Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Ram Pothineni Andhra King Thaluka sensor completed1
ఆంధ్ర కింగ్‌ తాలూకా.. రన్‌ టైమ్ ఎంతంటే.!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ మూవీ రన్‌ టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా(యాడ్స్, టైటిల్స్‌తో సహా) ఉండనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హీరో అభిమాని పాత్రలో రామ్ కనిపించనున్నారు. It is a U/A for #AndhraKingTaluka ❤‍🔥A film for all, a film relatable to all 💥GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 27th.BOOKINGS NOW OPEN!🎟️ https://t.co/LKMkGbt7jv#AKTonNOV27 Energetic star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/PlAdBO6p3w— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2025

Interesting Facts About Actor Dharmendra Garam Dharam Dhaba2
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర రెస్టారెంట్ ప్రత్యేకతలు తెలుసా..?

బాలీవుడ్ లెజెండ్, 'హీ-మ్యాన్' ధర్మేంద్రకు కేవలం నటనపైనే కాదు, ఆహారం, ఆతిథ్యంపై కూడా మక్కువ ఎక్కువ. ఆయన సినీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పంజాబీ కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రారంభించిన రెస్టారెంట్ ప్రాజెక్టే ఈ 'గరం ధరం - ధాబా తే ఠేకా'.రెస్టారెంట్ ప్రత్యేకతలు ఇవే.. 'గరం ధరం ధాబా' కేవలం భోజనశాల కాదు, ధర్మేంద్ర అభిమానులకు ఒక ఆలయం లాంటిది. ధర్మేంద్ర వ్యక్తిత్వం, ఆయన నటించిన సినిమా లలోని ముఖ్య ఘట్టాలు, డైలాగ్‌లు ఈ ధాబాలోని ప్రతి గోడపై కనిపిస్తాయి.సందర్శకులను ఆకర్షించే థీమ్..ఈ రెస్టారెంట్ మొత్తం బాలీవుడ్ థీమ్‌తో అలంకరించి ఉంటుంది. ధర్మేంద్ర క్లాసిక్ చిత్రాల పోస్టర్లు, అద్భుతమైన డైలాగ్స్ గోడలపై కనిపిస్తాయి.ఐకానిక్ ఆర్ట్ వర్క్స్.. ధర్మేంద్ర వివిధ రూపాల పోర్ట్రెయిట్‌లు, గ్రాఫిటీ ఆర్ట్ ఈ స్థలాన్ని నింపుతాయి. 'షోలే' సినిమాలోని ప్రసిద్ధ 'ట్యాంకీ' సీన్, జై-వీరు ప్రయాణించిన ఐకానిక్ కారు మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.'దేశీ' ఇంటీరియర్ తో..ఇటుక గోడలు, రంగుల దీపాలు, పాతకాలపు హెడ్‌లైట్స్, చేతిపంపులు వంటివి ధాబాకు దేశీ రూపాన్ని ఇస్తాయి. హర్యానాలోని ముర్తల్‌లో ప్రారంభించిన మొట్టమొదటి అవుట్‌లెట్ 1,200 మంది కూర్చునే సామర్థ్యంతో, 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద ధాబాగా ప్రసిద్ధి చెందింది.రుచికరమైన ఆహారం, దేశీ ఫ్లేవర్స్.. ఈ ధాబాలో నార్త్ ఇండియన్, పంజాబీ వంటకాలకు పెద్ద పీట వేస్తారు. రుచిలో రాజీ పడకుండా, ఇంటి భోజనాన్ని తలపించేలా ఇక్కడ వడ్డిస్తారు.మఖానీ పరాఠాలు, దాల్ మఖానీ, గలోటి కబాబ్‌లు, తందూరి పనీర్ టిక్కా, బిర్యానీ, వివిధ రకాల రుచికరమైన కూరలు ఇక్కడ లభిస్తాయి.ప్రత్యేక మెనూ ఏమిటంటే..?మెనూలో కొన్ని వంటకాలకు ఆయన సినిమాల పేర్లు పెట్టి, 'ధరం జీ స్పెషల్' అనే ప్రత్యేక పేజీని కూడా ఉంచారు. క్విర్కీ డ్రింక్స్ 'వీరూ కీ ఘుట్టీ', 'ప్యారే మోహన్ మసాలా నింబు' వంటి మోక్‌టైల్స్ ను బంటా అంటే దేశీ స్టైల్ సీసాలలో అందిస్తారు. ధాబా ఆవిర్భావం..ధర్మేంద్ర రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు చాలా రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత ఉమాంగ్ తివారీ, మిక్కీ మెహతా లతో కలిసి భాగస్వామ్యంలో మొదటి రెస్టారెంట్ ను ప్రారంభించారు.మొదటి ఔట్‌లెట్ ప్రారంభమైందిలా..ఫిబ్రవరి 23, 2018 న హర్యానాలోని ప్రసిద్ధ ఫుడ్ స్టాప్ ముర్తల్‌లో ఈ 'గరం ధరం ధాబా' తన మొదటి బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. ముర్తల్ బ్రాంచ్ విజయవంతం అయిన తర్వాత, దీని శాఖలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఘజియాబాద్ అర్థాలా, మోహన్ నగర్), నోయిడా, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వంటి అనేక ప్రదేశాలలో విస్తరించాయి.'హీ-మ్యాన్' రెస్టారెంట్.. 'గరం ధరం' విజయం తర్వాత, ధర్మేంద్ర కర్నాల్‌లో 'ఫామ్-టు-ఫోర్క్' కాన్సెప్ట్‌తో 'హీ-మ్యాన్' అనే తన రెండవ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు. ఈ 'గరం ధరం ధాబా' ధర్మేంద్ర అభిమానులకు ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన దేశీ జీవనశైలి గురించి గుర్తుచేసే ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- సాక్షి స్పెషల్

