Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Theri Movie Release Postponed Because the reason1
'తెరి' వాయిదా.. కృతజ్ఞతలు చెప్పిన నిర్మాతలు

నటుడు విజయ్‌ చిత్రం విడుదలవుతోందంటే దాని ప్రభావం ఆయన అభిమానుల్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనూ చాలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన గతంలో నటించిన చిత్రం 'తెరి' ( పోలీసోడు) రీ రిలీజ్ కానుంది. దీంతో ఇతర చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నటుడు విజయ్‌ హీరోగా వీ.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మించిన తెరి సినిమాలో నటి సమంత, ఎమీజాక్సన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. జన నాయగన్‌ వాయిదా పడటంతో విజయ్‌ ఫ్యాన్స్‌ కోసం తెరి చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన రీ రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతో పాటు అజిత్‌ హీరోగా నటించిన మంగాత్తా చిత్రం కూడా అదే తేదీన రీ రిలీజ్‌ కానుంది. అయితే అదే తేదీన కొత్త చిత్రాలైన ద్రౌపది–2, హాట్‌స్పాట్‌–2 విడుదల కానున్నాయి. ఈ క్రమంలో విజయ్‌ నటించిన తెరి చిత్రం రీ రిలీజ్‌ కానుండడంతో ఈ చిన్న చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో హట్‌స్పాట్‌–2 చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌ కార్తీక్‌ తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ చేశారు. అందులో తెరి చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిందిగా నిర్మాత కలైపులి ఎస్‌.థానుకు విజ్ఞప్తి చేశారు. తెరి చిత్రం విడుదల కారణంగా తమ చిత్రానికి థియేటర్ల సమస్య వస్తోందని అందులో పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని ద్రౌపది–2 ,చిత్ర దర్శక, నిర్మాతలు ఎక్స్‌ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దీంతో చిన్న చిత్రాలను కాపాడేవిధంగా నిర్మాత కలైపులి ఎస్‌.థాను తెరి చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ద్రౌపది–2 చిత్ర దర్శక నిర్మాతలకు కాస్త రిలీఫ్‌ వచ్చినట్లు అయ్యింది. వెంటనే ఆ చిత్ర దర్శకుడు మోహన్‌.జీ, నిర్మాత చోళ చక్రవర్తి నిర్మాత కలైపులి ఎస్‌.థానును కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Prabhas Raja Saab Director Maruthi Next Movie With Mega Hero2
మెగా హీరోతో మారుతి కొత్త సినిమా!

ఈ పండగ సీజన్‌లో విడుదలైన ప్రభాస్ – మారుతి రాజాసాబ్ సినిమా తరువాత ప్రభాస్‌కి వరుసగా పెద్ద ప్రాజెక్టులు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ దర్శకుడు మారుతి తదుపరి సినిమా ఏమిటన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతి ఒక మెగా హీరోతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మారుతి కి అత్యంత సన్నిహితుడైన నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. వీలైనంత రీజనబుల్ బడ్జెట్‌లో, మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథ ఫైనల్ అయిన వెంటనే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైమ్ ఉంది. ఎందుకంటే ఆ మెగా హీరో ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. ఆ తరువాతే మారుతి సినిమా వైపు అడుగులు వేయనున్నారు.ప్రస్తుతం మారుతి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్‌లను పదును పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. కథ రెడీ అయిన వెంటనే ఈ మెగా ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tollywood actresses Social media updates in instagram viral3
బ్లూ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేశ్.. సావిత్రి బేబీ బంప్‌ లుక్..!

