ప్రధాన వార్తలు
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్ చేస్తే తీసేస్తారు: అషూ
టిక్టాక్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్ స్మాష్, రీల్స్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్బాస్ నాన్స్టాప్లోనూ పాల్గొని మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.ఇప్పటివరకు ఎన్నో చేశా..ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్లో నటించింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ విన్నర్ నిఖిల్ మళయక్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రెస్మీట్లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ పర్ఫామెన్స్లు, క్యారెక్టర్ రోల్స్, హోస్టింగ్.. ఇలా అన్నీ చేశాను. హీరోయిన్ అంటుంటే..తొలిసారి హీరోయిన్గా చేశాను. షూటింగ్లో అందరూ హీరోయిన్గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా..అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా ప్రొడక్షన్ హౌస్ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే?
మిమ్మల్ని కలిసే ఛాన్స్ రాలేదు.. ఆ ప్రేమని జీవితాంతం కొనసాగిస్తూ
అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026
నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా
సోషల్ మీడియా, యూట్యూబ్ చూసేవాళ్లకు షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయం అక్కర్లేదు. 'వైవా' అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మొదలైన ఇతడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా చేసేంత వరకు వచ్చాడు. అయితే తోటి యూట్యూబర్ దీప్తి సునైనాతో ప్రేమ-బ్రేకప్, బిగ్బాస్ 5వ సీజన్లో సిరి హనుమంతుతో చేసిన రచ్చ, ఓసారి డ్రగ్స్తో దొరికిపోవడం.. ఇలా చాలాసార్లు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడు. గత కొన్నేళ్లుగా పెద్దగా కనిపించని షన్ను.. కొన్నిరోజుల క్రితం వైష్ణవి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. గతంలో తనకు జరిగిన చేదు సంఘటనలు, బ్రేకప్, బిగ్బాస్ అనుభవం, వైష్ణవితో ప్రేమ-నిశ్చితార్థం ఇలా చాలా విషయాలు గురించి మాట్లాడాడు. మిగతా వాటి సంగతేమో గానీ తనని తాను.. బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని అని చెప్పుకోవడం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. బ్రేకప్ (దీప్తి సునైనాతో) తర్వాత నిజంగా బాధపడ్డారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సంగతులు చెప్పుకొచ్చాడు. ఒక టీవీ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని బిగ్బాస్ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.'అవును బ్రేకప్ తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాను. నా వల్ల తనకు, ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకున్నాను. పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు నడిచాను. కానీ ఎందుకు బ్రేకప్ చెప్పావ్? నాకు సమాధానం చెప్పు అని ఒత్తిడి చేయలేదు. చెప్పాలంటే నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని. బ్రేకప్ తర్వాత ఒక్కరిని కూడా టార్చర్ చేసింది లేదు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఫోన్ తీసి ఫొటోలు చూసుకోవడమే తప్పితే.. ఇది చేస్తా అది చేస్తా అనే బ్యాచ్ కాదు' అని షన్ను చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: గద్దర్ అవార్డ్స్-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య)'బ్రేకప్ తర్వాత తనకు ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయింది. అలాంటి టైంలో తన జీవితంలోకి వైష్ణవి వచ్చిందని షన్ను చెప్పాడు. ఈమెకు చాలా దైవభక్తి. ఎప్పటికప్పుడు దేవాలయాలకు వెళ్తూనే ఉంటుంది. అలానే మాకు పరిచయమైంది. తొలుత హనుమాన్ చాలీసా లాంటివి వాట్సాప్లో పంపించుకునేవాళ్లం. హనుమాన్ జయంతి సందర్భంగా కరుంగళి మాలతో పాటు హనుమాన్ చాలీసా లాంటివి వైష్ణవి పంపింది. నేను కూడా రామకోటి లాంటివి శ్రీరామనవమి టైంకి పంపించాను. అలా స్నేహితులుగా ఉన్నవాళ్లం కాస్త తర్వాత స్టేజీకి వెళ్లాం''అయితే ప్రేమలాంటివి కాకుండా డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. నా గురించి అన్ని తెలిసి కూడా వైష్ణవి, వాళ్ల అమ్మ ఒప్పుకోవడం గొప్ప విషయం. ఇక నా చేతిపై పచ్చబొట్టు గురించి వైష్ణవి చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అది మీకో మెమొరీ. ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఎప్పుడు తీసేయాలన్నా సరే మీ ఇష్టం అని నాతో చెప్పింది. అది కాదండీ, ఇలా మాట్లాడండి అని పిలవడం తప్పితే ఇప్పటివరకు నన్ను షన్ను అని పిలవలేదు' అని షన్ను.. తనకు కాబోయే భార్య వైష్ణవి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హీరోగా 'ప్రేమకు నమస్కారం' సినిమా చేస్తున్నాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య)
బిగ్బాస్
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు
తనూజ బర్త్డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
ప్రేయసితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
A to Z
OTT: నేటి తరం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది
నాడు రాత్రిపూట మేడ మీద మన తాతలు, అవ్వలు చెప్పిన కథ...
