Tollywood
-
ఆదితి గౌతమ్ నాభి అందాలు.. బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..!
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..పర్పుల్ కలర్ డ్రెస్ టాలీవుడ్ నటి బిందు మాధవి సమ్మర్ పోజులు..లైట్ కలర్ శారీలో ఆదితి గౌతమ్ మతిపొగొట్టే అందాలు..సిస్టమ్ టీమ్తో జ్యోతిక చిల్..డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by @natasastankovic__ -
మెగాస్టార్ చెంతకు పర్సంటేజీ వివాదం.. అసలేం జరగనుంది?
టాలీవుడ్ పర్సెంటేజ్ వివాదం మరింత రసవత్తరంగా మారింది. ఈ సమస్య చివరికీ మెగాస్టార్ వరకు చేసింది. ఈ వివాదం మరింత ముదరడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతస సంఘం చిరంజీవిని కలిశారు. దాదాపు గంటసేపు వీరితో చిరంజీవి సమావేశంలో కానున్నారు. ఎగ్జిబిటర్స్తో, గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి భేటీపై అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ రోజు తెలంగాణ ఎక్జిబిటర్స్, నిర్మాత కేఎల్ నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల నియమించిన కమిటీ నుంచి అన్ని వివరాలు చిరంజీవి తెలుసుకున్నారని నిర్మాత దిల్ రాజు అన్నారు. రెండు మూడు రోజుల్లో అఫిషియల్గా చెబుతామని తెలిపారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య..: ఎగ్జిబిటర్ శ్రీధర్..ఇది ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్య అని.. పెద్ది మూవీ గురించి కాదని ఎగ్జిబిటర్ శ్రీధర్ వెల్లడించారు. చిరంజీవి రెస్పాన్స్ బాగుందని అన్నారు. అన్ని వివరాలు మెగాస్టార్ అడిగి తెలుసుకున్నారని వివరించారు. సింగిల్ స్రీన్ థియేటర్స్ పడుతున్న సమస్యలు ఇన్ని ఉన్నాయా అని చిరు ఆశ్చర్యం వ్యక్తం చేశారని శ్రీధర్ అన్నారు. -
'రాసి పెట్టుకోండి'.. పెద్దిపై రామ్ చరణ్ గూస్బంప్స్ స్పీచ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ను కూడా విడుదల చేశారు.ఈ మూవ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో పెద్ది హీరో రామ్ చరణ్ ప్రమోషన్లతో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఈవెంట్కు చెర్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని రామ్ చరణ్ అన్నారు. ఈ మూవీ కోసం దాదాపు రెండన్నరేళ్ల పాటు ప్రాణం పెట్టి చేశానని చెర్రీ పంచుకున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఈ మూవీ కోసం శ్రమించామని పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Reiterates... "Ee Cinema Raasi Pettukondi" 🔥#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/OOAdD59WHI— Trends RamCharan ™ (@TweetRamCharan) May 25, 2026 -
చరణ్ బాడీగార్డ్ ప్రొఫెషనల్ ఫైటరా? ఇతడెవరు జీతమెంత?
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు బయట పెద్దగా తిరగరు. సెల్ఫీల పేరుతో అభిమానులు ఇబ్బంది పెడతారని భయం. అందుకు కొందరు బాడీగార్డ్స్ని పెట్టుకుంటారు. సల్మాన్ ఖాన్, యష్ లాంటి వాళ్ల లోకల్గా ఉండేవాళ్లని నియమించుకోగా మెగాహీరో రామ్ చరణ్ మాత్రం ఏకంగా ఓ ఆఫ్రికన్ ఫైటర్ని తనకు బాడీగార్డ్గా పెట్టుకున్నాడు. గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇతడెవరు? జీతం ఎంతిస్తున్నారు?(ఇదీ చదవండి: డబ్బింగ్లకు డబ్బులు.. తెలుగు సినిమాలకు నిల్.. ఎందుకిలా?)'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్గా ముంబైలో జరిగింది. అప్పటినుంచి చరణ్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెంటే ఉంటూ భద్రత కల్పిస్తున్న వ్యక్తి పేరు కెవిన్ కుంట. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన ఇతడు.. అంతర్జాతీయ స్థాయిలో ఎమ్ఎమ్ఏ(MMA) ఫైటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్గా ఎన్నో రికార్డులు సాధించాడు.కేవలం బాక్సింగ్ రింగ్ లోపలే కాకుండా నిజ జీవితంలోనూ సెలబ్రిటీలు, అంతర్జాతీయ వీఐపీలకు VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే 'పెద్ది' ప్రమోషన్లు జరిగేంతవరకు రామ్ చరణ్ ఇతడిని మాట్లాడుకున్నట్లు ఉంది. అయితే భద్రత కల్పిస్తున్నందుకుగానూ రోజుకు రూ.2 లక్షలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్కి రూ.15 లక్షలు ఇస్తుండగా.. కన్నడ హీరో యష్ తన బాడీగార్డ్కి రూ.10 లక్షల వరకు ఇస్తున్నాడని టాక్. ఇప్పుడు చరణ్ బాడీగార్డ్ గురించి వస్తున్న నిజమైతే మాత్రం ఇదో రికార్డ్ అవుతుందేమో!(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం)Mega Power Star #RamCharan arrives in Bengaluru for #Peddi promotions!! pic.twitter.com/fsH5ucWi7t— cinee worldd (@Cinee_Worldd) May 25, 2026 -
పెళ్లి కంటే ఆ పని చేయడం వందరెట్లు బెటర్: టాలీవుడ్ హీరోయిన్
స్వాతి అంటే గుర్తు పట్టరేమో కానీ.. కలర్స్ యాడ్ చేస్తే ఇట్టే పసిగడతారు. అంతలా ఆ పేరుతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. డేంజర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల తర్వాత మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ముఖ్యంగా పెళ్లి టాపిక్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని తన మనసులోని మాటను బయటకు చెప్పేశారు. ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపింది.ఈ రోజుల్లో ఎవరికీ కూడా కొంచే కూడా ఓపిక ఉండడం లేదని.. అందుకే ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లాడి ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం నాకు ఇష్టం లేదన్నారు. అందుకే ఎలా చింతా లేకుండా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని అన్నారు. ఎందుకంటే అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని.. ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమిస్తుందని హీరోయిన్ స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది. -
డబ్బింగ్లకు డబ్బులు.. తెలుగు సినిమాలకు నిల్.. ఎందుకిలా?
సూర్య 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు) బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తమిళ, తెలుగులో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. మరోవైపు మోహన్ లాల్ 'దృశ్యం 3' ఎలాంటి ప్రచారం లేకుండానే మన థియేటర్లలోకి వచ్చి మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. అయితే ఈ రెండింటికి తెలుగులో ఏమంత గొప్ప టాక్ రాలేదు. కానీ ఆ ప్రభావం కలెక్షన్స్పై అస్సలు పడినట్లు కనిపించడం లేదు. అదే టైంలో వీటితో పాటు రిలీజైన తెలుగు మూవీస్ని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకీ పరిస్థితి?(ఇదీ చదవండి: హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్)టాలీవుడ్ బాక్సాఫీస్కి సంక్రాంతి ఎంత ముఖ్యమో అంతకు మించి వేసవిలో సందడి ఉంటుంది. కానీ ఈ సమ్మర్ని తెలుగు దర్శకనిర్మాతలు హీరోలు వృథాగా వదిలేశారు. చెప్పుకోదగ్గ ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. దీంతో థియేటర్లన్నీ బోసిపోయాయి. ఎండలు, ఐపీఎల్ వల్ల జనాలు థియేటర్లకు రావట్లేదని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు గానీ అసలు కారణం ఇది కాదు. ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్తో ఒక్కరూ మూవీస్ చేయట్లేదు. రొటీన్ రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల చిన్న, మిడ్ రేంజ్ మూవీస్ వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి.అలా స్టార్స్ సినిమాల కోసం ముఖం వాచిపోయిన తెలుగు ప్రేక్షకులకు.. సూర్య, మోహన్ లాల్ మూవీస్ మండవేసవిలో కూలింగ్ వాటర్లా కనిపించాయి. అంత ఎండలో వాటర్ బాగోలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. అలానే ఈ రెండు చిత్రాలు ఏమంత పెద్దగా గొప్పగా లేవు అని ఆడియెన్స్కి తెలిసినా సరే చూసేద్దాంలే అని వెళ్తున్నారు. సూర్య చిత్రానికి బీ,సీ సెంటర్లలో రెండో వారం కూడా ఆదరణ లభిస్తుండగా.. మోహన్ లాల్ చిత్రం మల్టీప్లెక్స్ల్లో జోరు చూపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోలేకపోయిన తెలుగు దర్శకనిర్మాతలు పదుల కోట్ల రూపాయల వసూళ్లని చేజేతులా వదిలేసుకున్నారు.ఉన్నంతలో తెలుగు ఆడియెన్స్ కోసం వేసవి చివరలో వస్తున్న పెద్ద సినిమా 'పెద్ది'నే. ప్రస్తుతానికైతే దీనిపై బజ్ బాగానే ఉంది కానీ ఇండస్ట్రీలో పరిస్థితులే బాగోలేవు. ఈ మూవీకి కచ్చితంగా పర్సంటేజీ ఇచ్చి తీరాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా తగ్గడం లేదు. దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా టాలీవుడ్లోని అంతర్గత సమస్యలు కూడా డబ్బింగ్లకు ఓ రకంగా ప్లస్ అవుతున్నాయి. మరి ఈ విషయం తెలుగు హీరోలు దర్శకులు నిర్మాతలకు ఎప్పుడు అర్థమవుతుందో?(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం) -
స్టార్ హీరోలకు అచ్చొచ్చిన త్రిష.. వాళ్లందరికీ లక్కీ ఛార్మ్!
హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.లక్కీ చార్మ్ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.అజిత్: హీరో అజిత్ 'గుడ్బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ -
పెద్ది ఐటమ్ సాంగ్.. సోషల్ మీడియాను ఊపేస్తోంది..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ను కూడా విడుదల చేశారు.హల్లల్లలో అంటూ సాగే ఈ సాంగ్లో రామ్ చరణ్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ భామ శృతిహాసన్ తన డ్యాన్స్తో ఫ్యాన్స్ను అలరించింది. తాజాగా ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా 50 మిలియన్లకు (5 కోట్లకు) పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. మరోవైపు ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం
ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఈమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రంభ.. తండ్రి తలుచుకుని చాలా భావోద్వేగానికి గురైంది. నా హృదయంలో నీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ నీ ముఖంపై చిరునవ్వు మాత్రం చెరిగిపోనివ్వలేదు. నువ్వు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యమైపోయింది అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) విజయవాడకు చెందిన రంభ అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈమెకు తొలుత మలయాళంలో అవకాశమొచ్చింది. 1992లో 'సర్గామ్' మూవీతో ఈమె హీరోయిన్ కెరీర్ మొదలైంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ హిట్ తర్వాత అదే ఏడాది 'ఆ ఒక్కటి అడక్కు'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అయింది. దీంట్లోనే ఆమె స్క్రీన్ నేమ్ రంభగా ఫిక్స్ అయింది. తర్వాత సూపర్ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్పూరి, బెంగాలి భాషల్లోనూ రంభ సినిమాలు చేసింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ని పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్బై చెప్పింది. రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఇండస్ట్రీకి దూరమైనా రియాలిటీ టీవీ షోలకు ఈ మధ్య జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. ఇంతలోనే తండ్రి చనిపోవడంతో దుఖంలో మునిగిపోయింది.(ఇదీ చదవండి: హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్) -
30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ
ఒకప్పుడు తన అందంతో, హావభావాలతో, అద్భుతమైన డ్యాన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈమె తెలుగులో చిరంజీవి సరసన 'ఆపద్బాంధవుడు' చిత్రంలో నటించింది. అవురా అమ్మకు చెల్ల పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసి అమెరికా వెళ్లిపోయింది. 30 ఏళ్ల తర్వాత స్వదేశానికి..అక్కడ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేసి ఎంతోమందికి నాట్యం నేర్పించింది. దాదాపు 30 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న ఈ నటి కొన్ని నెలల క్రితమే భారత్కు తిరిగి వచ్చేసింది. తనకు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుందన్న కోరికను మీనాక్షి శేషాద్రి ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. 'నన్ను అభిమానిస్తున్న అందరికీ నమస్కారం.. మీ ప్రేమానురాగాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. 30 ఏళ్ల తర్వాత నా కర్మభూమికి తిరిగొచ్చేశాను.అలాంటి పాత్రలు చేయాలనుందిఇప్పుడు ముంబైలో ఉంటున్నాను. సానుకూల దృక్పథం, ఆశ, ప్యాషన్తో మరోసారి చలనచిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నాను. చిన్న, పెద్ద, ప్రధాన పాత్ర అని తేడా లేకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. సినిమాలతో పాటు ఓటీటీ షోలు, వెబ్సిరీస్లైనా చేసేందుకు రెడీగా ఉన్నాను. చాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది. నేను భారత్ తిరిగి వచ్చాక అనేక ఆఫర్లు వచ్చాయి. ఏదో నిరూపించుకోవాలని కాదుకానీ అందులో కొన్ని ఏమంత ఎగ్జయిటింగ్గా లేవు. మరికొన్నేమో ముందుకు కదల్లేవు. అయినా సరే ఎటువంటి టీమ్, ఏజెన్సీ లేకుండా నేనే అంతా మేనేజ్ చేసుకుంటున్నాను. నేను ఏదో నిరూపించుకోవడానికి రీఎంట్రీ ఇవ్వడం లేదు. నా కుటుంబసభ్యుల ఎంకరేజ్మెంట్ వల్లే ఇక్కడున్నాను. నాకు సంతోషాన్నిచ్చేదే సినిమా.. అందుకే మళ్లీ ఇండస్ట్రీలో భాగం అవాలని కోరుకుంటున్నాను' అని నటి చెప్పుకొచ్చింది.కెరీర్మీనాక్షి శేషాద్రి హిందీలో.. హీరో, పైసా యే పైసా, దిల్వాలా, స్వాతి, జుర్మ్, దామిని, గంగా జమున సరస్వతి వంటి అనేక చిత్రాల్లో నటించింది. చివరగా స్వామి వివేకానంద (1998) బయోపిక్లో కనిపించింది. ఆ తర్వాత ఘాయల్: వన్స్ ఎగైన్ మూవీలో ఫ్లాష్బ్యాక్లో తళుక్కుమని మెరిసింది. మరి మీనాక్షి ఇప్పుడెలాంటి సినిమాలు ఎంపిక చేసుకుంటుందో చూడాలి!చదవండి: కదిలే రైలుపై నేను, విజయ్.. ఆరోజు చనిపోయేవాళ్లం: విలన్ -
చిరంజీవి దగ్గరకు ఎగ్జిబిటర్స్ .. 'పెద్ది' గురించి ఏం తేలుస్తారో?
ప్రస్తుతం టాలీవుడ్లో పర్సంటేజీ పంచాయితీ నడుస్తోంది. నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు ప్రదర్శించినందుకు అద్దె మాత్రమే చెల్లిస్తామని అంటుంటే.. ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్లు తమకు కూడా పర్సంటేజీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రామ్ చరణ్ 'పెద్ది'తోనే దీనిని మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నిర్మాతల వైపు నుంచి సానుకూల స్పందన రావట్లేదు. దీంతో ఇది కాస్త ఇప్పుడు చిరంజీవి దగ్గర చేరింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) తెలంగాణ ఎగ్జిబిటర్లతో సోమవారం సాయంత్రం 4 గంటలకు చిరంజీవి భేటీ కానున్నారు. ఇందులో పర్సంటేజీ విధానంపై చర్చించుకోనున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరగా.. ఎగ్జిబిటర్స్ మాత్రం దీనిపై అసంతృప్తి గా ఉన్నారు. ససేమిరా అంటున్నారు. మల్టీప్లెక్స్ల కంటే తక్కువగా ఎంతో కొంత పర్సంటేజీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.శనివారం జరిగిన ఎగ్జిబిటర్స్ సమావేశంలోనే చిరంజీవి సమయం ఇస్తే తాము గోడు వినిపిస్తాం అని ఎగ్జిబిటర్లు అన్నారు. ఇప్పుడు చిరుతో భేటీకి సిద్ధమయ్యారు. పెద్ది సినిమాని తాము టార్గెట్ చేయలేదని, ఏడాదిగా పర్సంటేజీ గురించి అడుగుతున్నామని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం.. నిర్మాణంలో ఉన్న 25సినిమాలపై ఇప్పటికే దాదాపు 70-80 శాతం ఖర్చు చేశామని, అవి రిలీజైన తర్వాత పర్సంటేజీ ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనల గురించి 'పెద్ది' నిర్మాత వెంకట్ సతీష్ కిలారు.. రామ్ చరణ్కి తెలియజేశారు. మరి ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల పర్సంటేజీ వివాదాన్ని ఇప్పుడు చిరంజీవి పరిష్కారిస్తారా? ఒకవేళ చేస్తే ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: తెలుగు ఆడియెన్స్ కోసం మరో ఓటీటీ) -
ఇండస్ట్రీలో పెద్దమనిషి నన్ను చెప్పుతో కొట్టాడు: బండ్ల గణేశ్
కమెడియన్గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతడు ఇటీవలే రీఎంట్రీ ప్రకటించాడు. చిరంజీవి- బాబీ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే నిర్మాతగానూ సినిమాలు చేయనున్నట్లు తెలిపాడు. తాజాగా నటుడు రాజా రవీంద్ర పాడ్కాస్ట్లో పాల్గొన్న బండ్ల గణేశ్ ఒక చేదు సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పుకొచ్చాడు.ఘోరమైన అవమానంబండ్ల గణేశ్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఒక పెద్దమనిషి నన్ను ఎంతో అవమానించాడు. ఆ సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది. ఆయన మంచి వ్యక్తే.. కానీ ఆరోజు ఎందుకలా చేశాడో తెలీదు. అయితే ఆయన కోపమే నాకు వరంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది. నేను, ఇంకో యాక్టర్ సెట్లో సాయంత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. సారీ చెప్పినా..నేను ఊరికే కూర్చుని సార్.. సార్ అని పిలిచినందుకు ఆ పెద్ద మనిషి సడన్గా నన్ను చెప్పుతో కొట్టాడు. దేవుడి మీద ఒట్టు.. ఆయన ఏ టెన్షన్లో ఉన్నాడో కానీ చెప్పు తీసుకుని కొట్టాడు. రెండు రోజుల తర్వాత సారీరా.. ఏమనుకోకు, వేరేవాళ్ల మీద కోపం నీమీద చూపించాను అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఎంతైనా నేను బలహీనుడిని కాబట్టే కదా నాపై ప్రతాపం చూపించాడు.ఛాలెంజ్ఆరోజు ఆయనలా కొట్టిన వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. నా దగ్గర డబ్బు లేదనే కదా నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా.. లేకపోతే నా పేరు గణేశే కాదు అని నాకు నేనే సవాల్ విసురుకున్నాను. అలా నా జీవితాన్ని మార్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే బండ్ల గణేశ్ తక్కువకాలంలోనే సక్సెస్ఫుల్ నిర్మాతగా రాణించి కోట్లు కూడబెట్టాడు.చదవండి: మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్? -
మంచులో ప్రేమ
హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ ప్రదేశాలకు వెళితే ఆ హాయే వేరు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేకి ఆ చాన్స్ దక్కింది. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఓ చల్లని ప్రదేశంలో జరిగింది. మంచు, చిరు జల్లుల మధ్య ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ని పూర్తి చేసింది యూనిట్. ఆ ఫొటోలను విడుదల చేశారు. చిరు జల్లుల నుంచి తప్పించుకోవడానికి గొడుగు, చలి తట్టుకోవడానికి వింటర్ అవుట్ఫిట్స్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు దుల్కర్, పూజ. అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రవి నెలకుడితి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి. -
90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్లో ప్రస్తుత విద్యా విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై మాట్లాడుతూ.. నేటి స్కూళ్లు పిల్లలపై అధిక ఒత్తిడి పెంచి వారిని డిప్రెషన్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పిల్లలకు చిన్న వయసులోనే నైతిక విలువలు,సమయపాలన, సర్వైవల్ స్కిల్స్ నేర్పాలి. అలాగే డిజిటల్ డిసిప్లిన్, మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత విద్యా విధానంలో 90% మార్కులు తెచ్చుకున్నా ఆ విద్యార్థికి జీవితంలో దాని ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్, మనోస్థైర్యం, సంస్కారం నేర్పితే వారు మంచి పౌరులుగా తయారవుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ.. ప్రతి సంవత్సరం 13,000–15,000 మంది విద్యార్థులు అకాడమిక్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు కంటే సంస్కారం ముఖ్యం. భవిష్యత్ విద్యావ్యవస్థ పిల్లలకు మనోస్థైర్యం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ నేర్పేలా ఉండాలని పూరీ జగన్నాథ్ కోరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి-విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. దాని తరువాత సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. -
త్రిష వీకెండ్ మూడ్.. మృణాల్ మెరుపులు
వీకెండ్ మూడ్లో తమిళ హీరోయిన్ త్రిషమెరిసిపోతున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్సన్నగా మారిపోయి షాకిచ్చిన హెబ్బా పటేల్ముద్దొచ్చేంత అందంగా బుట్టబొమ్మ పూజా హెగ్డేఆషికా రంగనాథ్ ఈ వారం గడిచిందిలాక్యూట్ లుక్స్తో మలయాళ హీరోయిన్ నజ్రియా View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) -
సత్యానంద్ శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటా: పవన్ కల్యాణ్
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’ ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. నేను సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదు. ఒక వేళ నా నేను బాగా నటించకపోతే మీ పేరుకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తోంది. అందుకే ఈ రోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదంతా వీరు గారి వల్లే సాధ్యమైంది. ప్రీమియర్ల నుంచీ మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మూవీని చూసి నాలోని ప్లస్, మైనస్లు చెప్పండి. మైనస్లు చెబితే వాటిని నేను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. మా సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చూడనివారు మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని, మా కష్టాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాను ఇంతటి స్థాయికి తీసుకు వెళ్లిన మీడియాకి థాంక్స్. ముగ్గురు హీరోయిన్లు చక్కగా నటించారు. వీరు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరామెన్ సతీష్ గారు మంచి వ్యక్తి. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. పవన్ కళ్యాణ్ బత్తులని హీరోగా పెట్టి సినిమా తీస్తామని నా కంటే కోటీశ్వరులు ఫోన్ చేసి చెప్పారు. నేనే ఇంకో రెండు చిత్రాలు చేస్తానని వారికి చెప్పాను. ఎక్కడా కొత్త అబ్బాయిలా అనిపించలేదు. మా అబ్బాయి యాక్టింగ్ నాకు నచ్చింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరు వులవల, నటులు కసిరెడ్డి రాజ్ కుమార్, విషిక, హాసిని సుధీర్, సంధ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. -
ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి
పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న 'డ్రాగన్' మూవీతో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే తారక్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ లాంటి మూవీ అంటే అందరూ చెప్పేది 'టెంపర్' గురించే. ఇప్పుడా చిత్రం గురించి నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా నటుడు రాజా రవీంద్రతో చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)'ఎన్టీఆర్ కెరీర్లో రెండు సూపర్ హిట్స్ ఇచ్చాను. 'బాద్షా' ముందు ఆయనకు ఫ్లాపులు ఉన్నాయి. ఆ రోజుకి ఎన్టీఆర్ కెరీర్ 'బాద్షా' బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత 'రామయ్య వస్తావయ్యా' అనే డిజాస్టర్ చేశారు హరీశ్ శంకర్తో. తర్వాత 'రభస' అనే అట్టర్ఫ్లాప్ తీశారు. తర్వాత 'టెంపర్' అనే బ్లాక్బస్టర్ తీశాను. ఈ కథ వక్కంతం వంశీ చెప్పగానే.. ఇది పెద్ద హిట్టవుద్దిరా వంశీ అని చెప్పి.. నేను దాన్ని పూరీ దగ్గరకు తీసుకెళ్లా. పూరీ స్టోరీ వినగానే ఇది నీకు మరో 'గబ్బర్సింగ్' అని అన్నాడు. ఆ సినిమా ఇప్పుడు గనక తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి. హీరో కూడా ఫెర్ఫార్మెన్స్ చింపి చాటేశాడు' అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.2015లో రిలీజైన 'టెంపర్' ముందు వరకు ఎన్టీఆర్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండేది. ఒక సినిమా అయితే వరసగా ఫ్లాప్లులు ఎదురయ్యేవి. 'టెంపర్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ.. ఇకపై అభిమానులు కాలర్ ఎత్తుకునేలాంటి మూవీస్ చేస్తానని అన్నాడు. అందుకు తగ్గట్లే మాట మీద నిలబడుతూ వచ్చాడు. కానీ ఈ సెంటిమెంట్ని గతేడాది రిలీజైన 'వార్ 2' దారుణంగా బ్రేక్ చేసింది. ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. సాధారణంగా పూరీ జగన్నాథ్ తాను తీసే సినిమాల్లో వేరొకరి స్టోరీ ఉపయోగించుకోడు. కానీ 'టెంపర్' కోసం ఆ సెంటిమెంట్ పక్కనబెట్టాడు. అటు పూరీ, ఇటు ఎన్టీఆర్.. ఇద్దరూ ఈ మూవీతో అదిరిపోయే సక్సెస్ కొట్టారు.(ఇదీ చదవండి: ఇలాంటి టాక్తో 'దృశ్యం 3'కి రూ.100 కోట్ల కలెక్షన్ ఎలా సాధ్యం?)Temper cinema ippudu teesthe 1000 kotlu Chestundi– Producer Bandla Ganesh pic.twitter.com/iNvrla8Nev— cinee worldd (@Cinee_Worldd) May 24, 2026 -
లుక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ.. అవికా గోర్ ఏమన్నారంటే..?
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో చిన్న వయసులోనే స్టార్డమ్ అందుకున్న నటి అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..తొలి చిత్రంతోనే భారీ హిట్ని అందుకుంది. ఆ తర్వాత ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గతేడాదిలో పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ అవికాను ఇంకా ‘చిన్నారి పెళ్లికూతురు’గానే చూస్తారు. తాజాగా ఈ బ్యూటీ ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అందమైన లుక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే పుకార్లపై స్పందించింది. లుక్ కోసం తాను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదని స్పష్టం చేసింది.మొటిమల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాలుక్ కోసం నేనెప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదు. నా జీవితంలో ఒకే ఒక్కసారి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది కూడా మొటిమలు పోగోట్టుకోవడానికి. టీనేజ్లో నా ముఖంపై చాలా మొటిమలు ఉండేవి. వాటిని తొలగించుకునేందుకు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు(నవ్వుతూ). ఇప్పటికీ నా ముఖంపై మొటిమలు ఉన్నాయి. సర్జరీలు ఏం చేసుకోలేదు కానీ..స్కీన్ పాడవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా. నేనే కాదు ప్రతి ఒక్క నటీనటులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నేను 7 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చా. చిన్నప్పటి నుంచే మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. అందుకే సన్స్క్రీన్ ఎక్కువగా వాడేదాన్ని.అమ్మ తిట్టేది.. లుక్ కోసం ట్రీట్మెంట్ కాదు..కనీసం నా హెయిర్ కట్ చేసుకుంటా అని చెప్పిన అమ్మ తిట్టేది. ఇక టాటూ వేసుకుంటా అన్నప్పుడు అయితే పెద్ద గొడవే జరిగింది. అలాంటిది నేను లుక్ కోసం ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటా? వయసు పెరిగేకొద్ది మన ముఖంలో మార్పులు వస్తాయి. నేను చిన్నప్పటి నుంచే అందరికి తెలియడంతో పెద్దయ్యాక నా ముఖంలో వచ్చిన మార్పులు చూసి సర్జరీ చేయించుకుందనే పుకార్లను సృష్టించారు. అంతేకాదు నేను బరువు పెరిగి తగ్గడం వల్ల కూడా ఇలాంటి పుకార్లకు కారణం అయింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు’ అని అవికా స్పష్టం చేసింది. -
ఇలాంటి టాక్తో రూ.100 కోట్ల కలెక్షన్.. ఎలా సాధ్యం?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నా వాటిని జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు డబ్బింగులని మాత్రం ఆదరిస్తున్నారు. అలా ఈ వీకెండ్ రిలీజైన 'దృశ్యం 3' మంచి ఆక్యుపెన్సీ నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులైన కాకముందే రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇంతకీ ఎలా సాధ్యమైంది?(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)మోహన్ లాల్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'దృశ్యం' ఫ్రాంచైజీ ఈయనకు మరింతలా ఫేమ్ తీసుకొచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాల్ని వెంకటేశ్తో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. అయితే మూడో భాగాన్ని రీమేక్ చేయకుండా మలయాళ వెర్షన్నే డబ్బింగ్ రూపంలో ఈ గురవారం థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇందులో సాగదీత తప్పితే ఏం లేదని రివ్యూలు వచ్చాయి. కానీ ఆడియెన్స్ మాత్రం ఈసారి జార్జ్ కుట్టి అండ్ ఫ్యామిలీ ఎలాంటి ఎత్తులు వేశారా అని థియేటర్లకు వెళ్తున్నారు.అలా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మోహన్ లాల్-జీతూ జోసెఫ్ 'దృశ్యం 3'కి మూడు రోజులైనా గడవక ముందు అంటే 58 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే పోస్టర్ రిలీజ్ చేసి మరీ ధ్రువీకరించారు. టాక్ బాగోలేకపోయినా ఈ రేంజ్ కలెక్షన్స్కి కారణం..ఫ్రాంచైజీపై ఉన్న హైప్, మోహన్ లాల్ లాంటి స్టార్ పవర్ కూడా కారణమని చెప్పొచ్చు. ఎలాంటి ప్రచారం చేయకుండా తెలుగులోనూ రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ల్లో మంచి నంబర్లే నమోదవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)Thank you for carrying this journey with us for 13 years. ❤️Your love, support, and belief in this story continue to humble us every day.#Drishyam3 running successfully in theatres near you.@jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk… pic.twitter.com/eIo0vLtKdE— Mohanlal (@Mohanlal) May 23, 2026 -
ప్రెగ్నెన్సీలో హారర్ సీన్ చూసి భయపడ్డా.. అబార్షన్ అయింది: ఉదయభాను
ఉదయభాను..ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్. ఆమె ఎనర్జీ, స్టైల్, మాటతీరుతో టెలివిజన్ రంగంలో ప్రత్యేకమైన ట్రెండ్ చేసిన యాంకర్ ఆమె. డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరా ఢింభకా, ఢీ లాంటి షోల విజయంలో ఉదయభాను కీలక పాత్ర పోషించింది. అయితే పెళ్లి తర్వాత ఆమె ఎక్కువ షోలు చేయలేకపోయింది. ఇక పిల్లలు(ట్విన్స్) పుట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు పూర్తిగా బుల్లితెరకు, వెండితెరకు దూరమైంది. చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వస్తోంది. ఒకవైపు సినిమాలతో పాటు కొన్ని ఈవెంట్స్కి హోస్ట్గాను చేస్తోంది. అయితే తన మొదటి ప్రాధాన్యత మాత్రం పిల్లలు, కుటుంబమే అంటోంది ఉదయ భాను. పిల్లలే తన ప్రపంచం అని.. వాళ్ల కోసం ఏదైనా వదులుసుకుంటానని చెబుతోంది. తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో పడిన బాధల గురించి, అంతకు ముందు జరిగిన అబార్షన్ గురించి చెబుతు ఎమోషనల్ అయింది.విమానం ఎక్కేముందు తెలిసిందిపెళ్లి తర్వాత కూడా నేను వరుస ఈవెంట్స్తో బిజీ అయిపోయాను. ఓ సారి ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అంతా రెడీ చేసుకొని వెళ్లే ముందు డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే నేను గర్భం దాల్చిన విషయం తెలిసింది.వెంటనే వైధ్యులను సంప్రదించా. ఫ్లైట్ జర్నీ చేయొచ్చా లేదా? అని అడిగా. ఏం పర్లేదు.. వెళ్లమని డాక్టర్లు చెప్పారు. అక్కడకు వెళ్లిన తర్వాత వరుస ఈవెంట్స్ చేశాను. చాలా అలసిపోయా. మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లా.అక్కడ చెక్ చేసి బేబీ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు.ఫ్లోర్ మొత్తం రక్తమే.. నాకు హారర్ సినిమాలంటే చాలా భయం. అస్సలు చూడలేను. భయపడే సీన్స్ వస్తే కళ్లు, చెవులు మొత్తం మూసుకుంటా. ఓ రోజు అమెరికాలోనే కజిన్స్, ఫ్రెండ్స్ హారర్ సినిమా చూస్తున్నారు. అప్పుడు నేను కూడా ఇంట్లోనే ఉన్నా. కానీ సినిమా మాత్రం చూడనని చెప్పేశా. అనుకోకుండా ఆ సినిమాలో ఓ సీన్ చూశా. చాలా భయపడిపోయా. నా బాడీతో ఏదో తేడా వచ్చిందనే విషయం అర్థమవుతుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం.డాక్టర్లు ఏదేదో చెక్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటేది చెప్పట్లేదు. నాకు పెద్ద ఎత్తున రక్తస్త్రావం జరుగుతోంది. ఫ్లోర్ మొత్తం బ్లడ్తో నిండిపోయింది. కాసేపటి తర్వాత మిస్ క్యారీ(అబార్షన్) అయిందని చెప్పారు.ఏడాది పాటు డిప్రెషన్.. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ప్రెగ్నెంట్ విషయం తెలియగానే చాలా ఆనంద పడ్డాను. కానీ అనుకోకుండా మిస్ క్యారీ కావడంతో చాలా బాధపడ్డా. ఏడాది పాటు డిప్రెషన్లోకి వెళ్లా. కానీ ఆ భగవంతుడు నాకు సహాయం చేశాడు. ఏడాది తర్వాత మళ్లీ గర్భవతిని అయ్యాను. టెస్ట్ చేస్తే కలవలు అని తెలిసింది. మా ఆనందం డబుల్ అయింది. వెంటనే ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నా. నేను చేస్తున్న షో కూడా రద్దు చేసుకున్నా. దాదాపు మూడేళ్ల పాటు నేను దేని గురించి ఆలోచించలేదు. ట్రావెల్ చేయడం వల్లే అబార్షన్ అయిందనే అనుమానంతో ఎక్కడకు వెళ్లలేదు. ప్రెగ్నెంట్ సమయంలో 100 కిలోల బరువు పెరిగాను. పొట్టలో ఇద్దరు 3 కిలోల చొప్పున ఉండడంతో బెడ్ మీద నుంచి దిగలేకపోయా. ఒక పక్క నుంచి మరో పక్కకు తిరగానికే దాదాపు 15 నిమిషాల సమయం పట్టేది. డెలివరీ కాస్త ముందుగానే చేసుకోమని వైద్యులు చెప్పారు. కానీ ఎంత బాధనైన భరిస్తా.. సరైన సమయానికే సర్జరీ చేయమని చెప్పా. పిల్లలు పుట్టాక నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు వాళ్లే నా ప్రపంచం’ అని ఉదయభాను చెప్పుకొచ్చింది. -
నువ్వు లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు: నాగ్ ఎమోషనల్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. డబ్బింగ్ చిత్రాల నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూర్ గుజ్జలపూడి హరి (46) గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్గా హరి ఎన్నో సినిమాలను పంపిణీ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది ఆయనే!డబ్బింగ్ సినిమాలువిశాల్, తమన్నా జంటగా నటించిన ఒక్కడొచ్చాడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. విశాల్ తమిళంలో నిర్మించిన పలు సినిమాలను తెలుగులో 'హరి వెంకటేశ్వర పిక్చర్స్' బ్యానర్పై విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ మూవీస్కు చెందిన పలు చిత్రాలను నెల్లూరులో పంపిణీ చేశారు.25 ఏళ్లకు పైగా పరిచయంహరి మరణంపై హీరో నాగార్జున విచారం వ్యక్తం చేశాడు. 'హరి మరణవార్త విని షాకయ్యాను. ఆయన ఇక లేడన్న విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మా పరిచయం 25 సంవత్సరాలకు పైగా సాగింది. అక్కినేని కుటుంబానికి ఆయన ఒక పిల్లర్లా అండగా నిలబడ్డారు. మా జీవితాల్లో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక మంచి మనిషిని, గొప్ప డిస్ట్రిబ్యూటర్ను కోల్పోయింది' అని ట్వీట్ చేశాడు. Deeply saddened and shocked lby the passing of Gujjalapudi Hari Kumar. Our association goes back over 25 years, A pillar of support for the Akkineni family, his presence will be irreplaceable in our lives.The Telugu film industry has lost a fine distributor and a wonderful soul.… pic.twitter.com/CcxEEwyLoe— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 24, 2026 చదవండి: క్షమాపణలు చెప్పిన రామ్చరణ్ -
శృతి హాసన్ టు పూజ హెగ్డే... ‘స్పెషల్’ స్పెషలిస్ట్గా సీనియర్ భామలు
ఒకప్పుడు కేవలం ఐటెమ్ సాంగ్స్ కోసమే ప్రత్యేకంగా కొందరు డ్యాన్సర్లు ఉండేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్లో మెరుస్తూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు సౌత్, నార్త్ సినిమాలలో సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్కు ‘కేరాఫ్’గా నిలుస్తున్నారు. వరుస అవకాశాలతో బిజీగా ఉంటూనే, కేవలం మూడు నాలుగు నిమిషాల పాటతో సినిమా స్థాయిని మార్చేయగల సత్తా ఈ సీనియర్ హీరోయిన్లకు ఉంది. అందుకే నిర్మాతలు సైతం కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ ఈ భామలను స్పెషల్ సాంగ్స్ కోసం ఎంచుకుంటున్నారు.‘పెద్ది’ హాసన్ మాస్ స్టెప్పులుటాలెంట్, గ్లామర్ కలబోసిన శృతి హాసన్ ఇటు మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూనే, అటు స్పెషల్ సాంగ్స్లోనూ అదరగొడుతోంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ చిత్రంలో శృతి హాసన్ ప్రత్యేక పాటకు రామ్ చరణ్తో కాలు కదిపింది. గతంలో మహేశ్ బాబు ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్ లో..’ అంటూ మాస్ స్టెప్పులేసిన శృతి, ఇప్పుడు చరణ్తో స్టెప్పులేయబోతుంది. నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ ఓ స్పెషల్ అప్పియరెన్స్తో ప్రేక్షకులను అలరించింది.‘స్పెషల్ సాంగ్స్’ స్పెషలిస్ట్గా తమన్నామిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చుట్టూనే తిరుగుతోంది. కేవలం పాట కోసమే థియేటర్లకు వచ్చేలా చేయగల క్రేజ్ తమన్నా సొంతం. జై లవకుశ: ‘స్వింగ్ జరా..’ అంటూ ఎన్టీఆర్తో పోటీపడి డ్యాన్స్ చేసింది. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేశ్ బాబుతో కలిసి ‘డాంగ్ డాంగ్..’ అంటూ ఆర్మీ బ్యాక్డ్రాప్లో దుమ్మురేపింది. రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా..’ పాట దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాగే హిందీ మూవీ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ అంటూ బాలీవుడ్ను కూడా షేక్ చేసింది.ఒక్కసారే..రికార్డులు బ్రేక్స్టార్ హీరోయిన్ సమంత కెరీర్లోనే మైలురాయిగా నిలిచే స్పెషల్ సాంగ్ ‘పుష్ప: ద రైజ్’ లోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’. అల్లు అర్జున్ సరసన సమంత చేసిన ఈ ఊరమాస్ సాంగ్ కేవలం టాలీవుడ్లోనే కాదు, అంతర్జాతీయంగా ట్రెండ్ అయింది. యూట్యూబ్లో భారీ వ్యూస్తో రికార్డులు సృష్టించింది. సమంత గ్లామర్, ఎక్స్ప్రెషన్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి.‘మొనికా’ హంగామాబుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం స్పెషల్ సాంగ్స్తో థియేటర్లలో పూనకాలు తెప్పించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ’ చిత్రంలో ‘మొనికా..’ అనే స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు, గ్లామర్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అంతకు ముందు రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ‘జిగేల్ రాణి’గా పూజ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 2’ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్తో మెరిసింది. వీళ్లు మాత్రమే కాదు.. శ్రీలీల, మృణాల్తో పాటు మరికొంత మంది యంగ్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. -
ఇద్దరు భామలతో 'పెద్ది' స్టెప్పులు.. ఐటం సాంగ్ చూశారా?
రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి వరుస సర్ప్రైజ్లు వదులుతున్నారు. మొన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్ 'హల్లల్లల్లో హల్లో..' ప్రోమో వదిలారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్ఈ ఐటం సాంగ్లో శృతి హాసన్ స్పెషల్ అట్రాక్షన్గా మెరిసింది. ఇక పెద్ది.. అటు శృతి హాసన్తో, ఇటు జాన్వీ కపూర్తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. సింగర్ రక్షిత సురేశ్ ఎంతో హుషారుగా ఆలపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక పెద్ది విషయానికి వస్తే.. శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్చరణ్ -
క్షమాపణలు చెప్పిన రామ్చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా, తాజాగా భోపాల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో రామ్చరణ్ నోరు జారడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డాడు. దీంతో వెంటనే తన తప్పు సరిదిద్దుకుంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా క్షమాపణలు చెప్పాడు.ఏం జరిగింది?'పెద్ది కీ ఆవాజ్' పేరుతో భోపాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రామ్చరణ్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న హోస్ట్ రామ్చరణ్తో ర్యాపిడ్ ఫైర్ ఆడించాడు. కొంతమంది క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తూ వారి గురించి ఒక్కమాటలో చెప్పాలన్నాడు. అలా సచిన్, ధోని, కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్స్ గురించి ఒక్క లైన్లోనే పొగడ్తలు కురిపించాడు. చివరగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావించాడు యాంకర్.వీడియో క్లిప్ వైరల్ఇక్కడే చరణ్ తప్పులో కాలేశాడు. 'నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఆయన మనదేశంలో ఫుట్బాల్ ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు' అని బదులిచ్చాడు. ఈ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్గా మారింది. క్రికెటర్ను ఫుట్బాల్ ఆటగాడిగా పేర్కొనడంతో చరణ్ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అటు హోస్ట్ కూడా ఈ తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడంతో అతడిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్షమించండిదీంతో చరణ్ ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ క్షమాపణలు చెప్పాడు. 'కొన్నిసార్లు నేను పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటాను. అంతమంది జనం, హడావుడి మధ్యలో అనుకోకుండా పొరపాటు దొర్లింది. అందుకు బుమ్రా గారిని క్షమించమని కోరుతున్నాను. నేను నిజంగా ఆయన ఆటకు వీరాభిమానిని. ఆయనపై నాకెంతో గౌరవం ఉంది. ఆయన సాధించిన విజయాలు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి' అని ట్వీట్ చేశాడు. Uff… I’m genuinely so forgetful with names sometimes.Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026Context - pic.twitter.com/yK0YIH6V7d— Film Culture (@CinemasHive) May 23, 2026 చదవండి: ఈ సినిమా రిలీజ్లు ఎప్పుడు? -
స్వయంభు ప్రపంచంలో...
నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రంపోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో సినిమాపోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల విస్తృత స్థాయిని చూపించారు.నిఖిల్ సిద్ధార్థ, భరత్ కృష్ణమాచారి, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కలిసి వీఎఫ్ఎక్స్ సంస్థ ఫాంథమ్ ఎఫ్ఎక్స్ను సందర్శించడం కనిపించింది. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ చిత్రానికి 2700కి పైగా వీఎఫ్ఎక్స్ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పని చేస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రా చీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
విడుదల ఎప్పుడు?
చిత్ర పరిశ్రమలో పలు సినిమాల విడుదల విషయంలో సందిగ్ధం నెలకొంది. ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడే ఆయా చిత్రాల రిలీజ్ డేట్స్ని అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శక–నిర్మాతలు. మరికొందరేమో చిత్రీకరణ జరుగుతున్న తీరు,పోస్ట్ ప్రోడక్షన్ పనులు వంటి వాటి ఆధారంగా ఫలానా తేదీకి విడుదల చేస్తామని చెబుతుంటారు. ఇంకొందరేమో ఫలానా తేదీకి తప్పుకుండా వస్తాం... రిలీజ్ పక్కా... ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు అని బలంగా చెబుతుంటారు. అయితే షూటింగ్స్ ఆలస్యం కావడం..పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం... కంటెంట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం... సరైన విడుదల తేదీ కుదరకపోవడం... బాక్సాఫీస్ వద్ద తీవ్రమైనపోటీ ఉండటం... ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు... విడుదల తేదీల్లో అనివార్యంగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొన్ని సినిమాల విడుదల తేదీలు ముందుగా ప్రకటించినప్పటికీ వాయిదా పడటం... మరికొన్ని చిత్రాల షూటింగ్స్,పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి అయినప్పటికీ ఎలాంటి రిలీజ్ డేట్స్ ప్రకటించకుండా ప్రమోషన్స్ మాత్రం ఫుల్ స్వింగ్లో చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘విశ్వంభర, స్లమ్డాగ్ 33 టెంపుల్ రోడ్, స్వయంభు, ఆపరేషన్ అరుణా రెడ్డి, చెన్నై లవ్స్టోరీ, సంబరాల ఏటిగట్టు, కొరియన్ కనకరాజు’ వంటి సినిమాల రిలీజ్ డేట్స్పై ఎలాంటి స్పష్టత లేదు. ఈ చిత్రాల విడుదల ఎప్పుడు? అన్నది సగటు సినీ ప్రేమికుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఎదురు చూడాల్సిందే. ఇక వాయిదా పడుతూ వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...విశ్వంభరుడి రాక కోసం...చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ కోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపా ట ఈ మూవీ నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే 2025 సంక్రాంతి బరిలో సందడి చేయాల్సి ఉంది.జనవరి 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తప్పకుండా సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని అనుకున్నారంతా. అయితే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన పా న్ ఇండియన్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో విడుదల వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పటికీ వీఎఫ్ఎక్స్ పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో మూవీ విడుదల తేదీ విషయంలో చిత్రబృందం సందిగ్ధతను కొనసాగిస్తున్నట్లు ఫిల్మ్నగర్ టాక్. ‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమాని 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అంటూ తన పుట్టినరోజు సందర్భంగా 2025 ఆగస్టు 22న చిరంజీవి ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయిదే వేసవి మొదలై ఇప్పటికే సగానికి పైగా అయినప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్.ఇదిలా ఉంటే చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘ఇంద్ర’ (2002 జూలై 24 రిలీజైంది) విడుదల తేదీ అయిన జూలై 24ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మరి ఆ తేదీకి అయినా ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టులో విడుదలవుతుందా? అదీ కుదరకుంటే దసరా కానుకగా అక్టోబరులో రిలీజ్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ‘విశ్వంభర’ రిలీజ్పై మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. టెంపుల్ రోడ్లో...దర్శకుడు పూరి జగన్నాథ్ శైలి ప్రత్యేకమైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాని శరవేగంగా అనుకున్న సమయంలో పూర్తి చేయగలరనే పేరుంది ఆయనకు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ కూడా ఆయన స్టైల్లో స్పీడుగానే సాగిందని టాక్. అయితే విడుదల తేదీ విషయంలోనే సందిగ్ధం నెలకొందట. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించారు. టబు, బ్రహ్మాజీ, దునియా విజయ్కుమార్ ఇతర కీలక పాత్రలుపోషించారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోహన్ పిక్చర్స్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించారు. ఈ మూవీ చిత్రీకరణ,పోస్ట్ ప్రోడక్షన్, రీ–రికార్డింగ్ పనులు పూర్తి అయినప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు.‘‘పూరి మార్క్ యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్టైనర్, ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ‘స్లమ్ డాగ్’కి తనదైన శైలిలో స్వరాలు అందించారు. ప్రత్యేకించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ పా న్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. చిత్ర పరిశ్రమలో డైరెక్టర్గా 26 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ కెరీర్లో ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ స్పెషల్ ఫిల్మ్గా గుర్తుండిపోతుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.స్వయంభు... ‘కార్తికేయ 2’(2022)వంటి పా న్ ఇండియా బ్లాక్బస్టర్ తర్వాత నిఖిల్ హీరోగా నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’.ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్ఫుల్ వారియర్ పా త్రలో కనిపించనున్నారు. 1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రా ంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవారు. అల్లరిగా తిరిగే అతను అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందట. ఈ క్యారెక్టర్లో సహజంగా ఒదిగిపోవడానికి నిఖిల్ ఈ ప్రాజెక్ట్పై దాదాపు రెండు సంవత్సరాలు వెచ్చించి, ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. తన కెరీర్లో ‘స్వయంభు’ని ఒక మైలురాయిగా భావించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు నిఖిల్. ఈ మూవీ టీజర్లోని విజువల్స్, భారీతనం, ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన స్పందన రావడంతో పా టు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.‘కేజీఎఫ్, సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఏప్రిల్ 16న విడుదల చేసిన తొలి పా ట ‘రా రా ధీవర’కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘స్వయంభు’ని తొలుత 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్ కాలేదు. అలాగే ఆ తర్వాత ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది.పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్న ఈ మూవీ రిలీజ్కి కేవలం తెలుగులో సరైన విడుదల తేదీ కుదిరితే సరిపోదు. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలకు గట్టిపోటీ లేకుండా ఉండే తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అక్కడి మార్కెట్ని కూడా జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంటుంది మేకర్స్. మరి వీటన్నింటినీ దష్టిలో పెట్టుకుని ‘స్వయంభు’ కొత్త విడుదల తేదీ ఎప్పుడన్నది చిత్రయూనిట్ ప్రకటించే వరకు వేచి చూడాలి.ఆపరేషన్ అరుణారెడ్డినటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ప్లే రచయిత... ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారుపోసాని కృష్ణమురళి. శ్రీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘దుశ్శాసన’. 2011 మే 27న ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ తర్వాత నటుడిగా బిజీ అయినపోసాని కృష్ణమురళి కొన్నేళ్ల పా టు దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన మూవీ ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఆయన కీలక పా త్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది.ఈ చిత్రానికి ఆయన కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టడంతో పా టు తొలిసారి రెండు పా టలు కూడా రాయడం విశేషం. హిందోళ చక్రవర్తి టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలోపోసాని కృష్ణమురళి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, ఎంపీ రఘునందన్ రావు ఇతర ప్రధాన పా త్రలుపోషించారు. 3 ఇడియట్స్ మూవీస్ సమర్పణలో యూపీ సినిమా లైన్స్ , కుసుమ ఎంటర్టైన్మెంట్స్పై రూపొందిన ఈ చిత్రంపోస్ట్ ప్రోడక్షన్, సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటికీ సినిమా రిలీజ్ డేట్పై క్లారిటీ లేదు.‘‘నిజాయితీపరులైన జర్నలిస్టుల కథతో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ రూపొందింది. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుందనేది కథాంశం. అరుణారెడ్డి అనే జర్నలిస్ట్గా హిందోళ చక్రవర్తి నటించారు. కొందరు చేసిన రాజకీయాలకు ఓ మంచి జర్నలిస్ట్ రోడ్డున పడే పరిస్థితి వస్తే.. ఇలాంటి నిజాయతీ కలిగిన అమ్మాయి జర్నలిజంలో ఉండాలని ముఖ్యమంత్రి అండగా నిలబడతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే కథనం ఆసక్తిగా ఉంటుంది. సినిమా ప్రా రంభం నుంచి చివరి దాకా తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ప్రేక్షకుల ఊహకు కూడా అందదు. స్క్రీన్ప్లే అంత అద్భుతంగా ఉంటుంది. ఈ నెలాఖరులో లేదా జూన్లో మా సినిమాని విడుదల చేస్తాం’’ అంటూపోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.కొరియన్ కనకరాజు... వరుణ్ తేజ్ హీరోగా నటì ంచిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ మూవీ ఫేమ్ మేర్లపా క గాంధీ రచన–దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ‘మిరాయ్’ మూవీ ఫేమ్ ‘రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, నటుడు సత్య కీలకపా త్రపోషించారు. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయినప్పటికీ విడుదల ఎప్పుడు? అన్నది ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ‘‘వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ , మేర్లపా క గాంధీ హిలేరియస్ స్టోరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్ –ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది.హారర్, కామెడీ, ట్విస్ట్లతో ఇండియన్, కొరియన్ నేపథ్యాల్లో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పా త్రపోషించారు. ఈ సినిమా కోసం కంప్లీట్గా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారాయన. రితికా నాయక్ చక్కని నటనతో ఆకట్టుకుంటారు. సత్య కామెడీ టైమింగ్తో మరోసారి నవ్వులు పండిస్తారు. వినోదం, యాక్షన్, హారర్ని మేళవిస్తూ మేర్లపా క గాంధీ ఈ మూవీ తెరకెక్కించారు.కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. తమన్ సంగీతం అందించిన మా సినిమా నుంచి విడుదల చేసిన ‘కమ్సాహం నిదా...’ పా టకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వేసవిలో సినిమాని విడుదల చేస్తాం’’ అంటూ చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే... వేసవిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫొటో, బేబి’ చిత్రాల దర్శకుడు సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా నటించారు. అమృత ప్రోడక్షన్స్ , మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించారు. చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కానప్పటికీ మేకర్స్ మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ‘‘మణిశర్మ సంగీతం అందించిన మా మూవీ నుంచి విడుదల చేసిన తొలి పా ట ‘గుర్తుందా...’ కి అనూహ్యమైన స్పందన వచ్చింది.మా సినిమాను జూన్ 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటిస్తాం’’ అంటూ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఎస్కేఎన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ డాల్బీలో చేయడం సంతోషంగా ఉంది. రవి నంబూరితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ‘గుర్తుందా...’ పా ట కోసం కోటి రూపా యలు ఖర్చు చేసి సెట్ వేశారు. ‘రాజా వారు రాణి గారు’ మూవీ తర్వాత నేను ఈ సినిమాలో సెటిల్డ్గా ఉండే క్యారెక్టర్ చేశాను.మా మూవీ ప్రమోషన్ కంటెంట్కు వచ్చిన రెస్పాన్స్ , సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. మణిశర్మగారు ఏడు పా టలు కంపోజ్ చేశారు. ఆ పా టల్ని అందరూ థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు. మా మూవీ రిలీజ్ అయిన రోజు థియేటర్స్లో మ్యూజిక్ కన్సర్ట్ జరిగినట్లు ఉంటుంది. ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్లో ఒకటిగా మా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.సంబరాల ఏటిగట్టు... సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పా త్రలుపోషించారు. ‘హను–మాన్’(2024) వంటి పా న్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్గా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్పోస్ట్పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల విషయంపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే సందిగ్ధం నెలకొంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.టాక్సిక్...‘కేజీఎఫ్ 1, 2’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత యశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ , మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే... ఈ మూవీని తొలుత మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మార్చి 19 నుంచి జూన్ 4కు రిలీజ్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ, జూన్ 4న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా మరోసారి మారనుంది. త్వరలోనే కొత్త డేట్ను ప్రకటించనున్నారు మేకర్స్. ‘‘సినిమాకాన్ లో ‘టాక్సిక్’ని ప్రదర్శించిన తర్వాత ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి అద్భుతమైన స్పందన లభించింది. అక్కడ వచ్చిన స్పందన చూసిన తర్వాత ఇది వరల్డ్ వైడ్గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీ, భాగస్వామ్యాలను కాంటాక్ట్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో మా సినిమా విడుదల తేదీని పునఃసమీక్షించాలని నిర్ణయించుకున్నాం. గతంలో ప్రకటించినట్లుగా జూన్ 4న విడుదల చేయలేకపోతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన తదుపరి విడుదల తేదీని త్వరలోనే చెబుతాం. భారతీయ సినిమా తన సత్తాను వరల్డ్వైడ్గా చాటుతూ గొప్ప భవిష్యత్తుతో ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో దాని స్థాయిని మరింత పెంచాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది.ఒక నటుడిగా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమ కోసం, మనందరి కోసం నా వంతు పా త్రపోషించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. కొన్ని కథలకు సహనం అవసరం. కొన్ని ప్రయాణాలకు అది తప్పనిసరి. మీరు ఆస్వాదించి, వేడుక చేసుకునే ఒక చిత్రాన్ని మీకు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక గర్వకారణంగా నిలిచే చిత్రం ఇది’’ అని యశ్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని చిత్రాల విడుదల తేదీల పైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్ -
అల్లు అర్జున్ కుమారుడికి స్టార్ క్రికెటర్ సర్ప్రైజ్ గిఫ్ట్
ఓ సినీమా స్టార్తో ఓ క్రికెట్ స్టార్ కలిసిన అరుదైన క్షణం అభిమానులను ఉత్సాహపరిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ను కలిశారు. ఐపీఎల్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న అయ్యర్ను బన్నీ అభినందించారు. వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ బన్నీ కుమారుడు అల్లు అయాన్కు ఓ ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. తన సంతకంతో కూడిన క్రికెట్ జెర్సీని అయాన్కు బహుమతిగా అందించారు. ఇక ఈ గిఫ్ట్పై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్ అయ్యర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ని ఈ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ బన్నీ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)ఈ భేటీతో అల్లు అర్జున్ అభిమానులు, క్రికెట్ లవర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
చరణ్ డాన్స్తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. మొదట విడుదలైన “చికిరి.. చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. “రయ్.. రయ్.. రారా” పాట కూడా భారీ హిట్ అయింది. తాజాగా విడుదలైన స్పెషల్ మాస్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటల్లో ఏదీ తన ఫేవరెట్ సాంగ్ కాదని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ప్రకారం, తనకు అత్యంత ఇష్టమైనవి ఈ చిత్రంలోని ఇంకా విడుదల కాని బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని సాంగ్స్ అని తెలిపారు. ఈ సినిమాలో కీలకమైన రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి అత్యంత ఎమోషనల్గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు కూడా ఓ ఇంటర్వూలో ధృవీకరించారు.రామ్చరణ్ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. నేను పాటలు కంపోజ్ చేసినప్పుడు అవి బాగానే ఉన్నాయి. కానీ ఆ పాటలకు చరణ్ డాన్స్ చేసిన తర్వాత వాటి అందం రెట్టింపు అయింది. రీ-రికార్డింగ్ సమయంలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలో బెస్ట్ పార్ట్ చరణ్ యాక్టింగ్ అని అన్నారు. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంచి. -
'పెద్ది' ఆపితే ఆమరణ నిరహార దీక్ష చేస్తా
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆంధ్రాలో విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ తెలంగాణలోని థియేటర్లలోకి వస్తుందా అనే సందేహం మాత్రం నెలకొంది. దానికి కారణం పర్సంటేజీ వివాదం. కొన్నిరోజుల ముందు అంతా సద్దుమణిగింది అనుకుంటే.. తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పెద్ది'కి పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఇదలా ఉండగానే నిర్మాత నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)'మీరు పెద్ది సినిమాని ఇదే ప్రకారం ఆపాలని నిర్ణయించుకుంటే బుధవారం(మే 27) ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆమరణ నిరహార దీక్షకు దిగుతా. మీరు చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేయట్లేదు అంటూనే అదే చేస్తున్నారు. చేస్తున్న వాళ్లు ఎవరో మాకు బాగా తెలుసు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఆ ఆటకు బలికావద్దు' అని నట్టికుమార్ ఆవేశపడిపోయారు.ఇదంతా చూస్తుంటే తెలంగాణలో 'పెద్ది' రిలీజ్ అవుతుందా అనిపిస్తుంది. శనివారం జరిగిన ఇదే ప్రెస్మీట్లో ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే అవకాశం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాసినట్లు చెప్పుకొచ్చారు. మరి ఈ అడ్డంకులు దాటుకుని మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి?స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో చరణ్.. రన్నర్, క్రికెటర్, కుస్తీ వీరుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)Producer #NattiKumar :"మీరు #PEDDI సినిమా ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను." pic.twitter.com/NaeuuHtT7Q— Whynot Cinemas (@whynotcinemass_) May 23, 2026 -
లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు
జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ఫిజిక్ మెంటైన్ చేస్తూ ఫిట్ ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో మాత్రం కాస్త బొద్దుగా ఉండేవాడు. రాఖీ మూవీ టైంలో ఇదే విషయమై పలు విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత పూర్తిగా లుక్ మార్చి అందరికీ షాకిచ్చాడు. అయితే చిన్నతనంలోనే తన శరీరం గురించి ఆలోచిస్తూ తారక్ మదనపడేవాడని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చెప్పారు. ఎన్టీఆర్ చిన్నతనంలో జరిగిన సంఘటనలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)'జూ.ఎన్టీఆర్కి నేనంటే ఇష్టం. చిన్నప్పుడే యాక్టింగ్, బాడీ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోవాలనుకున్నాడు. దీని గురించే వాళ్ల అమ్మ కూడా నన్ను అడిగారు. 'వద్దమ్మా.. మీ వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమాలు చేయించండి బాగా చేస్తాడు' అన్నాను. 'అంకుల్ నేను లావుగా ఉన్నానా? జనాలు చూస్తారా?' అని ఎన్టీఆర్ నన్ను అడిగాడు. దీంతో బాబు నువ్వు మీ తాత లాగా బ్రహ్మాండంగా ఉంటావు. నువ్వేం భయపడక్కకర్లేదు' అని చెప్పినట్లు పోసాని వెల్లడించారు.'డైరెక్టర్ ఉదయ్ కుమార్తో అప్పట్లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. దీనికి నన్ను డైలాగ్స్ రాయమని అడిగాడు. అప్పట్లో రైటర్గా బిజీగా ఉండేవాడిని కథ వినమని చెబితే వెళ్లి విన్నాను. 'మీకు స్టోరీ నచ్చిందా బాబు' అని తారక్ని అడిగాను. నచ్చిందని చెప్పాడు. నేను మాత్రం నాకు నచ్చలేదు. కథ బాగోలేదు బాబు అని డైరెక్టర్ అక్కడున్నప్పుడే ఎన్టీఆర్కి చెప్పా. స్టోరీ లైన్ నచ్చకపోయినా నువ్వు డైలాగ్స్ రాయమంటే రాస్తాను. ఆలోచించుకో బాబు అని అన్నాను. మీరు వద్దు అన్న తర్వాత ఇంకెందుకు అని ఆ స్టోరీని పక్కనబెట్టేశాడు. ఎన్టీఆర్ నన్ను అంతలా నమ్మాడు. అలా ఉదయ్ కుమార్తో కాకుండా రాజమౌళితో 'సింహాద్రి' చేశాడు. తర్వాత ఎక్కడికో వెళ్లిపోయాడు' అని పోసాని అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.కెరీర్ ప్రారంభంలో రచయిత, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. తర్వాత కాలంలో నటుడిగా మారారు. ఎన్టీఆర్ 'టెంపర్' మూవీలో ఈయన చేసిన నారాయణమూర్తి అనే కానిస్టేబుల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో 'మీరు మారిపోయారు సర్' అని పోసాని చెప్పే డైలాగ్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోసాని లీడ్ రోల్ చేస్తూ దర్శకనిర్మాతగా 'ఆపరేషన్ అరుణారెడ్డి' తీశారు. దీని ప్రమోషన్లలో భాగంగానే ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాల్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం) -
ఉప్పల్ స్టేడియంలో తెలుగు హీరోయిన్.. చిత్రంగా ఐటమ్ బ్యూటీ
ఉప్పల్ స్టేడియంలో హీరోయిన్ శాన్వి మేఘనచిత్రమైన డ్రస్లో షాకిచ్చిన నోరా ఫతేహిమేకప్తో అదరగొట్టేసిన అనన్య నాగళ్లచూడచక్కగా మెరిసిపోతున్న విష్ణుప్రియఒంపుసొంపులతో హీరోయిన్ సయీ మంజ్రేకర్అద్దం పక్కన పోజులతో నటి మౌనీ రాయ్ View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Vishnu Priya Bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Aneet Padda (@aneetpadda_) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
ఫీల్ గుడ్ ఎమోషన్తో రాబోతోన్న విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’
ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఆగస్టులో ఈ చిత్రాన్ని ఘనంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫుల్ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. ఈ కథ తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధాన్ని హైలైట్ చేస్తూ యాక్షన్ ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో విజయ్ ఆంటోని కనిపిస్తున్న తీరు, రక్తంతో ఉన్న ఆ విధానం, ఆయన ఇంటెన్స్ లుక్స్ ఇవన్నీ కథ ఎంత డెప్త్గా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు.ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. -
మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు కష్టాలు తొలగిపోలేదు. సమస్య మళ్లీ మొదటకొచ్చింది. అంతా సెట్ అయిందనుకున్న పర్సంటేజీ గొడవ మళ్లీ మొదలైంది. 'పెద్ది'కి కూడా పర్సంటేజీ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో శనివారం సమావేశమైన అనంతరం పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీతో రెండుమూడు సార్లు చర్చలు జరిగాయి. 'హరిహర వీరమల్లు' రిలీజ్ టైంలోనే 2-3 నెలల్లో సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. ఏడాది దాటిపోయినా అది జరగలేదు. నిర్మాతలు.. ముందుగా మూడు వారాలన్నారు. ఇప్పుడు మరో మూడు వారాలని వాయిదా వేస్తున్నారు. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలని థియేటర్లలో ఆడిస్తాం అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు.దేశం మొత్తం థియేటర్లలో పర్సంటేజీ విధానం ఉంది. తెలంగాణలో మాత్రం రెంటల్ ఉంది. నిర్మాతలు.. సమస్యని రోజురోజుకీ ఆలస్యం చేస్తున్నారు. మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగడం లేదు. మాకు పర్సంటేజీ విధానం కావాల్సిందే. అది ఎంతిస్తారో చెప్పండి అని కూడా శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చు తెలంగాణలో మాత్రం ఉండదు. రేట్లు పెంచొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశాం. 'పెద్ది'పై మాకు ఎలాంటి పగ లేదు. కానీ ఇప్పుడు కాకపోతే నిర్మాతలు మళ్లీ ఎప్పుడు పట్టించుకుంటారనేది తెలియదు అందుకే ఈ చిత్రాన్ని కూడా పర్సంటేజీ శ్లాబ్లో చేర్చాలని ఫిక్సయ్యాం అని చెప్పుకొచ్చారు.దీనిబట్టి చూస్తే ఆంధ్రా వరకు 'పెద్ది'కి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు గానీ తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేస్తారా అనేది సందేహం. ఎందుకంటే అటు నిర్మాతలు గానీ ఇటు ఎగ్జిబిటర్లు ఎవరూ తగ్గడం లేదు. విడుదలకు మరో 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో 'పెద్ది' విషయంలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్లా మారిపోయింది.(ఇదీ చదవండి: వయసు తేడా ఏడాది.. తల్లీకొడుకుగా చేసిన హీరోహీరోయిన్) -
బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి
కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరు చెప్పగానే సంప్రదాయ పాత్రలే గుర్తొస్తాయి. అలాంటిది ఈమె స్విమ్మింగ్ పూల్లో బికినీ ధరించి ఫొటోషూట్ చేసిందని చెప్పి ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. నిజంగానే రుక్మిణి ఇలా చేసిందా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు సదరు బికినీ పిక్స్పై స్వయంగా రుక్మిణినే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: టాలీవుడ్ హీరోయిన్)'ఏఐ సాయంతో సృష్టించిన నా ఫొటోలు ఆన్లైన్లో వైరల్ కావడం నేను, నా టీమ్ గుర్తించాం. అవన్నీ ఫేక్. ఏఐతో తయారు చేశారని క్లారిటీ ఇస్తున్నాను. ఇలాంటివి క్రియేట్ చేయడం నిజంగా బాధ్యతారాహిత్యమే. అలానే మా వ్యక్తిగత గోప్యతని ఉల్లంఘించడమే అవుతుంది. దీన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఫొటోలని సృష్టించిన వాళ్లతో పాటు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు మొదలుపెట్టాం. ఇలాంటి వాటిని పోస్ట్ చేయడం, షేర్ చేయడం లాంటివి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని రుక్మిణి చెప్పుకొచ్చింది.రీసెంట్ టైంలో ఇలా జరగడం మరీ ఎక్కువైపోయింది. గతంలో పలువురు ఫొటోగ్రాఫర్లు.. వెనక వైపు నుంచి, అసభ్యకర యాంగిల్స్లో ఫొటోలు తీస్తున్నారని రుక్మిణితో పాటు పలువురు కన్నడ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పడిలా జరిగింది. యాంకర్ అనసూయకి కూడా ఇలానే జరగడంతో కేసు పెట్టింది.రుక్మిణి సినిమాల విషయానికొస్తే.. కన్నడలో చేసిన 'సప్త సాగర ఎల్లో దాచే' రెండు భాగాలతో పాటు 'కాంతార' సీక్వెల్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్తో 'డ్రాగన్'లో నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన) -
భర్తతో కలిసి ట్రోఫీ గెలిచిన వాసంతి.. ప్రైజ్మనీ ఎంతో తెలుసా?
పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా మందికి ఆశ.. అందులోనూ సెలబ్రిటీలు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో చూడాలని చాలామంది తహతహలాడుతుంటారు. వారందరి కోసమే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రియాలిటీ షోలు పుట్టుకొస్తున్నాయి. అలా ఎక్కువమందికి దగ్గరైన షో బిగ్బాస్. ఈసారి కొత్తగా 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షో తీసుకొచ్చారు. ఇది మాటీవీతో పాటు హాట్స్టార్లోనూ ప్రసారమైంది.10 వారాల రియాలిటీ షోశ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో అనిల్ రావిపూడి, రాధ, లయ జడ్జిలుగా వ్యవహరించారు. సీరియల్స్, బిగ్బాస్ ద్వారా ఫేమస్ అయిన సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా ఎంచుకున్నారు. అలా 10 సెలబ్రిటీ జంటలను 10 వారాలపాటు ఒక మాన్షన్లో ఉంచారు. వారే మహేశ్- సాండ్రా, జాను- భాను, వాసంతి కృష్ణన్- పవన్ కల్యాణ్, నటరాజ్ మాస్టర్- నీతూ, నూకరాజు- ఆసియా, సంధ్య- బ్రిట్టో, హరిత- హరీశ్, ప్రియాంక జైన్- శివకుమార్, అంజలి - పవన్, సోనియా- సిద్ధు. విజేతగా వాసంతి జోడీమధ్యలో అభిమానిక- ఆమిర్ దంపతులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ జంటల మధ్య ప్రేమ, నమ్మకం, సహనాన్ని పరీక్షించారు. ఎన్నో గేమ్స్ ఆడించారు. వాటన్నింటినీ దాటుకుని అందరికంటే బలమైన జంటగా నిలిచారు వాసంతి కృష్ణన్- పవన్ కల్యాణ్. ఈ జోడీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ట్రోఫీ గెలవడంతో పాటు రూ.15 లక్షల ప్రైజ్మనీ అందుకుంది. రెండో స్థానంలో నూకరాజు, మూడో స్థానంలో మహేశ్, ఐదో స్థానంలో జాను దంపతులు నిలిచారు. మొదటి నుంచి గెలుపు నాదే అని ఫిక్సయిన నటరాజ్ మాస్టర్ నాలుగో స్థానానికి పరిమితమవడంతో హర్టయి ఫినాలే నుంచి వెళ్లిపోయాడు. View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)చదవండి: అమ్మకు క్యాన్సర్.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: స్నేహ ఉల్లాల్ -
నాగార్జునకు చిన్న కొడుకు సర్ప్రైజ్.. అదేంటో చూసేయండి!
మొదటి అడుగు ఎవరికైనా ప్రత్యేకమే.. కింగ్ నాగార్జున నటించిన మొదటి సినిమా విక్రమ్. ఈ మూవీ విడుదలై నేటి (మే 23)కి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తండ్రికి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు చిన్న కుమారుడు, హీరో అఖిల్. అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' మూవీ టీజర్ వదిలారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.తండ్రికి సర్ప్రైజ్'నా సినీ జీవితం మొదలైన రోజు అఖిల్ నాకో చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. చూస్తుంటే చాలా హాయిగా ఉంది. మీరూ చూడండి, మనోడు వస్తున్నాడు' అని రాసుకొచ్చాడు. లెనిన్ టీజర్ విషయానికి వస్తే.. 'ఏమంటివి ఏమంటివి...' అన్న ఎన్టీఆర్ డైలాగ్తో వీడియో మొదలైంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రంగస్థల కళాకారిణిగా ఆ డైలాగ్ను స్టేజీపై చెప్తుంది. పల్లె పరిమళంఎన్టీఆర్ అంత కాకపోయినా బానే చెప్పావని మెచ్చుకున్నాడు హీరో అఖిల్. ఇద్దరూ పల్లెటూరి యాసలో డైలాగులు చెప్తూ మెప్పించారు. టీజర్ అయితే అదిరిపోయింది. ఈసారి అఖిల్ చాలా కొత్తగా ట్రై చేశాడని, హిట్టు గ్యారెంటీ అని అభిమానులు అప్పుడే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. Today, May 23rd నా సిని జీవితం మొదలైన రోజు Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది మీరు చూడండి. 👉🏽 https://t.co/QG2BFis2XTమనోడు వస్తున్నాడు…. #ManoduVasthunnadu #LeninOnJune26th— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026 -
మే 23.. నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు : నాగార్జున
మే 23వ తేదిని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఆయన నటించిన మొదటి చిత్రం విక్రమ్ రిలీజై నేటికి(మే 23) 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా తనను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.‘ మే 23.. ఈ తేదిని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. మా నాన్న(అక్కినేని నాగేశ్వరరావు) గారితో పాటు నా కొడుకులతో(నాగ చైతన్య, అఖిల్)కలిసి నటించిన ‘మనం’ మూవీ ఇదే రోజున రిలీజైంది. ఇక ఇదే రోజు నా మొదటి చిత్రం ‘విక్రమ్’ కూడా విడుదలైంది. మిమ్మల్ని అలరించడానికి , మీ ప్రేమాభిమానాలు పొందడానికి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇన్నాళ్లుగా నాకు అండగా నిలిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ మే 23ని ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ నాగార్జున్ ట్వీట్ చేశాడు.నాగార్జున మొదటి చిత్రం విక్రమ్ విషయానికొస్తే... 1986 మే 23న ఈ చిత్రం విడుదలైంది. బాలీవుడ్ సూపర్ హిట్ ‘హీరో’కి తెలుగు రీమేకే ఈ చిత్రం. తొలి సినిమాతో నాగార్జునకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తూ.. ‘టాలీవుడ్ కింగ్’గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన 100వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తోంది. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారని సమాచారం. Thank you for all the blessings and love being showered on me today🙏🙏🙏May 23!! the date I cannot forget!!The day which I had the honour of producing and releasing the last film MANAM of my legendary father ANR🙏 the film which I had the privilege of working both with my…— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026 -
అమ్మకు క్యాన్సర్.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: హీరోయిన్
ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ స్నేహ ఉల్లాల్. అయితే ఆమె కెరీర్ మొదలైంది మాత్రం హిందీ సినిమాతోనే.. లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ (2005) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది. ఒక్క సినిమాతోనే తన దశ తిరిగిపోయింది. తెలుగు, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంది. మధ్యలో సినిమాలు వదిలేసింది. 16 ఏళ్లకే ఎంట్రీరెండేళ్ల క్రితమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహా ఉల్లాల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను సినిమాల్లో అడుగుపెట్టే సమయానికి నా వయసు 16 ఏళ్లే! అప్పుడే పదో తరగతి పూర్తి చేసి కాలేజీలో చేరాను. అక్కడ సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ ఫ్రెండ్స్ నన్ను చూశారు. వారు లక్కీ సినిమా ఆడిషన్స్కు వెళ్లారు. బహుశా ఆ సమయంలోనే నా గురించి చెప్పి ఉంటారు. అమ్మకు క్యాన్సర్అలా ఆ మూవీ టీమ్ నన్ను కలిసింది. ఆ సమయంలో మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు. అమ్మ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటోంది. అందరి ముఖంలోనూ విషాదమే ఉంది. ఈ సినిమా ఛాన్స్ ద్వారా అందరికీ కాస్త ఉపశమనం కలిగించాలనుకున్నాను. పైగా అమ్మకు ప్రయాణాలంటే భలే ఇష్టం. షూటింగ్స్ కోసం తనను వెంట తీసుకుని వెళ్లొచ్చని సినిమా ఒప్పుకున్నాను.చాలా కోల్పోయా..ఈ మూవీ రిలీజయ్యాక నాపై బోలెడంత ప్రేమ కురిపించారు. ఈ ఇండస్ట్రీ నాకెంతిచ్చిందో అంతకంటే ఎక్కువే తీసుకుంది. నా కాలేజీ లైఫ్, స్వేచ్ఛను హరించేసింది. 16 ఏళ్ల నుంచి సడన్గా పెద్దదాన్నయిపోయాను. టీనేజ్ను మిస్ అయ్యాను. అయితే చిన్నప్పటి నుంచే నాకు చాలా ఆఫర్లు చవ్చాయి. ఒమన్ నుంచి భారత్కు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వాణిజ్య ప్రకటనలో నటించమని అడిగారు. ఆ భయంతో దూరంకానీ ఇండస్ట్రీపై ఉన్న భయంతో వాటిని దూరం పెట్టాను. ఇంట్లోవాళ్లు కూడా ఇండస్ట్రీ అసభ్యకరంగా ఉంటుందని భయపెట్టారు. పైగా నేనంత గ్లామర్గా కూడా ఉండనని నా అభిప్రాయం. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు మంచి పాత్రలు ఎంచుకుని మళ్లీ బాలీవుడ్లో బిజీ అవాలని ఉంది' అని స్నేహ ఉల్లాల్ చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మ సలహాతో పెళ్లికి ముందు సహజీవనం: నటి -
‘వారణాసి’ సూపర్ సాంగ్.. మహేశ్, ప్రియాంక అదిరిపోయే స్టెప్పులు!
హైదరాబాద్లో షూట్ గ్యాప్లో హ్యాపీగా మామిడిపండ్లు తింటున్నారు హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఏ సినిమా షూట్ అంటే ‘వారణాసి’. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ‘ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్’ అన్నట్లు మహేశ్బాబు, ప్రియాంకా చోప్రా పాల్గొంటుండగా భారీ స్థాయిలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. మహేశ్, ప్రియాంక అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నారని తెలిసింది. థియేటర్స్లో ప్రేక్షకులకు ఈ పాట ఓ విజువల్ ఫీస్ట్లా ఉంటుందట. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ సాంగ్కు కొరియోగ్రఫీ చేస్తున్నారని తెలిసింది. ఈ సాంగ్ షూట్ గ్యాప్లో మామిడి పండ్లు తింటున్నట్లుగా ప్రియాంకా చోప్రా తన ఇన్స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగానే విదేశాల్లో మరో కొత్త షెడ్యూల్ను ఆరంభించనున్నారట రాజమౌళి. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
పవర్ఫుల్ లుక్లో రషీన్, పోస్టర్ రిలీజ్
ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. 1987లో రాగలీల సినిమాతో పరిచయమై భారత్ బంద్, ప్రియతమా, బిల్లా, సింహ వంటి సినిమాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మే 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ Production No. 1 నుంచి ఒక ప్రత్యేక బర్త్డే పోస్టర్ ను లాంచ్ చేశారు.ఆ పోస్టర్ ద్వారా ఆయన పాత్ర వ్యక్తిత్వాన్ని, అందులోని మిస్టరీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. రహమాన్ పవర్ఫుల్ లుక్లో కనిపించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
'విశ్వంభర' డైరెక్టర్ సోదరుడు దర్శకుడిగా ఎంట్రీ
చిరంజీవితో 'విశ్వంభర' తీసిన దర్శకుడు వశిష్ట సోదరుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'తక్షక'. కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నాడు. డా.లతారాజు నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర పోస్టర్ని స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: లేడీ యూట్యూబర్పై కేసు పెట్టిన యాంకర్ విష్ణుప్రియ)చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసిన కుర్రాడు కృష్ణ. ఫస్ట్ టైమ్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా బాగుండాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి అని వినాయక్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తయి దర్శకుడిగా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్గా ఉంది. సీజీ వర్క్ పూర్తిచేసి ఒక గొప్ప మూవీని మీకు అందించబోతున్నాం అని డైరెక్టర్ కృష్ణ మల్లిడి అన్నారు.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు) -
అందంగా రానా భార్య.. నేచురల్ బ్యూటీతో భాగ్యశ్రీ
అందంగా మెరిసిపోతున్న రానా భార్య మిహీకమేకప్ లేకుండా భాగ్యశ్రీ.. మే నెల జ్ఞాపకాలుబ్లాక్ డ్రస్లో గ్లామరస్గా ఐశ్వర్యా రాజేశ్మెరుపుతీగలా మారిపోయిన ఫరియా అబ్దుల్లాపలుచని చీరలో కుందనపు బొమ్మలా వైష్ణవిగౌరి కిషన్ హాట్నెస్.. చూపు తిప్పడం కష్టమే View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) -
యూట్యూబర్పై కేసు పెట్టిన యాంకర్ విష్ణుప్రియ
దాదాపు నెలరోజుల క్రితం ఇన్స్టా సబ్స్క్రిప్షన్ కారణంగా వార్తల్లో నిలిచిన యాంకర్ విష్ణుప్రియ.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. తోటి యూట్యూబర్పై హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. తన వ్యక్తిగత, వృత్తిపర జీవితంపై నిజాలు వక్రీకరిస్తూ వీడియోలు చేస్తున్నారని కంప్లైంట్లో పేర్కొంది.(ఇదీ చదవండి: అమ్మకానికి 'ఐమాక్స్'?)అసలేం జరిగింది?యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత బిగ్బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ప్రస్తుతానికైతే కొత్తగా ఎలాంటి సినిమాలు చేస్తున్నట్లు లేదు. పలు షోల్లో అడపాదడపా కనిపిస్తోంది. అయితే ఈమె అసభ్య వీడియోలతో యువతని పెడదారి పట్టిస్తోందని, సబ్స్క్రిప్షన్ పేరిట లక్షల రూపాయలు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది.అయితే ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని సోనాలి అనే తెలుగు యూట్యూబర్.. విష్ణుప్రియపై రోస్టింగ్ వీడియో చేసింది. ఈ క్రమంలోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు యూట్యూబర్పై నాలుగు రోజుల క్రితం మియాపుర్ పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇకపై ఏ యూట్యూబర్ అయినా తనని వేధించేలా వీడియోలు చేస్తూ ఇలానే కేసులు నమోదవుతాయని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. విష్ణుప్రియ కేసు పెట్టగానే సదరు యూట్యూబర్.. ఈమెకు సంబంధించిన వీడియోని డిలీట్ చేసింది!(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
అప్పట్లో స్టార్ హీరో.. పదేళ్ల గ్యాప్.. హిట్ పడుతుందా?
వడ్డే నవీన్.. ఇప్పటి సినీ ప్రియులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్కి బాగా పరిచయమున్న హీరో. అప్పట్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వడ్డే నవీన్ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మరో ప్రయత్నం చేశారు. 1997లో కోరుకున్న ప్రియుడు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఏమైందో తెలియదు కానీ 2010 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు అంటే 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. వడ్డే నవీన్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ కొడతాడా?దాదాపు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న మూవీ కావడంతో వడ్డే నవీన్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ హిట్ అయితే తనకు కూడా మంచి కమ్బ్యాక్ ఇచ్చినట్లు అవుతుంది. ఇటీవల కొందరు స్టార్స్ రీ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది హీరో రాజశేఖర్ సైతం బైకర్ మూవీతో మరోసారి వెండితెరపై మెరిశారు. ఈ చిత్రం ఆయనకు బాగానే కలిసొచ్చింది. ఇప్పుడు వడ్డే నవీన్ కూడా కమ్ బ్యాక్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ మూవీతో హిట్ పడితే వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమేనంటున్నాడు మన 90స్ హీరో. నవీన్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. -
హీరోగా టాలీవుడ్ హీరోయిన్ బాయ్ఫ్రెండ్.. సినిమా రివ్యూ
టైటిల్ : ఫస్ట్ టైంనటీనటులు: సౌరబ్ ధింగ్ర, అఖిల్ సార్థక్, అనిక్క విక్రమన్,గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం తదితరులునిర్మాత: హేమంత్ ఇప్పలపల్లిరచన-దర్శకత్వం: హేమంత్ ఇప్పలపల్లిసంగీతం: శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్, రామ్విడుదల తేది: మే 22, 2026టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రియుడు సౌరభ్ ధింగ్ర హీరోగా పరిచయమైన తెలుగు సినిమా 'ఫస్ట్ టైం'. హేమంత్ ఇప్పలపల్లి.. దర్శక నిర్మాతగా వ్యవహరించారు. 'బిగ్బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్ర చేశాడు. అనిక విక్రమన్ హీరోయిన్. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించారు. వీఎఫ్ఎక్స్ ఆధారంగా తీసిన ఈ మూవీ నేడు (మే 22) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)కథేంటి?2304 ఏడీలో ఏలియన్స్తో మొదలయ్యే ఈ సినిమా.. అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది? కొత్త భారతదేశం ఎలా తయారైంది అనే పాయింట్తో తెరకెక్కించారు. ఏలియన్లకు అప్పటి మానవులు ఈ కలియుగంలో జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ ఉంటారు. ఆద్య(అనికా విక్రమన్) ఇంజనీరింగ్ చదువుతుంటుంది. అదే కాలేజీలో చదువుతున్న రాహుల్(శివ కుమార్) ఎలాగైన ఆమెకు దక్కించుకోవాలనుకుంటాడు. మరోవైపు ఆద్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె బావ అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. అతనితో బలవంతంగా ఎంగేజ్మెంట్ జరిపిస్తారు. సోల్మేట్ దొరికితే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చని ఆద్య ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఆమెకు ఆది(అఖిల్ సార్థక్) పరిచయం అవుతాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ విషయం ఆద్య బావకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేమించిన ఆద్యను ఆది ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? భూమి మీద ఉన్న మనుషులంతా ఎందుకు చనిపోతుంటారు? ఆద్య, ఆదిలు మాత్రమే ఎలా బతుకుతారు? ఏలియన్స్కి ఈ కథలో ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో సౌరభ్ ధింగ్రని పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?ఇదొక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ సినిమా. 2304లో అంటే దాదాపు 300 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న కలియుగం అంతం అయితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు మళ్లీ మానవజాతిని సృష్టించడానికి భారతీయులు..అందులోనూ మన తెలుగువాడు కారణం అయితే ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా చూపించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అద్భుతంగా ఉంది. కానీ దాన్ని తెరపై చూపించడంతో మాత్రం కాస్త తడబడ్డాడు. ఒకవైపు ఏలియన్లు, సైంటిస్టుల ప్రయోగాలు, మరోవైపు ఆద్య జీవితంతో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఫస్టాఫ్ కాస్త గందరగోళంగా ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉండడంతో బోరింగ్గా అనిపిస్తుంది. అసలు కథ ఏంటి అనేది సెకండాఫ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరోగా పరిచయమైన సౌరభ్ ధింగ్రకి ఇదే తొలి సినిమా అయినా సరే బాగానే చేశాడు.అనికా విక్రమన్ నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భూపాల్ రాజు శివకుమార్గా అఖిల్ సార్థక్ పర్లేదనిపించాడు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా కూడా ఓకే. సాంకేతికగా సినిమా బాగుంది. ఈ సినిమాలో ఏఐ ఉపయోగించకుండా హ్యూమన్ ఇంటలిజెన్స్ మాత్రమే వాడడం ప్రత్యేకం. దర్శకనిర్మాత హేమంత్ ఇప్పలపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్లో మంచి ఔట్పుట్ ఇచ్చారు. గతంలో విఎఫ్ఎక్స్ అనుభవం ఉండటంతో హేమంత్ చక్కగా తీశారు. వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ వెంకట్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ పర్లేదనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. (ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
పెద్ది ఐటమ్ సాంగ్.. 50 రోజులు కష్టపడ్డాం..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. చెర్రీ సరసన కనిపించనుంది. తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు.తాజాగా ఈ పాటకు సంబంధించి గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం 50 రోజులు కష్టపడ్డానని అన్నారు. ఈ పాటలోని ప్రతి పదం అర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఆర్ రెహమాన్ బాణీలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. ఆయన బాణీలను అర్థం చేసుకోవడానికే కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫుల్ సాంగ్ మే 23న విడుదల కానుంది. -
పెద్ది ఐటమ్ సాంగ్.. ప్రోమోతోనే గూస్ బంప్స్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సూపర్ హిట్ ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.అంతేకాకుండా ఈ మూవీ ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. ఈ ఐటమ్ సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ల పరిశీలించిన మేకర్స్.. చివరికీ కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ను ఎంపిక చేశారు. ఈ సాంగ్లో రామ్ చరణ్ సరసన శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. హల్లల్లో హల్లల్లో అంటూ సాగే ఈ పాట ప్రోమో చూస్తుంటే మెగా ఫ్యాన్స్ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫుల్ సాంగ్ను మే 23న భోపాల్లో జరగనున్న ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారు. -
సడన్గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రైడే ఓటీటీల్లోనూ కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతుంటాయి. కొన్ని సినిమాలు ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాయి. మరికొన్ని సడన్గా ఓటీటీల్లో దర్శనమిస్తుంటాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.తాజాగా ఇవాళ ఎలాంటి హడావుడి లేకుండానే ఓ తెలుగు స్ట్రీమింగ్కు వచ్చేసింది. తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో వచ్చిన చిత్రం గాయపడ్డ సింహం. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా కథేంటంటే..దరహాస్(తరుణ్ భాస్కర్), గాయత్రి(మానసా చౌదరి) ప్రేమించుకుంటారు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని గాయత్రి తండ్రి కండీషన్ పెట్టడంతో.. దరహాస్ అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతాడు. వీసా తీసుకొని అమెరికాకి వెళ్లి.. 34 గంటల్లోనే తిరిగి వస్తాడు. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వెనక్కి వచ్చిన (డిపోర్ట్) భారతీయ విద్యార్థుల్లో దరహాస్ ఒకడు. తనను అమెరికాకు వెళ్లకుండా చేసిన ట్రప్పై దరహాస్ పగపడతాడు. ఎలాగైన ట్రంప్పై ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహితులతో చెబుతాడు. దరహాస్ టార్చర్ భరించలేక ఫ్రెండ్ ఒక సలహా ఇస్తాడు. అదేంటి? ట్రంప్పై పగ తీర్చుకోవడం సాధ్యమేనా? దరహాస్ పగకు మాఫియా డాన్ బ్రూటల్ ధర్మ(జేడీ చక్రవర్తి)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో భైరవ దాస్(శ్రీవిష్ణు), శాలిని(ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘పురుషః’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: పురుషఃనటీనటులు:బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్, రాయంచ కొక్కురనిర్మాత: బత్తుల కోటేశ్వరదర్శకత్వం: వీరు వులవలసంగీతం: శ్రవణ్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాలఎడిటింగ్: కోటివిడుదల తేది: మే 22,2026కథేంటంటే..గోవింద్ అలియాస్ బండ(పవన్ కల్యాణ్ బత్తుల),సత్తిబాబు అలియాస్ బొగ్గు(సప్తగిరి), శ్రీను అలియాస్ జంప్(కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. పెళ్ళైన తర్వాత ఈ ముగ్గురికీ తమ తమ భార్యలతో రోజూ చిన్న చిన్న గొడవలు అతుతుంటాయి. భర్తలపై అనుమానం పెంచుకున్న ఈ ముగ్గురు భార్యలు..నిత్యం వారిని టార్చర్ చేస్తుంటారు. అదే సమయంలో చిన్నప్పటి స్నేహితుడు కిస్సు(వెన్నెల కిశోర్) పెళ్లి కుదురుతుంది. ఈ ముగ్గరు తమ భార్యలతో కలిసి ఆ పెళ్లికి వెళ్తారు. అక్కడ యవ్వనంలో గోవింద్, సత్తిబాబు, శ్రీనులు కలిసి చేసిన కొన్ని చిలిపి పనుల గురించి భార్యలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రోజీ ఎవరు? గోవింద్ జీవితంలోకి ఆమె ఎలా వచ్చింది? కిస్సు రాసిన బుక్ ఈ ముగ్గురి కాపురాల్లో ఎలాంటి చిచ్చు పెట్టింది? విడాకుల కేసు ఏమైంది? చివరకు ఈ మూడు జంటలు మళ్లీ కలిశాయా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. భార్య బాధితుల కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘ఎఫ్ 2’ లాంటి సినిమాలు చాలా మంచి విజయం సాధించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్తో సినిమాలు రాలేదు. చాలా కాలం తర్వాత భార్య బాధితుల నేపథ్యంలో వచ్చిన చిత్రం పురుషః. ఓ రకంగా ఇది పెళ్లైన మగాడి బయోపిక్ అని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య గొడవలతో మొదలైన ఈ కథ చివరకు ‘భార్యల్ని యుద్దంతో కాదు.. ప్రేమతో గెలవాలి’ అనే సందేశంతో ముగుస్తుంది. సినిమా ప్రారంభంలోనే ముగ్గురు స్నేహితుల ఫ్యామిలో జరిగే గొడవలు.. కోర్టు కేసు సన్నివేశాలతో నవ్వులు పూయిస్తుంది. కోర్టులో విడాకుల కోసం వెళ్లిన ముగ్గురు స్నేహితలను అక్కడి న్యాయమూర్తి (వీటీవీ గణేష్) తన క్యాబిన్లోకి పిలుచుకొని వారి సమస్యలు ఏంటని అడగడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే భర్తలు కష్టాలు.. భార్యలు చేసే టార్చర్ చూస్తున్నంతసేపు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ఎఫ్ 2 లాంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు మనకు గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్ అంతా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ చేసే కామెడీతో సాగిపోతుంది.వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత కామెడీ మరింత పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథనం ఎక్కువగా గోవింద్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గోవింద్ ప్లాష్బ్యాక్, రోజీతో లవ్స్టోరీ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇక గొడవ అయిన ప్రతిసారి భర్తలు సూపర్ హీరోలుగా మారి వారితో యుద్ధం చేస్తున్నట్లుగా వచ్చే కామెడీ సీన్స్ కూడా అంతగా నవ్వించవు. చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని ప్రభావం కూడా అంతంత మాత్రమే.అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించరు. కానీ, ఆ ట్వీస్ట్ రివీల్ అయిన తర్వాత గత సినిమాలు గుర్తుకు వస్తాయి. ముగింపు బాగుంటుంది. ఎవరెలా చేశారంటే..పవన్ కల్యాణ్ కి ఇదే తొలి సినిమా. అయినా కూడా చాలా బాగా నటించాడు. భార్య చేతిలో ఇబ్బంది పడే భర్తగా, ఫ్లాష్ బ్యాక్ లో నిజాయితీగా ప్రేమించే లవర్గా రెండు డిఫరెంట్ వేరియేషన్ చూపించి మెప్పించాడు. స ప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ల కామెడీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. వెన్నెల కిశోర్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. భార్యలుగా నటించిన రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల, టీవీ గణేష్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ను కట్ చేసి ఉంటే సినిమా మరింత వేగంగా ఉండేది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
అందుకే బ్రేక్ వచ్చింది : వడ్డే నవీన్
వడ్డే నవీన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో వడ్డే నవీన్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు (నిర్మాత వడ్డే రమేష్) చనిపోయిన తర్వాత నేను నటించిన, నిర్మించిన తొలి చిత్రం ఇది. పదేళ్లుగా నేను సినిమాలు చేయకపోయినా నన్ను గుర్తు పెట్టుకున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. నేను ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉన్నాను. ఫ్యామిలీతో ఉంటున్నాను. నాకు బ్రేక్ ఎలా వచ్చిందంటే... నాకు నచ్చిన సినిమాలు రాలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలు నచ్చక నేను చేయలేదు. ఇలా రెండు విధాలుగా నాకు బ్రేక్ వచ్చింది. ఎన్నో కథలు విన్న తర్వాత ఈ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ కథ చెప్పారు కమల్. కథ, స్క్రిప్ట్పై మేం ఇద్దరం ఏడాది పాటు వర్క్ చేశాం. కంటెంట్ కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘పూరిగారి వద్ద పని చేసినప్పుడు ఇలాంటి ఓ మూమెంట్ కోసం చూశాను. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ నవీన్కు మంచి కమ్బ్యాక్ మూవీలా ఉంటుంది’’ అన్నారు కమల్ తేజ నార్ల. ‘‘ఇందులో నేను లక్ష్మీ అనే ΄ాత్రలో నటించాను’’ అని చె΄్పారు రాశీ సింగ్. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్. -
'రమణి కళ్యాణం' మూవీ రివ్యూ
టైటిల్: రమణి కళ్యాణం నటీనటులు: సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస రెడ్డి, యాంకర్ శ్యామల.. తదితరులునిర్మాణ సంస్థ: కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్నిర్మాతలు: విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాలరచన & దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డిడైలాగ్స్ : రామ్ జగదీశ్ సినిమాటోగ్రఫీ : అరవింద్ తిరుకోవెల సంగీతం : సూరజ్ S కురుప్ ఎడిటర్ : రవితేజ గిరజాల విడుదల తేది: మే 22, 2026ట్రైలర్, టీజర్స్ చూడగానే నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి మధ్య ప్రేమకథ అని తెలిసి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్ కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. ఎప్పుడో గతంలో ఇలా హీరో హీరోయిన్స్ కి ఆరోగ్య సమస్యలు ఉండటం, వాళ్ళ పేమకథలతో సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలైంది. మనలో ఏ లోపం ఉన్నా జీవితంలో ముందుకు వెళ్లడానికి అది అడ్డంకిగా మారకూడదు అనే పాయింట్ ని ఓ ప్రేమకథగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్స్ పాత్రల పరిచయం, వాళ్ళ స్నేహం, ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ ఎమోషనల్ సీన్ తో నెక్స్ట్ కిషోర్ ఏం చేస్తాడు అనే ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. ఈ సినిమాకి హీరోయిన్ పాత్రనే బాగా హైలెట్ చేసారు. తను అసలు బ్లైండ్ అనే విషయం మర్చిపోయి ధీమాగా బతుకుతుంది. తన యాక్సిడెంట్ వల్ల అసలు కారు ఎక్కదు. దాని గురించి గొడవే జరుగుతుంది. అలాంటిది ఆ భయం నుంచి ఎలా బయటపడింది తన ట్రామాకు సంబంధించిన సీన్స్ అన్ని బాగానే రాసుకున్నారు.మధ్యమధ్యలో కామెడీ ట్రై చేసారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇక హీరోయిన్ ఆర్జేగా మారడం ఓకే కానీ, ఆ ఆర్జే సీన్స్, ఆఫీసులో కిరాక్ సీతతో అక్కర్లేని సీన్స్ తో సాగదీశారు. అసలు కిరాక్ సీత పాత్ర ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. హీరో ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మనం ఊహించం. అయితే క్లైమాక్స్ మాత్రం రొటీన్ పాత సినిమాల్లో లాగా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేసారు. ఆ క్లైమాక్స్ ఇంటర్వెల్ సమయంలోనే ఊహించేయొచ్చు.ఇక హీరోయిన్ తో ఉండే ఆ నలుగురు పిల్లలు ఎవరు, ఆ బామ్మ ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రేమకథలో ఎమోషన్ ఇంకాస్తా పండాల్సింది. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయితో డ్రీమ్ సాంగ్స్ వేయడం ఇబ్బందిగా ఉండటమే కాక కథకు అడ్డంగా కూడా ఉంటుంది. ఇక ఈ సినిమా ఓ రెండు మూడేళ్ళ క్రితం షూటింగ్ జరుపుకున్న సినిమా అని అందులో ఉన్న కొంతమంది ఆర్టిస్టులను చూస్తే తెలిసిపోతుంది. హీరో హీరోయిన్స్ కి లోపాలు పెట్టి వల్ల మధ్య ప్రేమకథతో దర్శకుడు ఏదో మోటివేషనల్ మెసేజ్ ఇద్దామనుకున్నట్టు ఉంటుంది.ఎవరెలా చేశారంటే..దీప్షిక చంద్రన్ మాత్రం కళ్ళు లేని అమ్మాయి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సూర్య వశిష్ట కూడా సినిమా అంతా వీల్ చైర్ లోనే ఉండి బాగానే నటించాడు. ఎప్పుడూ నవ్వించే శ్రీనివాస రెడ్డి ఈసారి ఎమోషనల్ పాత్రలో మెప్పించాడు. లోహిత్ కుమార్, ప్రభావతి, చైతన్య జొన్నలగడ్డ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు అంతగా మెప్పించవు. ఎడిటింగ్ లో అక్కర్లేని సాంగ్, కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది. దర్శకుడు ఓ మోటివేషనల్ రాసుకున్న ప్రేమకథని ఇంకాస్త ఎమోషనల్ గా తెరకెక్కించాల్సింది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. -
ఇండియాలోనే బెస్ట్ స్క్రీన్ ప్లేగా నిలుస్తుంది: పోసాని కృష్ణమురళి
‘‘జర్నలిజం అన్నది ఎంతో బాధ్యతతో కూడుకున్నది. నిజాయతీ కలిగిన జర్నలిస్టులు ఉంటే సమాజానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రజలను, సమాజాన్ని కూడా చైతన్యవంతం చేసే శక్తి జర్నలిజానికి ఉంది. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రమే ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. జర్నలిస్ట్ అరుణా రెడ్డి పాత్రలో హిందోళ చక్రవర్తి అద్భుతంగా నటించారు. నేను ఇప్పటివరకూ సుమారు 100కు పైగా సినిమాలకు స్క్రీన్ ప్లే రాసి ఉంటాను. నా కెరీర్లోనే ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. నేను, నా భార్య కుసుమ లత కలిసి ఈ మూవీ స్క్రీన్ ప్లే రాశాం.ఇండియాలోనే బెస్ట్ స్క్రీన్ ప్లే చిత్రంగా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలను’’ అని పోసాని కష్ణమురళి తెలిపారు. ఆయన కీలక పాత్రలో నటించి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. హిందోళ చక్రవర్తి టైటిల్ రోల్ చేశారు. బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ ఇతర పాత్రలు పోషించారు. 3 ఇడియట్స్ మూవీస్ సమర్పణలో పోసాని కష్ణమురళి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి ‘సాక్షి’తో ఎక్స్క్లూజివ్గా చెప్పిన ఈ చిత్రం విశేషాలు ఈ విధంగా...ప్రేక్షకులు ఊహించలేరు శ్రీకాంత్ హీరోగా, ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నేను తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రం 2017 మే 31న విడుదలై 100 రోజులు ఆడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్గా నిలిచి, 100 రోజుల పోస్టర్ పడ్డ చివరి చిత్రం మా ‘ఆపరేషన్ దుర్యోధన’. ఆ తర్వాత ఏ సినిమా కూడా నాకు తెలిసి 100 రోజులు ప్రదర్శించబడలేదు. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ టైటిల్ చూడగానే ‘ఆపరేషన్ దుర్యోధన’కి సీక్వెల్ తీశారేమో అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు ఎలాంటి పోలిక లేదు... సీక్వెల్ అస్సలు కానే కాదు. సమాజంలో నేను చూసిన, విన్నటువంటి పలు వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ రాశాను. నేను, నా భార్య కలిసి స్క్రీన్ ప్లే రాశాం. ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ప్రేక్షకులు ఊహించలేరు. కొత్తవారికి ఎలాంటి ఇమేజ్ ఉండదు ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ సినిమా కోసం అందర్నీ కొత్త వారినే తీసుకున్నాను. వారికి జనాల్లో ఎలాంటి ఇమేజ్ ఉండదు కాబట్టి ఆయా పాత్రలతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. నిజాయతీ కలిగిన జర్నలిస్ట్ అరుణా రెడ్డి పాత్రలో హిందోళ చక్రవర్తి నటించారు. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారు? వ్యాపారాలు చేయడం, డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎవరు వచ్చారు? అన్నది ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆమె హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు? సరైన నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజాలను నిర్భయంగా మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదని కొందరు కుట్ర పన్ని, అరుణా రెడ్డి రోడ్డున పడే పరిస్థితి తీసుకొస్తారు.ఈ నేపథ్యంలో నిజాయతీ కలిగిన ఇలాంటి వారు జర్నలిజంలో ఉండాలని నిజాయతీపరుడైన ముఖ్యమంత్రి అండగా నిలబడి, సాయం చేస్తాడు. నేను అడగ్గానే సీఎం పాత్రలో నటించేందుకు ఒప్పుకున్న ఎంపీ రఘునందన్ రావుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజ జీవితంలోనూ ఆయన వాస్తవాలను మాట్లాడుతూ, నిజాయతీగా ఉంటారు కాబట్టే ముఖ్యమంత్రి పాత్రలో ఆయన్ని నటింపజేశాను. అప్పుడు ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రంలో సీఎం పాత్రలో మోత్కుపల్లి నరసింహులు అన్నని నటింపజేశాను. నటుడిగా ఆయనకు అదే తొలి చిత్రం.నటించేందుకు సిద్ధంనేను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. అందులో ఎలాంటి దాపరికాలు ఉండవు. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ సినిమాని నేను ఎవరిపైనో సెటైరికల్గా తీశాననుకుంటున్నారు. అందులో వాస్తవం లేదు. వంద శాతం నిజాయతీగా తీసిన చిత్రం ఇది. ఈ సినిమాకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్... ఇలా అన్ని పార్టీల వారు ఈ చిత్రాన్ని నిరభ్యంతరంగా చూడొచ్చు. ఎందుకంటే అన్ని వర్గాల వారికి నచ్చే సినిమా ఇది. పైగా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు.ఈ చిత్రాన్ని కుదిరితే ఈ నెలాఖరులో లేదంటే జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను. ఇకపై నా దర్శక–నిర్మాణంలో కుదిరితే ఏడాదికి రెండు సినిమాలు తీస్తాను... లేకుంటే కనీసం ఒక్క చిత్రం అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను. ప్రస్తుతం ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అనే మూవీ కోసం లైన్ అనుకున్నాను. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ విడుదల తర్వాత ఓ నెల గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ స్క్రిప్ట్ని మొదలు పెడతాను. ఈ మూవీలో నాతో పాటు కొత్తవారు నటిస్తారు. నా పాత్ర నచ్చితే ఎవరి సినిమాలో అయినా నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం కొందరు రచయితలు–దర్శకులు నన్ను సంప్రదిస్తున్నారు. తొలిసారి పాటలు రాశాను‘ఆపరేషన్ అరుణారెడ్డి’ చిత్రంలో ఓ పార్టీ అధ్యక్షుడి తనయుడి పాత్రను నేను చేశాను. నా పాత్రతో పాటు హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ ... ఇలా అన్ని పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రానికి మహదేవ్ ఎలేందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. భవిష్యత్తులో తను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా కోసం తొలిసారి నేను రెండు పాటలు రాశాను. చాలా సరళమైన పదాలతో ఆ పాటలు అందరికీ అర్థం అయ్యేలా ఉంటాయి. కెమెరామేన్ సుధాకర్ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన పనిని వెండితెరపై చూస్తారు.– డేరంగుల జగన్ మోహన్ -
చెప్పని కథ
సురేష్, రూప హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆత్మకథ’. ‘యాన్ అన్టోల్డ్ స్టోరీ’ (ఓ చెప్పని కథ) అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ బండ్రెడ్డి దర్శకత్వంలో వారాహి ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సోమేష్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ను లాంచ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో చాలా ధైర్యంగా శ్రీనివాస్గారు ఓ మంచి కథ చెబుతున్నారు. సురేష్ మంచి నటుడు.ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఆత్మకథ’ చిత్రంతో మెయిన్ హీరోగా మారాను. ఒక ఇంట్లో జరిగే కథగా రూపొందిన సినిమా ఇది. కామన్ మ్యాన్ భావోద్వేగాలు, భయం, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చె΄్పారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు శ్రీనివాస్ గుండ్రెడ్డి. ‘‘దర్శకుడు ఈ కథ చెప్పి, ఇందులో ఆత్మ మీరే అన్నారు. దీంతో సినిమాలో నేను కనిపిస్తానా? అనుకున్నాను. కానీ ఈ సినిమా కథ అంతా నా చుట్టూ తిరుగుతుంది’’ అని తెలిపారు సమ్మెట గాంధీ. -
ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణ వృథా
జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఒక భారీ సర్ప్రైజ్ ఉంటుందని ఎదురుచూశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'ను అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే దానిపై సితార ఎంటర్టైన్మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆయన ఎక్స్ హ్యాండిల్లో మాత్రం ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. "త్వరలోనే సెట్స్పై కలుద్దాం" అంటూ పోస్టు పెట్టారు. అదే సమయంలో 'డ్రాగన్ గ్లింప్స్' వీడియోను కూడా ట్యాగ్ చేశారు. ఈ పరిణామంతో తారక్ అభిమానులు నిరాశ చెందారు. ఆయన పుట్టినరోజు నాడు 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ ప్రకటిస్తారని అభిమానులు ఆశించారు. దానికోసం వారు పదేపదే నాగవంశీ సోషల్మీడియా హ్యాండిల్ను తనిఖీ కూడా చేశారు. 'గాడ్ ఆఫ్ వార్' కోసం వందలాది పోస్టులు కూడా చేశారు. కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రాగన్ గ్లింప్స్ విడుదల సమయంలో మరో సినిమా ప్రకటించడం వల్ల ఆ ప్రాజెక్ట్పై ఉన్న బజ్ తగ్గిపోతుందనే ఆలోచనతో నాగవంశీ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ను మరో మంచి రోజున ప్రకటించాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్ద ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు. -
వైట్ డ్రెస్లో మౌనీ రాయ్.. స్పెయిన్ వీధుల్లో ఆషిక..!
కర్రసాము చేస్తోన్న సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి ..వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ అందాలు..స్పెయిన్ వీధుల్లో ఆషిక రంగనాథ్ చిల్.. ఎల్లో శారీలో బిగ్బాస్ రీతూ చౌదరి అందాలు.. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్కరోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఎప్పటిలాగే ఉంటుంది. ఈ గురువారమే మోహన్ లాల్ దృశ్యం-3 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఫ్రైడే చిన్న సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే దురంధర్ అన్కట్ వర్షన్ కూడా వచ్చేస్తోంది. దీంతో పాటు హిందీ సినిమా సిస్టమ్, మధువిదు లాంటి మలయాళ సినిమా కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ఈ శుక్రవారమే సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్.. లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22 దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22 మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22 దురంధర్(అన్కట్ వర్షన్)- మే 22 గబ్బీస్ డాల్హౌస్(హాలీవుడ్ మూవీ)- మే 22 గోట్(యానిమేషన్ మూవీ)- మే 24 బ్యాడ్ థాట్స్- సీజన్ 2- మే 24అమెజాన్ ప్రైమ్- సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 ది బ్రైడ్(హాలీవుడ్ మూవీ)- మే 22సన్ నెక్ట్స్.. బీష్మార్(మలయాళం సినిమా)- మే 22 శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్స్టార్.. స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22 దురంధర్(అన్కట్ వర్షన్)- మే 22జీ5 వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22 మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22 సత్రంగి బద్లే కా ఖేల్(హిందీ సినిమా)- మే 22సోనీలివ్.. మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే.. పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22ఎంఎక్స్ ప్లేయర్..వు ఈజ్ యువర్ గైనాక్?- సీజన్ 2(బాలీవుడ్ సిరీస్)- మే 22 -
విరోష్ వెడ్డింగ్.. ఆ సీక్రెట్ రివీల్..!
ఈ ఏడాది టాలీవుడ్లో జరిగిన బిగ్గెస్ట్ గ్రాండ్ వెడ్డింగ్ విరోష్ జంటదే. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పెళ్లికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ ప్రియ మాగంటి ఓ సీక్రెట్ రివీల్ చేశారు. రష్మిక తన మంగళసూత్రాన్ని స్వయంగా డిజైన్ చేసుకున్నారని తెలిపారు. ట్రెండ్ను ఫాలో కావాలని విరోష్ జోడీ ముందు నుంచే అనుకోలేదన్నారు. దుస్తులు, ఆభరణాల నుంచి అన్నీ రొటీన్కు భిన్నంగా ప్లాన్ చేసుకున్నారని వెల్లడించారు. వీరిద్దరు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే వీరిద్దరు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
డ్రాగన్ కష్టాలు.. ఆ లుక్ కోసం ఇంత చేశారా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్ల్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ మూవీలో తన లుక్ కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గారని సమాచారం. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే బరువు తగ్గాల్సి ఉంటుందని ఎన్టీఆర్తో చెప్పానని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మరింత బలహీనంగా, పాలిపోయినట్లుగా కనిపించారని నీల్ అన్నారు. ఈ శారీరక మార్పు చూసి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారని దర్శకుడు వెల్లడించారు.ఏడాదిన్నర క్రితమే ప్లాన్..దాదాపు ఏడాదిన్నర క్రితం 'డ్రాగన్' లుక్ టెస్టుల సమయంలోనే ఈ మార్పు మొదలైందని దర్శుకుడు వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ పోషించిన లూగర్ పాత్ర గురించి చర్చిస్తున్నప్పుడు కండలు తిరిగిన యాక్షన్ హీరో లుక్ కంటే.. సన్నని శరీరాకృతి ఆ పాత్రకు బాగా సరిపోతుందని డైరెక్టర్ అన్నారు. అందువల్లే ఈ రోల్ కోసం కొంచెం బరువు తగ్గమని మాత్రమే తాను సూచించానని.. కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి అంకితభావంతో ఆ సవాలును స్వీకరించారని ప్రశాంత్ నీల్ చెప్పారు. ముఖ్యంగా తన ఫిట్నెస్ పూర్తిగా దృష్టి పెట్టడానికి దాదాపు నాలుగు నెలల పాటు అన్ని షూటింగ్ కార్యక్రమాలకు విరామం ఇచ్చినట్లు సమాచారం. కఠినమైన ఆహార ప్రణాళిక, తీవ్రమైన వర్కౌట్ సెషన్లు, నిశితమైన వైద్య పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని డైరెక్టర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బలహీనంగా.. పాలిపోయినట్లు కనిపించడంతో చాలాసార్లు ఆపేయమని చెప్పానని.. అయినా కూడా అతను వినలేదని దర్శకుడు పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ లుక్పై చాలా రూమర్స్ వచ్చాయి. ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే మందుల వాడారని వార్తలొచ్చాయి. కానీ వీటన్నింటినీ టీమ్ ఖండించింది. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పోషణతోనే ఇది సాధ్యమైందని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా, రుక్మిణి వసంత్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 2027లో థియేటర్లలో విడుదల కానుంది. -
'పదేళ్లలో 55 ట్రాన్స్ఫర్స్'.. త్రిమూర్తులు టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అప్పట్లో పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ కొన్నేళ్ల తర్వాత కనుమరుగైపోయాడు. మళ్లీ గ్రాండ్గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల విరామం హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమాకు కమల్తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీసింగ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఓ కానిస్టేబుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినని రెబల్ కానిస్టేబుల్గా పాత్రలో వడ్డే నవీన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అభిమాని కల నిజం చేసిన హీరో రామ్..!
aటాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని కలను నిజం చేశారు. ఎప్పటికైనా తనను కలవాలని ఆరాటపడుతున్న వీరాభిమాని కోరికను నెరవేర్చాడు. 18 ఏళ్లుగా 'ఫ్రీడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానితో మాట్లాడిన రామ్ తనకు ధైర్యం చెప్పారు. అప్యాయంగా పలకరించిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో రామ్ చేసిన పనిపై టాలీవుడ్ సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాల విషయానికొస్తే ఆయన తొలిసారి మెగా ఫోన్ పట్టనున్నారు. రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెలలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్గా మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.Tollywood actor Ram Pothineni showed his kind-hearted nature Fulfilling the dream of a die-hard fan battling the rare disease ‘Friedreich’s Ataxia’ for 18 years, Ram personally visited her home, spent time with her, and offered emotional support. #RamPothineni #Tollywood pic.twitter.com/7Fge86Xk58— Telangana Ahead (@telanganaahead) May 21, 2026 -
మరో ఓటీటీలో మెగా కోడలి సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ తేజ్ సతీమణి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం సతీ లీలావతి. పెళ్లి తర్వాత లావణ్య చేసిన మూవీ ఇదే కావడం విశేషం. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆదరణ లేకపోవడంతో కేవలం 12 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ వేదికగా ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ సన్ నెక్ట్స్లోకి వచ్చేసింది. ప్రస్తుతం రెండు ఫ్లాట్ఫామ్స్లోనూ అడియన్స్కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ప్రేమ, పెళ్లి, విడాకుల అనే అంశాలతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.సతీ లీలావతి కథేంటంటే..లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్. ఇంట్లో పెరెంట్స్ తరచూ గొడవలు పడడంతో చిన్నప్పటి నుంచి ఆమెలో ఓ భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు(దేవ్ మోహన్)ని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారి, నాన్న(నరేశ్) అనుమతిలో పెళ్లి కూడా చేసుకుంటుంది. మూడేళ్ల పాటు చక్కగా కాపురం చేసిన రామ్.. ఉన్నపళంగా విడాకులు కోరతాడు.ప్రస్తుతం తాను నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)తో రిలేషన్లో ఉన్నానని.. విడాకులు ఇస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. విడిపోవడం ఇష్టంలేని లీలావతి..భర్తను కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సేతు నేపథ్యం ఏంటి? నర్స్ నికోల అతని జీవితంలోకి ఎలా వచ్చింది? భర్తను దక్కించుకునేందుకు లీలావతి ఏం చేసింది? లాయర్ తమలపాకుల(వీటీవీ గణేష్)కు ఆమె చెప్పిన అబద్దం ఏంటి? ఆమెకు దొంగ(సప్తగిరి), నిర్మాత మొట్ట రాజర్(మొట్ట రాజేంద్రన్) ఎలాంటి సహాయం చేశారు? చివరకు లీలావతి-రామ్సేతు విడాకులు తీసుకున్నారా ? లేదా తిరిగి ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. Pellam. Problems. Pralayam 🔥And somehow all three feel the same 😭Get ready to witness a husband struggling to survive marriage 🤞🏼#SathiLeelavathi streaming now on JioHotstar! 💫#SathiLeelavathiOnJioHotstar @Itslavanya @ActorDevMohan @SatyaTatineni @ddp_offl #NaagaMohan… pic.twitter.com/P3ppgSd75k— JioHotstar Telugu (@JioHotstarTel_) May 21, 2026 -
'మా పాపను కూడా ఎత్తుకోలేకపోయా..': రామ్ చరణ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రీడ ఆడాలన్నా పెద్దినే అనే స్పోర్ట్స్ కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో సీన్ల గురించి వివరించారు. ఇసుకలో, ఎండలో షూటింగ్ చాలా కష్టంగా అనిపించలేదా అని బుచ్చిబాబ.. చెర్రీని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదన్నారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయానని తెలిపారు.మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారని రామ్ చరణ్ అన్నారు. వాళ్లు నటించమంటే.. రియల్గా ఆడేస్తున్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. తర్వాత మళ్లీ సారీ చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని చెర్రీ వివరించారు. యాక్టింగ్ చేయమంటే వారికి అది రాదని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్లో మెప్పించనుంది. -
రికార్డు సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం డ్రాగన్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ బర్త్డే సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి డ్రాగన్ గ్లింప్స్ వదిలారు. సాధారణంగా గ్లింప్స్ అనగానే చాలా తక్కువ నిడివితో ఉన్న వీడియోను వదులుతారు. కానీ డ్రాగన్ యూనిట్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కథ గురించి, హీరో ఉన్న సామ్రాజ్యం గురించి చూపించారు. అలాగే విలన్స్ను హైలైట్ చేశారు.గ్లింప్స్ రికార్డుఎన్టీఆర్ను క్రూరమైన పాత్రలో చూపించారు. 'పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఈ గ్లింప్స్ వీడియో అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ గ్లింప్స్ వీడియోకు 24 గంటల్లో ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్ రాలేదంటూ పోస్టర్ వదిలింది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సినిమాడ్రాగన్ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్ కథానాయికగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అషుతోష్ రానా, అన్షుమాన్ పుష్కర్, సిద్దాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. Records were never safe from #DRAGON 🐉🔥#DragonGlimpse pic.twitter.com/6omRXL8JCb— Dragon (@DragonMovieOffl) May 20, 2026 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లకు పొగరు: డ్యాన్సర్ -
#Mega158: చిరు-బాబీ మూవీ 'మెగా' లాంచ్
'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి- బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం #Mega158 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా గురువారం ఉదయం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు చిరంజీవి సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి కొబ్బరికాయ కొట్టి క్లాప్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్రాజు, బండ్ల గణేశ్, వివి. వినాయక్, మెహర్ రమేశ్, వశిష్ట తదితరులు హాజరయ్యారు. మెగా డాటర్స్ సుస్మిత కొణిదెల, నిహారిక సైతం ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుంది. తను కూడా పూజా కార్యక్రమంలో తళుక్కుమని మెరిసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్గా వ్యవహరించనున్నాడు. #KVNTeluguDebut - #Mega158 is going to be THE BIGGEST LAUNCH EVER in INDIAN CINEMA with three towering personalities coming together💥⚡MEGASTAR @KChiruTweetsxPOWER STAR @PawanKalyanxMEGA POWER STAR @AlwaysRamCharanWatch #ChiruBobby2 Pooja Ceremony Live now❤️🔥--… pic.twitter.com/nt2oA36JN7— KVN Productions (@KvnProductions) May 21, 2026 A new wave of charm joins the MEGA storm 🌪️❤️🔥Welcoming the lovely #AnaswaraRajan to the world of #Mega158 💥#KVNTeluguDebut - #ChiruBobby2 Launched Grandly 🔥A @dirbobby Film 🪓Megastar @KChiruTweets #VenkatKNarayana @MusicThaman @vijaykartikdop @AntonyLRuben @artkolla… pic.twitter.com/xBmHzSlpFH— KVN Productions (@KvnProductions) May 21, 2026 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లు పొగరుగా ప్రవర్తించారు: డ్యాన్సర్ -
మంచు మనోజ్కి మరో కీలక పాత్ర.. ఆ సీనియర్ హీరోతో ఢీ
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. -
'డ్రాగన్', 'పెద్ది'.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి?
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరోజు వ్యవధిలో రెండు అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'పెద్ది' ట్రైలర్ విషయానికొస్తే.. మాస్ మూమెంట్స్, పంచ్ డైలాగ్స్ లాంటి వాటికంటే స్టోరీ ఎలా ఉండబోతుందనేది ఫోకస్ చేసి చూపించారు. మెగా అభిమానులు సంతృప్తి చెందారు కానీ సగటు ఆడియెన్స్కి మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. యాక్టింగ్ పరంగా చరణ్ని వంకపెట్టడానికి లేదు గానీ మాస్ మూమెంట్స్ లాంటివి ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేశారు. అవి లేకపోవడంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందన్నట్లు టాక్ వినిపిస్తోంది. భోపాల్, హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేయొచ్చంటున్నారు. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.'డ్రాగన్' విషయానికొస్తే ఇందులోనూ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ లాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. డ్రగ్ మాఫియా, అందులోని విలన్స్ని చూపించారు. ఎన్టీఆర్ కూడా అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. కానీ ట్రైలర్లో అందుకు సంబంధించిన యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ లాంటి వాటికి పెద్దగా చోటివ్వలేదు. మూవీ థియేటర్లలోకి రావడానికి మరో ఏడాది సమయముంది కాబట్టి ఇకపై రాబోయే ప్రమోషనల్ కంటెంట్లో ఫైట్ సీన్స్ లాంటివి ఉండే అవకాశముంది.ఈ రెండింటిని పోల్చి చూడలేం గానీ రెండింటికి యునానిమస్ టాక్ అయితే రాలేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పలేదు. కొందరికి విపరీతంగా నచ్చేశాయి. మరికొందరికి మాత్రం ఓ మాదిరిగా మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే స్పందన వస్తోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు) -
ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు
కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం తారక్ చాలా బక్కచిక్కిపోయాడు. గతంలో పలు ఈవెంట్స్లో అలానే కనిపించాడు. అయితే అంతలా బరువు తగ్గిపోవడానికి కారణాన్ని ఇన్నాళ్లకు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో చెప్పాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'మూవీ షూటింగ్ మొదలుపెడదామనగా.. ఎన్టీఆర్ని కొంచెం సన్నబడమని చెప్పాను. కానీ ఆయన మాత్రం నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. తారక్ భార్య, తల్లి, ఫ్రెండ్సే కాదు నా టీమ్ కూడా నన్నే తిట్టారు. నేనే ఇదంతా చేశానని అన్నారు. ఎందుకంటే మరీ బక్కగా, బలహీనంగా కనిపించాడు. నేను కూడా చాలాసార్లు ఇక సరిపోతుంది ఆపేయమని చెప్పా. అయినా వినలేదు''కథ కోసం, తన పాత్ర కోసం ఎన్టీఆర్ని ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆయనని ఆపడం చాలా కష్టం. ఇంత పట్టుదల గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, వ్యక్తిగతంగా సమస్య ఉందని వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. పాత్ర కోసం పడిన కష్టమే అది' అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు.వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఆఫ్గాన్ డ్రగ్ మాఫియా కంపెనీలో పనిచేసే నరహంతకుడిగా కనిపించబోతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. అనిల్ కపూర్, జిబు మేనన్, ఖుష్బూ, అశుతోష్ రాణా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. అతిపెద్ద దేశభక్తి సినిమా: ప్రశాంత్ నీల్)#PrashanthNeel says, 'We spent four months looking at him ( #NTR ) suffer.'“I told him that if you became THINNER for the role of the assassin, it would help.His wife, his mother, all his friends and my whole team were UPSET with me.” pic.twitter.com/FpJ7Puj0BW— Whynot Cinemas (@whynotcinemass_) May 20, 2026 -
జాన్వీ తుంటరి లుక్.. రితికా నాయక్ గ్లామర్
హెయిర్ పట్టుకుని జాన్వీ తుంటరి లుక్వయ్యారాలతో గ్లామరస్గా రితికా నాయక్అందంగా సోయగాలు చూపిస్తున్న నభాతెల్లని చీరలో మాయ చేసేలా మాళవికకృతి శెట్టి క్యూట్ అండ్ స్వీట్ పోజులుగ్లామర్ డోస్ పెంచేసిన సయీ మంజ్రేకర్ View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) -
ఈ సినిమాతో మా అబ్బాయి సిగ్గు పోతే చాలు: నిర్మాత
సినిమా ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. హీరో అవ్వాలన్న నా కలని మా అబ్బాయి ద్వారా నెరవేర్చుకున్నాను. మా అబ్బాయికి ఉన్న సిగ్గు, బిడియం కూడా ఈ సినిమాల వల్ల పోతుంది. అందుకే మా కొడుకుని హీరోగా చేశాను’ అన్నారు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడకు వచ్చాక అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలోకి రావడం మంచి పరిణామంగా అనిపిస్తోంది.→ దర్శకుడు వీరుతో కంటే ముందు ఓ దర్శకుడితో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. ఆ తరువాత సతీష్ ముత్యాల ద్వారా వీరు పరిచయం అయ్యాడు. ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మా కన్స్ట్రక్షన్ ఆఫీస్నే సినిమా ఆఫీస్గా మార్చాం.→ ‘పురుష:’ కథ చాలా బాగుంటుంది. ఆయన నెరేషన్ ఇచ్చిన తీరు కూడా డిఫరెంట్గా ఉంది. ఇందులోని లవ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఏదో ఒక భారీ సినిమా తీసేయాలనే కోరిక అయితే నాకు లేదు. మా అబ్బాయికి ఉన్న బిడియం, సిగ్గుని పోగొడితే చాలు అని నాకు అనిపించింది. డబ్బుల కోసం అయితే మూవీ తీయలేదు. లాభాలు ఆశించడం లేదు.→ ఈ చిత్రంలో వీటీవీ గణేష్ పాత్ర అందరినీ నవ్విస్తుంది. ఆయన మాకు ఎంతో సహకరించారు. డేట్స్ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. వెన్నెల కిషోర్ వల్లే కథలో సంఘర్షణ వస్తుంది. సప్తగిరి అద్భుతంగా నటించారు. కసిరెడ్డి గారు చక్కగా నటించారు. మా హీరోయిన్లు అందంగా కనిపించడమే కాకుండా తెరపై చక్కగా నటించారు. అనంత శ్రీరామ్ పాత్ర చాలా స్పెషల్గా ఉంటుంది. మా అబ్బాయి గురించి నేను చెప్పను. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ చెప్పాలి.→ ఈ సినిమాని మొత్తంగా మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మే 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. థియేటర్లో హాయిగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది.→ మా అబ్బాయికి నేను ముందుగానే మాట ఇచ్చాను. మూడు సినిమాలు చేస్తానని చెప్పానని. అప్పటి వరకు మా వాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఓకే. లేదంటే మళ్లీ మా ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని ముందే చెప్పాను. అలా నేను మా వాడితో కచ్చితంగా నాకున్న స్థోమతలో మూడు సినిమాలు అయితే చేస్తాను. -
ఎన్టీఆర్ అడిగిన ప్రశ్న.. సమాధానానికి నాకు మూడేళ్లు పట్టింది
ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అభిమానులకు నచ్చేయగా సాధారణ ప్రేక్షకులకు మాత్రం సరైన యాక్షన్ ఏదో మిస్ అయిందే అని ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్ కూడా నడుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతుల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో బోలెడన్ని విశేషాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)'ఐదేళ్ల క్రితమే ఈ మూవీకి సంబంధించిన కోర్ ఐడియాని ఎన్టీఆర్కి చెప్పా. అయితే 'ఆ క్యారెక్టర్ చేసే విపరీతమైన పనుల వెనక పక్కా కారణం, బలమైన డ్రామా ఉందా?' అని నన్ను అడిగారు. దీంతో ఆ పాత్ర ప్రవర్తన, అది చేసే పనులు జస్టిఫై చేయడానికి.. దాని వెనకున్న బలమైన కారణాన్ని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడానికి నాకు, నా టీమ్కి మూడేళ్లు పట్టింది. ఇదంతా సిద్ధమైన తర్వాత.. నేను రెడీ అని తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇంతటి స్టార్డమ్ ఉన్న ఓ హీరో, ఇలాంటి పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం చాలా కఠిన నిర్ణయం. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకులకు ఆ విషయం అర్థమవుతుంది''ఇది చాలా డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు నేను రాసిన అన్ని పాత్రల కంటే అత్యంత క్రూరంగా ఉంటుంది. నా ట్రయాలజీ(కేజీఎఫ్, సలార్)లో.. ఈ జానర్లో 'డ్రాగన్' చివరి సినిమా. ఈ మూడు ఒకేలా కనిపించడానికి కలర్ కారణం. కానీ మూడు వేర్వేరు స్టోరీలు. దీని తర్వాత కలర్ఫుల్ మూవీస్ చేస్తా. మైథాలజీ ఆధారంగా ఓ కథ రాశాను. ప్రస్తుతం ఒప్పుకొన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాన్ని సినిమాగా తీస్తాను. 'డ్రాగన్' ద్వారా అతిపెద్ద దేశభక్తి సినిమాని అందించబోతున్నాను' అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.డ్రాగన్.. దేశభక్తి సినిమా అని ప్రశాంత్ నీల్ అనగానే ఎదురుగా ఉన్న యాంకర్ కూడా షాకయ్యారు. అసలు ఈ సమాధానం ఊహించలేదని చెప్పుకొచ్చారు. మరి డైరెక్టర్ చెప్పినట్లు ఎలాంటి దేశభక్తి చూపిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఆగాల్సిందే. ఇందులో ఎన్టీఆర్తో పాటు అనిల్ కపూర్, బిజు మేనన్, ఖుష్బూ, రుక్మిణి వసంత్, అశుతోష్ రానా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?) -
ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్
అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చేసింది. నాలుగున్నర నిమిషాల వీడియోతో అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. 'డ్రాగన్' ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఒపియమ్ అనే మొక్క, దీని ద్వారా వచ్చే హెరాయిన్.. దీని చుట్టూ ఉండే మాఫియా బ్యాక్డ్రాప్ ఇందులో చూపించబోతున్నారు. అయితే ఇందులో ఏకంగా ఎనిమిది విలన్స్ కనిపించడం అందరికీ షాకిచ్చింది. అసలు వీళ్లెవరు? ఏ ఇండస్ట్రీకి చెందినవాళ్లు? ఏయే సినిమాలు చేశారు? వాళ్ల వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఫ్రెండ్స్ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!)మొదటగా ఎన్టీఆర్ విషయానికొస్తే.. పేరుకే హీరో అయినప్పటికీ విలనీ టచ్ ఉన్న లూగెర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన హంతకుల ముఠాకు నాయకుడిగా నటించాడు.మొత్తం ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ బాస్ అయిన దాదా సర్కార్ పాత్రలో తెలుగు, తమిళ, హిందీలో గతంలో పలు సినిమాలు చేసిన అశుతోష్ రాణా నటించాడు. తెలుగులో ఈయన వెంకీ, బంగారం, బలుపు, తడాఖా, పటాస్ తదితర మూవీస్ చేశాడు. ముంబైకి చెందిన ఇతడు ఎక్కువగా హిందీ మూవీస్ చేశాడు.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో సెకండ్ ఇన్ కమాండ్ అయిన సుజోయ్ సర్కార్ పాత్రని అన్షుమాన్ పుష్కర్ అనే హిందీ నటుడు చేశాడు. ఇతడో సీరియల్ నటుడు. 2018 నుంచి హిందీ సీరియల్స్ చేస్తున్నాడు. 12th ఫెయిల్, మాలిక్ లాంటి మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో వాజిర్ అయిన బాబీ సర్కార్ పాత్రలో సిద్ధాంత్ గుప్తా కనిపించబోతున్నాడు. ఇతడు కూడా హిందీలో సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ పాత్ర కోసమే తొలుత మలయాళ హీరో టొవినో థామస్ని అడిగారని అంటున్నారు. బాబీ సర్కార్, లూగెర్.. అన్నదమ్ముల పాత్రలట.ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో రావ్ అనే అకౌంటెంట్ పాత్రని తమిళ నటుడు గురు సోమసుందరం చేశాడు. ఇతడు గతంలో తెలుగులో చీకటిరాజ్యం, స్కార్క్ లైఫ్ చిత్రాల్లో నటించాడు. కానీ మలయాళ మూవీ 'మిన్నళ్ మురళి' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ద ట్రైనర్ పాత్రలో 'ధురంధర్'లో షిరానీ సాబ్గా నటించిన బిమల్ జీత్ ఒబెరాయ్ కనిపింతబోతున్నాడు. ఇతడికో పెద్ద సైన్యమే ఉండబోతుంది. ముంబైకి చెందిన ఇతడు గతంలో పీకే, టైగర్ 3 చిత్రాల్లోనూ కనిపించాడు గానీ 'ధురంధర్' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.రష్యన్ డిస్ట్రిబ్యూటర్ విక్టర్ మేన్స్కోవ్ పాత్రలో రష్యన్ నటుడు అలెగ్జాండర్ మిజేవ్, సోమాలియా నియంత జనరల్ దురాన్ పాత్రలో బ్రిటీష్ నటుడు బెన్డిక్ట్ పాల్ గారెట్, ఆఫ్రికా-యూరప్ డిస్ట్రిబ్యూటర్ బిలే క్సెర్సీ పాత్రలో దక్షిణాఫ్రికా నటుడు తుతేలో ప్రిన్స్ గ్రాట్బూమ్ కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చెప్పినవన్నీ విలన్ పాత్రలే.వీళ్లతో పాటు ఆఫ్గానిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహ్మాన్ పాత్రలో మలయాళ ప్రముఖ నటుడు బిజు మేనన్ కనిపించబోతున్నారు. ఈయన గతంలో తెలుగులో 'రణం', ఖతర్నాక్ మూవీస్లో నటించారు. ఓటీటీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈయన కాస్త సుపరిచితమే.అలానే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్(ఇండియా) రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించారు. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా చేశారు. రీసెంట్ టైంలో 'యానిమల్' మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిజు మేనన్, అనిల్ కపూర్వి 'డ్రాగన్'లో పాజిటివ్ పాత్రలనిపిస్తోంది.పైన చెప్పిన నటులతో పాటు ఈ మూవీలో తమిళ నటి ఖుష్బూ కూడా నటించింది. గ్లింప్స్లో విలన్స్ అందరి గురించి చెప్పే పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది గానీ ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు. వీళ్లతో పాటు రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, శత్రు తదితరులు ఇతర సహాయ పాత్రలు చేశారు.ప్రస్తుతం రిలీజ్ చేసిన గ్లింప్స్లో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అందులో విలన్స్ని మాత్రమే చూపించారు. గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ, అందులో విలన్స్ ఎవరెవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. మరి అందులో ఎంతమంది విలన్స్ ఉంటారో ఏంటో?(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?) -
OTT: ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ రివ్యూ
ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా,చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బ్రతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కాని ఇప్పటి పరిస్థితులలో చదువుకునే వారు తక్కువయ్యారు చదువు కొనే వారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కుట్రదారులు కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపధ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ఎగ్జామ్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది.దాదాపుగా వాస్తవిక ఘటనలతో , చిన్నపాటి సినీ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకులు సర్కుణమ్.ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కథాంశానికొస్తే తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డిఎస్ పి మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో ఝాన్సీ మారుమల్లిని కిడ్నాప్ చేసి తైకారాకు తాను డిఎస్ పిగా వెళుతుంది. ఓ డిఎస్ పి స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమా లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు.కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతాడు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది, స్టేషన్ కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్ లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్య వ్యవస్థ లో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్ధం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసలమీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరి చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీవన్. -
ఎప్సెట్ టాపర్కు ‘మెగా’ సర్ప్రైజ్
తెలంగాణ ఎప్సెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషికి మెగాసార్ స్టార్ చిరంజీవి సర్ప్రైజ్ ఇచ్చారు. పరీక్షల ముందు ఆమెకు తండ్రి ఓ మాట ఇస్తే.. దాన్ని మెగాసార్ట్ నిజం చేశారు. అభిమాన హీరో ఇచ్చిన సర్ప్రైజ్కి రుషితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాకవ్వడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. అసలు తండ్రి ఇచ్చిన మాటేంటి? చిరంజీవి చేసిన సర్ప్రైజ్ ఏంటి?చిరంజీవి కోసం ఫస్ట్ ర్యాంకుతెలంగాణ ఎప్సెట్కు సన్నద్దమవుతున్న సమయంలో ‘స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధిస్తే మెగాస్టార్తో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆమె కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఈ విషయం చిరంజీవికి తెలియడంతో, ఆ యంగ్ అచీవర్ను స్వయంగా తన ఇంటికి పిలిపించుకొని సన్మానించారు.ల్యాప్టాప్ బహుమతిబుధవారం ఉదయం రుషి ఫ్యామిలీని చిరంజీవి ఇంటికి పిలిపించుకున్నారు. తన నివాసానికి వచ్చిన రుషిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉన్నత చదువుల నిమిత్తం ప్రోత్సాహకంగా ఆమెకు ఒక ల్యాప్టాప్ను బహుమతిగా అందజేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కష్టపడి చదివి టాపర్గా నిలవడమే కాకుండా, తన అభిమాన హీరోను స్వయంగా కలుసుకుని సత్కారం అందుకోవడంతో రుషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కల నెరవేరినందుకు ఆమె చాలా సంతోషించింది. #TGEAPCET లో State Top Rank సాధించిన M. Rushi కలను నిజం చేసిన Megastar #Chiranjeevi 🤩❤️Her father had promised that she would get to meet Megastar #Chiranjeevi if she secured the State Top Rank in the prestigious TG EAPCET exam ✨Today, that promise was fulfilled as… pic.twitter.com/y97hKTjSDO— Team Megastar (@MegaStaroffl) May 20, 2026 -
తిరుపతిలో కాలేజీ కడతా.. 25 శాతం డిస్కౌంట్ ఇస్తా!
ఈరోజు ఎన్టీఆర్తో పాటు మంచు మనోజ్ పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే మనోజ్ చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే 'వడ్డీకాసులవాడ' పేరితో మనోజ్ హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు. రెండు నిమిషాలున్న వీడియోతో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో)నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 'భైరవం', 'మిరాయ్' సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకున్న మంచు మనోజ్.. కామెడీ జానర్లో గతంలో మూవీస్ చేశాడు. హిట్స్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి, బాలయ్య మూవీలోనూ నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ చేయబోతున్నాడు. కానీ 'వడ్డీకాసులవాడ' సినిమాలో మాత్రం ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడే మధ్యతరగతి వ్యక్తిగా కనిపించబోతున్నాడని అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. పూర్తిగా ఫన్ జానర్లోనే ఈ సినిమా ఉండబోతుంది.ఏఐ ఉపయోగించి ఈ వీడియోని రూపొందించారు. అయితే ఇందులో మనోజ్ పాత్ర చెప్పే.. అప్పులన్నీ తీర్చేసి కోటీశ్వరుడిని చేస్తే తిరుపతిలో కాలేజీ కట్టిస్తా, అందరికీ 25 పర్సంటేజీ డిస్కౌంట్ ఇస్తా లాంటి డైలాగ్స్ మంచు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా అనిపించాయి. తేజ్ ఉప్పాలపాటి దర్శకుడు కాగా మనోజ్, అనిల్ సుంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్) -
రామ్కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో చై మూవీ!
ఆనందం, రన్, సండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా), అంజాన్ (సికిందర్) వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగుస్వామి. నిర్మాతగానూ పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ఈయన ఇటీవల మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. సండైకోళి చిత్రంతో విశాల్కు సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన లింగుస్వామి ఇటీవల దానికి సీక్వెల్గా పందెం కోడి 2 చిత్రాన్ని చేశారు. అది అంచనాలను అందుకోలేకపోయింది. చిన్న గ్యాప్ తర్వాత..ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్పోతినేని కథానాయకుడిగా ది వారియర్ చిత్రాన్ని చేశారు. కానీ ఈ మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఈయన సంగీత దర్శకుడు విద్యాసాగర్ వారసుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఏమైందో గానీ తాజాగా నాగచైతన్యతో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాఇది మంచి యాక్షన్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ మధ్య తండేల్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నాగ చెతన్య ప్రస్తుతం వృషకర్మ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళంలో వెంకట్ ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమా చేసి చేతులు కాల్చుకున్న చై.. లింగుసామితో సినిమా చేస్తాడా? లేదా? చూడాలి! -
ఫ్రెండ్స్ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. రెండు అందమైన రామచిలుకలు తారక్తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన బర్త్డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి అసాహి, యూహి అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. ఇవి జపనీస్ పేర్లు. అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్ దేశంపై తనకున్న ప్రేమతోనే పెంపుడు పక్షులకు జపనీస్ పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.తారక్ కెరీర్ మొదలైందిలా..దివంగత నటుడు ఎన్టీరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. స్టూడెంట్ నెం.1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్.. ఇలా అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. సినిమాచివరగా తెలుగులో దేవర: పార్ట్ 1తో హిట్ అందుకున్నాడు. హృతిక్ రోషన్ వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్లో విడుదల కానుంది. అలాగే తారక్ చేతిలో దేవర 2 కూడా ఉంది.చదవండి: జైల్లోనే పెళ్లిరోజు.. దర్శన్ భార్య ఎమోషనల్ పోస్ట్ -
చూపులేని హీరోయిన్.. నడవలేని హీరో
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఓ మూవీ 'రమణీ కళ్యాణం'. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్తో ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!)కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. సంజన ఆర్జే & సింగర్. తనకి చుపులేదు. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. 'కోర్ట్' ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ రాశారు. మే 22న అంటే ఈ శుక్రవారమే సినిమా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?) -
ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి రాజీనామా.. ఆ కారణం వల్లే..
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి ఏషియన్ మూవీస్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ వైదొలిగారు. ఈ మేరకు ఛాంబర్ ప్రతినిధులకు మంగళవారం రాత్రి ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.నావల్ల కాదు'కొందరు కార్యవర్గ సభ్యులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి నేను పని చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఛాంబర్ ఎప్పుడూ ఏకాభిప్రాయంతో నడవాలి. ప్రస్తుతం అలా జరగడం లేదు' అని ఫిలిం ఛాంబర్కు రాసిన లేఖలో సునీల్ నారంగ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సునీల్ నారంగ్ రాజీనామాను ఫిలిం ఛాంబర్ ఆమోదించింది.అసలేంటి వివాదం?ఇటీవల టాలీవుడ్లో పర్సంటేజీ (కమిషన్) విధానంపై వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే! సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరగా అగ్రనిర్మాతలు అంగీకరించడం లేదు. కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు జరుగుతున్న పర్సంటేజీ వివాదమే సునీల్ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామాతెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త సునీల్ నారంగ్ రాజీనామా చేశారు.ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి ఆమోదించింది. pic.twitter.com/0HUtwHeKFC— Telangana State Film Chamber Of Commerce (@TelanganaFilm) May 20, 2026 చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? -
రిలేషన్లో వన్ టైం చీటింగ్ తప్పేం కాదు: రకుల్
తెలిసో తెలియకో ఏదో ఒకసారి చీటింగ్ చేస్తే తప్పేం కాదంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అలా అని మోసం చేయడాన్ని తాను సమర్థించడం లేదని చెప్తోంది. రకుల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం 'పతీ పత్నీ ఔర్ వో దో'. ఇటీవల రిలీజైన ఈ హిందీ సినిమా ఇప్పటివరకు రూ.30 కోట్లకు పైగా రాబట్టింది. పాజిటివ్ టాక్తో థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మోసం చేస్తే?ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్లు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పార్ట్నర్ మోసం చేస్తే ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నకు ముగ్గురూ విభిన్నంగా స్పందించారు. మొదటగా సారా అలీ ఖాన్.. మోసం చేయడం సరికాదు, కానీ మోసం జరిగితే మాత్రం కచ్చితంగా సారీ చెప్పాలి అంది. దానికి రకుల్ కూడా అవునని వంత పాడింది. అయితే ఆయుష్మాన్ ఖురానా మాత్రం పెళ్లయ్యాక ప్రత్యేక షరతులుంటాయి. మానవ సహజంఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి, దానికి బాధపడుతూ నిజాయితీగా సారీ చెప్పినప్పుడు క్షమించేయడమే ఉత్తమం. మనిషన్నాక చిన్నపాటి పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. వాటిని పెద్దగా చూడకూడదు. అయితే పొరపాట్లు చేయడమే పనిగా పెట్టుకోవడం మాత్రం సరికాదు అన్నాడు. అలాగైతే ఒకసారి చీట్ చేస్తే క్షమించేయొచ్చా? అని సారా అడగ్గా కుదరదని రకుల్ బదులిచ్చింది.అది సరికాదుకానీ, అంతలోనే మళ్లీ మాట మార్చేసింది. 'ఎవరైనా అనుకోకుండా పొరపాటు చేస్తే మాత్రం క్షమించేయొచ్చు. ఎందుకంటే జీవితం చాలా పెద్దది. ఒక్క పొరపాటు చేసినందుకు జీవితాంతం అవతలి వ్యక్తిని క్షమించకుండా ఉండటం కరెక్ట్ కాదు. అలా అని ఇది నా జీవితానికి, నా భర్తకు వర్తించదు' అని రకుల్ పేర్కొంది.చదవండి: జైలులో పెళ్లిరోజు.. ఏదేమైనా నీ చేయి వదలను: దర్శన్ భార్య -
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల సందడి
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే నేడు (మే 20). ఈ క్రమంలోనే ఎన్టీఆర్ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాలుస్తూ హీరో పుట్టినరోజును పండగలా సెలబ్రేట్ చేశారు. ఇక తనకోసం వచ్చిన అభిమానులను ఎన్టీఆర్ నవ్వుతూ పలకరించాడు. వారిని పలకరిస్తూ అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ఇకపోతే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాదాపు 4 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలో తారక్ బరువు తగ్గి, గంభీరమైన లుక్తో కనిపించాడు. ప్రశాంత్ నీల్ టేకింగ్, తారక్ డైలాగ్స్.. గ్లింప్స్లో హైలైట్గా నిలిచాయి. రవి బస్రూర్ సంగీతం సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చింది. డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. #DRAGON. The Dragon meet #jrntr #ntrneel #dragon pic.twitter.com/XIYI5U1PzX— Teja M (@TejaM112720) May 19, 2026చదవండి: డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ -
జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?
తెలుగు హీరోల్లో జూ.ఎన్టీఆర్ కాస్త స్పెషల్. చిన్నప్పుడే నటుడు అయిపోయాడు. ఓ వయసొచ్చేసరికి సూపర్ హిట్స్ కొట్టి అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో ఫ్లాప్స్ పడ్డాయి కానీ మళ్లీ పుంజుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇంతకీ తారక్ ఎంత ఆస్తి సంపాదించాడు? గ్యారేజీలో కార్ల కలెక్షన్స్ ఏంటి?జూ.ఎన్టీఆర్.. సినీ, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చాడు. అలా ఇప్పటివరకు రూ.500-600 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ప్రొపర్టీస్ రూపంలోనే ఎక్కువగా ఉన్నట్టు టాక్. ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్లోని ఇంటి విలువ రూ.25 కోట్లు ఉంటుందని, అలానే హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉందని తెలుస్తోంది.సినిమాలు చేసినప్పటికి కుటుంబానికి కూడా ఎన్టీఆర్ అదే స్థాయిలో సమయం కేటాయిస్తుంటాడు. ఇద్దరు కొడుకులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. వీటన్నింటితో పాటు కార్లు, వాచీలంటే కూడా తారక్కి పిచ్చి ఇష్టం.తారక్ దగ్గర ప్రస్తుతం అరడజనుకు పైగానే కార్లు ఉన్నాయి! వాటిలో అత్యంత ఖరీదైన పోర్స్ కేమన్ ఎస్ ఒకటి. దీని ఉత్పత్తిని సదరు కంపెనీ ఎప్పుడో ఆపేసింది. చాన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ దీన్ని కొనుగోలు చేశాడు. అప్పట్లో రూ.3 కోట్లు పెట్టి దీన్ని కొన్నాడు. అంటే ఇప్పటి రేటులో డబుల్ ధర ఉండొచ్చు. దీని తర్వాత చూసుకుంటే కొన్నేళ్ల క్రితం రూ.3.5 కోట్లు విలువైన లాంబోర్గిని ఉరుస్ క్యాప్సుల్ గ్రాఫైట్ కారు కొన్నాడు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు.ఈ రెండింటితో పాటు రూ.4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ మేబాచ్ ఎస్ క్లాస్, రూ.2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ.1.70 కోట్ల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫ్యామిలీ అంతా కలిసి తిరిగేందుకు రూ.1.53 కోట్ల విలువైన టయోటా వెల్ ఫైర్ కారు.. ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్నాయి. వీటలో చాలా వాటికి 9999 లేదా 9 సంఖ్య కలిసొచ్చేలా నంబర్ ప్లేట్స్ ఉంటాయి. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ పాటించిన '9' సెంటిమెంట్నే తారక్ ఫాలో అవుతూ వస్తున్నాడు. కార్లే కాదు ఖరీదైన వాచీలు కూడా తారక్ దగ్గరున్నాయి. రూ.7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే చేతి గడియారం, రూ.2.5 కోట్ల విలువైన నటిలస్ వాచీలు తారక్ సొంతం.తారక్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత చేసిన వాటిలో 'దేవర' హిట్ కాగా గతేడాది రిలీజైన 'వార్ 2' ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీని గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. -
స్పెషల్ ఎట్రాక్షన్
కమర్షియల్ సినిమాలో హీరో ఉంటారు. ఫైట్స్, పాటలు ఉంటాయి. అయినా అదనపు ఆకర్షణ కావాలి. ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేక గీతం థియేటర్స్లో ప్లే అవ్వాలి. అందుకే కొందరు హీరోలు స్టోరీలో స్పెషల్ సాంగ్ చేసే స్కోప్ ఉంటే, సై అంటున్నారు. ఆ పాటలు చేయడానికి హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచే స్టెప్పులు వేస్తున్నారు. మరి... ఏ సినిమాలో ఏ నటి స్పెషల్గా కనిపించనున్నారో ఓసారి లుక్ వేయండి.జైలర్తో స్టెప్పుల్ మంచి కమర్షియల్ మోడ్లో కనిపిస్తున్నారు రజనీకాంత్. ఈ సీనియర్ హీరో నటించిన గత రెండు చిత్రాలు ‘జైలర్, కూలీ’ కమర్షియల్ ఎంటర్టైనర్స్గా ఆడియన్స్ను అలరించాయి. అలాగే ఈ రెండు చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా..’ పాటలో తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేస్తే, ‘కూలీ’ చిత్రంలోని ‘మోనికా..’ పాటలో పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ను ఇరగదీశారు. కాగా రజనీకాంత్ పూర్తి చేసిన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ను బాలీవుడ్ నటి నోరా ఫతేహీ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది.‘జైలర్’ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్గా రానున్న ‘జైలర్ 2’ మూవీకి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారని తెలిసింది.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్ 2’ చిత్రం జూన్లో విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుధ్ స్వరకర్త. అన్నట్లు... నోరా ఫతేహీ గురించి మన తెలుగు ఆడియన్స్కు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే..‘బాహుబలి: ది బిగినింగ్’లో ‘మనోహరి’, ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’ ఇలా పలు స్పెషల్ సాంగ్స్లో నోరా నర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది.స్పెషల్ ఎంట్రీ టాలీవుడ్కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి మౌనీ రాయ్. చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ చిత్రంలో మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. దాదాపు వందమంది డ్యాన్సర్స్తో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటలో చిరంజీవి, మౌనీ రాయ్ డ్యాన్స్ చేశారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లుగా ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్లు నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ ‘విశ్వంభర’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.మాస్ డ్యాన్స్ రామ్చరణ్ టైటిల్ రోల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో హీరో రామ్ చరణ్తో కలిసి శ్రుతీహాసన్ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశారు. ఈ స్పెషల్ సాంగ్కు కుస్తీతో కూడిన ఓ కాన్సెప్ట్ కూడా ఉందట. అంతేకాదు... ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కాలు కదిపారని సమాచారం. ఇదే నిజమైతే ఒకే ఫ్రేమ్లో చరణ్, జాన్వీ శ్రుతీహాసన్లను చూడటం మాస్ ఆడియన్స్కు థియేటర్స్లో విజిల్ వర్తీ మూమెంట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1970–1980 మధ్య కాలంలో సాగుతుంది. ఇందులో క్రాస్ ఓవర్ అథ్లెట్గా రామ్చరణ్ నటించారు. అంటే... ఈ చిత్రంలో రామ్చరణ్ క్రికెట్, కుస్తీ ఆడతారు. మరొక గేమ్ కూడా ఉంది. ఈ గేమ్పై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ సినిమాలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్వేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. మరోవైపు మహేశ్బాబు ‘ఆగడు’, అర్జున్ కపూర్ ‘తేవర్’ చిత్రాల్లో శ్రుతీహాసన్ స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.ఆలియా ఆటా పాటా! ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలో ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటకు స్కోప్ ఉంది.ఈ పాటలో నటిస్తారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ పాటలో ఆలియా భట్ కనిపిస్తారనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇదే నిజమైతే, ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్, ఆలియా భట్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.ది ప్యారడైజ్లో తమన్నా! స్పెషల్ సాంగ్స్కు ఓ కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు హీరోయిన్ తమన్నా. అంతేకాదు... ఈ బ్యూటీ ఫలానా సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమా హిట్టవుతుందనే టాక్ కూడా ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ‘కావాలయ్యా..’, కావొచ్చు, హిందీ చిత్రం ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ కావొచ్చు, మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘డాంగ్ డాంగ్..’ పాట కావొచ్చు... తమన్నా స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమాకు అది తప్పుకుండా ప్లస్ అవుతుంది. తాజాగా ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ యువకుడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్కు స్కోప్ ఉందట. దీంతో ఈ సాంగ్కు తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఆ దిశగా సంప్రదింపులు మొదలయ్యాయని సమాచారం. అయితే ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్న అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ చిత్రంలో మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ తేదీకి విడుదల కుదరకపోవడంతో, ఈ ఏడాది ఆగస్టు 21కి వాయిదా వేశారు. అయితే ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా విడుదల కాకపోవచ్చని, అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ సాగడం లేదని, రీ షూట్స్ చేయాల్సి వస్తోందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, అనుకున్న ప్రకారమే ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోందని, ఆగస్టు 21న ఈ సినిమా విడుదల అవుతుందని టీమ్ మరోసారి స్పష్టత ఇచ్చింది.నేను రెడీ టాలీవుడ్కు వచ్చేందుకు నేను రెడీ అన్నారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. స్పెషల్ సాంగ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. హిందీలో ‘హౌస్ఫుల్ 3, హౌస్ఫుల్ 5, 5 వెడ్డింగ్స్’ వంటి చిత్రాల్లో నటించారు నర్గీస్. అలానే సల్మాన్ ఖాన్ ‘కిక్’లో ‘యార్ నా మిలే’, తమిళ హీరో ప్రశాంత్ ‘సాగసం’లో స్పెషల్ సాంగ్స్ చేశారు నర్గీస్. ఇప్పుడు తెలుగు సినిమాకు వచ్చారు. హవీష్, కావ్యాథాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నేను రెడీ’.ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ చేశారు నర్గీస్. టాలీవుడ్లో నర్గీస్ చేసిన తొలి సినిమా ఇదే. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ పతాకంపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించిన ఈ చిత్రం జూన్ రెండో వారంలో విడుదల కానుంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ ‘నేను రెడీ’ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ‘నేను రెడీ’ సినిమా విడుదల కాకముందే, తెలుగులో ఇంకో సినిమాలో మరో స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారట నర్గీస్. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో నర్గీస్ ఫక్రీ డ్యాన్స్ చేశారని తెలిసింది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావొచ్చు.బ్లాక్ గోల్డ్లో సీరత్ ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో అరుదుగా ప్రత్యేక పాటలు చూస్తుంటాం. హీరోయిన్ సంయుక్త నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది బ్లాక్గోల్డ్’. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాను కేఎమ్సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారు సంయుక్త. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల బ్యాక్డ్రాప్లో నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ చిత్రంలో హీరోయిన్ సీరత్ కపూర్ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ పాటను రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఈ సంగతి ఇలా ఉంచితే.. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీకమల్, తన్వీ లీడ్ రోల్స్లో నటించిన ‘ఉషా పరిణయం’ (2024) చిత్రంలో సీరత్ కపూర్ ప్రత్యేక పాటలో మెరిశారు. ఇక శర్వానంద్ ‘రన్ రాజా రన్’లో హీరోయిన్గా నటించిన సీరత్ కపూర్ నాగార్జున ‘రాజుగారి గది 2’, అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’, రవితేజ ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో కీ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరు తారలు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. -
తమిళ భాష నేర్చుకుంటున్నాను
హీరో, హీరోయిన్లు వివిధ భాషల్లో సినిమాలు చేస్తుంటారు. ఆయా భాషల్లో తమ పాత్ర తాలూకు భావోద్వేగాలు అర్థం చేసుకునేందుకు, సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఆ భాషలు నేర్చుకుంటుంటారు. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తమిళ్ నేర్చుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ (2024) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు భాగ్యశ్రీ. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ‘కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించిన ‘కాంత’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారామె. ప్రస్తుతం తెలుగులో అఖిల్ సరసన ‘లెనిన్’ మూవీలో నటిస్తున్న భాగ్యశ్రీ ‘సెయాన్’ అనే మరో తమిళ్ సినిమాలో అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నటిగా నన్ను నేను నిరూపించుకునేలా ఉంటుంది. ప్రేక్షకుల పట్ల నిజాయితీగా ఉండాలంటే నటించే చిత్రాల భాషను నేర్చుకోవాలి. తెలుగులో ‘కింగ్డమ్’ చిత్రానికి నేనే డబ్బింగ్ చె΄్పాను. ఇప్పుడు ‘సెయాన్’ కోసం తమిళ భాష నేర్చుకుంటున్నాను’’ అని భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. -
‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పవర్ఫుల్ ట్రీట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ మొత్తం సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, తన మార్క్ ఏమాత్రం తగ్గకుండానే ఈ గ్లింప్స్ కట్ చేశాడు.ఇక తారక్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి 11.30 గంటల తర్వాత డ్రాగన్ సినిమా గ్లింప్స్ వచ్చింది. 4.28 నిమిషాల నిడివి గల ఈ గ్లింప్స్లో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ ఆకట్టుకుంది. సింపుల్గా సినిమా కథ, ఆ ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ గ్లింప్స్లో తారక్ చెప్పిన డైలాగ్స్ అభిమానులను అలరించేలా ఉన్నాయి. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. పవర్ఫుల్గా సాగిన ఈ గ్లింప్స్ సినిమా మీద భారీ అంచనాలను రేపుతోంది.కాగా డ్రాగన్ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ షెడ్యూల్లు వరుసగా వాయిదాలు పడటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు డ్రాగన్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఓ కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు. కథను మలుపు తిప్పే మరో లీడ్ రోల్లో నటించనున్నారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, కాజోల్... వంటి వార్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా భట్ పేరు తెరపైకి వచ్చింది. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ను మీరు కూడా చూసేయండి. -
'పెద్ది'.. సమస్యలన్నీ క్లియర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నిరోజుల నుంచి పర్సంటేజీ వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్లే తమకు కూడా షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్స్ నిర్వహిస్తున్న ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే ఇరువురి మధ్య మీటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ కమిటీ కూడా వేసింది. అయితే 'పెద్ది'కి కూడా పర్సంటేజీ ఇవ్వనున్నారని తెలిసింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన మీటింగే దీనికి కారణం. ఇప్పుడు ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్వయంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ ధరల పెంచితే అందులో 7.5 శాతం సదరు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియర్ షోల కోసమైతే ఏ సెంటర్లో ప్రతి షోకు రూ.25 వేలు, బి సెంటర్లో ప్రతి షోకు రూ.15 వేలు, సి సెంటర్లో ప్రతి షోకు రూ.10 వేలు చొప్పున నిర్మాత చెల్లించాలి.తెలంగాణలో టికెట్ ధరలు పెంచితే పై నిబంధనలు వర్తిస్తాయి. టికెట్ ధర పెంపు లేకపోతే వారు ఎప్పటిలానే డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానాన్ని అమలు చేసేందుకు అంగీకరించారని కూడా తెలిపింది.జూన్ 4న పెద్ది సినిమా థియేటర్లలోకి రానుంది. సోమవారం ట్రైలర్ రిలీజ్ చేయగా కొందరికి నచ్చితే మరికొందరికి ల్యాగ్ అనిపించింది. ఇందులో రామ్ చరమ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్గా కనిపిస్తాడు. అంటే క్రికెట్, కుస్తీ, రన్నింగ్ చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు. -
ముద్దుగున్న మృణాల్.. ఐస్క్రీమ్తో 'ధురంధర్' సారా
దేశీ లుక్లో ముద్దేచ్చేలా మృణాల్ ఠాకుర్పలుచని చీరలో 'పెద్ది' కోసం జాన్వీ కపూర్ఐస్ క్రీమ్తో పోజులిచ్చిన సారా అర్జున్ఎర్రచీరలో భయపెట్టేస్తున్న శ్రుతి హాసన్బుక్ చదువుతూ అందంగా మీనాక్షి చౌదరిగులాబీ చీరలో అను ఇమ్మాన్యుయేల్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. తన భార్య మౌనిక రాజకీయ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి బయటపెట్టారు. తాము నెలకొల్పిన సేవా సంస్థ 'ఐక్య' గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?)'ఐక్య' స్వచ్ఛంద సంస్థ. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ప్రజల కోసం దీన్ని ప్రారంభించాం. దీని కోసం మేం మా సొంత నిధులే ఖర్చు పెట్టనున్నాం. నా భార్య మౌనిక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతం మేం రాజకీయాల్లో భాగమయ్యాయం అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.మౌనిక విషయానికొస్తే.. ఉమ్మడి కర్నూలుకి చెందిన భూమా కుటుంబం ఈమెది. ఈమె తండ్రి భూమా నాగిరెడ్డి వైసీపీ, టీడీపీ, ప్రజారాజ్యం తరఫున రెండుసార్లు ఎమ్మెల్మేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి కూడా రెండుసార్లు ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తె అఖిలప్రియ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ నుంచి గెలిచిన ఈమె.. తర్వాత టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది. తల్లిదండ్రుల రాజకీయ వారసురాలగా అఖిలప్రియ కొనసాగుతున్నారు. ఇప్పుడు చిన్నకుమార్తె మౌనిక కూడా రాజకీయాల్లోకి వస్తుండటంతో రాయలసీమ పాలిటిక్స్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. మరి మౌనిక.. ఏ పార్టీ తరఫున ఎక్కడ పోటీ చేస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే) -
పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్కు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, కానీ తమని తాము నిరూపించుకోవడమే అసలైన టాస్క్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి, ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.'దేవర'లో గ్లామర్ షోకే పరిమితంభారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'తంగం' అనే పల్లెటూరి పడచు పాత్రలో జాన్వీ లుక్స్, ముఖ్యంగా ‘చుట్టమల్లే’ పాటలో ఆమె పండించిన గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఒక నటిగా చూస్తే మాత్రం దేవరలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ షోకే, కమర్షియల్ ఎలిమెంట్స్కే ఆమెను పరిమితం చేసేశారనే విమర్శలు వచ్చాయి.'పెద్ది’లోనూ అదే రిపీట్ అవుతుందా?ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే, నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులోనూ ఆమె కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయినట్లుగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావచ్చు. కానీ, ‘పెద్ది’ లాంటి రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ కథలకు గ్లామర్ మాత్రమే నమ్ముకుంటే అది సినిమాకే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలోనూ జాన్వీ పాత్రకు నటన పరంగా స్కోప్ లేకపోతే, ఆమె టాలీవుడ్ కెరీర్కు అది పెద్ద మైనస్ అవుతుంది. టాలీవుడ్లో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, బలమైన పాత్రలు కూడా పడాలి.దాచి పెట్టారా?గ్లింప్స్, ట్రైలర్లో జాన్వీ గ్లామర్ షోకే పరిమితం చేశారు. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేశాడు దర్శకుడు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పెద్దిలో జాన్వీ నటన ఓ రేంజ్లో ఉంటుందని చెబుతున్నాడు. డాన్స్ కూడా అద్భుతంగా చేసిందని ప్రశంసించాడు. చరణ్ మాటల బట్టి చూస్తే.. ట్రైలర్లో జాన్వీని కావాలనే గ్లామర్ డాల్గా చూపించినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు సంబంధించిన సీన్ని పెడితే.. రిలీజ్ ముందే కథపై ఊహగానాలు ఎక్కువైపోతాయని దర్శకుడు భావించాడట. అందుకే ట్రైలర్లో చరణ్ని మాత్రమే హైలెట్ చేస్తూ.. మిగతావాళ్ల సీన్లను దాచిపెట్టాడని టాలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమై.. జాన్వీకి మంచి సీన్లు పడితే ఒకే. కేవలం పాటలకే పరిమితం అయితే మాత్రం.. ఆమె కెరీర్కి ఇబ్బంది తప్పదని సినీ పండితులు చెబుతున్నారు. -
గర్ల్ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా
టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకుడిగా మారారు. ఇప్పటివరకు పాటల రచయిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన టాక్సిక్ రిలేషన్స్ బ్యాక్డ్రాప్ స్టోరీతో వస్తున్నారు. ఆ మూవీ పేరే 'లలిత'. కాస్మిక్ పవర్ క్రియేట్స్ LLP బ్యానర్పై పి. సుధీర్ రాజు, డి.వైష్ణవి నేహా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నందిని హీరోయిన్గా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా పరిచయమవుతున్నారు.మణి, నాగరాజు సంయుక్తంగా సంగీతమందిస్తుండగా.. ఇందులో రఘుబాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తన వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'గర్ల్ఫ్రెండ్ అంటే బానిస కాదు' అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
'ఫస్ట్ టైమ్' రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం నాకుంది: పాయల్ రాజ్పుత్
అందాల తార పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథిగా హాజరైన 'ఫస్ట్ టైమ్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్, సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సినిమా ద్వారా పాయల్ రాజ్పుత్ ప్రియుడు సౌరబ్ ధింగ్ర హీరోగా టాలీవుడ్కు పరిచయమవుతున్నారు. హేమంత్ ఇప్పలపల్లి దర్శక-నిర్మాతగా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకుండా కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో అత్యున్నత వీఎఫ్ఎక్స్ (VFX) విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు హేమంత్ ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి కష్టపడ్డారు. మే 22న ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఇందులోని వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు. ఇక హీరో సౌరబ్ గురించి చెప్తూ.. తను సినిమాను ఒక ప్రతిజ్ఞలా తీసుకుని కష్టపడ్డాడని, భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆకాంక్షించారు.ఈ ఈవెంట్లో పాయల్ రాజ్పుత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా, చిత్ర బృందానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తదితరులు హాజరైన ఈ వేడుకలో 'ఈ పిల్ల నేను అనుకోనేలేదు' సాంగ్ మరియు ట్రైలర్కు విశేష స్పందన లభించింది. -
మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే
ఒకప్పుడు తెలుగులో హీరోగా సినిమాలు చేసిన మంచు మనోజ్.. రీసెంట్ టైంలో మిరాయ్, భైరవం చిత్రాలతో విలన్గా మారిపోయాడు. ఆకట్టుకున్నాడు కూడా. ప్రస్తుతం 'డేవిడ్ రెడ్డి' అనే మూవీలో నెగిటివ్ టచ్ ఉండే హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఓ ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. మీడియాతో కలిసి తన ప్రీ బర్త్ డే వేడుకల్ని హైదరాబాద్లో చేసుకున్నాడు. ఇందులోనే తండ్రితో గొడవ గురించి ప్రశ్న ఎదురవగా సెటైరికల్గా సమాధానమిచ్చాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)'మీ నాన్నతో గొడవ క్లియర్ అయినట్టేనా?' అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మనోజ్.. అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా? కానీ మైక్తో వెళ్ళకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. గతంలో మంచు కుటుంబంలో గొడవ జరుగుతున్నప్పుడు ఓ మీడియా ప్రతినిధిని మోహన్ బాబు మైక్తో కొట్టారు. తర్వాత క్షమాపణ చెప్పారు.మీడియాతో మాట్లాడుతూ మనోజ్ మరికొన్ని విషయాల్ని పంచుకున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాలు నాకు ఇచ్చిన డైరెక్టర్స్ ఇద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఇంకో జన్మ ఇచ్చారు. అలానే నా భార్య మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మనోజ్ చెప్పాడు.తాజాగా 'ఐక్య ధైర్య సేనా సమితి' పేరుతో ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. ఎవరైనా బెదిరింపు కాల్స్తో బాధపడుతుంటే వాళ్లకు మా ట్రస్ట్ అండగా ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికే దీనిని మొదలుపెట్టాం. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి చదువు బాధ్యతలను ఈరోజు నుంచే పూర్తిగా తీసుకుంటామని మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ)Media Person: మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ? #ManchuManoj: అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా ? వెళ్ళి అడగండి. కానీ Mic పట్టుకొని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. pic.twitter.com/M4WBvEe1rH— cinee worldd (@Cinee_Worldd) May 19, 2026 -
‘పెద్ది’కి పర్సెంటేజ్ కావాల్సిందే!
మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ స్క్రీన్స్లోనూ పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం.. ఇప్పటికిప్పుడు వీలుకాదంటూ ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ సభ్యులు మాట్లాడటం తెలిసిందే. ఈ సమస్యపై చర్చించేందుకు ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు డి.సురేశ్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో గత శుక్రవారం నిర్మాతలు, ఎగ్జిబిటర్స్తో సమావేశం నిర్వహించారు. పర్సెంటేజ్ విధానంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఏడుగురు నిర్మాతలు, ఏడుగురు ఎగ్జిబిటర్లు, ఏడుగురు డిస్ట్రిబ్యూటర్లు (మొత్తం 21 మంది)తో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే... హైదరాబాద్లోని ఫిల్మ్ చాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సోమవారం మరోసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో మూడు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదట. ‘పెద్ది’ సినిమా ప్రదర్శనలో తమకు పర్సెంటేజ్ కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబట్టారట. థియేటర్ రెంట్తో పాటు అదనంగా 7.5 శాతం పర్సెంటేజ్ ఇచ్చేందుకు సిద్ధమేనని నిర్మాతలు చెప్పారని తెలిసింది. అయితే ‘పెద్ది’కి మాత్రమే పర్సెంటేజ్ ఇస్తే సరిపోదని, తర్వాతి చిత్రాలకు కూడా ఎంత మేర పర్సెంటేజ్ ఇస్తారు? అనే విషయంపై ‘పెద్ది’ రిలీజ్కు ముందే తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరారట. ఈ డిమాండ్పై అంతర్గతంగా చర్చించుకుని, తమ నిర్ణయాన్ని నేడు చెబుతామని నిర్మాతలు చెప్పినట్లు సమాచారం. -
‘పెద్ది’ .. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ : రామ్ చరణ్
‘‘నా కెరీర్లో చేసిన మోస్ట్ ఇన్ స్పైరింగ్ ఫిల్మ్ ‘పెద్ది’. ఇలాంటి చిత్రాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ‘పెద్ది’ కూడా అలాంటి అరుదైన సినిమా. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ ఇది’’ అని హీరో రామ్చరణ్ తెలిపారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ మూవీ జూన్ 4న విడుదలకానుంది. సోమవారం ముంబైలో జరిగిన ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ– ‘‘నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు ‘‘మా అమ్మగారు(శ్రీదేవి), చిరంజీవిగారు కలిసి నటించిన సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. చరణ్గారు–నా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ నాకు చాలా ప్రత్యేకం’’ అని జాన్వీ కపూర్ చెప్పారు. ‘‘నేరుగా తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ వేడుకలో నిర్మాత సతీష్ కిలారు, నటుడు దివ్యేందు శర్మ, కెమెరామెన్ రత్నవేలు మాట్లాడారు. -
పవర్ఫుల్ సావిత్రి
కబీర్సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్ ప్రధాన తారాగణంగా నటించిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. రవికుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.కాగా ఈ సినిమాలో పవర్ఫుల్ సావిత్రి పాత్రలో రాశి నటించినట్లు వెల్లడించి, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. ఓ బ్యాగ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. కథను మలుపు తిప్పే సావిత్రి పాత్రలో రాశి నటించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
స్టైల్ మార్చిన శోభిత.. చీరలో మానస
కొత్త హెయిర్ స్టైల్తో అక్కినేని కోడలు శోభితచీరలో కనువిందు చేస్తున్న మానస వారణాసిఒంపు సొంపులతో దివ్యభారతి అందాల విందుఫన్నీ మూమెంట్స్ షేర్ చేసిన శ్రీనిధిశెట్టిపాత హీరోయిన్ లుక్లో దుషారా విజయన్ View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) -
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా.. హీరోయిన్గా తెలుగు బిగ్బాస్ బ్యూటీ
తెలుగు బిగ్బాస్ షోలో పాల్గొన్న వాళ్లలో పలువురికి గుర్తింపు అయితే వచ్చింది గానీ ఆ సీజన్ తర్వాత వాళ్లని జనాలు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ దగ్గర నుంచి లేటెస్ట్ సీజన్ విజేత కల్యాణ పడాల వరకు ఇదే తంతు. అలాంటిది గత సీజన్లో కొన్నిరోజులు మాత్రమే ఉన్న ఓ బ్యూటికీ సుడిగాలి సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)'జబర్దస్త్' కమెడియన్గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ లాంటి మూవీస్ చేశాడు. వీటిని ఒక్కడు కూడా పట్టించుకోలేదు. కొన్నేళ్ల క్రితం చేసిన 'గాలోడు' మాత్రం ఊహించని హిట్ అయింది. ప్రస్తుతం 'గోట్' అనే మూవీ చేశాడు. ఈ మార్చిలోనే రిలీజ్ చేస్తామని అన్నారు గానీ దాని సంగతి ఏంటో తెలియట్లేదు. అదలా ఉండగానే 'సుధీర్ జోకర్' పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.ఇందులోనే సుధీర్ సరసన ఆయేషా జీనత్ హీరోయిన్గా చేయనుంది. ఈమె తమిళ నటి. గతంలో తమిళ బిగ్బాస్లో పాల్గొంది. గతేడాది తెలుగులో ప్రసారమైన బిగ్బాస్లోనూ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే వెళ్లిపోయింది. ఇప్పుడు సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. (ఇదీ చదవండి: భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ) -
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్థింగ్ డిఫరెంట్గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
రష్మికకు చేదు అనుభవం.. స్టార్ హీరో అసభ్య ప్రవర్తన..!
టాలీవుడ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న కాక్టెయిల్-2 మూవీ ప్రమోషన్స్లో చాలా ఇబ్బందికి గురైంది. రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక మందన్నా తీవ్ర అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం.. విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ మూవీ ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కాక్టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మూవీ ‘కాక్టెయిల్-2’ ప్రమోషన్లలో షాహిద్ కపూర్ తీరుతో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు. షాహిద్ తన భుజంపై చేయి వేయగానే అన్కంఫర్టబుల్గా ఫీలై వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ ఏదో జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి… pic.twitter.com/FGza2sYnR8— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026 -
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ థియేటర్లతో పాటు డిజిటల్గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. Before the clock strikes May 20…the celebrations begin across India ⚡#NTRNeel First Glimpse arrives at 11:52 PM IST on May 19th in selected theatres & digitally 🔥— NTR Arts (@NTRArtsOfficial) May 18, 2026 -
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్లోకి వెళ్లిపోతారు. ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్లో పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్..డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22అమెజాన్ ప్రైమ్-ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 సన్ నెక్ట్స్..సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20బీష్మార్(మలయాళం సినిమా)- మే 22శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్స్టార్..స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22జీ5వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22సోనీలివ్..మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే..పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22 -
తెలుగు క్రికెటర్తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ మదర్..!
కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ.. స్టార్ హీరోల సరసన మెప్పించింది. రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుశ్తో ఓ సినిమా చేస్తోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. శ్రీలీల వ్యక్తిగత జీవితంపై ఓ వార్త వైరల్గా మారింది. ఆమె తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబయి ఐపీఎల్ మ్యాచ్కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా మరోసారి ఈ టాపిక్ వైరల్గా మారింది. గతేడాదిగా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ శ్రీలీల మదర్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల తల్లి కొట్టిపారేసింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఇప్పటి వరకు శ్రీలీల- తిలక్ వర్మ ఒక్క సారి కూడా కలుసుకోలేదని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేసింది. 2025 డిసెంబర్లో శ్రీలీల-తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం.. అలాగే వాంఖడే టీ20 మ్యాచ్లో నటి సందడి చేయడం.. ఇవి రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆమె అన్నారు. గతంలో కార్తీక్ ఆర్యన్తో వచ్చిన డేటింగ్ వార్తలను సైతం కొట్టిపారేశారు. కార్తీక్ వాళ్ల మదర్ డాక్టర్ కావడంతోనే వృత్తిపరంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్పై డేటింగ్ రూమర్స్కు చెక్ పడినట్లైంది. -
బాబీతో మరో మెగా ప్రాజెక్ట్.. 70 ఏళ్ల వయసులో చిరు కష్టం చూశారా?
వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్తో వచ్చే సెట్స్పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్ సోషల్మీడియాలో వైరలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్ సీన్స్తో నిండిన కథతో రానుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది.అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ అఫీషియల్గా లాంఛ్ కానుంది. ఈనె 21 నుంచి పూజా కార్యక్రమాలతో క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పరిమితులను అధిగమించడానికి ప్రతి రోజూ మరో అవకాశం…నా ప్రియమైన డైరెక్టర్ బాబీ గారితో మెగా 158 కోసం మరో చిరస్మరణీయ ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.. ప్రారంభోత్సవం మే 21న అంటూ జిమ్లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ వర్కవుట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
అదితి అదరహో...
ఫ్రాన్స్ వేదికగా 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో హాలీవుడ్ సినీ తారలతో పాటు భారతీయ సినీ తారల హంగామా జోరందుకుంది. హీరోయిన్స్ హ్యూమా ఖురేషీ, అదితి రావ్ హైదరీ, దిశా మదన్ రెడ్ కార్పెట్పై నడిచారు. గ్రీన్ కలర్లో అదిరిపోయే కాస్ట్యూమ్స్తో అదితీ రావ్ హైదరీ కనిపించారు. బ్లాక్ డ్రెస్లో మెరిశారు హ్యూమా ఖురేషి. హాలీవుడ్ స్టార్, ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలు డెమి మూర్ బార్బీ లుక్తో సందడి చేశారు.జేమ్స్ గ్రే డైరెక్షన్లోని ‘పేపర్ టైగర్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా డెమి మూర్ రెడ్ కార్పెట్ పై వాక్ చేశారు. స్పానిష్ దర్శకుడు రోడ్రిగ్ తెరకెక్కించిన ‘ది బిలవ్డ్’ సినిమా ప్రీమియర్ను ప్రదర్శించగా, ఈ యూనిట్ హంగామా ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే క్రిస్టెన్ స్టీవర్ట్ ఓ లీడ్ రోల్ చేసిన ‘ఫుల్ ఫిల్’ సినిమా ప్రీమియర్ ప్రదర్శితమైంది. ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 23 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. -
బ్లాక్మెయిల్ ఆరంభం
వరుణ్ సందేశ్, సురేష్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న సినిమా ‘బ్లాక్మెయిల్’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత–నిర్మాత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. సురేష్ తల్లి ఎం. వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు మంచి కంటెంట్తో సినిమా రాబోతోందని అర్థమైంది’’ అని అన్నారు.‘‘నన్ను నమ్మి ఈ సినిమాను నా చేతిలో పెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు శ్రీనివాస్ గుండ్రెడ్డి. ‘‘నేను హీరోగా నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్గారు ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా స్క్రీన్ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు సురేష్. ‘‘200 కుటుంబాలకు పని కల్పించవచ్చనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి వచ్చాను. నా సినిమాకు వచ్చే లాభాల్లో 10 శాతం మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్కు ఇస్తాను’’ అని తెలి΄ారు అవినాష్. ఈ చిత్రానికి సంగీతం: మల్లిక్ తేజ. -
నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు. అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన గురువు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. -
'తిమ్మరాజుపల్లి టీవీ'లో అదో గుర్తుండిపోయే జ్ఞాపకం: ప్రదీప్ కొట్టె
న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ'. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. రీసెంట్గా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో నటించిన ప్రదీప్ కొట్టె ఈ మూవీలో తన జర్నీ విశేషాలని పంచుకున్నాడు.'తిమ్మరాజు పల్లి టీవీ'లో నేను చేసిన రాజప్ప పాత్రకు ప్రశంసలు దక్కాయి. నాకు తొలి సినిమా, అవకాశం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఈ చిత్రంలోనే. ఇందులో సాయి తేజ్, లతీష్ ఇలా చాలామంది నటించిన పాత్రలు నాకు ఇష్టం. అందరూ సింగిల్ టేక్స్లోనే నటించారు. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మా అక్కకి తెలుసంతే. మా అమ్మనాన్నలకు చెప్పకుండా షూటింగ్కి తీసుకువచ్చింది మా అక్క. మా పేరెంట్స్ని అలా చూడటం, వారు నన్ను అలా చూడటం అదొక మెమరబుల్ మూమెంట్. -
అంజలి నెవ్వర్ బిఫోర్ లుక్.. డోస్ పెంచిన నేహాశెట్టి
బ్లాక్ డ్రస్లో రచ్చ లేపుతున్న అంజలిగ్లామర్ డోస్ పెంచేసిన నేహా శెట్టిపచ్చని ఔట్ఫిట్లో అదితీ హొయలువర్కౌట్ వీడియో షేర్ చేసిన కీర్తి సురేశ్గ్లామర్తో మాయ చేస్తున్న రాశీ సింగ్రకుల్ ప్రీత్ సింగ్ రోజు గడుస్తుందిలా View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మీరా వాసుదేవన్ గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే. గోల్ మాల్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ.. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అంజలి ఐ లవ్యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా వాసుదేవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ప్రస్తావించింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానని తెలిపింది. ఇప్పుడైతే చాలా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడించింది. పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాలు వృథా చేశానని పేర్కొంది. అర్థం లేని మూడు పెళ్లిళ్లకు అనవసరంగా సమయాన్ని కేటాయించానని వెల్లడించింది. పెళ్లి విషయంలో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు.మూడోసారి కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని మీరా వాసుదేవన్ తెలిపింది. నాకు నచ్చిన పనులు, సేవ చేస్తూ ఆనందంగా ఉంటున్నట్లు వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపుతున్నానని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని వ్యక్తులతో సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.పర్సనల్ లైఫ్..కాగా.. మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్లో కెమెరామెన్ విపిన్తో లవ్లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 ఆగస్టులో విడాకుల విషయాన్ని ప్రకటించింది. దీంతో మూడు పెళ్లిళ్లు ఇలా పెటాకులయ్యాయి. -
‘త్రికాల’గా వస్తున్న శ్రద్ధాదాస్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్బి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతుంది.ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ‘త్రికాల’పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్లు, అజయ్ పవర్ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మిళితం చేసి తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ‘త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.నిర్మాతలు మాట్లాడుతూ… సరికొత్త కాన్సెప్ట్తో, మైథలాజికల్ టచ్తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న మనోజ్
హీరో మంచు మనోజ్ "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించాడు. ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. మార్చి 20న మనోజ్ పుట్టినరోజు.. ఈ క్రమంలోనే శనివారం (మార్చి 17) నాడు కొత్త ట్రస్ట్ను ప్రారంభిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎవరు మన పక్కనున్నారు? ఎవరు మానవత్వంతో వ్యవహరించారనేది జీవితం గుర్తు చేస్తుంది.అలాంటి వారికోసం..ఈ మానవత్వం, సేవా స్ఫూర్తి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. అది ఎల్లప్పుడూ మాలో అంతర్భాగంగా ఉంది. అవసరంలో ఉన్నవారికోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈరోజు మాలో ఉన్న స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానించాలనుకుంటున్నాము.మానవత్వం కోసం..ముఖ్యంగా మౌనిక ప్రేరేపించిన ఆలోచనతో నేడు ఐక్యధైర్యసేనా సమితిని ప్రారంభిస్తున్నాం. ఐక్య అంటే ఐకమత్యం. మానవత్వం కోసం అందరూ ఏకం కావడం. దేవుడు మాకు ప్రసాదించినదాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుకోవాలనుకుంటున్నాము. రక్తదానం, అత్యవసర సహాయం వంటివి అవసరమైనచోట ఐక్య సంస్థ నిలబడుతుంది. ఇది రాజకీయం కాదు, అలాగే ఈ సంస్థ మాది మాత్రమే కాదు, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ..కొత్త ఆశఒక గొప్ప లక్ష్యం కోసం హృదయాలు ఏకమైనప్పుడు జీవితాలు మారడమే కాదు... ఆశ మళ్లీ జీవం పోసుకుంటుంది అని ట్వీట్ చేశాడు. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు మనోజ్ ప్రకటించాడు. ఈరోజు నుంచి వారి బాధ్యతలు తనవేనని హామీ ఇచ్చాడు. Before celebrating birthdays, me and my wife @BhumaMounika wanted to begin with service.Life’s journey has taught us that beyond every high and low, what truly matters is humanity and the people who stand beside us.This spirit of service did not begin today. It has always… pic.twitter.com/p6gg3HqljP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 17, 2026 చదవండి: పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే.. -
తెలుగు క్రికెటర్తో శ్రీలీల డేటింగ్..!
కన్నడ ముద్దుగుమ్మ, హీరోయిన్ శ్రీలీల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ ప్రస్తుతం ధనుష్కు జంటగా కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మపై గతంలో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చాయి. వినాయక చవితి వేడుకల కోసం ఆమె తన తల్లితో కలిసి ముంబయిలోని కార్తీక్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు వైరలయ్యాయి. అదే సమయంలో తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో మరింత ఆజ్యం పోసింది. కానీ వీటిపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.(చదవండి: రామ్ చరణ్ మణికట్టుకు గాయం.. ఎల్లుండి ఆపరేషన్!)తాజాగా శ్రీలీలపై మరోసారి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ సారి ఏకంగా టీమిండియా క్రికెటర్తో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ కథనాలొస్తున్నాయి. మన తెలుగువాడు, యంగ్ క్రికెటర్తో డేటింగ్ చేస్తోందని కథనాలు మొదలయ్యాయి.ఏడాదిగా రూమర్స్.. శ్రీలీల, తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారని గతేడాది నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించారని వార్తలు రావడంతో రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. దాదాపు ఆరు నెలల క్రితమే శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను సందర్శించింది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.ఆ తర్వాత ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల, ఆమె తల్లితో పాటు ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి కనిపించడంతో రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. -
రామ్ చరణ్కు మరో ఆపరేషన్.. ?
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ మరికొద్ది రోజుల్లో(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం రామ్ చరణ్ కష్టపడ్డాడు. దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్ పడిన కష్టం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్తో పాటు నిర్మాత కూడా చరణ్ పడిన కష్టం గురించే చెబుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే క్రమంలో చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారట. దాదాపు మూడు పెద్ద గాయాలు అయ్యాయట. కానీ బయటకు మాత్రం కంటికి గాయం అయిందన్న విషయమే తెలిసిందే. ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నప్పుడు చరణ్ మణికట్టుకు కూడా తీవ్రంగా గాయం అయిందట. అయినా కూడా షూటింగ్కి బ్రేక్ ఇవ్వలేదట. ఇప్పుడా నొప్పి కాస్త ఎక్కువైపోవడంతో వైద్యులను సంప్రదిస్తే.. సర్జరీ చేయాలని చెప్పారట. రెండు రోజుల్లో చరణ్ మణికట్టు దగ్గర చిన్న సర్జరీ చేయించుకోబుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెంకట సతీష్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. చరణ్కు తగిలిన గాయాల గురించి వివరించాడు.‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు మూడు గాయాలు అయ్యాయి. అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్లో పాల్గొన్నాడు. కంటికి మాత్రమే కాదు మణికట్టు దగ్గర కూడా గాయం అయింది. ఇప్పుడా నొప్పితో బాధపడుతున్నాడు. ఎల్లుండి(మంగళవారం) ఆపరేషన్ ఉంది. షూటింగ్ సమయంలో కండరాలు పట్టేసేవి. షూటింగ్ గ్యాప్లో జిమ్ చేసి వచ్చేవాడు. కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్లో ఆయన కండరాలు పట్టేశాయి. కాలు కూడా బెణికింది. ఆయన కోసం ప్రత్యేకంగా ఫిజియో థెరపిస్ట్ పెట్టాల్సివచ్చింది. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి నటించాడు. సినిమా చూస్తే అందరికి ఆ విషయం అర్థవవుతుంది. సినిమా ప్రారంభం నుంచే పెద్ది ప్రపంచంలోకి వెళ్తారు’ అని సతీష్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల చరణ్ కంటికి చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మణికట్టుకు కూడా మరో సర్జరీ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
మేం అమ్మనాన్న అయ్యాం.. కమెడియన్ పోస్ట్
జబర్దస్త్ కామెడీ షోతో చాలామంది కమెడియన్లు గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లలో కెవ్వు కార్తిక్ ఒకడు. ప్రారంభంలో అవినాష్తో కలిసి స్కిట్స్ చేసిన ఇతడు తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రవీణ్తో కలిసి షోలో కనిపిస్తున్నాడు. ఇకపోతే రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు కార్తీక్ వెల్లడించాడు.(ఇదీ చదవండి: అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?)మేం అమ్మనాన్న అయ్యాం. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది. అమ్మని కోల్పోయిన సరిగ్గా రెండేళ్లకు ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది అని కెవ్వు కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.కార్తిక్తో స్కిట్స్ చేసిన అవినాష్ కూడా రెండు మూడు రోజుల క్రితమే తండ్రయిన విషయాన్ని బయటపెట్టాడు. కొడుకు పుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పిల్లాడి ఫొటోలని పంచుకున్నడు. మరోవైపు కార్తిక్తో ప్రస్తుతం స్కిట్స్ చేస్తున్న ప్రవీణ్.. రీసెంట్గానే నటి వంశీతని పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
'ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది'.. నటికి డైరెక్టర్ కౌంటర్
టాలీవుడ్ నటి సునయన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్లో తాను లేకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ కూడా ఫుల్ డిసప్పాయింట్కు గురయ్యారని వెల్లడించింది. విదేశాల్లో షూట్కు వెళ్లినప్పుడు కాస్తా గ్యాప్ దొరికితే ఎవరైనా షాపింగ్ వెళ్తారని చెప్పింది. అంతమాత్రాన నా ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్లో నుంచి తీసేయండి చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది.షాపింగ్ వెళ్తే ఎలా ఉంటారు.. డైరెక్టర్ కౌంటర్సునయనకు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ కౌంటరిచ్చారు. పారిస్ లాంటి లోకేషన్స్కు వెళ్లినప్పుడు.. షూట్లో లేకుండా మీరు షాపింగ్కు ఎలా వెళ్తారండి అని ప్రశ్నించారు. పారిస్ వరకు వచ్చాక మీరు షూటింగ్ లోకేషన్లో అందుబాటులో ఉండాలి కదా అని నిలదీశారు. అక్కడేక్కడో మిక్చర్ బాగుంటుంది.. ఇక్కడెక్కడో బజ్జీలు బాగుంటాయంటా? అని మీరు వెళ్తే మరి ఫోటోలో ఎలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చివరికీ మిమ్మల్ని యాడ్ చేసేందుకు వీఎఫ్ఎక్స్లో కూడా ట్రై చేశామన్నారు. కానీ నేచురల్ లుక్ రాకపోవడంతోనే నేనే వద్దని చెప్పానని డైరెక్టర్ అభిరామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది మీ బ్యాడ్ లక్ అండి.. ఈ విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేనని కౌంటరిచ్చారు. ఇప్పుడు ఈ మ్యాటర్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. కాగా.. సునయన బదం పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా మెప్పించింది. -
త్రిష కోసం ఆ పనిచేశా.. చెప్పాలంటే భయంగా ఉంది!
చిన్మయి శ్రీపాద.. పాటలు పాడటమే కాదు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటుంది. అలా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో త్రిషకు కూడా తనే గొంతు అరువిచ్చింది. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమేసిందంటోంది చిన్మయి. ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.నిజంగా భయపడ్డా..'మీకు ఈ విషయం ఎలా చెప్పాలా? అని నన్ను నేను సిద్ధం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. కరుప్పు సినిమాలో త్రిషకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ మాట చెప్పేందుకు నేను నిజంగా భయపడ్డాను. ఆర్జే బాలాజీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడు, అతడి భార్య ఎంతో మంచివాళ్లు. బాలాజీ ఎంతో పట్టుదల, ధృడ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తాడు. నాకు అతడి గురించి, అతడి కుటుంబం గురించి బాగా తెలుసు. అందుకే అతడి గురించి భయపడ్డాను. వెక్కివెక్కి ఏడ్చా..గతంలో లియో సినిమా(త్రిష కోసం డబ్బింగ్ చెప్పినందుకు) విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అతడికి ఎలాంటి వ్యతిరేకతలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాను. ఆ మూవీలో కొన్ని సీన్స్కు డబ్బింగ్ చెప్పేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. గతంలో జరిగిందంతా మళ్లీ నా కళ్లముందు కదులుతున్నట్లే అనిపించింది.థాంక్యూ బాలాజీఏదేమైనా ఈ సినిమాలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్నిచ్చినందుకు థాంక్యూ బాలాజీ. నా సొంతగడ్డపై ఎటువంటి బెరుకు లేకుండా, తర్వాత ఏం జరుగుతోందనన్న భయం లేకుండా నా పని నేను ధైర్యంగా చేసుకునే శక్తిని ఆ కరుప్పు సామి ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏళ్ల తరబడి పని చేసుకోకుండా నిషేధించబడ్డ నాకు, నాలాంటి బాధితులను దేవుడు అనుగ్రహించుగాక!' అంటూ #KaruppuBlockbuster అనే ట్యాగ్ జత చేసింది చిన్మయి.చిన్మయిపై బ్యాన్2018లో మీటూ ఉద్యమ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధా రవిపై చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తమిళనాడులోని 'సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్' (SICTADAU) చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి నిషేధం విధించింది. ఆమెపై బ్యాన్ ఉన్నప్పటికీ లోకేశ్ కగనరాజ్ లియో (2023) మూవీలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని చిన్మయికి ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కరుప్పులో త్రిషకు తనే డబ్బింగ్ చెప్పింది. Strange I am readying myself saying this... I was genuinely afraid this time, of sharing that I dubbed in Karuppu. I have known R J Balaji a long time - he and his wife, are such lovely people and RJB himself, is someone whose entire life is such a story of grit,…— Chinmayi Sripaada (@Chinmayi) May 16, 2026 చదవండి: విజయ్- త్రిషలపై చీప్ ప్రశ్న.. రాజాసాబ్ బ్యూటీ ఆగ్రహం -
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కాదు.. ఎవరంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
తప్పు తనదే అన్నాడు.. చరణ్లా ఏ హీరో ఒప్పుకోరు : ఫైట్ మాస్టర్
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్గా వర్క్ చేసిన నబా కాంత్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ–‘‘మాది మణిపూర్. నా చిన్నప్పుడే నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. నాన్నగారి స్ఫూర్తితో ఇదే ఫీల్డ్లో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నాను. స్టంట్స్లో నాకు 18 ఏళ్ల అనుభవం ఉంది. విజయ్, రామ్–లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్ మాస్టర్గా వర్క్ చేశాను. ‘పుష్ప’ చిత్రంతో యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాను. ఆ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ చూసి, ‘మా పేరు నిలబెట్టావ్’ అని రామ్–లక్ష్మణ్ మాస్టర్లు అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పుష్ప 2, మన శంకర వరప్రసాద్గారు, డెకాయిట్’ సినిమాలకు వర్క్ చేశాను. తాజాగా ‘పెద్ది’ సినిమా చేశాను. ఫస్ట్ గ్లింప్స్లో సరికొత్త బ్యాటింగ్ స్టైల్తో చరణ్గారు సిక్సర్ కొట్టే షాట్ను నేనే కంపోజ్ చేశాను. మా గురువుగారు రామ్–లక్ష్మణ్మాస్టర్లు ఈ సినిమాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ చేశారు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చరణ్కి గాయమైంది. ఓ రోల్ మూమెంట్లో తనకి పొరపాటున అలా జరిగింది. ఆ క్షణంలో నేను ఏడ్చేశాను. కానీ, చరణ్ మాత్రం పొరపాటు తనవైపే ఉందని చెప్పారు. నిజంగా ఏ హీరో అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్కి ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేయించుకుని మరుసటి రోజే షూట్కి వచ్చేశారు. నేనైతే షాక్ అయిపోయా.ఇందులో కుస్తీ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్గారి నాన్నగారు శ్యామ్ కౌశల్ను సంప్రదించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ‘పెద్ది’ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఎమోషన్స్కు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనా ర్ధన’, చిరంజీవి–బాబీ, సల్మాన్ఖాన్–వంశీగార్ల సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
'ఎంత పని చేశావయ్యా?'.. పెద్ది డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..!
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కానుంది.అయితే ట్రైలర్ రిలీజ్కు ముందే మెగాస్టార్ ట్రైలర్ వీక్షించారు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఫుల్ ఫైర్పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని ప్రశంసలు కురిపించారు. చరణ్… బుచ్చి… రెహమాన్… ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్నెస్ అన్ని నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయన్నారు. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి.."మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అంటూ పెద్ది డైలాగ్ లీక్ చేశారు. నన్ను క్షమించు బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పాను అంటూ చిరు ట్వీట్ చేశారు. #PeddiTrailer చూసాను!! 🔥Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026 -
చిరంజీవి-బాబీ, రామ్ చరణ్-సుకుమార్.. హిట్ కాంబినేషన్ రిపీట్
ఓ సినిమా హిట్ అయిందంటే ఆ చిత్రకథానాయకుడు–దర్శకుడు, హీరో–హీరోయిన్... వీరిది ‘హిట్ కాంబినేషన్’ అనే ఇమేజ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఓ హీరో–ఓ డైరెక్టర్ కాంబినేషన్లో ఒక హిట్ మూవీ వచ్చిందంటే చాలు.. వారి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇప్పటికే తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో పని చేయడానికి హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ హీరో–డైరెక్టర్ కాంబోని రిపీట్ చేసేందుకు నిర్మాతలు కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే హిట్ కాంబినేషన్లో మరో మూవీ వస్తోందంటే బిజినెస్ పరంగానూ నిర్మాతలకు బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం చిరంజీవి–బాబీ, వెంకటేశ్, కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి, బాలకృష్ణ– గోపీచంద్ మలినేని, రామ్చరణ్–సుకుమార్, నాని–శ్రీకాంత్ ఓదెల, విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాయన్, శ్రీ విష్ణు– రామ్ అబ్బరాజు వంటి హీరోలు–డైరెక్టర్స్ కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’కి సీక్వెల్గా ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ‘కల్కి 2898 ఏడీ 2’, ఎన్టీఆర్–కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ వంటి సీక్వెల్ సినిమాలు కూడా రానున్నాయి. ఆ విధంగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లే. అయితే సీక్వెల్స్తో కాకుండా డైరెక్ట్ మూవీస్తో సిల్వర్ స్క్రీన్పై మరోసారి హిట్ మ్యాజిక్ని రిపీట్ చేయనున్న హీరోలు–దర్శకుల సినిమాల గురించి తెలుసుకుందాం. రెండోసారి... హీరో చిరంజీవి–డైరెక్టర్ బాబీ కొల్లిలది (కేఎస్ రవీంద్ర) హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో హీరో రవితేజ నటించడం విశేషం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి– బాబీ కొల్లి కాంబినేషన్లో రెండో సినిమాకి శ్రీకారం చుట్టారు. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రమిది. ‘చిరుబాబీ2’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్పై వెంకట్ కె. నారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి చిరంజీవి లుక్ టెస్ట్ని కూడా పూర్తి చేసినట్లు ఏప్రిల్ 28న చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘చిరుబాబీ2’ మరో ప్రతిష్టాత్మక ్ర΄ాజెక్ట్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ సినిమాలో పవర్ఫుల్, స్ట్రైకింగ్ లుక్లో చిరంజీవి కనిపించబోతున్నారు. మాస్ ఎంటర్టైన్మెంట్ను తనదైన స్టైల్లో అద్భుతంగా అందించే బాబీ ఈసారి చిరంజీవి కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్ను డిజైన్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. ఈ కాంబినేషన్ నుంచి ఓ భారీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రాబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్పై ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రానికి ‘కాకాజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ నెల చివరి వారంలో ఈ సినిమాని ప్రారంభించి జూన్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో శరవేగంగా తెరకెక్కించనున్నారట బాబీ. క్రేజీ మల్టీస్టారర్ హీరో వెంకటేశ్–డైరెక్టర్ అనిల్ రావిపూడిలది క్రేజీ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఎఫ్ 2’. ఈ మూవీలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. 2019 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో వినోదాల జల్లులు కురిపించింది. ‘ఎఫ్ 2’ వంటి హిట్ మూవీ తర్వాత వెంకటేశ్–వరుణ్ తేజ్లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ 2022 మే 27న రిలీజై విజయం సాధించింది. వెంకటేశ్ సోలో హీరోగా అనిల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు... వెంకటేశ్ తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్లో చేశారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్ వెంకీ గౌడ అనే కీలకమైన పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... హీరోలు వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీని ప్రకటించారు అనిల్ రావిపూడి. ‘పటాస్’ (2015) సినిమాతో అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేశారు కల్యాణ్ రామ్. పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతుండటం విశేషం. ‘‘ఈ కొత్త చిత్రాన్ని క్లీన్, టిపికల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూ΄÷ందించనున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్లా ఉంటుంది. అనిల్ ట్రేడ్ మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో రూపొందించనున్న మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్గా నిలిచేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ–్ర΄÷డక్షన్ దశలో ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.పవర్ఫుల్ జడల్ హీరో నాని పూర్తి స్థాయి ఫుల్ మాస్ లుక్లో కనిపించిన చిత్రం ‘దసరా’. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే నాని వంటి క్లాస్ హీరోని ఊర మాస్ లుక్లో చూపించి, హిట్ అందుకున్నారు దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా 2023 మార్చి 30న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. ‘దసరా’లో నానీని ఫుల్ మాస్ లుక్లో చూపించిన శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’లో అంతకు మించి అన్నట్లుగా రా రస్టిక్ పాత్రలో చూపించనున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన ΄ాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ సినిమా తెలుగుతో ΄ాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానుంది.మరోసారి... హీరో బాలకృష్ణ– డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘వీర సింహారెడ్డి’. 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ‘వీర సింహారెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో రూ΄÷ందుతోన్న ద్వితీయ చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబయ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో జరుగుతోంది. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్తో సుమారు 30 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి, దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్బీకే 111’లో హీరోయిన్గా తొలుత నయనతార పేరు వినిపించింది. ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆర్సీ 17 కోసం... రామ్ చరణ్ కెరీర్లోని హిట్ మూవీస్లో ‘రంగస్థలం’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ‘చిరుత’ (2007) ‘ధృవ’ (2016) వరకూ లవర్ బాయ్గా, స్టైలిష్ క్యారెక్టర్స్లో కనిపించిన ఆయన్ను ‘రంగస్థలం’ చిత్రంలో పూర్తి స్థాయి మాస్ లుక్లో చూపించారు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ప్రత్యేకించి ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్లో రామ్చరణ్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్– సుకుమార్ కాంబినేషన్లో రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది. ‘రంగస్థలం’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) వంటి సినిమాలు తెరకెక్కించి, పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు సుకుమార్. ఈ చిత్రాల తర్వాత రామ్ చరణ్ హీరోగా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్) చేయనున్నారు సుకుమార్. ‘పుష్ప’ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న సినిమా కావడంతో ప్రకటనతోనే ‘ఆర్సీ 17’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ‘పెద్ది’ రిలీజ్ తర్వాత ‘ఆర్సీ 17’ షూటింగ్లో పాల్గొంటారట రామ్ చరణ్. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని సమాచారం. జూన్ 25 నుంచి ఈ మూవీ షూటింగ్ ్ర΄ారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా సుకుమార్ ఒక వినూత్నమైన ΄ాయింట్ను ఎంచుకున్నట్లు తెలిసింది.ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. వాస్తవ ఘటనలతో... హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2017 నవంబరు 17న విడుదలైన ఈ మూవీ హిట్గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న రెండో చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న భారీ ΄ాన్ ఇండియా మూవీ ఇది. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందుతోంది. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని హార్స్ రైడింగ్ సన్నివేశాల కోసం స్టాలియన్ బ్రీడ్ గుర్రాలపై స్వారీ చేయడానికి విజయ్ ఎలాంటి కఠినమైన శిక్షణ తీసుకున్నారు? ఈ క్రమంలో గాయాల్ని తట్టుకుని ఎలా విజయవంతంగా స్వారీ చేశారు? అన్నది ఈ గ్లింప్స్లో చూపించారు. ‘‘రణబాలి’లో ఈ సన్నివేశాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగుంటాయి. అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్ చేస్తున్నాను’ అని విజయ్ దేవరకొండ చెప్పారు. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ ΄ాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. రణబాలి పాత్రలో విజయ్ హార్స్ రైడింగ్ సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్గా నిలుస్తాయి. సెప్టెంబరు 11న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
విజయ్-త్రిషలపై చీప్ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్ బ్యూటీ
నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అనుచిత ప్రశ్నఇదే సమయంలో సీఎం విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన హీరోయిన్ మాళవిక మోహనన్ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. సంచలనం కోసం..ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్ నాకు ఏడేళ్లుగా పరిచయం. అద్భుతంఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసింది.సినిమామాళవిక మోహనన్ 2013లో తన సినీకెరీర్ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. ది రాజాసాబ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2, పాకెట్ నోవెల్ అని రెండు సినిమాలు చేస్తోంది. I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.Thalapathy Vijay is someone I’ve…— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026 చదవండి: టాలీవుడ్లో స్పెషల్ ఎంట్రీ -
కాన్స్ లో మెరిసిన భారత సినీ తారలు
ఫ్రాన్స్లో జరుగుతున్న 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ తారలు మెరిశారు. గత ఏడాది ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ తొలిసారిగా ఈ చిత్రోత్సవాల్లో మెరిశారు. ఈ ఫెస్టివల్ కోసమే అదితీ రావు హైదరి, డయానా పెంటీ ఫ్రాన్స్లో ఉన్నారు. నటి తారా సుతారియా కూడా తొలిసారిగా ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా’ వేదికపై తారా సుతారియాకు ప్రత్యేక సత్కారం జరిగింది. సంగీతం, థియేటర్ ఆర్ట్స్, నటిగా బహుముఖ ప్రతిభ చూపిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం లభించింది. ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా’ కార్యక్రమంలో హ్యూమా ఖురేషి సందడి చేశారు. ఇంకా అభినవ్ గోమటం, స్వాతీ శర్మ లీడ్ రోల్స్లో నటిస్తున్న తెలుగు చిత్రం ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ టీజర్, పోస్టర్ను రిలీజ్ చేశారు. వేణు నక్షత్రం దర్శకత్వంలో అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే జాన్ అబ్రహాం దర్శకత్వంలోని మలయాళ బ్లాక్బస్టర్ సినిమా ‘అమ్మ అరియాన్’ రీస్టోర్డ్ 4కే వెర్షన్ను ‘కాన్స్ క్లాసిక్’ విభాగంలో ప్రదర్శించారు. ఈ ఏడాది ఈ విభాగంలో ఎంపికైన ఏకైక భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు అమి విర్క్, రూపీ గిల్ లీడ్ రోల్స్లో నటించిన పంజాబీ సినిమా ‘చర్దోకలా’ ప్రదర్శితమైంది. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా రూపీ గిల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై మెరిశారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్న తొలి పంజాబీ సినిమా ‘చర్దోకలా’ కావడం విశేషం. గుజరాతీ నటి–నిర్మాత మానసీ పారేఖ్, సింగర్–నిర్మాత పార్దివ్ గోహిల్, చందు పటేల్ గుజరాతీ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం హాజరై, సందడి చేస్తున్నారు. ఈ నెల 23 వరకూ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
స్పెషల్ ఎంట్రీ
టాలీవుడ్కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. హవీష్ హీరోగా నటించిన ‘నేను రెడీ’ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ చేశారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ఇదే. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించారు. ‘‘నేను రెడీ’ సినిమా రీ–రికార్డింగ్ పనులతో సహా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. జూన్ రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం. హవీష్కు క్లీన్ కమర్షియల్ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
కొత్త అనుభూతినిచ్చేలా...
నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృష కర్మ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బి. సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్తాన్లో ఓ భారీ షెడ్యూల్ను పూర్తి చేశారు.దీంతో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపి, రాజస్తాన్ లొకేషన్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్ప కళతో కనిపిస్తున్న ఈ లొకేషన్స్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఓ హైలైట్ అని తెలుస్తోంది. ‘‘షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నాం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్కి ముందే పెంచేసిన హైప్
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్ మాత్రం ట్రయిలర్లోని ఓ కీలక డైలాగ్ను లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్ ట్రయిలర్లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్ చూశాక కంట్రోల్ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు. అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్ ట్రయిలర్పై ఉన్న హైప్ను అమాంతం పెంచేశారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న పెద్ది ట్రయిలర్పై చిరంజీవి చేసిన ఈ లీక్స్ ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. -
సన్నగా మారేందుకు సర్జరీ? క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్
బొద్దుగా కనిపించే హీరోయిన్లు, హఠాత్తుగా బక్కచిక్కిపోయి కనిపిస్తే ఎవరికైనా లేనిపోని సందేహాలు వస్తాయి. హీరోయిన్ కీర్తి సురేశ్ గురించి గతంలో ఇలానే అనుకున్నారు. 2018లో 'మహానటి'లో నిండుగా బొద్దుగా కనిపించిన ఈమె.. తర్వాత కాలంలో ముఖంలో జీవకళ కోల్పోయినట్లు సన్నగా మారిపోయి షాకిచ్చింది. దీంతో అసలు ఈమెకు ఏమైందా అనుకున్నారు. కొందరైతే సర్జరీ చేసుకుందేమోనని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ సందేహాలపై స్వయంగా కీర్తినే క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్)'2013లో నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఫిట్నెస్పై నాకేం అవగాహన లేదు. జిమ్ నా వల్ల కాదు అనుకునేదాన్ని. 2018లో 'మహానటి' చేసిన తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్నెస్పై దృష్టి పెట్టాలనుకున్నా. హెచ్ఐఐటీ, కార్డియో వర్కౌట్స్తో పాటు ఎక్కువ ప్రొటీన్, తక్కువ కార్బో డైట్ పాటించి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కానీ నేను ఇంత కష్టపడితే కొందరు మాత్రం బలహీనంగా కనిపిస్తున్నావు, సర్జరీలు చేయించుకున్నావా అని అన్నారు. అది నాకు ఆవేదన కలిగించింది''2020లో యోగా చేయడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శరీరంపై ప్రేమ పెరిగింది. సరైన విధంగా జిమ్ చేస్తే ఎంత ఉపయోగమో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో అర్థమైంది. ప్రస్తుతం స్ట్రెంగ్త్ ట్రైనింగ్తోపాటు యోగా, అనిమల్ ఫ్లో, కార్డియో, కాలిస్థెనిక్స్ను బ్యాలెన్స్గా చేస్తున్నాను. ఇప్పుడే నా జీవితంలో బెస్ట్ ఫేజ్లో ఉన్నా''అయితే నా చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నానని సన్నబడమని చెప్పినవాళ్లే.. ఇప్పుడు సన్నబడిన తర్వాత గతంలోనే బాగున్నావని అంటున్నారు. అసలు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఈ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నవడం వల్లే బయట కనిపించలేదు. జీవితంలో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాల్సి రావచ్చు. కానీ జిమ్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.కేరళకు చెందిన కీర్తి సురేశ్.. 'నేను శైలజ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'మహానటి'తో అదరగొట్టి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా దక్కించుకుంది. రీసెంట్ టైంలో టాలీవుడ్లో పెద్దగా నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లో చేస్తోంది.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
మహేశ్ సినిమా.. నేను అది తీసుకోలేకపోయాను
భారత ఆర్మీకి చెందిన గూఢచారులు అనగానే స్టైల్గా సూటు బూటు వేసుకుని ప్రైవేట్ జెట్స్లో తిరుగుతూ విలన్లని చితగ్గొట్టేస్తుంటారు లాంటి వాటినే ఇన్నాళ్లుగా సినిమాల్లో చూపిస్తూ వచ్చారు. అయితే ఓ గూఢచారి.. ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాడనేది 'ధురంధర్'లో కొంతమేర రియాలిటీకి దగ్గరగా చూపించారు. అయితే మన మూవీస్లో ఆర్మీని చూపించే తీరుపై మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)'ఆర్మీ సినిమాలు నాకు పెద్దగా నచ్చవు. 'ధురంధర్' పక్కనబెట్టేస్తే నిజానికి దూరంగా ఉంటాయి. అందుకే నేను వాటిని చూసేందుకు వెళ్లను కూడా. మహేశ్ బాబు మూవీ(సరిలేరు నీకెవ్వరు) ఏదో ఉంది. బాంబు ఉంటే పక్కనే కూర్చుని కాఫీ తాగుతుంటాడు. అదంతా చూసి నాకు కామెడీగా అనిపిస్తుంది. ఇదే సినిమాకు నా ఫ్రెండ్తో కలిసి వెళ్లాను. నేను నవ్వుతుంటే.. అరేయ్ నవ్వకురా జనాలు కొడతార్రా అని అన్నాడు. మరి ఆ సీన్ అలా ఉంది ఏం చేయమంటావ్ అని అడిగా. నువ్వు ఆర్మీ వాడివి అని తర్వాత అడుగుతార్రా, ఫస్ట్ కొడతారు అని ఫ్రెండ్ నాతో అన్నాడు. దీంతో నేను థియేటర్ నుంచి బయటకొచ్చేశా. ఆర్మీని వాళ్లు అపహస్యం చేసినట్లు అనిపించింది. నేను అది తీసుకోలేకపోయాను' అని మేజర్ ఒబెరాయ్ చెప్పుకొచ్చారు.సినిమాలంటేనే రియాలిటీకి ఆమడ దూరంలో ఉంటాయి. వాటిలో లాజిక్స్ వెతకలేం. 'సరిలేరు నీకెవ్వరు'లోనూ అదే తరహాలో ఉంటాయి. విలన్ ప్రకాశ్ రాజ్ని చివరలో ఆర్మీ చేర్పించే సీన్స్పై రిలీజ్ టైంలోనే విమర్శలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆర్మీ మేజర్.. ఈ ప్రస్తావన తీసుకురావడంతో మహేశ్ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే) -
దీనస్థితిలో పావలా శ్యామల.. అండగా నిలిచిన దిల్ రాజు!
అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటి పావలా శ్యామలకు నిర్మాత దిల్ రాజు అండగా నిలిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు దిల్ రాజు తన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించాడు. తన మేనేజర్ల ద్వారా అక్కడి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.కాగా, గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, డబ్బులు లేవని ఆమెను బయటకు పంపించేశారు. క్యాబ్ డ్రైవర్ ఆమెను అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆమెను పట్టించుకునేవారే లేరని, తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించాడు.తన మేనేజర్ల ద్వారా శ్యామల ప్రస్తుతం కూకట్పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారని ట్రేస్ చేయించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు స్వయంగా ఆసుపత్రి వైద్యులను ఫోన్లో సంప్రదించి శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడిన దిల్ రాజు, ‘శ్యామల గారికి పూర్తిస్థాయి చికిత్స అందించండి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. మా మేనేజర్లు మీతో టచ్లో ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.కన్నీళ్లు పెట్టుకున్న శ్యామలదిల్ రాజు టీమ్ పావలా శ్యామలను కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో కూడా చాలా సార్లు దిల్ రాజు సహాయం చేశాడని..మరోసారి తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అని శ్యామల పేర్కొంది. పావలా శ్యామలకు అండగా దిల్ రాజుProducer #DilRaju stepped in to ensure she received proper care. He immediately sent his team to the hospital to assess her condition and coordinate with doctors.#PavalaShyamala pic.twitter.com/lOJOcejaWL— Milagro Movies (@MilagroMovies) May 16, 2026 -
సమంతని ఇలా చూసుండరేమో.. హన్సిక జీరో సైజ్!
షాకింగ్ లుక్లో కనిపించిన సమంతనడుము అందాలతో హన్సిక పోజులుబీచ్లో నోరా ఫతేహి గ్లామరస్ డ్యాన్స్పూల పక్కన మెరిసిపోతున్న నయనతారకళ్లద్దాలతో రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మకొత్త హెయిర్ స్టైల్తో ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Savleen kaur manchanda (@savleenmanchanda) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) -
అది నా అదృష్టం.. గర్వంగా ఉంది : రాగ్ మయూర్
‘నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా నటుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది’ అని రాగ్ మయూర్ అన్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాగ్ మయూర్.. ఇండస్ట్రీకి వచ్చి ఈ శుక్రవారం(మే 15)తో ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 👉 సినిమా బండి రిలీజ్ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాలు యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్కు మరింత దగ్గర చేశాయి. ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’కు రీమేక్గా వచ్చిన ‘సివరాపల్లి’ నటుడిగా మరింత గుర్తింపు తెచ్చింది.👉 ‘సివరాపల్లి’ సూపర్హిట్ తర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చింది. చాలా మంది దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలను రాశామని చెప్పారు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయటం అనేది నటుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావటంతో నటనలో విభిన్న కోణాలను అన్వేషించే అవకాశం దక్కింది. అది నా నటనను మరింత మెరుగు పరిచింది.👉 ‘శుభం’లో క్యామియో రోల్ చేశా. అది చిన్న క్యామియో పాత్రే అయినా, ఓ బ్లాక్బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన సమంత గారికి కృతజ్ఞతలు. 👉 ప్రస్తుతం డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము తెరకెక్కిస్తోన్న ‘గరివిడి లక్ష్మి’లో బుర్రకథ కళాకారుడి పాత్ర చేశా. ఇది చాలా ఎక్సైటింగ్తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి నటించాను.👉 నా ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉంది. కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను’ అని అన్నారు. -
త్రిషకు నేనంటే ప్రాణం.. నా వల్ల కాదు అని ఏడ్చేసింది
అప్పడెప్పుడో 1999లో సినిమాల్లోకి వచ్చిన త్రిష.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్ని కవర్ చేస్తోంది. అయితే తమిళనాడు సీఎంగా విజయ్ గెలవడం మాటేమో గానీ సోషల్ మీడియాలో ఈమెనే ట్రెండ్ అయిపోతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)'మహేశ్ బాబు 'అర్జున్' కోసం త్రిషని ఆడిషన్ చేశారు కానీ ఎందుకో ఈ అమ్మాయి సెట్ అవ్వదని దర్శకుడికి అనిపించింది. మహేశ్ దగ్గర ఆ ఫొటోలని చూసి ఆమెని కలవాలనుకున్నాను. ఆ టైంకి ఛాన్సులు రాకపోవడంతో కొంచెం నిరాశలో ఉంది. నా నుంచి ఫోన్ రాగానే తెగ ఆనందపడింది. తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్లి చూసి ఓకే అనుకున్నాక 'వర్షం'లో హీరోయిన్గా సెలెక్ట్ చేశా. షూటింగ్లో 75 రోజుల పాటు వర్షంలో తడుస్తూనే షూటింగ్ చేసింది. ట్రైన్ నుంచి దూకే సీన్స్ చేయలేక నా వల్ల కాదు అని ఏడ్చేసింది. నేను ధైర్యం చెప్పి ప్రోత్సాహించడంతో నేను కచ్చితంగా చేస్తానని అంది. ఈ మూవీ రిలీజైన తర్వాత త్రిష మా ఇంటిలో మనిషి అయిపోయింది. అందుకే ఆమెని చిన్నపిల్లలా ట్రీట్ చేసేవాడిని''త్రిషకు నేనంటే ప్రాణం. ఎంతలా అంటే ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వాళ్లు..'రాత్రి 3 గంటలకు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు' అని ఆమెని అడిగితే మరో ఆలోచన లేకుండా నా పేరు చెప్పింది. నాపై ఆమెకు అంత నమ్మకం ఉండేది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాకు హీరోయిన్ని ఇంకా ఎవరిని అనుకోలేదు. కానీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేసింది. భోజనం చేసి తన డేట్స్ బుక్ ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తానని చెప్పింది. ఇక 'ఆట'లో ఇలియానాని హీరోయిన్గా పెట్టినందుకు నాపై అలిగింది. నేను షూటింగ్కి వచ్చేస్తానని వరసపెట్టి ఫోన్లు చేస్తూనే ఉంది. షూటింగ్ మొదలైపోయింది. ఆపడం కుదరదు అనే చెప్పడంతో శాంతించింది' అని ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు.వీళ్లిద్దరి కాంబినేషన్లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి సినిమాలు వచ్చాయి. వీటిలో తొలి రెండు సూపర్ హిట్ కాగా మూడోది మాత్రం బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. అప్పట్లో స్టోరీ అందించి నిర్మాతగా వ్యవహరించిన ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు దర్శకుడిగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన 'అగధ' విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లలోనే త్రిషతో తన బంధం గురించి చెప్పారు.(ఇదీ చదవండి: శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్లో 'ధురంధర్ 2') -
తండ్రయిన అవినాష్.. అప్పుడు రోడ్డుపై పిచ్చోడిలా.. ఇప్పుడేమో!
కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రయ్యాడు. ఏడాది కిందటే తండ్రయినప్పటికీ చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు బాబు పుట్టిన సంగతిని పన్నెండు నెలలుగా దాచి ఇప్పుడు బయటకు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. గతేడాది మే 14న తనకు కొడుకు పుట్టాడని, అతడికి అద్వైత్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. కొడుకు మొదటి పుట్టినరోజును ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయగా.. ఈ వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.2021లో పెళ్లిఅయితే అవినాష్ తన కొడుకును వెంటనే పరిచయం చేయకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఇతడు 2021 నవంబర్లో అనూజను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ 2023లో గుడ్న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫోటోలు, మెటర్నటీ షూట్, సీమంతం వీడియోలతో తెగ సందడి చేశారు. కానీ, ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 2024 ప్రారంభంలో అబార్షన్ అయిందని చేదువార్త చెప్పాడు. విషాదంతెల్లవారితే డెలివరీ అనగా అనూజ కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఏదో ఒకటి చేసి బిడ్డను బతికించమని డాక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడు అవినాష్. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయాక తిరిగి బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదని వైద్యులు చేతులెత్తేశారు. ఊహించని ఈ విషాదానికి పిచ్చోడైపోయాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు రోడ్డుపై ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. అందుకే ఇంత సీక్రెట్2.75 కిలోల బరువుతో పుట్టిన బిడ్డలో ప్రాణం లేకపోవడం మా ఇద్దర్నీ ఎంతో కుంగదీసిందంటూ ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తన బాధను పంచుకున్నాడు. అందుకే అనూజ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఎవరితోనూ ఆ వార్తను పంచుకోలేదు. కనీసం కొడుకు పుట్టాక కూడా ఎవరికీ చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: చిన్న వయసులోనే పెళ్లి.. గర్భస్రావం.. హీరోను వదిలేస్తున్నా: సింగర్ -
నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి
గత కొంతకాలంగా హీరో జయం రవి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆయన పర్సనల్ లైఫ్పై పుకార్లు ఎక్కువయ్యాయి. సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో ఆయన రిలేషన్లో ఉండడం.. విడాకులకు ఆమెనే కారణం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోల్ చేశారు. అయితే తాజాగా సింగర్ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జయం రవి మీడియా ముందుకు వచ్చాడు. ఈ వివాదాలపై మాట్లాడుతూ ఎమోషన్ అయ్యాడు.నరకం చూశా.. ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతుందని.. ఇన్నేళ్లు ఎలాంటి మచ్చ లేకుండా బతికిన తాను.. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. ‘పెళ్లైయిన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో కనీసం గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారు. ఎంతో ఇష్టంగా కోట్లాది రూపాయలకు కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే(ఆర్తి) స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కనీసం నా పిల్లలను కూడా చూడనివ్వడం లేదు. ఫోన్లు లాక్కున్నారు. స్కూల్కి బాడీగార్డ్స్ని పెట్టి పంపిస్తున్నారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి నన్ను నాపై ట్రోలింగ్ చేస్తున్నారు. నా బిడ్డల భవిష్యత్తు కోసమే అన్నీ భరించా.(చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!)చేతబడి చేశారు.. ఇంట్లో ఉన్నప్పుడు నేను వారి చెప్పుచేతుల్లో ఉండడానికి నాపై చేతబడి చేశారు. నన్ను పూర్తిగా అనచివేయడానికి ఇలా చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్ల ఇప్పుడు నాకు రక్తంతో వాంతులు అవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా హింసించి నన్ను చంపేయాలని కుట్ర చేస్తున్నారు. అయితే అందరి సంగతి తేల్చేవరకు నేను పోరాడుతూనే ఉంటా. అప్పటి వరకు నటించను45 ఏళ్ల వయసులో అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలలో మహిళల హక్కుల గురించి మాట్లాడే తాను, ఆడవారి గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని లక్షలు పెట్టి చదివించాను. అయినా కూడా వాళ్లపై నాకు ప్రేమ లేదని రాయించారు. అవి ఎంత భాదిస్తాయో తెలుసా? ఇన్నాళ్లు నన్ను అర్ధం చేసుకుని తోడుగా నిలిచిన కేనీషాను కూడా టార్గెట్ చేసి వేధింపులు చేసి ఆమెను పంపించేశారు. మూడక్షరాల ఇడ్లీ నటి నా జీవితాన్ని నాశనం చేసింది.. నాతో పాటు ఎన్నో కుటుంబాలను ఆమె కూల్చింది. నా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకుని .. నా భార్యతో విడాకులు తీసుకున్నాకే తిరిగి సినిమాలలో నటిస్తా, అప్పటి వరకు నటించనని జయం రవి వెల్లడించారు. View this post on Instagram A post shared by Sun News Tamil (@sunnews) -
కేన్స్ వేదికపై మన సినీ ప్రమోషన్!
ఫ్రాన్స్లో ఏటా జరిగే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కేన్స్ చలనచిత్రోత్సవం ఈసారి కూడా సందడిగా సాగుతోంది. మే నెల 12న మొదలైన ఈ ఏటి 79వ కాన్ చలనచిత్రోత్సవంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఫ్రెంచ్ పీరియడ్ – కామెడీ చిత్రం ‘ది ఎలక్ట్రిక్ కిస్’తో ఆరంభమైన ఈ వేడుకలో భారత ప్రభుత్వం సైతం మన దేశీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయంగా మరింత మందికి చేరువ చేసేందుకు ‘భారత్ పెవిలియన్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’, అలాగే వందేళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ప్రతిష్ఠాత్మక భారతీయ వ్యాపార సంఘం ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) సమష్టిగా వివిధ భారతీయ సినిమాల ప్రమోషన్కు ఈ ‘భారతీయ పెవిలియన్’ ద్వారా వేదికను కల్పిస్తున్నాయి.తెలుగు నుంచి సోషియో - ఫ్యాంటసీగా...వివిధ దేశాల సినీ రంగాలకు ఏర్పాటు చేసిన పెవిలియన్ల లానే భారతీయ సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా పెట్టిన ‘భారత్ పెవిలియన్’లో మే 15, శుక్రవారం ఓ తెలుగు సినిమా ప్రమోషన్ కూడా జరగడం విశేషం. ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ (ఆటాడిన పాట) అనే తెలుగు చిత్రం టీజర్, పోస్టర్ విడుదల అక్కడ జరిపారు. నక్షత్రం ప్రొడక్షన్స్ పతాకంపై అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రముఖ కథా, నవలా రచయిత వేణు నక్షత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. కాన్ ఫిలిం ఫెస్టివల్లో ‘లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ (ఎల్ఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అయిన క్యారీ సాహ్ని చేతుల మీదుగా ఈ సినిమా టీజర్, పోస్టర్ను ఆవిష్కరించి, సభికులకు ప్రదర్శించారు. సోషియో- ఫ్యాంటసీ జానర్లో రూపొందిన ఈ ‘ఆటాడిన పాట’లో అభినవ్ గోమఠం, స్వాతీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.“ఇదో వినూత్న ప్రయోగం. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయింది. తెలుగులో రూపొందించిన ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాం” అని రచయిత, దర్శకుడు వేణు నక్షత్రం తెలిపారు. ఈ చిత్రానికి రాహుల్ మాచినేని ఛాయాగ్రహణం, టి.ఆర్. సెల్వకుమార్ కూర్పు, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ‘భారత్ పెవిలియన్’లో జరిగిన ఈ చిత్ర కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సినిమా టీజర్ను ఆసక్తిగా గమనించారు. టీజర్ను ఆవిష్కరించిన క్యారీ సాహ్ని సహా పలువురు చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు సహకరించిన డైరెక్టర్ శర్వి, తదితర మిత్రులు, ఆహూతులకు వేణు నక్షత్రం ధన్యవాదాలు తెలిపారు.గుజరాతీ చిత్ర పరిశ్రమ సైతం...వివిధ భారతీయ భాషా చిత్రాలు అంతర్జాతీయంగా తమను తాము మార్కెట్ చేసుకొనేందుకు కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ పెవిలియన్ వేదికను కల్పిస్తోంది. ఇప్పటికే పలు భారతీయ భాషా చిత్ర పరిశ్రమలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. హిందీ టీవీ నుంచి గుజరాతీ చిత్రసీమలో ప్రముఖ నటిగా ఎదిగి, గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్ ప్రెస్’ (2023) ద్వారా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మానసీ పారేఖ్ ఈసారి కాన్లో గుజరాతీ సినిమా పక్షాన జోరుగా ప్రచారం చేస్తూ, రకరకాల ఫ్యాషన్ దుస్తులతో ఫోటోలు దిగుతూ, అందరినీ ఆకర్షిస్తున్నారు. నిరుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ముఖ్య పాత్రగా చేసుకొని, అతి తక్కువ బడ్జెట్లో నిర్మాణమై, కనివిని ఎరుగని వసూళ్ళతో గుజరాతీ సినీ పరిశ్రమ వైపు దేశమంతా తిరిగి చూసేలా చేసిన సోషియో-ఫ్యాంటసీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్ర దర్శకుడు సహా పలువురు ఆ పరిశ్రమ నుంచి అక్కడ సందడి చేస్తున్నారు. ఈ మే 23 వరకు మరో వారం రోజుల పాటు ఈ కాన్ చలనచిత్రోత్సవం సాగనున్నందున తెలుగు చిత్రసీమతో పాటు ఇతర భారతీయ భాషల నుంచి మరెన్ని విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. అటు వృద్ధాప్య సమస్యలు, ఇటు అనారోగ్యం ఆమెను మరింత కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్లో ఆశ్రయం పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి అస్వస్థతకు లోనవగా చికిత్స కోసం కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. దీన స్థితిలో నటికానీ చికిత్సకు సరిపడా డబ్బు తన దగ్గర లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరించింది. అంతేకాకుండా ఓ క్యాబ్ ఎక్కించి ఆమెను బలవంతంగా పంపించేసింది. అయితే క్యాబ్ డ్రైవర్ సైతం ఆమెను మధ్యలోనే దింపేశాడు. కూకట్పల్లిలోని ఓ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన ఫుట్పాత్పై దించేసి నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడు. దీంతో అర్ధరాత్రి కటిక చీకటిలో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయింది. ఆస్పత్రిలో చికిత్సకాసేపటికి ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు.. ఆమె ఆశ్రయం పొందుతున్న ఆర్కే ఫౌండేషన్కు సమాచారమివ్వడంతో వారు తనను సనత్నగర్లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఒకప్పుడు తన నటనతో ఎంతోమందిని నవ్వించిన నటి ఇప్పుడిలా రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించడం చూసి సినీప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సాయం చేయడం కోసం తన టీంను ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.చదవండి: సూర్యకు భారీ పారితోషికం.. మరి త్రిషకెంతో? -
రామ్చరణ్ చేతికి గాయం? హీరోకు ఏమైంది?
గేమ్ ఛేంజర్తో భారీ డిజాస్టర్ను మూటగట్టుకున్న రామ్చరణ్ ఈసారి పెద్దితో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది. అయితే అప్పటివరకు గ్యాప్ లేకుండా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. బ్యాండేజ్తో చరణ్?మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్తో ఈ ప్రమోషన్స్ జర్నీ మొదలు కానుంది. పలు నగరాల్లో అనేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు. చివరగా జూన్ 2న హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన రామ్చరణ్ చేతికి బ్యాండేజ్తో కనిపించాడు. శుక్రవారం నాడు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్కు వెళ్లాడు చరణ్. చరణ్కు ఏమైంది?అనంతరం బయటకు వస్తుండగా అతడి కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో చరణ్కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షూటింగ్లో చరణ్ చేతికి చిన్న గాయమైందని, దాన్నుంచి త్వరగా కోలుకోవడానికే ఈ బ్యాండేజ్ ధరించాడని తెలుస్తోంది. #RamCharan - MAINTAINING HOLLYWOOD STAR LEVEL OF LOOKS - and Ram Charan is absolutely owning that long hair look🔥#ramcharan 💥 pic.twitter.com/SJ5IW73K9j— ROYAL BHARAT (INDIAN)🇮🇳 (@royal_mogile) May 16, 2026 చదవండి: స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు: సల్మాన్ ఖాన్ -
పవర్ఫుల్ లీలావతి
విరాట్ కర్ణ హీరోగా నటించిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నభా నటేష్, ఐశ్వర్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో లీలావతి పాత్రలో అనసూయ నటించినట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అనసూయ పాత్ర పవర్ఫుల్గా, కీలకంగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
కొత్త ప్రయాణం
బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు హీరో రామ్ పోతినేని. దర్శకుడిగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారాయన. శుక్రవారం (మే 15) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా రామ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఆయన దర్శకత్వం వహించనున్న తొలి సినిమా ఇదే. రామ్ కెరీర్లోని ఈ 23వ సినిమాను రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వీర అనే పాత్రలో నటించనున్నారు రామ్. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అనేది ఈ సినిమా క్యాప్షన్ . ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను జూన్ లో ప్రారంభించి, డిసెంబరులో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో వీర పాత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని లుక్లో రామ్ కనిపిస్తారు. ఒంటరితనం, మానసిక సంఘర్షణలతో నిండిన కొత్త పాత్ర ఆయనది’’ అని యూనిట్ పేర్కొంది. కాగా తన గత చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం రామ్ రచయితగా మారి తొలి పాట రాయడంతో పాటు పాటలు పాడారు. -
రెడ్ డ్రెస్లో మంచు లక్ష్మీ.. కేన్స్లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్లో అనన్య పాండే..జిమ్లో బిగ్బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న వీకే నరేశ్.. ఎన్ని కోట్లో తెలుసా?
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు విలువ దాదాపు రూ.2.5 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఖరీదైన స్పోర్ట్స్ కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు నరేశ్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. వీకే నరేశ్ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన, కామెడీతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది బ్యూటీ, హే బల్వంత్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. Live life King Size like Naresh pic.twitter.com/PaChEpGm9A— Journalist Nishant (@NishantOpinions) May 15, 2026 -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండుదర్శకత్వం: మధుదీప్ చెలికానినిర్మాత: అరవింద్ మండెంఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావుసంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు విడుదల తేది: మే 15, 2026కథేంటంటే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివస్తాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచేడానకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు. ఆ యాప్తో రైతుల జీవితం ఎలా మార్చాడు? మహి(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని అరవింద్ ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్ చూడగానే ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ అనుకుంటారు. కానీ ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి..వ్యవసాయం చేసుకునే యువకుడి కథను చెప్పాడు దర్శకుడు మధుదీప్ చెలికాని. అప్పట్లో ఎలాంటి ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్ద వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ నేటి తరం అలా ఉండటం లేదు. రసాయన ఎరువులు వాడిన కూరగాయలు, రైస్ తీసుకొని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో ఒకవైపు రైతుల కష్టాలను చూపిస్తూనే మరోవైపు ఆర్గానిక్ వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. దర్శకుడు పనితనం కొన్నిసన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. ఉన్నంతలో ఫస్టాఫ్ బాగానే ఉంటుంది. కొన్ని కామెడీ సీన్లు, లవ్ ఎపిసోడ్ పర్వాలేదు. కానీ సెండాఫ్లో కథనం స్లోగా సాగడంతో సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది.ఎవరెలా చేశారంటే..అరవింద్ పాత్రకి త్రిగుణ్ న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. సబ్ కమిటీ ఏర్పాటు
టాలీవుడ్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల అంశంపై ముందడుగు పడింది. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్సంటేజీ వివాదంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ పర్సంటేజీ సమస్యను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్కు సంబంధించిన పర్సంటేజీ విధానంపై చర్చ జరిగింది. సబ్ కమిటీ ఛైర్మన్గా డి. సురేష్ బాబు, కన్వీనర్లుగా అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎల్. నారాయణ, కె. అశోక్ కుమార్ ఉన్నారు. ఈ సబ్-కమిటీలో మూడు రంగాలకు (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) సమాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిర్మాతల రంగం నుంచి వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవి శంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, జి. శ్రీనివాస్ కుమార్(ఎస్కేఎన్), టి. ప్రసన్న కుమార్ సభ్యులుగా ఉన్నారు.ఎగ్జిబిటర్స్ రంగం నుంచి వి. ప్రతాప్ రెడ్డి, టి. బాల్గోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాస రావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్ రంగం నుంచి డి. విష్ణు మూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలేని కూడా ఉన్నారు. -
ది రాజాసాబ్పై కామెంట్స్.. సప్తగిరి క్షమాపణలు!
టాలీవుడ్లో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో సప్తగిరి ఒకరు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం పురుషః అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈవెంట్కు హాజరైన సప్తగిరి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చేసిన చిన్న సినిమాల గురించి చెప్పే క్రమంలో అనుకోకుండా ది రాజాసాబ్ పేరును కూడా కలిపేశారు. ఈ మధ్యే సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కావడంతో సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. సప్తగిరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా తాను చేసిన కామెంట్స్పై సప్తగిరి స్పందించారు. అలా మాట్లాడినందుకు నన్ను క్షమించాలని కోరారు. మినిమం బడ్జెట్ మూవీస్ చేస్తున్నాను.. ఆ సినిమాల లిస్ట్ చెబుతూనే ది రాజాసాబ్ పేరు చెప్పానని తెలిపారు. మారుతి కూడా నాకు ఫోన్ చేశారని.. సారీ చెప్పమని అడిగారని వెల్లడించారు. ఆయనకు కూడా సారీ చెప్పా.. ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పారు సప్తగిరి. -
‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: వీరభద్రుడునటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, ఆర్.జే బాలాజీ తదితరులునిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభురచన & దర్శకత్వం: ఆర్.జే బాలాజీసినిమాటోగ్రఫీ : జికె విష్ణుసంగీతం : సాయి అభ్యంకర్ఎడిటర్ : ఆర్.కళైవానన్విడుదల తేది: మే 15, 2026సూర్య ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కరుప్పు పైనే పెట్టుకున్నాడు. తెలుగులో ‘వీరభద్రుడు’పేరుతో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు. ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే..ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఒక కేసుని పరిష్కరించడానికి నెలల సమయం పడుతుంది. డబ్బులు ఉన్నవాడికే ‘న్యాయం’ జరుగుతున్న రోజులివి. సామాన్యుడు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తే.. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. అప్పటికీ సరైన న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. అవినీతి కంపులో న్యాయ వ్యవస్థ మునిగిపోయిందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చివరకు ఆ దేవుడే దిగివచ్చినా.. ప్రస్తుత న్యాయవ్యవస్థను బాగు చేయలేడు అనేది వినోదాత్మకంగా ‘వీరభద్రుడు’ సినిమాలో చెప్పాడు దర్శకుడు ఆర్.జే బాలాజీ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. కోర్టులో జరుగుతున్న అవినీతిని, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. కానీ సూర్య స్థాయి లాంటి హీరోని పక్కన పెట్టి.. ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్రను హైలెట్ చేయడమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా మొదలైన అరగంట వరకు సూర్య తెరపై కనిపించడు. సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆర్జే బాలజీ పాత్రకే మంచి సన్నివేశాలు ఉంటాయి. అయితే క్లైమాక్స్లో మాత్రం వీరభద్రుడు(సూర్య) తాండవం అదిరిపోతుంది. మీను పాత్రతో పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నగలు అమ్మి చికిత్స చేసుకోవాలని నగరానికి వచ్చిన తండ్రి కూతుళ్లపై దొంగలు దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లడం.. కేసు పెట్టి, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ సూర్య ఎంట్రీ లేకపోవడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక వీరభద్రుడు ఆగమనం తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎమోషనల్గా సాగుతుంది. కోర్టు డ్రామా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా..చిరాకుగా అనిపిస్తుంది. న్యాయం కోసం దేవుడు చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్లో ఎమోషన్ మీద దృష్టిపెట్టిన దర్శకుడు..ద్వితియార్థంలో మాత్రం మాస్ ఎలిమెంట్స్పైనే ఫోకస్ పెట్టాడు. సూర్యతో వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కథనం కూడా అక్కడక్కకే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్లో వీరభద్రుడు తాండవం ఆకట్టుకుంటుంది. తమిళ వాసనలు ఎక్కువగా ఉండడం.. సూర్య పాత్ర నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. వీరభద్రుడు పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. సామాన్య మనిషిగా, దేవుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్లో వీరభద్రుడు తాండవం అదిరిపోతుంది. లాయర్ ప్రీతిగా త్రిష చక్కగా నటించింది. ఫస్టాఫ్లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సెకండాఫ్లో మాత్రం ఒకటి రెండు మంచి సీన్లు పడ్డాయి. ఇక దర్శకుడు ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో బాలాజీ ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సాయి అభ్యంకర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ వీఎఫ్ఎక్స్ పనితీరు తేలిపోయింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కరుప్పు మూవీ.. పూనకంతో ఊగిపోయిన డైరెక్టర్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆర్థికపరమైన సమస్యలతో ఓ రోజు ఆలస్యంగా తెరపైకొచ్చింది. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది.ఇవాళ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్జే బాలాజీ సైతం థియేటర్లో వీక్షించారు. దీంతో సినిమాను చూసి పూనకంతో ఊగిపోయారు. టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ మూవీ సీన్ రీ క్రియేట్ చేశారు. ట్రైన్ సీన్లో నానిలానే బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #RJBalaji - HUGGED TRISHA AFTER A BLOCKBUSTER RESPONSE - Of #Karuppu Film 🔥🔥🔥🔥This Man Deserves this SUCCESS.pic.twitter.com/LmeMv8q3Fv— GetsCinema (@GetsCinema) May 15, 2026 -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్లో ఫుల్ యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
వివాదంలో రాజీవ్ కనకాల.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్కూల్ ఫంక్షన్కు హాజరైన ఆయన పదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు, షీల్డ్స్ అందజేశారు. అయితే ఈ ఈవెంట్కు నవ తెలంగాణ విద్యార్థి విభాగం సభ్యులు వచ్చిన ఒక్కసారిగా నిరసనకు దిగారు. అసలు ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా అని నిలదీశారు. అక్కడ స్కూల్ మేనేజ్మెంట్, విద్యార్థి సంఘం మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది.అదే సమయంలో పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజీవ్ కనకాలను సైతం ప్రశ్నించారు. నుమతులు లేని అలాంటి స్కూల్ ఫంక్షన్కి ఎలా అటెండ్ అవుతారని అడిగారు. అయితే ఈ విషయాల గురించి తనకు ఏమీ తెలియదని రాజీవ్ కనకాల అన్నారు. మంచి కార్యక్రమం అని పిలిస్తే వచ్చానని తెలిపారు. దయచేసి ఈ ఈవెంట్కు సంబంధించిన నా ఫోటోలు, వీడియోలు ఎవరూ కూడా పబ్లిసిటీ వినియోగించవద్దని రాజీవ్ కనకాల విజ్ఞప్తి చేశారు. నన్ను అలర్ట్ చేసినందుకు నవ తెలంగాణ విద్యార్థి విభాగానికిని నా ధన్యవాదాలు అంటూ వీడియో రిలీజ్ చేశారు. రాజీవ్ కనకాల ఓ స్కూల్ వివాదంలో ఇరుక్కున్నారు10th lo highest marks vachina students ki Rajeev Kanakala garu shields andincharu. Sanmana karyakramam jarugutunna samayam lo Nav Telangana Vidyarthi Shakti (NTVS) organization members okkasariga protest chesaru. Aa school ki… pic.twitter.com/45jhHyXQZK— Milagro Movies (@MilagroMovies) May 15, 2026 -
పర్సంటేజీ సమస్య.. ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం
టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్లు వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్ల్లో ఇస్తున్నట్లే సింగిల్ స్కీన్లలోనూ పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. నిర్మాతలు మాత్రం దీనికి పూర్తిగా అంగీకరించట్లేదు. వ్యవహారం శ్రుతి మించుతుండటంతో ఇందులో ఫిలిం ఛాంబర్ కల్పించుకుంది. హైదరాబాద్లో శుక్రవారం ఇరువర్గాలతో కలిసి మీటింగ్ పెట్టింది. ఇందులోనే కీలక నిర్ణయం తీసుకుంది.(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)పర్సంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీలో 18 మంది సభ్యులు. 1-2 నెలల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఈ టైంలో సినిమా రిలీజులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తలో ఆరుగురు కమిటీలో ఉంటారని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్స్ యాక్టీవ్ గిల్డ్ నిర్మాతలు సమావేశం వాడివేడిగా సాగుతోంది. చర్చలు జరుగుతున్నప్పుడే ఏషియన్ సునీల్ నారంగ్ అరుస్తూ బయటికి వచ్చేశారు. దీంతో ఈయనని బతిమాలిన చదలవాడ శ్రీనివాస్, దిల్ రాజు, నాగవంశీ, అనుపమ్ రెడ్డి తిరిగి మీటింగ్కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇరు వర్గాలు వేర్వేరుగా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే: టాలీవుడ్ విలన్) -
మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే
మహేశ్ బాబు ఇప్పటివరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేశాడు. హిందీలో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆసక్తి చూపించలేదు. ఈ విషయం గురించి గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడా టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఒకప్పుడు టాలీవుడ్ విలన్ రోల్స్ చేసిన రాహుల్ దేవ్. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ గురించి ఇతడు చేసిన కామెంట్స్ షాకింగ్గా అనిపించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)మహేశ్ బాబు గతంలో ఓసారి మాట్లాడుతూ.. 'బాలీవుడ్ వాళ్లు నన్ను భరించలేరు' అన్నారు కదా దానిపై మీ స్పందన ఏంటి? అని యాంకర్ అడగ్గా.. రాహుల్ దేవ్ నవ్వుతూనే ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో కమర్షియల్ హంగులతో పాటు ఓ అర్థం ఉంటుంది. త్రివిక్రమ్తో మహేశ్ చేశారు. ఇలాంటి మూవీస్ హిందీలో ఉండవు. అక్కడంతా రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు తీసే టైపు సినిమాలు లేదంటే హాలీవుడ్ రీమేక్సే ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే ఆయనకు(మహేశ్) భాష రాదు అదే అసలు కారణం' అని రాహుల్ దేవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ నటుడు ఏ ఉద్దేశంతో మహేశ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశాడనేది అర్థం కావట్లేదు.మహేశ్ గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నకు బదులిస్తూ.. 'నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. గర్వంగా అనిపించొచ్చు కానీ వాళ్లు నన్ను భరించలేరు. నా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. తెలుగు సినిమాల్లో నాకు దొరుకుతున్న స్టార్డమ్, అభిమానం చూసిన తర్వాత మరో పరిశ్రమకు ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. ఇక్కడే మూవీస్ చేస్తానని, అది పెద్ద హిట్ అవుతాయని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమవుతోంది' అని అన్నారు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న 'వారణాసి' మూవీ.. హిందీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు?)


