ప్రధాన వార్తలు
మగాళ్లు మా సినిమా చూడకపోయినా పర్వాలేదు
మంచు లక్ష్మీ మైక్ పట్టిందంటే చాలు.. ఏదో ఒకలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలానే తమ సినిమాని మగాళ్లు చూడకపోయినా పర్లేదని చెప్పి విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈమెతో పాటు అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'లేచింది మహిళా లోకం'. ఈనెల 26నే థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు)'మేం చిన్న సినిమా చేసినా అద్భుతమైన సినిమాలు చేశామనమాట. ఇందులో ఇంతలా కామెడీ చేస్తానని అనుకోలేదు. నేను రెచ్చిపోయాను. కొన్ని డైలాగులు ఉండవని అనుకున్నా కానీ ఉన్నాయి. సీరియస్ సబ్జెక్ట్లని కామెడీగా చెబితేనే జనాలు వింటారు. సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఉంటుందేమో! మహిళలందరూ తమ తల్లి, నానమ్మ, అమ్మమ్మలతో వచ్చి మా సినిమా చూడండి. మగాళ్లు చూడకపోయినా పర్వాలేదు' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.అలానే ట్రైలర్లో వినిపించిన 'ఫిష్ అండ్ ఫిషర్ మెన్', 'లెట్ దెం నో' అనే డైలాగులు తన ప్రమేయం లేకుండానే సినిమాలో పెట్టేశారని లక్ష్మీ క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు డైలాగుల్లో ఒకటి మోహన్ బాబుది కాగా రెండోది మంచు విష్ణుది. ఇక ట్రైలర్లోని వైల్డ్ ఫైర్ డైలాగ్ గురించి ప్రస్తావించిన ఈమె.. 'పుష్ప 2' రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. సుకుమార్ కంటే ఫైర్, వైల్డ్ ఫైర్ డైలాగ్ నేను మొదట ఈ సినిమాలో వాడాను. ప్రస్తుతం సినిమాలు నిర్మించడం మానేశాను. కాబట్టి నా దగ్గరకు కథలు తీసుకురాకండి. యాక్టింగ్ కోసం మాత్రమే సంప్రదించండి అని చెప్పింది. ఒకప్పుడు మీడియా ముందు ఎలా ఉండాలా అని ఆలోచించేదాన్ని? ఇప్పుడు ఎలాంటి విమర్శలను, ట్రోలింగ్ని పట్టించుకోవడం లేదని తెలిపింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)
జన నాయగన్కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్ మేకర్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్ బోర్డ్ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.
గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే' సాంగ్ విన్నారా?
'బేబి' సినిమా జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం "ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్". 90's సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి సంచారమే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించడంతో పాటు పాట ఆలపించాడు. ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా హమ్మింగ్ చేస్తూ మధ్యమధ్యలో లిరిక్స్ అందుకున్నాడు. గోరేటి వెంకన్న నోట..వెంకన్న గొంతుక ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందం ఏమున్నది? అంటూ పాట మొదలవుతుంది. ఊరు నుంచి విదేశాలకు వెళ్లిన సంచారి అనుభవాలను, ఎగ్జయిట్మెంట్ను పాటలో చూపించారు. ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చదవండి: అప్ప ట్లో వాష్రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి
50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు, హీరోగా చేసిన రణ్దీప్ హుడా శుభవార్త చెప్పేశాడు. ఇతడి భార్య లిన్ లైస్రామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈమె బేబీ బంప్తో ఉన్న ఫొటోలని స్వయంగా రణ్దీప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్)2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ టైంలో అయితే వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్గా అలరించాడు.అసలు విషయానికొస్తే.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్ని మణిపురి సంప్రదాయంలో రణ్దీప్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇతడి వయసు 47 ఏళ్లు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అంటే 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత నెలలోనే లిన్కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda)
బిగ్బాస్
ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ
నేనెంత లక్కీ.. కన్నీళ్లాగడం లేదు: తనూజ ఎమోషనల్
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు
తనూజ బర్త్డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
A to Z
ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమ...