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి...
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వస...
అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి
తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది....
వాయిదా రూమర్స్కి చెక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా...
కృతీని అవమానించిందా? చిల్లర పనులు చేయనన్న హీరోయిన్
హీరోయిన్ కృతిసనన్పై యామీ గౌతమ్ అసూయతో రగిలిపోతు...
పెద్ది హీరోయిన్ బర్త్ డే.. కాలి నడకన తిరుమలకు..!
బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ త...
ఇండియా వదిలేస్తా ఇరాన్ వెళ్లిపోతా.. బాలీవుడ్ నటి సంచలన ప్రకటన
దుబాయ్ సహా పశ్చిమాసియాలో చిక్కుకున్న బాలీవుడ్ నట...
19ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న 'షకీరా'
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీర...
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. క...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్
పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్కు మెగా హీరో రామ్ చరణ్ ...
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్...
కరీనా కపూర్లా చూపిస్తానన్నాడు.. అందుకే బికినీ ధరించా!
హీరోయిన్ ప్రియమణి సినీ జర్నీ తెలుగు సినిమాతోనే మొ...
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
స్టార్ హీరో విజయ్- సంగీత విడాకుల వ్యవహారం తమిళనా...
ఫొటోలు
తమిళనాడు డివోషనల్ ట్రిప్లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)
‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
వరలక్ష్మి శరత్కుమార్ ‘సరస్వతి’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
హైదరాబాద్లో గ్రాండ్గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
గాసిప్స్
View all
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్కి ముందు భారీ మార్పులు?
రామ్ చరణ్ 'పెద్ది' రన్టైమ్.. 4 గంటలపైనే?
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
దర్శకుడు మారుతి 'హ్యాపీ పొంగల్'?
నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’.. యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్?
హిట్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకొన్న వెంకటేశ్?
రివ్యూలు
View all
2.5
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
1.75
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ.. ప్రేక్షకులు సుద్దపూసలు కాదు
2.25
‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
‘సరస్వతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
మూగజీవాల ఎమోషన్స్ చూపించే లక్కీ.. ఓటీటీ మూవీ రివ్యూ
2.75
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
2.75
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
భార్యకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్
అల్లు అర్జున్.. తన భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. పెళ్లిరోజు సందర్భంగా కారుని గిఫ్ట్గా ప్రెజెంట్ చేశాడు. నిన్ననే ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే బన్నీ.. తన తమ్ముడు శిరీష్కి ఈ కారుని పెళ్లి కానుకగా దీన్ని ఇచ్చాడని చాలామంది అనుకున్నారు. కానీ పెళ్లిరోజు సందర్భంగా భార్యకు దీన్ని ఇచ్చినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. 2011లో స్నేహని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అయాన్, అర్హ అని పిల్లలు ఉన్నారు. శుక్రవారం(మార్చి 06) వీళ్ల పెళ్లిరోజు. ఈ క్రమంలోనే భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. ఇదే రోజున అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ కూడా నయనికతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం విశేషం.అయితే పెళ్లిరోజున అల్లు అర్జున్ తన భార్యకు విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ ఏఎమ్జీ మోడల్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్ కారు ధర రూ.4-5 కోట్ల మధ్యనే ఉంది. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒకటి చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతోంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ మొదలుపెట్టొచ్చు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonliine_)
విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.(ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)Recently, there have been a few problems happening. I see that you are getting hurt while fighting for it. I’m getting hurt seeing you guys getting hurt. I’ll take care of the problems. Don’t get hurt. Nothing to worry about..- #ThalapathyVijay's speech pic.twitter.com/8QFSWVjklU— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2026
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ‘రాజు వెడ్స్ రాంబాయి’
కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ సత్తాచాటింది. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ..ఇలా నాలుగు ప్రధాన కేటగిరీల్లో ఈ సినిమా అవార్డ్స్ గెల్చుకుంది. ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటి, ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి, స్పెషల్ జ్యూరీగా చైతన్య జొన్నలగడ్డ గద్దర్ అవార్డ్స్ స్వీకరించనున్నారు."రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.(ఇదీ చదవండి: ‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?)తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్డేట్ అంటారు. తర్వాత సాంగ్కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్లో చాలామంది పాటించరు.తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్లు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మరింత వైలెంట్గా ధురంధర్ 2 ట్రైలర్)
ఆ రోజు రాత్రే ప్రియాంకకు ‘ఫ్రెంచ్ కిస్’.. సీక్రెట్స్ బయటపెట్టిన నిక్ జోనాస్
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంటకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఏ విషయంలో అయినా వీరిద్దరు చాలా ఓపెన్గా మాట్లాడతారు. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటారు. అందుకే ఈ జంటపై నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా నిక్ జోనాస్ ఒక ఇంటర్వ్యూలో తమ మొదటి డేటింగ్కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిక్ జోనాస్ తన మొదటి డేటింగ్ అనుభవం గురించి చెబుతూ.. ‘మా మొదటి డేటింగ్ చాలా విచిత్రంగా జరిగింది. అందరిలాగా మేం ఒంటరిగా డేటింగ్కి వెళ్లలేదు. ప్రియాంక తన స్నేహితురాలితో వస్తే..నేను మా సోదరుడిని తీసుకొని వెళ్లాను. ఈ డేట్ ప్లాన్ చేసింది ప్రియాంకనే. మొదట ఓ మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్కి వెళ్లాం. అయితే అది ప్రియాంకకు నచ్చలేదు. దీంతో బయటకు వెళ్లాలనుకున్నాం. మాతో పాటు ఇంకో జంట కూడా వచ్చింది. ఆ రోజు సాయంత్రం చాలా ఆనందంగా గడిపాం. ఇద్దరం కలిసి డ్రింక్ చేయడానికి ఎక్కడికో వెళ్లాం. మేము ఎంత దూరంలో ఉన్న సోదరుడు మా కోసం డ్రింక్స్ పంపించి.. దూరంగా వెళ్లిపోయాడు. అంతేకాదు ఆ రోజు టైమ్ దొరికినప్పుడల్లా ప్రియాంకకు నా గురించి గొప్పగా చెప్పేందుకు ట్రై చేశాడు. అది ఆమెకు అర్థమై ‘మీ బ్రదర్ నీకు బాగానే గ్యాస్ కొడుతున్నాడు కదా’ అని నవ్వేసింది. ఇలా ఆ ఈవినింగ్ చాలా ఎంజాయ్ చేశాం. ఇక ఆ రోజు రాత్రి ఎలా గడిపారనే విషయాన్ని చెబుతూ.. ‘ఆ రోజు నైట్ మీమిద్దరం 'ఫ్రెంచ్ కిస్' చేసుకున్నామని నిక్ చెప్పాడు. ఆ క్షణం తమ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకం అని, అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎంతో నిజాయితీగా పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.కాగా, ప్రియాంక, నిక్ల వివాహం 2018లో జరిగింది. ప్రస్తుతం ఈ జంటకి 'మాలతీ మేరీ' అనే కుమార్తె ఉంది. తమ కెరీర్లతో బిజీగా ఉంటూనే, కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
విరోష్ రిసెప్షన్లో అల్లు అర్జున్ బౌన్సర్లు ఎందుకలా చేశారంటే?
