Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Harish Shankarm says I opened the comments Box for Mahesh fans1
మహేష్ ఫ్యాన్స్ కోసమే కామెంట్స్ ఓపెన్ చేశాను: హరీశ్ శంకర్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోపానికి గురైన దర్శకుడు హరీశ్ శంకర్ తన పొరపాటును బహిరంగంగా ఒప్పుకున్నారు. “BoB రికార్డులు మళ్లీ లేపరా” అంటూ వచ్చిన ఒక పోస్టుకు హరీశ్ శంకర్ ‘తథాస్తు’ అని రిప్లయ్ ఇవ్వడం మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ, అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. “నేను అంత స్పీడ్‌గా రియాక్ట్ కాకుండా, ట్వీట్ పూర్తిగా చదివి రెస్పాండ్ అవ్వాల్సింది. 30 సెకన్లలోనే డిలీట్ చేశాను. ‘బీ..వో’ అనే పదాలు కనిపించడంతో తొందర్లో బాక్సాఫీస్ అనుకున్నాను. అది పొరపాటు. అయినప్పటికీ కర్మను నమ్ముతాను. అందుకే క్షమాపణలు చెబుతూ నోట్ పెట్టిన తర్వాత కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేశాను. ఎంతయినా తిట్టండి అని అనుమతించాను” అని హరీశ్ తెలిపారు. “గద్దలకొండ గణేశ్ సినిమా బాగుందని మహేష్ బాబు స్వయంగా ట్వీట్ చేసి నన్ను అభినందించారు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేని వ్యక్తి అయినా, మనస్ఫూర్తిగా అభినందించారు. అలాంటి వ్యక్తి గురించి పొరపాటున నేను తప్పుగా ట్వీట్ చేయడం మహాపాపం. నేను ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని, అధర్మం పనులు చేయను. ఇది తప్పు కాదు, పొరపాటు మాత్రమే” అని హరీశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా అన్ని రికార్డులను బద్దలుకొడుతుందని తాను కూడా నమ్ముతున్నానని హరీశ్ ప్రకటించారు.

Choreographer Prem Rakshith Happy Post about Vincent Paterson2
ప్రేమ్‌ రక్షిత్‌పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ 'మైఖేల్ జాక్సన్'కు లెజెండరీ కొరియోగ్రాఫర్ 'విన్సెంట్ ప్యాటర్సన్' ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్‌వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌ను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. వీడియో వైరల్‌ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ ప్రశంసించడం భారతీయ డాన్స్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు లభించడమే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ప్రేమ్‌ ప్రతిభకు విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయ్యారు. 'హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. ఏదో ఒక రోజు కలుస్తా..చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నా. మీ కొరియోగ్రఫీ అద్భుతం. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారి కలలు సాధించుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్ను కలుస్తా రక్షిత్' అంటూ విన్సెంట్ వీడియోలో చెప్పారు.ఎంతో ప్రత్యేకం'నేను చిన్నప్పటి నుంచే స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం కొరియోగ్రాఫర్‌గా ఎంతో ప్రత్యేకమైన విషయం. థాంక్స్‌ డియర్‌ విన్సెంట్ సర్' అని ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. చెన్నైలో పెరిగిన రక్షిత్.. ప్రభాస్‌'ఛత్రపతి'తో ప్రయాణం మొదలుపెట్టి.. 'బాహుబలి' వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. View this post on Instagram A post shared by Prem Rakshith (@premrakshith_choreographer)

Actor Narra Venkateswara Rao Daughter about his father3
క్యాన్సర్‌ చివరి స్టేజ్‌.. చావు తథ్యమని ఏడ్చిన నటుడు

