Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Actor sivaji request to All movie fans watch to dandora movie1
'దండోరా'కు నష్టం.. వేడుకున్న శివాజీ

నటుడు శివాజీ, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు నటించిన దండోరా సినిమా బాగుందని చాలామంది అంటున్నారు. కుల‌వివ‌క్ష గురించి దర్శకుడు మురళీకాంత్ చక్కగా చూపారని రివ్యూవర్లు కూడా చెబుతున్నారు. కానీ, థియేటర్‌లో మాత్రం పెద్దగా ప్రేక్షకులు కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన చేసిన డర్టీ కామెంట్సే.. సోషల్‌మీడియాలో ఆయన్ను సమర్థించిన వారందరూ వెళ్లి సినిమా చూసినా భారీ కలెక్షన్స్‌ వచ్చేవని కొందరు సెటైర్స్‌ కూడా వేస్తున్నారు. అయితే, తాజాగా దండోరా సినిమా చూడాలని ప్రేక్షకులను శివాజీ వేడుకున్నాడు.దండోరా సినిమా కోసం ప్రతి ఆర్టిస్టు ప్రాణం పెట్టి చేశారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే, తన వ్యక్తిగత విషయాల వైపు వెళ్లకుండా ఈ చిత్రాన్ని అందరూ ప్రమోట్‌ చేయాలని కోరాడు. ప్రతి ఒక్కరూ చూడండి. లేదంటే ఆ నింద తాను మోయాల్సి వస్తుందని తెలిపాడు. తనతో ఏదైన సమస్య ఉంటే మిగిలిన విషయాల గురించి మరోచోట మాట్లుడుకుందామని చెప్పాడు. కావాలంటే తాను కూడా థియేటర్‌కు వస్తానన్నాడు. ఏం మాట్లాడాలన్నా అందరం థియేటర్లోనే మాట్లాడుకుందామన్నాడు.అయితే, దండోరా చిత్ర దర్శకుడు మురళీకాంత్ ఇలా అన్నాడు. 'కొద్దిరోజుల క్రితం జరిగిన వేడుకలో దొర్లిన రెండు మూడు మాటల ఆధారంగా ఈ చిత్రాన్ని ఎవరూ జడ్జ్‌ చేయకండి. ఈ సినిమా కోసం నేను సుమారు మూడేళ్లు పైగానే కష్టపడ్డాను. నటీనటులు కూడా చాలా కష్టపడ్డారు. మా అందరి శ్రమకు ఫలితం తెరపై కనిపించింది. ఇప్పుడు చాలా సినిమాలు పోటీలో ఉన్నా సరే మా కథపై నమ్మకంతోనే భయపడకుండా సినిమా విడుదల చేశాం' అని దర్శకుడు అన్నారు.Worst fellow still living in 16th century, who thinks Women are subservient to Men I never saw any women advising how Men should dress publicly, why the fuck he can advise If he says similar thing is US, he would be thrown out of movies & public lifepic.twitter.com/cSIhwmo7vt— Ravi @ Prabhas Army (@RaviPrabhas333) December 26, 2025

Vijay thalapathy with His Wife Sangeetha attend to jana nayagan audio launch2
విడాకుల రూమర్స్‌.. సతీమణితో వేదికపై రానున్న విజయ్‌!

నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్‌. నటి పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమితా బైజు ముఖ్యభూమికలు పోషించారు. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్‌ పిక్చర్స్‌ భారీ బడ్జెట్లో నిర్మించింది. హెచ్‌.వినోద్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 జనవరి 9వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది నటుడు విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రం ప్రస్తుతం ఆయన తమిళగ వెట్రికళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో జననాయకన్‌ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి తోడ్పడేలా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. దీంతో జననాయకన్‌ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే విడుదలై విజయ్‌ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న చెన్నైలో కాకుండా మలేషియాలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. విజయ్‌ సతీమణి పాల్గొంటారా? జననాయకన్‌ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై నుంచి పలువురు సినీ ప్రముఖులు మలేషియాకు వరుస కట్టారు. ముఖ్యంగా దర్శకుడు అట్లి, నెల్సన్‌ తదితరులు మలేషియాకు మలేషియాకు వెళ్లారు. నటుడు విజయ్‌ కూడా తన తల్లి శోభ చంద్రశేఖర్, బంధువు, గాయని పల్లవి వినోద్‌ తదితరులు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి మలేషియాకు చేరుకున్నారు. అదేవిధంగా విజయ్‌ భార్య సంగీత, కొడుకు జెసన్‌ సంజయ్‌ కూడా మలేషియాకు వెళ్లారు. అయితే వీరు జననాయకన్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నటుడు విజయ్‌ ఆయన భార్య సంగీత మధ్య సఖ్యత లేదంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది సంగీత ఆమె కొడుకు, కూతురు దివ్య సాషా జననాయక్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తెరదించినట్లు అవుతుంది.

Ashtadigbandhanam Movie OTT Streaming Now 3
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా

చిన్న సినిమాలు థియేటర్లలోకి ఎప్పుడొచ్చి వెళ్తాయో కూడా తెలీదు. ఒకవేళ కంటెంట్ బాగున్నా సరే స్టార్స్ లేకపోవడం ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. వీటిలో కొన్ని తర్వాత ఎప్పుడో ఓటీటీలోకి వస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు మూవీ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులు చూడొచ్చు?సూర్య భరత్ చంద్ర, విషిక హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ 'అష్టదిగ్బంధనం'. 2023 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే దీని గురించి ప్రేక్షకులు పెద్దగా తెలియలేదు. ఇన్నాళ్లకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఉచితంగా చూసే అవకాశం రావొచ్చు.(ఇదీ చదవండి: కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ)'అష్టదిగ్బంధనం' విషయానికొస్తే.. ప్రజా సంక్షేమ పార్టీ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు అలియాస్‌ రాములన్న దగ్గర శంకర్‌, నర్సింగ్ అనే రౌడీషీటర్స్ పనిచేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో నర్సింగ్‌, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని రాములన్న ప్రకటిస్తాడు. దీంతో శంకర్‌కి అసూయ ఏర్పడుతుంది. తాను కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని రాములన్నతో చెప్పగా.. రూ.50 కోట్లు ఇస్తే సీటు ఇస్తానని అంటాడు. దీంతో శంకర్‌.. బ్యాంకు దోపిడీ చేయాలనుకుంటాడు. తన మనుషులతో కలిసి పక్కా ప్లాన్‌ వేస్తాడు.మరి శంకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇతడి స్కెచ్‌లో హీరో హీరోయిన్లు ఎలా ఇరుక్కున్నారు? గౌతమ్‌(సూర్య భరత్‌ చంద్ర) గతమేంటి? ఎలక్షన్‌ ఫండ్‌ అని రాములన్న ఇచ్చిన రూ.100 కోట్లని శంకర్‌ ఎక్కడ దాచాడు? ఆ డబ్బు ఎవరు ఎలా కొట్టేశారు? అసలు 'అష్టదిగ్భంధనం' ప్లాన్‌ వేసిందెవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

Sreeleela And Kajal Aggerwal Latest News4
శ్రీలీల గ్లామర్ టచ్.. కాజల్ కిస్సీ ఫేస్

గ్లామరస్ టచ్ ఇచ్చేస్తున్న శ్రీలీలముద్దు ఇచ్చేలా ఫేస్ పెట్టిన కాజల్క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కీర్తి సురేశ్మత్తెక్కేలా చూస్తూ నేహాశెట్టి పోజులువైట్ డ్రస్‌లో అందాల బొమ్మలా రెజీనాషూటింగ్ జ్ఞాపకాలతో అనన్య పాండే View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Surbhi Puranik (@surofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Navya & Divya Niranjan (@styledbynavyadivya) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)

 VanaVeera Movie Official Trailer5
రిలీజ్‌కి ముందు టైటిల్ మార్పు.. ట్రైలర్ రిలీజ్

అవినాష్ హీరోగా పరిచయమవుతూ దర్శకత్వం వహించిన సినిమా 'వానర'. నిన్నటివరకు ఈ పేరుతోనే ప్రచారం చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చినట్లు ప్రకటించారు. 'వనవీర' అనే పేరుని ఫిక్స్ చేశారు. జనవరి 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు.కులం, రాజకీయ అంశాలతో తీసిన ఈ సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉంది. ఈ మేరకు ట్రైలర్‌లో రాముడు, వానర సైన్యం, లంకకు వారధి కట్టడం లాంటి గ్రాఫిక్ విజువల్స్ చూపించారు. అయితే స్టోరీకి రాముడు, వానర సైన్యానికి లింక్ చేసి ఎలా చూపిస్తారో? ఇందులో సిమ్రన్ చౌదరి హీరోయిన్‌గా చేయగా.. వివేక్ సాగర్ సంగీతమందించాడు.

Nupur Sanon Christmas Celebration With Stebin Ben6
కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ

మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కాబోయే వధూవరులు ఇద్దరూ జంటగా కనిపించారు. కలిసి క్రిస్మస్ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేశ్ బాబు 'వన్-నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. తర్వాత తెలుగులో మరో మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. అడపాదడపా హిట్స్ అందుకుని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్‌కి పెళ్లి కానుంది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)కృతిసనన్ ఫ్యామిలీ క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలో సింగర్ స్టెబిన్ బిన్ కూడా కనిపించాడు. కృతి చెల్లి నుపుర్‌కి కాబోయే భర్త ఇతడే. గాయకుడిగా స్టెబిన్‌ బాగానే ఫేమ్ ఉంది. నుపుర్ కూడా హీరోయిన్‌గా తెలుగులోనే 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో పరిచయమైంది. ఇది ఘోరమైన ఫ్లాప్ కావడంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు ఓ ఇంటిది కాబోతుంది.కొత్త ఏడాదిలో జరిగే సెలబ్రిటీ పెళ్లిలో నుపుర్‌దే మొదటిది అని చెప్పొచ్చు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా జనవరి 11న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ మేరకు ఏ‍ర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు.(ఇదీ చదవండి: ఇక నీకు సైడ్‌ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్‌ హీరోయిన్‌)

Dhanya Balakrishna Amaravathiki Aahwanam Glimpse Released7
హారర్‌ మూవీ 'అమరావతికి ఆహ్వానం' గ్లింప్స్‌ చూశారా?

ప్రస్తుతం హార‌ర్ సినిమాల హ‌వా న‌డుస్తోంది. ఈ ఏడాది విడుద‌లైన అన్ని హార‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం అదే త‌ర‌హాలో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో రూపొందిన చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్త‌ర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు నిర్మించారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని ప‌లు లొకేష‌న్స్‌లో షూటింగ్స్ జ‌రుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌ల‌తో పోస్టర్, గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. మా సినిమా టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని పాత్ర‌ల‌కి ప్రాధాన్య‌త ఉండేలా దర్శకుడు మంచి క‌థతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్ర‌స్తుతం వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి అన్నారు.ద‌ర్శ‌కుడు జివికె మాట్లాడుతూ.. ఈ మ‌ధ్య కాలంలో రిలీజైన అన్ని హార‌ర్ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. అదే త‌ర‌హాలో మ‌రో డిఫ‌రెంట్‌ క‌థాశంతో వ‌స్తోన్న చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌ జె ప్రభాక‌ర్ రెడ్డి గారి విజువ‌ల్స్, హ‌నుమాన్ ఫేమ్ సాయిబాబు త‌లారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. పద్మ‌నాబ్ బ‌ర‌ద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేట‌ర్స్‌లో ఆడియ‌న్స్‌ని హార‌ర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది అన్నారు.

Actor Motta Rajendran about His Hair Loss8
కెమికల్‌ వాటర్‌లో పడ్డా.. అప్పటినుంచే..: కమెడియన్‌

కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై రాణిస్తున్నాడు తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్‌. ఈయన మొదట్లో స్టంట్‌మెన్‌గా పనిచేశాడు. నాన్‌ కడవులే సినిమాకుగానూ రాష్ట్రస్థాయిలో అవార్డులు గెల్చుకున్నాడు. అయితే మొదట్లో రాజేంద్రన్‌ పలువురు నటుల స్థానంలో యాక్షన్‌ సీన్లు (స్టంట్‌ డబుల్‌) చేసేవాడు. ఇప్పుడు మాత్రం నటుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.15 అడుగుల ఎత్తులో నుంఒక మలయాళ సినిమా షూటింగ్‌లో 15 అడుగుల ఎత్తులో నుంచి కింద నీళ్లలో పడాల్సి ఉంటుంది. నేను ఆలోచించకుండా దూకేశాను. తీరా ఆ ఊరివాళ్లు చూసి.. ఇదంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్‌ వాటర్‌.. ఈ నీళ్లలో ఎందుకు దూకారు? అన్నారు. అలా అప్పుడే జుట్టురాలడం మొదలైంది. కొంతకాలానికే మొత్తం గుండు అయిపోయింది. కనుబొమ్మలు కూడా పోయాయి. మొదట్లో కొంత బాధపడ్డాను.అదే ప్లస్‌ అయిందిఅప్పటినుంచే విలన్‌గా కాకుండా కామెడీ రోల్స్‌ వచ్చాయి. విగ్‌ కూడా పెట్టుకోకుండా అలాగే ఉండమంటున్నారు. ఏదైతే మైనస్‌ అనుకున్నానో అదే నాకు ప్లస్‌ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు నన్ను థియేటర్లలో చూసి విజిల్స్‌ వేస్తుంటే ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అన్నాడు. రాజేంద్రన్‌ తెలుగులో చలో, ఎఫ్‌ 3, వాల్తేర్‌ వీరయ్య, సర్‌, విమానం, దే కాల్‌ హిమ్‌ ఓజీ, త్రిబాణధారి బార్బరిక్‌, త్రిముఖ వంటి పలు చిత్రాల్లో నటించాడు.

Sunita Ahuja Confirms Govinda Dating Rumours9
మరో అమ్మాయితో నా భర్త డేటింగ్‌.. వదిలిపెట్టను : స్టార్‌ హీరో భార్య

బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో గోవిందా, ఆయన భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వీరిద్దరు సపరేట్‌గా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు. కోర్టు ద్వారా గోవిందాకు నోటీసులు అందించారని..త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్త గోవిందాపై సునీత(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని.. డబ్బుల కోసమే ఆమె ఆయనకు దగ్గరైందని ఆరోపించారు.తాజాగా ఆమె ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్‌పై స్పందించారు. ‘మేమిద్దరం సపరేట్‌గా ఉంటున్న విషయం నిజమే. గోవిందా(Govinda) మరోక అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం లేదు.. డబ్బుల కోసమై దగ్గరైంది. ఆమె హీరోయిన్‌ అయితే కాదు. హీరోయిన్లు ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేంత చెడ్డవాళ్లు కాదు’ అని సునీత చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ..గోవింద జీవితంలో ముగ్గురే మహిళలు కీలకంగా ఉండాలని కోరుకున్నాం. ఆమె తల్లి, భార్య, కూతురు.. ఈ ముగ్గురు మహిళలే ఆయన జీవితంలో ఉండాలకున్నాం. కానీ నాలుగో మహిళ రావడం జీర్ణించుకోలేకపోయామని సునీత ఎమోషనల్‌ అయ్యారు. ఇప్పటికైనా గోవింద తన చుట్టు ఉన్న చెంచాలను వదిలేసి.. వర్క్‌పై ఫోకస్‌ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్‌, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్‌ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు.

Thalapathy Vijay Jana Nayagan Movie Chella Magale Lyrical 10
'జన నాయగణ్'.. విజయ్ పాడిన మరో పాట రిలీజ్

తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు రాగా తాజాగా మూడో పాటని విడుదల చేశారు. 'చెల్ల మగళే' అంటూ సాగే ఈ క్యూట్ గీతాన్ని విజయ్ పాడటం విశేషం. 'దళపతి కచేరీ' అంటూ సాగిన తొలి పాటలోని ఓ పోర్షన్‌ని విజయ్ గాత్రమందించాడు. ఈ పాట మాత్రం మొత్తంగా విజయ్ ఆలపించాడు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్‌' ఇమ్మాన్యుయేల్)ఈ సినిమా.. తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పాట చూస్తే అదే అనిపించింది. ఒరిజినల్ మూవీలోనూ హీరో బాలకృష్ణ-పాప శ్రీలీల మధ్య ఓ సాంగ్ ఉంటుంది. అది ఇది ఒకటేలా అనిపిస్తున్నాయి. తెలుగులోనూ ఈ మూవీ 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.విజయ్‌.. తనకు ఇది చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించాడు. వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఇతడి పార్టీ పోటీపడనుంది. అందులో విజయ్ ఏ మేరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి? ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. మమిత బైజు కూడా కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

Advertisement
Advertisement