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. ఈ లవ్బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. తర్వాత మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టేజీపై ఫోటో దిగేందుకు వెళ్తుండగా ఆయన వెనకాల ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకుని ఆపేశారు.ఏం జరిగిందంటే?కొందు ఆయన్ను సైడ్ యాంగిల్లో చూసి జూనియర్ ఎన్టీఆర్ అనే భ్రమపడ్డారు. అల్లు అర్జున్ బౌన్సర్లు ఎన్టీఆర్ను ఆపేశారా? అని ఆశ్చర్యపోయారు. కానీ, అక్కడున్నది తారక్ కాదు, ఆయనకు డూప్గా నటించే ఈశ్వర్. తాజాగా ఈశ్వర్ అక్కడేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్తో పాటు వీడియోలో ఉన్నది నేనే.. ఆ రోజు ఏం జరిగిందంటే? అల్లు అర్జున్ సర్ లోపలకు వచ్చే సమయంలో నేను కూడా లోనికి వెళ్తున్నాను. జూమ్ చేస్తూ పెద్దగా..స్టేజీపై ఫోటో దిగడం కోసం ఆయన సడన్గా ఆగిపోయారు. ఆయన బౌన్సర్లు ఏమనుకున్నారంటే నేను ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తున్నానని భ్రమపడ్డారు. లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించి నన్ను ఆపేశారు. అది చాలా చిన్న విషయం. దాన్ని జూమ్ చేస్తూ చాలా పెద్దగా చూపించారు. అలా వీడియో చాలా వైరల్ చేశారు. దానివల్ల నాకు కూడా మంచి రీచ్ వచ్చింది. థాంక్యూ సోమచ్ అని వీడియో షేర్ చేశాడు. ఇతడు ఆర్ఆర్ఆర్ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్కు డూప్గా నటించాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwarharris_1) చదవండి: అణిగిమణిగి ఉండాలి.. లేదంటే సైడ్ చేస్తారు: అషూ
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్ చేస్తే తీసేస్తారు: అషూ
టిక్టాక్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్ స్మాష్, రీల్స్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్బాస్ నాన్స్టాప్లోనూ పాల్గొని మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.ఇప్పటివరకు ఎన్నో చేశా..ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్లో నటించింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ విన్నర్ నిఖిల్ మళయక్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రెస్మీట్లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ పర్ఫామెన్స్లు, క్యారెక్టర్ రోల్స్, హోస్టింగ్.. ఇలా అన్నీ చేశాను. హీరోయిన్ అంటుంటే..తొలిసారి హీరోయిన్గా చేశాను. షూటింగ్లో అందరూ హీరోయిన్గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా..అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా ప్రొడక్షన్ హౌస్ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే?
మిమ్మల్ని కలిసే ఛాన్స్ రాలేదు.. ఆ ప్రేమని జీవితాంతం కొనసాగిస్తూ
అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)
నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా
సోషల్ మీడియా, యూట్యూబ్ చూసేవాళ్లకు షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయం అక్కర్లేదు. 'వైవా' అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మొదలైన ఇతడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా చేసేంత వరకు వచ్చాడు. అయితే తోటి యూట్యూబర్ దీప్తి సునైనాతో ప్రేమ-బ్రేకప్, బిగ్బాస్ 5వ సీజన్లో సిరి హనుమంతుతో చేసిన రచ్చ, ఓసారి డ్రగ్స్తో దొరికిపోవడం.. ఇలా చాలాసార్లు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడు. గత కొన్నేళ్లుగా పెద్దగా కనిపించని షన్ను.. కొన్నిరోజుల క్రితం వైష్ణవి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. గతంలో తనకు జరిగిన చేదు సంఘటనలు, బ్రేకప్, బిగ్బాస్ అనుభవం, వైష్ణవితో ప్రేమ-నిశ్చితార్థం ఇలా చాలా విషయాలు గురించి మాట్లాడాడు. మిగతా వాటి సంగతేమో గానీ తనని తాను.. బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని అని చెప్పుకోవడం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. బ్రేకప్ (దీప్తి సునైనాతో) తర్వాత నిజంగా బాధపడ్డారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సంగతులు చెప్పుకొచ్చాడు. ఒక టీవీ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని బిగ్బాస్ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.'