ప్రధాన వార్తలు
అందుకే ‘ఎల్లమ్మ’ లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నా : దేవిశ్రీ
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ మూవీతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ఫేం వేణు యెల్దండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని నానితో తెరకెక్కించాలనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో నాని నో చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత నితిన్ హీరోగా చేయబోతున్నట్లు దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు కూడా. కానీ తమ్ముడు మూవీ రిలీజ్ తర్వాత నితిన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. చివరకు దేవీశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ పట్టాలెక్కింది. టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు వదిలిన గ్లింప్స్కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. బీజీఎంతో పాటు దేవీ లుక్పై కూడా ప్రశంసలు వచ్చాయి. తనదైన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీఎస్పీ..ఇప్పుడు నటనతోనూ ఆకట్టుబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమైంది. అయితే హీరోగా మారినప్పటికీ.. సంగీతాన్ని వదలబోనని అంటున్నాడు డీఎస్పీ. అంతేకాదు సంగీతానికి మంచి స్కోప్ ఉన్న కథ కాబట్టే ‘ఎల్లమ్మ’లో నటించడానికి ఒప్పుకున్నానని చెబుతున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎల్లమ్మ’ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అందుకే ఒప్పుకున్నా.. సినిమాల్లో నటించాలని ఎప్పుటి నుంచో అనుకుంటున్నా. చాలా మంది దర్శకులు నన్ను హీరోగా చేయమని అడిగారు. సుకుమార్ దర్శకత్వంలోనే నేను హీరోగా పరిచయం కావాల్సింది. కానీ నాన్న చనిపోవడంతో బాధలో ఉండి నేనే నటించడానికి ఆసక్తి చూపించలేదు. త్రివిక్రమ్, హరీశ్ శంకర్ కూడా సినిమా చేస్తామని చెప్పారు. కానీ కుదరలేదు. నేను చాలా స్క్రిప్టులు విన్నాను. ఒక్కటి కూడా నాకు సెట్ అయ్యేలా అనిపించలేదు. కానీ ఎల్లమ్మ కథ వినగానే నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పా. నెలన్నరలో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.నెలకు పది రోజులు మాత్రమే.. సినిమాల్లో నటించినప్పటికీ సంగీతానికి మాత్రం బ్రేక్ ఇవ్వను. మ్యూజికే నా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే నటన. ఎల్లమ్మ కథ కూడా గొప్ప సంగీతంతో ముడిపడి ఉంటుంది. అందుకే నాకు బాగా నచ్చింది. పైగా నిర్మాత దిల్ రాజు కూడా నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు. ‘నెలకు 10 రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుంది. మిగతా రోజులన్నీ నీ సంగీతానికే కేటాయించుకో’ అని చెప్పారు. దర్శకుడు వేణు కూడా సపోర్ట్ చేశాడు. అందుకే ఈ సినిమా చేయాలని అనుకున్నాను.అప్పుడు ‘దేవి’..ఇప్పుడు ‘ఎల్లమ్మ’నేను సంగీతం అందించిన మొదటి సినిమా ‘దేవి’. ఎల్లమ్మకు మరో పేరు ఇది. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ కథతోనే హీరోగా పరిచయం అవుతున్నాను. ఇలా ఒక సంగీత దర్శకుడిగా, హీరోగా రెండూ ‘అమ్మవారి’ కథలతోనే పరిచయం అవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్సింగ్ సినిమా బీజీఎం పనుల్లో బిజీగా ఉన్నా. ఇది పూర్తయిపోయిన వెంటనే ‘ఎల్లమ్మ’ షూటింగ్లో పాల్గొంటా. ఎల్లమ్మ సినిమా అనేది నన్ను, నా సంగీతాన్నీ ప్రేమంచే ప్రతీ ఒక్కరికి నేను ఇస్తున్న బహుమతి’ అని దేశిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