బ్లూ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేశ్ అందాలు..టాలీవుడ్ నటి అభినయ ‍అదిరిపోయే లుక్..బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ సావిత్రి..ఫుల్‌గా వర్కవుట్స్ చేస్తోన్న బాలీవుడ్ భామ ఖుషీ కపూర్..చిల్ అవుతోన్న సమంత, మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official)

Prime minister narendra Modi Biopic Maa Vande with Huge Budget4
భారీ బడ్జెట్‌.. వరల్డ్ క్లాస్ మేకింగ్.. ప్రధాని బయోపిక్‌ విశేషాలివే..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌గా వస్తోన్న చిత్రం "మా వందే". ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ "మా వందే రూపంలో ప్రేక్షకులను చూపించనున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయనున్నారు.ఈ మూవీని ప్రపంచంలో తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్‌లో హీరోగా నటించిన జేసన్ మమొవాను "మా వందే" చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్‌లా కాకుండా సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 22వ తేదీ నుంచి కశ్మీర్‌లో ప్రారంభం కానుంది.

Mana Shankara Vara Prasad Garu Record collections in just 8 days5
మనశంకర వరప్రసాద్‌గారు.. ఆ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్..!

మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర్ వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా రూ.300 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన ప్రాంతీయ సినిమాగా ఆల్‌ టైమ్ రికార్డ్ సృష్టించింది.ఈ విషయాన్ని నిర్మాత సుస్మిత కొణిదెల ట్విటర్ వేదికగా షేర్ చేసింది. మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ బద్దలైపోయింది ‍అంటూ ట్వీట్ చేసింది. మెగాస్టార్ తన స్వాగ్, స్టైల్‌తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. రెండో వారంలోనూ మెగా విధ్వంసం ప్రారంభమైందంటూ సుస్మిత తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. కేవలం రిలీజైన ఎనిమిది రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. బాక్సాఫీస్ బద్దలైపోయింది💥💥💥Megastar @KChiruTweets garu is breaking box office records with his SWAG and STYLE 😎🔥#ManaShankaraVaraPrasadGaru grosses ₹300+ crores worldwide and becomes an ALL-TIME INDUSTRY RECORD as the FASTEST regional film ❤️‍🔥… pic.twitter.com/9wmeDz9lKR— Sushmita Konidela (@sushkonidela) January 19, 2026

Tollywood Hero Jr Ntr tweet On Tollywood latest movie 6
ఆ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు.. కథ అద్భుతమంటూ ట్వీట్

దండోరా మూవీపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఇప్పుడే దండోరా సినిమా చూశానని.. చాలా ఆలోచించేలా చేసిందని కొనియాడారు. శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని ఎన్టీఆర్‌ ప్రశంసించారు.ఇంత బలమైన కథను ‍అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్‌కు నా ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఇంతటి అద్భుతమైన చిత్రానికి మద్దతు ఇచ్చి.. ఈ మూవీలో భాగమైనందుకు తారాగణం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్‌ కావడంతో.. హీరో నవదీప్ రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశాడు.కాగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి డ్రాగన్‌ అనే పేరు టైటిల్‌ పెట్టనున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో యానిమల్ నటుడు అనిల్ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది. Just watched #Dhandoraa. Deeply thought-provoking and powerful. Outstanding performances by Sivaji garu, Navdeep, Nandu, Ravi Krishna and Bindu Madhavi throughout… Hats off to director Murali Kanth garu for the strong writing and for executing such a rooted story so well.…— Jr NTR (@tarak9999) January 19, 2026

Tollywood actor Vk Naresh Comments about Pavitra Lokesh7
'తను నా లక్కీ ఛార్మ్'.. పవిత్రా లోకేశ్‌పై నరేశ్‌ ప్రశంసలు..!

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె వల్లే తనకు లక్‌ కలిసొచ్చిందని అన్నారు. పవిత్రా లోకేశ్ తన లక్కీ ఛార్మ్ అంటూ ప్రశంసలు కురిపించారు. నా లైఫ్‌లోకి ఆమె వచ్చాకే సక్సెస్‌ మొదలైందని నరేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు. శుభకృత నామ సంవత్సరం మూవీ గ్లింప్స్ లాంఛ్‌ ఈవెంట్‌లో నరేశ్ మాట్లాడారు. ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అనంతరం పవిత్రా లోకేశ్ కూడా మాట్లాడారు. నరేశ్‌పై ప్రశంసలు కురిపించారు. దాదాపు 54 ఏళ్ల కెరీర్‌ ఆయనది.. ఇలాంటి గొప్ప వ్యక్తితో నేను జీవించడం అనేది నా అదృష్టమని పవిత్రా ఆనందం వ్యక్తం చేసింది. ఆయనతో మాట్లాడేందుకు నాకు కేవలం 30 నిమిషాలు మాత్రమే సమయం దొరుకుతుందని.. అంతా ఫుల్ బిజీగా ఉంటారని తెలిపింది. ఈ సినిమాలో ‍అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. కన్నడ నిర్మాత తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులోనూ నన్ను అభిమాస్తున్నారని.. కానీ అమ్మ భాషపై నాకు మమకారం ఎక్కువని తెలిపింది. నరేశ్ వల్లే నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాని పవిత్రా లోకేశ్ వెల్లడించింది.కాగా.. శుభకృత నామ సంవత్సరం మూవీలో నరేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ధనుంజయ, ప్రకృతి జంటగా నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహించారు. డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి సుధా శ్రీనివాస్ సంగీతమందించారు. #PavitraLokesh : నరేష్ గారి లాంటి నటుడితో లివింగ్ నా అదృష్టం,ఆయన రోజుకి 30 నిమిషాలే టైమ్ ఇస్తారు,May U have wonderful life with me 😊#ShubhakruthNamaSamvatsaram#VKNaresh pic.twitter.com/RXdlZntirV— Taraq(Tarak Ram) (@tarakviews) January 19, 2026

Tollywood actor abhinav gomatam Latest Movie title revealed8
అభినవ్ గోమటం లేటేస్ట్ మూవీ.. అమెరికాలో టైటిల్ రివీల్

అభినవ్ గోమఠం, స్వాతి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు వేణు నక్షత్రం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై అవంతిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి సినిమా టైటిల్‌ ఆవిష్కరించగా.. టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు హాజరై.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ… 'ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జయంత్ చల్లా, నాగేశ్వర్ రావు పూజారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ మెట్రో ప్రాంత ప్రేక్షకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులు, మాకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రేమతో వందనాలు. ఇలాగే మీ ప్రేమను, ఆశీర్వాదాలను మా మీద కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం' అని అన్నారు.నిర్మాత అవంతిక మాట్లాడుతూ… 'మా మీద నమ్మకం ఉంచి అండగా నిలిచిన 'ఆటాడిన పాట' చిత్రం టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమ, ఆదరణే మా ప్రయాణానికి బలం. త్వరలోనే ‘ఆటాడిన పాట’ మీ ముందుకు వచ్చి, మీ హృదయాలను తాకుతుంది. ప్రతి ఒక్కరి నమ్మకాన్నీ ఈ సినిమా నిలబెడుతుంది. సోషియో- ఫ్యాంటసీ కోవలోని ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని' వెల్లడించారు.

Rashmika Mandanna Reacts On Marriage rumours with vijay devarakonda9
వచ్చేనెలలో విజయ్‌తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే?

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.కాగా.. విజయ్‌ దేవరకొండతో ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ‍అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్‌ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. Q: There’s been a lot of buzz that #VijayDeverakonda and Rashmika are engaged and getting married on FEB 26th in Udaipur. What’s the truth?#RashmikaMandanna : pic.twitter.com/x6vD2jSIZB— Whynot Cinemas (@whynotcinemass_) January 19, 2026

Introducing Satvika Veeravalli in Aakasamlo Oka Tara Movie10
నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి?.. హీరోయిన్‌ ఇంట్రో గ్లింప్స్‌ చూశారా?

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీకి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ను పరిచయం చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. రోడ్డు కూడా సరిగా లేని ఈ ఊరి నుంచి ఆకాశానికి నిచ్చేనేశావా? ముందు ఈ ఊరి పొలిమేర దాటి చూపించు చూద్దాం అనే డైలాగ్ వింటుంటే.. కనీస వసతులు కూడా లేని పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement