Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page
Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Confusion over Movies release dates in Tollywood1
టాలీవుడ్‌లో మరోసారి విడుదల తేదీల గందరగోళం

టాలీవుడ్‌లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్‌డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్‌కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్‌ చరణ్‌ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ​ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్‌లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్‌లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ashika Ranganath And Dimple Hayathi Latest News2
ఎర్రచీరలో ఆషిక అందం.. గ్లామరస్ డింపుల్ హయాతి

ఎర్రచీరలో అందంగా మెరిసిపోతున్న ఆషికాదుబాయిలో స్కై డైవింగ్ చేసిన హీరోయిన్ నిహారికజిమ్‌లో తెగ కష్టపడిపోతున్న నభా నటేశ్జీన్ నిక్కర్‌లో గ్లామర్ ఆరబోస్తున్న సోనాల్ చౌహాన్పచ్చ చీరలో గ్లామర్ హద్దులు దాటేస్తున్న డింపుల్నాలోని మరో కోణం.. సంయుక్త ఇంట్రెస్టింగ్ వీడియో View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Preethi Anju Asrani (@thepreethiasrani) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq)

Vijay Devarakonda Ranabaali Movie Details3
విజయ్-రష్మిక పెళ్లి తర్వాత వచ్చే సినిమా ఇదే.. వీడియో రిలీజ్

గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ మాత్రం విజయ్ దేవరకొండకు దొరకట్లేదు. గతేడాది 'కింగ్డమ్'తో వచ్చాడు గానీ అదే సీన్ రిపీటైంది. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'రౌడీ జనార్ధన' కాగా మరొకటి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పీరియాడిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'రణబాలి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 1876-78 మధ్య రాయలసీమ ప్రాంతంలో జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన బ్రిటీషర్లు.. హిట్లర్ చేసిన దానికంటే ఎంత పెద్ద మారణహోమం సృష్టించారు. ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకోవడం, 40 ఏళ్లలో 100 మిలియన్ల మంది చావులకు కారణమవడం.. ఇలాంటి చాలా విషయాలు సినిమాలో ఉండబోతున్నాయని అనౌన్స్‌మెంట్ వీడియోతో చెప్పకనే చెప్పేశారు.ఇందులో విజయ్.. బ్రిటీషర్లపై పోరాడిన రణబాలి అనే వీరుడిగా కనిపించనున్నాడు. రష్మిక.. జయమ్మ అనే పాత్ర పోషించింది. 'మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ... సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేశాడు. బాలీవుడ్ ఫేమ్ అజయ్ అతుల్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వీళ్లిద్దరూ భార్యభర్తలుగా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో వీళ్లిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు జంటగా చేశారు.

Actress Shriya Saran recalls Her Pregnancy journey4
ప్రెగ్నెన్సీ.. మహిళ ఒక ఆవులా కనిపిస్తుంది: శ్రియ

ప్రెగ్నెన్సీ జర్నీలో భార్యకు భర్త తోడుండాలంటోంది హీరోయిన్‌ శ్రియా శరణ్‌. ఆ సమయంలో భర్త తోడు ఎక్కువ కావాలనిపిస్తుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా మాట్లాడుతూ.. మహిళ గర్భం దాల్చినప్పుడు తన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపులో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటోందంటే అదొక అద్భుతమైన అనుభవం. అతడిదే బాధ్యతకానీ ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు భావోద్వేగాలు అదుపులో ఉండవు. కడుపులో ఓ బిడ్డను మోస్తూ తిరగాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు నీలాగే కనబడవు. ఆ సమయంలో ఆడవారి శరీరం ఒక ఆవులా కనిపిస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే! నేను గర్భం దాల్చినప్పుడు ఎక్కువ బాధగా అనిపించేది. నా భర్త నాతో ఎక్కువసేపు ఉంటే బాగుండనిపించేది. అదే సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పనికి వెళ్లాలనిపించేది. ఇలా నా ఎమోషన్స్‌ అదుపులో ఉండేవి కాదు అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రియా.. రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను 2018లో పెళ్లి చేసుకుంది. 2021లో వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు రాధా శరణ్‌ కొశ్చీవ్‌ జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్‌, నీకు నేను నాకు నువ్వు, నేనున్నాను, ఛత్రపతి, మనం వంటి పలు సినిమాల్లో నటించింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. కొన్ని ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. చివరగా మిరాయ్‌ మూవీలో కనిపించింది. ప్రస్తుతం హిందీ దృశ్యం 3లో నటిస్తోంది.చదవండి: తరుణ్‌ భాస్కర్‌తో డేటింగ్‌? తొలిసారి పెదవి విప్పిన హీరోయిన్‌

Anudeep KV About His Love Story And Wedding Plan5
స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించా.. కానీ చివరకు

డైరెక్టర్ అనుదీప్ అనగానే అందరికీ 'జాతిరత్నాలు' సినిమానే గుర్తొస్తుంది. అంతకు ముందు ఓ మూవీ చేసినప్పటి.. దీని తర్వాతే బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ, బయట.. ఎక్కడైనా సరే తనదైన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు 'ఫంకీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 13న రిలీజ్. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)ఎవరినైనా ప్రేమించారా? అని యాంకర్ సుమ, అనుదీప్‌ని అడగ్గా..'స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లవ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రేమ, పెళ్లి మీద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు' అని క్లారిటీ ఇచ్చేశాడు.అయితే అనుదీప్.. ఇదంతా సీరియస్‌గానే చెప్పాడా? లేదా జోక్‌గా చెప్పాడా? అనేది తెలియదు. ఎందుకంటే చాలా కామెడీ విషయాన్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెబుతుంటాడు. కొన్నిసార్లు అయితే నిజాన్ని, అబద్ధాన్ని ఒకేలా చెబుతుంటాడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ రెండింటిలో ఏదా అనేది తెలియదు. మూవీ విషయానికొస్తే 'జాతిరత్నాలు' తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' తీశాడు. కానీ సరిగా ఆడలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'ఫంకీ'తో వస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు)

Eesha Rebba Respond on Love Rumours with Tharun Bhascker6
తరుణ్‌తో డేటింగ్‌? తొలిసారి స్పందించిన హీరోయిన్‌

తెలుగు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, హీరోయిన్‌ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి పండగలు సెలబ్రేట్‌ చేసుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఇది మలయాళ మూవీ జయజయజయహేకి రీమేక్‌గా తెరకెక్కింది.తర్వాత చెప్తాతాజాగా సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన ఈషా రెబ్బాకు డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. తెరపై జంటగా నటించిన తరుణ్‌- ఈషా.. రియల్‌ లైఫ్‌లోనూ జోడీయేనా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. 'ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉంటే నేనే అందరికీ చెప్తాను' అని బదులిచ్చింది. ఆమె రూమర్స్‌ను ఖండించనూ లేదు, ఒప్పుకోనూ లేదంటే సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉన్నట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.గట్టిగా కొట్టాడుఇక సినిమాలో తనను తరుణ్‌ నిజంగా కొట్టాడంది ఈషా. ఒక సన్నివేశంలో చట్నీ నా చెంపకు అంటాలని దర్శకుడు చెప్పాడు. అప్పుడు తరుణ్‌ నన్ను గట్టిగా కొట్టాడు. అది నేను ఊహించలేదు. ఆ దెబ్బకు నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. సీన్‌ అయిపోగానే సారీ చెప్పాడు. కానీ చివర్లో నేను కూడా గట్టిగానే కొట్టాను అని ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రభాకర్‌ కొడుకును కాకపోయుంటే ఎన్నో సినిమాలు చేసేవాడిని

Vishwak Sen Reacts Laila Movie Result And His Mother Reaction7
మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు

తెలుగు హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గానీ తర్వాత తర్వాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. గతేడాది రిలీజైన 'లైలా' మూవీతో ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు 'ఫంకీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూ వదిలారు. ఇందులో మాట్లాడిన విశ్వక్.. డైరెక్టర్ అనుదీప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్)''ఫంకీ'లో రొమాంటిక్ సీన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్ అసలు. అదేంటో గానీ మేం సీన్స్ చేస్తుంటే.. మానిటర్ ముందు కూర్చున్న అనుదీప్ చాలా ఇబ్బందిగా అయిపోయాడు. చెప్పాలంటే బిగుసుకుపోయేవాడు' అని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇదే విషయం గురించి హీరోయిన్ కాయదు లోహర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్ జరుగుతుంటే మధ్యలో అనుదీప్ కట్ చెప్పేసేవాడు. మేమే ఎలాగోలా దాన్ని పూర్తి చేసేవాళ్లం అని చెప్పుకొచ్చింది.'లైలా' ఫ్లాప్ గురించి మాట్లాడిన విశ్వక్ సేన్.. నా ప్రతి సినిమా చూసే అమ్మ, అది యావరేజ్‌గా ఉన్నా తెగ పొగిడేసేది. 'లైలా'కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. మూవీ చూసొచ్చిన తర్వాత నన్ను జాలిగా చూసింది అని చెప్పాడు. 'ఫంకీ' విషయానికొస్తే.. మూవీ డైరెక్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తోంది. (ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)#Funky లో Romantic Scenes PEAKS లో ఉంటాయి... EXTREME అసలు..రొమాంటిక్ Scenes లో #Anudeep చాలా UNCOMFORTABLE అయిపోయాడు!!- #VishwakSen pic.twitter.com/DSigVrImla— Movies4u Official (@Movies4u_Officl) January 26, 2026

Chandrahas: If iam not Prabhakar Son, i get More Cinema Chances8
ప్రభాకర్‌ కొడుకుని కాకపోయుంటే ఎన్నో మూవీస్‌..

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ తనయుడు, యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రామ్‌నగర్‌ బన్నీ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఆ మూవీయే బరాబర్‌ ప్రేమిస్తా. ఈ చిత్రంలో మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్‌ మహి విలన్‌గా యాక్ట్‌ చేశాడు. నాన్న సపోర్ట్‌ చేయలేదుసంపత్‌ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో చంద్రహాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రహాస్‌ మాట్లాడుతూ.. నాకు 17 ఏళ్ల వయసున్నప్పటి నుంచే యాక్టింగ్‌ వైపు రావాలనిపించింది. నాన్న సపోర్ట్‌ చేయలేదు. 25 ఏళ్లు వచ్చాకే సపోర్ట్‌ చేస్తానన్నాడు. అప్పటిదాకా ఖాళీగా ఎందుకుండాలి? అనుకున్నాను. ట్రిప్పులు తిరిగాను. అప్పటికి నేను 12th పాస్‌ అంతే! దాంతో మా అమ్మ బ్లాక్‌మెయిల్‌ చేసింది.అమ్మ ఏడుపు వల్లే..నా కొడుకు 12వ తరగతి వరకే చదివాడని ఎలా చెప్పుకోవాలి? తలెత్తుకుని ఎలా తిరగాలి? అని ఏడ్చేసింది. తనకోసం కాలేజీలో జాయిన్‌ అయ్యా.. ఓపక్క చదువుకుంటూనే సినిమాలు, షార్ట్‌ ఫిలింస్‌కి ట్రై చేద్దామనుకున్నాను. ఓ పెద్ద ఆఫీస్‌కు వెళ్తే చాలాసేపు వెయిట్‌ చేయించారు. చివరకు ఆ క్యారెక్టర్‌కు నేను సెట్‌ కానని చెప్పారు. కనీసం ఆఫీస్‌ లోపలకు కూడా పిలవలేదు. నేను ప్రభాకర్‌ కొడుకునని ఆయనకు తెలుసు. నేను ఆయన కొడుకును కాకపోయుంటే వాళ్లు చేసినదాన్ని పట్టించుకునేవాడినే కాదు. ఆయన కొడుకుని కాకపోయుంటే..అసలు ప్రభాకర్‌ కొడుకుని కాకపోయుంటే ఈపాటికి చాలా సినిమాలు చేసేవాడిని.. చిన్న క్యారెక్టర్‌ లేదా పెద్ద పాత్రలు ఏవైనా చేసుకుంటూ పోయేవాడిని. కానీ, ఇప్పుడు నాకు ఆ స్వేచ్ఛ లేదు. ఆరోజు జరిగిన ఘటనతో గట్టిగా ఒకటి డిసైడయ్యా.. నన్ను ఉన్నత విద్య కోసం భారీగా ఖర్చు పెట్టి విదేశాలకు పంపించొద్దు.. ఆ డబ్బు ఏదో నేను చేయబోయే పాటకు ఇవ్వు. రూ.10-15 లక్షలు ఇస్తే ఓ పాట చేసుకుంటా అన్నాను. అది చూసి ఎవరైనా సినిమా ఛాన్సులిస్తారన్నది నా ఆశ!అనుకున్నట్లే సినిమా ఆఫర్‌ వచ్చింది అని చెప్పుకొచ్చాడు.చదవండి: బిస్కెట్స్‌ తిని కడుపు నింపుకున్నా: హీరో

Lokesh Kanagaraj Clarify Kaithi 2 And LCU Over Allu Arjun Movie9
డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. అల్లు అర్జున్‌తో రెండు వారాల క్రితం కొత్త సినిమాని ప్రకటించాడు. దీంతో ఈ దర్శకుడిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేసరికి 'ఖైదీ 2' వదిలేశాడు, LCU(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఆగిపోయింది అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై లోకేశ్ స్వయంగా స్పందించాడు. చెన్నైలో సోమవారం ఉదయం జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో తనపై వస్తున్న అన్ని పుకార్లకు సమాధానమిచ్చాడు.'గత వారం నుంచి ఎల్‌సీయూ క్లోజ్ అయిపోయిందని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఖైదీ 2 కూడా ఆగిపోయిందంటున్నారు. ఇది కూడా నిజం కాదు. అల్లు అర్జున్‌తో చేస్తున్న మూవీ పూర్తవగానే 'ఖైదీ 2' చేస్తా. తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ చిత్రాలు వరసగా వస్తాయి. లారెన్స్‌తో చేస్తున్న 'బెంజ్' కూడా ఎల్‌సీయూలో భాగమే. దయచేసి రూమర్స్ నమ్మకండి'(ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)'ఖైదీ 2 ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు. వేరే నిర్మాతలు డబ్బులు ఎక్కువ ఇచ్చారని దీన్ని వదిలేయలేదు. ఇతర ప్రాజెక్టుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. 'కూలీ' తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం చేయమన్నారు. దీంతో ఒకటిన్నర నెలలు స్క్రిప్ట్‌ వర్క్ చేశాను. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తుండటంతో ఒక సింపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చేద్దామన్నారు. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీక ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాను''అల్లు అర్జున్‌తో సినిమా కోసం మైత్రీ మూవీస్ సంస్థతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నాయి. అది ఇప్పటికి కుదిరింది. అందుకే బన్నీ మూవీ ఇప్పుడు చేస్తున్నాను తప్పితే 'ఖైదీ 2' వదిలేసి చేయట్లేదు. అలానే దళపతి విజయ్ 'జన నాయగణ్'లో అతిథి పాత్ర చేశా' అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)#LokeshKanagaraj about UpComing #LCU Film- After my film with #AlluArjun sir, my very next project will be #Kaithi2, #Vikram2, and the #Rolex standalone film are all commitments I’ve made, and I will complete every one of them.#AA23pic.twitter.com/de7CqnwckD— Movie Tamil (@_MovieTamil) January 26, 2026

Vikrant Massey: Survived on Parle G and water At Age of 1610
బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నా: బాలీవుడ్‌ హీరో

కష్టాలు దాటుకుని సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న తారలు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్‌ హీరో విక్రాంత్‌ మాస్సే ఒకరు. చిన్న వయసులోనే బండెడు కష్టాలు చూశానంటున్న ఈయన తాజాగా వాటిని ఓ సారి గుర్తు చేసుకున్నాడు. విక్రాంత్‌ మాస్సే మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను. అప్పటివరకు కాఫీ షాప్‌లో పని చేశాను. రోజులో 16 గంటలు పనినా చదువు ముందుకు సాగాలంటే ఆ ఉద్యోగం చేయడం తప్పనిసరి. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో కూడా పని చేశాను. అదే సమయంలో ఓ డ్యాన్స్‌ గ్రూప్‌కు అసిస్టెంట్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్‌ చేశాను. ప్రతిరోజు నాలుగు లోకల్‌ ట్రైన్స్‌ మారేవాడిని. 16 గంటలు పనిచేసేవాడిని. పార్లీజీ బిస్కెట్‌, నీళ్లు.. ఈ రెండింటితోనే కడుపు నింపుకునేవాడిని. తర్వాత నేనొక షో చేశాను. దానికోసం దాదాపు 8 నెలలపాటు కష్టపడ్డాను. డబ్బు కూడా సగమే..తీరా ఆ షో ప్రసారమే కాలేదు. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సగమే ఇచ్చారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయిందని చాలా బాధపడ్డాను. కొన్నేళ్ల తర్వాత ఆ షోను అర్ధరాత్రి టీవీలో ప్రసారం చేశారు. ఇలాంటి సమస్యలు యాక్టర్స్‌కు చివరి నిమిషం వరకు తెలియవు. అయితే ఈ షో కోసం నేనెంత కష్టపడ్డానో గుర్తించిన ఓ మహిళా నిర్మాత తన బ్యానర్‌లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా బుల్లితెరకు.. అక్కడినుంచి వెండితెరకు పరిచయమయ్యాను అని గుర్తు చేసుకున్నాడు.సీరియల్‌, సినిమావిక్రాంత్‌ మాస్సే.. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు), ఖుబూల్‌ హై వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేశాడు. సినిమాల్లో రాణించాలన్న ఆశతో బుల్లితెరకు గుడ్‌బై చెప్పాడు. లూటేరా చిత్రంతో 2013లో తొలిసారి వెండితెరపై కనిపించాడు. 12th ఫెయిల్‌ మూవీతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఓ రోమియో సినిమా చేస్తున్నాడు. షాహిద్‌ కపూర్‌, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది.చదవండి: ఫ్లాప్‌ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే: చిరంజీవి కౌంటర్‌?

Advertisement
Advertisement