Mahesh Babu entry at Globetrotter event making video gors viral3
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్.. మహేశ్ బాబు ఎంట్రీ కోసం ఇంత కష్టపడ్డారా?

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న యాక్షన్ ‍అడ్వెంచరస్ మూవీ వారణాసి(Varanasi Movie). ఇటీవలే మెగా ఈవెంట్‌ ఏర్పాటు చేసిన టైటిల్ రివీల్ చేశారు మన దర్శకధీరుడు. గ్లోబ్‌ట్రాటర్ (Globe Trotter Event) పేరుతో భారీ ఈవెంట్‌ నిర్వహించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‍గ్రాండ్ ఈవెంట్‌కు వేలమంది అభిమానులు హాజరయ్యారు.అయితే ఈ వేడుకలో రిలీజ్‌ టైటిల్ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా నిలిచింది. ఈ బిగ్ ఈవెంట్‌లో మహేశ్ బాబు వృషభంపై(బొమ్మ) వస్తూ ఎంట్రీ ఇవ్వడం ప్రిన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సీన్‌ కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో తాజాగా వీడియోను పంచుకున్నారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు జక్కన్న సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే మహేశ్ బాబు ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Raju Weds Rambai Movie Box Office Collection Day 4 Details4
‘రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్‌ ఎంతంటే?

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం .. తొలిరోజే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 4 రోజుల్లో ఈ సినిమాకు 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు, మూడో రోజును మించి నాలుగో రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు దక్కాయి. వీక్ డేస్ లోనూ "రాజు వెడ్స్ రాంబాయి" బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుండటం విశేషం."రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు.

producer SKN Analysis On Ticket Price, Tweet Goes Viral5
రూపాయిలో నిర్మాతకు మిగిలేది 17 పైసలే.. : నిర్మాత ఎస్కేఎన్‌

ఐబొమ్మ రవి అరెస్ట్‌ తర్వాత సినిమా టికెట్ల ధరలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రేట్లు పెంచడం కూడా ఓ రకంగా పైరసీని ప్రోత్సహించిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతేకాదు తప్పు చేసిన రవికి మద్దతుగా నెటిజన్స్‌ ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్‌ నిర్మాత ఎస్కేఎన్‌ టికెట్ల ధరలపై, దాని వల్ల ఎవరికి లాభం వస్తుందనేదానిపై తనదైన శైలీలో విశ్లేషించాడు. మల్లీప్లెక్స్‌లో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకుడు ఖర్చు చేసే రూపాయిలో కేవలం 17 పైసలు మాత్రమే నిర్మాతకు వెళ్తాయని.. మిగిలినదంతా మల్టీప్లెక్స్‌ యాజమాన్యంతో పాటు జీఎస్‌టీకీ వెళ్తుందని ఎస్కేన్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాదు పాప్‌కార్న్‌, సమోస, కూల్‌డ్రింక్స్‌తో పాటు థియేటర్‌లో వచ్చే యాడ్స్‌త నిర్మాతకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు.ఎస్కేఎన్‌ చెప్పిన విశ్లేషణ ప్రకారం..‘మల్టీప్లెక్స్‌లో ఒక ఫ్యామిలీ సినిమా చూసేందకు దాదాపు రూ. 2178 ఖర్చు అవుతుందట. అందులో మల్టీప్లెక్స్‌ మెయింటెన్స్‌, అక్కడ కొనుగోలు చేసే ఆహారపదార్థాలు, ఇతర సర్వీసు చార్జిలతో కలిపి. రూ. 1545 వరకు మల్టీప్లెక్స్‌ యాజమాన్యానికె వెళ్తుంది. నిర్మాతకు టికెట్‌పై కేవలం రూ. 372(నెట్‌) మాత్రమే వస్తుంది. జీఎస్‌టీ కి రూ. 182, ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌కి రూ. 78 వరకు వెళ్తుంది’ అని ఎస్కేఎన్‌ చెప్పుకొచ్చాడు.కష్టపడి దర్శకుడుని పట్టుకొని, కథ చేయించుకొని, హీరో ని ఒప్పించి, అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి ఈ మొత్తంలో వచ్చేది కేవలం 17.08 శాతం మాత్రమే. నిర్మాత తెగ లాభపడిపోతున్నాడని వాదిస్తున్నవారి కోసమే ఇలా ప్రజంటేషన్‌తో ముందుకు వచ్చానని ఎస్కేఎన్‌ ట్వీట్‌ చేశాడు. కష్టపడి దర్శకుడుని పట్టుకొని కథ చేయించుకొని హీరో ని ఒప్పించి డబ్బులు అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి ఒకఒక ఫామిలీ మల్టీప్లెక్స్ లో 2200 ఖర్చు చేస్తే ఎంత మిగులుతుందో ఇది డిటైల్డ్ ఎనాలిసిస్ జస్ట్ 17%పాప్కార్న్ సమోసా కూల్ డ్రింక్ థియేటర్ యాడ్స్ తో నిర్మాతకి పైసా సంభంధం… pic.twitter.com/iQmD1yIsZ6— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 25, 2025

Vijay Jana Nayagan concert ticket prices In Malaysia event6
జన నాయగణ్ భారీ ఈవెంట్‌.. ఒక్క టికెట్ అన్ని లక్షలా?

పొలిటికల్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయాల్లోకి వచ్చేముందు ఈ మూవీనే తన కెరీర్‌లో చివరి సినిమా అని ప్రకటించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ యాక్షన్‌ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది.అయితే ఈ మూవీ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌ను ఏకంగా విదేశాల్లో నిర్వహిస్తున్నారు. మలేసియాలో ఈ బిగ్ ఈవెంట్ జరగనుందని ఇప్పటికే వెల్లడించారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమంది ఫ్యాన్స్‌ హాజరవుతారని అంచనా. ఈ భారీ ఈవెంట్‌లో గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లిడించారు.తమ అభిమాన హీరో బిగ్ ఈవెంట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్‌కు భారీ డిమాండ్ ఉండడంతో టిక్కెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.2 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉండనుందని సమాచారం. ఈ టికెట్ బుకింగ్స్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో డిసెంబర్ 27న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్‌లో సైంధవి, టిప్పు, అనురాధ శ్రీరామ్, ఆండ్రియా జెరెమా ఎస్.పి.బి. చరణ్, హరిచరణ్, హరీష్ రాఘవేంద్ర, యోగి బి, విజయ్ యేసుదాస్ పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Celina Jaitly Files Domestic Violence Case Against Husband Peter Haag 7
'తీవ్ర మానసిక వేదన అనుభవించా'.. విదేశీ భర్తపై నటి ఫిర్యాదు.!

బాలీవుడ్ నటి, హీరోయిన్ సెలీనా జైట్లీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త వేధింపులకు గురి చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై గృహ హింసకు పాల్పడ్డారని భర్త పీటర్ హాగ్‌పై ముంబయిలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వేధింపులతో తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు కోర్టుకు తెలిపారు. అతని వేధింపుల కారణంగా సైకోవెజిటేటివ్ ఓవర్‌లోడ్‌తో బాధపడుతున్నట్లు ప్రస్తావించారు. దాదాపు పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భర్త పీటర్ హాగ్‌పై గృహ హింస కేసు పెట్టడం గమనార్హం. దీంతో ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు డిసెంబర్ 12 లోపు కోర్టు ముందు హాజరు కావాలని హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే గత వారంలోనే తన భర్త హాగ్‌పై గృహ హింస పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.కాగా.. బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ.. పీటర్‌ హాగ్‌ను సెప్టెంబర్ 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా భర్త హాగ్ తనను మానసిక, శారీరక హింసకు గురి చేశారని ఆరోపించింది. 2019 తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయాని పిటిషన్‌లో పేర్కొంది. తన ఆస్తులు, ఆర్థిక నియంత్రణ అతని చేతికి అప్పగించాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది.నా బిడ్డ, తల్లిదండ్రులు కొన్ని నెలల వ్యవధిలో మరణించిన తర్వాత ముంబయిలోని తన నివాసాన్ని అతని పేరిట మార్చాలని తీవ్ర ఒత్తిడి చేశారని పిటిషన్‌లో వివరించింది. అయితే అంతకుముందే సెలీనా జైట్లీ జనవరి 14, 2019న తాను రాసిచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని బాంబే సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. కాగా.. గతంలో ఆమె పీటర్‌కు ఉమ్మడి ఇంటి ఆస్తిని బహుమతిగా ఇచ్చింది.

Hindi Actor Jagdish Raj Typecast Role Details8
144 సినిమాల్లో 'ఒకే' పాత్ర.. ఈ నటుడి గురించి తెలుసా?

ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే ఇప్పటికే వేలాది సినిమాలు వచ్చాయి. ఎందరో నటీనటులు కొత్తగా వస్తున్నారు. పాత నటీనటులు కనుమరుగైపోతూనే ఉన్నారు. మనం సరిగా గమనించం గానీ కొన్నిసార్లు చిత్రమైనవి జరుగుతూనే ఉంటాయి. ఒకే నటుడు వరసగా ఒకే తరహా పాత్రల్లో కనిపిస్తూ ఉంటారు. తెలుగులోనూ ఇలాంటి వాళ్లని చూసే ఉంటారు. అయితే ఇలా ఒకే పాత్రలో ఓ వ్యక్తి ఏకంగా 144 సినిమాలు చేసి గిన్నీస్ రికార్డ్ సాధించాడని మీకు తెలుసా? ఇంతకీ ఆ నటుడెవరు? ఏంటా రికార్డ్?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)ఒక యాక్టర్ నాలుగైదు సినిమాల్లో ఒకే లాంటి పాత్ర చేస్తే 'మూస' నటుడు అని ట్యాగ్ వేసేస్తారు. ఇలాంటివి పడేందుకు సాధారణంగా నటీనటులు పెద్దగా ఇష్టపడరు. కాస్త పేరున్న వాళ్లయితే వైవిధ్యమైన పాత్రలు చేయాలని అనుకుంటారు. కానీ అప్పట్లో హిందీ చిత్రసీమలో జగదీశ్ రాజ్ అనే నటుడు ఉండేవాడు. ఈయన్ని అందరూ బాలీవుడ్ 'ఇన్‌స్పెక్టర్ సాబ్' అని పిలిచేవారు. ఎందుకంటే 144 సినిమాల్లో పోలీస్ పాత్రల్లోనే కనిపించాడు. ఇది గిన్నీస్ రికార్డ్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ నమోదైంది.1928లో బ్రిటీష్ ఇండియాలోని పాకిస్థాన్‌లో సర్గోదా అనే ఊరిలో జగదీష్ పుట్టారు. పుట్టిన పదకొండేళ్లకే అంటే 1939లోనే బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1955 నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారారు. అప్పటినుంచి 2004 వరకు వరసగా దాదాపు 260 చిత్రాలు చేశారు. 1956లో వచ్చిన 'సీఐడీ'లో తొలిసారి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. తర్వాత దీవార్, డాన్, శక్తి, మజ్దూర్, ఇమాన్ ధరమ్, జాసూస్, సిల్సిలా, ఐనా, బేషరమ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఈయన పోలీస్‌గానే కనిపించారు. చివరగా 'మేరీ బీవీ కా జవాబ్ నహిన్' అనే సినిమా చేశారు. ఈ మూవీలోనూ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నటించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?)260కి పైగా సినిమాలు చేసిన జగదీష్ రాజ్.. పోలీస్ పాత్రలతో పాటు విలన్, న్యాయమూర్తి లాంటి ఇతర పాత్రల్లోనూ కనిపించారు. కానీ ఈయన సినీ పోలీస్‌గానే అందరికీ గుర్తుండిపోయారు. శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతూ 2013 జూలై 29న ముంబైలోని జుహు నివాసంలో జగదీశ్ తుదిశ్వాస విడిచారు. జగదీష్ కూతురు అనితా రాజ్ కూడా నటిగా సుపరిచతమే. 1981లో 'ప్రేమ్ గీత్' నటిగా కెరీర్ ప్రారంభించింది. 80, 90లలో చాలా హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు మూవీస్ చేస్తోంది.ఏదేమైనా ఒకేలాంటి పాత్రని 144 సినిమాల్లో చేయడం అంటే మాములు విషయం కాదు. ఇప్పటి నటులకైతే ఇలా చేయడం పక్కనబెడితే అసలు ఇది సాధ్యమేనా?(ఇదీ చదవండి: కుక్క కాటు పెద్ద మేటర్ కాదు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు)

Ram Pothineni Responds On Relationship With Bhagyashri Borse9
భాగ్యశ్రీతో డేటింగ్‌.. స్పందించిన రామ్‌ పోతినేని!

హీరో రామ్‌ పోతినేని(Ram Pothineni ), నటి భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారనే వార్త గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆంధ్రకింగ్ తాలూకా’ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని..అది కాస్త స్నేహబంధం దాటి ప్రేమగా మారిందనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఈ పుకార్లపై హీరో రామ్‌ పోతినేని స్పందించారు. ఆంధ్రాకింగ్‌ తాలుకా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రామ్‌ మాట్లాడుతూ.. భాగ్యశ్రీతో డేటింగ్‌ అనేది కేవలం రూమర్‌ మాత్రమే అని స్పష్టం చేశారు. ‘ఆంధ్రకింగ్‌ తాలుకా’(Andhra King Taluka) సినిమా కోసం నేను ఒక ప్రేమ గీతం రాశాను. అప్పటి నుంచి ఈ రూమర్స్‌ మొదలయ్యాయి. భాగ్యశ్రీ(Bhagyashri Borse)పై మనసులో ప్రేమ లేనిదే ఇంత గొప్ప పాట ఎలా రాయగలడు? అని అంతా అనుకున్నారు. వాస్తవం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌ని ఎంపిక చేయకముందే నేను ఆ పాట రాశాను. సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలను ఊహించుకొని ఆ లిరిక్స్‌ రాస్తే..అంతా మరోలా అనుకున్నారు’ అని రామ్ చెప్పుకొచ్చారు.ఇక ఇదే విషయంపై మరో ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ కూడా స్పందించారు. రామ్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమే నని.. ఒక నటుడిగా ఆయన అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పింది. ఆయన డెడికేషన్‌ చూసి ఎంతో నేర్చుకున్నానని..అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.ఆంధ్రకింగ్‌ తాలుకా సినిమా విషయానికొస్తే..పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌కి జోడీగా భాగ్యశ్రీ నటించింది. ఇందులో రామ్‌ ఒక స్టార్‌ హీరోకి అభిమానిగా నటించబోతున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ఈ మూవీ నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

List Of Telugu Movies For Release In Sankranthi 202610
పొంగల్‌ పోరులో ఏడు చిత్రాలు .. లిస్ట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

తెలుగులో సంక్రాంతి పండ‌క్కి సినిమాల సంద‌డి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే అతిపెద్ద సీజ‌న్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తుంటాయి. యావరేజ్‌ సినిమా కూడా సూపర్‌ హిట్‌ అయ్యే అవకాశాలు ఉండే సీజన్‌ ఇది. అందుకే స్టార్‌ హీరోలలో చాలా మంది తమ సినిమా ఒకటి సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ పండక్కీ తెలుగులో మొత్తంగా ఆరేడు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వచ్చే సంక్రాంతి సీజన్‌పై కొన్ని సినిమాలు కర్చీఫులు వేశాయి. అయితే వాటిల్లో ఏది రిలీజ్‌ కానుంది? ఏ సినిమా వెనక్కి తగ్గనుంది అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..మన శంకర వర ప్రసాద్ గారురాజాసాబ్భర్త మహాశయులకు విజ్ఞప్తిఅనగనగా ఒక రాజునారీ నారీ నడుమ మురారీజననాయగన్పరాశక్తి‘రాజాసాబ్‌’పై క్లారిటీ వచ్చేదిఈ సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో ఉన్న సినిమాలో తొలుత రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన పెద్ద సినిమా ది రాజాసాబ్‌(The Raja Saab). మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుసార్లు రిలీజ్‌ డేట్‌ ప్రకటించి..వాయిదా వేయడంతో మరోసారి కూడా ఈ సినిమా వెనక్కి తగ్గిందనే రూమర్స్‌ వచ్చాయి. దీంతో పలు చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే తాము తప్పుకోవడం లేదని ది రాజాసాబ్‌ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చెప్పడమే కాకుండా.. ప్రమోషన్స్‌ కూడా స్టార్‌ చేయడంతో కొన్ని సినిమాలు బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయి.రాజుగారు రావడం లేదా?సంక్రాంతి పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతూ వచ్చిన నవీన్‌ పొలిశెట్టి..అందరికంటే ముందుగానే తప్పుకునే అవకాశం ఉంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) వచ్చే ఏడాది జనవరి 14న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. బాక్సాఫీస్‌ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో నిర్మాత నాగవంశీ వెనక్కీ తగ్గాడట. అన్ని కుదిరితే రిపబ్లిక్‌ డేకి రిలీజ్‌ చేయాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడట.ఇక శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) చిత్రం కూడా ఈ సంక్రాంతికి వచ్చేలా లేదు. డిసెంబర్‌లో ఆయన బైకర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం కూడా వెనక్కి తగ్గేలా ఉంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కూడా కచ్చితంగా పొంగల్‌ పోరులోకి రాబోతుంది.చిరు క్లారిటీ ఇస్తే.. డేట్‌ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతి పండగకి పక్కా రాబోతున్న చిత్రం మెగాస్టార్‌ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’(Mana Shankara Vara Prasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టుకొని మరి ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. ఈసారి చిరంజీవి మూవీతో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్‌ డేట్‌పై స్పష్టత వస్తే కానీ సంక్రాంతి రిలీజ్‌ సినిమాలపై క్లారిటీ రాలేదు. ఒక వేళ చిరు సినిమా వాయిదా పడితే..కచ్చితంగా చిన్న సినిమాలన్నీ బరిలోకి దిగుతాయి. అయితే ఆ అవకాశం అయితే దాదాపు లేనట్లే. వీటితో పాటు ఈ పొంగల్‌ పోరులో తమిళ్‌ నుంచి రెండు భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ఒకటి..విజయ్‌ చివరి చిత్రం ‘జననాయగన్‌’. హెచ్‌. వినోద్‌ దర్వకత్వం వహించిన ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు శివకార్తికేయన్‌-సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి పండక్కే రాబోతుంది. జవవరి 14న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. మొత్తంగా ఈ పొంగల్‌ పోరులో ఎన్ని చిత్రాలు ఉంటాయనేది డిసెంబర్‌ మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement