellammaGlimpse #Yellamma pic.twitter.com/K7S1VH5g2W— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) January 19, 2026
సినిమా
సాత్విక వీరవల్లి హీరోయిన్ గా ఎంట్రీ..
కొరియన్ కనకరాజు గా వరుణ్ తేజ్ టీజర్ మామూలుగా లేదుగా
ధనుష్ - మృణాల్ ఠాకూర్ పెళ్లి.. అసలు నిజం ఎంత..?
Mumbai : అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం
Anil Ravipudi: చిరంజీవి పేరు... పెట్టడానికి కారణం ఇదే ...?
Anil Ravipudi: నాగార్జున, మహేష్ తో సినిమా కన్ఫర్..?
1300 కోట్ల భారీ బడ్జెట్తో వారణాసి.. రాజమౌళి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?
సెంటిమెంట్ ఫాలో అవుతున్న సూపర్ స్టార్..
మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న సమంత
2027 పొంగల్ కి.. అప్పుడే ఖర్చిఫ్ వేసారుగా..!
