ప్రధాన వార్తలు
తెలుగు తెరపై కొత్తందం
ప్రతి ఏడాది తెలుగు తెరపై కొత్త అమ్మాయిలు మెరుస్తుంటారు. కొత్త కథానాయికలు ఎందరొచ్చినా అందరికీ తెలుగు తెర చోటు కల్పిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది వెండితెరను మెరిపించేందుకు, తమలోని నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కొంతమంది కథానాయికల వివరాలపై ఓ లుక్ వేద్దాం.లక్కీ చాన్స్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్తో తొలి సినిమా అంటే ఏ హీరోయిన్కు అయినా లక్కీ చాన్స్ అనే చెప్పోచ్చు. ఈ లక్కీ చాన్స్ ఇమాన్వీ ఇస్మాయిల్కు దక్కింది. ‘సీతారామం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్గా చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, కర్తవ్యం వంటి అంశాల మేళవింపుతో 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.తొలి సినిమాయే ప్రభాస్ వంటి టాప్ హీరోతో నటిస్తుండటం, పైగా జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇమాన్వీకి కెరీర్ పరంగా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘ఫౌజి’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు సహ– నిర్మాతగా శివ చనన వ్యవహరిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.వెల్కమ్ జోయా రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్’ చిత్రం 2023లో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, కథలో కీలకమైన జోయా పాత్రధారిగా త్రిప్తీ దిమ్రి నటించారు. జోయా పాత్రలో త్రిప్తి నటనకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ ‘యానిమల్’ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో కూడా పడ్డారు త్రిప్తి. అప్పట్నుంచి ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఫలానా హీరోతో ఉంటుందనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్గా ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ చిత్రంతో త్రిప్తీ దిమ్రి టాలీవుడ్కు వస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘స్పిరిట్’ కావడం విశేషం. అంతేకాదు... ‘యానిమల్’ సినిమాతో త్రిప్తీకి పాపులారిటీ తెచ్చిపెట్టిన సందీప్ రెడ్డివంగాయే ‘స్పిరిట్’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు జపాన్ వంటి విదేశీ భాషల్లోనూ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. డాక్టర్ పాత్రలో నటిస్తున్నారట త్రిప్తీ దిమ్రి. ప్రభాస్, త్రిప్తి ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని సమాచారం. ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రకాశ్రాజ్, కాంచన, వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సీతా పయనం యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన బహుభాషా చిత్రం ‘సీతా పయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోనే ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్గా నటించారు. ఐశ్వర్యకు తొలి తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ఇలా తన తండ్రి డైరెక్షన్ వహించి, నటించిన సినిమాతో ఐశ్వర్య తెలుగులోకి వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ధ్రువ సర్జా గెస్ట్ రోల్ చేశారు.ఆకాశంలో ఒక తార ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సినీ తారగా తెలుగుకి వస్తున్నారు సాత్విక వీరవల్లి. ఈ సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేస్తున్నారు సాత్విక. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి, తన కలలను సాకారం చేసుకోవాలని తాపత్రయపడే అమ్మాయి పాత్రలో సాత్విక నటిస్తున్నారని తెలిసింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా చేస్తున్నారు. మరో హీరోయిన్ శ్రుతీహాసన్ ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 80 శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ పీరియాడికల్ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ మూవీకి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు.శ్రీను–మంగల లవ్స్టోరీ బాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ అయిన రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ వంటి సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి డైరెక్షన్లో రానున్న ఇంటెన్స్ లవ్స్టోరీ సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్స్టార్ కృష్ణ, మహేశ్బాబుల నటవారసత్వాన్ని కొనసాగిస్తూ, జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.ఈ సినిమాలోనే రషా తడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ లవ్స్టోరీ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తుండగా, మంగ పాత్రలో రషా తడానీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మంగ ఫస్ట్ లుక్పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా రెండో షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. సి. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ స్వరకర్త.లెగసీ ‘లెగసీ’ అనే ΄పొలిటికల్ మూవీతో టాలీవుడ్కి వస్తున్నారు కన్నడ హీరోయిన్ ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ హీరోగా సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ΄పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘లెగసీ’. ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనేది ఉపశీర్షిక. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంతోనే ఏక్తా రాథోడ్ టాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. గతంలో ‘సిలికాన్ సిటీ, మాస్టర్ పీస్’ వంటి చిత్రాల్లో నటించారు ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తెలుగు అమ్మాయి హరికృష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, యువరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ చౌదరి కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి వీణా రావు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. వీణ మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. నటనలో దాదాపు ఏడాదిన్నర కాలం శిక్షణ తీసుకున్న తర్వాత హీరోయిన్గా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లుగా వీణ చెప్పారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ, రిలీజ్ వంటి అంశాలపై అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ పదేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్లో నటించిన ‘దాగుడు మూత దండాకోర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు సారా అర్జున్. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నందిని (నందిని రోల్ను ఐశ్వర్యా రాయ్ చేయగా, ఈ రోల్ యంగ్గా ఉన్నప్పటి సీన్స్లో సారా అర్జున్ నటించారు) పాత్రలో నటించి, యంగ్ యాక్టర్గా పాపులర్ అయ్యారు సారా. కాగా ఈ ఫిబ్రవరి 6న థియేటర్స్లో విడుదలైన ‘యుఫోరియా’ సినిమాతో ఓ లీడ్ యాక్టర్గా తెలుగు చిత్రపరిశ్రమకు సారా అర్జున్ పరిచయం అయ్యారు.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రంలోని సారా నటన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలాగే సారా అర్జున్ ఓ లీడ్ రోల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మ్యాజిక్’ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇంకా రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర యాలినా జమాలిగా సారా నటించారు. హీరోయిన్గా హిందీలో సారా అర్జున్కు ఇది తొలి చిత్రం కావడం విశేషం.⇒ ‘ది రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో భైరవి అనే పాత్రలో కనిపించారు మాళవిక. ఈ చిత్రంలో భైరవిగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశారు మాళవిక. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ది రాజాసాబ్’ సినిమా కంటే ముందే మాళవికా మోహనన్ ఎంట్రీ తెలుగులో జరగాల్సింది. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ఓ సినిమా క్యాన్సిలైంది. ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్’ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం మాళవికా మోహనన్ పేరును ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ పరిశీలించారు. కానీ ఈప్రాజెక్ట్లో మాళవిక పేరు ఫైనలైజ్ కాలేదు. ఈ చాన్స్ శ్రుతీహాసన్కు దక్కింది. ఇలా... మాళవిక టాలీవుడ్ రాక కాస్త ఆలస్యమైంది. ఇలా ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్న హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు
సీతా పరశురామ్ ఐపీఎస్
శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. ‘సామజవరగమన’ (2023) వంటి హిట్ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ద్వితీయ సినిమా ఇది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్ సీతా పరశురామ్గా రెబా మోనికా జాన్ నటించారు. శనివారం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ‘మృత్యుంజయ్’లో రెబా మోనికా జాన్ తనదైన నటనతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను!
‘అతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను... ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు’ అనే డైలాగ్తో ‘సీతా పయనం’ మూవీ ట్రైలర్ ఆరంభం అయింది. హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా ఇతర పాత్రలుపోషించారు.శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘‘మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్... ఇలా అన్ని రకాల అంశాలతో రూపొందిన చిత్రం ‘సీతా పయనం’. కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ ఇది’’ అని మేకర్స్ తెలిపారు.
ధనుష్-సాయిపల్లవి-శ్రీలీల సినిమా షురూ
ధనుష్ హీరోగా నటిస్తున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి శనివారం క్లాప్ కొట్టారు. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్బార్ ఫిల్మ్స్ ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘మారి 2’ (2018) చిత్రంలో ధనుష్, సాయిపల్లవి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ‘డీ 55’తో ఈ జోడీ రిపీట్ అవుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’ మూవీ ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి ‘డీ 55’ రెండో సినిమా. పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.
బిగ్బాస్
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
యాక్సిడెంట్తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
2009లో ఇండస్ట్రీలోకి.. ఇన్నాళ్లకు నటిగా..: స్రవంతి స్పీచ్
బిగ్బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
A to Z
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి...
ఓటీటీకి మనశంకర వరప్రసాద్గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమ...
ఓటీటీకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమ...
2026పై నెట్ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్లా?
ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తోంది. ఏ సినిమాని థియేటర్...
రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చిన విక్రాంత్ మాస్సే
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సినిమాలకు గుడ్బై...
బ్యాక్ టు బాలీవుడ్?
బ్యాక్ టు బాలీవుడ్ అంటున్నారట హీరోయిన్ ప్రియాంక...
జోడీ రిపీట్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మం...
ప్రేమకు వయసుతో పని లేదన్న నటి! భర్త చనిపోయాక..
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించింది హిందీ బుల్లి...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
'జన నాయగన్' రిలీజ్కు గ్రీన్ సిగ్నల్..?
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నా...
నేను ఏదీ అర్థం చేసుకోలేకున్నా: తమన్నా
అందం ఏ ఒక్కరికీ సొంతం కాదు. అయినా ఎవరి అందం వారికి...
అర్జున్ రెడ్డి బ్యూటీ బోల్డ్ లుక్.. థాయ్లాండ్లో శ్వేతామీనన్ చిల్..!
భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ పిక్స్..అర్జున్ ర...
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిం...
ఫొటోలు
వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)
కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)
‘యుఫోరియా’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
బ్లూ డ్రెస్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)
ఈయనే నా కెప్టెన్: శేఖర్ కమ్ముల కూతురు (ఫోటోలు)
ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)
ఫ్యామిలీతో వండర్ పార్క్లో లహరి (ఫోటోలు)
బర్త్డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్లో ఫోటోలు
‘ఎర్రచీర’ మూవీ హీరోయిన్ కారుణ్య చౌదరి (ఫొటోలు)
గాసిప్స్
View all
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
"ది ప్యారడైజ్" రిలీజ్పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్లోనే!
సంక్రాంతి 2027.. సీనియర్ హీరోల పోటీ?
'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?
భర్త కోసం పేరు మార్చుకోనున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా?
సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్
రివ్యూలు
View all
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
2.75
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
3.25
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.75
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినీ ప్రపంచం
నన్ను అలా అన్నందుకు బాధలేదు.. కానీ..: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశాన్ని ఓ విదేశీ జర్నలిస్ట్ అలా అని పిలవడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఒక దేశంలో ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైనప్పుడు అక్కడి స్థానిక అభిమానుల నుండి తనకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. విమానంలో ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తనను జాగ్రత్తగా హోటల్కు తీసుకెళ్లారని వెల్లడించారు. ఇటీవల టీమ్ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.అమితాబ్ మాట్లాడుతూ.. "ఒక దేశం నన్ను ఫిల్మ్ ఫెస్టివల్కు ఆహ్వానించింది(ఆ దేశం పేరు వెల్లడించను). దీనికి నేను వెళ్లడానికి అంగీకరించా. ఆ దేశానికి వెళ్లినప్పుడు విమానంలో ఓ వార్తాపత్రికను చూశా. అందులో నా సినిమాలలో ఒక చిత్రం ఉంది. ఆ దేశ భాష అర్థం కాక అందులో ఏమి రాశారని నేను ఎయిర్ హోస్టెస్ను అడిగా. అది ఒక భారతీయ సినిమా పోస్టర్ అని.. ఆ దేశానికి చెందిన నటుడు ఇక్కడికి వస్తున్నాడని పత్రికలో రాశారని ఆమె చెప్పింది" అని అన్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ తనను అభిమానుల గుంపు చుట్టుముట్టడంతో ఆశ్చర్యపోయానని వెల్లడించారు.ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఈ దేశంలో మన సినిమాల పట్ల ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. విమానం దిగిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ వరకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డా. పరిస్థితి ఎంత గందరగోళంగా మారిందంటే పోలీసులు వచ్చి నన్ను కారులో ఎక్కించి నా హోటల్కు తీసుకుని వెళ్లారు. నా జీవితంలో మొదటిసారిగా నా ఇమ్మిగ్రేషన్ హోటల్లో జరిగిందని' అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు.విదేశీ జర్నలిస్ట్ కామెంట్స్..అయితే తనకు ఆత్మీయ స్వాగతం లభించినప్పటికీ.. ఓ విదేశీ జర్నలిస్ట్ తనపై రాసిన కథనం చూసి బాధపడ్డానని తెలిపారు. మూడవ ప్రపంచ దేశానికి చెందిన ఈ మూడో రకం నటుడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారని కథనంలో రాసుకొచ్చాడని వెల్లడించారు. అయితే తనను మూడో రకం నటుడు అన్నందుకు బాధలేదని.. నా భారతదేశాన్ని మూడవ ప్రపంచ దేశం అని పిలవడం బాధ కలిగించిందని తెలిపారు.అందుకే తాజాగా తనకెదురైన అనుభవాన్ని క్రికెట్తో ముడిపెట్టి ట్వీట్ చేశారు. అండర్-19 క్రికెట్ ఇండియా.. ప్రపంచ ఛాంపియన్స్గా నిలిచారు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లుగా వరల్డ్లోనే మొదటి స్థానంలో ఉన్నాం.. మనం మూడో ప్రపంచం కాదు.. మనం మొదటి ప్రపంచం.. భారత్ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు. అంధులు, స్త్రీలు, పురుషులు, ఇప్పుడు 19ఏళ్ల వయస్సు క్రికెటర్స్ కూడా ఈ విషయాన్ని నిరూపించారని ట్విటర్లో పంచుకున్నారు. కాగా.. ఇటీవల జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో ఓడించింది. T 5649 - U19 Cricket INDIA .. WORLD CHAMPIONS !ठोक दिया दुश्मन को !!Blind , Women's , Mens Cricket ALL world Champions .. we are NUMBER 1 .. ONE .. on top , FIRST in World ..We are NOT 3rd World .. we are FIRST World !!BHARAT MATA KI JAI 🇮🇳 🇮🇳🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) February 7, 2026
అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నటి శరణ్య కూతురు రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో కోలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. హీరో కార్తీ, ధనుశ్తో పాటు పలువురు నటులు రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా.. శరణ్య పొన్నవన్.. ధనుశ్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంలో నటించారు. ఈ మూవీలో ధనుశ్కు అమ్మగా కనిపించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతే కాకుండా శరణ్య రఘువరన్ బీటెక్తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 .@dhanushkraja sir at Saranya Ponvannan Daughter Wedding Function! @theSreyas pic.twitter.com/Z3egrQzMTI— Chowdrey (@Chowdrey_Pro) February 7, 2026
మైక్ తీసుకోగానే బూతులు.. కానీ ఇప్పుడు: హీరోపై నాగవంశీ కామెంట్స్
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది చూసిన విశ్వక్ సేన్.. ఇప్పడున్న విశ్వక్ సేన్ వేరని అన్నారు. మైక్ తీసుకోగానే బూతులు తిట్టే విశ్వక్ కాదన్నారు. ఇప్పుడున్న విశ్వక్ సేన్ చాలా మారిపోయాడని తెలిపారు. ప్రస్తుతమున్న విశ్వక్ సేన్ను చూస్తుంటే అనుదీప్ను చూసినట్లు ఉందని ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. సంవత్సరం క్రితం చూసిన Vishwaksen కి ఇప్పటికి మారిపోయినట్టు లేడు. Mic ఇస్తే ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టేసి, arrogant బిహేవ్ చేసే Vishwak ను కాకుండా anudeep ను చూసినట్టు లేదు. - @vamsi84 pic.twitter.com/63cBPhgh15— Rajesh Manne (@rajeshmanne1) February 7, 2026
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
ప్రభాస్ 'రాజాసాబ్' ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో చూసినప్పుడే ఈ సినిమాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్గా రిలీజైన మరింత ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా దర్శకుడు మారుతిని అయితే నెటిజన్లు వదలట్లేదు. పూర్తిగా ఆడేసుకుంటున్నారు. మూవీలో ఎన్నెన్ని తప్పులున్నాయో ఎత్తిచూపుతూ మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ మూవీ 'రాజాసాబ్'. గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్కి ముందు సినిమా గురించి చాలా విషయాలు చెప్పిన మారుతి.. ఏకంగా తన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు. అయితే అదే అతడికి బూమ్రాంగ్ అయింది. మూవీ సరిగా తీయలేదనే కోపంతో ప్రభాస్ అభిమానులు.. వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పెట్టి మారుతిని ఇబ్బంది పెట్టినట్లు అప్పుడు వార్తలొచ్చాయి. ఇప్పుడైతే ట్విటర్లో ట్యాగ్ చేసి మరీ మారుతిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.'రాజాసాబ్' విషయంలో చాలామంది చేస్తున్న కంప్లైంట్ డూప్. స్టార్ హీరోలు చాలామందికి డూప్ ఉపయోగిస్తుంటారు. ఈ చిత్రంలో డూప్ అనే సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ప్రభాస్ ఫేస్ మార్పింగ్ గురించి స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అలానే సినిమాలో ప్రభాస్ బస్ జర్నీ చేసే సీన్లో.. తొలుత గడ్డం ఉండటం, బస్ దిగేసరికి గడ్డం ట్రిమ్ అయిపోవడం, బస్సే మారిపోవడం గురించి సెటైర్లు వేస్తున్నారు.మహారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా సంజయ్ దత్ పాత్ర సొంతమవుతుంది కదా? మరి పారిపోవడంలో లాజిక్ ఏంటని నెటిజన్లు అడుగుతున్నారు. ప్రభాస్ నానమ్మ మహారాణి అయితే ఇప్పటివరకు ఎలా బతికి ఉంది? ఇంతకీ ఆమె వయసెంత? లాంటి లాజిక్స్ కూడా వేస్తున్నారు. అలానే కోట్ల రూపాయలతో పాటు మహాల్ ఉన్న సంజయ్ దత్ పాత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర దగ్గర రూ.3 లక్షలు కొట్టేయడం ఏంటని అంటున్నారు. ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో లాజిక్స్ లేని సీన్లపై మారుతిని విమర్శిస్తున్నారు.
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలోనే 'షరారత్' అంటూ సాగే ఐటమ్ సాంగ్లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఆయేషా ఖాన్పైనా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. కానీ కొందరు ఈమెని.. బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్తో ఫేమస్ అయిన తమన్నా, నోరా ఫతేహితో పోలుస్తున్నారు. తనని వాళ్లతో పోల్చడం నచ్చలేదని ఆయేషా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'తమన్నా, నోరా ఫతేహితో నన్ను పోలుస్తున్నా రీల్స్.. సోషల్ మీడియాలో నేను కూడా చూశాను. కానీ అది నాకు నచ్చట్లేదు. వాళ్లిద్దరూ అద్భుతమైన మహిళలు. నోరా స్టేజీ ఫెర్ఫార్మెన్స్, ఎనర్జీ చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. తను చేసిది నేను ఎప్పటికీ చేయలేను' అని నోరా గురించి మాట్లాడింది. తమన్నా గురించి కూడా మాట్లాడిన ఆయేషా ఖాన్.. 'తమన్నా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. 'ఆజ్ కీ రాత్' పాటలో ఆమెని చూసి నేను ఫిదా అయిపోయా. ఇండస్ట్రీకి నేను కొత్త. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పుకొచ్చింది.'ధురంధర్'లో ఐటమ్ సాంగ్లో కలిసి చేసిన క్రిస్టల్తో మనస్పర్థలు అని వస్తున్న పుకార్లపైనా ఆయేషా స్పందించింది. అవన్నీ కేవలం రూమర్సే. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా.. తెలుగులోనూ ముఖచిత్రం, ఓం బీమ్ బుష్, మనమే తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ 'ధురంధర్' మూవీ ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాల్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ ప్రత్యేకతగా నిలిచింది. వరుసగా మూడు సినిమాలు అదే స్టైల్లో రావడంతో ఆయన మరోలా తీయరా అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ ఇప్పుడు ఆ అనుమానాలు తీరిపోయే సమయం వచ్చినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఫుల్ కలర్ ఫుల్గా ఉండబోతోందట. ఈసారి గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదని ఓ టాక్ నడుస్తోంది. అంటే ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్ను ఎంచుకున్నారని చెప్పొచ్చు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నబడ్డ విషయం తెలిసిందే. బయట ఒకటి రెండు సార్లు ఆయనను చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ సినిమాలో మాత్రం ఆయన గెటప్ ఓ లెవెల్లో ఉందని అంటున్నారు. చూసిన వాళ్లు అదిరిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూట్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర 2 కూడా లైన్లో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కెజిఎఫ్, సలార్ సినిమాల విజయాలతో ప్రశాంత్ నీల్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. డ్రాగన్ను గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ కాకుండా కొత్త స్టైల్లో తీస్తున్నందుకు అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
చెన్నైలో మంచు లక్ష్మికి చేదు అనుభవం
టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మికి చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన ఈమె.. గ్రీన్ పార్క్ అనే హోటల్కి వెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది తనతో రూడ్గా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.చెన్నైలోని ఈ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్న మంచు లక్ష్మి.. తనతో పాటు సిబ్బందిని కూడా తీసుకెళ్లింది. కానీ కెమెరామ్యాన్ని మాత్రం లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చింది. చిన్న కెమెరాకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని చెప్పుకొచ్చింది. దీని వల్ల చాలా అసంతృప్తికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు హాస్పిటాలిటీ ఇలా ఉండనేకూడదంటూ పేర్కొంది.గత కొన్నాళ్లుగా యాక్టింగ్ బాగా తగ్గించేసిన మంచు లక్ష్మి.. అడపాదడపా మాత్రమే ఒకటి రెండు మూవీస్ చేస్తోంది. గతేడాది 'దక్ష' అనే చిత్రంతో వచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. అలానే ఓటీటీ రియాలటీ షో 'ద ట్రైటర్స్ ఇండియా'లోనూ పాల్గొంది కానీ విజేత కాలేకపోయింది. కాకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.Extremely disappointed with the experience at Green Park Hotels Chennai.No rule was shown to me in writing, and no solution was offered, not even allowing a small camera with one person. This is not what hospitality should look like. pic.twitter.com/TeZRsFkyTu— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 7, 2026
'ధురంధర్' సినిమా కోసం 3 కేరవాన్స్ అడిగిన హీరో?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్బస్టర్ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. ధురంధర్: ద రివేంజ్ మూవీ మార్చి 19న విడుదల కానుంది.మూడు కేరవాన్స్ఇదిలా ఉంటే ధురంధర్ సినిమా సెట్లో రణ్వీర్ సింగ్ ఏకంగా మూడు కేరవాన్స్ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు నిజమిదే!ధురంధర్ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్లో షూట్ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్ డిమాండ్ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్ కోసం రణ్వీర్ సింగ్ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు. Hamza VanHamza's staff VanHamza's Normal Van 😭😭🙏🏻#RanveerSingh what you actually do with so many vans? #Dhurandhar pic.twitter.com/yQ7oiDKvTY— Bunny (@cinephilesonly) February 1, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్
శరణ్య కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్ హీరోలు
ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ్య- దర్శకనటుడు పొన్వన్నన్ దంపతుల చిన్న కూతురు చాందిని పెళ్లి పీటలెక్కింది. ఫిబ్రవరి 2న వివాహం జరగ్గా శుక్రవారం చెన్నైలో ఎంతో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్కు తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇద్దరూ డాక్టర్సే..చాందిని డాక్టర్ కాగా, అతడి భర్త ఫిలిప్ కూడా డాక్టర్ అని తెలుస్తోంది. 2025 డిసెంబర్లోనే వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇకపోతే నటి శరణ్య.. తల్లి, అత్తమ్మ పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్ హీరోలకు వెండితెరపై అమ్మగా కనిపించింది. గ్యాంగ్ లీడర్, రఘువరన్ బీటెక్, 24.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఈవిడ దర్శకుడు పొన్వన్నన్ను పెళ్లి చేసుకోగా వీరికి ప్రియదర్శిని, చాందిని సంతానం. కూతుర్లిద్దరూ డాక్టర్స్గా స్థిరపడ్డారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026Dhanush at Saranya Ponvannan’s Daughter Wedding Reception💥pic.twitter.com/Ox0Yn0hpgt— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్
నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ చేసిన ఓ పని వల్ల తీవ్ర విమర్శలపాలయ్యాడు. ప్రమోషన్స్ కోసం ఓ పాట పాడటం.. అందులో అసభ్య పదాలు ఉండటంతో హీరోను విమర్శించనివాళ్లు లేరు. ఓపక్క ట్రోలింగ్ జరుగుతుండగానే అతడి సినిమా బరాబర్ ప్రేమిస్తా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.స్పందించిన ప్రభాకర్ఈ క్రమంలో ఈ వివాదంపై నటుడు ప్రభాకర్ స్పందించాడు. తన కొడుకు చేసింది తప్పేనని అంగీకరించాడు. అందుకు క్షమాపణలు తెలియజేశాడు. ప్రభాకర్ మాట్లాడుతూ.. గత నాలుగురోజులుగా విపరీతంగా వైరలవుతున్న విషయం.. మా బాబు చంద్రహాస్ వాడిన బూతు పదాలు- దానిపై విశ్లేషణలు, అభిప్రాయాలు, వాళ్లు తిరిగి బూతులు అనడాలు.తప్పని చెప్పా..నేనైనా, నా కొడుకైనా, ఎవరైనా సరే పబ్లిక్గా బూతులు మాట్లాడటమనేది తప్పు. దాన్ని నేను ఎంకరేజ్ చేయను. ఆరోజు నేను ఫంక్షన్లో సగం పాటయ్యాక అక్కడికి వెళ్లాను. పాట అయిపోగానే బాబును పక్కకు పిలిచి నాన్నా, ఇలాంటి పదాలు పబ్లిక్గా వాడకూడదు అని చెప్పాను. వాడు కూడా సరేనని, ఇంకోసారి పునరావృతం చేయనన్నాడు. అయితే ఆ పాట వీడియో క్లిప్పింగ్స్ను ముక్కలుగా కట్ చేసి వైరల్ చేశారు. అది పెద్ద తప్పుతప్పు చేసినవాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు, కానీ, వినకూడని మాటల్ని ఇంకా ఎక్కువమందికి వినిపించి తప్పు చేస్తున్నారు. ఆ వీడియోలో రెండు, మూడు బూతులుంటే నా కుటుంబం మొత్తాన్ని వందల బూతులు తిడుతున్నారు. అది చేయకుండా ఉంటే బాగుండనిపించింది. ఆ ఈవెంట్లో నా భార్య, కూతురు లేరు. వాళ్లు చెన్నై షూటింగ్లో ఉన్నారు. ఆ విషయం తెలియకుండా చాలా మంది చాలామాటలన్నారు. అది చాలా పెద్ద తప్పు. పెంపకంపై విమర్శలుఏదైనా తెలుసుకుని మాట్లాడండి. నన్ను కూడా నానామాటలన్నారు. పెంచడం రాదా? పద్ధతి తెలీదా? అని విమర్శించారు. నా పెంపకం, నేర్పించిన సంస్కారం.. ఈ ఒక్క పాటతో డిసైడ్ చేయకూడదు. నా బిడ్డ టాలెంట్ చూడండి. బరాబర్ ప్రేమిస్తా సినిమా చూసినవాళ్లు చంద్రహాస్ అద్భుతంగా చేశాడంటున్నారు. ఎంతో మెచ్యురిటీ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అంటున్నారు.ఇబ్బందిపపడితే క్షమించండితప్పుని నేను సమర్థించట్లేదు. తప్పుని ఎత్తిచూపే పనిలో పడి మనం ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో! సమాజానికి హాని చేస్తున్నామేమో! నేను ఒకటే చెప్పదల్చుకున్నా.. మా అబ్బాయి ప్రవర్తన, మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపపడితే క్షమించండి. ఆరోజు ఫంక్షన్కు నాపై ప్రేమతో వచ్చిన జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్, జయంత్ సి. పరంజి గారిని మన్నించమని కోరుతున్నా.. నా ఫంక్షన్కు వచ్చినందుకు మీరు మాట పడాల్సి వచ్చింది. చివరగా.. నా బిడ్డ తప్పుల్ని ఎంచారు, ఒకసారి వాడి టాలెంట్నూ చూడండి అంటూ బరాబర్ ప్రేమిస్తా సినిమా చూడమని ప్రభాకర్ కోరాడు. View this post on Instagram A post shared by Prabhakar Podakandla (@prabhakarpodakandla) చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా: చంద్రహాస్
సినిమా
సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ
Koti: నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
Keerthi: పని చేస్తేనే ఫుడ్.. కష్టాలు ఎలా ఉంటాయంటే ?
ఇండస్ట్రీకి కొత్త హీరో దొరికాడు.. బిగ్ బాస్లో లాగా, సినిమాలో కూడా...
కొత్త క్రష్ మలయాళ బ్యూటీ రియా శిబు
Premalu Movie: రూ. 3 కోట్లతో.. రూ. 130 కోట్లు సీక్వెల్ లేనట్టేనా..?
రాజాసాబ్ రీమిక్స్ సాంగ్ కోసం.. రూ. 20 కోట్లా...?
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీకి వస్తున్నాడు..
బన్నీ మూవీలో రష్మిక కీ రోల్ ..! అట్లీ ప్లాన్ అదుర్స్