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్ చేస్తే తీసేస్తారు: అషూ
టిక్టాక్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది...
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే ఏకంగా 12 చిత్రాలు..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం...
ఓటీటీలో జెన్జీ లవ్స్టోరీ.. స్ట్రీమింగ్పై ప్రకటన
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్...
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్
సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే...
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా...
‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర...
భార్యాభర్తలిద్దరం పని చేస్తామంటే కుదరదు: కరీనా
రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని వాదించి వార్త...
19ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న 'షకీరా'
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీర...
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. క...
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజ...
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛ...
థియేటర్లలో మళ్లీ కాంచన.. రీ రిలీజ్ ఎప్పుడంటే?
తమిళ స్టార్, దర్శకుడు రాఘవ లారెన్స్ స్వీయ డైరెక్షన...
టీమిండియా వరల్డ్ కప్ విన్.. పెద్ది సాంగ్ వీడియో వైరల్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ను ము...
విడాకులు.. తాగుడుకు బానిసయ్యా.. చావే దిక్కనుకున్నా!
విడాకుల బాధ భరించలేక మద్యపానానికి బానిసయ్యానంటున్న...
రిలీజ్కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల...
ఫొటోలు
చీరలో పవర్ఫుల్గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)
గ్రాండ్గా హీరోయిన్ శ్రద్ధాదాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)
'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ (ఫొటోలు)
తమిళనాడు డివోషనల్ ట్రిప్లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)
‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
వరలక్ష్మి శరత్కుమార్ ‘సరస్వతి’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
హైదరాబాద్లో గ్రాండ్గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
గాసిప్స్
View all
రీమేక్ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం
పవన్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్!
సినిమాల కౌంట్ ఫుల్.. కలెక్షన్ నిల్
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్కి ముందు భారీ మార్పులు?
రామ్ చరణ్ 'పెద్ది' రన్టైమ్.. 4 గంటలపైనే?
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
రివ్యూలు
View all
ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
1.75
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ.. ప్రేక్షకులు సుద్దపూసలు కాదు
2.25
‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.25
‘సరస్వతి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
మూగజీవాల ఎమోషన్స్ చూపించే లక్కీ.. ఓటీటీ మూవీ రివ్యూ
2.75
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
1.5
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
సినీ ప్రపంచం
ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు సంగతి పక్కనబెడితే ఓటీటీల్లోనూ నేరుగా కొన్ని మూవీస్ స్ట్రీమింగ్లోకి వస్తుంటాయి. అలా గత వీకెండ్ వచ్చిన హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'వార్ మెషీన్'. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ దృష్టిలో పడింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)కథేంటి?