అవును బ్రేకప్ తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాను. నా వల్ల తనకు, ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకున్నాను. పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు నడిచాను. కానీ ఎందుకు బ్రేకప్ చెప్పావ్? నాకు సమాధానం చెప్పు అని ఒత్తిడి చేయలేదు. చెప్పాలంటే నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని. బ్రేకప్ తర్వాత ఒక్కరిని కూడా టార్చర్ చేసింది లేదు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఫోన్ తీసి ఫొటోలు చూసుకోవడమే తప్పితే.. ఇది చేస్తా అది చేస్తా అనే బ్యాచ్ కాదు' అని షన్ను చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: గద్దర్ అవార్డ్స్-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య)'బ్రేకప్ తర్వాత తనకు ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయింది. అలాంటి టైంలో తన జీవితంలోకి వైష్ణవి వచ్చిందని షన్ను చెప్పాడు. ఈమెకు చాలా దైవభక్తి. ఎప్పటికప్పుడు దేవాలయాలకు వెళ్తూనే ఉంటుంది. అలానే మాకు పరిచయమైంది. తొలుత హనుమాన్ చాలీసా లాంటివి వాట్సాప్లో పంపించుకునేవాళ్లం. హనుమాన్ జయంతి సందర్భంగా కరుంగళి మాలతో పాటు హనుమాన్ చాలీసా లాంటివి వైష్ణవి పంపింది. నేను కూడా రామకోటి లాంటివి శ్రీరామనవమి టైంకి పంపించాను. అలా స్నేహితులుగా ఉన్నవాళ్లం కాస్త తర్వాత స్టేజీకి వెళ్లాం''అయితే ప్రేమలాంటివి కాకుండా డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. నా గురించి అన్ని తెలిసి కూడా వైష్ణవి, వాళ్ల అమ్మ ఒప్పుకోవడం గొప్ప విషయం. ఇక నా చేతిపై పచ్చబొట్టు గురించి వైష్ణవి చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అది మీకో మెమొరీ. ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఎప్పుడు తీసేయాలన్నా సరే మీ ఇష్టం అని నాతో చెప్పింది. అది కాదండీ, ఇలా మాట్లాడండి అని పిలవడం తప్పితే ఇప్పటివరకు నన్ను షన్ను అని పిలవలేదు' అని షన్ను.. తనకు కాబోయే భార్య వైష్ణవి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హీరోగా 'ప్రేమకు నమస్కారం' సినిమా చేస్తున్నాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య)
‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలు డబుల్ చేసింది. యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని రణ్వీర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే ‘ధురంధర్2: ది రివెంజ్’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్మై షో, డిస్ట్రిక్ట్ యాప్ల ద్వారా టికెట్ బుకింగ్స్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్లోని వివిధ మల్టీప్లెక్స్లలో ఇప్పటికే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్ ప్రీమియర్స్కి టికెట్ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్ 2కి మాత్రం ప్రీమియర్స్కి కూడా నార్మల్ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్కి రావడం కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీ రన్టైమ్..ధురంధర్ 2 మూవీ రన్టైమ్పై మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్ టైమ్తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టే.. రన్టైమ్ విషయంలో మేకర్స్ భయపడడం లేదట. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
సినిమా
విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్
వెంకీ మూవీలో కీర్తి సురేష్..?
పెళ్లి తర్వాత రౌడీ లైనప్ ఫుల్ చేంజ్..!
గద్దర్ అవార్డ్స్ - 2025 ప్రకటన.. ఉత్తమ నటి, నటుడు
అల్లు వారి పెళ్లి సందడి..
పావలా శ్యామలకు బన్నీ భరోసా..!
పెద్ది మళ్ళీ పోస్టుపోన్..! APR 30 కాదు.. ఎప్పుడంటే..?
విడాకుల వ్యవహారం.. భార్య సంగీతకి రూ.250 కోట్లు ఆఫర్ చేసిన విజయ్!
టాప్ స్టార్ గా రామ్ చరణ్ రికార్డు... లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..?
విరోష్ ప్రేమకథ.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే
