ప్రధాన వార్తలు

హీరోయిన్తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్
‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలు, కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదం..ఆ ప్రమాదంలో తండ్రి మరణించడం.. ఇవన్నీ చాకోని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో చేసిన తప్ప్పులను సరిదిద్దుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో తన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డ నటి విన్సీసోనీ అలోషియన్(Vincy Aloshious)కి తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కావాలని అలా చేయలేదని.. ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలంటూ మీడియా ముందే ఆమెను కోరారు. చాకో చెప్పిన సారీని విన్సీ అంగీకరించడంతో వివాదానికి ఎండ్ కార్డు పడింది.సూత్రధారి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మధ్య విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మలయాళ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇదే సినిమా ప్రచారం కోసం వచ్చిన చాకో.. అందరి ముందే విన్సీకి క్షమాపణలు చెప్పాడు. ‘నేను కావాలని మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను సరదాగా చెప్పానంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. నా ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడినందుకు క్షమించాలి’ అని కోరగా.. పక్కనే ఉన్న విన్సీ మైక్ తీసుకొని ‘ఆ సమయంలో ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆయన నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. నేను స్పందించిన తీరు ఆయన కుటుంబాన్ని కూడా ఎంతో బాధించింది. ఇప్పుడు ఆయనలో మార్పు కనిపిస్తుంది. తప్పు తెలుసుకున్నాడు. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అని పేర్కొంది. విన్సీ క్షమించడంతో చాకోకు ఒక పెద్ద రిలీఫ్ లభించినట్లు అయింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుతో ఇబ్బంది పడుతున్న చాకో.. సారీ చెప్పి మంచి పనే చేశాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సినిమా షూటింగ్లో అయితే వివాదం చెలరేగిందో.. అదే సినిమా ఈవెంట్లో దాన్ని పరిష్కరించుకొని ఒక సమస్యను తగ్గించుకున్నాడు.

అయోత్తి రీమేక్లో?
తమిళ హీరో ధనుష్తో కలిసి నాగార్జున చేసిన ‘కుబేర’ సినిమా ఈ జూన్ 20న విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్గా నటించగా, ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే నాగార్జున వందో సినిమా పనులు తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్తో జరుగుతున్నాయి.కాగా తాజాగా శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘అయోత్తి’ పట్ల నాగార్జున ఆసక్తిగా ఉన్నారట. 2023లో విడుదలై, ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ రీమేక్ వార్త నిజమే అయితే ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణం వరకే పరిమితమవుతారా? అనేది చూడాలి. ఇక ‘అయోత్తి’ కథ విషయానికి వస్తే... ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జీవించే బలరాం తీర్థయాత్ర కోసం తమిళనాడులోని రామేశ్వరానికి వెళతాడు.కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో బలరాం భార్య జానకి, కూతురు శివానీ గాయపడతారు. చికిత్స తీసుకుంటూనే జానకి మరణిస్తుంది. దీంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు తీసుకెళ్లాలని బలరాం అనుకుంటాడు. కానీ అతనికి అనుకోని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొని, అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి సాయంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు బలరాం ఎలా తీసుకుని వెళ్లాడన్నదే ‘అయోత్తి’ సినిమా.

రాజా సాబ్తో స్టెప్పులు?
హీరోయిన్ తమన్నాది డిఫరెంట్ స్టైల్. ఒకవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే, మరోవైపు వీలు కుదిరినప్పుడల్లా ఇతర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో సూపర్బ్గా డ్యాన్స్ చేస్తూ, అందుకు తగ్గట్టుగా భారీ పారితోషికం అందుకుంటుంటారు. ఇప్పటికే తమన్నా పదికి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. 2023లో వచ్చిన రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ‘నువ్.. కావాలయ్యా..’, 2024లో శ్రద్ధా కపూర్–రాజ్కుమార్ రావుల ‘స్త్రీ 2’ చిత్రంలో ‘ఆజ్ కీ రాత్’ సాంగ్స్లో తమన్నా అదిరిపోయే స్టెప్పులు ప్రేక్షకులను అలరించాయి.ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఈ పాటలు బాగా ఉపయోగపడ్డాయి. తాజాగా తమన్నా మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజా సాబ్’. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో ప్రభాస్తో కలిసి తమన్నా డ్యాన్స్ చేయనున్నారట. ఈ చిత్రానికి తమన్ సంగీతదర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది.

ఒక్క రోజులో జీవితం మారిపోతే..!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి నార్త్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా సాయిపల్లవి హిందీ చిత్రాలు ‘ఏక్ దిన్’, ‘రామాయణ’లకు సైన్ చేశారు. తాజాగా ‘ఏక్ దిన్’ సినిమా విడుదల తేదీ ఖరారైందని, ఈ చిత్రం ఈ నవంబరు 7న విడుదల కానుందని తెలిసింది. సాయి పల్లవి కెరీర్లోని ఈ తొలి హిందీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.‘జానే తూ... యా జానే నా’ (2008) సినిమా తర్వాత ఆమిర్ ఖాన్, మన్సూర్ కలిసి 17 సంవత్సరాల తర్వాత నిర్మించిన చిత్రం ‘ఏక్ దిన్’ కావడం విశేషం. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ఓ విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు. ఆ ఒక్క రోజు తర్వాత వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయి? అన్నదే ‘ఏక్ దిన్’ సినిమా కథాంశమని సమాచారం. మరోవైపు నితీష్ తివారి ‘రామాయణ’ సినిమాలో సీతగా నటిస్తున్నారు సాయి పల్లవి. రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి.
ఫొటోలు


“రాజు గాని సవాల్” మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)


హీరో సిద్ధార్థ్ ‘3BHK’ మూవీ థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)


'ఓ భామ అయ్యో రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


కొరియా సినిమాకు ఒక్క మగాడు (ఫొటోలు)


'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవికి గోల్డెన్ ఛాన్స్ (ఫొటోలు)


వైఎస్సార్.. అరుదైన చిత్రమాలిక


విష్ణు విశాల్- గుత్తా జ్వాలా కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్.. ఫోటోలు


హీరోయిన్గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)


RK Sagar : ‘ది 100’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)


భార్యతో ద్వారకా తిరుమల వెళ్లిన కమెడియన్ (ఫోటోలు)
A to Z

ఈ సారికి వదిలేయండి.. మళ్లీ తప్పు జరగకుండా చూసుకుంటా: కలర్ ఫోటో డైరెక్టర్
షార్ట్ ఫిల్మ్లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రా...

ఓటీటీలో 'అభిషేక్ బచ్చన్' కొత్త సినిమా రివ్యూ
టైటిల్ : కాళిధర్ లపతానటీనటులు: అభిషేక్ బచ్చన్, దైవ...

ఓటీటీలోకి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. ‘క్లీనర్’ కథేంటి?
ఊహించని, ఊహకందని విషయాలను మనం చూడగలిగేది వెండితెర ...

OTT: ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటా...

తెలంగాణ సీఎంను కలిసి స్టార్ హీరో అజయ్ దేవగణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ బాలీవుడ్ హీరో ...

సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఐదో సీజన్.. మేకర్స్ అఫీషియల్ ప్రకటన
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్...

'రామాయణ' కోసం వారిద్దరికి భారీ రెమ్యునరేషన్
బాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ...

చాలా మిస్ అవుతున్నా, కన్నీళ్లు ఆగడంలేదు: రష్మిక
రష్మిక మందన్నా.. సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్త...

స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా?
టైటిల్: స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ (మూడో సీజన్...

ఒసామా బిన్లాడెన్పై వెబ్ సిరీస్.. ఎలా ఉందంటే?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి...

ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్
‘‘ప్రపంచ సినిమాకి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణ...

'గెలాక్టస్తో యుద్ధానికి సిద్ధం'.. ఫెంటాస్టిక్ ఫోర్ తెలుగు ట్రైలర్ చూశారా?
మార్వెల్ అభిమానులకు ఇక పండగే! 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫ...

స్మృతి ఇరానీకి జాక్పాట్.. రీ ఎంట్రీలో కళ్లుచెదిరే రెమ్యునరేషన్!
బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించి కేంద్రమంత్రి స్...

' నా భార్యకు ఐవీఎఫ్ చికిత్స.. ఆశలు వదిలేసుకున్నాం.. కానీ'.. విష్ణు విశాల్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే హైదరాబాద్ల...

మొన్న శృతిహాసన్.. నేడు మార్కో హీరో.. సోషల్ మీడియా హ్యాక్!
ఇటీవల ఎక్కువగా సినీతారల సోషల్ మీడియా ఖాతాలే టార్గె...

సుకుమార్ ఫస్ట్ సినిమా 'కుమారి 21F' రీరిలీజ్ (ట్రైలర్)
దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స...
గాసిప్స్
View all
సాయిపల్లవి సినిమాకు రూ.1000 కోట్ల లాభం.. అదీ విడుదల కాకుండానే...

అల్లు అర్జున్- అట్లీ సినిమాకు విలన్గా 'ఆస్కార్' నటుడు

'రామాయణ' కోసం వారిద్దరికి భారీ రెమ్యునరేషన్

శేఖర్ కమ్ములతో సినిమా..వపర్ఫుల్ పాత్రలో సమంత!

'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్.. నితిన్ కెరీర్లో ఇదే తక్కువ

మహేష్, రాజమౌళి సినిమా ఆ ఓటీటీలోనే...రికార్డ్స్ బద్ధలయ్యాయిగా...

ఓటీటీలో 'కె.విశ్వనాథ్' చివరి సినిమా.. 15 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్

కుబేర 2.. ధనుష్ను రీప్లేస్ చేసే దమ్మున్న తెలుగు హీరో

చిరు-నాగ్తో మల్టీస్టారర్.. ఇలా మిస్ అయింది!

ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?
రివ్యూలు
View all
ఓటీటీలో 'అభిషేక్ బచ్చన్' కొత్త సినిమా రివ్యూ

తమ్ముడు మూవీ రివ్యూ

'ఉప్పు కప్పురంబు' మూవీ రివ్యూ.. డిఫరెంట్ పాత్రలో కీర్తి సురేశ్

స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా?

విజయ్ ఆంటోనీ 'మార్గన్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్తో మెప్పించాడా?

‘కన్నప్ప’ మూవీ రివ్యూ

Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ

'8 వసంతాలు' సినిమా రివ్యూ

ఓటీటీ సినిమా రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్

రానా నాయుడు 2 రివ్యూ.. కుటుంబం కోసం 'యుద్దం'
సినీ ప్రపంచం

సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా..
నమ్రత శిర్కోదర్ టాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తే చెల్లి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) బాలీవుడ్లో కథానాయికగా అలరించింది. హమ్, ఆంఖెన్, పెంచన్ వంటి సినిమాలతో శిల్ప హిందీలో ఫుల్ బిజీ అయింది. అయితే 2000వ సంవత్సరంలో వచ్చిన గజగామిని మూవీ తర్వాత ఆమె వెండితెరకు విరామం ప్రకటించింది. అప్పుడే యూకేకి చెందిన బ్యాంకు ఉద్యోగి అపరేశ్ రంజిత్ను పెళ్లాడింది. మొదట్లో ఈ దంపతులు నెదర్లాండ్స్కు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్లో సెటిలయ్యారు.కోర్సు నేర్చుకున్నా..ఇక హీరోయిన్గా స్టార్డమ్ చూసిన శిల్ప.. సినిమాలు మానేశాక ఏం పని చేసిందనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఖాళీగా ఉండకుండా బిజీగా గడపాలని న్యూజిలాండ్లో హెయిర్డ్రెస్సింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఇందులో మేకప్, బ్యూటీ గురించి ఉండటంతో యాక్టింగ్కు కనెక్ట్ అయి ఉన్నట్లే అనిపించేది. రెండునెలలపాటు సెలూన్లో కూడా పని చేశాను. పనిగంటలు సెట్టవకపోవడంతో మానేశాను. పదో తరగతి ఫెయిల్ అని రెజ్యూమ్కార్పొరేట్ సంస్థలో పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఇంకేదైనా చేయాలనుకున్నాను. నా భర్తకు నా రెజ్యూమ్ సిద్ధం చేయమని చెప్పాను. అందుకాయన రెజ్యూమ్లో ఏమని రాయను? అన్నాడు. అబద్ధాలు చెప్పకుండా నా గురించి ఉన్నది ఉన్నట్లు రాయు. 10th ఫెయిల్ అని, అలాగే సినిమాల్లో పని చేశానని కూడా పేర్కొనమని చెప్పాను. ఆశ్చర్యంగా ఒక్కరోజే నాకు రెండు జాబ్ ఆఫర్స్ వచ్చాయి. డన్ అండ్ బ్రాడ్షీట్ కంపెనీలో క్రెడిట్ కంట్రోలర్గా ఉద్యోగంలో చేరాను.జోక్ కాస్తా నిజమైందికానీ ఉద్యోగంలో చేరిన కొంతకాలానికే నాకు అలసటగా అనిపించేది. ఇదే మాట నా స్నేహితురాలికి చెప్తే ప్రెగ్నెంట్ అయ్యావేమో అని జోక్ చేసింది. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని తేలింది. కానీ ఆ జర్నీ అంత ఈజీగా సాగలేదు. ఇన్సులిన్ ఇంజక్షన్లు, బరువు తగ్గేందుకు ప్రయత్నాలు.. ఇలా చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. అలా నాకు కూతురు అనుష్క పుట్టింది. దాంతో సినిమాలకు మరింత దూరంగా ఉండాల్సి వచ్చింది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్?!.. అతడితోనే సమంత విందు, విహారం

త్వరలో ‘హెచ్చరిక ’
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, ‘శుభలేఖ’ సుధాకర్, షాయాజీ షిండే, ‘శంకరాభరణం’ తులసి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘΄పోలీస్వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్, నటి ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మేమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జీ మీద ఉన్న గౌరవం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి’’ అన్నారు ‘శుభలేఖ’ సుధాకర్. ‘‘ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు సముద్ర నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘మా సినిమాని అందరూ చూసి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు బెల్లి జనార్ధన్. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘సినిమాల కోసం పని చేసేవారు తాము చేసిన చిత్రం విడుదలైన ప్రతిసారీ పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తారు. మా ‘పోలీస్ వారి హెచ్చరిక’ని ఆదరించాలి’’ అని పేర్కొన్నారు.

హీరోయిన్ పేరుతో 77 లక్షల మోసం.. మాజీ పీఏ అరెస్ట్!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt ) మాజీ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) వేదికా ప్రకాశ్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 77 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి, దర్శకురాలు సోనీ సోనీ రజ్దాన్ ఇచ్చిన ఫిర్యాదుతో వేదిక ప్రకాశ్శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 నుంచి 2024 వరకు అలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. ఆ సమయంలో ఆలియాకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్లను వేదికనే చూసుకునేది. అదే సమయంలోనే వేదికా నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా సంతకాన్నీ మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐదు నెలల క్రితమే వేదికపై ఆలియా తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సోనియా ముంబై నుంచి పారిపోయింది. రాజస్తాన్, కర్ణాటక, పుణెల్లో తిరుగుతూ.. చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసి ముంబైకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్?!.. అతడితోనే విందు, విహారం..
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఇటీవల తానా వేడుకల కోసం అమెరికా వెళ్లింది. మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తూనే ఉన్నారంటూ భావోద్వేగానికి లోనైంది. తెలుగువారికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంది. ఈ వేడుకల అనంతరం సామ్ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.రాజ్తో అమెరికాలో చెట్టాపట్టాల్అమెరికాలోని డెట్రాయిట్లో తనకు నచ్చిన ఫుడ్ తింటూ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో రెండు ఫోటోల్లో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండటం విశేషం! ఓ ఫోటో అయితే.. వీరిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రాజ్.. ఆప్యాయంగా సామ్ భుజంపై చేయి వేశాడు. అతడి సాన్నిహిత్యంలో ఉన్న సామ్ నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మరో ఫోటోలో రాజ్తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్తో లంచ్కు వెళ్లింది. ఇది చూసిన అభిమానులు.. సామ్.. రాజ్తో రిలేషన్ను అధికారికంగా ప్రకటించేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.ఎలా మొదలైంది?రాజ్ నిడిమోరు (Raj Nidimoru), తన స్నేహితుడు కృష్ణతో కలిసి ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్గా నటించింది. అప్పుడే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిద్దరూ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ చేశారు. సమంత చేతిలో ఉన్న రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్టుకు సైతం రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.పర్సనల్ లైఫ్అయితే రాజ్కు ఇదివరకే పెళ్లయింది. అతడికి భార్యతో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు.

ఆ సినిమా చేయడమే తప్పు.. రంగస్థలం రిజెక్ట్ చేశా: ఆర్కే సాగర్
మొగలిరేకులు.. అప్పట్లో ఈ సీరియల్ ఒక సెన్సేషన్. ఇందులో పోలీసాఫీసర్ ఆర్కే నాయుడిగా నటించి బుల్లితెర హీరో అయ్యాడు నటుడు సాగర్. అప్పటికే చక్రవాకం ధారావాహికతోనూ బోలెడంత పాపులర్ అయ్యాడు. ఈ ఫేమ్ వల్ల సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అలా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేశానని, కానీ రంగస్థలం వదిలేసుకున్నానని చెప్తున్నాడు.నేను చేసిన తప్పుఆర్కే సాగర్ (R.K. Sagar) హీరోగా నటించిన తాజా చిత్రం ది 100. సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 11న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు సాగర్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా లైఫ్లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేయడం నేను చేసిన తప్పు. మొగలిరేకులు సీరియల్ పీక్స్లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ (Mr Perfect Movie)లో ఛాన్స్ వచ్చింది. 15 రోజులు డేట్స్ ఇచ్చా..అందులో సెకండ్ లీడ్ నాదే అన్నారు. పెద్ద బ్యానర్ అని ఒప్పుకున్నాను. అప్పటివరకు నాకు సినిమాలపై పెద్దగా అవగాహన లేదు. సీరియల్ టీమ్ను ఎలాగోలా ఒప్పించి మిస్టర్ పర్ఫెక్ట్ టీమ్కు 15 రోజులు డేట్స్ ఇచ్చాను. మొదటి మూడురోజులు నాకు షూటింగ్ లేదు. అనుమానం వచ్చి డైరెక్టర్ దశరథ్ను అడిగితే రేపు నీ సీన్ ఉంటుందన్నాడు. అలా నాపై రెండు మూడు సీన్లు తీశారు.చాలా డిసప్పాయింటయ్యాసెకండ్ లీడ్ అని వెళ్తే.. అక్కడంతా రివర్స్లో జరుగుతోందనిపించింది. నాకు చెప్పిన క్యారెక్టర్ ఇది కాదు కదా అనిపించింది. అదే విషయం నిలదీశాను. అసలు నాది సెకండ్ లీడేనా? అని అడిగాను. అందుకాయన.. అప్పుడప్పుడు క్యారెక్టర్లు మారుతుంటాయి. అర్థం చేసుకోండి అన్నారు. చాలా నిరాశచెందాను. నేను చేయాలనుకుంది ఇది కాదు కదా అనిపించి బయటకు వచ్చేశాను.నా సీన్లు లేపేయమన్నానా సీన్లు తీసేయమన్నాను. ఎందుకంటే డబ్బు కోసం సినిమా చేయట్లేదు, వెండితెరపై నా ఎంట్రీ బాగుండాలని చేశానంతే! నా క్యారెక్టర్ను తీసేసి వేరే పాత్రను హైలైట్ చేసుకోండి అని చెప్పాను. అయినప్పటికీ సినిమాలో నా రోల్ అలాగే ఉంచారు. ఆ సినిమా ఇంపాక్ట్ నా కెరీర్పై ప్రభావం చూపించింది. ఆ మూవీ రిలీజయ్యాక చాలామంది అలాంటి రోల్ చేశావేంటి? అని అడిగారు. అప్పుడే మంచి సినిమాలు చేయాలని డిసైడయ్యాను.రంగస్థలం రిజెక్ట్ చేశా..రంగస్థలం మూవీలోనూ ఆఫర్ వచ్చింది. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా దెబ్బతో మళ్లీ నా పాత్రను ఎటు తిప్పుతారో ఏంటోనని భయపడి వెనకడుగు వేశాను. ఆ తర్వాత హీరో ఆదిగారిని సంప్రదించారని తెలిసింది. ఆయన కూడా ఒప్పుకోలేదు. కొద్దిరోజులకు ఇద్దరం ఒకేసారి ఒప్పుకున్నాం. అప్పటికే ఆది.. సుకుమార్కు ఫోన్ చేసి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో తనను సెలక్ట్ చేశారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: హీరోయిన్తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్

సాయిపల్లవి సినిమాకు రూ.1000 కోట్ల లాభం.. అదీ విడుదల కాకుండానే...
సినిమాల లాభాలు సాధారణంగా ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత గానీ లెక్కకు రావు. అరుదుగా కొన్ని సెన్సేషనల్ చిత్రాలు మాత్రం బిజినెస్ రైట్స్ అమ్మకాలు వంటి వాటి ద్వారా ముందే రికార్డ్స్ సృష్టిస్తాయి. అయితే వీటన్నింటికీ అతీతంగా హక్కుల అమ్మకాల ద్వారా కాకుండా ఎప్పుడూ ఎవరూ చవిచూడని రీతిలో ఓ సినిమా లాభాలను ఆర్జించి వార్తల్లో నిలిచింది. బహుశా భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా లాభాలు అదీ ఈ స్థాయిలో అందుకున్న తొలిసినిమా ఇదే కావచ్చు. ఆ సినిమా పేరు రామాయణ(Ramayana). భారత దేశంలో హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించే పౌరాణిక గాధ... భారతీయ సినిమాను సైతం శాసించనున్నట్టు ఈ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నభూతో నభవిష్యత్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.1000 కోట్ల వరకూ అంచనా వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే రూ.1000 కోట్ల లాభాలు ఎలా అర్జించిందీ అంటే...వెయ్యికోట్ల లాభం వెనుక...ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ను నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)లో లిస్టింగ్ లో ఉన్న కంపెనీ ప్రైమ్ ఫోకస్. ఈ ప్రతిష్టాత్మక సినిమా ‘రామాయణ’ తొలి గ్లింప్స్ ఈ నెల3న విడుదలైంది. ఆ విడుదలతోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు, ప్రచారం పెరుగుతూ పోతుండడంతో ప్రైమ్ ఫోకస్ కంపెనీకి స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు రావడం మొదలైంది. ఈ కంపెనీ షేర్లు జూన్ 25న రూ113.47 వద్ద ఉండగా, జూలై 1 నాటికి రూ.149.69కి పెరిగాయి. అయితే, జూలై 3న ‘రామాయణం’ ఫస్ట్ లుక్ విడుదలైన రోజున ఈ షేర్ విలువ ఏకంగా రూ.176కి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 1న రూ.4638 కోట్ల నుంచి రూ5641 కోట్లకు పెరిగింది. అంటే, కేవలం రెండు రోజుల్లోనే సంస్థకు రూ.1000 కోట్ల వరకూ సంపద పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర ₹169గా ఉండగా, మొత్తం క్యాప్ దాదాపు 5200 కోట్ల వద్ద స్థిరపడింది.భారీ పారితోషికం...హీరోకి కూడా షేర్లు...ఇక ఈ సినిమా హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కూడా నిర్మాణ సంస్థలో పెట్టుబడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ బోర్డు మంజూరు చేసిన 462.7 మిలియన్ షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యులో రణబీర్ కూడా షేర్లను పొందారని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. రణబీర్ మొత్తం 12.5 లక్షల షేర్లను కలిగి ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రణబీర్కు రూ.150కోట్ల వరకూ పారితోషికం చెల్లిస్తున్నట్టు సమాచారం. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో విడుదల కానుంది.సీతగా సాయిపల్లవి...ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రావణుడిగా, యష్(yash)లు నటిస్తుండగా సీత పాత్రలో దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తుండడం విశేషం. ఇక లక్ష్మణుడిగారవీ దూబే హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంయుక్తంగా రూపొందించనున్నారు. హాన్స్ జిమ్మర్కు ఇది బాలీవుడ్ లో ఆరంగేట్రం కావడం విశేషం.రామాయణం’ ప్రాజెక్ట్తో భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం సాకారమవుతోందని సినీవర్గాలు భావిస్తున్నాయి.

రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. ఆ పార్టీలో చేరనుందా?
సినీ కథానాయికలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యం కాదు. నటి కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఒక సమయంలో ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశ పడ్డారట. ఓ భేటీలో తన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే కథానాయికిగా రంగ ప్రవేశం చేసి పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఇదు ఎన్నమాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందించింది. ఆ తరువాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ ప్రేక్షకులను బేబీ జాన్ చిత్రంతో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల స్నేహితుడిని గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతనో, వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్కు అవకాశాలు తగ్గాయి. వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కారం అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే..టీవీకే అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తిసురేష్ నటుడు విజయ్కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు. దీంతో కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అయ్యింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే అంటూ కేకలు పెట్టారు. మరి నటి కీర్తి సురేష్ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

హీరోయిన్తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్
‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలు, కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదం..ఆ ప్రమాదంలో తండ్రి మరణించడం.. ఇవన్నీ చాకోని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో చేసిన తప్ప్పులను సరిదిద్దుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో తన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డ నటి విన్సీసోనీ అలోషియన్(Vincy Aloshious)కి తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కావాలని అలా చేయలేదని.. ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలంటూ మీడియా ముందే ఆమెను కోరారు. చాకో చెప్పిన సారీని విన్సీ అంగీకరించడంతో వివాదానికి ఎండ్ కార్డు పడింది.సూత్రధారి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మధ్య విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మలయాళ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇదే సినిమా ప్రచారం కోసం వచ్చిన చాకో.. అందరి ముందే విన్సీకి క్షమాపణలు చెప్పాడు. ‘నేను కావాలని మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను సరదాగా చెప్పానంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. నా ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడినందుకు క్షమించాలి’ అని కోరగా.. పక్కనే ఉన్న విన్సీ మైక్ తీసుకొని ‘ఆ సమయంలో ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆయన నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. నేను స్పందించిన తీరు ఆయన కుటుంబాన్ని కూడా ఎంతో బాధించింది. ఇప్పుడు ఆయనలో మార్పు కనిపిస్తుంది. తప్పు తెలుసుకున్నాడు. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అని పేర్కొంది. విన్సీ క్షమించడంతో చాకోకు ఒక పెద్ద రిలీఫ్ లభించినట్లు అయింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుతో ఇబ్బంది పడుతున్న చాకో.. సారీ చెప్పి మంచి పనే చేశాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సినిమా షూటింగ్లో అయితే వివాదం చెలరేగిందో.. అదే సినిమా ఈవెంట్లో దాన్ని పరిష్కరించుకొని ఒక సమస్యను తగ్గించుకున్నాడు.

జిమ్లో బిగ్బాస్ దివి వర్కవుట్స్.. మాల్దీవుస్లో హీరోయిన్ ప్రణీత!
బిగ్బాస్ దివి జిమ్ వర్కవుట్ పోజులు.చిన్నపిల్లలతో బిగ్బాస్ అశ్విని శ్రీ ..మాల్దీవుల్లో హీరోయిన్ ప్రణీత వేకేషన్..శారీలో హీరోయిన్ ప్రియమణి పోజులు..స్విమ్మింగ్పూల్లో సేదతీరుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by HemaDayal (@hemadayal18) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi)

జయం రవితో విడాకుల వివాదం.. ఆర్తి తొలిసారి ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం గత కొద్దికాలంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల వివాహాబంధానికి ముగింపు పలికేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గతేడాది చివర్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు జయం రవి. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాము విడిపోవడానికి కారణం మూడో వ్యక్తేనని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. పరోక్షంగా సింగర్ కెన్నీషాను ఉద్దేశించి విమర్శలు చేసింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో కోర్టు విచారణకు హాజరవుతున్నారు.అయితే తాజాగా జయం రవి భార్య ఆర్తి చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ పెరుగుతూనే ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఇద్దరు పిల్లలు, పెట్ డాగ్తో ఉన్న వరుస ఫోటోలను షేర్ చేసింది. కొన్ని హృదయాలకు ఎక్కడ ఉండాలో తెలుసంటూ రాసుకొచ్చింది.ఆర్తి తన ఇన్స్టాలో రాస్తూ.. "కొన్ని సాయంత్రాలు, కొన్ని పెరుగుతున్న విషయాల మధ్య సూర్యాస్తమయం.. గట్టిగా పట్టుకునే రెండు చేతులు.. ఎలాంటి మాటలు లేకున్నా దగ్గరగా ఉండే హృదయం.. ప్రతిదీ సంపూర్ణంగా అనిపించేలా చేసే నిశ్శబ్ద ప్రేమ ' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. జయం రవితో విడాకుల వివాదం ప్రేమ, హృదయం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇది చూసిన హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా స్పందించింది. చాలా అందంగా ఉంది.. ఆర్తు అంటూ కామెంట్ చేసింది. కాగా.. 16 ఏళ్ల క్రిత రవి, ఆర్తి పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)
సినిమా


నాగార్జున ఫ్యాన్స్ కు షాక్! కింగ్ 100వ సినిమా డబ్బింగ్ ఫిల్మా..?


నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్


హీరో మహేష్ బాబుకు నోటీసులు


వైఎస్ జగన్ హయాంలో ఏపీలో పాఠశాలల రూపురేఖలు మారాయి: సినీనటుడు సుమన్


అసెంబ్లీ రౌడీ రీమేక్ కోసం రంగంలోకి ప్రభుదేవా?


SSMB 29 రిలీజ్ డేట్ వచ్చేసింది..


ప్రభాస్ స్పిరిట్ క్రేజీ అప్డేట్


ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ


మధ్యప్రదేశ్ హైకోర్టులో సైఫ్ అలీఖాను కు షాక్


లుక్స్ మార్చి పిచ్చెక్కిస్తున్న డార్లింగ్..!