అది అఫ్ఘానిస్తాన్లోని ఓ ప్రాంతం. పాడపోయిన తన తమ్ముడి ఆర్మీ కాన్వాయ్ బాగు చేసేందుకు అమెరికన్ ఆర్మీకి చెందిన స్టాఫ్ సార్జెంట్ (అలెన్ రిచ్సన్) వస్తాడు. సరిగ్గా అప్పుడే తాలిబన్లు వీరిపై దాడి చేస్తారు. దీని నుంచి సార్జెంట్ మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత అమెరికన్ ఆర్మీలోని అత్యంత కష్టమైన రేంజర్ కావాలనుకుంటాడు. నాలుగుసార్లు తిరస్కరణకు గురైనా సరే చివరకు ట్రైనింగ్కి ఎంపికవుతాడు. శిక్షణలో భాగంగా చివరి దశకు చేరుకుంటాడు. చిట్టచివరి పరీక్షలో పాసైతే చాలు అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? సార్జెంట్.. ఏలియన్ షిప్తో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు గానీ దీన్ని థియేటర్లో విడుదల చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అలాంటి అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే 100 నిమిషాలున్న ఈ మూవీ.. మొదటి సీన్ నుంచి చివరవరకు అసలు గ్యాప్ అనేది లేకుండా అదరగొట్టేసింది. ఓవైపు యాక్షన్ చూపిస్తూనే.. మరోవైపు ఏలియన్ షిప్ చేస్తున్న దాడి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.అసలు అమెరికన్ ఆర్మీ ఎలా ఉంటుంది? ఆర్మీలోని రేంజర్ కావాలంటే ఎలాంటి పరీక్షలు పెడతారు? ఎంతలా కష్టపడాల్సి వస్తుందనే విషయాల్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. హీరోతో సహా మిగతా పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయినా సరే చివరివరకు ఆపకుండా చూసేంత ఎంగేజింగ్గా మూవీని తెరకెక్కించారు.సింపుల్గా తేల్చేయొచ్చు అనుకునే పరిస్థితుల్లో ఊహించని విధంగా ఏలియన్ షిప్ దాడి చేసి.. కనిపించిన వాళ్లని కనిపించినట్లు చంపేస్తుంటే.. హీరో తను బయటపడటంతో పాటు మరో వ్యక్తిని ఎలా రక్షించాడు. చివరకు బతికి బట్టకట్టడంతో పాటు రేంజర్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ మూవీ చూసేయాల్సిందే.మిలటరీ కాన్సెప్ట్, యాక్షన్-సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అంటే ఆసక్తి ఉంటే మాత్రం దీనిపై లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రధాన పాత్ర చేసిన రిచ్సన్ తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఓటీటీలో ఏదైనా ఓ మంచి యాక్షన్ మూవీ చూద్దానుకుంటే మాత్రం ఇదో బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: పనిచేసినా రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన)
స్టేట్ అవార్డుతో సాయిపల్లవి.. కోలీవుడ్లో 'బేబి' బిజీ
తమిళనాడు రాష్ట్ర అవార్డుతో సాయిపల్లవి పోజులుకోలీవుడ్ హీరో ఆర్యతో వైష్ణవి చైతన్య జిమ్ స్టిల్స్పద్ధతిగా లంగా ఓణీలో 'బలగం' హీరోయిన్ కావ్యషూటింగ్స్లో తెర వెనక సంయుక్త మేనన్ ఇలాబ్లాక్ డ్రస్లో గ్లామర్ చూపించేస్తున్న శ్రుతి హాసన్చుడీదార్లో కుందనపు బొమ్మలా రకుల్ ప్రీత్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Divi (@actordivi)
పనిచేసినా రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన
ఇండస్ట్రీలో సమస్యలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లని.. దర్శకనిర్మాతల దగ్గర నుంచి నిర్మాణ సంస్థలు పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి బయటపడుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఇలానే నిర్మాణ సంస్థ తన రెమ్యునరేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)రన్ రాజా రన్, టైగర్, ఒక్క క్షణం, రాజుగారి గది 2 తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన సీరత్ కపూర్.. చివరగా 2024లో మనమే, ఉషా పరిణయం చిత్రాల్లో కనిపించింది. మరి ప్రస్తుతం ఏ మూవీ చేస్తుందో ఏమో గానీ షూటింగ్ పూర్తయి నాలుగు నెలలు అవుతున్న తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వట్లేదని చెప్పి ఓ ట్వీట్ చేసింది.'షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలు గడిచినా సరే సంబంధిత ప్రొడక్షన్ టీమ్ నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. నా కుటుంబంలో అత్యవసర వైద్య పరిస్థితి ఉందని చెప్పినా స్పందించలేదు. చాలా సహనంతో ఎదురుచూస్తున్నా. నా టీమ్కి ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా పెండింగ్లోనే ఉంది. టీమ్కు ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయింది. దీన్ని ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి. లేకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని సీరత్ కపూర్ రాసుకొచ్చింది. ఇలాంటి విషయాల్లో కాస్త బాధ్యతతో వ్యవహరించాలని హితవు చెప్పింది. మరి ఈమెని ఇబ్బంది పెడుతున్న ఆ నిర్మాణ సంస్థ పేరు బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. తెలుగు సినిమా టీజర్)pic.twitter.com/LONBKhAvMc— Seerat Kapoor (@IamSeeratKapoor) March 7, 2026
మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్ సిటీ టీజర్ చూశారా?
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.డబ్బులు ప్రింట్ చేసే మిషన్సోమవారం సాయంత్రం కాన్సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.చేతులు మారిన యంత్రందాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్గా మిషన్ కనిపించకుండా పోతుంది. వీధిలో నోట్ల వర్షంఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది.
ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో.. కాబోయే భార్య ఫొటోలు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఆదివారం ఉదయం కావ్యరెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి కూడా. అయితే తామిద్దరి మధ్య జరిగింది ఎంగేజ్మెంట్ కాదని చెప్పి ఈ హీరో షాకిచ్చాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టడంతో పాటు తనకు కాబోయే భార్య ఫొటోలని కూడా పంచుకున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు శ్రీనివాస్.. 'అల్లుడు శ్రీను' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ హిట్ రాలేదు. రాక్షసుడు, జయ జానకి నాయక లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే సక్సెస్ అయ్యాయి. గతేడాది 'కిష్కింధపురి', 'భైరవం' చిత్రాలతో వచ్చాడు. ప్రస్తుతం ఓ మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్ చాన్నాళ్ల నుంచి హైదరాబాద్కి చెందిన కావ్యరెడ్డితో ప్రేమలో ఉన్నాడని, ఎంగేజ్మెంట్ అంటూ వార్తలొచ్చాయి. అంతా అదే అనుకున్నారు. కానీ ఇది కేవలం తమ ఫ్యామిలీ అనౌన్స్మెంట్ అని, నిశ్చితార్థం-పెళ్లి లాంటి శుభకార్యాలన్ని త్వరలో జరుగుతాయని తాజా ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చాడు.'నా కావ్యమ్మకు.. జీవితానికి తనకంటూ ఓ అందమైన టైమ్ ఉంటుంది. నా జీవితంలోకి ఆ సమయం నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. సరైన టైంలో నా లైఫ్లోకి వచ్చి నన్ను నమ్మి, నా రోజులని ఎంతో ఆనందంగా, పాజిటివ్గా చేసినందుకు థ్యాంక్స్. నీ ముఖంపైనున్న ఆ నవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాను. మనం ఎప్పటికీ కలిసుండే ఆ జీవితం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: మగాళ్లు మా సినిమా చూడకపోయినా పర్వాలేదు: మంచు లక్ష్మీ) View this post on Instagram A post shared by Sreenivas bellamkonda (@sreenivasbellamkonda)
రూ.50 కోట్లు కొల్లగొట్టిన రాధిక శరత్ కుమార్ మూవీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన రాధిక శరత్కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. శివకుమార్ మురుగేశన్ దర్వకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హాఫ్ సెంచరీపాజిటివ్ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. #ThaaiKizhavi crosses ₹50 Crore Worldwide GBOC in just 10 days! 💥Overwhelmed by the incredible love and support from everywhere. Thank you for making it a #MegaBlockbusterThaaiKizhavi ❤️#MorattuVasool@Siva_Kartikeyan @Sudhans2017 @KalaiArasu_ @SKProdOffl… pic.twitter.com/4aKJASW3hg— Sivakarthikeyan Productions (@SKProdOffl) March 9, 2026 చదవండి: వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ ఏవీ లేవు: నటి
మగాళ్లు మా సినిమా చూడకపోయినా పర్వాలేదు
మంచు లక్ష్మీ మైక్ పట్టిందంటే చాలు.. ఏదో ఒకలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలానే తమ సినిమాని మగాళ్లు చూడకపోయినా పర్లేదని చెప్పి విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈమెతో పాటు అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'లేచింది మహిళా లోకం'. ఈనెల 26నే థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు)'మేం చిన్న సినిమా చేసినా అద్భుతమైన సినిమాలు చేశామనమాట. ఇందులో ఇంతలా కామెడీ చేస్తానని అనుకోలేదు. నేను రెచ్చిపోయాను. కొన్ని డైలాగులు ఉండవని అనుకున్నా కానీ ఉన్నాయి. సీరియస్ సబ్జెక్ట్లని కామెడీగా చెబితేనే జనాలు వింటారు. సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఉంటుందేమో! మహిళలందరూ తమ తల్లి, నానమ్మ, అమ్మమ్మలతో వచ్చి మా సినిమా చూడండి. మగాళ్లు చూడకపోయినా పర్వాలేదు' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.అలానే ట్రైలర్లో వినిపించిన 'ఫిష్ అండ్ ఫిషర్ మెన్', 'లెట్ దెం నో' అనే డైలాగులు తన ప్రమేయం లేకుండానే సినిమాలో పెట్టేశారని లక్ష్మీ క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు డైలాగుల్లో ఒకటి మోహన్ బాబుది కాగా రెండోది మంచు విష్ణుది. ఇక ట్రైలర్లోని వైల్డ్ ఫైర్ డైలాగ్ గురించి ప్రస్తావించిన ఈమె.. 'పుష్ప 2' రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. సుకుమార్ కంటే ఫైర్, వైల్డ్ ఫైర్ డైలాగ్ నేను మొదట ఈ సినిమాలో వాడాను. ప్రస్తుతం సినిమాలు నిర్మించడం మానేశాను. కాబట్టి నా దగ్గరకు కథలు తీసుకురాకండి. యాక్టింగ్ కోసం మాత్రమే సంప్రదించండి అని చెప్పింది. ఒకప్పుడు మీడియా ముందు ఎలా ఉండాలా అని ఆలోచించేదాన్ని? ఇప్పుడు ఎలాంటి విమర్శలను, ట్రోలింగ్ని పట్టించుకోవడం లేదని తెలిపింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)
జన నాయగన్కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్ మేకర్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్ బోర్డ్ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.
గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే' సాంగ్ విన్నారా?
'బేబి' సినిమా జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం "ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్". 90's సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి సంచారమే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించడంతో పాటు పాట ఆలపించాడు. ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా హమ్మింగ్ చేస్తూ మధ్యమధ్యలో లిరిక్స్ అందుకున్నాడు. గోరేటి వెంకన్న నోట..వెంకన్న గొంతుక ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందం ఏమున్నది? అంటూ పాట మొదలవుతుంది. ఊరు నుంచి విదేశాలకు వెళ్లిన సంచారి అనుభవాలను, ఎగ్జయిట్మెంట్ను పాటలో చూపించారు. ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చదవండి: అప్ప ట్లో వాష్రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి
50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు, హీరోగా చేసిన రణ్దీప్ హుడా శుభవార్త చెప్పేశాడు. ఇతడి భార్య లిన్ లైస్రామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈమె బేబీ బంప్తో ఉన్న ఫొటోలని స్వయంగా రణ్దీప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్)2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ టైంలో అయితే వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్గా అలరించాడు.అసలు విషయానికొస్తే.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్ని మణిపురి సంప్రదాయంలో రణ్దీప్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇతడి వయసు 47 ఏళ్లు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అంటే 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత నెలలోనే లిన్కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda)
సినిమా
డేంజర్ లో కియారా అద్వానీ కెరీర్..
దళపతి విడాకుల కేసు క్లోజ్..! భార్యకు రూ.250 కోట్ల భరణం..?
సల్మాన్ సినిమాలో హీరోయిన్ సమంత..
పెళ్లి తర్వాత నో బ్రేక్.. మళ్లీ షూటింగ్ లో బిజీ అయిన విరోష్!
సాయి మాధవ్ బుర్రా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు
వెంకీ మూవీలో కీర్తి సురేష్..?
భారీ అంచనాలతో.. ధురంధర్ 2.. ట్రైలర్ చూస్తే పూనకాలే
విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్
వెంకీ మూవీలో కీర్తి సురేష్..?
పెళ్లి తర్వాత రౌడీ లైనప్ ఫుల్ చేంజ్..!