థ్రిల్లర్ సిరీస్లో సముద్రఖని.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుండా నటీనటులందరూ అందులోనూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తాజాగా సముద్రఖని తొలిసారి ఓ ఓటీటీ వెబ్సిరీస్లో బాగమయ్యాడు. ఆ సిరీస్ పేరు తడయం (క్లూ అని అర్థం). సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఫిబ్రవరి 27న ప్రసారం కానుంది.ట్రైలర్ రిలీజ్తాజాగా ట్రైలర్ వదిలారు. అందులో ఒక పాలవాడు రోజూలాగే అందరికీ పాలు పోసేందుకు బయలుదేరతాడు. అయితే ఓ ఇంటికి వచ్చాక మాత్రం ఎంత పిలిచినా ఎవరూ బయటకు రారు. దాంతో అతడే అమ్మా అని పిలుస్తూ లోపలకు వెళ్తాడు. తీరా అక్కడ రక్తపుమడుగు చూసి భయభ్రాంతులకు లోనవుతాడు. ఈ సన్నివేశంతోనే ట్రైలర్ మొదలైంది. వరుస హత్యలను చేధించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఐ అదియమాన్గా సముద్రఖనిని చూపించారు.ఓటీటీలో తడయంఇది ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించేద్దాం అని తెలుగు నటుడు నవీన్ చంద్ర వాయిస్తో డైలాగ్ వచ్చింది. మరి ఈ సిరీస్లో నవీన్ ఉన్నాడా? లేదా? అన్నది తడయం ఓటీటీలోకి వచ్చాకే తెలియనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. నవీన్ కుమార్ పలనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు విబిన్ భాస్కర్ సంగీతం అందించాడు.A story that unfolds frame by frame🔍Samuthirakani's 1st ever web-series #Thadayam Premieres on 27th Feb On ZEE5!@thondankani @SshivadaOffcl @cocktailcinemas @dirNavin_offl#Thadayam #ThadayamOnZEE5 #TamilZEE5Original #ZEE5Tamil #TamilZEE5 pic.twitter.com/xYfK9xg6s4— ZEE5 Tamil (@ZEE5Tamil) February 19, 2026
జైళ్లలో స్మోకింగ్ జోన్ ఉండాలి: రాజ్పాల్ యాదవ్
చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్ తాత్కాలిక బెయిల్పై బయటకు వచ్చాడు. అనంతరం జైలు సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రైల్వే స్టేషన్స్, విమానాశ్రాయాల మాదిరిగా జైళ్లలోనూ పొగ తాగేందుకు ప్రత్యేక ప్రాంతాలు (స్మోకింగ్ జోన్స్) ఏర్పాటు చేయాలన్నాడు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారేందుకు వీలైన సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బయట నుంచి చూసేవారికి ఎవరు కరడుగట్టిన నేరస్థులు, ఎవరు పొరొపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని తెలిపాడు. ప్రస్తుతం తన ఇంట్లో వివాహ వేడుక ఉందని, ఆ సెలబ్రేషన్స్ పూర్తయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం సింపతీ సాధించడం కన్నా డబ్బు సంపాదించమే ముఖ్యమని పేర్కొన్నాడు.ఏం జరిగింది?రాజ్పాల్ యాదవ్, ఆయన భార్య రాధపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లు తిరిగివ్వడం లేదని, పైగా ఇచ్చిన చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2018లో ఈ చెక్బౌన్స్ కేసులో ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.2019లో సెషన్స్ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తానంటూ స్టే తెచ్చుకున్నాడు. కానీ, వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో న్యాయస్థానం సీరియస్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తీహార్ జైలులో లొంగిపోయాడు. ఫిర్యాదుదారునికి రాజ్పాల్ యాదవ్ రూ.1.5 కోట్లు డిపాజిట్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్ చేసింది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 17న నటుడు విడుదలయ్యాడు. కాగా రాజ్పాల్ యాదవ్.. హంగామా, భూల్ భూలయా, డ్రీమ్ గర్ల్ 2, బేబీ జాన్ వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించాడు. కిక్ 2 సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు.చదవండి: ఆ హీరోను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు: మృణాల్
‘మిరాకిల్’ చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్
రణధీర్ భీసు హీరోగా తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాకిల్’. సత్య గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్న మూడో షెడ్యూల్ లో సెట్స్ లో జాయిన్ కానుందని చిత్రబృందం వెల్లడించింది.ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్ గా పరిచయమవుతున్నాడు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము), సమీర్ దత్తా, అనుశ్రీ, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు!!
బిగ్బాస్
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
A to Z
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లో చెప్పుకోదగ్గ తెలుగు రిలీజులు అయిత...
టాలీవుడ్ డైరెక్టర్ సినిమా.. మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలో స్ట్రీమింగ్
ఓటీటీల్లో సినిమాలు సడన్గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ రో...
తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ...
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్
వాలంటైన్స్ డే వీకెండ్ కూడా అయిపోయింది. మరో కొత్తవా...
ఆపరేషన్ సింధూర్పై మరో సినిమా.. వివేక్ అగ్నిహోత్రి రియాక్షన్ ఇదే..!
ఆపరేషన్ సిందూర్పై మరో సినిమా రానున్నట్లు తెలుస్త...
జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: అక్షయ్ కుమార్
భార్య పుస్తకాల రచయిత్రి, కానీ తాను మాత్రం ఇంతవరకు ...
రెండుసార్లు గుండెపోటు, వీల్చైర్కే పరిమితం: దర్శకుడు
బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ 2023లోన...
మందుపార్టీకి ఒంటరిగా రమ్మన్నారు: బాలీవుడ్ నటి
ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్గా ఉన్న నటి వైష్ణవి మ...
ఆస్కార్ నామినేషన్స్లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
ఒకే ఒక కారణంతో 'ఐబొమ్మ రవి'కి బెయిల్
సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి 90రోజుల తర...
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమా ప్రారంభం ఎప్పుడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేశ్...
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్...
సోషల్ మీడియాలో విజయ్- రష్మిక వెడ్డింగ్ కార్డ్.. టీమ్ ఆగ్రహం..!
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ- రష...
ఫొటోలు
పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)
శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్బాబు ఆశీస్సులు (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)
స్టన్నింగ్ ఔట్ఫిట్తో సమంత.. వైరల్ ఫోటోలు
‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
కోలీవుడ్ కపుల్ జంటగా మరకతమణి 2 (ఫోటోలు)
ఉంగరాల జుట్టుతో ఎపిక్ హీరోయిన్ (ఫోటోలు)
ప్రియమైన భార్యతో 12th ఫెయిల్ మూవీ హీరో (ఫోటోలు)
పెళ్లిరోజున తిరుమలలో యాంకర్ లాస్య దంపతులు (ఫోటోలు)
గాసిప్స్
View all
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
మారుతి కొత్త ప్రాజెక్ట్పై ఆసక్తికర చర్చ
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
Mrunal Thakur: ధనుష్తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
రివ్యూలు
View all
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
సినీ ప్రపంచం
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది పునర్నవి భూపాలం. కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. అయితే తెలుగు బిగ్బాస్ మూడో సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాహుల్తో లవ్ ట్రాక్తో బాగా ఫేమస్ అయింది. కానీ షో ముగిసిన తర్వాత రాహుల్- పునర్నవి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి కెరీర్లో వారు బిజీ అయ్యారు.పెళ్లికి వేళాయెకొంతకాలం క్రితం రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు. ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అయింది. ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసింది. హేమంత్ వర్మ ప్రపోజల్కు ఎస్ చెప్పానంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. తాజాగా వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. లగ్న పత్రికఈ రోజు పునర్నవి - హేమంత్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో లగ్నపత్రిక రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలను పునర్నవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నీలిరంగు చీరలో పునర్నవి అందంగా మెరిసిపోతోంది. అయితే తను సింగిల్గా దిగిన పిక్స్ మాత్రమే అభిమానులతో పంచుకుంది.చదవండి: 6 సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్.. ఒక్క సంఘటనతో సంచలన నిర్ణయం
ది కేరళ స్టోరీ-2 మేకర్స్కు షాక్..!
ది కేరళ స్టోరీ నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ నిలిపేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర సమాచారశాఖతో పాటు సెన్సార్ బోర్డ్, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా ట్రైలర్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సుదీప్తో సేన్ డైరెక్షన్లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహంచారు.
6సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్.. కొడుకు పేరు జహంగీర్!
ఛత్రపతి శివాజీ.. ఈ పేరు వినగానే తెలియని ధైర్యం ఒంట్లోకి వస్తుంది. తన మతాన్ని, సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన ధీరశాలి. నేడు (ఫిబ్రవరి 19న) శివాజీ మహారాజ్ జయంతి. ఈ సందర్భంగా వెండితెరపై ఆరుసార్లు శివాజీగా వేషం వేసి మెప్పించిన నటుడెవరో చూసేద్దాం..ఆరు సార్లు శివాజీగా..ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత చిన్మయ్ మాండ్లేకర్.. ఒకటీ రెండుసార్లు కాదు, ఏకంగా ఆరుసార్లు వెండితెరపై శివాజీ పాత్రను పోషించాడు. ఫర్జంద్, ఫత్తేశికస్త్, పవన్కైండ్, షేర్ శివరాజ్, సుబేదార్, శివరాయంచ అనే ఆరు మరాఠి సినిమాల్లో శివాజీగా వేషం కట్టాడు. కానీ ఒకే ఒక్క సంఘటన వల్ల ఇకపై ఎన్నటికీ శివాజీగా కనిపించనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.అసలేం జరిగిందంటే?మరాఠి నటుడు చిన్మయ్ మాండ్లేకర్.. శివాజీ పాత్రలో నటించినందుకుగానూ ప్రత్యేక గుర్తింపు, ఆదరణ పొందాడు. కానీ ఆయన కుమారుడికి జహంగీర్ అనే పేరు పెట్టాడు. ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కుటుంబం మొత్తానిపై విమర్శలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన చిన్మయ్.. ఈ ట్రోలింగ్ అన్యాయం అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. సంచలన నిర్ణయంవృత్తిపరంగా విమర్శలు చేస్తే ఓకే కానీ, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశాడు. తన కొడుకు, భార్య క్యారెక్టర్పై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారని, ఇది తప్పని అభిప్రాయపడ్డాడు. శివాజీ మహారాజ్ అంటే తనకు ఎంతో గౌరవం అని, ఇకపై ఆయన పాత్రను వెండితెరపై చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.కుమారుడికి ఆ పేరు ఎందుకంటే?మరి కుమారుడికి జహంగీర్ పేరు ఎందుకు పెట్టాడంటే? జహంగీర్ జంషెడ్ నవ్రోజ్లో జన్మించాడు. భారతరత్న జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా స్ఫూర్తితో కుమారుడికి జహంగీర్ అని పేరు పెట్టాడు. ఇక చిన్మయ్ మాండ్లేకర్.. హిందీలో తేరే బిన్ లాడెన్, సమీర్, ద కశ్మీర్ ఫైల్స్, గాంధీ గాడ్సే: ఏక్ యుధ్ సినిమాల్లో నటించాడు. కాలాపాణి, దల్దల్ వంటి వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేశాడు.చదవండి: ఓటీటీలో థ్రిల్లర్ వెబ్ సిరీస్... రిలీజ్ ఎప్పుడంటే?
'రాణి ఎప్పటికీ రాణినే'.. నమ్రతపై వారణాసి బ్యూటీ ప్రశంసలు..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్పై వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. రాణి ఎప్పటికీ రాణినే ఉంటూ ఓ వీడియోను షేర్ చేసింది. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న వీడియోను పంచుకుంది. అంతేకాకుండా ఈ వీడియోకు మహేష్ బాబును కూడా ట్యాగ్ చేసింది.కాగా.. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో నమ్రతా శిరోద్కర్ మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. నమ్రతా 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే ఏడాది నమ్రతా ప్రపంచ అందాల పోటీల్లో మనదేశం తరఫున పాల్గొని టాప్-6లో ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. కాగా.. ఆ తర్వాత మిస్ వరల్డ్ -2000 పోటీల్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఏకంగా టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.నమ్రతా సినీ కెరీర్నమ్రతా తొలిసారిగా 1977లో శత్రుఘ్న సిన్హా నటించిన షిర్డీ కే సాయి బాబా చిత్రంలో నటించింది. 1998లో మేరే దో అన్మోల్ రతన్ అనే చిత్రంతో అరంగేట్రం చేసిన నమ్రతా.. 2000 ఏడాదిలో వంశీ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వీరిద్దరు 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలను నమ్రతా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.మరోవైపు ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. View this post on Instagram A post shared by The Crown Journal (@the_crown_journal)
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025: జ్యూరీ కమిటీలో కీలక మార్పు!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025' జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగంగా 'స్పెషల్ అవార్డ్స్' ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీకి చైర్మన్గా సీనియర్ నిర్మాత, విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్ర పరిశ్రమపై తమ్మారెడ్డికి ఉన్న సుదీర్ఘ అనుభవం, సామాజిక అంశాలపై ఆయనకున్న లోతైన అవగాహనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 19, 2026న (ఉగాది పర్వదినం సందర్భంగా) ఈ పురస్కారాలను అత్యంత వైభవంగా అందజేయనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలు ఈ అవార్డులకు అర్హమైనవి. మొత్తం 17 విభాగాల్లో ఈసారి పురస్కారాలు ఇవ్వనున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ 'ఉత్తమ సామాజిక సందేశ చిత్రం', 'డాక్టర్ సి. నారాయణరెడ్డి' పేరుతో ప్రత్యేక అవార్డులను కూడా ప్రవేశపెట్టారు.ప్రస్తుతం వివిధ జ్యూరీ కమిటీల ఆధ్వర్యంలో సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే విజేతల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ది కేరళ స్టోరీ సీక్వెల్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే
సుదీప్తో సేన్ డైరెక్షన్లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్ సెన్సార్ బోర్డ్కు కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్ ఆమోదించిన కట్స్ ఈ సినిమాను మరింత ఎక్కువమంది ప్రేక్షకులు చూడటానికి మార్గం సుగమం చేశాయని అన్నారు. కుటుంబంతో కలిసి థియేటర్కు వచ్చి సినిమా చూడాలని అన్నారు.కామాఖ్య నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. 'మేము సెన్సార్ చెప్పిన కట్స్ను ఆమోదం తెలిపాం. అందుకే U/A సర్టిఫికేట్ వచ్చింది. మన టీనేజ్ సోదరీమణులు, మన కుమార్తెలు సినిమా హాళ్లకు వెళ్లి చూడటానికి వీలుగా సర్టిఫికేట్ ఇచ్చినందు సెన్సార్ బోర్డుకు నా కృతజ్ఞతలు. యువకులు, తల్లిదండ్రులు కూడా థియేటర్కు వెళ్లి సినిమా చూడాలి' అని అన్నారు. కాగా.. ది కేరళ స్టోరీ 2 చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి చిత్రం ది కేరళ స్టోరీలో ఆదా శర్మ, సోనియా బలానీ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ నటించారు. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకోగా, ప్రశాంతను మోహపాత్ర ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డ్ అందుకున్నారు..
అందుకే ‘ఎల్లమ్మ’ లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నా : దేవిశ్రీ
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ మూవీతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ఫేం వేణు యెల్దండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని నానితో తెరకెక్కించాలనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో నాని నో చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత నితిన్ హీరోగా చేయబోతున్నట్లు దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు కూడా. కానీ తమ్ముడు మూవీ రిలీజ్ తర్వాత నితిన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. చివరకు దేవీశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ పట్టాలెక్కింది. టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు వదిలిన గ్లింప్స్కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. బీజీఎంతో పాటు దేవీ లుక్పై కూడా ప్రశంసలు వచ్చాయి. తనదైన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీఎస్పీ..ఇప్పుడు నటనతోనూ ఆకట్టుబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమైంది. అయితే హీరోగా మారినప్పటికీ.. సంగీతాన్ని వదలబోనని అంటున్నాడు డీఎస్పీ. అంతేకాదు సంగీతానికి మంచి స్కోప్ ఉన్న కథ కాబట్టే ‘ఎల్లమ్మ’లో నటించడానికి ఒప్పుకున్నానని చెబుతున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎల్లమ్మ’ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అందుకే ఒప్పుకున్నా.. సినిమాల్లో నటించాలని ఎప్పుటి నుంచో అనుకుంటున్నా. చాలా మంది దర్శకులు నన్ను హీరోగా చేయమని అడిగారు. సుకుమార్ దర్శకత్వంలోనే నేను హీరోగా పరిచయం కావాల్సింది. కానీ నాన్న చనిపోవడంతో బాధలో ఉండి నేనే నటించడానికి ఆసక్తి చూపించలేదు. త్రివిక్రమ్, హరీశ్ శంకర్ కూడా సినిమా చేస్తామని చెప్పారు. కానీ కుదరలేదు. నేను చాలా స్క్రిప్టులు విన్నాను. ఒక్కటి కూడా నాకు సెట్ అయ్యేలా అనిపించలేదు. కానీ ఎల్లమ్మ కథ వినగానే నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పా. నెలన్నరలో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.నెలకు పది రోజులు మాత్రమే.. సినిమాల్లో నటించినప్పటికీ సంగీతానికి మాత్రం బ్రేక్ ఇవ్వను. మ్యూజికే నా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే నటన. ఎల్లమ్మ కథ కూడా గొప్ప సంగీతంతో ముడిపడి ఉంటుంది. అందుకే నాకు బాగా నచ్చింది. పైగా నిర్మాత దిల్ రాజు కూడా నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు. ‘నెలకు 10 రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుంది. మిగతా రోజులన్నీ నీ సంగీతానికే కేటాయించుకో’ అని చెప్పారు. దర్శకుడు వేణు కూడా సపోర్ట్ చేశాడు. అందుకే ఈ సినిమా చేయాలని అనుకున్నాను.అప్పుడు ‘దేవి’..ఇప్పుడు ‘ఎల్లమ్మ’నేను సంగీతం అందించిన మొదటి సినిమా ‘దేవి’. ఎల్లమ్మకు మరో పేరు ఇది. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ కథతోనే హీరోగా పరిచయం అవుతున్నాను. ఇలా ఒక సంగీత దర్శకుడిగా, హీరోగా రెండూ ‘అమ్మవారి’ కథలతోనే పరిచయం అవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్సింగ్ సినిమా బీజీఎం పనుల్లో బిజీగా ఉన్నా. ఇది పూర్తయిపోయిన వెంటనే ‘ఎల్లమ్మ’ షూటింగ్లో పాల్గొంటా. ఎల్లమ్మ సినిమా అనేది నన్ను, నా సంగీతాన్నీ ప్రేమంచే ప్రతీ ఒక్కరికి నేను ఇస్తున్న బహుమతి’ అని దేశిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
థ్రిల్లర్ సిరీస్లో సముద్రఖని.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుండా నటీనటులందరూ అందులోనూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తాజాగా సముద్రఖని తొలిసారి ఓ ఓటీటీ వెబ్సిరీస్లో బాగమయ్యాడు. ఆ సిరీస్ పేరు తడయం (క్లూ అని అర్థం). సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఫిబ్రవరి 27న ప్రసారం కానుంది.ట్రైలర్ రిలీజ్తాజాగా ట్రైలర్ వదిలారు. అందులో ఒక పాలవాడు రోజూలాగే అందరికీ పాలు పోసేందుకు బయలుదేరతాడు. అయితే ఓ ఇంటికి వచ్చాక మాత్రం ఎంత పిలిచినా ఎవరూ బయటకు రారు. దాంతో అతడే అమ్మా అని పిలుస్తూ లోపలకు వెళ్తాడు. తీరా అక్కడ రక్తపుమడుగు చూసి భయభ్రాంతులకు లోనవుతాడు. ఈ సన్నివేశంతోనే ట్రైలర్ మొదలైంది. వరుస హత్యలను చేధించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఐ అదియమాన్గా సముద్రఖనిని చూపించారు.ఓటీటీలో తడయంఇది ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించేద్దాం అని తెలుగు నటుడు నవీన్ చంద్ర వాయిస్తో డైలాగ్ వచ్చింది. మరి ఈ సిరీస్లో నవీన్ ఉన్నాడా? లేదా? అన్నది తడయం ఓటీటీలోకి వచ్చాకే తెలియనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. నవీన్ కుమార్ పలనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు విబిన్ భాస్కర్ సంగీతం అందించాడు.A story that unfolds frame by frame🔍Samuthirakani's 1st ever web-series #Thadayam Premieres on 27th Feb On ZEE5!@thondankani @SshivadaOffcl @cocktailcinemas @dirNavin_offl#Thadayam #ThadayamOnZEE5 #TamilZEE5Original #ZEE5Tamil #TamilZEE5 pic.twitter.com/xYfK9xg6s4— ZEE5 Tamil (@ZEE5Tamil) February 19, 2026
జైళ్లలో స్మోకింగ్ జోన్ ఉండాలి: రాజ్పాల్ యాదవ్
చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్ తాత్కాలిక బెయిల్పై బయటకు వచ్చాడు. అనంతరం జైలు సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రైల్వే స్టేషన్స్, విమానాశ్రాయాల మాదిరిగా జైళ్లలోనూ పొగ తాగేందుకు ప్రత్యేక ప్రాంతాలు (స్మోకింగ్ జోన్స్) ఏర్పాటు చేయాలన్నాడు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారేందుకు వీలైన సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బయట నుంచి చూసేవారికి ఎవరు కరడుగట్టిన నేరస్థులు, ఎవరు పొరొపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని తెలిపాడు. ప్రస్తుతం తన ఇంట్లో వివాహ వేడుక ఉందని, ఆ సెలబ్రేషన్స్ పూర్తయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం సింపతీ సాధించడం కన్నా డబ్బు సంపాదించమే ముఖ్యమని పేర్కొన్నాడు.ఏం జరిగింది?రాజ్పాల్ యాదవ్, ఆయన భార్య రాధపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లు తిరిగివ్వడం లేదని, పైగా ఇచ్చిన చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2018లో ఈ చెక్బౌన్స్ కేసులో ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.2019లో సెషన్స్ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తానంటూ స్టే తెచ్చుకున్నాడు. కానీ, వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో న్యాయస్థానం సీరియస్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తీహార్ జైలులో లొంగిపోయాడు. ఫిర్యాదుదారునికి రాజ్పాల్ యాదవ్ రూ.1.5 కోట్లు డిపాజిట్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్ చేసింది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 17న నటుడు విడుదలయ్యాడు. కాగా రాజ్పాల్ యాదవ్.. హంగామా, భూల్ భూలయా, డ్రీమ్ గర్ల్ 2, బేబీ జాన్ వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించాడు. కిక్ 2 సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు.చదవండి: ఆ హీరోను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు: మృణాల్
‘మిరాకిల్’ చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్
రణధీర్ భీసు హీరోగా తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాకిల్’. సత్య గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్న మూడో షెడ్యూల్ లో సెట్స్ లో జాయిన్ కానుందని చిత్రబృందం వెల్లడించింది.ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్ గా పరిచయమవుతున్నాడు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము), సమీర్ దత్తా, అనుశ్రీ, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు!!
సినిమా
వైరల్ గా మారిన ఆలియా భట్ డ్రెస్..
వారణాసిలో కిచ్చా సుదీప్ రోల్ ఏంటంటే..?
మహేష్ బాబు NEXT మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా!
12 ఏళ్ల తర్వాత.. కొచ్చాడియాన్ కు Ai హంగులు
డిటెక్టివ్ పాత్రలో.. సిద్ధు జొన్నలగడ్డ
Madras High Court: 21 కోట్లు చెల్లించాల్సిందే.. చిక్కుల్లో హీరో విశాల్..
అనిల్ రావిపూడిది పెద్ద ప్లానే.. NEXT మూవీలో కోలీవుడ్ స్టార్
Prathyusha case: 24 ఏళ్ల తర్వాత సుప్రీం సంచలన తీర్పు.. అసలేం జరిగిందంటే?
రజనీకాంత్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ సినిమాలకు తలైవా గుడ్ బై?
ఆ విషయంలో ప్రభాస్ నిల్.. పూజా హెగ్దే షాకింగ్ కామెంట్స్