చిన్నాపెద్ద తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తింపు సంపాదించుకున్నారు నర్రా వెంకటేశ్వరరావు. వెండితెరపైనే కాకుండా, రియల్‌ లైఫ్‌లోనూ ఠీవీగా ఉండే ఆయన జీవిత చరమాంకంలో మాత్రం బిగుసుకుపోయాడు. చావును ముందే గ్రహించి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. 2009 డిసెంబర్‌ 27న క్యాన్సర్‌తో కన్నుమూశాడు.ఆలస్యంగా బయటపడ్డ క్యాన్సర్‌తాజాగా నటుడి ఫ్యామిలీ ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా నర్రా కూతురు వాసంతి ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నాన్నకు క్యాన్సర్‌ చాలా ఆలస్యంగా బయటపడింది. ఆయన బరువు తగ్గిపోతుంటే షుగర్‌ వల్లేమో అనుకున్నాం.. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయిస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ ఉందని తేలింది. అది కూడా చివరి స్టేజ్‌.. 25 కిలోలు తగ్గిన నటుడుకొన్ని నెలలు మాత్రమే బతుకుతాడన్నారు. కీమోథెరపీ, సర్జరీలు చేయించడం వల్ల నాలుగేళ్లు బతికారు. క్యాన్సర్‌ వల్ల దాదాపు 25 కిలోలు తగ్గిపోయారు. కాకపోతే మొదటి సర్జరీ అయ్యాక పవిత్ర బంధం అని ఓ సీరియల్‌ చేశారు. ఇంట్లో ఉంటే ఏదో జబ్బుతో మంచానపడినట్లుందని పనితో బిజీ అయ్యారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఒంట్లో ఓపిక లేక షూటింగ్‌కు వెళ్లలేదు. చివరి రోజుల్లో కంటతడిమనవళ్లతో ఎంజాయ్‌ చేయాలనుకున్న సమయంలో ఇలా ఆరోగ్యం దెబ్బతినేసరికి చాలా నిరాశపడ్డాడు. ఇంకేమైనా ట్రీట్‌మెంట్‌ ఉందా? కనుక్కున్నారా? అని అడిగేవారు. మరోపక్క రేపు ఏదైనా జరిగినా నిన్ను పిల్లలు చూసుకుంటారు అని అమ్మకు ధైర్యం చెప్పేవారు. ఇక ఆయన చావుకు దగ్గరైనప్పుడు ఎంతో ఏడ్చారు. నాన్న చాలా ధైర్యవంతుడు, అలాంటి ఆయన్ను అలా చూడటం అదే మొదటి, ఆఖరిసారి! సినిమాహీరో శోభన్‌బాబు ఇచ్చిన సలహా వల్లే నాన్న సంపాదించిన ప్రతి పైసాలో సగం భూమి మీదే పెట్టేవాళ్లు. అలా ఎక్కువ ఆస్తులు సంపాదించాడు. కాగా నర్రా వెంకటేశ్వరరావు.. కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మ, నేటి భారతం, తొలి ప్రేమ, పౌర్ణమి వంటి పలు చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఎక్కువగా విలన్‌ తరహా పాత్రల్లో నటించాడు. దాదాపు మూడు దశాబ్దాల్లో 500కి పైగా సినిమాలు చేశాడు. చదవండి: నాన్న ప్రతి ఆదివారం అవే ఆర్డర్‌ పెడతాడు: నాగచైతన్య

Naga Chaitanya: Sobhita Dhulipala rates Recipes, Nagarjuna orders Pizzas4
నాన్న పిజ్జాలు అడిగి మరీ తెప్పించుకుంటాడు: నాగచైతన్య

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య కొన్నేళ్ల క్రితం షోయూ పేరుతో క్లౌడ్‌ కిచెన్‌ ప్రారంభించాడు. ముఖ్యంగా జపనీస్‌ వంటకాలకు ఇది బాగా ఫేమస్‌. ఈ ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభం నుంచి విజయవంతంగా రన్‌ అవుతోంది. దాని గురించి తాజాగా చై మాట్లాడుతూ.. జపనీస్‌ వంటకాలంటే నాకెంతో ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా జపనీస్‌ వంటకాలనే ఫస్ట్‌ ఆర్డర్‌ చేస్తాను. రెస్టారెంట్‌ అనుకున్నాంఆ వంటకాలను హైదరాబాద్‌కు తీసుకురావాలనిపించింది. నిజానికి ఏకంగా రెస్టారెంటే ప్రారంభించాలనుకున్నాను. కానీ, కరోనా వల్ల పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. అప్పుడే క్లౌడ్‌ కిచెన్‌ ఆలోచన వచ్చింది. కస్టమర్లకు నేరుగా ఇంటికే డెలివరీ చేసే ఆలోచన బాగుందనిపించింది. మా కిచెన్‌లో కొత్తగా ఏ వంటకం చేయాలన్నా ముందు ఇంట్లో టెస్ట్‌ చేయాల్సిందే!నాన్నకు పిజ్జా ఇష్టంఇంట్లో వంటపై ప్రయోగాలు చేసినప్పుడు శోభిత దాన్ని టేస్ట్‌ చేసి ఎలా ఉందో చెప్తుంది. మెనూ తయారీలో తన సూచనలు ఉపయోగపడ్డాయి. నాన్నకు షోయూలో సూజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి ఆదివారం పిలిచి.. ఈసారి కొత్తగా ఏం పిజ్జాలు చేశారు? నాకు పంపించు అని అడుగుతూ ఉంటారు అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తుండగా బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మిస్తున్నారు.చదవండి: 8 ఏళ్లుగా భరిస్తున్నా.. నావల్ల కాదు: రష్మిక మందన్నా

Samuthirakani Karmeni Selvam Movie teaser Released5
కార్మేని సెల్వం టీజర్‌: అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి!

సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఈ మూవీ తెలుగు టీజర్‌ రిలీజ్‌ చేశారు. "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్‌తో టీజర్‌ మొదలవుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు.. ఇలా నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. రిచ్‌ కావాలంటే..ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయి. టీజర్ చివర్లో.. “ధవంతుడివి కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకునైనా ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ నేటి మనుషుల పోకడను తెలియజేస్తోంది. సినిమాఈ మూవీని రామ్ చక్రి దర్శకత్వంలో పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Collar Ey Etthara  Lyric Video song out from Ustaad Bhagat Singh6
ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ 'కాలరే ఎత్తరా..' సాంగ్‌ విడుదల

పవన్‌ కల్యాణ్‌- హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. తాజాగా ఈ మూవీ నుంచి కాలరే ఎత్తరా ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు.

Allu Cinemas multiplex Grand Launch Event video7
'అల్లు సినిమాస్‌' ప్రారంభోత్సవం.. లైవ్‌ వీడియో

‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్‌, డి సురేష్‌ బాబు, బన్నీ వాస్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్‌కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్‌ పాత్ర ఐకానిక్‌గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్‌-2, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాలు ప్రదర్శించనున్నారు.

Rashmika Mandanna Angry on Mother Leaked Audio Viral, Warns Of Legal Action8
8 ఏళ్లు ఎంత బాధపెట్టినా మౌనంగా భరించా.. ఇకనావల్ల కాదు!

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్‌పూర్‌లో తెలుగు హీరో విజయ్‌దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్‌ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్‌ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్‌ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్నీభరించా..ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్‌ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్‌, రీచ్‌ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతదూరం వెళ్తారు?ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్‌ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్‌, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 24 గంటల్లో డిలీట్‌అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.వివాదం ఏంటి?2016లో కిరిక్‌ పార్టీ మూవీ షూటింగ్‌లో రష్మిక, రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 🙏🏻 pic.twitter.com/DdJwFIjeP3— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026

Actress Radhika Sarathkumar praises Sivakarthikeyan9
రాధికా శరత్‌కుమార్‌ రికార్డ్‌.. తొలి హీరోయిన్‌గా గుర్తింపు

ఇండస్ట్రీలో సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్‌ను బట్టే ఫలితం నిర్ణయిస్తారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బడ్జెట్‌ పేపరుతో టికెట్‌ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరం అవుతున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం వారంలోనే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమకు నచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుతున్నారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీనియర్ నటి రాధిక శ‌ర‌త్ కుమార్ నటించిన తాయి కిళ‌వై చిత్రం తక్కువ టికెట్‌ ధరలతోనే భారీ కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.తను నటించిన కొత్త సినిమా పదిరోజుల కలెక్షన్స్‌పై రాధికా శరత్‌కుమార్‌ ఇలా మాట్లాడారు.. ' రూ. 150 రూపాయల టికెట్ ధరతోనే మా సినిమా రూ. 60 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. స్టార్‌ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ. 1500 నుంచి 2000 వరకు ఉంటున్న విషయం తెలసిందే. అయినప్పటికీ కలెక్షన్స్‌ పెద్దగా వచ్చిన దాఖలు లేదు. ఈ మూవీ కోసం బడ్జెట్‌ రూ. 9 కోట్లు మాత్రమే పెట్టారు.. బాక్సాఫీస్‌ లెక్కలు సరిగ్గా అంచనా వేసుకుంటే స్టార్‌ హీరోల కంటే మేము పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. మంచి కథ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను చూస్తారు.' అని ఆమె చెప్పింది. అధిక టికెట్ రేట్లు లేకుండానే పెద్ద విజయాలు సాధించవచ్చని తమ సినిమా చూపించిందని ఆమె గుర్తు చేశారు.రాధిక చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి. ఆమె మాట్లాడింది నిజమే కదా అంటూ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్‌పై రాధిక ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్‌ ఇచ్చారని భావిస్తున్నారు. బారీ బడ్జెట్‌ సినిమాల పేరుతో టికెట్‌ ధరలు పెంచడంపై ప్రేక్షకులు అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే.తమిళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా, ఒక హీరోయిన్ తాను తీసుకునే రెమ్యునరేషన్‌తో పాటుగా లాభాల వాటాను అందుకున్న నటిగా రాధికా రికార్డ్‌ క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం ఒక రికార్డ్‌గా నిలిచిపోతుంది. అన్ని పరిశ్రమలలో గేమ్-ఛేంజర్ అవుతుందని ఈ విషయంపై రాధికా అన్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు హీరోలకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేదని. తాజాగా తాయి కిళవి కొత్త ట్రెండ్‌కు తెరతీసిందని ఆమె అన్నారు. నిర్మాత శివకార్తికేయన్‌ను అభినందించాలని ఆమె కొనియాడారు.

Mumtaz about Polygamy, Marrying three-four times is Wrong10
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్‌

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా.. ఆ తర్వాత హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది సీనియర్‌ నటి ముంతాజ్‌. ఖిలోనా, దో రాస్తే, ఆప్‌కీ కసమ్‌, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్‌ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది.హిందూ దేవుళ్లంటే ఇష్టంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్‌ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.ఎందుకీ గొడవ?నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి ​కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.అది చాలా తప్పుభార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్‌ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్‌ నొక్కి చెప్పింది.చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్‌.. చెండాలమైన లిరిక్స్‌: నటి

Advertisement
Advertisement