Tollywood
-
బోర్ కొట్టేస్తున్న తెలుగు సినిమాలు.. ఎందుకిలా!?
తెలుగు దర్శకుల్లో చాలామంది తాము తీసేదే అద్భుతమైన కళాఖండం అనుకుని భ్రమపడుతున్నారు. బాగోలేదని ఒప్పుకోవడానికి కూడా వాళ్లకు మనసు రావట్లేదు. రొటీన్ ఫక్తు కమర్షియల్ అంశాలతో బోర్ కొట్టిస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చేలా తీయడం సంగతి అటుంచి ఏ జానర్ ట్రెండ్ అవుతుంటే దాని వెంట పడుతున్నారు. అయినా గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంతకీ డైరెక్టర్స్ అప్డేట్ అవ్వట్లేదా? లేదంటే ప్రేక్షకులు అడ్వాన్స్ అయ్యారా? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)టాలీవుడ్ అనగానే చాలామందికి కమర్షియల్ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ తరహా చిత్రాలే దాదాపుగా వచ్చేవి. అప్పట్లో మొబైల్, టెక్నాలజీ లాంటివి పెద్దగా లేకపోవడంతో సినిమా ఒక్కటే వినోద సాధనంగా ఉండేది. దీంతో లాజిక్స్ పట్టించుకోకుండానే మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఎక్కువపోయాయి. మొబైల్, టీవీ, క్రికెట్ ఇలా కళ్లముందు చాలానే కనిపిస్తున్నాయి. వీటన్నింటిని దాటుకుని సినిమా చూడాలంటే అందులో కచ్చితంగా సమ్థింగ్ స్పెషల్ ఉండాలి. ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో అదే మిస్ అవుతోంది.ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో కొన్ని అంశాలైనా ప్రేక్షకులు తమని తాము రిలేట్ చేసుకునేలా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి వాటిని డైరెక్టర్స్ మిస్ చేస్తున్నారు. కథల్లో సహజత్వం పెద్దగా కనిపించట్లేదు. దీంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. కొత్తగా కామెడీ, డ్రామా సృష్టించడం లాంటివి చేయకుండా వింటేజ్ పేరు చెప్పి పాత సినిమాల్లో పాటలు, కామెడీని, డ్రామాని వాడేయాలని చూస్తున్నారు. అవి ఎందుకో సరిగా కుదరట్లేదు.(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)ఈ ఏడాదే తీసుకుంటే సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్' సినిమా తప్పితే ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. బైకర్, డెకాయిట్ లాంటివి కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి గానీ వీటిలో కథ ఉన్నప్పటికీ అనవసరమైన కమర్షియల్ అంశాలు చేర్చి సూపర్హిట్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇకపోతే 'నారీ నారీ నడుమ మురారి', 'యుఫోరియా', 'శ్రీ చిదంబరం గారు', 'కపుల్ ఫ్రెండ్లీ' లాంటి కొన్ని మూవీస్ మంచి కంటెంట్తో వచ్చాయి గానీ వీటికి థియేటర్లలో సరైన సపోర్ట్ దొరకలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత జనాదరణ పొందాయి.మొత్తంగా చూస్తే చాలామంది దర్శకులు.. తెలుగు ప్రేక్షకుల్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏం తీసినా చూస్తారులే అనుకుంటున్నారు. మరికొందరైతే ప్రమోషన్లలో నవ్విస్తున్నారు గానీ సినిమాలో తీసికట్టు కంటెంట్తో విసుగు తెప్పిస్తున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మలయాళ, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలని చూసుకుంటున్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే, అవి కూడా బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తాడు. రొటీన్ కంటెంట్తో ఇంకా బోర్ కొట్టిస్తే వాటికి కూడా వెళ్లాలా వద్దా అని సందేహపడతాడు! అప్పుడు టాలీవుడ్కే కష్టకాలం!(ఇదీ చదవండి: ‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం) -
'ఆ బాధ జీవితాంతం గుర్తుంటుంది..' మోహన్ బాబు ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ నటుడు, హీరో మోహన్ బాబు ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవలే మోహన్ బాబు క్యారెక్టర్ సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత విలన్ పాత్రలో కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా సంగతి పక్కనపెడితే మోహన్ బాబు డైరెక్టర్స్ డే 2026 ఈవెంట్కు హాజరయ్యారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాసరి నారాయణరావును తలచుకుని ఎమోషనలయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఆయన బర్త్ డేను మనం సెలబ్రేట్ చేసుకున్నప్పటీకీ.. చాలా బాధకరమైన రోజేనని అన్నారు. తండ్రి లాంటి వ్యక్తిని నేను కోల్పోయాననే బాధ నాకు జీవితమంతా ఉంటుందని తెలిపారు. ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకువచ్చి మోహన్బాబుగా ఈ స్థాయికి తీసుకొచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ జనరేషన్ వాళ్లకు చాలామందికి డైరెక్టర్ అనే పదానికి అర్థం తెలియదు.. దర్శకుడు అనే పదానికి సరైన అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావుగారే అన్నారు. -
దేవుళ్లు కూడా నన్ను ఆపలేరు.. విజువల్ వండర్లా కొత్త ట్రైలర్
క్రిస్టోఫర్ నోలన్ పేరు చెబితే మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఈ దర్శకుడు తీసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక పట్టానా అర్థం కావనే కామెంట్స్ వినిపిస్తాయి గానీ సూపర్ హిట్ అవడంతో పాటు వేల కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ. ఈయన చేసిన లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ కొత్తది రిలీజ్ చేశారు. ఇది విజువల్ వండర్లా ఉంటూ మూవీపై హైప్ పెంచుతోంది.(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)ఒడియన్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒడియన్ పాత్రలో మ్యాట్ డామన్, పెనెలోపీగా అన్నా హాత్వే, టెలిమాకస్గా టామ్ హోలండ్ కనిపించనున్నారు. రాబర్ట్ ప్యాటిన్సన్, ఛార్లెజ్ థెరోన్ కూడా కీలక పాత్రలు చేశారు. ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ మూవీని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం విశేషం.ట్రైలర్ బట్టి చూస్తే ఒడియన్ అనే రాజు, ఓ యుద్ధంలో పాల్గొనేందుకు తన రాజ్యాన్ని, భార్య కొడుకుని వదిలి మరో చోటకు వెళ్తాడు. యుద్ధం గెలిచి తిరిగొస్తుంటే సముద్రంలో ఇతడి సైన్యం ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురవుతుంది. కానీ ఒడియన్ రాజు ప్రాణాలు దక్కించుకుంటాడు. తర్వాత ఏమైంది? భార్య-కొడుకుని కలిశాడా అనేది మిగతా స్టోరీ. ప్రాచీన కవి హోమర్ రాసిన 'ద ఒడిస్సీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. (ఇదీ చదవండి: ‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం) -
‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం
ఏది జరిగినా మన మంచికే అనుకునే మనసు ఉంటే…ప్రతి కష్టం ఒక పాఠం అవుతుంది… ప్రతి ఓటమి ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు దళపతి విజయ్ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల ముందు ఆయనకు వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్య సంగీతతో విడాకులు వివాదం.. మరోవైపు ప్రచారంలో తొక్కిసలాటలు, ఇంకోవైపు తన చివరి చిత్రం విడుదల వాయిదా పడడం.. ఇవన్నీ తట్టుకొని అలుపెరగకుండా ప్రచారం చేసి.. చివరకు రాజకీయ ప్రభంజనం సృష్టించాడు. తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న ఏకైక సినిమా ‘జన నాయగన్’ కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం కూడా ఖాయమే.ఆలస్యమే ఆమృతం..ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుందంటారు. నిజమే కానీ ‘జన నాయగన్’ విషయంలో మాత్రం ఆలస్యమే అమృతం అయ్యేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎన్నికల ముందు రిలీజ్ అయితే.. కొంతవరకు పొలిటికల్ కెరీర్కి కూడా ప్లస్ అవుతుందని విజయ్ భావించాడు. కానీ అది జరగలేదు. వాయిదా పడడమే కాదు.. అందులోని కొన్ని సన్నివేశాలు కూడా లీకయ్యాయి. ఓటీటీ బిజినెస్ కూడా చేజారిపోయింది. ఇక జన నాయగన్ రిలీజ్ అవుతుందో లేదో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిన్నటి ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేసింది. 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచి.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విజయ్ సీఎం అయిన తర్వాత జననాయగన్ విడుదల అవ్వడం ఖాయం. అప్పుడు ఈ సినిమాకు వచ్చే హైప్, క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది.బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..ఎన్నికల ముందు రిలీజ్ అయి ఉంటే..టాక్ని బట్టి కలెక్షన్స్ ఉండేవి. హిట్ టాక్ వస్తే కానీ ఈ సినిమా భారీ కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు టాక్తో సంబంధం లేదు. సినిమా ఎలా ఉన్నా.. తొలి మూడు రోజులు థియేటర్స్ కిక్కిరిసిపోతాయి. సీఎం సినిమా కాబట్టి.. ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేస్తాయి. ఎన్నికల ముందు ఎలా ఉండేదో కానీ..ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ సినిమాతో భారీగా నష్టాలు తప్పవని భావించిన కెవీఎన్ సంస్థ ఇప్పుడు ఊపిరిపీల్చుకుంది. మొన్నటిదాక జన నాయగన్కి శాపంగా మారినవన్నీ ఇప్పుడు వరంగా మారాయి. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. -
ఫైమాతో కటీఫ్.. నటితో నిశ్చితార్థం చేసుకున్న కమెడియన్
తెలుగులో రియాలిటీ షోలతో చాలాజంటలు పాపులారిటీ సంపాదించాయి. అలాంటి వాటిలో ప్రవీణ్-ఫైమా జోడీ ఒకటి. కలిసి స్కిట్స్ చేశారు. యూట్యూబ్ వ్లాగ్స్ కూడా చేశారు. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఫైమా తన జీవితంలో ప్రవీణ్ అనే మరో వ్యక్తి ఉన్నాడని అతడే తన ప్రియుడి అని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఫైమాతో కలిసి నటించిన ప్రవీణ్ విషయానికొస్తే ఇప్పుడు మరో నటితో నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పలు ఆల్బమ్ సాంగ్స్లో చేసిన వంశిత అనే అమ్మాయితో పటాస్ ప్రవీణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. దీంతో తోటి కమెడియన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో పెళ్లి వార్త కూడా చెప్పే అవకాశముంది.ప్రవీణ్ పెళ్లి చేసుకోబోతున్న వంశిత.. బంధువుల అమ్మాయి అని అంటున్నారు. పటాస్ ప్రవీణ్ విషయానికొస్తే చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. నాలుగేళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్తో తండ్రి కూడా చనిపోయాడు. ఇతడికి ఓ అన్న ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.(ఇదీ చదవండి: రూ.20 కోట్ల బడ్జెట్.. 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్) -
రూ.20 కోట్ల బడ్జెట్.. 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్
ఏ వ్యాపారం అయినా లాభాల సంపాదనే కీలకం. దానికోసమే ప్రతిఒక్కరూ ఆలోచిస్తారు. కొంతమంది మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సంపాదించాలా అని చూస్తుంటారు. మలయాళ దర్శకనిర్మాతల ఆలోచన ఇప్పుడు అదే. 'పుష్ప' ఫేమ్ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ ఇదే విషయాన్ని తెలుగు నిర్మాత 'మైత్రీ' రవిశంకర్తో పంచుకోగా.. ఆ విషయాన్ని ఈయన ఇప్పుడు బయటపెట్టారు.(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మలయాళ సీనియర్ నటుడు)'కేరళ ఇండస్ట్రీలో రూ.20 కోట్లతో సినిమా తీసి 'బాహుబలి' స్థాయి కలెక్షన్స్ ఎలా సాధించాలా అని ఆలోచిస్తున్నామని ఫహద్ ఫాజిల్ నాతో అన్నారు. చాలా ముచ్చటగా అనిపించింది. అలాంటి వందల వేల కోట్ల కలెక్షన్స్ చూడాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనేది వాళ్ల ఆలోచన' అని 'మైత్రీ' నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన దాసరి జయంతి వేడుకల్లో ఈ విషయాన్ని బయటపెట్టారు.ఫహద్ చెప్పింది గమనిస్తే నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది మలయాళం వచ్చిన 'లోక' సినిమానే తీసుకుంటే రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. కానీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నెలరోజుల క్రితం రిలీజైన 'వాలా 2' సెన్సేషనల్ సక్సెస్ అయింది. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైనే వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో మలయాళ మేకర్స్.. తక్కువ బడ్జెట్ పెట్టి 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే మలయాళ సినిమాలపై జనాల్లో అభిప్రాయం మారింది. థియేటర్లలో వీలుకానప్పటికీ ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత వాటిని ఎగబడి చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులైతే కొన్ని మలయాళ మూవీస్కి ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు!ఫహద్ ఫాజిల్ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా టాలీవుడ్లో జరుగుతూ ఉంటుంది. వేల కోట్ల కలెక్షన్స్ కావాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఫిక్సయిపోయింది. తీరా చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా కొన్ని సినిమాలు రాబట్టుకోలేకపోతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ సినిమాలకు వందల కోట్లు బడ్జెట్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న కొందరు యువ దర్శకులు సైతం రూ.100 కోట్లకు పైనే నిర్మాతలతో ఖర్చు పెట్టించేస్తున్నారు. ఈ విషయమే చాలామంది నిర్మాతలని భయపెట్టేస్తోంది! ఫహద్ ఆలోచిస్తున్నట్లు మన దర్శకనిర్మాతలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది! ఒకవేళ ఆలోచించినా ఇది సాధ్యమవుతుందా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న!(ఇదీ చదవండి: కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం)Shocking Statement by #FahadhFaasil 🚨Actor #FahadhFaasiil told me that in the #Keralafilmindustry, we think about how to make #Baahubali level revenue Film with a 20 crore budget.:- Mythri #RaviShankar pic.twitter.com/X8CbrVJ8vC— Milagro Movies (@MilagroMovies) May 4, 2026 -
విడుదలకు సిద్ధమైన 'కృష్ణావతారం పార్ట్ 1'
'కృష్ణావతారంపార్ట్ 1' సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారం(మే 07) థియేటర్లలోకి రానుంది. అత్యంత మహత్తరమైన దివ్యగాథతో తీసిన ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా సత్యభామగా సంస్కృతి జయన నటించారు. రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసి కృష్ణన్ కనిపించబోతున్నారు.హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సజన్ రాజ్ కురుప్, శోభాసాంత్, పూనం ష్రాఫ్, పార్థ్ గజ్జర్ నిర్మాతలుగా వ్యవహరించారు. నిర్మాతరాజ్ కురుప్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఆశయంతో పాటు బాధ్యతని మోసుకుని వస్తోంది. మనం లోతైన సాంస్కృతిక జ్ఞాపకాలలో ఉన్న కథని చెబుతున్నప్పటికీ, దాన్ని ఎంతో ఆత్మీయమైన మానవీయకోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. కృష్ణుడి ప్రయాణాన్ని సత్యభామ కళ్ల ద్వారా అనుభవించి ప్రేక్షకులు బయటకు వస్తే ఈ మూవీకి మేము న్యాయం చేసినట్టే' అని చెప్పుకొచ్చారు. ఈ కథ సత్యభామ కళ్ల ద్వారా ఆవిష్కృతమవుతూ కృష్ణుడి ప్రయాణం, అతని సంబంధాలు, భావోద్వేగ ప్రపంచాన్ని ప్రేక్షకులకు కొత్తగా, ఆత్మీయంగా చూపిస్తుంది. -
కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం
కేరళలో అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ ఫ్యాన్స్ మీటింగ్ లో అసోసియేషన్ ను మరింత బలపర్చడం, విస్తరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులకు చేరువకావడంపై డిస్కషన్స్ చేశారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) దేశంలో అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ గా ఏర్పడింది. అన్ని ప్రాంతాల్లో ఏఏఎఫ్ఏ తమ కార్యక్రమాలను చేపడుతోంది. సౌత్ ఇండియాలో సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇకపై నార్త్ ఇండియాలోనూ తమ యాక్టివిటీస్ చేసేందుకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. -
'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే?
చిన్న సినిమాలు అప్పుడప్పుడు సూపర్ హిట్ అయిపోతుంటాయి. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. అలా గతేడాది వచ్చిన వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి' ఒకటి. తెలంగాణలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రంతో సాయిలు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలో మెప్పించాడు. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన అఖిల్ రాజ్, తేజస్వి కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఈ మూవీలో తానే హీరోగా చేయాలని, కానీ కొన్ని కారణాల వల్ల వదిలేశానని 'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో నేనే చేయాలి. సుమంత్.. ఇది నువ్వే చేస్తే బాగుంటుంది అని సాయిలు(దర్శకుడు) అన్న చెప్పాడు. నేను కథ విన్నా. స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని అన్నతో చెప్పా. పదిమంది మాట్లాడుకునే సినిమా ఇది అని చెప్పాను. అప్పుడే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ చేశా. మళ్లీ తెలంగాణ కథ చేశానంటే.. అయ్యో నేను ఇటు వెళ్లిపోతానేమో అనిపించింది. ఆ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ సినిమా అయితే తప్పకుండా రావాలన్నా. మీది 100 శాతం వర్కౌట్ అవుతుందని ఎప్పుడు అంటుండేవాడిని. చెప్పాలంటే నాకు నెరేట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. ఫస్టాప్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా తీశాడు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా ప్రెజెంట్ చేశాడు'యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్తో నటుడిగా మారిన సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో దర్శకుడు, నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'గోదారి గట్టుపైన' మూవీ చేశాడు. ఇది ఈ శుక్రవారం(మే 08) ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరుకి తగ్గట్లే గోదావరి బ్యాక్డ్రాప్లో సాగే ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. దీని ప్రమోషన్లలో భాగంగానే సుమంత్ ప్రభాస్.. 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో అవకాశం వదులుకున్న సంగతి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి) -
శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారు కానీ.., : రాజశేఖర్
సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. మొన్నటి వరకు హీరోగా మాత్రమే సినిమాలు తీసిన ఆయన..ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ మూవీలో శర్వానంద్ తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి.శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్..రాజశేఖర్, జీవితలది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. `తలంబ్రాలు`(1986) సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే జీవిత కంటే ముందు శ్రీదేవితో తనకు పెళ్లి ప్రపోజల్ వచ్చిందని గతంలో ఓ న్యూస్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పాడు. ఇదే విషయాన్ని తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ గుర్తు చేసింది. ‘జీవిత కంటే ముందు శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చిందట కదా.. నిజమేనా?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ‘నిజమే. శ్రీదేవి తండ్రికి, మా నాన్నగారికి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ చొరవతో ఇరువైపులా స్నేహితుల మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆమె మన మధ్య లేరు. అందుకే ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడం సరికాదు. వదిలేద్దాం’ అని రాజశేఖర్ చెప్పాడు.ఆర్టిస్ట్ అని శ్రీదేవిని రిజెక్ట్ చేశారుఅయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో రాజశేఖర్ వివరించాడు. ‘శ్రీదేవి నాన్నతో మా నాన్నకు మంచి స్నేహబంధం ఉండేది. కులం కూడా ఒకటే. దూరపు బంధువులు అవుతారు. అందుకే శ్రీదేవి ఫ్యామిలీ నుంచి నాకు పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అప్పటికీ నేను సినిమాల్లోకి రాలేదు. ఎంఎస్ చదవాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని మా నాన్న వాళ్లకు పెళ్లి.. వారి ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు. సినిమాల్లో నటించేవాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ని పక్కన పెట్టారు’ అని రాజశేఖర్ అన్నారు. -
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి
ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ యూనియన్ సభ్యుల కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపుర్మెట్ దగ్గర డివైడర్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1940ల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్. ఈ ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం.(ఇదీ చదవండి: విజయ్ విజయం.. పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు..!) -
M4M: కిల్లర్ ఎవరో చెబితే లక్ష రూపాయల నగదు బహుమతి
జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన తారాగణంగా మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకుడు వి. సముద్ర హాజరై, సినిమా హిట్టవ్వాలని కోరారు. ‘‘మా చిత్రానికి ఇప్పటికే 25 దేశాల్లో 50కిపైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అన్నారు జో శర్మ. ‘‘ఈ మూవీలోని సీరియల్ కిల్లర్ ఎవరో ముందుగా చెప్పిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఉంటుంది’’ అన్నారు మోహన్ వడ్లపట్ల. -
రజనీ-కమల్ మూవీ క్రేజీ అప్డేట్
జైలర్ 2 చిత్రాన్ని పూర్తి చేసిన నటుడు రజనీకాంత్ తదుపరి తన 173వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు.దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్,రజనీకాంత్ కలిసి నిర్మించే చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. ఆరంభ కాలంలో కలిసి పలు చిత్రాల్లో నటించిన కమల్,రజనీ సుమారు 17 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. రెడ్జయింట్స్ పతాకంపై ఇన్భున్ ఉదయనిధి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి రాజీవ్మీనన్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో ను ఇటీవల చిత్రీకరించారు. దీని గురించి ఆయన ఒక భేటీలో పేర్కొంటూ దర్శకుడు నెల్సన్ ఈ చిత్ర కథను వివరించిన విధం చాలా ఆసక్తిగా ఉందన్నారు. ముందుగా ఎలాంటి భావోద్రేకాల గురించి చెప్పకుండా వినోదంగా చెప్పే విధానం మనల్సి నవిస్తుందన్నారు. ఆయన ఒక్క వారంతోనే ఈ చిత్ర ప్రోమోను చిత్రీకరించాలని చెప్పారన్నారు. తాను ఇంతకు ముందు నటుడు కమలహాసన్తో వాణిజ్య ప్రకటనలను చేసిన అనుభవం ఉందనీ,అయితే రజనీకాంత్తో కలిసి పని చేయలేదని చెప్పారు. అలాంటిది వీరిద్దరితో కలిసి ప్రోమో ను చిత్రీకరించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్,కమలహాసన్ వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారనీ, దీంతో వారిద్దరూ కలిసి నటించే చిత్రం ఈ ఏడాది ఆగస్టులో గానీ, సెప్టెంబరులో గానీ ప్రారంభం అవుతుందని ఛాయాగ్రహకుడు రాజీవ్ మీనన్ చెప్పారు. -
భావోద్వేగాలు మెప్పిస్తాయి: నిర్మాత అభినవ్
‘‘నేను పదేళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నప్పటికీ సినిమాఅంటే ప్యాషన్ . యూనివర్సల్ సబ్జెక్ట్తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేయాలనుకున్నాను. అలాంటి కథ ‘గోదారి గట్టుపైన..’తో కుదిరింది. ఈ సినిమా కోసం సుమంత్ గోదారి యాస నేర్చుకుని నటించాడు. జగపతిబాబు–నిధిగార్ల మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి’’ అని నిర్మాత అభినవ్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, నిధీ ప్రదీప్ జోడీగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో అభినవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా అభినవ్ మాట్లాడుతూ–‘‘దర్శకుడు సుభాష్కు సినిమా తప్ప మరో ధ్యాస లేదు. ఈ కథలో ఎమోషన్ , కామెడీ, డ్రామా అన్నీ కుదిరాయి. నిర్మాత సునీల్గారు నాకు మార్గదర్శి. నా తొలి సినిమాలోనే జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాలగార్ల వంటి నటీనటులు ఉన్నారంటే ఇందుకు కారణం ఆయనే. నాగవంశీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాను ఏపీలో సురేశ్ బాబుగారు, నైజాంలో నేను–సునీల్గారు, సీడెడ్లో తిరుపతి ప్రసాద్గారు రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రం కూడా సుభాష్ దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని చెప్పారు. -
ఏం జరుగుతుంది?
రాజ్ తరుణ్, అమృతా చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘టార్టాయిస్’. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ పతాకంపై రాజ్ విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘నిద్రలో నడిచే అలవాటు ఉన్న హీరో ఒక అమ్మాయిని హత్య చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? అనే కాన్సెప్ట్తో ‘టార్టాయిస్’ రూపొందింది’’ అని యూనిట్ సభ్యులు తెలిపారు. -
'ఆ దారుణాన్ని మర్చిపోలేదు.. ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పారు..' హీరో నిఖిల్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ దారుణాలను ప్రజలు ఇంకా మరిచిలేదు.. క్షమించనూ లేదన్నారు. అందుకే మమతా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాసుకొచ్చారు. సామాన్యుడిని పట్టించుకోని ప్రభుత్వానికి ఇలాంటి గతే పడుతుందన్నారు. ఆర్జీ కర్ వైద్య కళాశాల బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఈ దారుణంపై తాను మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.కాగా.. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇప్పటికే మూడుసార్లు సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆమె ప్రభుత్వంలోనే ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. The People of West Bengal did not forget or forgive . They Taught a lesson to the Govt which did not care for the Common Person . Justice for RG KAR Medical college Horror . #RGKAR #Kolkata https://t.co/ydOioIZBdH— Nikhil Siddhartha (@actor_Nikhil) May 4, 2026 -
గ్రాండ్గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మనవరాలి పెళ్లి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వీఆర్కే రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన మనవరాలు హిమశ్రీ వేమూరి వివాహా వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుక జన్వాడలోని నియో కన్వెన్షన్లో జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయికుమార్, అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ-మధుమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సందడి చేశారు.కాగా.. వీఆర్కే రావు భారత వైమానిక దళంలో కమాండర్గా పనిచేశారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా.. కళాకారుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగా బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నంది అవార్డ్ అందుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఆయన అందించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. -
విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు
విజయ్ గెలుపుతో కోలీవుడ్లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్ సైతం విజిల్స్తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్ను అభినందించారు. టాలీవుడ్ హీరోల ప్రశంసలు..దళపతి విజయ్కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్ విజయంపై ట్వీట్ చేశారు.కాజల్ అగర్వాల్ ట్వీట్..తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా చెప్పారని ప్రశంసించింది. ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ, మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026 Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This… pic.twitter.com/XVhg0aYt1r— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 4, 2026 Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026 Dear @actorvijay,Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2026 -
టాలీవుడ్ రీఎంట్రీలో త్రిషకు 'సినిమా' కష్టాలు
త్రిష.. తెలుగులో చాలా సినిమాలు చేసిన స్టార్ హీరోయినే. కానీ గత పదేళ్లలో టాలీవుడ్లో నటించలేదు. చేసిన ఒక్క మూవీ 'విశ్వంభర' కూడా ఎప్పుడో రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టీమ్, ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష)'వర్షం'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. తర్వాత చిరంజీవి, మహేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, రవితేజ తదితర స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2016లో చివరగా 'నాయకి' మూవీ చేసింది. ఆ టైంలో ఇక ఈమె కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ '96' అనే తమిళ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. అనంతరం పొన్నియిన్ సెల్వన్ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ చేసింది. ఈ క్రమంలోనే చిరంజీవి 'విశ్వంభర' కోసం ఈమెని హీరోయిన్గా తీసుకున్నారు.2023లో విశ్వంభర చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. తాజాగా జూలైలో రిలీజ్ కావొచ్చని రూమర్స్ వచ్చాయి గానీ త్రిష పుట్టినరోజు విషెస్ చెబుతూ వదిలిన పోస్టర్లో డేట్ ఏం లేదు. అంటే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదనమాట. చూస్తుంటే త్రిషకు టాలీవుడ్ రీఎంట్రీ విషయంలో సినిమా కష్టాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది.పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ కథతో తీసిన 'విశ్వంభర'లో త్రిష హీరోయిన్ అయినప్పటికీ ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా తదితర హీరోయిన్లు కూడా ఇతర పాత్రల్లో నటించారు. వశిష్ఠ దర్శకుడు కాగా కీరవాణి సంగీతమందించారు. యువీ క్రియేషన్స్ రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టేసింది గానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతోనే రిలీజ్ ఎప్పుడో దర్శకనిర్మాతలు కూడా చెప్పలేకపోతున్నారు.(ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?)Team #Vishwambhara wishes the gorgeous @trishtrashers a very Happy Birthday ❤️Her portrayal of ‘Avani’ will be elegant and enchanting ✨MEGA MASS BEYOND the UNIVERSE 🌟In Cinemas Soon 💫MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @AbhishekOfficl @UV_Creations… pic.twitter.com/HbP8PgeMm9— UV Creations (@UV_Creations) May 4, 2026 -
ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి ఈ సామెతని అన్వయించుకుంటే.. సొంత భాషల్లో హిట్స్ కొట్టిన అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియాలోనూ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కానీ తమిళ హీరో ధనుష్ పరిస్థితి మాత్రం కాస్త చిత్రంగా అనిపిస్తుంది. రీసెంట్ టైంలో వచ్చిన ఇతడి సినిమాలు, వాటి ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)ధనుష్ పేరు చెప్పగానే ఆల్రౌండర్ అనే పదమే గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా దర్శకుడిగా నిర్మాతగా విభిన్న బాధ్యతల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తాడు. మధ్య పాటల రాసేస్తుంటాడు. కుదిరితే పాడేస్తుంటాడు కూడా. వీటి విషయంలో ఇతడిని వంక పెట్టడానికి ఏం లేదు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇతడి మూవీస్ చూస్తే మాత్రం పరభాషలో చేసినవన్నీ హిట్ అవుతున్నాయి. సొంత భాషలో చేసినవి మాత్రం అక్కడివరకే పరిమితమవుతున్నట్లు కనిపిస్తుంది.గత కొన్నేళ్లలో తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ధనుష్.. అణిచివేత గురయ్యే తరహా పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నాడు. దీంతో తమిళ ప్రేక్షకులకే ధనుష్ మూవీస్పై మొనాటనీ వచ్చేసింది. వేరే దర్శకులు తీస్తున్నా ధనుషే సొంత డైరెక్షన్ చేస్తున్నా కాన్సెప్ట్ దాదాపు ఇదే ఉంటోంది. ఈ తరహా చిత్రాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పెద్దగా ఆడట్లేదు. గత రెండేళ్లలో రిలీజైన రాయన్, ఇడ్లీ కొట్టు తరహా చిత్రాలతో పాటు గత వీకెండ్ రిలీజైన 'కర' మూవీలో ఇదే తరహా కాన్సెప్ట్స్ ఉండటం మైనస్ అవుతోంది. ఇవన్నీ తమిళంలో ఓ మాదిరిగా ఆడుతుంటే మిగతా చోట్ల మాత్రం దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి.మిగతా భాషల్లో మాత్రం ధనుష్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'సర్'లో టీచర్గా ధనుష్ అదరగొట్టేశాడు. శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'లో బిచ్చగాడిగా మెప్పించాడు. గతేడాది చివరలో వచ్చిన హిందీ చిత్రం 'రే ఇష్క్ మై'లోనూ శ్రుతిమించే ఎమోషన్స్ ఉండే ప్రేమికుడిగానూ ఆకట్టుకున్నాడు. చూస్తుంటే ఎప్పుడో ఇంట గెలిచేసినా ధనుష్.. రీసెంట్ టైంలో మాత్రం సొంత భాషా సినిమాలతో హిట్స్ కొట్టలేకపోతున్నాడు. అదే టైంలో తెలుగు, హిందీలో మాత్రం హిట్స్ కొడుతూ అదరగొట్టేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఆ తర్వాతే నా కెరీర్ మలుపు తిరిగింది
‘‘చెన్నైలోని మైలాపూర్లో ఉన్న వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే నా కెరీర్ మలుపు తిరిగింది’’ అన్నారు శ్రుతీహాసన్. ఆమె తండ్రి , ప్రముఖ నటుడు కమల్హాసన్ నాస్తికుడు అనే విషయం తెలిసిందే. శ్రుతీహాసన్ మాత్రం ‘నేను నాస్తికురాలిని కాదు... నాలో దైవ భక్తి, విశ్వాసం ఉన్నాయి’ అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో వారాహి అమ్మవారి ప్రభావం చాలా ఉంది. మైలాపూర్లో ఉన్న వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే నా కెరీర్ మలుపు తిరిగింది. మనం ఓ గుడికి వెళ్లాలని నిర్ణయించుకుని వెళతాం.అయితే దైవాలు కూడా మనల్ని ఎంచుకుంటారు. వారాహి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్లగానే భక్తి పారవశ్యాన్ని పొందాను. అంతేకాదు.. ఏదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తోందనిపించింది. ఆ గుడిలో వీఐపీ క్యూలు లేవు... ఆడంబరాలు లేవు. కేవలం శక్తివంతమైన వారాహి అమ్మవారు మాత్రమే ఉన్నారు. అదే విధంగా అస్సాంలోని శక్తిపీఠం కామాఖ్య దేవాలయాన్ని కూడా సందర్శిస్తుంటాను. నాలోని మానసిక ప్రశాంతతకు, ఆత్మవిశ్వాసానికి ఆధ్యాత్మిక చింతనే కారణం అనుకోవచ్చు’’ అని శ్రుతీహాసన్ తెలిపారు. ప్రస్తుతం ఆమె తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘ట్రైన్’ మూవీలో నటిస్తున్నారు. -
ఆరంభం... ముగింపు అక్కడే!
‘‘వారణాసి’ చిత్రకథ వారణాసి ఘాట్లలో ఆరంభమై, అక్కడే ముగుస్తుంది’’ అని పేర్కొన్నారు ఎస్ఎస్ కార్తికేయ. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. ఇటీవల మెక్సికోలో జరిగిన ‘కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్’లో ఈ చిత్రం వీడియో గ్లింప్స్ని ప్రదర్శించారు. ఆ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడుతూ... ఈ సినిమా వారణాసి ఘాట్స్లో ఆరంభమై, అక్కడే ముగుస్తుందని పేర్కొన్నారు.ఇంకా దాదాపు 20 నిమిషాల పాటు సాగే రామాయణం ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని తెలిపారు కార్తికేయ. ఒక కొత్త కోణంలో రాజమౌళి చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని విధంగా ఉంటుందని, విజువల్గా స్టన్నింగ్గా ఉంటుందని కూడా పంచుకున్నారు. తెరపై కనిపించే ఈ 20 నిమిషాల ఎపిసోడ్ చిత్రీకరణకు దాదాపు 60 రోజులు పట్టిందట. ప్రస్తుతం ఈ సినిమా షూట్ అంటార్కిటికాలో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల కానుంది. -
పవర్ఫుల్ ఫైట్లో...
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్, హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ హై ఓల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ని హైదరాబాద్లో పూర్తి చేశారట మేకర్స్.ఫైట్ మాస్టర్ కెవిన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశం తెరకెక్కించారట. వెంకటేశ్పై చిత్రీకరించిన ఈ పవర్ఫుల్ ఫైట్ మూవీ క్లైమాక్స్లో వస్తుందని సమాచారం. కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం’లో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు వెంకటేశ్. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
సరికొత్త యాక్షన్ షురూ
గోపీచంద్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగులోకి అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత మల్లెమాల శ్యామ్ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత ‘దిల్’ రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, యలమంచిలి రవిశంకర్ స్క్రిప్ట్ను అందజేశారు.‘‘70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్’ వంటి గొప్ప నిర్మాణ సంస్థ ‘గోపీచంద్ 34’ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది. వి. వెంకట్కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ బలమైన స్క్రిప్ట్ను తయారు చేశారు. గోపీచంద్ పూర్తి యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలో ఇంటెన్స్ డ్రామా, మంచి ఎమోషన్స్ ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షామ్దత్, సంగీతం: సామ్ సీఎస్. -
జైలర్-2 తెలుగు హక్కులపై భారీ చర్చ
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమాకు తెలుగు హక్కుల ధరను రూ.60 కోట్లుగా మేకర్స్ నిర్ణయించారు. జైలర్ చిత్రం తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దాని సీక్వెల్కు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ విజయాన్ని బట్టి సీక్వెల్కు భారీ రేట్లు చెప్పడం సహజమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జైలర్కు ముందు, ఆ తర్వాత రజనీకాంత్కు తెలుగులో పెద్ద విజయాలు లేకపోవడం గమనార్హం. రజనీకాంత్ నటించిన 'కూలి' చిత్రం తెలుగు రైట్స్ రూ.52 కోట్లకు (జీఎస్టీతో కలిపి) అమ్ముడయ్యాయి. వేట్టయాన్ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. కానీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించి జైలర్-2కు రూ.60 కోట్ల రేటు ఫిక్స్ చేశారు. దాంతో జైలర్-2కు ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనే చర్చ మొదలైంది.జూన్ 12న థియేటర్లలోకి రానున్న జైలర్-2కు ముందు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయితే జైలర్-2కు థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల చివరి రేటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్లో విగ్రహాల స్మగ్లింగ్ చేసే సిండికేట్కు ఎదురెళ్లే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా రజనీకాంత్ కనిపించనున్నారు. ఈ కథలో ఎస్జే సూర్య కొత్త విలన్గా పరిచయం కానున్నారు. -
లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇంట్లో విషాదం
తెలుగులో చాన్నాళ్ల నుంచి గీత రచయితగా గుర్తింపు తెచ్చుకుని.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఈయన సోదరుడు రాజేంద్ర గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఈయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.(ఇదీ చదవండి: రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్)రాజేంద్ర.. వ్యాపారం కోసం బెంగళూరు నుంచి అన్నమయ్య జిల్లా కలికిరి నగరానికి వచ్చారు. తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో శనివారం రాత్రి బసచేశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేసుకున్న తర్వాత కలికిరి క్రాస్ రోడ్లో ఓ హోటల్లో టిఫిన్ చేశారు. తర్వాత వెంటనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు.(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?) -
స్టైల్ మార్చిన ఐశ్వర్య.. సింహంతో హన్సిక
స్టైల్ మార్చి గ్లామర్ చూపిస్తున్న ఐశ్వర్యా రాజేశ్సింహంతో ఫొటోలు పోజులిచ్చిన హన్సికఒంపుసొంపులతో మాయ చేస్తున్న అనుపమమత్తెక్కించేలా అదరగొట్టేస్తున్న శ్రద్ధా దాస్కుందనపు బొమ్మలా 'రాంబాయి' తేజస్విచిరిగిన జీన్ డ్రస్తో ప్రగ్యా జైస్వాల్ స్మైల్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Preethi Anju Asrani (@thepreethiasrani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Tejaswi. (@tej_aswiii) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) -
'ఫస్ట్ డేనే అలా చేయడం తప్పు.. ఫ్రీ షోలు వేయాలి'
డైరెక్టర్గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారిలో రవిబాబు ఒకరు. తన టాలెంట్తో దర్శకుడిగా మాత్రమే కాదు.. హీరోగా కూడా మెప్పించారు. అలా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం రేజర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఇండస్ట్రీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో ఒళ్లు బలిసి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.అంతేకాకుండా హీరోల అభిమానుల గురించి కూడా రవిబాబు ప్రస్తావించారు. వారి వల్లే హీరోలకు క్రేజ్ ఉందన్న మనందరికీ తెలుసు కదా అన్నారు. అలాంటప్పుడు ఫస్ట్ రోజే వాళ్ల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాగడమేంటని ప్రశ్నించారు. మొదటి రోజు ఫ్యాన్స్కు ఉచితంగా సినిమా వేయొచ్చు కదా అని సూచించారు. నువ్వు రెండో రోజు నుంచి రూ.1000 తీసుకున్నా ఫర్వాలేదని రవిబాబు అన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
‘సిద్దయ్య’ కోసం 30 కిలోలు పెరిగా.. గుర్తుపట్టలేదు : నటుడు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తొలి సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’తోనే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల టాలీవుడ్కి పరిచయం అయ్యారు. అందులో ఒక నటుడు లతీష్. తిమ్మరాజుపల్లి టీవీలో విలన్ సిద్ధయ్య పాత్రలో నటించి..ఆకట్టుకున్నాడు. తొలి మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటున్నాడు లతీష్. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. తన సినీ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.→ నగరిలో మాది వ్యవసాయ కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి.అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి నన్ను చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమా చూసి, అందులో నా పర్ఫామెన్స్ చూసి మాట్లాడాడు.→ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు బెంగళూరులో ఉద్యోగం చేశా. 2017లో హైదరాబాద్కి వచ్చాను. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. అందరూ నా యాక్టింగ్ బాగానే ఉందని అంటూ చెప్పారు. కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. మహిపాల్ వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్గా పని చేశాను. ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ టైంలో యూట్యూబ్లోనే ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. మళ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశాను.→ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలో కెమెరా కొనేందుకు ఇంట్లో వాళ్లనే డబ్బులు అడిగాను. నిర్మించేందుకు డబ్బులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. నాకు ఏ అసోసియేషన్లోనూ మెంబర్ షిప్ లేదు. వేరే డైరెక్టర్ మీద ఆ కథను రిజిష్టర్ చేయించాను. నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు. ఆ తరువాత నేను డా. షేక్ జాన్ బషీర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను.→ తిమ్మరాజుపల్లిలో నాది విలన్ పాత్ర అనగానే.. ఒకప్పుడు విలన్గా నటించి తర్వాత హీరోలు అయిన నటులంతా గుర్తుకు వచ్చారు. సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ కోసం వెయిట్ పెరిగాను. ఏకంగా ముప్పై కిలోలు పెరిగి ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయా. సిద్దయ్య పాత్రకు సరిపోవాలని చాలా శ్రమించాను. సినిమా చూసిన వారంతా అది నువ్వేనా? అని అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది.→ కిరణ్ అబ్బవరం అన్న సినిమా చూసిన తరువాత టీం అందరినీ మెచ్చుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా ప్రదీప్ అన్నని, నన్ను ఎంతో ప్రశంసించారు. బయట ఇంత సైలెన్స్గా ఉన్నావ్.. స్క్రీన్ మీద అలా కనిపించావ్ ఏంట్రా అని ఆశ్చర్యపోయారు. అద్భుతంగా చేశావ్ అని కిరణ్ అన్న మెచ్చుకున్నారు. నరేష్ అగస్త్య కూడా చాలా పొగిడారు. మా బషీర్ సార్ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. నలుగురు శిష్యులు ఒకే సినిమాలో నటించడంతో బషీర్ సార్ కూడా సంతోషించారు. ఇన్స్టిట్యూట్కి వెళ్లిన తరువాత నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను.→ ప్రస్తుతం బీ స్టూడియోలో పార్ట్ టైంగా పని చేస్తున్నాను. చాలా మంది నుంచి ఫోన్స్ వస్తున్నాయి. చాలా కథలు వింటున్నాను. కానీ ఇంత వరకు ఏదీ క్లారిటీ రాలేదు. త్వరలోనే అన్నీ ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి. -
ఓటీటీకి అడివి శేష్ డెకాయిట్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ. -
యశ్తో బోల్డ్ సీన్స్.. తొలగించాలంటూ హీరోయిన్ విజ్ఞప్తి!
కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కన్నడ స్టార్ యశ్ నటించిన పాన్ వరల్డ్ చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చిలోనే విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషంలో జూన్ 4వ తేదికి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్లో కూడా ఈ చిత్రం విడుదల కావడం లేదు. సినిమా ఔట్పుట్ బాగా వచ్చిందని..ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా ప్రమోషన్స్ కోసమే వాయిదా వేస్తున్నట్లు యశ్ ప్రకటించారు. కొత్త తేదిని త్వరలో ప్రకటించనున్నారు.ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. చిత్రబృందానికి వింత విజ్ఞప్తి చేసిందట. షూటింగ్ సమయంలో కథ డిమాండ్ మేరకు యశ్, కియారాల మధ్య కొన్ని బోల్డ్ సీన్లు చిత్రీకరించారట. ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని కియారాకి ముందే చెప్పారట. ఆమె అన్నింటికి ఒప్పుకొనే సినిమాకు సైన్ చేసిందట. ఇష్టంతోనే బోల్డ్ సీన్లు చేసినప్పటికీ.. ఫైనల్ కట్ చూసి ఇప్పుడు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. బోల్డ్ సీన్లు తెరపై మరింత ఘటూగా ఉన్నాయని..వాటిని అలాగే చూపిస్తే తన ఇమేజ్పై ప్రభావం పడుతుందని భయపడుతుందట. అందుకే వాటిని తొలగించడా లేదా నిడివి తగ్గించే ప్రయత్నం చేయమని దర్శకురాలికి రిక్వెస్ట్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆయా సన్నివేశాలు కథకి చాలా కీలకమని..వాటిని తొలగిస్తే సినిమాలోని భావోద్వేగ తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారట. మరి కియారా రిక్వెస్ట్ మేరకు ఆ సీన్లను తొలగిస్తారా లేదా అలానే ఉంచుతారా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే. -
'టాలీవుడ్లో కుల పిచ్చి ఎక్కువ'.. మహేశ్ విట్టా షాకింగ్ కామెంట్స్
యూట్యూబర్ కెరీర్ స్టార్ట్ చేసిన టాలీవుడ్లో నటుడిగా స్థిరపడిన కొద్దిమందిలో మహేశ్ విట్టా ఒకరు. చాయ్ బిస్కెట్ వెబ్ సిరీస్ల ద్వారా వినోదాన్ని పంచిన మహేశ్.. ఆ తర్వాత బిగ్బాస్తో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. టాలీవుడ్ సినిమాల్లో కమెడియన్గా తన నటనతో ప్రత్యేక ముద్రవేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూ హాజరైన మహేశ్ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి ప్రస్తావించారు. తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.సినీ ఇండస్ట్రీలో కుల పిచ్చి ఎక్కువని సంచలన కామెంట్స్ చేశారు. ఆడిషన్ పూర్తయిన తర్వాత నాకు రావాల్సిన రోల్స్ను చివరి నిమిషంలో వేరేవాళ్లకు ఇచ్చేవారని అన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేయడం కూడా ఆపేసే వారని తెలిపారు. ఇక్కడ టాలెంట్ కంటే.. కులం ముఖ్యమని నాకు అర్థమైందన్నారు. అలా నాకు ఎన్నో అవకాశాలు రాకుండా పోయాయని మహేశ్ విట్టా ఆవేదన వ్యక్తం చేశారు.గత ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ..' నేను చాలా పాత్రలకు ఆడిషన్లు ఇచ్చేవాడిని. నన్ను సెలెక్ట్ కూడా చేసేవారు. షూటింగ్ తేదీలు కూడా ఫిక్స్ చేసేవారు. కానీ చివరి నిమిషంలో నాకు ఫోన్ చేయడం ఆపేయడం.. నా స్థానంలో మరో నటుడిని తీసుకోవడం జరిగేది. మొదట్లో ఇదంతా నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ విషయంపై ఆరా తీశా. నా స్థానంలో వచ్చిన వ్యక్తి నిర్మాత, దర్శకుడి సామాజిక వర్గానికి చెందినవాడేనని తెలిసి షాక్ అయ్యా. ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం క్యాస్ట్ కారణంగా నాకు అవకాశాలు దక్కకపోవడం తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసింది' అని అన్నారు.కాగా.. యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా.. తర్వాత టాలీవుడ్లోకి వచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. బిగ్బాస్ షోలోనూ రెండుసార్లు కంటెస్టెంట్గా పాల్గొన్నాడు. సినిమాలు చేస్తూనే శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. -
అరుదైన దృశ్యం.. ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య..!
నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘వృషకర్మ’. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి విరూపాక్ష’ఫేం కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కన పెడితే టాలీవుడ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఓకే వేడుకలో మెరిశారు. చైతూ తన భార్య శోభిత ధూళిపాళ్లతో పెళ్లి రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఇదే రిసెప్షన్కు సమంత సైతం తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. వీరిద్దరు ప్రముఖ నిర్మాత, ఏషియన్ సునీల్ కూతురు సిమ్రాన్ పెళ్లి రిసెప్షన్ హాజరు కావడం విశేషం.వీరిద్దరు విడిపోయి పెళ్లిళ్లు చేసుకున్నాక ఓ వేడుకలో కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే ఒక్కసారిగా అందరి కళ్లు వీరిద్దరిపైనే పడ్డాయి. ఇదే రిసెప్షన్లో నాగార్జున, అమల సైతం కనిపించారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Naga Chaitanya and Sobhita Dhulipala at Simran (Sunil Narang's daughter) - Krish wedding reception. pic.twitter.com/zgVOmb4ABa— idlebrain.com (@idlebraindotcom) May 3, 2026 #TFNExclusive: All smiles as #Samantha along with her husband #RajNidimoru graced #SunilNarang’s daughter’s reception ❤️✨#SimranKrish #TeluguFilmNagar pic.twitter.com/twIKpdrAAz— Telugu FilmNagar (@telugufilmnagar) May 2, 2026 -
తరాలు మారినా భావోద్వేగాలు మారవు : సుభాష్ చంద్ర
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు కీలక పాత్రలో నటించిన సినిమా ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో సుభాష్ చంద్ర మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనం నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. బీటెక్ చదువుతున్నప్పట్నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడం ప్రారంభించాను. దాదాపు 80 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఎక్కువగా రాజ్ తరుణ్తో చేశాను. ఈ క్రమంలో ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్స్కి ప్రయత్నాలు ఆరంభించాను. ఒక సినిమా సెట్స్కు వెళ్లే ముందు ఆగిపోయింది. మరో సినిమా షూటింగ్ పూర్తయింది కానీ రిలీజ్ కాలేదు. ఫైనల్గా ‘గోదారి గట్టుపైన..’ సినిమాతో దర్శకుడిగా వస్తున్నాను. ఈ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పను కానీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. తరాలు మారినా భావోద్వేగాలు మారవని నమ్మే వ్యక్తిని నేను. ఈ సినిమా కథ మన జీవితాల్లో మనం చూసినదే. తండ్రీకూతుళ్ల ప్రేమ, ఇద్దరు ప్రేమికుల ప్రేమ... ఈ రెండు అంశాలను ట్రయాంగిల్ ఫార్మ్లో చూపించే ప్రయత్నం చేశాం. తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి తండ్రి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇది తండ్రి ప్రేమ. ఇటు అబ్బాయి ప్రేమలోనూ నిజం ఉంటుంది. ఈ అంశాలను పరిణతితో కూడిన ఆలోచనలతో చూపించాం. తెలంగాణ అబ్బాయి సుమంత్ ఈ సినిమా కోసం గోదావరి యాస సాధన చేశాడు. హీరోయిన్ నిధి కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరు. నాగవంశీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా తర్వాతి సినిమా ఈ బ్యానర్లోనే ఉంటుంది. అలాగే హారర్–థ్రిల్లర్ జానర్లో ఓ సినిమా చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
హీరోయిన్ యాక్షన్
‘హీరోయిన్లు అంటే హీరోల సరసన ఆడి పాడేందుకే పరిమితం’ అనే మాట ఇటు చిత్ర పరిశ్రమలో, అటు ప్రేక్షకుల్లో వినిపించేది. అయితే.. ఇదంతా గతం. ప్రస్తుతం మాత్రం ఏ విషయంలోనూ తాము తక్కువ కాదు అంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు పలువురు హీరోయిన్లు. పోలీస్, లాయర్, గృహిణి... ఇలా పాత్ర ఏదైనా బిగ్ స్క్రీన్పై తమదైన నటన చూపించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలకు కూడా సై అంటున్నారు. రిస్కీ సన్నివేశాలకు కూడా నో చెప్పడం లేదు. ప్రస్తుతం సమంత, రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్, సంయుక్త, కీర్తీ సురేష్, కామాక్షి భాస్కర్ల... వంటి పలువురు హీరో యిన్లు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం. వినోదం... సందేశం తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీకళ్యాణం’ (2007) సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయ్యారు కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్, మహేశ్బాబు, ఎన్టీఆర్... వంటి పలువురు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి, తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. ప్రస్తుతం తెలుగులో ఆమె ఏ సినిమాలోనూ నటించడం లేదు. అయితే ఇతర భాషల్లో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ అనేది క్యాప్షన్. డీకే చేతన్ దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే నిర్మించిన ఈ హిందీ సినిమా జూలై 24న రిలీజ్ కానుంది.జీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే సమకాలీన అంశంతో రూపొందిన ఈ గ్రిప్పింగ్ సోషియో–నేషనల్ డ్రామా మూవీలో కాజల్ అగర్వాల్ లాయర్ పాత్రలో నటించారు. ‘‘కెమికల్స్ దుర్వినియోగం, సాగులో పురుగు మందులు మితిమీరిన వినియోగం, దీని వెనుక ఉన్న భారీ కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుంది. నేటి ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలోనే మా ‘ది ఇండియా స్టోరీ’ కూడా ఉంటుంది.బలమైన సందేశం, ఆలోచింపజేసే స్క్రీన్ప్లే, స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్ తో వస్తున్న మా మూవీ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సినిమాలో కాజల్ ధైర్యవంతురాలైన న్యాయవాది పాత్రలో కనిపిస్తారు. కంపెనీల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బయటపెట్టే పాత్రను ఆమె పోషించారు. వినోదంతో పాటు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాలనే ఆలోచనతో రూపొందిన ఈ చిత్రం బలమైన కథ, భావోద్వేగభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఫ్యామిలీ డ్రామా ఓ వైపు హీరోయిన్గా, నిర్మాతగా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత. ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత ఆమె నటించిన మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రానికి బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ‘ఓ బేబి’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన రెండవ సినిమా ఇది. ఇందులో గౌతమి, శ్రీలక్ష్మి, దిగ్నాథ్, ఆనంద్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాంక్ దువ్వూరుతో కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు నిర్మించారు.ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సమంత లుక్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రత్యేకించి ఈ మూవీలో సమంత యాక్షన్ సన్నివేశాలు హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది. ‘‘ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్ , గ్రిప్పింగ్ స్టోరీ ఉండనున్నాయి. రా, హై ఇం పాక్ట్ యాక్షన్తో భారతీయ శైలిని మిక్స్ చేసిన సమంత పాత్ర ప్రేక్షకులకు సరికొత్తగా ఉంటుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘తస్సాదియ్యా...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా, చిన్మయి శ్రీ పాద, పుణ్య సెల్వ తమదైన శైలిలో ఆలపించారు. సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ ఈ పాటను విజువల్ ట్రీట్గా మార్చేశాయి. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘తస్సాదియ్యా...’ ఉంటుంది. ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేసిన ‘మా ఇంటి బంగారం’పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందించడంతో ఈ మూవీకి మరింతగా హైప్ వచ్చింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా ‘మా ఇంటి బంగారం’ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఫాంటసీ ఎంటర్టైనర్ రష్మికా మందన్నా భలే జోరు మీద ఉన్నారు. ఓ వైపు హీరోయిన్గా తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న ఆమె మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్లోనూ నటిస్తున్నారు. రష్మిక కమిట్ అయిన తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్బో’. ఈ చిత్రం ద్వారా శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో రష్మికకి జోడీగా మలయాళ నటుడు దేవ్మోహన్ నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్పై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్. ప్రభు తెలుగు– తమిళ భాషల్లో నిర్మించారు. ‘‘విభిన్నమైన రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో రష్మిక పాత్ర అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఇప్పటి వరకూ చూడని సరికొత్త పాత్రలో ఆమె ప్రేక్షకులను అలరిస్తారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, కె.ఎం.భాస్కరన్ఛాయాగ్రహణం ఈ మూవీకి హైలెట్గా నిలుస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ‘రెయిన్బో’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రష్మిక నటించిన సెకండ్ లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా 2025 నవంబరు 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. రష్మిక చేసిన తొలి సినిమా ‘రెయిన్బో’ విడుదల కాకమునుపే సెకండ్ ఫిల్మ్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ విడుదలవడం విశేషం. మైసా యాక్షన్ రష్మికా మందన్న నటిస్తున్న మరో పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో గోండు గిరిజన అమ్మాయి మైసాగా కనిపించనున్నారామె. ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకున్నారు రష్మిక. రా, రియల్గా అనిపించే యాక్షన్ పెర్ఫార్మెన్స్ కోసం బ్యాంకాక్కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్లో శిక్షణ తీసుకున్నారు.రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వా¯Œ్డ్స స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఆమె శిక్షణ పొందిన ఫొటోలు చూస్తే సాధారణంగా కనిపించే సాఫ్ట్ నేచర్ ఇమేజ్కు పూర్తి భిన్నంగా, ఈ చిత్రంలో ఒక దృఢ సంకల్పంతో కూడిన యోధురాలిలా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభం అయింది. ‘‘ పాన్ ఇండియాగా రూపొందుతోన్న ఈ మూవీలో తన కెరీర్లో అత్యంత సవాల్తో కూడిన పాత్ర చేస్తున్నారు రష్మిక. 15 రోజుల యాక్షన్ ΄్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ కేరళలో ప్రారంభించాం.కేచా ఖంపక్దీ మాస్టర్ హై ఓల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్గా నిలుస్తాయి. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మూవీకి శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ సంగీతం హైలైట్గా నిలుస్తాయి. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ని సెట్ చేయబోతోంది. ఈ మూవీలో ఓ యాక్షన్ సన్నివేశం కోసం 80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేశారు రష్మిక’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కోర్టు రూమ్ డ్రామా... ‘మహానటి’ చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక అభిమానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్. ‘నేను శైలజ, నేను లోకల్, సర్కారు వారి పాట, దసరా’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె పెళ్లి కోసం కొంచెం విరామం తీసుకున్నారు. ఇప్పుడు కెరీర్లో మళ్లీ స్పీడు పెంచారు కీర్తీ సురేష్. ప్రస్తుతం తెలుగులో ‘రౌడీ జనార్ధన’తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో వెంకటేశ్కి జోడీగా నటిస్తున్నారు. అలాగే మలయాళం, హిందీ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’. ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.మిస్కిన్, బాల శరవణన్, చారుకేశ్, శిల్పా మంజునాథ్ ఇతర పాత్రలు పోషించారు. డ్రమ్స్టిక్స్ ప్రోడక్షన్స్ , జీ స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. కోర్టు రూమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ నుంచి విడుదలైన కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వస్తోంది. ‘ప్రశాంతమైన ముఖం.. అజేయమైన శక్తి.. ఇప్పుడు అంతా ఆమె వంతు’ అంటూ మేకర్స్ పేర్కొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కోర్టు వాతావరణంలో లాయర్ల మధ్య నిలబడి ఉన్న కీర్తి... సాధారణ చుడీదార్ ధరించి, నుదుట, పాపిట్లో కుంకుమ బొట్టుతో కనిపిస్తోంది. ఆమె కళ్లలో అమాయకత్వం కనిపిస్తున్నప్పటికీ, ఏదో గట్టి పోరాటం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్, నేపథ్య సంగీతం అదిరిపోయేలా ఉంటుందట. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.మహాదేవిగా... ‘శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా పేరు సొంతం చేసుకున్నారు సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎంఎస్ రాజు. నిర్మాత నుంచి డైరెక్టర్గా మలుపు తీసుకున్న ఆయన ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రోడక్ష¯Œన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల నటించిన మహాదేవి పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల ఆమె లుక్ని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ మూవీలో ‘డర్టీ హరి’ మూవీ ఫేమ్ శ్రవణ్ రెడ్డి సింహ అనే పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ సినిమా ద్వారా ప్రముఖ నటీనటులు మంజుల–విజయ్ కుమార్ మనవరాలు, నటి వనిత కుమార్తె జోవిక తెలుగులో పరిచయం అవుతున్నారు. హరిణి పాత్రలో ఆమె నటించినట్లు పేర్కొంటూ ఇటీవల ఆమె లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘అగధ’లోని దైవిక, ఆధ్యాత్మిక అంశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి.85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్.. దాదాపు 45 నిమిషాల వి.ఎఫ్.ఎక్స్తో మా మూవీ ఆడియన్స్కి గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పైన పేర్కొన్న హీరోయిన్లే కాదు.. మరికొంత మంది కథానాయికలు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్లో.. ‘అమ్మాయిలు కాదు... అమ్మాయి... భానుమతి... ఒక్కటే పీస్... రెండు కులాలు, రెండు మతాలు... హైబ్రీడ్ పిల్ల’ అంటూ ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి చేసిన అల్లరి ప్రేక్షకులకు బాగా నచ్చింది. ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్, పడిపడి లేచె మనసు, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, తండేల్’ వంటి తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు సాయి పల్లవి. ‘తండేల్’ మూవీ తర్వాత ఆమె మరో తెలుగు చిత్రం ఏదీ ఒప్పుకోలేదు. కానీ, హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆమె ఓ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్సి గ్నల్ ఇచ్చారని, అది కూడా లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ అని టాక్. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ తెరపైకి రానున్న సంగతి తెలిసిందే.ఈ మూవీకి ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు ఈ మూవీ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో సాయి పల్లవి నటించనున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. ప్రీ–్ర΄÷డక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ టాక్.ఇదిలా ఉంటే... సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ నుండి తప్పుకున్నారని, ఆ అవకాశం రుక్ష్మిణీ వసంత్కు దక్కిందనే వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. మరి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్ర చేసే అవకాశం సాయి పల్లవికి దక్కుతుందా? లేదా రుక్ష్మిణీ వసంత్ని వరిస్తుందా? అన్నది వేచి చూడాలి. పవర్ఫుల్ పోలీస్ తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ... ఇలా దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంయుక్త. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీకి తొలిసారి తెలుగులో ఆమె సంతకం చేశారు. అయితే ‘భీమ్లా నాయక్’ సినిమా ముందుగా విడుదలైంది. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూ పాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న సంయుక్త నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహించారు. మురళీ శర్మ, రావు రమేశ్, నాజర్, మనీష్ వాధ్వా, రామ్కి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ‘ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం, సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, మజాకా’ వంటి సినిమాలు తీసిన రాజేశ్ దండా హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్స్పై ఈ సినిమా నిర్మించారు. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించారు సంయుక్త. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల నేపథ్యంలో, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఈ కథని మరింత గ్రిప్పింగ్గా తీర్చిదిద్దారు యోగేష్.స్క్రిప్ట్లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. సంయుక్త కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్లో చిత్రీకరించాం. మొత్తం 60కి పైగా వర్కింగ్ డేస్లో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఐదు పవర్ఫుల్ షెడ్యూల్స్లో, పదికి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరించాం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలుంటాయి.ఈ చిత్రీకరణ కోసం ప్రతిరోజూ రెండు కెమెరాలను ఉపయోగించాం. కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా ఐదు కెమెరాలను ఏకకాలంలో వినియోగించాం. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందించిన ‘బ్లాక్ గోల్డ్’ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.– డేరంగుల జగన్ మోహన్ -
యాక్షన్కి డేట్ ఫిక్స్
నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్కుమార్ జంటగా నటించిన పోలీస్ కంప్లెయింట్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 22న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు.సంజీవ్ మేగోటి మాట్లాడుతూ–‘‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాం. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగే ఈ కథకి హారర్, థ్రిల్లర్ అంశాలను జోడించాం’’ అని తెలి పారు. -
విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి
కార్తీకదీపం సీరియల్ పేరు చెప్పగానే అందరికీ దీపనే గుర్తొస్తుంది. వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోనే ఈమె తల్లి సుమిత్రగా చేస్తున్న నటి సీత గురించి చాలామందికి తెలుసు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బాగానే పేరు తెచ్చుకుంది. అయితే ఈమె అప్పుడప్పుడు బుర్కా ధరించడం, నమాజ్ చేస్తుండటంపై వస్తున్న ప్రశ్నలకు రీసెంట్గా క్లారిటీ ఇచ్చింది. తను రెండో పెళ్లి చేసుకోవడం గురించి కూడా వివరణ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)'చాలారోజులుగా నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా ఫాలోవర్స్కి నాపై చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా కామెంట్స్లో అడుగుతూనే ఉంటారు. సీతాలక్ష్మీ అనే పేరు ఉంది కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా? ఎందుకు పెట్టుకోవడం లేదని అడుగుతుంటారు. మీరు బుర్కా ఎందుకు ధరిస్తున్నారని కూడా అడుగుతున్నారు. కావాలనే వేసుకుంది, నటిస్తుందని అంటుంటారు. ఇలా చాలామందికి అర్థం కావట్లేదు. వాటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా పేరు సీతాలక్ష్మీ. అది అమ్మనాన్న పెట్టిన పేరు. నా ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటైల్స్ అన్నింటిలో అలానే ఉంది. అయితే నా జీవితంలో ఓ చేదు జ్ఞాపకముంది. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. దాన్నుంచి బయటకు రావడానికి నాలుగేళ్ల పట్టింది. 2013 తర్వాత నాలుగేళ్లు యాక్టింగే చేయలేదు. ఎందుకంటే అప్పుడు నాకు విడాకులయ్యాయి. ఇది ఎందరికీ తెలుసో తెలీదు. కానీ నిజం చెప్పడానికి బాధపడను. అనుభవిస్తే కానీ ఆ బాధ అర్థం కాదు''నాకు విడాకులు అయిన తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు. నా బాధలు అతడితో చెప్పుకొన్న తర్వాత మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. తోడు కావాలని ఓకే చెప్పేశాను. అలా అతడిని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ ఆయన వైపు వాళ్లు నన్ను అంగీకరించారు. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. ఆయాస్ అని పిలుస్తారు. నా గురించి అంతా తెలిసిన వ్యక్తి. నన్ను అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా మేం ఒక్కటయ్యాం. కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ల మతంలోకి మారాల్సి వచ్చింది. మా ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేదు. అత్తగారింట్లో సపోర్ట్ కావాలంటే కొన్ని చేయకతప్పదు. అందుకే వాళ్ల వైపు వెళ్లిపోయా. అలా మా అత్తగారు నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు. అలా సీతాలక్ష్మి కాస్త యాస్మిన్ అయింది. వాళ్లు నన్ను యాస్మిన్ అనే పిలుస్తారు. సీత అని పిలవరు''పేరు మార్చుకుంటే ఇండస్ట్రీలో కుదరదు కాబట్టి సీత అని అలానే ఉంచేసుకున్నా. నా భర్త వైపు వాళ్లు మాత్రం యాస్మిన్ అనే పిలుస్తారు. వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా నేనేం చేయను. అందుకే బుర్కా ధరిస్తాను. అయితే వాళ్లు ఇలానే ఉండాలి, అలాగే ఉండాలి అని నన్ను బలవంతం చేయరు. షూటింగ్కి వచ్చినప్పుడు మాత్రం నచ్చినట్టు ఉంటాను. అందుకే ఒకసారి బొట్టు పెట్టుకుంటాను. ఇంకోసారి పెట్టుకోను. అంతే తప్ప హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇవేం ఉండవు. నాకు మతపరమైన ఫీలింగే లేదు. నా జీవితంలో చాలా ఆశపడ్డాను. కానీ ఒక్కటీ జరగలేదు. విడాకులు అవుతాయని కలలో కూడా ఊహించలేదు. రెండో పెళ్లి కూడా ఊహించలేదు' 'దేవుడు ముందే అంతా నిర్ణయించి ఉంటాడు. రాసినదాన్ని తప్పించుకోలేం. వద్దంటే ఆగిపోదు.. కావాలంటే రాదు. మా అత్తగారి ఇంటి వాళ్ల కోసం అలా మారాను. నేనే తప్పు చేయడం లేదు. నేను అల్లాని మొక్కుతా. నమాజ్ చేస్తా. నిజాయితీగా ఉంటా. నేను ఎవరికీ చెడు చేయలేదు. నేను కష్టపడుతున్నా. నేను తింటున్నా. నా బాధలైనా ఆనందం అయినా దేవుడితోనే, అది ఏ దేవుడైనా అయ్యి ఉండొచ్చు' అని సీత వివరణ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ) -
కాజల్ వింటేజ్ గ్లామర్.. విష్ణుప్రియ అస్సలు తగ్గట్లే!
అందానికే అందంలా మెరిసిపోతున్న కాజల్బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఇమాన్విఆరెంజ్ డ్రస్లో విష్ణుప్రియ అందాల ఆరబోతమాల్దీవుల్లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న కియారాస్టైలిష్ వాక్తో సెగలు పుట్టిస్తున్న మాళవికఅందంగా నవ్వేస్తున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Vishnu Priya Bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) -
వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' రిలీజ్ ఎప్పుడంటే?
విలనిజం, క్యారెక్టర్ రోల్.. ఏదైనా సరే తనదైన నటనతో ఆకట్టుకునే వరలక్ష్మి శరత్కుమార్ కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. నవీన్ చంద్రతో కలిసి నటించిన 'పోలీస్ కంప్లైంట్'.. మే 22న థియేటర్లలోకి రానుంది. సంజీవ్ మేగోటీ దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కృష్ణసాయి నటించారు. ఇతడి బర్త్ డే సందర్భంగా తన అభిమాన నటుడు సూపర్స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తీశాం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఆ డైరెక్టర్ 10 సార్లు లైంగికంగా వేధించాడు: మోనాలిసా) -
మా బావ రామ్ చరణ్కి స్పెషల్ థాంక్స్ : లావణ్య త్రిపాఠి
‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అడగగానే మా కోసం ‘సతీ లీలావతి’ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న మా బావ గారు రామ్ చరణ్కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్కి, మా సినిమాకు రీచ్ పెరిగింది’ అన్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఆమె, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు.ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.దేవ్ మోహన్ మాట్లాడుతూ .. ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాతినేని సత్య, నాగ మోహన్, తాగుబోతు రమేష్ , సప్తగిరి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
‘అరుంధతి’గా మెగా కోడలు.. నవ్వులు పూయిస్తున్న ‘సతీ లీలావతి’ ట్రైలర్
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. మే 8న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ని మేకర్స్ విడుదల చేశారు. భార్యాభర్తల మధ్య గొడవతో మొదలయ్యే ఈ కథలో భార్య లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి, భర్తగా దేవ్ మోహన్ నటించారు. ‘20 ఏళ్ల నా పెంపకంలో కనబడని నవ్వు.. మూడేళ్ల మీ సంసార జీవితంలో నీ మొఖంలో కనిపిస్తుంది’ అంటూ నరేశ్.. లావణ్యతో చెప్పే డైలాగ్లో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ‘ఇంతకీ అల్లుడెక్కడ?’ అని నరేశ్ అడగడం.. అతన్ని కిడ్నాప్ చేసి తెలియదు అన్నట్లుగా లావణ్య నటించడం..మధ్యలో ‘నికోలా సెబాస్టియన్’ పాత్ర ఎంట్రీ తో ఆద్యంతం వినోదాత్మకంగా ట్రైలర్ సాగింది. ఇక చివరిలో లావణ్య అరుంధతిగా మారి ‘నువ్వు నన్నేం చేయలేవురా’అనే డైలాగు చెప్పడం బట్టి చూస్తే.. సినిమాలో నవ్వులు పూయించే సన్నివేశాలు బాగానే ఉన్నట్లు అర్థమవుతుంది. -
త్రిష షాకింగ్ ట్వీట్.. ఇలా అవమానిస్తారా?
సినిమాల్లో నటించడమే కాదు దాన్ని ప్రమోషన్స్లో పాల్గొనడం కూడా హీరోహీరోయిన్ల బాధ్యత. ఇప్పుడు చాలా మంది ప్రమోషన్స్కి దూరంగా ఉంటున్నారు. షూటింగ్ అయిపోయిందా.. ప్యాకప్ చెప్పేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లలో చాలా మంది ప్రమోషన్స్కి దూరంగా ఉంటున్నారు. అందులో త్రిష కూడా చేరిందని మొన్నటి వరకు ప్రచారం సాగింది. సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’(తెలుగులో వీరభద్రుడు) మూవీలో త్రిష హీరోయిన్గా చేసింది. మే 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిష హాజరుకాకపోవడంతో..ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. మూవీ ప్రమోషన్స్కి దూరంగా ఉంటుందని కొంతమంది నెటిజన్స్ విమర్శిస్తూ కామెంట్ చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే.. అసలు ఆడియో లాంచ్ ఈవెంట్కి త్రిషకు ఆహ్వానమే అందలేదట. ఈ విషయాన్ని త్రిష పరోక్షంగా చెబుతూ.. ‘కరుప్పు’ టీమ్పై సెటైర్లు వేసింది.త్రిష లుక్ వైరల్కరుప్ప మేకర్స్ తాజాగా త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. 37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో త్రిష కోర్టు రూమ్లో సీరియస్ లాయర్గా, మరో సీన్లో ఆకుపచ్చ చీరలో డ్యాన్స్ చేస్తూ మెరిశారు. 43 ఏళ్ల వయసులోనూ మరింత అందంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త్రిష ఇంత యంగ్గా ఎలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.నేను కూడా మర్చిపోయా.. అయితే ఓ అభిమాని త్రిష లుక్పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘కరుప్పు సినిమాలో త్రిష ఉందన్న విషయమే మర్చిపోయాను. ఆమె ఏజ్ రివర్స్ గేర్లో వెళ్తోంది" అని ట్వీట్ చేశారు. దానికి త్రిష ఇలా రిప్లై ఇచ్చింది. "ధన్యవాదాలు. నేనూ మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా వారు ఇలా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది’ అని వ్యంగ్యంగా పేర్కొంది. ఇన్విటేషన్ మిస్ అయిందేమోదీనిపై సూర్య అభిమాని స్పందిస్తూ.. ‘ఆడియో లాంచ్కే రాని మీకు ఇంత వెతకారం అవసరమా?’ అని ప్రశ్నించారు. దానికి త్రిష బదులిస్తూ.. ‘నా ఇన్విటేషన్ బహుశా మెయిల్లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే’ అంటూ తనను ఆ వేడుకకు తనను ఆహ్వానించలేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పింది. ఆడియో లాంచ్ పోస్టర్లలో ఆమె పేరున్నప్పటికీ, పిలవకుండా పోస్టర్లు వేస్తే ఎలా వస్తారని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.‘చెత్త ప్రొడక్షన్ హౌస్.. ఒక స్టార్ హీరోయిన్ని ఇలా అవమానిస్తారా?’, ‘సూర్య ఈ విషయంపై స్పదించాలి’ అని కామెంట్ చేస్తున్నారు. Thank you ☺️ Even I forgot.Good to know they set a reminder now atleast😅 https://t.co/vAgpPJiJJ9— Trish (@trishtrashers) May 1, 2026 -
ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు : రవిబాబు
ఒకప్పుడు సినిమా తీసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేసేవారని..ఇప్పుడు ఒళ్లు బలిసి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నాడు నటుడు, దర్శకుడు రవిబాబు. చాలా గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వంలో రేజర్ అనే సినిమా రాబోతుంది. ఇందులో ఆయనే హీరోగా నటించాడు. మే 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో బిజీ అయిపోయాడు రవిబాబు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటికీ ఇప్పటికి ఫిలిం మేకింగ్ లో వచ్చిన మార్పులపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.‘అప్పుడు సినిమాలు చేసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని తీసేవాళ్లు. ఇప్పుడు సినిమాలు చేసేవాళ్లు ఒళ్లు బలిసి చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో 'ఫిల్మ్'లో సినిమా తీస్తాం కాబట్టి, దానిపై ఒక రెస్పెక్ట్ ఉండేది. ఫిల్మ్ చాలా ఖరీదైనది కావడంతో, యాక్టర్స్ , డైరెక్టర్స్, కెమెరామెన్ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్లు చేసేవాళ్లు. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. చిప్ వేస్తున్నాడు, తీస్తున్నాడు.. మళ్లీ అదే చిప్ పెడుతున్నాడు. దాని కాస్ట్ కూడా కాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే బేసిక్ ఇన్ ఫుట్ టెక్నాలజీ మీద, టైమ్ మీద రెస్పెక్ట్ లేకుండా పోయింది. అప్పట్లో టైమ్కి,డబ్బులకి వ్యాల్యూ ఇచ్చేవారు. ఇప్పుడు అసలు అదేం లేదు. ఒకప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ అంతా డిసిప్లైన్ గా జరిగేది. ఇప్పుడు అలాంటి డిసిప్లైన్ లేదు’ అని రవిబాబు అన్నారు. అయితే ‘ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు’ అని విమర్శించడాన్ని కొంతమంది నెటిజన్స్ తప్పుపడుతున్నారు. టెక్నీషియన్లను ఉద్దేశించి ఇలాంటి పదజాలం వాడటం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది రవిబాబు వ్యాఖ్యలలో వాస్తవం ఉందని కొందరు సమర్థిస్తున్నారు. -
జెట్లీ ప్రదర్శనను నిలిపివేయడం తగదు
మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సెంటే జీ విధానంలో సినిమాలను ప్రదర్శించాలని హైదరాబాద్లోని 23 సింగిల్ స్క్రీన్ల థియేటర్ల యజమానులు నిర్ణయించినట్లు ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్సీసీ) గతంలో ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పర్సెంటేజీ బేస్డ్ స్క్రీనింగ్ విధానాన్ని తాము అంగీకరించమని, పాత విధానాన్నే కొనసాగించాలని ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ సభ్యులు ‘టీఎఫ్సీసీ’కి లేఖ పంపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీకెండ్ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ నిబంధనలపై గత కొంతకాలంగా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ సంస్థకు, ఎగ్జిబిటర్లకు మధ్య భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ‘మైత్రి’ సినిమాలను సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. అయితే శుక్రవారం మైత్రి సంస్థ నుంచి విడుదలైన ‘జెట్లీ’ సినిమాను పలు మల్టీప్లెక్స్లలో ప్రదర్శించలేదట. ఈ విషయంపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ భాగస్వామి అయిన కేతిరెడ్డి శశిధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యపై మొదటి నుంచి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్య ఇంకా పరిష్కారం కానప్పటికీ మీ నిర్ణయాన్ని మేము గౌరవించాం. కానీ ‘జెట్లీ’ మూవీ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. మీ నియంత్రణలో ఉన్న మల్టీప్లెక్స్లో మా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఈ నిర్ణయం మాపై ఒత్తిడి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోంది. వెంటనే పునరాలోచించి మల్టీప్లెక్స్లలో ‘జెట్లీ’ ప్రదర్శనకు అనుమతించాలి’’ అని కోరారు. -
జూన్లో సింగ్ గీతం
మూకీ చిత్రం ‘పుష్పక్’, టాకీ సినిమాలు ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్ ’, ‘ఆదిత్య 369’ వంటి ఎన్నో సూపర్హిట్ చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోని తాజా సినిమాకు ‘సింగ్ గీతం’ అనే టైటిల్ ఖరారైంది. 94 సంవత్సరాల వయసులో ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ మ్యూజికల్ ఫాంటసీ సినిమాలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.శుక్రవారం ఈ సినిమా టీజర్ను విడుదల చేసి, ఈ సినిమాను జూన్ 11న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. ‘కుబేరపురం... అసలు ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడు అంకుల్ మా నాన్న ఈ ఊరిని... రాజా ట్రీట్మెంట్ ఇక్కడ..., మనకు ఒక ఫారిన్ డీల్ ఓకే అయ్యింది’ అనే డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. ‘‘ఒక మిస్టీరియస్ విలేజ్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రతాప్ అనే యువకుడి కథ చుట్టూ తిరుగుతుంది. అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతాప్ జీవితం అనుకోని మార్గం లోకి వెళుతుంది. కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అడుగుపెడతాడు. దీంతో ఓ సంఘర్షణలో చిక్కుకుని తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. యూనిక్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
మేడే స్పెషల్
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. మహిమా నంబియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మే 1న మేడేని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి శ్రీవిష్ణు పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. -
గ్రీన్ డ్రెస్లో నిహారిక కొణిదెల.. డిఫరెంట్ అవుట్ఫిట్లో సుప్రీత..!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ..ఆరెంజ్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..పచ్చని డ్రెస్లో ప్రకృతిలో కలిసిపోయిన నిహారిక కొణిదెల..పార్టీలో యాంకర్ రష్మీ గౌతమ్ చిల్..డిఫరెంట్ అవుట్ఫిట్లో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ సుప్రీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
'నేను సడన్గా చనిపోతే..' ఏం చేయాలో ముందే చెబుతా..!
బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన విమాన ప్రయాణానికి ముందు ఓ సీక్రెట్ నోట్ పంపుతానని తెలిపారు. ఒకవేళ ఏదైనా జరిగిన నేను చనిపోతే రన్నింగ్లో ఉన్న సినిమాను ఆపొద్దని దర్శకుడు మన్సూర్ ఖాన్కు పంపుతానని వెల్లడించారు. నేను చనిపోయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని చెప్తానని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు.అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'ఏదైనా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి చివరి దశలో ఉన్నప్పుడు నేను విమాన ప్రయాణం చేయాల్సి వస్తే మన్సూర్కు ఓ సీక్రెట్ నోట్ పంపుతా. ఒకవేళ తాను ప్రయాణించే ఫ్లైట్ కూలిపోయి చనిపోతే.. ఆ సినిమా పనులు నువ్వే చూసుకో అని రాసి పంపిస్తా. అంతేకాకుండా దర్శకులతో కూడా ఇదే విషయాన్ని చెబుతా. నాకు ఏ ఆపద వచ్చినా సినిమాను ఆపొద్దని.. మన్సూర్తో కలిసి మూవీని విడుదల చేయాలని కోరతా' అని అన్నారు. ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఆపద వస్తుందనే భయం నాలో ఉందన్నారు. కాగా.. దర్శకుడు మన్సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఇద్దరు బంధువులు కావడం విశేషం. వీరిద్దరి కాంబోలో ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహీ సికందర్ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. -
'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు'
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా వెల్లడించారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్ సార్పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్ సార్కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్మీట్కు దర్శకుడు సుకుమార్, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా హాజరయ్యారు. -
మనుషులనే వదలరు.. కుక్కలను వదిలేస్తారా?.. రేణు దేశాయ్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ మూగ జీవాలకు ఏ కష్టమొచ్చినా తట్టుకోలేదు. ముఖ్యంగా వీధి కుక్కల రక్షణ కోసం ఆమె పోరాటం చేస్తూనే ఉంది. ఎక్కడైనా వాటిని హింసించినా.. హానీ తలపెట్టినా తన దృష్టికి వస్తే రియాక్ట్ అవుతూ ఉంటోంది. తాజాగా కొద్ది రోజులుగా కుక్కల రక్తం తీసి అమ్ముకుంటున్నారని ఓ వార్త తెగ వైరలవుతోంది. హైదరాబాద్లోనే ఈ దందా నడుస్తోందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్ అయింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ..'గత మూడు రోజులుగా మనం వింటున్నాం. అసలు ఈ రక్తం ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కొంటున్నారు? ఇద్దరిదీ తప్పే. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేవారు కుక్కలను వదిలేస్తారా? కానీ కొంచమైనా భయం, భక్తితో ఉండండి. మనం ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ మన పిల్లకు తగులుతుందని మైండ్లో పెట్టుకోండి. కుక్కల రక్తంతో డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు. వీధి కుక్కలతో ఇలాంటి పనులు చేయడం దారుణం. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ కుక్కలు, పిల్లులతో ఇలా చేస్తే అది పెద్ద కర్మ. అందరికీ డబ్బు కావాలి. కానీ ఇలా సంపాదించడమనేది ఎంతవరకు సమంజసం' అంటూ మాట్లాడింది.నిన్న కూడా ఫస్ట్ టైమ్ నన్ను మోసం చేశారని రేణు తెలిపింది. మెడిసిన్ బాటిల్స్ ఆర్డర్ చేస్తే పగిలిన పోయినవి వచ్చాయని వెల్లడించింది. ముసలి వాళ్లను టార్గెట్ చేసి.. ఓటీపీలు తీసుకుని మోసాలు చేస్తున్నారు. రాక్షసులైతేనే ఇలాంటి పనులు చేస్తారని.. మనుషులైతే ఇలా చేయరని రేణు మండిపడింది. చెడు మార్గాలు, మోసాలు, గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నాలను ఆపాలని రేణు దేశాయ్ కోరింది. నిజాయితీగా, కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించడని హితవు పలికింది. ఎందుకంటే కర్మ అనేది నిజం.. అది ఎవరినీ వదిలిపెట్టదని తెలిపింది. ఆ దేవుడు అంతా గమనిస్తూ ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందరు సురక్షితంగా ఉండాలని రేణు దేశాయ్ కోరింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
‘అరేయ్ ఆపండ్రా’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజును పురస్కరించుకుని, మే 15న "అరేయ్ ఆపండ్రా" చిత్రం గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ బ్యానర్పై బేబీ హరిణి సమర్పణలో, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో అశోక్ నిమ్మల ఈ కామెడీ సస్పెన్స్ చిత్రాన్ని నిర్మించారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకుంది.నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ, "ఈ వేసవిలో ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించే ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించబోతున్నాం. అనుకున్న బడ్జెట్లో మా దర్శకుడు సినిమాను చాలా రిచ్గా తెరకెక్కించారు. సుదర్శన్, భద్రం, తల్లాడ సాయికృష్ణల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ" అని తెలిపారు.సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరో సహ నిర్మాత అంజాద్ మాట్లాడుతూ షూటింగ్ ఖమ్మం, హైదరాబాద్ పరిసరాల్లో జరిగిందని, అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు.న్యాచురల్ కామెడీతో పాటు మంచి సందేశందర్శక-నటుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. "నేటి సామాజిక పరిస్థితులను సహజమైన కామెడీతో జోడించి, ఒక మంచి సందేశంతో ఈ సినిమాను రూపొందించాం. మా లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి రామ్ అన్న పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన పుట్టినరోజున సినిమాను విడుదల చేయడం సంతోషంగా ఉంది. అలాగే 'ఒంగోలు గిత్త'లో రామ్ అన్నతో నటించిన కిషోర్ దాస్ గారు మా సినిమాలో ఉండటం మాకు పెద్ద ప్లస్" అని అన్నారు. -
మెగా ఫ్యాన్స్కు పండగే.. కాస్తా ముందుగానే పెద్ది రిలీజ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
‘గాయపడ్డ సింహం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : గాయపడ్డ సింహంనటీనటులు: తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, శుభలేఖ సుధాకర్, విష్ణు తదితరులునిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ రచన, దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్సమర్పణ: పవన్ సాదినేనిసంగీతం: స్వీకర్ అగస్తీఎడిటర్: విప్లవ్ నిషాదంకథేంటంటే..దరహాస్(తరుణ్ భాస్కర్), గాయత్రి(మానసా చౌదరి) ప్రేమించుకుంటారు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని గాయత్రి తండ్రి కండీషన్ పెట్టడంతో.. దరహాస్ అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతాడు. వీసా తీసుకొని అమెరికాకి వెళ్లి.. 34 గంటల్లోనే తిరిగి వస్తాడు. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వెనక్కి వచ్చిన (డిపోర్ట్) భారతీయ విద్యార్థుల్లో దరహాస్ ఒకడు. తనను అమెరికాకు వెళ్లకుండా చేసిన ట్రప్పై దరహాస్ పగపడతాడు. ఎలాగైన ట్రంప్పై ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహితులతో చెబుతాడు. దరహాస్ టార్చర్ భరించలేక ఫ్రెండ్ ఒక సలహా ఇస్తాడు. అదేంటి? ట్రంప్పై పగ తీర్చుకోవడం సాధ్యమేనా? దరహాస్ పగకు మాఫియా డాన్ బ్రూటల్ ధర్మ(జేడీ చక్రవర్తి)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో భైరవ దాస్(శ్రీవిష్ణు), శాలిని(ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి చేతబడి.. ప్రాక్టికల్గా ఇది అసంభవం. ఇలాంటి పాయింట్తో తెరకెక్కిన చిత్రమే గాయపడ్డ సింహం. లైన్ వింటేనే నవ్వొస్తుంది. కథగా మలిస్తే ఎలా ఉండాలి? థియేటర్స్లో నవ్వులు వర్షం కురవాలి. కానీ దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కామెడీ పండించడంలో పూర్తిగా సఫలం కాలేదు. చేతబడి కాన్సెప్ట్, బ్లాక్ బస్టర్ సినిమాల స్పూఫ్.. ఇవన్నీ సినిమాలో ఉన్నాయి కానీ..అవేవి పెద్దగా ఆకట్టుకోలేదు. అలా అని పూర్తిగా బోర్ కొట్టించదు. కథ ఓకే కానీ..కథనం విషయంలోనే దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. బొమ్మరిల్లు, కేజీఎఫ్, అర్జున్ రెడ్డి, సలార్ లాంటి సినిమాల స్పూఫ్ సీన్లను మరింత బలంగా రాసుకోని ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. డ్రగ్స్ మాఫియాపై ఐజి విజయకాంత్ (శుభలేఖ సుధాకర్) టీమ్ మెరుపు దాడులు చేసే సన్నివేశాలతో కథను సీరియస్గా ప్రారంభించాడు దర్శకుడు. ఆ వెంటనే ఫరియా, తరుణ్ భాస్కర్ల పెళ్లి చూపులు సీన్తో కథ కామెడీ వైపు టర్న్ తీసుకుంటుంది. ఇక దరహాస్తో తన తండ్రికి ముందే పరిచయం ఉందని శాలిని గ్రహించి.. నిజం చెప్పమని కోరడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. దరహాస్, గాయత్రి లవ్ స్టోరీని లైట్గా చూపించి..అమెరికాకు వెళ్లే ముందు హీరో ఇచ్చే బిల్డప్పులను హైలెట్ చేశాడు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరో అమెరికా నుంచి తిరిగి వచ్చి.. పగతీర్చుకునేందుకు చేసే ప్రయత్నాల వరకు కథనం సోసోగానే నడుస్తుంది. ఎప్పుడైతే శ్రీవిష్ణు పాత్ర ఎంట్రీ ఇస్తుందో..అప్పటి నుంచి కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఎలాంటి సంబంధం లేని బ్రూటల్ ధర్మ పాత్రను ట్రంప్ చేతబడికి ముడిపెట్టిన విధానం బాగుంది. కానీ ఆయా సన్నివేశాలను మరింత కామెడీగా చూపించాల్సింది. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. కథనం కొంతవరకు ఆసక్తికరంగా సాగుతుంది. బొమ్మరిల్లు, కేజీఎఫ్ సినిమాల స్పూఫ్ కొంతవరకు నవ్విస్తుంది. మిగతా సినిమాల స్పూఫ్ జస్ట్ ఓకే. ఇక ఆర్జీవీ, జేడీ చక్రవర్తిల కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘సత్య’ మూవీకి ఈ కథకు ముడిపెట్టిన విధానం బాగుంది. అయితే కథనం పూర్తిగా నెమ్మదించడంతో ముందుకు పోకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్లో శ్రివిష్ణు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ‘గాయపడ్డ సింహం’ కొంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది. కామెడీ ఆశించి వెళ్తే మాత్రం.. ప్రేక్షకుడి మనసు గాయపడక తప్పదు. ఎవరెలా చేశారంటే.. దరహాస్ పాత్రకు తరుణ్ భాస్కర్ న్యాయం చేశాడు. ఆయన అమాయకత్వం, డైలాగులు కీడాకోల సినిమాను గుర్తు చేస్తాయి. బ్రూటల్ ధర్మగా జేడీ చక్రవర్తి బాగానే చేశాయి. అయితే ప్రమోషన్స్లో చెప్పినట్లుగా అద్భుతంగా అయితే లేదు. ఫస్టాఫ్లో డాన్లా కనిపించే సన్నివేశాలు బాగున్నాయి కానీ.. కామెడీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. తండ్రితో ప్లాష్బ్యాక్ని గంభీరంగా చెప్పించడం తప్ప ఫరియా అబ్దుల్లాకి పెద్దగా నటించే అవకాశం రాలేదు. శ్రీవిష్ణు తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు ఆయన పాత్రే ప్లస్ అని చెప్పాలి. సినిమా చూసిన వాళ్లకు భైరవ దాస్ పాత్ర గుర్తుండిపోతుంది. శుభలేఖ సుధాకర్, హర్ష, విష్ణుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. స్వీకర్ అగస్తీ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
దురంధర్-2 కలెక్షన్స్.. బాహుబలి-2 రికార్డ్ బ్రేకయ్యే ఛాన్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మూవీ రిలీజై 43 రోజులైనా వసూళ్లు సాధిస్తూనే ఉంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బద్దలు కొట్టిన దురంధర్-2 మరో క్రేజీ రికార్డ్పై కన్నేసింది.ఇప్పటి వరకు దురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,783.66 కోట్ల వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 1358.51 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం.. ఓవర్సీస్లో రూ. 425.15 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోన్న ఈ మూవీ బాహుబలి-2 రికార్డ్కు అత్యంత చేరువలో ఉంది. రాజమౌళి బాహుబలి-2 కంటే కేవలం రూ. 5 కోట్లు మాత్రమే వెనకబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇదే వసూళ్లు కొనసాగితే బాహుబలి-2ను సైతం అధిగమించేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఆరో వారంలో రూ.12.40 కోట్ల వసూళ్లు రాబట్టింది.గతేడాది రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఆదిత్య ధర్ రచన, దర్శకత్వం వహించగా.. రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రాకేష్ బేడి, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. -
విసుగెత్తిస్తున్న 'వాయిదాలు'.. దీనికి పరిష్కారం లేదా?
ఏదైనా పని ఫలానా సమయానికల్లా పూర్తి చేస్తానని చెప్పి.. చేయకపోతే ఎలా ఉంటుంది? కచ్చితంగా కోపం వస్తుంది. ఒకవేళ ఇలా రెండు మూడుసార్లు జరిగితే నిజంగా పని పూర్తయినా సరే చేయలేదేమో అనే అనుమానం కలుగుతుంది. అలానే పని ఫెర్ఫెక్ట్గా చేసినా ఇంప్రెసివ్గా అనిపించకపోవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తెలుగులో కొన్ని సినిమాల పరిస్థితి ఇలానే తయారైంది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రేక్షకులకే చిరాకు తెప్పిస్తున్నారు. దీనికి కారణమేంటి? పరిష్కారం లేదా?(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అంటే ప్రతిఒక్కరూ కమిట్మెంట్లా ఫీలయ్యేవారు. ఒకవేళ చెప్పిన తేదీకి రిలీజ్ చేయకపోతే నెగిటివ్ సెంటిమెంట్లా భావించేవారు. కానీ ఇప్పుడు వాయిదాలు అనేవి చాలా సాధారణం అయిపోయాయి. టెక్నికల్ అంశాల వల్ల ఇలా చేస్తున్నామని దాదాపు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కరోనా టైంలో షూటింగ్స్ సరిగా నడవక ఈ వాయిదాల పర్వం మొదలైంది. తర్వాత కరోనా వెళ్లిపోయింది గానీ వాయిదాలు మాత్రం అలానే ఉండిపోయాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సరైన్ ప్లానింగ్ లేకపోవడంతో షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం తదితర అంశాలు విడుదల తేదీలని పదేపదే మార్చేందుకు కారణమవుతున్నాయి. కొన్ని సినిమాలైతే అంతా సిద్ధమైపోయినా సరే ఎందుకో వాయిదా వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)గతం గురించి అక్కర్లేదు. టాలీవుడ్లో ప్రస్తుత పరిస్థితి ఓసారి చూసుకుంటే.. రామ్ చరణ్ 'పెద్ది'ని తొలుత మార్చి 27న రిలీజ్ చేస్తామని అన్నారు. ఆపై ఏప్రిల్ 30 అన్నారు. ఇప్పుడేమో జూన్లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రాన్ని తొలుత మే 01న రిలీజ్ అని ప్రకటించారు. 'పెద్ది' కారణంగా జూన్ 26కి వాయిదా వేశారు. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీని లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్లో రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం వెల్లడించారు. తీరా చూస్తే ఏకంగా ఏడాది వాయిదా వేసి వచ్చే జూన్ అని పోస్టర్ వదిలారు. కన్నడ డబ్బింగ్ చిత్రం 'టాక్సిక్' అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.సరే పైన చెప్పినవన్నీ స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ షెడ్యూల్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల ఆలస్యమైందిలే అనుకోవచ్చు. కానీ సమంత లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'ని మే 15 నుంచి జూన్ 4కి మార్చారని టాక్ వినిపిస్తోంది. నిఖిల్ చేసిన పీరియాడిక్ మూవీ 'స్వయంభు' అయితే ఫిబ్రవరి నుంచి అప్పుడు ఇప్పుడు అని చెబుతున్నారు గానీ రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నారు. నాని 'ప్యారడైజ్' అయితే తొలుత మార్చి అన్నారు. తర్వాత ఆగస్టు అన్నారు. ఇప్పుడసలు ఈ ఏడాది రాకపోవచ్చని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అయితే అనుకున్న బడ్జెట్ దాటేసిందని, షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిందని అంటున్నారు. ఎప్పుడో విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)ఇలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోతే సదరు సినిమాలపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిపోతుంది. థియేటర్కి వెళ్లి చూసిన తర్వాత నచ్చితే పర్లేదు. ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఇంతోటి దానికి ఇన్ని వాయిదాలు వేశారా అని ముఖం మీదే అనేస్తారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇది కేవలం ఆ ఒక్క సినిమాపైనే ప్రభావం చూపడం కాదు. మొత్తం టాలీవుడ్ వ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే తెలుగు ప్రేక్షకుడు ఇంకా థియేటర్కి దూరమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు. స్టార్ హీరోల చిత్రాల్ని ప్రకటించేటప్పుడు ఆర్భాటంగా డేట్స్ కూడా ప్రకటించేయకుండా ఔట్పుట్ రెడీ అయిన దానిబట్టి విడుదల తేదీపై క్లారిటీ ఇస్తే బెటర్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
చెప్పు శ్రీని.. కొత్త కోడలి వీడియో వైరల్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రియురాలు కావ్యని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి తిరుమల వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న నూతన వధూవరులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకునే సరికి చిన్నపాటి ఆటపట్టించడం లాంటివి జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన తర్వాత దంపతులిద్దరూ తమ పేర్లు చెప్పే ఇంట్లోకి అడుగుపెడతారు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి కూడా అలానే చేశారు. ముందుగా కొత్త కోడలు కావ్య మాట్లాడుతూ.. నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను అని చెప్పింది. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ .. మా ఇంటికి మా ఆవిడని తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి' అని నవ్వేశాడు. కావ్య కూడా తన భర్తను 'చెప్పు శ్రీని' అడగడంతో పాటు కుటుంబ సభ్యులు పట్టుబట్టేసరికి.. నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా. నా పేరు అల్లుడు శీను అని అనేశారు.ఇకపోతే నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకు అయిన శ్రీనివాస్.. అల్లుడు శీను సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు గానీ చెప్పుకోదగ్గ హిట్స్ ఏం లేవు. గతేడాది 'కిష్కింధపురి'తో వస్తే ఇది యావరేజ్గా నిలిచింది. ప్రస్తుతం హైందవ, టైనస్ నాయుడు తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)After wedding at Tirumala, the newlyweds #BellamkondaSreenivas and his wife Kavya have gracefully arrived at their home in Hyderabad, marking the beginning of a beautiful new chapter in their lives.❤️🔥✨@BSaiSreenivas pic.twitter.com/PvUQUqRgA0— H A N U (@HanuNews) April 30, 2026 -
ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
రైటర్ నుంచి డైరెక్టర్ అయిన తర్వాత వరసగా నాలుగు సినిమాలతో అద్భుతమైన హిట్స్ అందుకున్న కొరటాల శివ.. 2022లో 'ఆచార్య'తో మర్చిపోలేని డిజాస్టర్ చూశారు. దీని నుంచి బయటకొచ్చి 'దేవర' చేస్తే.. అది బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. అయితే దీని సీక్వెల్ ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్లో దాదాపు రెండేళ్లు అవుతున్నా కొరటాల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇన్నాళ్లకు దీనికి ఎండ్ కార్డ్ పడింది. కొరటాల తర్వాత ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వచ్చినట్లే హీరో బాలకృష్ణతో కొరటాల శివ కలిసి పనిచేయబోతున్నారు. ఇది పొలిటికల్ కాన్సెప్ట్ మూవీ అని కొందరు అంటుంటే పక్కా యాక్షన్ కమర్షియల్ సినిమా అని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారని పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని కూడా పేర్కొన్నారు. చూస్తుంటే వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు.బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనితో సమాంతరంగా కొరటాల మూవీ కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. మరి బాలకృష్ణతో మూవీ చేసిన తర్వాతైనా కొరటాల 'దేవర 2' చేస్తారా లేదంటే దాన్ని అలా వదిలేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: అషురెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు) -
అషురెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
నటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి.. లండన్కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి.. హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. ఈమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈమె.. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది. సోమవారం తదుపరి విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే హైకోర్టు.. మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోట్ని అషు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)'గత కొన్నిరోజుల నుంచి నాపై మీడియా, సోషల్ మీడియా, కంటెంట్ క్రియేటర్స్ నిరాధార కథనాలు ప్రసారం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం నాపై వచ్చిన ఆరోపణల కేసు.. కోర్టు పరిధిలో ఉంది. నా పరువుకు భంగం కలిగించే కంటెంట్ ప్రసారం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇది గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, నెటిజన్లని కోరుతున్నా. కోర్టు ఆదేశాల మేరకు నాపై ఉన్న అభ్యంతరకర పోస్టులు తొలగించాలని, కొత్తవి పబ్లిష్ చేయకుండా సహకరించాలని కోరుతున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్. రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి' అని అషురెడ్డి చెప్పుకొచ్చింది.ఇకపోతే ఈ కేసు విషయం బయటకొచ్చిన తర్వాత తామేం తప్పు చేయలేదని అషురెడ్డి, ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అషురెడ్డి మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకొచ్చింది. ఇందులో మే నెల వరకు టైమ్ ఇస్తే కోటిన్నర తిరిగి ఇచ్చేస్తా, మిగిలిన డబ్బులు జీవితంలో స్థిరపడినప్పుడు ఇచ్చేస్తా అని ధర్మేంద్రతో మాట్లాడుతున్నట్లు ఉంది. మరోవైపు ధర్మేంద్రకు సంబంధించిన ఆరు నిమిషాల ఆడియో కూడా వైరల్ అవుతోంది. ఇందులో ఇతడు మాట్లాడుతూ అప్పు చేసి మరీ అషురెడ్డికి డబ్బులిచ్చానని.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్లే కేసు పెట్టాల్సి వచ్చిందని మాట్లాడినట్లు ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
తండ్రి కాబోతున్న నారా రోహిత్.. ఆ ఇద్దరు కూడా
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాల హడావుడితోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రెండు రోజుల క్రితమే తిరుమలలో పెళ్లి చేసుకున్నాడు. అంతకు రెండు నెలల ముందు హీరోయిన్ రష్మిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇదలా ఉండగానే టాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు శుభవార్తలు చెప్పేశారు.(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో సామజవరగమన, మృత్యుంజయ్, మ్యాడ్ స్క్వేర్ తదితర సినిమాల్లో నటించిన హీరోయిన్ రెబా మోనికా జాన్, తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. థాయ్లాండ్లోని బీచ్లో భర్తతో దిగిన ఫొటోలని షేర్ చేసింది. త్వరలో తాము ముగ్గురు కాబోతున్నామని చెప్పింది. దీంతో ఈమెకు విషెస్ తెలియజేస్తున్నారు.గతేడాది అక్టోబరులో పెళ్లి చేసుకున్న హీరో నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఇతడి భార్య, నటి శిరీష ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. రీసెంట్గా సీమంతం వేడుక జరగ్గా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారికంగా ఈ విషయాన్ని అయితే ఈ జంట బయటపెట్టలేదు. 'ప్రతినిధి 2' మూవీ చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డ రోహిత్-శిరీష.. పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు.'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా నటించిన కన్నడ ధనంజయ భార్య ధన్యత కూడా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని తాజాగానే ఈ జంట ప్రకటించారు. తమ ప్రపంచం పెరగనుందని చెబుతూ ఫొటోలని పంచుకున్నారు. కన్నడలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తెలుగులో 'పుష్ప' కాకుండా ఒకటి రెండు డబ్బింగ్ చిత్రాలతో వచ్చాడు గానీ వర్కౌట్ కాలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Dr. Dhanyatha Gauraklar (@dr.dhanyatha_gauraklar) View this post on Instagram A post shared by Harsha clicks 📸 (@kissik_celeb_) -
సత్యవాన్ సావిత్రి
ఓ సామాజిక అంశం కోసం కోర్టులో లాయర్గా వాదనలు వినిపించనున్నారట కీర్తీ సురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘సత్యవాన్ సావిత్రి’. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాలో మరో లీడ్ రోల్ చేశారు. ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మిస్కిన్ లాయర్స్గా నటించారని తెలిసింది. మరోవైపు తెలుగులో వెంకటేశ్–కల్యాణ్రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాలోను, విజయ్ దేవరకొండ ‘రౌడీ జానర్ధన’లోనూ కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
అమ్మోరే దిగినాది...
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన సినిమా ‘అనకాపల్లి’. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించి, ఓ కీలక పాత్రలో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకంపై కాండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘అమ్మోరు దిగినాది... అమ్మోరే దిగినాది..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.‘‘కుంకాల పోగుంది... పసుపంటి నేలుంది... కాగడాల చమురు కాలుతూ నవ్వింది.... ఘల్లన్న ఈ గజ్జలు ఎవరంటూ చూశాము... చింతానిప్పుల వెనక నల్ల రాతిరిలాగా... నల్ల రాతిరిలాగా... అమ్మోరు దిగినాది... అమ్మోరే దిగినాది..’అంటూ సాగే ఈ జాతర పాటకు గణేష్ సలాది సాహిత్యం అందించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు దేవ్ జండ్ స్వరకల్పనలో మంగ్లీ పాడారు. ‘‘యూత్ ఎలిమెంట్స్, లవ్, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
జ్ఞాపకాల్లో మెగా డాటర్ నిహారిక.. శారీలో సీతారామం బ్యూటీ..!
మూవీ ఈవెంట్లో మెరిసిన పాయల్ రాజ్పుత్..బిగ్బాస్ సావిత్రి ఇంట 21 రోజుల వేడుక..గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనిఖా సురేంద్రన్..శారీలో మృణాల్ ఠాకూర్ హోయలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రాశి ఖన్నా హోయలు.. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ నుంచి జెట్లీ బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుశ్ కర సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్లో ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ నుంచి బైకర్, రాకాస లాంటి సినిమాలు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్లు సందడి చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ బైకర్ (తెలుగు మూవీ) - మే 01 రాకాస (తెలుగు సినిమా) - మే 01 గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01స్వాప్డ్(యానిమేషన్ మూవీ)- మే 01మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01సన్ ఇన్ లా(హాలీవుడ్ మూవీ)- మే 01యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01పార్ట్టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03క్లీకా (హాలీవుడ్)- మే 03ఆహాసోదర(తెలుగు మూవీ)- మే 01అమెజాన్ ప్రైమ్ సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01 యూ ఆర్ డేటింగ్ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01జీ5ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01హెచ్బీవో మ్యాక్స్..ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01సన్ నెక్ట్స్మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01హులు..హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01 -
సమంత మా ఇంటి బంగారం.. పెద్దితో పోటీ పడనుందా?
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సామ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సమంత యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసిందని పలువురు కొనియాడారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం వాయిదా పడనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న కారణంగా మూవీని పోస్ట్పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ టైమ్లో మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్లే మా ఇంటి బంగారాన్ని జూన్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరోవైపు రామ్ చరణ్ పెద్దిని కూడా జూన్ 4న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ్ మూవీ టాక్సిక్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెద్దిని ముందే తీసుకు రానున్నారని టాక్. టాక్సిక్ వాయిదా పడడంతో టాలీవుడ్ చిత్రాలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద పెద్ది మూవీతో సామ్ చిత్రం పోటీ పడే అవకాశముంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. -
'ఐ బొమ్మ బ్యాన్ చేశారుగా..' ఫుల్ కామెడీగా జెట్లీ ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సత్య సరసన రియా సింఘా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో జెట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫ్లైట్లో వచ్చే సీన్స్ ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. -
తెలుగులో మలయాళ సెన్సేషన్ 'హంట్'
స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం హంట్. తెలుగులో ‘డాక్టర్ కీర్తి- ఎంబీబీఎస్ ఎంఎస్ ’అనే పేరుతో మే 8న విడుదల అవుతుంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపద్యం గా తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ - కోల్ కత్తా లో సంచలనం సృష్టించిన డాక్టర్ రేపు మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. అప్పుడు జరిగిన ఆ సంఘటన పట్ల ప్రపంచం అంతా నివ్వెరపోయింది. డాక్టర్ పాత్రలో నటి భావన నటించారు ఆమె ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇక కైలాష్ మీనన్ సంగీతం సినిమాకి హైలెట్ గా ఉంటుంది. పీవీఆర్ ద్వారా మే 8న మా చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.నటి కవిత మాట్లాడుతూ - ‘మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్ లో ఒక డ్యూటీ డాక్టర్ కు ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది. ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు. షాజీ కైలాస్ గారు ఎంతో ప్రతిభ గల దర్శకులు. ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్ గా ప్రతి ఎలిమెంట్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్ మారనుందా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.రిలీజ్ డేట్ మారే ఛాన్స్..?అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్కు పండగే. అనుకున్న టైమ్ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
పెళ్లి వేడుకలో సీనియర్ నటి శారద.. ఇప్పుడెలా ఉందో చూశారా?
సీనియర్ హీరోయిన్ శారద ఓ పెళ్లి వేడుకలో కనిపించారు. ఆమెను చూసిన మెగాస్టార్ దంపతులు దగ్గరికి వెళ్లి పలకరించారు. ప్రస్తుతం ఆమె ఓ పెళ్లి వేడుకకు హాజరు కాగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి అప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పట్లో శారద అంటే కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. మాస్ యాక్షన్ డైలాగ్స్తోనూ సినిమాల్లో మెప్పించారు. కాగా.. కన్యా శుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు. అయితే శారద మాత్రం ముందు రచ్చ గెలిచి.. ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటి అయినప్పిటికీ.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ రేంజ్కు ఎదిగారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు.. తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. తెలుగులో అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, స్టాలిన్, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించారు.సీనియర్ హీరోయిన్ శారద గారు...#Chiranjeevi Garu @KChiruTweets #Saradha #Actress pic.twitter.com/wzXLhpHaXs— Suresh Kondeti (@santoshamsuresh) April 29, 2026 -
‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తమిళ హీరో ధనుష్కి టాలీవుడ్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే నేరుగా తెలుగులో సార్, కుబేర లాంటి సినిమాలు చేసి అలరించాడు. అంతేకాదు ఆయన నటించిన తమిళ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఆ మధ్య ఇండ్లీ కొట్టుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు..ఇప్పుడు ‘కర’తో వచ్చాడు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్ చేశాయి. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు. లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తండ్రి-కొడుకుల ఎమోషన్తో కూడిన రాబిన్వుడ్ కథ ఇది. అంటే హీరో దొంగ..కానీ మంచి కోసం దొంగతనం చేస్తుంటాడు. కిక్ సినిమాలో రవితేజ కోటీశ్వర్లు, రాజకీయ నాయకుల దగ్గర డబ్బులను కొట్టేస్తే.. ఇక్కడ ధనుష్ బ్యాంకుల్లోని డబ్బును మాత్రమే కొట్టేస్తాడు. అది కూడా ఒక్క బ్యాంకులోని డబ్బులు మాత్రమే. దానికీ ఓ కారణం ఉంటుంది. అదేంటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు విఘ్నేష్ రాజా ఎంచుకున్న పాయింట్ రాబిన్వుడ్ కథలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న భావోద్వేగ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా చదువురాని రైతులను వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనేది బాగా చూపించారు. హీరో ఎమ్మెల్యే ఇంట్లో చివరి దొంగతనం చేసే యాక్షన్ సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. అతను పోలీసులకు దొరకడం.. డీఎస్పీ భరతన్ నుంచి తప్పించుకొని పారిపోవడం.. ఇదంతా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే కథ 6 నెలల ముందుకు జరిగిన తర్వాత కొంత నెమ్మదిగా సాగుతుంది. హీరోహీరోయిన్లు కలిసి హోటల్ పెట్టాలనుకోవడం.. ఈ క్రమంలో హీరో సొంతూరుకి తిరిగిరావడం.. తండ్రి-కొడుకుల బాండింగ్..ఇదంతా కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ చోరీ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ద్వితియార్థం ఆసక్తికరంగా సాగుతుంది. వరుస బ్యాంకు రాబరీలు.. డీఎస్పీ ఇన్వెస్టిగేషన్..మరోవైపు బ్యాంకు మేనేజర్ ఇచ్చే ట్విస్టు..ఇవన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. హీరో దొంగతనం కోసం బ్యాంకుకు వెళ్లిన ప్రతిసారి..ఎలా బయటపడతాడా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా బలమైన స్క్రీన్ప్లేతో సెకండాఫ్ కథను రాసుకున్నారు. రైతు కష్టాలతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్తో కథను ముగించిన తీరు బాగుంది. ఎవరెలా చేశారంటే..ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. తనదైన సహజ నటనతో కరస్వామి పాత్రకు ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనుష్ వన్ మ్యాన్ షో ఇది. మమిత బైజు తెరపై కనిపించేంది కాసేపే అయినా.. చక్కగా నటించింది. హీరో తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. డీఎస్పీ భరతన్గా సూరజ్ వెంజర్మూడు, బ్యాంకు మేనేజర్గా జయరాంతో పాటు , కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలతో పాటు తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. తెరపై తెలుగు సినిమానే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇషారి కె గణేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ప్రముఖ నటి కూతురు.. ఫస్ట్ సినిమా పోస్టర్ విడుదల
ప్రముఖ నటి వనితా విజయ్కుమార్ కూతురు జోవిక టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. తాను నటిస్తున్న కొత్త సినిమా అగధ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. స్టార్ కిడ్గా గుర్తింపు ఉన్న జోవిక తమిళ్ బిగ్ బాస్ సీజన్- 7లో కనిపించిన విషయం తెలిసిందే.. తమిళ్లో గతేడాది మిసెస్ & మిస్టర్ మూవీతో అలరించిన జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రానున్న చిత్రం అగధ.. మిస్టికల్ డివైన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్ని కొద్దిరోజుల క్రితమే రివీల్ చేశారు.‘‘డర్టీ హరి’ చిత్రంతో గుర్తింపు తెచ్చకున్న శ్రవణ్ రెడ్డికి ఎం.ఎస్. రాజు. మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్... దాదాపు 45 నిమిషాల వీఎఫ్ఎక్స్తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. View this post on Instagram A post shared by Sri Adi Varaha Productions (@sriadivarahaproductions) -
కందుల సులోచనగా అనుపమ.. కొత్త మూవీ పోస్టర్ విడుదల
శర్వానంద్ భోగి సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. 1960 నేపథ్యంలో సాగే ఈ కథకు అనుగుణంగా ఆమె లుక్ ఉంది. ఇప్పటికే శర్వానంద్ లుక్ను కూడా మేకర్స్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 'నారీ నారీ నడుమ మురారి', బైకర్ చిత్రాలతో జోరు మీదు ఉన్న శర్వా.. హ్యాట్రిక్పై కన్నేశాడు. భోగి సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలని ఆయన ఉన్నారు. ఈ మూవీని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు.భోగి మూవీలో కందుల సులోచన రాణి పాత్రలో అనుపమ కనిపించనుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్ అనుపమ(Anupama Parameswaran) తన సాధారణ ఇమేజ్కు భిన్నంగా ఉంది. బోల్డ్, డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించడంతో ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. పోస్టర్తో పాటు చిత్ర యూనిట్ ఇలా ఒక క్యాప్షన్ కూడా చేర్చింది. "ప్రకృతి బిడ్డ... గంగా నిలయం... కందుల గర్వం... భోగికి ప్రాణం" అని అనుపమ గురించి వర్ణించారు.ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ స్టోరీని పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. ఇందులో డింపుల్ హయాతి, రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'భోగి' చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
చిరుత హీరోయిన్.. డబ్బు కోసం ఇదేం పని..?
బాలీవుడ్ నటి నేహా శర్మ సోషల్మీడియాలో విమర్శలు ఎదుర్కొంటుంది. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత కుర్రాడు మూవీ మాత్రమే తెలుగులో చేసింది. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో బిజీ అయిపోయింది. అయితే, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేకమైన కంటెంట్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చింది. దీంతో యూత్ను తప్పుదోవ పట్టిస్తోందని ఆమెపై విమర్శలు వచ్చాయి.నేహా శర్మను సుమారు 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు. కానీ, ఆమె ప్రత్యేకంగా షేర్ చేసే కంటెంట్ను పొందేందుకు మాత్రం 10వేల వరకు వినియోగుదారులు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. అందుకోసం నెలకు రూ. 299 చెల్లిస్తున్నారు. అంటే నెలకు రూ. 30 లక్షల వరకు ఆమె సంపాధిస్తుంది. అయితే, ఆమె అభిమానుల్లో కొందరు విమర్శించగా.. మరికొందరు సమర్థించారు.నేహా శర్మ ఒక ప్రతిష్టాత్మక కుటుంబానికి చెందినది కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె తండ్రి అజిత్ శర్మ రాజకీయ నాయకుడు కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఆర్థికంగా బాగానే ఉన్న నేహా.. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను ఎందుకు క్రియేట్ చేసిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.నెహా శర్మపై ఒక యూజర్ విరుచుకుపడింది. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అంటూ.. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదని కోరింది. బహుశా ఇలాంటి వారిని ప్రోత్సహించే ప్రదేశం భారతదేశం మాత్రమే కావచ్చని అభిప్రాయ పడింది. మరొకరు ఇలా రాశారు, "ఇది ఆమెకు సులభంగా డబ్బు సంపాదించే మార్గం. పైగా, దీనికి డిమాండ్ కూడా ఉంది. ఇది విచారకరం, కానీ వాస్తవం ఇదే." అంటూ షేర్ చేశారు. View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటా: త్రిష
ఇటీవల సెంటర్ ఆఫ్ ది మీడియాగా మారిన నటి త్రిష.. చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ హాట్టాపిక్గా మారారు. దీంతో ఆమె సోషల్మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతుంది. రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష.. కోలీవుడ్లోని అతి కొద్దిమంది మోస్టెస్ట్ బ్యాచిలర్ నటీమణుల్లో ఒకరు. ఈ విషయం కూడా ఈమెను వార్తల్లో నిలబెట్టడానికి ఒక కారణం కావచ్చు. నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఫ్రెండ్ కావడంతో ఈమె రాజకీయాల్లోనూ ఎక్కువగా నానుతున్నారు. దీంతో త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారని, సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే నటనకు స్వస్తి చెప్పడం లేదని చెప్పే విధంగా ఇటీవలే ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈమె మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసే ఫొటోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. త్రిష రాత్రి వేళ మేలుకుని ఉంటారనే ప్రచారం ఉంది. ఇటీవల త్రిష తన ఇన్స్ట్రాగామ్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో గంట నిద్ర కోల్పోతే, దాని నుంచి రికవరీ అవడానికి 4 రోజులు పడుతుంది. ఈ ప్రకారం లెక్కలు కడితే 2062 సంవత్సరంలోనే నేను ప్రశాంతంగా జీవిస్తాననే భావన కలుగుతోంది అని పేర్కొన్నారు. దీంతో త్రిష మాటల్లో అర్థం ఏమిటి ? అనే చర్చ జరుగుతోంది. త్రిషకు సరిగా నిద్ర పట్టడం లేదా, ఆమె మానసిక రుగ్మతకు లోనౌతున్నారా..? వంటి ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తున్నారు. -
స్టార్ హీరోపై జెడి చక్రవర్తి సంచలన ఆరోపణలు.. ఇండస్ట్రీని కుదిపేసే వార్త
టాలీవుడ్ నటుడు జెడి చక్రవర్తి సుమారు 35ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో ఉన్నారు. తన ప్రయాణం శివ సినిమాతో మొదలైన విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ స్టేటస్ను ఆయన అందుకున్నారు. హీరోగా ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే, తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమలోనే అతిపెద్ద స్టార్ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, పేరు రివీల్ చేయకుండానే బిగ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే కామెంట్స్ను షేర్ చేశారు.మనం అభిమానించే వ్యక్తుల గురించి అసలు విషయాలు తెలియకుండానే గౌరవం పెంచుకుంటే అది పొరపాటే అంటూ తనకు ఎదురైన ఒక సంఘటనను జె. డి. చక్రవర్తి ఇలా పంచుకున్నారు.'ఒక నటుడు అంటే నాకు చాలా రెస్పెక్ట్. కానీ, అతని పేరు మాత్రం చెప్పను. ఆ హీరో అంటే నాకు మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇండియాకు కూడా ఆయన అంటే గౌరవం. అలాగే నిజ జీవితంలో ఉంటారని అనుకున్నాను. కానీ, సినిమా సెట్స్కు ఆయన ఆలస్యంగా వస్తారు సార్ అని నాతో కొందరు చెప్పారు. ఎందుకంటే..? రాత్రి తాగింది దిగలేదన్నారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిజమా..! ఆయన తాగుతారా..? అని ప్రశ్నించాను. ఆయనకు అప్పటికే వయసు అయిపోయింది. హోటల్లో కూడా బస చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం తన గర్ల్ఫ్రెండ్తో ఉంటున్నారని చెప్పడంతో ఆయనకు పెళ్లైంది కదా అన్నాను. లేదు గర్ల్ఫ్రెండ్తోనే ఉంటున్నారని చెప్పారు. ఆ రోజు వరకు ఆయనకున్న ఇమేజ్ను బట్టి నేను కూడా మహానుబావుడు అనుకున్నాను.' అని రియాలిటీ మరోలా ఉంటుంది అనేలా జెడి చక్రవర్తి పేర్కొన్నారు. అయితే, ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం ఆయన రివీల్ చెయలేదు. Huge controversy!!!! pic.twitter.com/NZCOl6wIzn— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 29, 2026 -
తిరుమలలో వైభవంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో బుధవారం రాత్రి వారి వివాహం జరిగింది. తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.మే 1న హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. హైదరాబాద్కు చెందిన కావ్య రెడ్డి తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది ‘కిష్కింధపురి’ చిత్రంతో హిట్ కొట్టాడు. . ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ అనే ఆసక్తికరమైన రెండు ప్రాజెక్ట్లలో పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Beautiful Tirupathi 2.0 (@beautifultirupathi_2.0) -
ట్రైలర్ కొత్తగా అనిపించింది
‘‘ఫస్ట్ టైమ్’ ట్రైలర్ కొత్తగా అనిపించింది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ షాకింగ్గా ఉన్నాయి. ప్రతిభని ప్రోత్సహించడంలో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు విజయం అందించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలో ‘ఫస్ట్ టైమ్’ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందించా లని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తెలిపారు. హేమంత్ ఇప్పలపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైమ్’. సౌరభ్ ధింగ్ర హీరోగా, అనిక్క విక్రమన్ హీరోయిన్గా నటించారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్లో నటించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాయల్ రాజ్పుత్ ట్రైలర్ని విడుదల చేశారు. హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ– ‘‘మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాం. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలి’’ అని కోరారు. ‘‘నాకోసం ఈ కార్యక్రమానికి వచ్చిన పాయల్గారికి ధన్యవాదాలు’’ అన్నారు సౌరభ్ ధింగ్ర. -
కామన్ మేన్కి కనెక్ట్ అవుతుంది
‘‘ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యలు, భావోద్వేగాలతో ‘కర’ సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులందరికీ ఈ మూవీ కనెక్ట్ అవుతుంది’’ అని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సీహెచ్ సతీష్ కుమార్ తెలిపారు. ధనుష్, మమితా బైజు జంటగా నటించిన తమిళ చిత్రం ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించారు. ఈ సినిమా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ద్వారా తెలుగులో నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సీహెచ్ సతీష్ కుమార్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అర్జున్ రెడ్డి, కబాలి, సింగం 3, సలార్, కాంతారా చాప్టర్ 1’ వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ధనుష్గారి ‘ధర్మయోగి’ సినిమాని తెలుగులో రిలీజ్ చేశాను. ‘కర’ మూవీ తెలుగు వెర్షన్ చూడలేదు. అయినప్పటికీ ధనుష్, విఘ్నేశ్గార్లపై నమ్మకంతో రిలీజ్ చేస్తున్నాను. ఈ మూవీ కోసం నా ఫ్రెండ్ రాజేశ్కుమార్ బొబ్బర సపోర్ట్ తీసుకున్నాను. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే తెలుగులో 80 శాతం బిజినెస్ పూర్తి చేశాం. ఈ మూవీని నైజాంలో ‘దిల్’ రాజుగారు, ఉత్తరాంధ్రలో నేను పంపిణీ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
కొత్త అఖిల్ని చూడబోతున్నారు
‘‘లెనిన్’ సినిమాలో కొత్త అఖిల్ని చూడబోతున్నారు’’ అని పేర్కొన్నారు అక్కినేని నాగార్జున. ఆయన తనయుడు అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించి, ఆ తర్వాత జూన్ 26కి వాయిదా వేశారు మేకర్స్. అయితే రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్ 25కి విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ‘పెద్ది, లెనిన్’ సినిమాల రిలీజ్కి కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే అలాంటిదేం లేదని, జూన్ 26నే విడుదలవుతుందనీ పుకార్లన్నింటికీ తన పోస్ట్తో ఫుల్స్టాప్ పెట్టారు నాగార్జున. ‘‘నిన్న రాత్రి (మంగళవారం) మా ‘లెనిన్’ ఫస్ట్ కట్ చూశాను. నమ్మకంగా, గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమాలో కొత్త అఖిల్ని చూడబోతున్నారు. 2026 జూన్ 26వ తేదీని గుర్తుపెట్టుకోండి. థియేటర్లలో కలుద్దాం’’ అని బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాగార్జున. -
సముద్ర తీరాన హన్సిక చిల్.. పెళ్లి కూతురిలా మెరిసిపోతున్న శ్రీలీల..!
సముద్ర తీరాన చిల్ అవుతోన్న హన్సిక..బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గ్లామర్ పోజులు..సమ్మర్లో మ్యాంగో తింటూ ఎంజాయ్ చేస్తోన్న సమీరా..బ్లూ డ్రెస్లో బిగ్బాస్ దివి అందాలు..పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ముద్దుకు ముందు ‘మీరు ఏమిట్లు’.. దర్శకుడు క్లారిటీ
‘బేబీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన మరో చిత్రం ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ . ‘#90s: ఏ మిడిల్క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ‘#90s’లోని ఆదిత్య పాత్ర పెరిగి పెద్దయ్యాక..ఇంట్లో వాళ్ల ఒత్తిడితో యూకేకి వెళ్లి, అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏం జరిగిందన్న పాయింట్తో ఈ సినిమా రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. మంచి రొమాటిక్ సీన్లతో టీజర్ని కట్ చేశారు. అయితే ఇందులో కులం, మతానికి సంబంధించిన డైలాగులు ఉండడం గమనార్హం. ముద్దు పెట్టుకునే క్రమంలో ‘మీరు ఏమిట్లు’ అని హీరోని హీరోయిన్ ప్రశ్నించడం.. మరోచోట హీరో తన పేరుని చెబుతూ..‘ఆదిత్య..హిందువు’ అని చెప్పడం టీజర్లో చూపించారు. దీంతో సినిమా మొత్తం కులం, మతం చుట్టూనే తిరుగుతుందేమో అనే సందేహాన్ని ఓ విలేకరి దర్శకుడి ముందు వెలిబుచ్చగా, ఆయన క్లారిటీ ఇచ్చాడు.ఎపిక్ మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా ‘మీరు ఏమిట్లు..’అనే డైలాగు పెట్టారు. సినిమాలో కులం, మతం ప్రస్తావన ఉంటుందా?’అని దర్శకుడిని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి దర్శకుడు ఆదిత్య హాసన్ సమాధానం చెబుతూ..‘సినిమాలో కామెడీగానే ఆ డైలాగులు పెట్టాం. ఎక్కడా కుల మతాలను కించపరిచే సన్నివేశాలు ఉండవు. క్యాస్ట్పై వేసే జోకులు కూడా క్లీన్గానే ఉంటాయి. కాంట్రవర్సీ ఏం ఉండదు. ఒక కులాన్ని కానీ, మతాన్ని కానీ కించపరిచే సన్నివేశాలేవి మా సినిమాలో ఉండవు’ అని చెప్పాడు. -
అల్లు అర్జున్ రాకా.. నార్త్లోనూ కేక..!
పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన మార్కెట్ కేవలం దక్షిణాదిలోనే కాదు..నార్త్లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. పుష్ప-2 రిలీజ్ టైమ్లో బీహార్లో గ్రాండ్గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. పుష్ప 2 నార్త్లో కేవలం హిందీలోనే రూ. 812 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో బన్నీకి ఉత్తారాదిలోనూ భారీస్థాయిలో మార్కెట్ ఏర్పడింది.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెరకెక్కుతోన్న రాకా మూవీపై నార్త్ ఆడియన్స్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం బిహార్లో తీవ్రమైన పోటీ ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. ఆ రాష్ట్రంలో ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటికే 'రాకా' చిత్ర నిర్మాతలను సంప్రదించారని తెలిపింది.ఈ మూవీ రైట్స్ కోసం భారీ ధర చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారట. ఇదంతా చూస్తుంటే బిహార్లో బన్నీకి ఎంత క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ మూవీ బీహార్తో పాటు ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు రాకా సినిమాకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది.కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
దురంధర్-2 క్లైమాక్స్.. ఏకంగా 500 లీటర్ల పెట్రోల్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. మార్చి 19న వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ చిత్రాలు ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ మాస్ ఆడియన్స్కు గూస్బంప్స్ తెప్పించాయి. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో క్లైమాక్స్ సీన్స్ రణరంగాన్ని తలపించాయి. అయితే భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదని స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ విశాల్ త్యాగి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సన్నివేశాల కోసం దాదాపు 500 లీటర్ల పెట్రోల్ వినియోగించామని పేర్కొన్నారు.ఫైర్తో కూడిన సన్నివేశాల కోసం గ్రాఫిక్స్ వద్దని ఆదిత్య ధర్ తమకు ముందుగానే చెప్పాడని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సీన్స్ అన్నీ రియల్గా చేశామన్నారు. చివర్లో వచ్చే బ్లాస్ట్ను రూపొందించడం చాలా కష్టంగా చేశామని వెల్లడించారు. రణ్వీర్ భద్రత విషయంలో ఆందోళన పడ్డామని.. 500 లీటర్ల పెట్రోల్తో షూటింగ్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండని అన్నారు.విశాల్ త్యాగి మాట్లాడతూ..' క్లైమాక్స్ సీన్కు పక్కా ప్రణాళికతో ఉన్నాం. రణ్వీర్కు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్నాం. మొదట 250 లీటర్ల ఇంధనమే వాడాలని ప్రొడక్షన్ టీమ్ చెప్పింది. కానీ 500 లీటర్లు ఉంటేనే అవుట్పుట్ బాగా వస్తుందని చెప్పాం. దీంతోపాటు 25 కేజీల పేలుడు పదార్థాలు వాడాం. షూటింగ్ పూర్తయ్యాక.. అద్భుతమంటూ నన్ను, టీమ్ని రణ్వీర్ అభినందించారు' అని అన్నారు. -
బేబీ కాంబో రిపీట్.. ఎపిక్ టీజర్ చూశారా?
బేబీ మూవీ జోడీ మరోసారి బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతోన్న మూవీ ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకు 90s ఏ మిడిల్క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ డేస్, కెరీర్ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండనున్నట్లు టీజర్లో అర్థమవుతోంది. ఈ చిత్రంలో శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నారు. -
సూపర్ హిట్ సాంగ్ రీమేక్లో తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నాకు ఐటమ్ సాంగ్స్ కొత్తేమి కాదు. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె ప్రత్యేక పాటలలో మెరిసింది. ఇప్పుడు కూడా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరో పక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది.‘స్త్రీ-2’ చిత్రంలో తమన్నా చేసిన ‘ఆజ్ కి రాత్’ ప్రత్యేక గీతం ఇప్పటికీ యూట్యూబ్లో దూసుకెళ్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఐటమ్ సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అది కూడా మాములు ఐటం సాంగ్ కాదు బాలీవుడ్లో ఒకప్పుడు సంచలనం సృష్టిస్తున్న చోలీ కేఛే క్యా హై’ రీమేక్ సాంగ్కి తమన్నా స్టెప్పులేయబోతుంది.సంజయ్ దత్ కల్ట్ క్లాసిక్ ఖల్ నాయక్ సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో ఇది తెరకెక్కనుంది. ‘ఖల్ నాయక్’లోని ‘చోళీ కే పీచే క్యా హై’ పాట అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. మాధురీ దీక్షిత్ వేసిన స్టెప్పులకు యువత ఫిదా అయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాటలోని స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో.. లిరిక్స్ కూడా అంతే వివాదానికి దారి తీశాయి. డబుల్ మీనింగ్ లతో కూడిన లిరిక్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అయినప్పటికీ ఈ పాట సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ పలు పార్టీలలో ఈ పాట వినపడుతూనే ఉంటుంది.అలాంటి సూపర్ హిట్ ఐటం సాంగ్ని ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ కోసం రీమేక్ చేయబోతున్నారట. ఆ పాటకు తమన్నా అయితేనే న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సాంగ్ రీమిక్స్ పై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఫైనల్ కాస్టింగ్ ఇంకా లాక్ కాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ, తమన్నా పేరు బలంగా వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. -
నటి సురేఖవాణి బర్త్ డే.. కూతురు సుప్రీత స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ నటి సురేఖవాణి బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఆమె కూతురు సుప్రీత మదర్ బర్త్ డే వేడుకలు నిర్వహించింది. 'హ్యాపీ బర్త్ డే మమ్మీ.. నాకు అన్నీ నువ్వే.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా'.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సురేఖవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
మెగాస్టార్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా ఇదే..!
ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీతో మరోసారి జతకట్టారు. వీరిద్దిరి కాంబినేషన్లో వస్తోన్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీపై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి నెగెటివ్ రోల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా సమాచారం. అయితే మేకర్స్ ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల సంగతి పక్కనపెడితే.. నెట్టింట ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్బస్టర్ మూవీ భాషా చిరంజీవి మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ చిరంజీవిని కలిసి కథను వివరించారట. చిరంజీవికి.. నిర్మాత అల్లు అరవింద్ కు 'బాషా' కథ విపరీతంగా నచ్చిందట. వెంటనే ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు మొదలుపెట్టారట.కానీ అప్పట్లోనే బాషా నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం దాదాపు రూ.40 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట. అయితే అల్లు అరవింద్ రూ.25 లక్షలకు ఇవ్వాలని నిర్మాతలను కోరారని సమాచారం. దీంతో 15 లక్షల తేడా రావడంతో ఈ డీల్ కుదరలేదట. అలా మెగాస్టార్ ఈ బ్లాక్బస్టర్ మూవీని మిస్సైనట్లు తెలుస్తోంది. కాగా.. భాషా తమిళంలో విడుదలై ఊహించని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే ఉత్తమమని భావించి 1995 ఏప్రిల్లో తెలుగులోనూ విడుదల చేశారు. -
'పిల్లల కోసం పెళ్లి అక్కర్లేదు'.. నిత్యామీనన్ బాటలో కట్టప్ప కూతురు
ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలను కనాలంటే పెళ్లి అవసరం లేదని అన్నారు. అది మన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తాజాగా నిత్యామీనన్ బాటలో స్టార్ నటుడి కుమార్తె నిలిచింది. ఇప్పటికే నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. తాజాగా నటుడు సత్యరాజ్ కూతురు దివ్య చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో హాట్టాపిక్గా మారాయి.వివాహ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని దివ్య తెలిపింది. వ్యక్తిగతంగా తాను పెళ్లి బంధాన్ని విశ్వసించనని పేర్కొంది. కేవలం మంగళసూత్రం కట్టడం వల్లనో లేదంటే ఉంగరాలు మార్చుకోవడం వల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను భావించడం లేదని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారం, ప్రేమతో కలిసి జీవించవచ్చని దివ్య స్పష్టం చేసింది. కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర, ధృవీకరణ పత్రం అవసరం లేదంటూ దివ్య సత్యరాజ్ కుండ బద్దలు కొట్టింది. -
'తిరుమలలో పెళ్లి జరగడం నా అదృష్టం..' బెల్లంకొండ
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన పెళ్లి వేడుక జరగనుంది. కావ్య రెడ్డి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరిద్దరు పెళ్లి ఈ రోజు రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ ఆసక్తకర కామెంట్స్ చేశారు. తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అదృష్టం, ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మా అమ్మ, నాన్నలు నాకు ఆ స్వామి పేరునే పెట్టారని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకునే అదృష్టం దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందన్నారు. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగానని తెలిపారు. నా ఫియాన్నీ వచ్చాక శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు. నా లైఫ్లో స్వామివారి పాదాల చెంత పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. -
‘స్పిరిట్’ కోసం గొర్రెలు అమ్ముకున్నాం.. చాలా కష్టపడ్డాం
‘‘ఈ వేదికపైకి రావడానికి చాలా కష్టపడ్డాం. మాకున్న గొర్రెలన్నిటినీ అమ్ముకొని మా కుమారుడు రవీంద్రనాథ్ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా తీశాం. అందరూ మమ్మల్ని ఎగతాళి చేసినా పట్టించుకోలేదు. అయితే మా కష్టం చూసిన వారు మాత్రం సపోర్ట్ చేశారు. ‘స్పిరిట్’ మా ఒక్కరిది కాదు... మనందరి సినిమా. చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని నిర్మాతలు చిన్నబోయిన నర్సమ్మ, వెంకటేశ్వర్లు తెలిపారు. రవిబాబు, సత్య ప్రకాశ్, ‘చిత్రం’ శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలీ ముఖ్య తారలుగా సీహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పిరిట్’. రైతులు చిన్నబోయిన నర్సమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమా మే 8న విడుదల కానుంది. ఎస్ఎస్ వెంకటేశ్, సంతోష్ కావాలా సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ వేడుకలో దర్శకుడు వి. సముద్ర, కె. మోహన్, నిర్మాతలు అశోక్ కుమార్, ముత్యాల రాందాస్ ముఖ్య అతిథులుగా హాజరై, ‘స్పిరిట్’ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. సీహెచ్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘అందరికీ తల్లిదండ్రులు జన్మనిస్తే.. నాకు మాత్రం జన్మతో పాటు సినీ జీవితాన్ని కూడా ఇచ్చారు నా తల్లిదండ్రులు. ‘స్పిరిట్’ చాలా బాగా వచ్చింది. అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్కమల్ పి. భరత్. -
గుండెపోటుతో తెలుగు దర్శకుడు కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం. దర్శకుడు రఘురామ్ చనిపోయారు. మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సహచరులు, పలువురు ఈయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.రచయిత, జర్నలిస్టు అయిన రఘురామ్.. ఈటీవీ, వీ6, ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థల్లో స్పెషల్ కరస్పాండెంట్గా పనిచేశారు. జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లాంటివి చేసినప్పటికీ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదట్లో సానా యాదిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా పనిచేశారు. 2004లో వచ్చిన 'వరం' మూవీతో దర్శకుడిగా మారారు. ఇది పెద్దగా మెప్పించలేకపోయింది.గత కొన్నాళ్లుగా రైటర్, ఘోస్ట్ రైటర్గా పలు సినిమాలు చేస్తున్న ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన స్వస్థలం జగిత్యాల కాగా ప్రస్తుతం హైదరాబాద్లోని మధురా నగర్లో ఉంటున్నారు. భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
స్టార్ హీరో కుమారుడితో పూజా హెగ్డే డేటింగ్!
ప్రముఖ నటి పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారనే కథనాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా (దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు)తో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు కొంత కాలంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ ఫిల్మ్ఫేర్ సంస్థ సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారనే వార్త నిజమేనంటూ తమ వద్ద సరైన ఆధారం కూడా ఉందని ఆ సంస్థ పేర్కొంది.పూజా హెగ్డే, రోహన్ మెహ్రా తరుచుగా పలుమార్లు కలిసి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఇంతకాలం అది కేవలం రూమర్గానే ఉండేది. కానీ, ఫిల్మ్ఫేర్ లాంటి సంస్థ ఈ వార్తను ప్రచురించడంతో దాదాపు నిజమే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. అయితే , ఈ అంశం గురించి వారిద్దరూ ఇంకా స్పందించలేదు. రోహన్ మెహ్రా (Rohan Mehra) 2018లో 'బజార్' (Baazaar) చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 420 IPC, అద్భుత్ వంటి చిత్రాలతో పాటు, కాళ (Kaala) వంటి వెబ్ సిరీస్లలో నటించి గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Filmfare (@filmfare) -
అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర
నటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఓ ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఈమెపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అషు తొలుత స్పందించింది. ఈమె తండ్రి వెంకటకృష్టారెడ్డి అయితే ఇవన్నీ ఆరోపణలు అని కొట్టిపారేశారు. అబ్బాయికి ఆల్రెడీ పెళ్లయి, విడాకులు తీసుకున్నాడని.. ధర్మేంద్ర కుటుంబంపై కాల్ మనీ కేసు కూడా ఉందని సంచలన నిజాలు బయటపెట్టారు.(ఇదీ చదవండి: కొత్త అఖిల్ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ)వీళ్లిద్దరిలో ఎవరు రైట్? ఎవరు రాంగ్? అని అంతా అనుకుంటున్న టైంలో అషురెడ్డి పేరిట ఓ ఆడియో బయటకొచ్చింది. తీసుకున్న డబ్బులో కోటిన్నర రూపాయలని మే నెలలో తిరిగిచ్చేస్తానని.. మిగతా డబ్బు మాత్రం తాను జీవితంలో స్థిరపడినప్పుడు, తన దగ్గరున్నప్పుడు ఇస్తానని సదరు ఆడియోలో అషురెడ్డి చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే వేణుస్వామి, ప్రవీణ అక్క సమక్షంలో కూర్చుని మాట్లాడుకుందామని, ఇది కాదంటే తిరిగే కేసు పెడతానని అషు అన్నట్లు అందులో వినిపించింది.ఈ కేసులో భాగంగానే అషురెడ్డి తెలంగాణ హైకోర్టుని కూడా ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు అషురెడ్డి బాధితుడు ధర్మేంద్రకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ధర్మేంద్ర మాట్లాడుతూ.. 2 నెలల క్రితమే ఆమెపై ఫిర్యాదు చేశాం. అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే ఈ నెల 20న పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.గత ఏడాది కాలంగా డబ్బులు తిరిగివ్వడం గురించి చర్చలు నడుసున్నాయి. మీడియేటర్స్ ఈ మేటర్ సెటిల్ చేద్దామనుకున్నారు గానీ ఈ అమ్మాయి(అషు) అస్సలు వినట్లేదు. దీంతో వాళ్లు డ్రాప్ అయిపోయారు. మేం డబ్బులు అడగలేదు. గోల్డ్ కావాలని అడిగాం. నా ఇల్లు నాకు ఇచ్చేయమని అడిగాను. చాలా మీటింగ్స్, చాలా డిస్కషన్స్ తర్వాతే కేసు పెట్టాల్సి వచ్చింది. నాకు వేరే ఆప్షన్ వదల్లేదు. మొదట నుంచి ఆమెపై కేసు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ నాపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తోంది. పరిస్థితి ఇక్కడితో ఆగదని భావించి మా నాన్న కేసు పెట్టాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: హీరో విజయ్ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్)పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత రెండేళ్లలో బంగారం, ఫ్లాట్ నాతో కొనిపించింది. దీనికోసం నేను అప్పు చేయడంతో పాటు తెలిసిన వాళ్ల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసరికి నేను ఇచ్చిన డబ్బులు, ఆస్తులు తిరిగి ఇవ్వాలని అడిగితే మొదట ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించింది. నేను ఇచ్చిన ప్రతి రూపాయికీ ఆధారాలు ఉన్నాయి. ఆ అన్ని డాక్యుమెంట్స్ పోలీసులకు అందజేశాం. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన తరువాతే కేసు నమోదు చేశారు. చట్టపరంగా ఆమెపై పోరాటం కొనసాగిస్తాను.నాకు పెళ్లయి విడాకులు తీసుకున్న సంగతి అషురెడ్డికి ముందే తెలుసు. అయినా సరే ఆమె తండ్రి వింత వింత స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. డబ్బులిచ్చిన మాట వాస్తవమే అని అంటున్నారు. నేనేదో విడాకుల విషయం దాచి పెళ్లి ప్రపోజల్ తెచ్చినట్లు నా గురించి మాట్లాడుతున్నారు. నా దగ్గర వాట్సాప్ రికార్డులు అన్నీ ఉన్నాయని ధర్మేంద్ర తన వెర్షన్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'టాక్సిక్'.. అనుకున్నదే జరిగింది) -
'శ్రీనివాస మంగాపురం' ఫస్ట్ సాంగ్ విడుదల.. జీవీ ప్రకాశ్ అదుర్స్
ఘట్టమనేని జయకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ నుంచి మొదటి సాంగ్ తాజాగా విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్బాబు తనయుడే జయకృష్ణ.. ఇందులో ఆయనకు జోడీగా నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తుంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా 'అల్లెల్లే..' అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ సాంగ్ను జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తూనే ఆలపించారు. కొరియోగ్రఫీ ఆట సందీప్ అందించారు. -
80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసిన రష్మికా మందన్న
హీరోయిన్ రష్మికా మందన్న మైసా సినిమా కోసం భారీ సాహసమే చేస్తుంది. ఈ చిత్రంలో గోండు గిరిజన యువతిగా నటిస్తున్న ఆమె భారీ స్టంట్స్కు సంబంధించిన మెళకువలు నేర్చుకుంది. దీంతో ఈ మూవీ ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలబడిపోతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. రష్మిక కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద సాహసమే చేసిందని దర్శకుడు రవీంద్ర పుల్లె మాటాల్లో తెలుస్తోంది.. మైసాలో ఒక సీన్ కోసం రష్మిక మందన చేసిన సాహసం గురించి ఆయన రివీల్ చేశారు.రష్మికా మందన్న నటిస్తున్న మైసా తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభమైన విషయం తెలసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన సీన్ కోసం ఆమె చాలా రిష్క్ చేసిందని దర్శకుడు చెప్పారు. సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ లేకుండా రష్మిక జంప్ చేసిందని ఆయన వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి హీరోలు 10 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయాలంటే డూప్ కావాలని కోరడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది రష్మిక ఇంతపెద్ద రిష్క్ చేయడంతో అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.కేరళలో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా సారథ్యంలో సుమారు 20రోజుల పాటు అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలుస్తాయని చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది. మైసాలో తన పాత్ర కోసం రష్మిక మందన్న చాలా కఠినంగా శిక్షణ తీసుకున్నారు. బ్యాంకాక్లో కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ దాదాపు ఎనిమిది గంటలకు పైగానే ఫైటింగ్ మరియు స్టంట్స్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ఆమె అంకితభావం చూస్తే, తెరపై పూర్తిగా కొత్త మరియు ఉగ్రమైన ఇమేజ్ను ప్రదర్శించాలనే ఆమె లక్ష్యం స్పష్టమవుతుంది. -
కొత్త అఖిల్ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ
హీరోగా 100వ సినిమా చేస్తున్న నాగార్జున.. మరోవైపు కొడుకు అఖిల్ 'లెనిన్' చిత్ర బాధ్యతలని కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు సినిమాలు చేసినప్పటికీ అఖిల్కి సక్సెస్ దక్కలేదు. దీంతో ఈసారి అంతా పక్కాగా ఉండేలా చూసుకుని 'లెనిన్' తీశారు. కానీ షూటింగ్ ఆలస్యం, 'పెద్ది' కారణంగా ఇది వాయిదా పడింది. చరణ్ సినిమా మరోసారి వాయిదా పడి జూన్ 25కి షిఫ్ట్ కావడంతో అఖిల్ తప్పుకొంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడా విషయంపైనా క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)అఖిల్, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' మూవీని మే 01న థియేటర్లలోకి తీసుకొస్తామని తొలుత ప్రకటించారు. కానీ షూటింగ్, ఇతరత్రా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. జూన్ 26న రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ రామ్ చరణ్ 'పెద్ది' కూడా జూన్ 25న వస్తుందనేసరికి అఖిల్ సైడ్ అవుతాడని అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగార్జున స్పష్టం చేశారు.'నిన్న రాత్రి 'లెనిన్' సినిమా ఫస్ట్ కట్ చూశాను. మీరు కొత్త అఖిల్ని చూస్తారని గర్వంతో నమ్మకంగా చెబుతున్నా. డేట్ గుర్తుపెట్టుకోండి జూన్ 26న థియేటర్లలో కలుద్దాం' అని నాగార్జున ట్వీట్ చేశారు. అంటే 'పెద్ది' చిత్రం 25న వస్తుందని తెలిసినా సరే బరిలో ఉన్నారంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర మెగా vs అక్కినేని అనమాట. ఈ రెండు చిత్రాలు కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ నేపథ్య కథతో తీయడం విశేషం. మరి చెప్పిన మాటకు కట్టుబడి ఒకరోజు తేడాతో వస్తారా? లేదంటే 'లెనిన్' వాయిదా బాట పడతాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరో విజయ్ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్) -
రూ. 20 కోట్ల లగ్జరీ ఇల్లు.. నాది కాదు: యాంకర్ స్రవంతి
యూట్యూబ్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు.. తన చురుకైన మాటలు, అందంతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. బిగ్బాస్, యాంకర్, నటి, ఇలా పలు రంగాల్లో దూసుకుపోతూ సోషల్ మీడియాలో తరుచుగా ట్రెండింగ్లో నిలుస్తోంది. యాంకర్ సుమ, అనసూయ, శ్రీముఖిల మాదిరిగానే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకుని ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కదిరికి చెందిన స్రవంతి మధ్యతరగతి అమ్మాయే.. కానీ, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె భారీగా సంపాధిస్తుందని, రూ. 20 కోట్లతో హైదరాబాద్లో ఒక లగ్జరీ ఇల్లు కూడా కొనేసిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది.గోదారి గట్టుపైన సినిమా కార్యక్రమంలో యాంకర్ స్రవంతిని నటుడు సుదర్శన్ ఒక ప్రశ్న అడిగారు. 'మీకు రూ. 20 కోట్ల విల్లా ఉందని వార్తలు వస్తున్నాయి నిజమేనా..?' అన్నారు. అందుకు ఆమె కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. తనకు లగ్జరీ విల్లా ఉందనే విషయం కేవలం రూమర్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. కొందరు ఇలాంటి ప్రచారాలు చేయడం సహజమేనని ఆమె చెప్పింది. భవిష్యత్లో మంచి ఇల్లు కొనాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుందని ఆమె తెలిపింది. పుష్ప -1 రిలీజ్ సమయంలో రాయలసీమ స్లాంగ్తో అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చేసి స్రవంతి పాపులర్ అయింది. అలా ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. సున్నా నుంచి మొదలు పెట్టిన స్రవంతి ప్రయాణం ఎన్నో కష్టాలను దాటుకుని మంచి స్థానానికి చేరుకుందని తన గురించి తెలిసిన వారు బహిరంగంగానే చెబుతుంటారు.యాంకర్ స్రవంతి ఆర్థిక స్థితిపై ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి ప్రముఖ యాంకర్లు, డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్లందరూ కూడా సినీ నటులతో సమానంగా సంపాదిస్తున్నారనే అభిప్రాయానికి నెటిజన్లు రావడమే ఇలాంటి రూమర్స్కు కారణమని చెప్పవచ్చు. ఆపై యాంకర్లు తరచుగా ప్రయాణాలు చేస్తూ, ఆన్లైన్లో ఆడంబరమైన జీవితాన్ని ప్రదర్శించడం వల్లే ఇలాంటి అభిప్రాయానికి కారణం అవుతుంది. అసలు వాస్తవం మరోలా ఉంటుందని పలు సందర్భాల్లొ వారు చెప్పిన విషయం తెలిసిందే. తమ కాస్ట్యూమ్స్, మేకప్ ఖర్చులకే సగం రెమ్యునరేషన్ పోతుందని చాలామంది చెబుతుంటారు. View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) -
నేడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నేడు (ఏప్రిల్ 29) వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కావ్య రెడ్డి అనే యువతితోకలిసి తిరుమలలో ఏడు అడుగులు వెయ్యబోతున్నాడు. బుధవారం రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీనివాస్- కావ్యల పెళ్లి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది. సినీ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన కావ్యను ప్రేమించి శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. కొంతకాలంగా వారు ప్రేమలో ఉన్నామని రెండు కుటుంబాలకు తెలిపి ఒక్కటి కానున్నారు. కావ్య తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది. బెల్లంకొండ కుటుంబం సాయి శ్రీనివాస్ పెళ్లి ఘనంగా నిర్వహించనుంది. తమ కుటుంబ దైవం సమక్షంలో పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. అందుకోసం ఇప్పటికే శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
ధురంధర్ దర్శకుడి కొత్త సినిమా.. బిగ్ ప్లాన్తో ఆదిత్య ధర్
‘ధురంధర్’ ప్రాంఛైజీ చిత్రాలతో రణ్వీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. సుమారు రూ. 3వేల కోట్లకు పైగా ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ రాబట్టాయి. ఇండియన్ మూవీ మార్కెట్లోనే అనేక సంచలనాలను క్రియేట్ చేసిన వీరిద్దరూ మరో సినిమా కోసం పనిచేయనున్నారు. ఈమేరకు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి.రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ మరో కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్లో వస్తున్న కథనాల ప్రకారం దర్శకుడికి ఒక కొత్త ఆలోచన తట్టిందని ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ను మరింత బలంగా ఉండేలా తన పనిని ప్రారంభించారని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ 2027లో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుపుతున్నారు. భారతదేశ భద్రత, నిఘా, అంతర్గత/బాహ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పలు ఇంటలిజెన్స్ (నిఘా) సంస్థలు దేశం కోసం పనిచేస్తున్నాయి. మరోసారి దేశం కోసం పనిచేసే సైనికుడి పాత్రతోనే ఒక బలమైన స్టోరీని ఆయన ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.వాస్తవ ప్రపంచానికి దూరంగా.. ఒక భారీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రణవీర్ సింగ్ దాదాపు నటించనున్నారని టాక్ ఉంది. ప్రస్తుతానికి పూర్తి నటీనటుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. త్వరలో ఆయన మరిన్ని విషయాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. -
నెలకు నా ఖర్చు ఎన్ని లక్షలు అంటే..: నిధి అగర్వాల్
నిధి అగర్వాల్ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే నటిగా దశాబ్దానికి చేరువు అవుతున్నా..ఇప్పటికీ సరైన గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారని చెప్పక తప్పదు . అదే సమయంలో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే సంపాందిస్తున్నా, ఐరన్లెగ్ అనే ముద్ర నుంచి ఇంకా బయట పడలేదు. ఇక ప్రేమ వ్యవహారంలోనూ బాగానే వార్తల్లో ఉంటున్నారు. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం అంటూ ప్రచారం వైరల్ అయ్యింది. అప్పుడామె ఆయనకు జంటగా ఈశ్వర్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సక్సెస్ కాకపోయినా, ప్రేయాయణం వార్తలతో బాగానే పాపులర్ అయ్యారు.తెలుగుతో పాటు కోలీవుడ్లో ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. జయంరవికి జంటగా భూమి చిత్రంలో నటించారు. కానీ, ఆ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడంతో నిధి అగర్వాల్ కెరీర్కు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. ఆ మధ్య తెలుగులో పవన్ కల్యాణ్కు జంటగా నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అది కూడా పూర్తిగా నీరుగార్చింది. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. అదీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగత నెల ఖర్చు గురించి ఒక భేటీలో నిధిఅగర్వాల్ పేర్కొన్నారు. అందులో ‘ నా నెల ఖర్చు ఎంతో తెలుసా ? అంటూ చెప్పడం ప్రారంభించారు. నా నెలవారి ఖర్చు రూ. 5 లక్షలు అని పేర్కొన్నారు. నా ట్రావెలింగ్, బస,డయిట్,జిమ్, ట్రైనర్, పార్లర్ ఖర్చులకే రూ. 5 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా మేకప్, హెయిర్స్టైలింగ్, ఫోటోస్ వంటి ఖర్చులను కొన్ని సార్లు కార్యక్రమాల నిర్వాహకులు చెల్లించినా, కొన్ని సార్లు నేను భరించాల్సి ఉంటుంది’ అని నటి నిధి అగర్వాల్ పేర్కొన్నారు. -
స్పీడ్ పెంచారు
పాన్ ఇండియా ట్రెండ్లో పడి కొందరు తెలుగు హీరోలు పర్ఫెక్షన్ కోసం ఒకే సినిమాతో సెట్స్లో రెండు మూడేళ్లు గడుపుతు న్నారు. కథ స్థాయి, నిర్మాణ విలువల ప్రాధాన్యం వల్ల ఈ సమయం కొన్నిసార్లు పెరుగుతుంది. అయితే ఇకపై సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకూడదని, ప్రేక్షకులకు మరింత చేరువలో ఉండాలని ఏడాదికో సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు కొందరు హీరోలు. స్పీడ్ పెంచి, వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు. మరి... ఈ హీరోలు, వీరు చేస్తున్న సినిమాల గురించి ఓ లుక్ వేద్దాం.స్ట్రాంగ్ లైనప్ స్టార్ హీరో ప్రభాస్ లైనప్ ఎప్పుడూ మూడు సినిమాలకు తక్కువ కాకుండా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజి, స్పిరిట్’ చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. వచ్చే నెల నుంచి ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణను కూడా షురూ చేయనున్నారు. ఇలా ఏకకాలంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ లవ్స్టోరీ సినిమా ‘ఫౌజి’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిపాత్రలో కనిపిస్తారని తెలిసింది ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ‘ఫౌజి’ సినిమా విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరోవైపు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైపోయింది. వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. దీంతో వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు సందీప్ రెడ్డి వంగా.ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండగా హీరోయిన్ త్రిప్తి దిమ్రి డాక్టర్ రోల్ చేస్తున్నారని తెలిసింది. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్, కాంచన, ప్రకాశ్ రాజ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టి సిరీస్ ఫిలింస్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో కల్కి సెట్స్లో..! దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి సినిమా ‘కల్కి 2898ఏడీ’. ఈ యూనివర్స్ నుంచి వచ్చే ఏడాది ‘కర్ణ 3102బీసీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా రానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అమితాబ్ బచ్చన్, కమల్హాసన్పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే నెలలో ఈ చిత్ర హీరో ప్రభాస్ సైతం ఈ సినిమా సెట్స్లో జాయిన్ కానున్నట్లుగా తెలిసింది. సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.‘కర్ణ 3102బీసీ’ సినిమా వచ్చే ఏడాది చివర్లో థియేటర్స్లో విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ సమాచారం. ఇంకా ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో మూడు సినిమాల్లో హీరోగా నటించేందుకు ప్రభాస్ ఆల్రెడీ కమిటైన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి ‘సలార్ 2’ అని, మరో చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఒకే ఏడాదిలో మూడు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్ ట్రాక్లోకి వచ్చారు శర్వానంద్. ఈ యంగ్ హీరో నుంచి ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం శర్వానంద్ ‘భోగి’, శ్రీను వైట్ల డైరెక్షన్లోని ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలోని ‘భోగి’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 28న రిలీజ్ కానుంది. 1960 కాలమానంలో తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతంలో జరిగే ఈ రివెంజ్ యాక్షన్ సినిమాలో అనుపమా పరమేశ్వర్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ‘జార్జ్ క్రిష్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా శర్వానంద్ ఆల్రెడీ ప్రకటించారు. ఒకవేళ ఈ సినిమా అనుకున్నట్లుగా వచ్చే సంక్రాంతికే రిలీజ్ అయితే 2026 సంక్రాంతి నుంచి 2027 సంక్రాంతికి లోపు నాలుగు సినిమాల్లో శర్వానంద్ కనిపించినట్లు అవుతుంది.ఇటు గోదావరి... అటు రాయలసీమ ‘రణబాలి, రౌడీ జనార్థన’... ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్తో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఈ రెండూ పీరియాడికల్ సినిమాలే కావడం విశేషం. అలాగే ‘రణబాలి’ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 11న, ‘రౌడీ జనార్థన’ సినిమాను ఈ డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లు విజయ్ దేవరకొండ ఆల్రెడీ ప్రకటించారు. ఈ దిశగా షూటింగ్స్ జరుగుతున్నాయి. 1854 –1878 మధ్య బ్రిటిష్ పరి పాలనా కాలంలో, రాయలసీమలో జరిగిన ఆర్థిక దోపిడీ, రణబాలి తిరుగుబాటు వంటి అంశాల ఆధారంగా ‘రణబాలి’ సినిమా కథనం ఉంటుంది. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఆయన భార్య రష్మికా మందన్నా హీరోయిన్గా చేస్తున్నారు. జయమ్మపాత్రలో నటిస్తున్నారు రష్మిక.‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్–రష్మిక కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్లో అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ‘రౌడీ జనార్థన’ విషయానికి వస్తే... రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా చేస్తున్నారు. 1980 టైమ్లైన్లో తూర్పుగోదావరి నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం గోదావరి యాసలో మాట్లాడేందుకు విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ రెండు చిత్రాలను కాస్త పక్కన పెడితే... విజయ్ దేవరకొండ హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి... ‘రణబాలి’, ‘రౌడీ జనార్థన’లతో కలిసి ఈ సినిమానూ విజయ్ సెట్స్కు తీసుకువెళ్తారా? లేక ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాలి.ముచ్చటగా మూడు వరుసగా సినిమాలు చేయడానికి పక్కా ప్లాన్తో రెడీ అవుతున్నారు నితిన్. ఈ ప్లాన్లో భాగంగా నితిన్ ఆల్రెడీ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలోని సినిమాను షురూ చేస్తున్నారు నితిన్. సోము–నర్రి ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం వచ్చే నెల మొదటివారంలో జరుగుతుందని, చిత్రీకరణ కూడా వచ్చే నెలలోనే ప్రారంభం అవుతుందని తెలిసింది. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తారని సమాచారం. ఇక వీఐ ఆనంద్ డైరెక్షన్లో నితిన్ ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో తొలిసారి నితిన్ ద్వి పాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్లో ఓ సినిమా చేయనున్నారు నితిన్. ‘ఆయ్’ సినిమా ఫేమ్ దర్శకుడు అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో... వీలైనంత తొందరగానే ఈ సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలా నితిన్ ఏకకాలంలో కనీసం రెండు సినిమాలు చేస్తారని ఊహించవచ్చు. పాలిటిక్స్... ఫ్యాంటసీ! వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ హీరోగా నటించిన ‘సిగ్మా’ సినిమా రిలీజ్కు సిద్ధం అవుతోంది. ప్రజెంట్ కృష్ణ చైతన్య డైరెక్షన్లో ‘పవర్ పేట’, ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని డైరెక్షన్లోని సోషియో ఫ్యాంటసీ సినిమాలకు సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ మూవీని నిర్మిస్తారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు సమాంతరంగా జరగనున్నాయి. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి. అలాగే సందీప్ కిషన్ హీరోగా ‘వైబ్, మాయవన్’ వంటి సినిమాల ప్రకటనలు వచ్చాయి కానీ, ఆ తర్వాత ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది.రానా రెడీ! ఇటీవలి కాలంలో నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు రానా. దుల్కర్ సల్మాన్తో ‘కాంత’ వంటి సినిమాను నిర్మించడమే కాకుండా, తన స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా పలు తెలుగు సినిమాల రిలీజ్లకు అసోసియేట్ అయ్యారు. కాగా, రానా మళ్లీ యాక్టింగ్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తేజ సజ్జా ‘మిరాయ్’ క్లైమాక్స్లో కనిపించారు రానా. సో... ‘మిరాయ్ 2’ చిత్రంలో రానా ఉంటారని ఊహించవచ్చు. ఇక అక్షయ్ కుమార్, రానా లీడ్ రోల్స్లో చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రానుందనే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.కరణ్ జోహర్ నిర్మించనున్న ఈ హిస్టారికల్ సినిమా ఉజ్జయిని నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ‘జై హనుమాన్’ సినిమా చిత్రీకరణలోనూ రానాపాల్గొంటున్నారని తెలిసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా ఓ ప్రధానపాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఇలా ఏక కాలంలో రెండు సినిమాలు చేస్తున్నారు రానా. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘జై హనుమాన్’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇలా ఒకేసారి రెండు మూడు సినిమాలను సెట్స్పైకి తీసుకువెళ్లిన హీరోలు మరికొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఈ తరహాలో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.ఏడాదికో సినిమా!మహేశ్బాబు హీరోగా నటించి, థియేటర్స్లో రిలీజైన గత చిత్రం ‘గుంటూరు కారం’. 2024లో ఈ సినిమా విడుదలైంది. మహేశ్బాబు నెక్ట్స్ సినిమా ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల మధ్య దూరం మూడు సంవత్సరాలు. అయితే ఇకపై ఇలాంటి గ్యాప్ ఉండకూడదని, ఏడాదికో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మహేశ్బాబు తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్లో ఓ సినిమా చేయనున్నారట మహేశ్బాబు.అలాగే సందీప్ రెడ్డి వంగాతో మహేశ్బాబు ఓ సినిమా చేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా వరుస సినిమాలను రిలీజ్ చేయాలనే ప్లానింగ్లో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే... అల్లు అర్జున్ గత చిత్రం ‘పుష్ప: ది రూల్’, రాబోయే చిత్రం ‘రాకా’ (అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సన్పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా) ల మధ్య మూడు సంవత్సరాల గ్యాప్ కనిపిస్తోంది. ఈ గ్యాప్ను తగ్గించాలని అల్లు అర్జున్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారట. ఈ దిశగా అల్లు అర్జున్ తన లైనప్ను రెడీ చేసుకుంటున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.‘రాకా’ తర్వాత తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లుగా అల్లు అర్జున్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోల తరహాలోనే మరికొంత మంది హీరోలు సైతం సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా తమ లైనప్స్ను, కాల్షీట్స్ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే స్టార్ హీరోల సినిమాల విషయంలో వారి ఫ్యాన్స్ను హ్యాపీ ఫీలయ్యేలా చేసే విషయం ఒకటి ఉంది. వారి సినిమాలు రీ రిలీజ్లు అవుతుంటాయి. అయినప్పటికీ కొత్త సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు రావాలని స్టార్ హీరోలు ప్లాన్స్ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
పుట్టినరోజు కానుకగా...
హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు ఓ కానుక ఇవ్వనున్నారు. మే 20న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఊసరవెల్లి’ సినిమా రీ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ప్రకాశ్రాజ్, విద్యుత్ జమాల్, సాయాజీ షిండే, మురళీ శర్మ తదితరులు ఇతరపాత్రలు పోషించారు.బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్గా నిలిచింది. కాగా ‘ఊసరవెల్లి’ చిత్రం సుమారు పదిహేనేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై కల్యాణ్రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న రిలీజ్ కానుంది. -
పండుగాడు వస్తున్నాడు
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ సినిమాలో మహేశ్బాబు చెప్పిన డైలాగ్ ఎంతపాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే పండుగాడు (మహేశ్పాత్ర నిక్ నేమ్) మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాడు. మహేశ్బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోకిరి’. ఇలియానా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, అజయ్ ఇతరపాత్రలు పోషించారు. ఇందిర సమర్పణలో వైష్ణో అకాడమీ బ్యానర్పై పూరి జగన్నాథ్ నిర్మించిన ఈ సినిమా 2006 ఏప్రిల్ 28న విడుదలై, మహేశ్బాబు కెరీర్లోనే బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి ఈ చిత్రంలో మహేశ్ మేనరిజమ్, డైలాగ్స్ ఇప్పటికీపాపులరే. మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా విడుదలై మంగళవారంతో 20 ఏళ్లు పూర్తయ్యాయి.ఇదిలా ఉంటే... మహేశ్బాబు బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా ‘పోకిరి’ సినిమాని పీవీ ఎంటర్టైన్మెంట్ ద్వారా రీ రిలీజ్ చేస్తున్నారు. డాల్బీ, 4 కె వెర్షన్లో రీ రిలీజ్ కానుంది. కాగా మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
#కింగ్ 100.. 'శివ' లుక్తో నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వందో సినిమాను ఎంతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగిన ఫార్ములా కథతో సాగనుందని తెలుస్తోంది. ఇందులో నాగ్ ఒక షేడ్లో 25 ఏళ్ల యువకుడిలా కనిపించనున్నారని సమాచారం. దాని కోసం చిరంజీవి ఆచార్యలో, రజనీకాంత్ కూలీలో వాడిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. అంటే దాదాపు శివ సినిమాలో నాగార్జున ఎలా కనిపించారో, అదే వింటేజ్ లుక్ను ఈ పాత్రలో మళ్లీ చూపించనున్నారు.ఆచార్య వచ్చిన సమయంలో ఈ టెక్నాలజీ ఖరీదైనది. కానీ ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో ఖర్చు తగ్గింది, దాంతో వాడకం చాలా సులభమైంది. ఇక దీంతో నాగార్జున వందో సినిమా మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున-టబు జంట 28 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనుంది. గతంలో వీరిద్దరూ నటించిన నిన్నే పెళ్ళాడతా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. చివరిగా వీరు ఆవిడా మా ఆవిడే చిత్రంలో నటించారు. ప్రస్తుతం టబు షూటింగ్లో పాల్గొంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. దసరా తర్వాత విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే టైటిల్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఏదీ ఇప్పట్లో ప్రకటించే ఉద్దేశం లేదు. సినిమా పూర్తయిన తర్వాతే ప్రచారం మొదలుపెట్టాలని నాగ్ నిర్ణయించారు. ఇలా నాగార్జున తన వందో చిత్రంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. -
ఈవెంట్లో పాయల్ రాజ్పుత్ కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు పంజాబీలో చాలా సినిమాలు చేయడంతో పాటు హిందీ సీరియళ్లలో నటించారు. ఇటీవలే పంజాబీ ఫిల్మ్ ఖుష్ కబరీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా పాయల్ రాజ్పుత్ ఫస్ట్ టైమ్(01-01-01) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైంది. ఈ సినిమాతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో మూవీ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు.పాయల్ కన్నీటి పర్యంతం..ఈ ఈవెంట్కు పాయల్ రాజ్పుత్ సినీ కెరీర్, ఆరోగ్య సమస్యల గురించి ప్రశ్నించారు. దీనికి పాయల్ స్పందించింది. తన అనారోగ్యంతో జైపూర్లో పది రోజులు చికిత్స తీసుకున్నానని వెల్లడించింది. ఆ సమయంలో మా ఫాదర్కు క్యాన్సర్ సోకిందని తెలిపింది. నా లైఫ్లో రియల్ హీరో మా నాన్నే అంటూ ఎమోషనలైంది. తన తండ్రిని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. నా సినిమాలు చూడాలని నాన్న ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూసేవాడని తెలిపింది. నా చిత్రాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయనేనని పాయల్ వెల్లడించింది. తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని వేదికపై బోరున ఏడ్చేసింది. దీంతో అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారంది. కాగా.. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ గతేడాది జూలై 28న క్యాన్సర్తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. Actress Payal Rajput gets emotional while answering and walks away pic.twitter.com/ysuvKFdaxZ— idlebrain.com (@idlebraindotcom) April 28, 2026 -
సమంత బర్త్ డే స్పెషల్.. ఫుల్ యాక్షన్ వీడియో రిలీజ్
ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు కావడంతో స్పెషల్ వీడియో రిలీజైంది. సామ్కు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రశంసలు కురిపించారు మా ఇంటి బంగారం టీమ్. ఈ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేసిన వీడియో సామ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సామ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.ఈ సందర్భంగా సామ్ నటనపై ప్రశంసలు కురిపించారు. సమంత స్టంట్స్ అదరగొట్టేశారని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ కొనియాడారు. సమంతను బీస్ట్ అంటూ ఆకాశానికెత్తారు. ఎలాంటి సీన్స్లోనైనా అద్భుతంగా చేయగలదని డైరెక్టర్ నందిని రెడ్డి ప్రశంసించారు. సామ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటి అని డీవోపీ ఓంప్రకాశ్ అన్నారు. ఆమె యాక్షన్ సీన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. సామ్ భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సైతం సమంత నటన ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందన్నారు. అభిమానులకు విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. కాగా.. సమంత తన సొంతం బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దీపికా ప్రెగ్నెన్సీ.. రాకా యాక్షన్ సీన్స్పై క్లారిటీ..!
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న బిగ్ ప్రాజెక్ట్ రాకా. ఈ ఏడాది బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో తోడేలును తలపించేలా బన్నీ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్ చూస్తే బన్నీ నెగెటివ్ రోల్ చేయనున్నారని అర్థమవుతోంది. ఈ భారీ యాక్షన్ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది.దీపికా పదుకొణె ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించింది. ఇప్పటికీ ఆమెకు ఓ కూతురు ఉండగా.. మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో రాకా షూటింగ్ గురించి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాకా సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్గా మారింది. దీపికా పాత్ర కోసం రాకా మార్పులు చేస్తారా? అన్న సందేహం ఫ్యాన్స్లో ఆసక్తి పెంచుతోంది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో యాక్షన్ సీన్స్ను డూప్తో చేయిస్తారని బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రాకా స్క్రిప్ట్లో ఎలాంటి మార్పు చేయడం లేదని తెలుస్తోంది. దీపికా పదుకొణెకు అద్భుతమైన ఎంట్రీతో పాటు.. అల్లు అర్జున్తో ఒక బిగ్ యాక్షన్ సన్నివేశం కూడా ఉందని టాక్. అయితే ఈ యాక్షన్ సీన్స్లో మాత్రం దీపికా డూప్తో చేయించనున్నారు. మిగిలిన సన్నివేశాల్లో దీపికానే షూటింగ్లో కొనసాగించనున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కారణంగా రాకా కథలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో అభిమానుల అనుమానాలకు ఇక తెరపడినట్లే. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రుక్మిణి పింక్ లవ్.. చీరలో పూజా హెగ్డే
పింక్ డ్రస్లో సోయగాలు చూపిస్తున్న రుక్మిణిఫన్నీ హావభావాలతో అలరిస్తున్న ఎస్తర్ అనిల్సొంతూరిలో సరదాగా గడిపేస్తున్న పూజా హెగ్డేకల్యాణి ప్రియదర్శన్ మత్తెక్కించే స్టిల్స్బ్లాక్ డ్రస్లో నవ్వుతూ నిహారిక పోజులుట్రిప్ జ్ఞాపకాల వీడియోతో మాళవిక మోహన్ View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) -
'పిల్లల కోసం పెళ్లే కానక్కర్లేదు'.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మెప్పించింది. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గతేడాది ఇడ్లీ కొట్టు, తలైవన్ తలైవి, కాదలిక్కా నెరమిల్లై చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. కేయూరీ ప్రొడక్షన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు.అయితే ఇటీవలే 39వ వసంతంలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ పెళ్లి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడింది. తాజాగా మరోసారి పెళ్లిపై నిత్యా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. గతంలో సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ముద్దుగుమ్మ.. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని అన్నారు. తాజాగా మరోసారి పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్పై మాట్లాడింది. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.పెళ్లికి.. పిల్లల్ని కనడానికి ఎలాంటి సంబంధం లేదని నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అందుకు పెళ్లి ఒక్కటే మార్గం కాదన్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పేం కాదని నిత్యామీనన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కేవలం లైఫ్లో ఓ పార్ట్ మాత్రమేనని.. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. పిల్లల్ని కనడానికి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సింగిల్ లైఫ్ను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు. -
చిరంజీవి-బాబీ.. క్లారిటీ వచ్చింది
సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చి హిట్ కొట్టిన చిరంజీవి.. తర్వాత మూవీని సమయానికి మొదలుపెట్టకపోయేసరికి ఎక్కడ లేని రూమర్స్ అన్నీ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ తీయాల్సిన నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్.. జన నాయగణ్, టాక్సిక్ చిత్రాల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటమే దీనికి కారణం. అయితే చిరు-బాబీ సినిమా నుంచి కేవీఎన్ తప్పుకొందని, మరో నిర్మాత కావాల్సి ఉందని రకరకాల పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ దాదాపు చెక్ పడిపోయింది.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)రీసెంట్గానే నిర్మాణ సంస్థ మారిపోయిందనే రూమర్స్ని కేవీఎన్ ప్రొడక్షన్ ఖండించగా.. ఇప్పుడు దర్శకుడు బాబీ, చిరంజీవికి ఈరోజు(ఏప్రిల్ 28) లుక్ టెస్ట్ జరిగిందనే సంగతి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరోవైపు ఇప్పటికే సెట్ వర్క్ జరుగుతోందని, ప్రాజెక్ట్ లాంచ్ కాగానే ఇంటర్వెల్ ఎపిసోడ్తో షూటింగ్ మొదలవుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు.ఇకపోతే 'కాకాజీ' అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ పేరుపై మెగా అభిమానుల్లో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. టైటిల్ ఏమంత పవర్ఫుల్గా లేదని అనుకుంటున్నారు. మరి ఇదే పేరు ఫిక్స్ చేస్తారా లేదంటే ఏమైనా చేర్పులు మార్పులు ఉండబోతున్నాయా అనేది చూడాలి? ఇందులో ప్రముఖ నటీనటులు కూడా చాలామందే కనిపించబోతున్నట్లు సమాచారం.(ఇదీ చదవండి: నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే కేసు పెడతా: అషురెడ్డి)Look test ☑️Locked the look of #Mega158 with Megastar @KChiruTweets garu today 🤗Can’t wait to begin this journey❤️🔥#ChiruBobby2 @KvnProductions @LohithNK01 pic.twitter.com/eWSLEqCqVN— Bobby (@dirbobby) April 28, 2026 -
పోకిరి విధ్వంసానికి 20 ఏళ్లు.. మాస్ డైలాగ్ రీ క్రియేట్..!
పూరి జగన్నాద్-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ పోకిరి. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీలో ఇలియానా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 28న 2006లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పోకిరి మూవీ డైలాగ్స్ ఓసారి గుర్తు చేసుకుంటున్నారు. రెండు దశాబ్దాలైనా పోకిరి డైలాగ్స్ను తెలుగు ఆడియన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి.తాజాగా స్వీడన్కు చెందిన నటుడు కర్ల్ స్వాన్బెర్గ్ పోకిరి మూవీ డైలాగ్ను రీ క్రియేట్ చేశాడు. ఆశిష్ విద్యార్థితో మహేశ్బాబు చెప్పే డైలాగ్ను రీ క్రియేట్ చేశాడు. మీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సింది..అనవసరంగా పుట్టావ్? అనే డైలాగ్ ఇప్పుడు విన్న గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పట్లో పూరి జగన్నాధ్ మాస్ డైలాగ్స్కు అభిమానులు ఫిదా అయిపోయారు. మరోసారి పోకిరి డైలాగ్ను విని మీరు కూడా ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
'నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే'.. అషురెడ్డి ఆడియో వైరల్
బిగ్బాస్ బ్యూటీ అషు రెడ్డి కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు కాజేసిందని ఆయన తండ్రి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదంపై అషురెడ్డి తండ్రి కూడా స్పందించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అషు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఆడియో క్లిప్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది అషురెడ్డి పెట్టిన ఆడియో అని వైరలవుతోంది.ఈ ఆడియోలో మాట్లాడుతూ.. 'ప్రవీణ అక్కకు ఫోన్ చేశావని నాకు కాల్ చేసింది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. నాకు మే వరకు టైమ్ ఇస్తే రూ.1.5 కోటి ఇచ్చేస్తా. మిగిలిన డబ్బులు నా లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తా.. లేదు కుదరదు.. అంటే పెద్ద మనుషులకు ఫోన్ చేశావ్ కదా.. నా లైఫ్లో పెద్దమనిషి ప్రవీణ అక్కే.. నువ్వు ఎవరినీ పిలుచుకుంటావో నీ ఇష్టం. నేను ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. లేదు.. కుదరదు అంటే నేనే వేధింపుల కేసు పెడతా. మా అక్కను, అమ్మను ఇందులోకి లాగొద్దు. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి రావడమేంటి? నా తరఫున ప్రవీణ అక్క, వేణుస్వామి వస్తారు.. మే వరకు ఆ డబ్బులు సెటిల్ చేస్తా' అని ఉంది. ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. -
విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..
ఇన్ స్టాలో సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు నెలొచ్చేసరికి ఏకంగా లక్షలు సంపాదిస్తున్నారని, అయితే దీనికోసం హద్దులు దాటేస్తున్నారని వార్తలొచ్చాయి. విష్ణుప్రియపై విజయవాడలో కేసు కూడా పెట్టగా.. అనన్య మాత్రం తన రోజూవారీ జీవితంలో జరిగే వాటిని పోస్ట్ చేయడానికే ఈ సబ్స్క్రిప్షన్ పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే వీళ్లని మించే సబ్స్క్రిప్షన్ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వృత్తిక పటేల్ అనే ఇన్ స్టా అకౌంటే ఈ చర్చకు కారణం. ఇంతకీ ఈమె ఎవరు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)వృత్తిక పటేల్ అనే అమ్మాయి పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కేవలం లక్ష పద్నాలుగ వేలమంది ఫాలోవర్స్ మాత్రమే ఈమెకు ఉన్నారు. కానీ ఈమెని 300 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.390 అంటే దాదాపు రూ.లక్ష రూపాయల వరకు నెలకు ఈమె సంపాదిస్తోంది. ఇంతా చెప్పుకొన్నాం కదా అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. ఎందుకంటే మీరూ చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. వృత్తిక పటేల్ అనేది అమ్మాయి కాదు. ఇది ఏఐ మాయాజాలంతో సృష్టించిన ఖాతా.అవును మీరు విన్నది నిజమే. వృత్తిక పటేల్ అనే వ్యక్తిని ఏఐలో సృష్టించిన ఓ వ్యక్తి లేదా వ్యక్తులు.. నిజంగా అమ్మాయిలా ఉండేలా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్, దేవుడు లాంటి రెగ్యులర్ టాపిక్స్కి సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అలానే సబ్స్క్రిప్షన్ పెడితే 300 మంది వరకు చేరారు. ఈమె నిజమైన అమ్మాయి కాదు ఏఐ అని గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ ఈమె ఫాలోవర్స్ తగ్గడం లాంటివి జరగలేదు.విష్ణుప్రియ, అనన్య నాగళ్ల లాంటి వాళ్లు అమ్మాయిలు కాబట్టి వీళ్లపై కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వృత్తిక పటేల్ ఖాతా నడుపుతున్న వ్యక్తులు ఎవరో గానీ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ స్టాలో నెలకు సులభంగా లక్షకు పైనే సంపాదించేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలా జాగ్రత్త!(ఇదీ చదవండి: తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..) View this post on Instagram A post shared by Vrutika Patel (@vrutikaapatel) -
'మెగా ఇంటికి నా పిల్లలు.. వాళ్లకు చెప్పేది అదొక్కటే'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్లోనే ఉంటోంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోనే కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తోంది. అంతేకాకుండా మూగజీవాల కోసం తన వంతు పోరాటం చేస్తున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రేణు దేశాయ్.. హీరో పవన్ కల్యాణ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆద్య, అకీరా అనే పిల్లలు ఉన్నారు. అయితే కొన్నేళ్లకే ఆమె పవన్ కల్యాణ్తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె సింగిల్గానే తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే పేరేంట్స్ విడిపోయినప్పటికీ పిల్లలు తన తండ్రి వద్దకు వెళ్తుంటారు. మెగా ఫ్యామిలీ ఇంటికి కూడా వెళ్తుంటారు. దీనిపై రేణు దేశాయ్ను ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలకు ఏం చెప్తారన్న ప్రశ్నకు రేణు స్పందించింది.మీరు అక్కడికి వెళ్లి ఎలా ప్రవర్తిస్తారో అదే నా పెంపకాన్ని సూచిస్తుందని వారితో చెప్తానని రేణు దేశాయ్ తెలిపింది. పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పెంచిన తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తారని పేర్కొంది. అందుకే తన పిల్లలకు విలువల గురించి ప్రత్యేకంగా నేర్పించానని వెల్లడించారు.అందుకే మెగా ఇంటికి వెళ్లేముందు అక్కడ మీరు ఎలా మాట్లాడతారు? ఎలా ఉంటారనేది ముఖ్యమని.. ఒక తల్లిగా నేను సరిగా పెంచానా? లేదా అన్నది డిసైడ్ అవుతుందని వారితో చెప్పానని వెల్లడించింది. ఒక మదర్గా నా ఇద్దరు పిల్లలను పెంచడంలో చాలా హ్యాపీగా ఉన్నానని రేణు తెలిపింది. ఒక తల్లిగా తన పెంపకంపై మచ్చ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనన్నారు. ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం తన పిల్లలకు నేర్పించానని రేణు అన్నారు. -
తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..
తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ బడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే వీళ్లలో నిజమైన ఫైట్స్ చేసేది ఎంతమంది అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే చాలామంది డూప్స్ ఉపయోగిస్తుంటారు. కాకపోతే ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. అలానే సీన్స్లోనూ సదరు డూప్ ఉన్నాడని తెలియకుండా చూసుకుంటారు. అయితే టాలీవుడ్లో 90 శాతం మంది హీరోలు, డూపులనే ఉపయోగిస్తున్నారని చెప్పి నటుడు, దర్శకుడు రవిబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!)'నా సినిమాలో హీరోది మధ్య వయసు పాత్ర. దీని కోసం టాలీవుడ్లో ఎవరుంటారా అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు. ఎందుకంటే నాలా ఫిజికల్గా బలంగా ఉండి, నాలా నటించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవరూ దొరకలేదు. అందుకే నేనే చేశాను. అలానే మన దగ్గర 90 శాతం మంది హీరోలు డూప్స్ ఉపయోగిస్తుంటారు. నేను మాత్రం ఫైట్స్ సీన్స్లో మార్షల్ ఆర్ట్స్ లాంటివి, కిక్స్ నిజంగా ఫెర్ఫార్మ్ చేశాను' అన రవిబాబు చెప్పుకొచ్చాడు.సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు.. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే 'అల్లరి' లాంటి కామెడీ మూవీస్తో దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లలో చూసుకుంటే మూవీస్ అయితే తీస్తున్నాడు గానీ వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఇప్పుడు కూడా 'రేజర్' అనే రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమా చేశారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా, ఇందులో అంత రక్తపాతమే కనిపించింది. మే 08న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రవిబాబుకి ఇదెంత వరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా) -
హైకోర్టుకు అషురెడ్డి
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.. పెళ్లి పేరుతో తన కుమారుడిని రూ. 9.35 కోట్ల వరకు మోసం చేసిందంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టును అషురెడ్డి ఆశ్రయించారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు వాస్తవాలను దాచిపెట్టి తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు.ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. -
పోకిరి@ 20ఏళ్లు.. ఫస్ట్ చాయిస్ మహేశ్బాబు కాదు!
మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పోకిరి’. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్లో ఫస్ట్ రూ. 50 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది. 200లకు పైగా కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి, ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా.. 15 కేంద్రాల్లో 200 రోజుల పాటు ప్రదర్శించబడిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. 75ఏళ్ళ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డుగా పోకిరి నిలిచింది.హీరోగా ఫస్ట్ ఛాయిస్ మహేశ్ బాబు కాదుపోకిరి సినిమా కథ రాసుకున్నప్పుడు తొలుత మహేశ్ని అనుకోలేదట పూరి. మాస్ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రెడీ చేశాడట. అయితే, పలు కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను పూరి చేయలేకపోవడంతో మహేశ్ ఎంట్రీ ఇచ్చేశారట. అలాగే ఈ సినిమాకు ‘పోకిరి’అనే టైటిల్ను కూడా చివర్లో ఫైనల్ చేశారట. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య’అని టైటిల్ను పూరి ఫిక్స్ చేసుకున్నాడట.. కానీ, ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకోవడం వల్ల టైటిల్తో పాటు కథలో కొన్ని మార్పులు చేసి పోకిరి అనే టైటిల్ను ప్రకటించారట.పోకిరికి నో చెప్పిన ఇద్దరు హీరోయిన్స్ఈ సినిమాకు హీరోయిన్గా ఫస్ట్ చాయిస్ ఇలియానా కాదట. ఆమెను కూడా చివరి నిమిషంలో దర్శకుడు పూరి తీసుకున్నారు. తొలుత ఈ చిత్రానికి హీరోయిన్గా అయేషా టాకియాను సంప్రదించారట. అన్నీ ఓకే అయ్యాక మె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు. ఆ తర్వాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ని ఎంపిక చేస్తే.. షూటింగ్కి రెడీ అవుతున్న సమయంలో కంగనా కూడా హ్యాండించింది. తనకు బాలీవుడ్లో ‘గ్యాంగ్స్టర్’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదిస్తే ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ సినిమాతోనే ఇలియానా స్టార్ హీరోయిన్గా తన కెరీర్ మారిపోయింది.మహేశ్ కటౌట్ చూస్తే మిల్కీ బాయ్లా ఉంటాడు.. ఎప్పుడూ క్లీన్ షేవ్తో క్లాస్గా కనిపించే ఆయన తొలిసారి ఈ సినిమాలో ఊరమాస్ గెటప్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడు మూవీ తర్వాత సుమారు నాలుగు నెలలు గ్యాప్ తీసుకుని తన గెటప్ను చేంజ్ చేసుకున్నాడు. పోకిరి కోసం సరికొత్త లుక్లో కనిపించేందుకు చాలానే కష్టపడ్డాడు. అప్పటివరకు క్లాస్గా కనిపించే మహేశ్లోని ఊరమాస్ యాంగిల్ని ప్రేక్షలకు చూపించాడు పూరి. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది. -
గుడ్న్యూస్ తర్వాత తొలిసారి కనిపించిన దీపికా పదుకొణె (వీడియో)
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులు ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించారు. అయితే, రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన తర్వాత తొలిసారిగా వారు కెమెరా ముందుకు రావడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించినప్పటికీ ముందుగా ఒప్పుకున్న సినిమాల కోసం ఆమె పనిచేస్తూనే ఉన్నారు.అల్లు అర్జున్- అట్లీ మూవీ రాకాలో దీపికా నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సీన్స్ షూటింగ్ జరుగుతుంది. ఆపై షారుఖ్ ఖాన్ కింగ్ మూవీలోనే భాగమైన దీపికా.. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్స్లో నటించేందుకు రెడీ అయిపోయిందట. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కోసం షారుక్తో పాటు దీపిక కూడా సెట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులకు 2024లో దువా పదుకొణె సింగ్ అనే కుమార్తె జన్మించగా.. ఇప్పుడు రోండో బిడ్డ వారి జీవితంలోకి రానుంది. గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా సినిమా షూటింగులలో బిజీగా ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. Late-night airport spotting alert! #RanveerSingh and #DeepikaPadukone keep it stylish, comfy, and oh-so-iconic 💼✨#MissMalini pic.twitter.com/uaWuuB1hz1— MissMalini (@MissMalini) April 28, 2026 -
పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలకు ఒకేరోజు లీకుల షాక్
టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్లో వేసిన ఒక సెట్స్లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్లో క్రేజ్ను పెంచారు.నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది. -
మహిమాన్వితమైన గుడికి విజయ్.. వీడియో వైరల్
తిరుచెందూర్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి ఆలయం)ను నటుడు, టీవీకే అధినేత విజయ్ దర్శించుకున్నారు. కొద్దిరోజులుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయ్ 4న విడుదల కానున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుచెందూర్ మురుగన్ను విజయ్ దర్శించుకున్నారు. స్వామి ఆయుధం "వేల్" (శక్త్యాయుధము) చేత అందుకున్న విజయ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకే స్వామి ఆశీస్సుల కోసం విజయ్ వచ్చినట్లు తెలుస్తోంది.తమిళనాడులో ఉన్న మురుగన్ ఆరు నివాసాలలో ఇది రెండవది. తమిళనాడులో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ఆలయం ఉంది. సుబ్రహ్మణేశ్వర స్వామికి చెందిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపైనే ఉన్నాయి. కానీ, తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో కొలువై ఉంటుంది. ఇక్కడి సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు. తిరుచెందూర్ మురుగన్కు అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవని నమ్ముతారు. తమిళనాడు నలుమూలల నుంచి తిరుచెందూర్కు చేరుకోవచ్చు. తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మధురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిరంతరం రైలు, బస్సు రవాణా సౌకర్యం ఉంది. #TVKVijay at Tiruchendur Murugan Temple for Vishwaroopa Darshan ❤️🔥💥pic.twitter.com/204nfbypKs— Troll Cinema ( TC ) (@Troll_Cinema) April 28, 2026 -
హీరోగా యాత్ర.. కుమారుడి ఎంట్రీపై ధనుష్ రియాక్షన్
తమిళ నటుడు ధనుష్ మల్టీ టాలెంటెడ్. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. కథా రచయిత, గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాతగా మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కథనాలు వచ్చాయి. తనను ధనుష్నే లాంచ్ చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఇదే అంశం గురించి ధనుష్ను ప్రశ్నించగా ఆయన స్పందించారు.ధనుష్ కొత్త సినిమా కర.. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. కుమారుడు యాత్ర సినిమాల్లోకి ఎప్పుడొస్తారనే ప్రశ్నపై ఆయన ఇలా స్పందించారు. 'నేను 16ఏళ్లకే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. అందుకు కారణం మా కుటుంబ పరిస్థితులే.. ప్రస్తుతం యాత్ర వయసు 19ఏళ్లు. కానీ, వాడు నాకు చిన్నపిల్లోడిలానే కనిపిస్తాడు. రాబోయే రోజుల్లో వాడు ఏమవుతాడనేది నేను చెప్పలేను. సినిమా పరిశ్రమలోకి వస్తాడా అనేది కూడా చెప్పలేను. సమయం ఇంకా ఉంది. వాడు (యాత్ర) తన కెరీర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో దానిని అమలు చేస్తాను.' అని ధనుష్ అన్నారు. -
పవర్ఫుల్ గుడి.. దర్శనం తర్వాత నా లైఫ్ మారిపోయింది: శృతి హాసన్
దైవం అన్నది మానవ జీవితంలో అతి ప్రధానమైనది. నాస్తికులు దీన్ని అంగీకరించకపోవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక తరుణంలో మనిషి నిజమైన భక్తిని పొంది పరవశిస్తాడు. అలాంటి నిజమైన భక్తి పారవశ్యాన్ని పొంది తరించానంటున్నారు నటి శృతి హాసన్. నాస్తికుడైన కమలహాసన్ వారుసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruti Haasan) మాత్రం ఆస్తికురాలే. దైవభక్తి కలిగిన నటి. వ్యక్తిగతంగా సంచలన నటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమిళ్, తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఆమె రాణిస్తున్నారు. ఆ మధ్య ప్రేమలో పడ్డా, ఆ వ్యవహారం అచ్చిరాలేదనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం తాను సింగిల్ అని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిన గట్స్ కలిగిన నటి శృతీహాసన్. ఇటీవల ఈమె నిజమైన భక్తి భావనను పొందిన విషయంపై ఒక భేటీలో పేర్కొన్నారు. ‘ఇటీవల నేను వారాహీ మాత ఆలయానికి వెళ్లాను. మనమే కాదు. దైవాలు కూడా మనల్ని ఎంచుకుంటారు. ఒక మిత్రుడు నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. రా దేవాలయానికి వెళ్లి వద్దాం అని పిలిచారు. అది చాలా చిన్న ఆలయమే. అయితే గర్భగుడిలోకి వెళ్లగానే నిజమైన భక్తి పారవశ్యాన్ని పొందాను. ఎలాంటి ఆడంబరం లేదు. వీఐపీల క్యూ లేదు. శక్తివంతమైన దేవత ’ అని నటి శృతి హాసన్ పేర్కొ న్నారు. అయితే, అమ్మవారి దర్శనం తర్వాత తన జీవితంలో చాలా మంచి మార్పులు వచ్చాయని, తనలో కొత్త శక్తి వచ్చిందని ఆమె చెప్పడం విశేషం.శృతి హాసన్ జీవితంలో మార్పులుశృతి హాసన్ చెన్నైలో సందర్శించిన ప్రసిద్ధ వారాహి దేవి ఆలయం మయిలాపూర్ (Mylapore)లో ఉంది. ఈ ఆలయం చెన్నైలోని ప్రసిద్ధ కపాలీశ్వర ఆలయానికి సమీపంలో ఉంది, ఇది వారాహి ఆరాధనకు అత్యంత శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ దర్శనం కొద్దిరోజుల తర్వాత శృతి హాసన్ అస్సాంలోని వారాహి మాత (కామాఖ్య దేవాలయం) కూడా దర్శించారు. ఇది అస్సాంలోని గువాహటిలో నీలాచల్ కొండలపై ఉంది. వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో మంచి మార్పులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఇది ఒక ప్రముఖ శక్తి పీఠం ఆపై తంత్ర సాధనకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం.ఇకపోతే ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా ట్రైన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది నిర్మాణ దశలో ఉంది. సలార్–2 చిత్రంలో నటించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. -
#కింగ్ 100లో ఎంట్రీ
నాగార్జున హీరోగా నటిస్తున్న ‘#కింగ్ 100’ సినిమాలో భాగమయ్యారు నటి టబు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. కాగా, ఈ సినిమాలో నటి టబు భాగం అయినట్లుగా మేకర్స్ సోమవారం ప్రకటించారు. ‘‘సెట్స్లో మీ రాక మాకెంతో గౌరవంగా ఉంది.ఈ సినిమాలో మీరు భాగం కావడంతో మా మైల్స్టోన్ సినిమా మరింత స్పెషల్గా మారిపోయింది’’ అంటూ ‘#కింగ్ 100’ సినిమా యూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తాను జాయిన్ అయినట్లు ఇన్స్టా వేదికగా టబు పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా టబు కనిపిస్తారా? లేదా కీలక పాత్ర చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.నాగార్జున కెరీర్లోని ఈ వందో సినిమాలో సుస్మితా భట్, విజయేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని, తండ్రీకూతుళ్ల ఎమోషన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నిన్నే పెళ్లాడతా’(1996), ‘ఆవిడా మా ఆవిడే’ (1998) చిత్రాల్లో నాగార్జున, టబు జోడీగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
గాయపడ్డ సింహం సంతృప్తి ఇస్తుంది: ఫరియా అబ్దుల్లా
‘‘గాయపడ్డ సింహం’ చిత్ర కథ వినగానే కొత్తగా అనిపించింది. కశ్యప్ శ్రీనివాస్గారు నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగై్జటింగ్గా అనిపించింది. ఇందులో ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉంటుంది. నేను చేసిన షాలిని పాత్రలో వినోదం ఎక్కువగా ఉంటుంది. మా మూవీ చూసిన ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామనే సంతృప్తి కలుగుతుంది’’ అని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చెప్పారు.తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా పంచుకున్న విశేషాలు.... ⇒ నేను ఏదైనా ఓ సినిమా ఒప్పుకోవాలంటే కథ, నా పాత్ర నచ్చాలి. ‘గాయపడ్డ సింహం’లో వ్లాగర్ షాలిని పాత్ర చేశాను. కశ్యప్ క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్గా వచ్చాయి. మా మూవీ ఫైనల్ ఔట్పుట్ చూశాను.. చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తరుణ్ భాస్కర్గారు సరదాగా ఉంటారు. ఆయన సెట్స్లో చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేది. ఈ మూవీలో శ్రీవిష్ణుగారి క్యారెక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ప్రేమికుడి చేయి వదిలేసిన అమ్మాయిగా మానసా చౌదరి చేస్తే.. ఆ చేతిని పట్టుకునే అమ్మాయి పాత్ర నాది (నవ్వుతూ).⇒ ‘గాయపడ్డ సింహం’ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కలిపి హిలేరియస్గా తెరకెక్కించారు కశ్యప్ శ్రీనివాస్గారు. స్వీకర్ అగస్తి చాలా అందమైన సంగీతం ఇచ్చారు. ‘బ్రైడ్...’, ‘జింగాల...’ నాకు ఇష్టమైన పాటలు. ఈ చిత్రానికి నలుగురు నిర్మాతలు ఉన్నారు.. అందరూ చాలా క్రియేటివ్గా ఆలోచించే వారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తిగారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. దుల్కర్ సల్మాన్గారి సినిమాలో అతిథి పాత్ర వస్తే చేయాలనుకోవడం లేదు. పూర్తి స్థాయి నిడివి ఉండే పాత్ర చేయాలని ఉంది. వచ్చే ఏడాది నేను ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తాను.. కొన్ని కథలు రాస్తున్నాను. ప్రస్తుతం ‘భగవంతుడు’, ‘సిగ్మా’ సినిమాలు పూర్తి చేశాను. సత్యదేవ్గారితో ఓ మూవీ చేస్తున్నాను. మరో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. -
బొగ్గు స్కామ్పై సినిమా.. పవర్ఫుల్ పోలీస్గా యంగ్ బ్యూటీ
హీరోయిన్ సంయుక్త ప్రధాన పాత్రలో కోల్ సిండికేట్ నేపథ్యం, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపుదిద్దుకున్న యాక్షన్ సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. కేఎమ్సీ యోగేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్ ఇతర పాత్రల్లో నటించారు. మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.‘‘తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంతో సాగే కథే ‘ది బ్లాక్ గోల్డ్’. సంయుక్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆదిలాబాద్ లొకేషన్స్తో పాటుగా, హైదరాబాద్లో వేసిన సెట్స్లో ఈ సినిమా చిత్రీకరించాం. ఈ మూవీ కోసం పదికిపైగా భారీ సెట్స్ వేశాం. 60కిపైగా వర్కింగ్ డేస్లో చిత్రీకరణను పూర్తి చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ నిర్మాత: సింధు మాగంటి, సంగీతం: సామ్ సీఎస్. -
'నా భర్తకు పదిమందితో ఎఫైర్స్'.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమని మనందరికీ తెలుసు. కానీ మనకు పైకి కనిపించనంత అందంగా నటీమణుల జీవితాలు ఉండవని కొందరికే తెలుసు. పైకి కలర్పుల్గా కనిపించే వారి జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలా సినీతారల పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయి. కొందరు తమ ఆవేదన చెప్పుకోలేని పరిస్థితుల్లోనూ ఉంటారు. మరికొందరేమో సినీతారలు తాము పడిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. అలా తన పర్సనల్ లైఫ్ గురించి ఆనాటి హీరోయిన్, బుల్లితెర నటి షాకింగ్ విషయాలు పంచుకుంది. అప్పట్లో స్టార్గా పలు హీరోల సరసన మెప్పించిన పూజిత తన పెళ్లి, భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్త చేసిన ఘనకార్యాలను బయటపెట్టేసింది.'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్కు రెండో భార్యగా మెప్పించిన పూజిత.. అప్పటి వారికి సుపరిచితమైన పేరు. రుతురాగాలు వంటి సీరియల్తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో మెప్పించింది.భర్త మోసంపై ఒంటరి పోరాటం..వెండితెరపై అభిమానులను మెప్పించిన పూజిత రియల్ లైఫ్ మాత్రం భర్త చేసిన మోసంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది. తన భర్త విజయ్ గోపాల్ గురించి తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త దాదాపు 9 మంది మహిళలతో ఎఫైర్స్ నడిపాడని పూజిత తెలిపింది. కానీ చివరికీ ఒక ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. దాదాపు 28 ఏళ్ల వయసు కొడుకు ఉన్న ఓ మహిళా అధికారిణిని పెళ్లాడటం అప్పట్లో హాట్ టాపిక్గా నిలిచింది. తన భర్త మీడియా వ్యక్తి కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి.. తనకి అన్యాయం చేశాడని చాలాసార్లు పూజిత చెప్పుకొచ్చింది.కాగా.. విజయగోపాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన పూజితకు ఓ కుమారుడు జన్మించారు. దాదాపు 14 ఏళ్ల తరువాత పూజితను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు విజయ గోపాల్. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో నటి పూజిత రోడ్డుకెక్కింది. ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీలో బాగా వైరలైంది. కానీ అప్పట్లో పూజితతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని ఆమె భర్త విజయ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
సొంతూరిలో నభా.. 'దృశ్యం' పాప సీరియస్ లుక్
సొంతూరిలో సరదాగా తిరిగేస్తున్న నభా నటేశ్నాభి అందాలతో సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్చిత్రమైన డ్రస్లో జాన్వీ కపూర్ పోజులుపెట్ డాగ్తో భాగ్య శ్రీ బోర్సే సరదా సరదాగాసీరియస్ లుక్లో అందంగా 'దృశ్యం' ఎస్తర్ట్రిప్ జ్ఞాపకాలు పంచుకున్న జైన్ మేరీ ఖాన్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Meagan Concessio (@meaganconcessio) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
అలరించేలా 'గోదారి గట్టుపైన' ట్రైలర్
కూతురిని చాలా ప్రేమించే తండ్రి.. కానీ కూతురేమో ఓ కుర్రాడితో ప్రేమలో పడటం. తద్వారా ముగ్గురి జీవితాల్లో ఏర్పడే సంఘర్షణ అనే కాన్సెప్ట్తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీతో తీసిన మరో మూవీ 'గోదారి గట్టుపైన'. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు, నిధి ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా)షార్ట్ ఫిల్స్మ్, ఆల్బమ్ సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో టాలీవుడ్లోకి వచ్చాడు. ఇప్పుడు గోదారి గట్టుపైన' చిత్రం చేశాడు. మే 08న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. పేరుకు తగ్గట్లే సరదాగా సాగిపోయే ప్రేమకథ చిత్రంలా అనిపించింది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి క్రేజ్ తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ మూవీతో దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!) -
'నిజమైన కరెన్సీ అదే'.. పూరి జగన్నాధ్ సందేశం విన్నారా?
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే పూరి జగనాధ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైఫ్ పాఠాలు చెబుతుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పూరి రిలీజ్ చేసిన వీడియో మన టైమ్, మనీ గురించి మాట్లాడారు. ప్రతి రోజు మనం ఖర్చు చేస్తున్న సమయం గురించి వివరించారు. లైఫ్లో డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ కాదని సందేశమిచ్చారు. గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఏం చేసినా తిరిగి తీసుకురాలేమని అన్నారు. రియల్ కరెన్సీ పేరుతో పూరి ఏమన్నారో మీరు కూడా చదివేయండి.'అందరికీ దేవుడు ఇచ్చింది రోజుకి 24 గంటలు మాత్రమే. ఎన్ని గంటలు ఉన్నాయన్నది కాదు.. ఆ 24 గంటలు ఎలా ఖర్చు చేశామన్నదే ముఖ్యం. మనం ప్రతి రోజు డబ్బు కోసం రాత్రి, పగలు కష్టపడతాం. ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డబ్బు కంటే విలువైన సమయాన్ని మాత్రం పట్టించుకోం. టైం గురించి వివరంగా చెప్పాలంటే.. ప్రతి ఉదయం మన పర్సు టైంతో నిండిపోయి ఉంటుంది. రాత్రి అయ్యేసరికి నువ్వు ఏం చేసినా.. చేయకపోయినా ఖర్చు అయిపోతుంది. మళ్లీ ఉదయం చూసుకుంటే పర్సు నిండా 24 గంటలు నిండే ఉంటాయి' అని అన్నారు.'నువ్వు టైమ్ను వేస్ట్ చేసినా కరిగిపోతుంది.. తెలివిగా ఇన్వెస్ట్ చేసినా అయిపోతుంది. ఈ రెండింటిలో మనం ఏం చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎన్నేళ్లు కష్టపడినా పర్లేదు.. ఏదో రోజు బోలెడంత డబ్బు సంపాదించి మిగిలిన జీవితమంతా హ్యాపీగా బతుకుదామనుకుంటాం. బాగా సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేయడానికి టైముండదు. అందుకే అదే రియల్ కరెన్సీ. డబ్బు మాయలో పడి కుటుంబంతో గడిపే అరుదైన క్షణాలు కోల్పోతాం. మిత్రులతో గడిపే అందమైన సాయంత్రాలు మిస్ అవుతాం''ఒక రోజులో మన నాలుగు గంటలు ట్రాఫిక్.. మరో నాలుగు గంటలు చిరాకులో గడిచిపోతాయి. మిగతావి నిద్రకు కేటాయిస్తాం. ఈరోజు కాకపోతే రేపు గుడ్న్యూస్ వింటామని ఎదురు చూస్తూ నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా మన జీవితంలో ఎంత పోగొట్టుకున్నామో కరిగిపోయిన కాలమే సమాధానం చెబుతుంది. ఈ భూమ్మీద మనకి లిమిటెడ్ అవర్స్ ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ప్రాణం వదిలేస్తాం. అందుకే వీలైనన్ని మధుర క్షణాలు మన అకౌంట్లో పడితేనే పుట్టినందుకు.. ఇక్కడ గడిపినందుకు ఏదో ఓ మీనింగ్ అంటూ ఉంటుంది. లేకపోతే ఈ జర్నీ మొత్తం నాశనమైపోద్ది' అంటూ సమయం విలువను కరెన్సీతో పోలుస్తూ సందేశమిచ్చారు మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. -
కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!
టాలీవుడ్లో స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు పూర్తిగా వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో 2017లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'లో అద్భుతమైన యాక్టింగ్ చేసి హిట్ కొట్టింది. తర్వాత చేసిన వాటిలో మూడేళ్ల క్రితం 'భగవంత్ కేసరి' మాత్రమే సక్సెస్ అందుకుంది. ఇందులో ఈమెది పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడం వల్ల హిట్ క్రెడిట్ రాలేదు. గతేడాది రిలీజైన 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఓ రకంగా చెప్పాలంటే కాజల్ కెరీర్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో ఈమె లాయర్గా లీడ్ రోల్ చేసిన 'ద ఇండియన్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమైంది. లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. గతేడాది అక్టోబరులోనే షూటింగ్ పూర్తవగా ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ప్రకటించారు.జూలై 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని పోస్టర్ వదిలారు. ఇందులో కాజల్తోపాటు మరాఠీ స్టార్ నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్ర చేశాడు. పంటకు ఉపయోగించే రసాయనాల దుర్వినియోగం, సాగులో పురుగు మందుల మితిమీరిన వినియోగం, దీని వెనకున్న భారీ కుంభకోణాల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా మూవీస్ చేయాలనుకుంటే మాత్రం ఇది హిట్ కావడం కాజల్కి చాలా కీలకం. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకొన్ని ఆఫర్స్ వస్తాయి. లేదంటే మాత్రం మెల్లగా ఈమెని పట్టించుకోవడం దర్శకులు తగ్గించేస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?') -
సమంత, కీర్తి సురేశ్, పూజా హెగ్డే.. హిట్ పడాల్సిందే!
ఒకప్పుడు సినిమా అంటే కేవలం ఒక స్టార్ హీరో, పేరున్న నటీనటులు, నలుగురు వెన్నెముక లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. అప్పుడే ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చేవి, ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఎవరన్నది కాదు, ఏం చూపిస్తున్నారన్నదే ముఖ్యం. భాషా బేధాలు చెరిగిపోయాయి.. కేవలం కంటెంట్ ఉంటే చాలు, నటీనటులు కొత్తవారైనా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కథలో దమ్ముంటే, ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్తున్నారు.అదే కథలో వైవిధ్యం లేకపోతే.. స్టార్ హీరో సినిమా అయినా సరే.. రెండో రోజే థియేటర్స్ ఖాలీ అయిపోతున్నాయి. అందుకే ఇప్పుడు హీరోల పరిస్థితి దారుణంగా ఉంది. ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త ప్రయోగాలు చేయాల్సిందే. హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే. వైవిధ్యమైన పాత్రలతో అలరించపోతే.. వారిని ఈజీగా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికే అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇక సమంత, కీర్తి సురేశ్, పూజా హెగ్డే లాంటి తారలు కూడా హిట్లేక అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్గా రాణించిన సమంత..ఇటీవల తన పంథాను మార్చేసింది. స్టార్ హీరోల పక్కన నటించడం ఆపేసి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేసింది. దీంతో దర్శక నిర్మాతలు కమర్షియల్ సినిమాలకు సమంత పేరుని పరిశీలించడం కూడా మానేశారు. మరోవైపు ఆమె సోలోగా చేసిన శాకుంతలం, యశోద సినిమాలు బక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘మా ఇంటి బంగారం’పైనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లో నిర్మించడంతో అటు నిర్మాతగా, ఇటు నటిగా ఈ మూవీ సమంతకు చాలా ముఖ్యం. ఈ మూవీ హిట్ అయితేనే.. సమంత స్టార్ లిస్ట్లో మరికొంతకాలం కొనసాగుతుంది. లేదంటే ఆమెను కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉంది. మే 15న ఈ మూవీ విడుదల కానుంది.ఇక కీర్తి సురేశ్ పరిస్థితి కూడా సమంతలాగే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన కీర్తి.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎల్లమ్మ సినిమాలు అవకాశం వచ్చినట్లే వచ్చి.. చేజారిపోయింది. ఇప్పుడు వెంకటేశ్-అనిల్ రావిపూడి చిత్రంలో చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రౌడీ జనార్థన చిత్రంలోనూ విజయ్కి జోడీగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితేనే కీర్తి సురేశ్కు మరిన్ని అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది.ఇక పూజా హెగ్డె.. ‘అల..వైకుంఠపురములో’ మూవీతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఒకప్పుడు తెలుగు,తమిళ, హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకు ఎక్కడ అవకాశాలు రావట్లేదు. తెలుగులో అయితే పూజా హెగ్డే పేరునే మర్చిపోతున్నారు. నాని – సుజిత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితేనే పూజా కూడా కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ లిస్ట్లో కొనసాగుతుంది. లేదంటే పూజా పేరుని కూడా టాలీవుడ్ మర్చిపోతుంది. అందుకే సమంత, కీర్తి, పూజా హెగ్డేలకు అర్జెంట్గా హిట్ అవసరం. మరి ఈ కొత్త చిత్రాలన్ని విజయం సాధించి.. ఈ తారలను మరికొంతకాలం స్టార్ హీరోయిన్లుగా కొనసాగిస్తాయో లేదో చూడాలి. -
రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ఈ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అయితే పెద్ది మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రెండుసార్లు వాయిదా పడడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు కారణాలేంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్ వల్లే వాయిదా వేశారని కొందరు భావిస్తున్నారు. కానీ ఇతర కారణాల వల్లే రెండోసారి వాయిదా వేశారని అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఇదేనని సోషల్ మీడియాలో వైరలవుతోంది.పెద్ది మూవీ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ గెటప్కు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే ఏప్రిల్ 30 నుంచి జూన్కు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గనట్లుగా ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మరింత అనుభూతి ఇచ్చేందుకే ఈ మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ చేయనున్నారు. -
జగపతి బాబు, లయ కొత్త సినిమా.. టీజర్ విడుదల
జగపతి బాబు, లయ, హృతిక నటించిన కొత్త సినిమా ‘వదలా’.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆసక్తిగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఈ చిత్రంలో చూపించారు. -
లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకైన ధునుష్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమా ఈవెంట్ కోసం ఎప్పుడు వచ్చిన.. ధనుష్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వస్తుంటారు. నిన్న(ఏప్రిల్ 26) హైదరాబాద్లో నిర్వహించిన ‘కర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ అదే జరిగింది. ధనుష్ వస్తున్నాడని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు. అందులో ఓ మహిళా అభిమాని చేసిన పనికి ధనుష్ షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది?ధనుష్ కోసం..ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ ఈవెంట్కి ధనుష్ కూడా వస్తున్నాడని తెలిసి ఓ మహిళా అభిమాని ఆ హోటల్కి వెళ్లింది. తన అభిమాన హీరోని లైవ్లో చూసి మురిసిపోయింది.మోకాళ్లపై కూర్చోని.. ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వేదికపై నుంచి వెళ్తుండగా.. సదరు మహిళా అతన్ని కలిసేందుకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ధనుష్ను దగ్గరకు వెళ్లింది. అతను ఆమెను పలకరించగానే.. భావోద్వేగానికి లోనైంది. ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది. ఊహించని ఈ పరిణామానికి ధనుష్ షాకయ్యాడు. క్షణాల్లో తెరుకొని వెంటనే ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మళ్లీ అలాగే చేయడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి, మాట్లాడి, చివరకు ఆమెతో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. A female fan goes down on her knees to greet #Dhanush at the #Kara event.#MamithaBaiju pic.twitter.com/ZtTLrqPmId— Milagro Movies (@MilagroMovies) April 26, 2026 -
టాలీవుడ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడో తెలుసా?
టాలీవుడ్ నుంచి ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలంతా ఇప్పుడు షూటింగ్లో బిజీ అయిపోయారు. వీరితో పాటు సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటెశ్ కూడా సమ్మర్లోనూ సెట్స్లోనే ఉంటున్నారు. మరి ఏ హీరో ఎక్కడ ఉన్నాడు? కొత్త సినిమాల షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఓ లుక్కేయండి.🎥 ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది🎥 అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ ముంబైలోనే ఉన్నాడు.🎥 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన ఓ సెట్లో కీలకమైన సన్నివేశలు షూట్ చేస్తున్నారు.🎥 రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లి లో జరుగుతోంది. అక్కడే ఓ సెట్లో ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నారు.🎥 నందమూరి బాలకృష్ణ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ జన్వాడ గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది.🎥 కార్తీక్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా కెక్కుతున్న సినిమా షూటింగ్ ఎల్బీ నగర్ లో జరుగుతుంది. నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఇది.🎥 వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.🎥 నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది.🎥 విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేట సెట్ లో జరుగుతుంది.🎥 రవితేజ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.🎥 శర్వానంద్ సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతోంది.🎥 రష్మిక , రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతోంది.🎥 శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.🎥 గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భరతవర్ష సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. -
ఓటీటీలో నంబర్ వన్ సినిమా.. తండ్రి-కొడుకుల బంధానికి ఫిదా
జీవీ ప్రకాశ్కుమార్, శ్రీ గౌరిప్రియ జోడీగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్.. విజయవంతంగా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మస్ట్ వాచ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దర్శకులు మారియా ఎలాంచెజియన్ తెరకెక్కించిన ఈ మూవీని జైవర్దన్ నిర్మించారు. ఈ మూవీతో సుమారు 11ఏళ్ల తర్వాత నటుడు అబ్బాస్ వెండితెరపై కనిపించాడు. అయితే, ఓటీటీలో హ్యాపీ రాజ్ దూసుకుపోతున్నాడు.ట్రెండింగ్లో హ్యాపీ రాజ్తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటున్న 'హ్యాపీ రాజ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల ప్రేక్షకులలో వేగంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ సినిమాగా చార్టులలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంపై చిత్ర యూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచింది.ప్రతి కుమారుడు తన తండ్రితో చూడాల్సిన సినిమా అంటూ చాలామంది నెటిజన్లు హ్యాపీ రాజ్ మూవీ గురించి పోస్టులు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలతో కన్నీళ్లు తెప్పిస్తుందని తెలుపుతున్నారు. ఓటీటీలో కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. -
కన్నీరు పెట్టుకున్న ఆమిర్ ఖాన్.. ఓదార్చిన సాయి పల్లవి: వీడియో
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ని హీరోగా వెండితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా సునీల్ పాండే తెరకెక్కించిన చిత్రం ఏక్ దిన్. ఈ మూవీతో సాయి పల్లవి బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది.ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీమ్ మ్యూజికల్ ఈవెంట్ని నిర్వహించింది. ఈ ఈవెంట్కి ఆమిర్ కూడా హాజరయ్యాడు. కొడుకు జునైద్, కోస్టార్ సాయి పల్లవి మధ్యలో కూర్చొని సినిమా వీక్షించాడు. కొడుకుని తొలిసారి బిగ్స్క్రీన్పై చూసి ఆమిర్ భావోద్వేగానికి లోనయ్యాడు. కళ్లజోడు తీసి కన్నీళ్లను తుడుచుకొని సంతోషంగా సినిమాను వీక్షించాడు. ఆమిర్ ఎమోషనల్ అవుతుంటే..పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదార్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సాయి పల్లవి చాన్స్ కొట్టేసిన రుక్మిణీ వసంత్!
దివంగత ప్రఖ్యాత గాయని, భారతరత్న అవార్డుగ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్కు ‘జెర్సీ’ సినిమా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారని, గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉంటుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో సాయి పల్లవి నటిస్తారనే టాక్ తొలుత వినిపించింది. కానీ ఇప్పుడు ఈ చాన్స్ కన్నడ నటి, ‘కాంతార’ ఫేమ్ రుక్మిణీ వసంత్ను వరించిందని టాక్. ‘రామాయణ’ (రెండు భాగాలుగా రానున్న సినిమా), ధనుష్ కొత్త చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. దీంతో కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక ఎంఎస్ సుబ్బులక్ష్మి సినిమా నుంచి సాయి పల్లవి తప్పుకోవాల్సి వచ్చిందట. ఆ చాన్స్ రుక్మిణీ వసంత్కి వెళ్లిందని సమాచారం. మరి... ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్లో రుక్మిణీ వసంత్ ఫైనలైజ్ అవుతారా? వేచి చూడాల్సిందే. -
నా హృదయానికి దగ్గరైన సినిమా కర : ధనుష్
‘‘అసాధారణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక సాధారణ మనిషి కథ ‘కర’. నా హృదయానికి దగ్గరైన చిత్రం ఇది’’ అని ధనుష్ అన్నారు. ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘కర’ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘విఘ్నేష్ రాజా స్పెషల్ ఫిల్మ్మేకర్. ‘కర’లాంటి సినిమా ఇచ్చిన తనకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘కర’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అంటున్న అతిథి బుచ్చిబాబుని రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘పెద్ది’ అప్డేట్ కోసం అడగ్గా.. ‘‘స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. జూన్ 25న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మరో అతిథి వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సార్’ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అందుకు రెండున్నర రెట్లు ఎక్కువగా ‘కర’ హిట్ కావాలి’’ అని చెప్పారు. ఇషారి కె. గణేశ్ మాట్లాడుతూ– ‘‘మన జీవితంలో నిత్యం జరుగుతున్నవే ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘ధనుష్గారు ‘కర’కు ఓకే చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రేక్షకుల డబ్బు, సమయాన్ని గౌరవించేలా ఈ సినిమా వారిని ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చెప్పారు విఘ్నేష్ రాజా. సతీష్ మాట్లాడుతూ –‘‘ధనుష్ సార్తో ఓ మంచి హిట్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. నా మిత్రుడు రాజేశ్ స΄ోర్ట్ చాలా ఉంది’’ అన్నారు. కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని నా ΄ాత్ర కోసం ్ర΄ోస్థటిక్ మేకప్ వేయడానికి, తీయడానికి నాలుగు గంటలు పట్టేది’’ అని అన్నారు. -
అలాంటి ప్రశ్న వేయడమే తప్పు : శ్రియ
ఇంతకుముందు హీరోయిన్లను వెంటాడే భయాల్లో ఒకటి పెళ్లి, మరొకటి వయసు. పెళ్లి అయితే హీరోయిన్ అవకాశాలు పోతాయేమోనన్న భయం ఎక్కువగా ఉండేది. అదేవిధంగా వయసు మీరితే అందం కరిగిపోతుందనే భయం కూడా ఉండేది. అయితే ఇప్పుడా భయం ఎవరిలోనూ కనిపించడంలేదు. పెళ్లి అయ్యి, నాలుగు పదుల వయసు దాటిన నటీమణులు కూడా అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో శ్రియ ఒకరు. ఈ భామ దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా వెలుగొందారు. కాగా వివాహానంతరం నటనకు కొద్ది కాలం దూరంగా ఉన్న శ్రియ ఇప్పుడు మళ్లీ నటించడంపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటించి మెప్పించారు. ఈ భామను ఇటీవల 43 మూడేళ్ల వయసులో ఇంత అందాన్ని ఎలా మెయిన్టెయిన్ చేస్తున్నారు, ఎలా అవకాశాలను అందుకుంటున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రియ బదులిస్తూ వయసును బట్టి నటీమణులను అంచనా వేయరాదంటూ ఘాటుగా పేర్కొన్నారు. అసలు ఈ ప్రశ్న వేయడమే తప్పు అన్నారు. వయసుతో పని ఏముంది? పెళ్లి అయితే నటీమణుల పని అయిపోతుంది అన్న ఆలోచనే రాకూడదు అని అన్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో సాధించడానికి వయసు ఆటంకమే కాదన్నారు. ప్రతిభ ముఖ్యమని, ప్రతి భావంతులైన కళాకారులు ఏ వయసులోనైనా సాధించగలరని అన్నారు. కాగా 43 ఏళ్ల వయసులోనూ తరగని అందాలతో ఆకట్టుకుంటున్న శ్రియ ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్లో నటించడానికి సిద్ధం అంటున్నారు. -
టైటిల్ ఫిక్స్?
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందిన తొలి సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్ ప్రధానపాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్లో విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. కాగా, ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న తదుపరి చిత్రం ‘కల్కి 2’ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. కమల్, అమితాబ్పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం ఫారిన్లో ఉన్నారని, మేలో ప్రారంభమయ్యే ఈ సినిమా షెడ్యూల్లో ఈ హీరోపాల్గొంటారని తెలిసింది. అలాగే ఈ చిత్రానికి ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ‘కల్కి 2898 ఏడీ’ (కల్కిపార్ట్ 1) సినిమాలో కర్ణుడిపాత్రలో ప్రభాస్ కొద్ది నిమిషాలు మాత్రమే స్క్రీన్పై కనిపిస్తారు. కానీ ‘కర్ణ 3102 బీసీ’ మూవీలో కర్ణుడిగా ప్రభాస్ స్క్రీన్పై దాదాపు 30 నిమిషాలు కనిపిస్తారట. ఇంకా ‘కల్కి 2’ మూవీ ముఖ్యంగా కర్ణుడి చుట్టూ తిరుగుతుందని, సినిమాలో కర్ణుడి పునర్జన్మ ఎలా జరిగింది? అనే దానిపైనే ప్రధాన కథనం ఉంటుందని టాక్. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే... ‘కల్కి 2’లో దీపికా పదుకోన్ నటించడం లేదని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. మరి... దీపిక ప్లేస్లో ఎవరు నటిస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదల కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. -
నన్ను ఎగతాళి చేశారు.. నేషనల్ అవార్డ్తో సమాధానం చెప్పా
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్కు ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్ను జ్ఞాపికగా అందించారు. దాంతో ధనుష్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొల్లాదవన్' నా కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాకు ముందు నన్ను చూసి చాలా మంది చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. కానీ 'పొల్లాదవన్'లో నేను మొదటిసారి సిక్స్ ప్యాక్తో కనిపించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలతో నన్ను స్వాగతించారు. నా జీవితంలో అది మర్చిపోలేని క్షణం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా 'యద్భావం తద్భవతి'. మనం ఏదైనా బలంగా నమ్మితే, దాన్ని సాధించగలం.నా కెరీర్ ప్రారంభ రోజులైన "2002-03 సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా అంటే అందరూ నవ్వుకునేవారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఆ అవార్డు నా చేతిలో ఉంటుందని గట్టిగా నమ్మాను. చివరకు అదే జరిగిందని ధనుష్ అన్నారు. తన పట్టుదల, కృషికి ప్రతిఫలంగా 2010లో ఆడుకాలం, 2019లో అసురన్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా కూడా కాక ముట్టై, విసారణై వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక 'కర' సినిమా విషయానికి వస్తే ధనుశ్, మమిత బైజు జంటగా నటించారు. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు జూన్లో వస్తుందని అధికారికంగా ప్రకటించారు గానీ తేదీ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. అలానే ఐటమ్ సాంగ్ షూటింగ్ ఎప్పుడు చేస్తారు? అందులో చేసే బ్యూటీ ఎవరు? తదితర వివరాలపై స్పష్టత రాకపోయేసరికి అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)ధనుష్ 'కర' సినిమా ఈనెల 30న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు.. జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు. అలానే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని చెప్పాడు. దీంతో చరణ్ అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో 'పెద్ది' తీస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా.. జగపతిబాబు, దివ్యేందు తదితరుల ఇతర పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)#Peddi - 25th June 🔒#RamCharan pic.twitter.com/Jnrer2KFrY— Suresh PRO (@SureshPRO_) April 26, 2026 -
పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకుంది. గతంలో మాజీ సీఎం మనవడితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకున్న ఈమె ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్లోని ఓ రిసార్ట్లో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగ్గా.. ఆ ఫొటోలని ఇప్పుడు పంచుకుంది. తన భర్త అర్ష్ ఔలక్ని పరిచయం చేసింది. ఈమె భర్తకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)పంజాబ్కి చెందిన మెహ్రీన్.. నాని 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, కవచం, చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయి, స్పార్క్ లైఫ్ మూవీస్ చేసింది. తమిళ, హిందీ, పంజాబీ, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.ఇకపోతే హరియాణాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ మనవడు అయిన భవ్య బిష్ణోయ్తో 2021 మార్చిలో మెహ్రీన్కి నిశ్చితార్థం జరిగింది. కానీ ఏమైందో ఏమో దీన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య పరి అనే ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మెహ్రీన్ కూడా అర్ష్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతానికైతే మెహ్రీన్ చేతిలో కొత్త సినిమాలేం లేవు. చూస్తుంటే నటనకు రిటైర్మెంట్ ఇచ్చేలానే ఉంది.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన సమంతని ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ.. వాటి కంటే విడాకులు, ఆరోగ్య సమస్యలు, రెండో పెళ్లి తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం' మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. అలానే మంగళవారం ఈమె పుట్టినరోజు కూడా. ఇంతలోనే చిన్నపాటి షాకిచ్చింది. తన దగ్గర ఇప్పుడేముంది? వేటిని వదులుకున్నానని ఓ పోస్ట్ రూపంలో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)పని మీద ప్రేమ, నడిపించే శక్తి, మనసు చెప్పే విషయం, సంకల్పం, నమ్మిన నిజం, ఓ లక్ష్యం తనతో పాటు ఉన్నాయని చెప్పుకొచ్చిన సమంత.. ఎవరో వచ్చి ఎంపిక చేస్తారని ఎదురుచూడటం, నియంత్రించే ఆలోచన, నచ్చినట్లు ఉండాలనుకునే లక్షణం, పట్టుకుని వేలాడటం, హడావుడి పడటం లాంటి అంశాలని వదిలేశానని తెలిపింది. ఇందుకు సంబంధించి నాలుగు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.చూస్తుంటే సమంత.. గత కొన్నేళ్లలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, వాటి వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి పరోక్షంగా ఈ పోస్టుతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఇక 'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఇది. ఓ ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్(సమంత).. రౌడీలని ఎందుకు చితక్కొట్టాల్సి వచ్చిందనేది కాన్సెప్ట్. ఈ చిత్రానికి సామ్ భర్త రాజ్ నిడిమోరు స్టోరీ, నిర్మాణ పరంగా సహకారం అందించారు.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. భారీ రికార్డ్కు మేకర్స్ ప్లాన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్ను హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్తో కలిసి స్టెప్పులు వేయనుంది.అయితే పెద్ది మూవీ జూన్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోనే పెద్ది ప్రీమియర్స్కు సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ విషయంలో కొత్త రికార్డ్ సెట్ చేయనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూన్ 24 న సాయంత్రం ఆరు గంటల నుంచే పెద్దఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రామ్చరణ్ స్పెషల్ సాంగ్లో స్టెప్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. దీంతో పెద్ది మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే పెద్ది రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. -
అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి
బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి గత రాత్రి నుంచి పలు వార్తలు వస్తున్నాయి. లండన్కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అషురెడ్డి.. తన అనుమతి లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి, మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టారు.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)'2021లో ఓ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సత్యనారాయణ అని తనని తాను పరిచయం చేసుకుని మీ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేశానని అన్నారు. మా అమ్మాయి మీకెలా తెలుసు అని అడిగాను. దీంతో మా అమ్మాయి, వాళ్ల అబ్బాయి కలిసి ఉద్యోగం చేశారని అలా పరిచయం అని నాతో చెప్పారు. ఓసారి కాకినాడ వచ్చి వెళ్లండి అని కూడా అన్నారు. నేను కాకినాడ వెళ్లలేదు గానీ తెలిసిన వాళ్లతో సదరు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోమన్నాను. అప్పటికే అతడికి పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని, సత్యనారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుదాం అని నాన్చుతూ వచ్చాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి వినడం''నేను వైజాగ్లో ఉంటాను. మా అమ్మాయి, తల్లితో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. మొదట నుంచి నాకు, అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. అషురెడ్డికి ఏం తెలీదు, అమయకురాలు. తల్లి పోత్రాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు ఏం తెలీదు. కానీ మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏమైనా సాక్ష్యాలు ఉంటే నిరూపించుకోవాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరే చోట ఉంది. రాత్రికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు(సోమవారం) ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరిగిందో చెబుతుంది. ఇదే సంగతి నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పింది. నేను కూడా ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తాను' అని అషురెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సాయిపల్లవి లేదా రుక్మిణి.. ఇద్దరిలో ఎవరు?) -
పెళ్లి వేడుకలో మెరిసిన నమ్రతా.. ఫుల్ గ్లామరస్గా ఆషిక రంగనాథ్..!
పెళ్లి వేడుకలో నమ్రతా శిరోద్కర్ సందడి..శారీలో బాలీవుడ్ భామ కాజోల్ అందాలు..చుడిదార్లో హీరోయిన్ ప్రియమణి పోజులు..డిగ్రీ ఫోటోను షేర్ చేసిన హీరోయిన్ మాధవీలత..ఫుల్ గ్లామరస్గా కనిపించిన నా సామిరంగ బ్యూటీ..సముద్ర తీరాన నటి ఐశ్వర్య రఘుపతి చిల్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) -
విశాల్పై అంజలి సెటైర్లు.. కాన్సెప్ట్ వీడియో
విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ‘మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు.హీరోయిన్ అంజలి వద్దకు దర్శకుడైన విశాల్ కథ చెప్పడానికి వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని విశాల్ అంటే.. అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండని కౌంటర్ వేస్తారు అంజలి. ఇలా విశాల్ కథ చెబుతూ ఉంటే మధ్య మధ్యలో అంజలి సెటైర్లు వేస్తుంటారు. విశాల్ ఇలా ఏదేదో చెబుతుంటారు.. అసలు మీ వద్ద కథ ఉందా? అని అంజలి అడగడంతో విశాల్ పారిపోతారు. మంచి కథ అని మేనేజర్ చెప్పారే.. విశాల్ ఏంటి ఇలా చెబుతున్నారని అంజలి అనుకుంటారు. కథ అడుగుతోందే.. ఎలా.. రేపు వచ్చి మరో కథ చెబుదాం అని విశాల్ వెళ్లిపోతారు.ఈ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.. @VishalKOfficial & @yoursanjali chemistry is the major highlight Of the film. #Makutam #MAGUDAM pic.twitter.com/vyj65qzJng— Filmy Today (@Filmy_Today) April 26, 2026 -
రేర్ పిక్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఫోటోలో ఎక్కడుందో తెలుసా?
మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా చాలా స్పెషల్. స్కూల్, కాలేజీ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని క్షణాలు. ఆనాటి రోజులను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. మన ఫ్రెండ్స్తో కలిసి తిరిగినా రోజులను చూసి చాలా మురిసిపోతాం. ఆ రోజుల్లో దిగిన ఒక్క ఫోటో ఉన్న సరే పట్టలేనంతగా సంతోషంతో మనల్ని మనం చూసుకుని సంబురపడిపోతాం. అలా తాను డిగ్రీ చదివిన రోజులను టాలీవుడ్ హీరోయిన్ మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. తన ఫ్రెండ్స్తో ఉన్న ఆనాటి రేర్ పిక్ను షేర్ చేసింది. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకొండి అంటూ అభిమానులకు చిన్న పరీక్ష పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో మెప్పించింది. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. కానీ ఆ తర్వాత పెద్దగా సక్సెస్ రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ముద్దుగుమ్మ.. బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi)


