Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Hebah Patel romantic action Theriller ott release date announced1
హెబ్బా పటేల్ రొమాంటిక్ థ్రిల్లర్‌.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హెబ్బా పటేల్, అనిరుధ్ శ్రీవాత్సవ్‌ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మారియో. ఈ చిత్రాన్ని కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రం.. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. కాగా.. నాటకం, తీస్ మార్ ఖాన్ లాంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ ఆడియన్స్‌ను మెప్పించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు హెబ్బా పటేల్‌ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా.. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతమందించారు. A Red-Hot AlertGet ready for a turbo-charged, ramp ride that hits hard and burns hotter 💥#Mario from Jan 23 on #aha pic.twitter.com/VlxHQQXMwq— ahavideoin (@ahavideoIN) January 21, 2026

Tollywood Movie first Indian film to be shot at Gurudongmar Lake in border2
టాలీవుడ్ మూవీ అరుదైన ఘనత.. ఇండియాలోనే తొలి చిత్రంగా..!

నరేష్ అగస్త్య, సంజనా సార‌థి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ మరొక్కసారి. ఈ మూవీకి నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టిబెట్ సరిహద్దు సమీపంలోని ప్ర‌పంచంలో ఎత్తైన ప్రాంతంలో జరుగుతోంది. గురుడోంగ్మార్ సరస్సు వద్ద షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా ఘనత సాధించింది. సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది.కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. చాలా తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్ సమయాల్లో అనుకోని వాతావరణ మార్పులు వంటి కఠిన పరిస్థితుల మధ్య షూటింగ్‌ను కంప్లీట్ చేసే స‌మ‌యంలో నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కఠినమైన వాతావరణంలోనూ షూటింగ్ సజావుగా పూర్తి చేశారు. ఈ మూవీని ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత బి.చంద్రకాత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి కీలక పాత్రల్లో నటించారు.

Actress Urvashi Brother, Acor Kamal Roy Passed Away3
ప్రముఖ నటి ఊర్వశి ఇంట విషాదం

చెన్నై: ప్రముఖ నటి ఊర్వశి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు, నటుడు కమల్‌ రాయ్‌ (54) చెన్నైలో కన్నుమూశారు. కమల్‌ రాయ్‌ మృతి పట్ల దర్శకుడు వినాయన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఊర్వశి, కల్పన, కలారంజినిల సోదరుడే కమల్‌ రాయ్‌. ఈయన కల్యాణసౌగంధికం సినిమాలో విలన్‌గా నటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుడిని ప్రార్థించాడు.నటులు చావర వీపీ నాయర్‌- విజయలక్ష్మిల సంతానమే కమల్‌ రాయ్‌. అతడికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వారే ఊర్వశి, కళారంజిని, కల్పన. ఈ ముగ్గురు కూడా యాక్టర్స్‌గా సుపరిచితులే. వీరితో పాటు ఓ సోదరుడు కూడా ఉండేవాడు. అతడి పేరు ప్రిన్స్‌. చిన్నవయసులోనే అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.కమల్‌ రాయ్‌ విషయానికి వస్తే.. సాయుజయం, కొల్లైలక్కం, మంజు, కింగిని, కల్యాణ సౌగంధికం, వచలం, శోభనం, ద కింగ్‌ మేకర్‌, లీడర్‌ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. మోహన్‌లాల్‌, ఊర్వశి హీరోహీరోయిన్‌గా నటించిన యువజనోల్సవం మూవీలో విలన్‌గా యాక్ట్‌ చేశారు. తమిళ సినిమాల్లోనూ నటించారు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్‌లోనూ మెరిశారు.చదవండి: భారత్‌లో బిజినెస్‌ చేయలేక దుబాయ్‌కు చెక్కేసిన హీరోయిన్‌

Shahid Kapoor and Triptii Dimri Movie O romeo Trailer Out Now4
యానిమల్ బ్యూటీ యాక్షన్ మూవీ.. ఇంగ్లీష్‌లో ట్రైలర్ రిలీజ్

షాహిద్‌ కపూర్‌ హీరోగా వస్తోన్న ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఓ రోమియో. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‍అయితే ఈ సినిమా ట్రైలర్‌ హిందీలో కాకుండా ఇంగ్లీష్‌ భాషలో రిలీజ్ చేయడం విశేషం. ఈ చిత్రంలో అవినాష్‌ తివారి, విక్రాంత్‌ మస్సే, నానా పటేకర్‌, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Actress Rimi Sen Currently Working as Real Estate Agent in Dubai5
భారత్‌లో ఈజీ కాదు, అందుకే దుబాయ్‌ చెక్కేశా..

ఒకప్పుడు హిట్‌ సినిమాల హీరోయిన్‌.. ఇప్పుడు మాత్రం రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌. భారత్‌ కన్నా విదేశాల్లో బతకడం, సంపాదించడమే ఈజీ అని దుబాయ్‌కు చెక్కేసింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూతో సడన్‌గా లైమ్‌ లైట్‌లోకి వచ్చింది. తనే హీరోయిన్‌ రిమీ సేన్‌.భారత్‌లో అలా లేదుహీరోయిన్‌ రిమీ సేన్‌ మాట్లాడుతూ.. దుబాయ్‌ నాకు సాదర స్వాగతం పలికింది. ఇక్కడి జనాభాలో 95% మంది ప్రవాసులే ఉన్నారు. ఇక్కడివారు అందరి గురించి ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ మసీదులతో పాటు గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అది మన భారత్‌లో లేదు. భారత్‌లో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలు మార్చేస్తుంది.అనుకూలంగా లేదుదీనివల్ల ప్రజల జీవితాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ట్యాక్సులు కూడా చాలా ఎక్కువ. నా దృష్టిలో ఇండియా ఇప్పుడు వ్యాపారం చేసేందుకు అనుకూలమైన దేశం కాదు. దుబాయ్‌లో వ్యాపార నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ సెటిలయ్యా.. అని చెప్పుకొచ్చింది.సినిమారిమీ బెంగాలీ అమ్మాయి. ఆమె అసలు పేరు శుభమిత్రాసేన్‌. 2001లో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్‌లో హంగామా, ధూమ్‌, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్‌, ఫిర్‌ హేరా ఫేరీ, గోల్‌మాల్‌ 2, ధూమ్‌ 2, థాంక్యూ.. ఇలా అనేక సినిమాలు చేసింది. చివరగా షాగిర్డ్‌ (2011) సినిమాలో కనిపించింది. 30 ఏళ్ల వయసులోనే నటనకు గుడ్‌బై చెప్పేసింది. హిందీ బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లోనూ పాల్గొంది. తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) చదవండి: ఇంకా నిద్రపోతున్నారా? హీరోకు అవమానకర ప్రశ్న

Vijay Varma Selfie With Amitabh Bachchan Golden Toilet6
సూపర్‌స్టార్ ఇంట్లో 'గోల్డెన్ టాయిలెట్'.. నటుడి సెల్ఫీ వైరల్

స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వాటిని రకరకాలుగా ఖర్చు పెడుతుంటారు. కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన వాటికి కూడా డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు అలానే ఓ ప్రముఖ నటుడు బాత్రూంలో కమోడ్‌ని బంగారంతో చేయించుకున్నాడు. ఇప్పుడు దాంతో ఓ నటుడు సెల్ఫీ దిగడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)తెలుగులో 'ఎమ్‌సీఏ' సినిమాలో విలన్‌గా చేసిన విజయ్ వర్మ.. ప్రస్తుతం హిందీలో మూవీస్, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కొన్నాళ్ల ముందు వరకు హీరోయిన్ తమన్నాతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఇతడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌తో సెల్ఫీ దిగాడు. అయితే ఈ సెల్ఫీని 2016లో తీసుకున్నాడు. రీసెంట్ వైరల్ ట్రెండ్ దృష్టా.. ఇప్పుడు ఆ ఫొటోని పోస్ట్ చేశాడు.2016 నాకు మైలురాయి లాంటిది. బిగ్ బీ, సుజిత్ సర్కార్‌లతో 'పింక్' సినిమా చేశాను. నా దేవుడు సచిన్‌ని కలిశాను. బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌తో సెల్ఫీ దిగాను అని విజయ్ వర్మ రాసుకొచ్చాడు. అలానే దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ని తన అభిమాన హీరోగానూ వర్ణిస్తూ ఆయనతో దిగిన ఫొటోను కూడా విజయ్ వర్మ షేర్ చేశాడు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?) View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma)

Are You Sleeping to Listen Stories, Ashwin Kumar Reaction Is7
'ఇంకా నిద్రపోతున్నారా?'.. హీరోను అవమానించేలా ప్రశ్న

తమిళ హీరో అశ్విన్‌ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రధాన పాత్రలో నటించిన హాట్‌స్పాట్‌ 2 మచ్‌ మూవీ త్వరలో రిలీజవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సినిమా ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్‌ అతడిని అవమానించేలా ప్రశ్న అడిగాడు. మీకు కథలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నారా? లేదా మెలకువతో ఉండి వింటున్నారా? అని ప్రశ్నించాడు. అది విని అశ్విన్‌ అసహనానికి లోనయ్యాడు.హీరో కౌంటర్‌మీరెప్పుడూ సినిమా చూసేటప్పుడు థియేటర్‌లో నిద్రపోలేదా? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడేదో 40 కథలు చెప్పేసరికి నిద్రపోయానన్నాను. బహుశా ఆ సంఖ్య 40 కన్నా ఎక్కువే ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. అయినా దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? నన్ను అవమానించడానికా? అని కోప్పడ్డాడు.గతంలో ఏం జరిగింది?2022లో ఎన్న సొల్ల పోగిరై మూవీ ఆడియో లాంచ్‌లో అశ్విన్‌ కుమార్‌ మాట్లాడాడు. ఒకేరోజు దాదాపు 40 కథలు విన్నానని, అవి చాలా చప్పగా ఉండటంతో సగంలోనే నిద్రపోయానన్నాడు. ఆయన కామెంట్స్‌పై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన.. ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదంటూ క్షమాపణలు చెప్పాడు. అక్కడితో ఆ వివాదం సమసిపోయింది.హాట్‌స్పాట్‌ 2 మచ్‌ విషయానికి వస్తే.. ఇది 2024లో వచ్చిన హాట్‌స్పాట్‌ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. విఘ్నేశ్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించాడు. అశ్విన్‌ కుమార్‌తో పాటు ప్రియ భవానీ శంకర్‌, ఆదిత్య భాస్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ తమిళ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. కాగా సీరియల్స్‌ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌ కుమార్‌ (Ashwin Kumar Lakshmikanthan).. తెలుగులో అన్నీ మంచి శకునములే సినిమాలోనూ యాక్ట్‌ చేశాడు. #Reporter: Are you sleeping now listening to stories or you woke up❓#AshwinKumar: 40 is the number which I said generally, it could be more or less. Have you never slept while watching films in theatres? Why are you bringing this question now & degrading me? It was not to hurt… pic.twitter.com/RPhtEoSfo0— AmuthaBharathi (@CinemaWithAB) January 20, 2026 చదవండి: రాజాసాబ్‌ ఫ్లాప్‌.. ప్రభాస్‌ రియాక్షన్‌ ఏంటో చెప్పిన నిధి అగర్వాల్‌

Nidhhi Agerwal Wasted Career With The Raja Saab And Hari Hara Veera Mallu Movies?8
పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?

'వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి' అనేది పాత సామెత అయ్యిండొచ్చు. కానీ ఏ తరానికి అయినా కచ్చితంగా పనికొచ్చేదే. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అందుకే చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు వరసగా గ్లామరస్ మూవీస్ చేస్తారు. కొన్నాళ్లకు పూర్తిగా తెరమరుగైపోతుంటారు. కొందరు మాత్రం తన తలరాత మారుతుందని చెప్పి కొన్ని ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంటారు. తీరా చూస్తే అవి అడియాశలు అవుతుంటాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!)స్టార్ హీరో సినిమాలో నటించారని ప్రతి హీరోయిన్ అనుకుంటుంది. అందుకు తగ్గట్లే చాలామందికి అవకాశాలు వస్తాయి. కానీ అదృష్టం కలిసొచ్చి ఫేట్ మారేది మాత్రం అతికొద్ది మందికే. మరికొందరికి మాత్రం ఘోరమైన దురదృష్టం తప్పితే మరొకటి మిగలదు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అలానే పవన్ కల్యాణ్, ప్రభాస్‌లపై బోలెడంత నమ్మకం పెట్టుకుంది. నాలుగేళ్ల విలువైన సమాయాన్ని వెచ్చించింది. మరో సినిమా చేయలేదు. ఇప్పుడేమో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.2017లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2022 వరకు తెలుగు, తమిళ, హిందీలో కలిపి ఎనిమిది సినిమాల వరకు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. 2019లో అలా పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటించే ఛాన్స్ నిధికి వచ్చింది. లాక్‌డౌన్, పవన్ రాజకీయాల వల్ల సినిమా చాలా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు గతేడాది థియేటర్లలోకి వచ్చింది. ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ చిత్రం నిధికి ఏ మాత్రం ఉపయోగపడలేదు.(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్‌.. ప్రభాస్‌ రియాక్షన్‌ చెప్పిన నిధి అగర్వాల్‌)రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ప్రభాస్ 'రాజాసాబ్'లోనూ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్‌గా చేసింది. దాదాపు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం తనకు ఫేట్ మార్చేస్తుందని, హిట్ అవుతుందని నిధి చాలా నమ్మింది. కానీ బ్యాడ్ లక్. ఇది కూడా ఫ్లాప్ అయింది. సరేలే ఈ రెండు మూవీస్ ఫెయిలైతే అయ్యాయి అనుకోవచ్చు. వీటిలో నిధి అగర్వాల్ పాత్రలు ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా ఉండవు. దీంతో ఈ విషయంలోనూ ఈమెకు పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు.నిధి అగర్వాల్ ఇ‍ప్పటికైతే ఏ కొత్త ప్రాజెక్టులోనూ నటిస్తున్నట్లు అయితే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక, శ్రీలీల, భాగ్యశ్రీ, మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. వీళ్లు కాకుండా రుక్మిణి వసంత్, మృణాల్ ఠాకుర్ లాంటి బ్యూటీస్.. స్టార్ హీరోలకు మెయిన్ ఆప్షన్స్‌గా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి ఈ ముద్దుగుమ్మలని దాటుకుని నిధి అగర్వాల్ కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటుందా? అనేది చూడాలి. ఒకవేళ లేదంటే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ పరంగా వెనకబడిపోయే ప్రమాదముంది!(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)

Prabhas is Detached from His Movie Results: Nidhhi Agerwal amid The Raja Saab Failure9
సినిమా ఫ్లాప్‌.. ప్రభాస్‌ రియాక్షన్‌ చెప్పిన నిధి అగర్వాల్‌

చాలామంది హిట్టు కొట్టగానే సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు, ఫ్లాప్‌ రాగానే ఒక్కసారిగా డీలా పడిపోతారు. అయితే ఈ జయాపజయాలను ప్రభాస్‌ అస్సలు లెక్క చేయడంటోంది హీరోయిన్‌ నిధి అగర్వాల్‌. ప్రభాస్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ "ది రాజాసాబ్‌". ఇందులో నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటించారు. చతికిలపడ్డ రాజాసాబ్‌మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో అన్నింటికంటే ముందుగా దిగింది. భారీ అంచనాలతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజాసాబ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడింది. నెగెటివ్‌ టాక్‌ వల్ల మంచి కలెక్షన్స్‌ రాబట్టలేపోయింది. అయితే ప్రభాస్‌ వీటినేవీ పట్టించుకోడంటోంది నిధి అగర్వాల్‌.తలదూర్చడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌ ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చడు. తన పనేదో తను చేసుకుపోతాడు. ఫేక్‌గా ఉండలేడు. చాలా మంచి వ్యక్తి. ఆయనంత హుందాగా నేను ఉండగలనా? అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కానీ, ఆయనతో కలిసి పని చేశాక మరో విషయం అర్థమైంది. తనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎంతో నిష్కల్మషంగా ఉంటాడు. ప్రేమగా మాట్లాడతాడు.ప్రభాస్‌ను కలిస్తే..ఎవరైనా సరే.. ఆయన్ను కలిసినప్పుడు తను ఓ స్టార్‌ హీరో అన్న విషయమే మర్చిపోతారు. ఐదేళ్ల పిల్లాడిని కలిసినట్లే ఉంటుంది. అంత సింపుల్‌గా ఉంటాడు. దేనికీ లెక్కలేసుకోడు, కమర్షియల్‌గా ఉండటం రాదు. పైగా తనకు ఎటువంటి పీఆర్‌ టీమ్‌ లేదు. తనతో పనిచేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. నా జీవితంలో నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి ప్రభాసే.. సినిమా కోసం తనవంతు కృషి చేస్తాడు. దాని రిజల్ట్‌ గురించి అసలు పట్టించుకోడు అని నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది. చదవండి: 40 ఏళ్ల హీరోతో రొమాన్స్‌.. ట్రోలింగ్‌ పట్టించుకోనంటున్న బ్యూటీ

Mahesh Babu Varanasi Movie Release Date Latest Update10
'వారణాసి' రిలీజ్‌పై మళ్లీ క్లారిటీ.. అయినా నమ్మట్లేదు

మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి టైటిల్ అనౌన్స్ చేశారు. 2027లోనే రిలీజ్ ఉంటుందని అన్నట్లు చెప్పుకొచ్చారు. రాజమౌళి మూవీ అంటే చెప్పిన సమయానికి ఎప్పుడు రాదు. తెలుగు ప్రేక్షకులకు ఇది తెలుసు. దీంతో ఈ చిత్రం కూడా 2027లో రావడం సందేహామే అని చాలామంది అనుకుంటున్నారు. దీంతో టీమ్ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!)2027లోనే 'వారణాసి' రిలీజ్ అవుతుందని టీమ్ ఇప్పుడు ట్వీట్ చేసింది. తద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది. చాలామంది ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చని అనుకుంటున్నారు. ఈ రెండు పండగలు అంటే మరో ఏడాది మాత్రమే టైమ్ ఉంది. అప్పట్లో రాజమౌళి, సినిమాని సిద్ధం చేస్తారా అనేది చూడాలి? మహేశ్ అభిమానులు, చాలామంది నెటిజన్లు మాత్రం 2027లోనే రిలీజ్ అంటే అస్సలు నమ్మట్లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ కామెంట్స్ పెడుతున్నారు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లు కాగా.. 'వారణాసి'లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ విలన్‌గా చేస్తున్నాడు. ఇందులో కాసేపు మహేశ్ రాముడి పాత్రలోనూ కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే బయటపెట్టాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)COMING IN 2027.#VARANASI pic.twitter.com/yuInvgJwIk— Varanasi (@VaranasiMovie) January 21, 2026

Advertisement
Advertisement