Tollywood
-
పడవలో ఫైట్
గంగానదిలో శత్రువులతో వీరోచిత పోరాటం చేస్తున్నారు రుద్ర. విజువల్గా ఈ ఫైట్ ఏ లెవల్లో ఉంటుందనేది ‘వారణాసి’ సినిమాలో చూడొచ్చు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ‘వారణాసి’. ఈ సినిమాలో రుద్రగా, రాముడిగా మహేశ్బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఓ కీలక పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.గంగానదిలో పడవలో ప్రయాణిస్తుండగా శత్రువులతో హీరో చేసే ఫైట్ ఇది. ఈ ఫైట్ సీక్వెన్స్లో మహేశ్బాబు పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘వారణాసి’ టీమ్ విదేశాలకు వెళుతుందట. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి చిన్న వీడియో లీకై, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లీక్స్ పట్ల మహేశ్బాబు అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ‘వారణాసి’ షూట్కి సంబంధించిన విజువల్స్ లీకైన సంగతి గుర్తుండే ఉంటుంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
అడవిలో సవాల్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ రాజమహేంద్రవరంలో ఆరంభమైంది. ‘‘ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళుతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘భోగి’ ఒకటిగా నిలిచేలా రూపొందిస్తున్నాం. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్తో కూడిన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రక్షా బంధన్ సందర్భంగా ఆగస్ట్ 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కిశోర్ కుమార్ అరోకియా. -
మీరొస్తామంటే... మేమొద్దంటామా..!
‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ఆస్కార్ అవార్డును కూడా తెచ్చింది. విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తెలుగు సినీ ఇండస్ట్రీపైనే ఉంది. అందుకే పరభాషా హీరోలు టాలీవుడ్ దర్శక–నిర్మాతలతో అసోసియేట్ అయి, సినిమాలు తీస్తున్నారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా హిట్ చేస్తారు, ఏ హీరోకైనా స్టార్ స్టేటస్ ఇస్తారు. దీంతో తెలుగులో సినిమాలు చేసే పరభాషల హీరోల సంఖ్య ఎక్కువ అవుతోంది. తెలుగు దర్శక–నిర్మాతలు కూడా ‘మీరొస్తామంటే... మేమొద్దంటామా..!’ అంటూ సినిమాలను ఓకే చేస్తున్నారు. మరి... ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తున్న కొందరు పరభాషా హీరోలపై ఓ లుక్ వేయండి.సల్మాన్ భాయ్ వచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో తిరుగు లేని నటుడు. అయితే తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు సల్మాన్ ఖాన్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూశారు. కొంతమంది కమర్షియల్ దర్శకులు చెప్పిన కథలు కూడా ఉన్నారు. కానీ సల్మాన్ ఖాన్ను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లికి దక్కింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు.ఈ నెలాఖరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించనున్నారు. వచ్చే నెలలో ఆమె ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్రాజా డైరెక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.హిట్ 4 అన్నయ్య సూర్య బాటలోనే కార్తీ నడుస్తున్నారు. సూర్య మాదిరిగానే కార్తీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. సూర్యను ఓన్ చేసుకున్నట్లే కార్తీని కూడా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో 2016లో ‘ఊపిరి’ సినిమా వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ఇది. తెలుగులో కార్తీ చేసిన స్ట్రయిట్ ఫిల్మ్గా ‘ఊపిరి’ని చెప్పుకోవచ్చు. కార్తీతో సినిమాలు చేసేందుకు కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఆసక్తి చూపించారు.‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్, ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ వంటి దర్శకులు కథలు వినిపించారని తెలిసింది. ఈ చర్చలు ఇలా ఉండగానే... నాని నిర్మాతగా ‘హిట్’ ఫ్రాంచైజీ నుంచి ‘హిట్ 4’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్కు వెళ్లనుందని తెలిసింది. ఇక కార్తీ నటించిన ‘సర్దార్ 2’ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండగా, ‘మార్షల్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.డబుల్ ధమాకా! ‘కాంతార, కాంతార: చాప్టర్ 2’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా తెలుగులో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ప్రశాంత్ శర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. రానా మరో కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.మరోవైపు అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేయనున్న ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. 18వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలోని బెంగాల్ ప్రావిన్స్ ప్లేస్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇందులో ఓ తిరుగుబాటు దళానికి చెందిన నాయకుడిగా రిషబ్ శెట్టి కనిపిస్తారట. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జై హనుమాన్’తో రిషబ్ బిజీగా ఉన్నారు. సో... అశ్విన్ గంగరాజుతో రిషబ్ శెట్టి చేయనున్న సినిమా సెట్స్పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందని ఊహించవచ్చు.నిశ్శబ్దం పెరిగేకొద్దీ... ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ రద్దు అయిందంటూ ఇటీవల నెట్టింట వార్తలు హల్చల్ చేయడం.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ చిత్ర నిర్మాణ సంస్థలు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఓ ఫొటోని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎన్టీఆర్ షేర్ చేసి, ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఆయన ఫొటో వైరల్గా మారింది. ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.హీరోగా హాస్యనటుడుచాలాకాలం హాస్య నటుడిగా కొనసాగిన సూరి మెల్లిగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. సూరి హీరోగా తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆర్. రవికుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విధంగా తెలుగులో సూరి చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రానుందని తెలిసింది.తెలుగులో బిజీ బిజీ ‘మహానటి, లక్కీభాస్కర్, కాంత’ వంటి చిత్రాలతో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి దర్శకురాలిగా పరిచయం అవుతుండగా ఇందులో శ్రుతీ హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాకు నిర్మాతలు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బలమైన ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఓ అమ్మాయి తన కలను నిజం చేసుకోవడానికి ఎంతటి సాహసం చేసిందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా ఎమోషనల్గా చూపించనున్నారట దర్శకుడు పవన్. అలాగే రవి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇంకా నాని నిర్మాతగా ‘కోర్ట్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన రామ్ జగదీష్ డైరెక్షన్లో దుల్కర్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా తెలుగు సినిమాలతో దుల్కర్ సల్మాన్ బిజీ బిజీగా ఉంటున్నారు. అటు మలయాళంలోనూ ఆయన హీరోగా ‘ఐ యామ్ ది గేమ్’ సినిమా రూపొందుతోంది. షూటర్ విశ్వనాథ్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే మన హీరోనే అని ఫీలవుతుంటారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ తెలుగులో అనువాదం అవుతుంటాయి. ఇదిలా ఉంటే... సూర్య తెలుగులో స్ట్రయిట్గా ‘రక్త చరిత్ర 2’ (2010) అనే సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా మరో తెలుగు సినిమా చేస్తున్నారు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా. కోలీవుడ్ హీరో ధనుష్తో ‘సార్’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి, ఈ ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో షూటర్ సంజయ్ విశ్వనాథ్గా సూర్య నటిస్తున్నారు. హీరోయిన్గా మమితా బైజు కనిపిస్తారు.రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ విశ్వనాథ్ కన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుంటుంది. ఈ సమస్య నుంచి సంజయ్ ఎలా బయటపడ్డాడు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది.సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుంది. సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు’ మే 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటాయని, రిలీజ్ డేట్పై కూడా స్పష్టత వస్తుందని ఊహించవచ్చు. ఇంకా... ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాల ఫేమ్ చందు మొండేటి సైతం సూర్యను కలిసి, కథ వినిపించారని తెలిసింది.ఒకేసారి రెండు సినిమాలుఅల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్ బన్వర్ సింగ్ షెకావత్గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఫాహద్ ఫాజిల్ హీరోగా తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాల ప్రకటనలు వచ్చాయి. ఈ చిత్రాలు ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’. ఈ రెండు చిత్రాలు రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ (రాజమౌళి తనయుడు) నిర్మిస్తున్నవే. ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా, ‘ఆక్సిజన్’ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. భావోద్వేగాలతో ముడిపడిన ‘ఆక్సిజన్’ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది.ఈసారి హీరోగా..! తమిళ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘ఉప్పెన, సైరా నరసింహారెడ్డి’ వంటి తెలుగు చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించారు. కొంత కాలంగా ఆయన హీరోగా నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతున్నాయి. కాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ అనే సినిమా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టబు, సంయుక్తా మీనన్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ కొండ్రల్ల ఈ సినిమాను నిర్మించారు. త్వరలోను రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్తమిళంలో సూపర్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో చేసిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి సినిమాలు తెలుగులో విడుదలై, సూపర్ హిట్గా నిలిచాయి. ప్రదీప్ గత చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండో తమిళ సినిమా ఇది. అయితే ఈసారి ఇదే నిర్మాణ సంస్థలో ప్రదీప్ హీరోగా ఓ తెలుగు సినిమా రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. చంద్రశేఖర్ ఏలేటి ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేశారని, ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇప్పుడు చాలా సినిమాలు ఒక భాషలో తెరకెక్కి, ఇతర భాషల్లో అనువాదం అవుతున్నాయి. కొన్ని సినిమాలు ద్విభాషా చిత్రాలుగా కూడా ఉంటున్నాయి. ఈ రకంగా పరభాషా హీరోలు టాలీవుడ్లో సినిమాలు చేసినప్పుడు, ఈ చిత్రాలు ఆ హీరోల మాతృభాషలోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇలా హీరోలకు రెండు విధాలా కలిసొస్తుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరూ ఒక సినిమాను పూర్తి చేసేందుకు దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. సినిమా భారీతనాన్ని బట్టి ఎక్కువ సమయం పడుతోందని ఊహించవచ్చు. పైగా ఒక సినిమా సెట్స్లో ఉండగా ఇంకో సినిమా చేసే వీలు కొందరు హీరోలకు ఉండటంలేదు. పరభాషల హీరోలతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ అసోసియేట్ కావడానికి ఇదొక కారణం అనే ఊహాగానాలు ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
తమిళంలోకి మాస్ ఎంట్రీ
లవర్ బాయ్గా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రాజ్ తరుణ్, ఆరి అర్జునన్, అమ్ము అభిరామి, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రఫ్ నోట్ ప్రోడక్షన్ సంస్థ తమిళ–తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మిల్టన్ మాట్లాడుతూ– ‘‘కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలను మేళవించిన ఈ మూవీ ఆడియన్స్కి మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది. స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ మా చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించారు’’ అని పేర్కొన్నారు. -
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'రష్మిక వెడ్డింగ్.. మాకు చాలా తక్కువ టైమ్ ఇచ్చింది'
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఈ ఏడాది తెలుగింటి కోడలిగా ఎంట్రీ ఇచ్చింది. రాజస్థాన్లో ఉదయ్పూర్లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే ఈ పెళ్లిలో రష్మికను ముస్తాబు చేసిన మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఎక్కువ మేకప్ వద్దని చెప్పిన రష్మిక.. మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారని తెలిపింది. కేవలం 40 నిమిషాల్లో రెడీ చేయాలని సూచించారని వెల్లడించింది. కానీ రష్మిక ఇచ్చిన టైమ్లో మా పని పూర్తి కాలేదని.. దాదాపు 90 నిమిషాలు పట్టిందని తన్వీ వివరించింది.ఆమె అనుకున్న టైమ్ కన్నా ఆలస్యంగా రావడం వల్లే మాకు సమయం తగ్గించారని తన్వీ పేర్కొంది. పెళ్లిలో తాను చాలా సింపుల్గా, నేచురల్గా కనిపించాలని మాతో చెప్పిందని మేకప్ ఆర్టిస్ట్ వెల్లడించింది. కనీసం కాటుక కూడా పెట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదని తెలిపింది. మేము కూడా రష్మిక చెప్పనట్టే చేశామని.. కానీ ఇంతలా మాకు ప్రశంసలు వస్తాయని అనుకోలేదని చెప్పింది. రష్మిక హీరోయిన్ కావడంతో మేకప్, హెయిర్ స్టైల్పై ఆమెకు ఫుల్ క్లారిటీ ఉందని తన్వీ అన్నారు.ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణబాలితో పాటు మైసా అనే చిత్రంలో నటిస్తున్నారు. రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన కనిపించనున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రమిదే కావడం విశేషం. ఈ మూవీని 1854- 1978 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
అల్లు- అట్లీ రాకా.. ఆ స్టార్ హీరో ఓకే చెప్పారా?
అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాకా. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ లుక్లో ఐకాన్ స్టార్ తోడేలు లాంటి లుక్లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.900 కోట్ల భారీ బడ్జెట్తో సన్ పిక్చర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉండగా.. రాకాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. అట్లీతో జతకట్టి సూపర్ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్ ఈ మూవీలో కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న పాత్ర చేయడానికి బాలీవుడ్ బాద్షా ఇప్పటికే అంగీకరించారని సమాచారం. అట్లీతో షారూక్కు ఉన్న అనుబంధం వల్లే రాకా మూవీకి ఓకే చెప్పారని ఓ నివేదికలో వెల్లడైంది. అట్లీ తెరకెక్కించిన జవాన్లో షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సంగతి తెలిసిందే.అందువల్లే ఈ మూవీలో నటించడానికి షారూక్ ఖాన్ దాదాపు ఓకే చెప్పారని టాక్. ఇదే నిజమైతే జవాన్ తర్వాత మరోసారి అట్లీతో కలిసి పని చేయనున్నారు. ఈ విషయంపై షారుక్ టీమ్ కొందరు సంప్రదించగా.. వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే గతంలో అల్లు అర్జున్ 'జవాన్' చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించాల్సి ఉండగా.. పుష్ప: ది రూల్ సినిమా షెడ్యూల్ వల్ల కుదరలేదు. దీంతో 'రాకా' మూవీతోనైనా వీరిద్దరిని స్క్రీన్పై చూసే అవకాశం ఆడియన్స్కు దక్కనుంది. షారుక్ ఖాన్ రాకాలో అతిథి పాత్రలో కనిపిస్తే ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరగనుంది. -
లుక్ మార్చిన మెగా కోడలు.. నల్ల చీరలో మృణాల్
చీరలో కాదు గ్లామరస్ లుక్స్లో లావణ్య త్రిపాఠితమిళ న్యూఇయర్.. అమృత అయ్యర్ వీడియోరాజస్థాన్ ట్రిప్లో రుక్మిణి వసంత్ హ్యాపీస్నల్ల చీరలో నవ్వుతూ మాయ చేస్తున్న మృణాల్కొంటె చూపులతో రచ్చ చేస్తున్న డింపుల్మత్తెక్కించేలా శ్రీముఖి పోజులు.. చూస్తూ అలా View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) -
చిరు సినిమాతో బాలనటిగా ఎంట్రీ.. పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరం
సినిమాలోకి ఎంతోమంది వస్తుంటారు. అంతేమంది మెల్లగా తెరమరుగైపోతుంటారు. అయితే గుర్తింపు రాక సైడ్ అయిపోతే ఓకే గానీ ఫేమస్ అయినా సరే కొందరు మూవీస్ చేయడం తగ్గించేస్తుంటారు. ఈమె కూడా అలాంటిదే. ఎందుకంటే చిరంజీవి లాంటి స్టార్ హీరో సరసన నటించి నటిగా అరంగేట్రం చేసింది. ఇప్పుడు యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. మరి ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)పైన కనిపిస్తున్న నటి పేరు శ్రియ శర్మ. హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఈమె ఐదారేళ్లకే పలు యాడ్స్ చేసింది. అలా దర్శకుల దృష్టిలో పడి ఎనిమిదేళ్లకే నటిగా మారింది. చిరు 'జై చిరంజీవ' సినిమాతో బాలనటిగా అరంగేట్రం చేసింది. తర్వాత తమిళ, కన్నడ, హిందీలోనూ పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. తెలుగులో అయితే మహేశ్ 'దూకుడు', రామ్ చరణ్ 'రచ్చ', నాని 'ఎటో వెళ్లిపోయింది మనసు' తదితర మూవీస్లో కనిపించింది.అయితే గాయకుడు, నిర్మలా కాన్వెంట్ సినిమాల్లో హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకున్న శ్రియ.. ఇవి ఫ్లాప్ అయ్యేసరికి యాక్టింగ్ పక్కనబెట్టేసినట్లు తెలుస్తోంది. 2016లో చివరగా 'నిర్మలా కాన్వెంట్' మూవీలో కనిపించింది. అప్పటినుంచి కొత్తగా ఏ మూవీ లేదా యాడ్ గానీ చేయలేదు. ఇదే టైంలో రచయితగా మారి 'కర్మ బ్యాక్ ఫైర్డ్' అనే బుక్ రాసింది. రీసెంట్గా 29వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈమె, తన ఫొటోలని పోస్ట్ చేసింది. అలా మరోసారి సోషల్ మీడియా డిస్కషన్లోకి వచ్చింది. 20 ఏళ్ల పాటు సినిమాలు చేసిన శ్రియ.. భారతీయ భాషల్లో 150కి పైగా యాడ్స్లో నటించడం విశేషం.(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) -
‘తెరచాప’: మండుటెండలో చెప్పుల్లేకుండా షూటింగ్, చాలా కష్టపడ్డారు
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెరచాప’. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, జబర్దస్త్ అశోక్, నాగి కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీ కనకాల మాట్లాడుతూ..ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను.ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందరూ వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.‘సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాం. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాం. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను’ అని హీరో నవీన్రాజ్ శంకరాపు అన్నారు. -
ప్రభాస్ స్పిరిట్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
ప్రభాస్- యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ టాలీవుడ్లో వైరల్గా మారింది.రూ.250 కోట్ల ఆఫర్..!ఈ సినిమా డిజిటల్ రైట్స్కు సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఓటీటీ డీల్ భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ డీల్పై నిర్మాణ సంస్థ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ విడుదల కానుంది. -
రాకా.. బన్ని కెరీర్లోనే తొలిసారి!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయనకు తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారందరిని మెప్పించే కథలపైనే బన్నీ ఫోకస్ పెట్టాడు. అందులో ఒకటి రాకా. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న తొలి సినిమా ఇది. రూ. 900 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీ బర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. ఇందులో బన్నీ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన లుక్ విలన్ది. హీరో పాత్రకు సంబంధించిన లుక్ చాలా స్టైలీష్గా ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలు మొత్తం నలుగురు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా దీపికా పదుకొణె పేరు బయటకు వచ్చింది. మరో ముగ్గురు హీరోయిన్లలో రష్మిక, మృణాల్, జాన్నీ కపూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో రష్మిక అల్రేడీ బన్నీతో కలిసి పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో నటించింది. మృణాల్, జాన్వీలు తొలిసారి బన్నీతో స్క్రీన్ చేసుకుంటున్నారు. ఇలా ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించడం బన్నీ కెరీర్లోనే తొలిసారి. కథ డిమాండ్ మేరకే నలుగురిని తీసుకున్నారట. అంతేకాదు ఈ నలుగురి పాత్రలు కూడా సినిమాలో కీలకం అట. ఒకవైపు కావాల్సినంత గ్లామర్ని చూపిస్తూనే.. మరోవైపు కథలో కీలకంగా వ్యవహరించేలా వీరి పాత్రలను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ నలుగురూ బన్నీతో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. -
'ధురంధర్-2' హిట్ రీమిక్స్ వీడియో సాంగ్ విడుదల
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ సినిమా ధురంధర్-2.. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీ నుంచి వివాదస్పదమైన రీమిక్స్ సాంగ్ వీడియో వర్షన్ను విడుదల చేశారు. ధురంధర్-2 సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ (Hum Pyar Karne Wale) సాంగ్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సాంగ్ త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్కు సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం తుది తీర్పు కోసం వేచి చూస్తున్నారు. -
విజయ్కి బిగ్ షాక్.. లోకల్ ఛానల్లో ‘జననాయగన్’
తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్కు నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సుమారు ఐదు నిమిషాల నిడివి గల కీలక దృశ్యాలు, పాటలు ఇంటర్నెట్లో లీక్ కాగా, తాజాగా ఓ లోకల్ ఛానల్ ఏకంగా సినిమా మొత్తాన్ని ప్రసారం చేసింది. ఇంకా థియేటర్స్లో కూడా విడుదల కానీ ఈ సినిమా.. టీవీలో ప్రసారం చేయడం చిత్రబృందాన్ని షాక్కు గురి చేసింది.కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో ‘రాశి కేబుల్ టీవీ’ నెట్వర్క్ను నిర్వహిస్తున్న పళనిసామి అనే వ్యక్తి తన లోకల్ ఛానెల్లో ఏప్రిల్ 11 రాత్రి ఈ చిత్రాన్ని ప్రసారం చేశారు. ఇంకా థియేటర్స్లో విడుదల కాని సినిమా ఏకంగా టీవీలో ప్రసారం కావడాన్ని చూసి విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు షాకయ్యారు. ఈ సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పళనిసామిని అరెస్ట్ చేసి ప్రసారానికి వాడిన కంప్యూటర్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే సినిమా మొత్తం సదరు ఛానల్లో ప్రసారం అయిందని టీవీకే నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఆన్లైన్ లీకేజీకి సంబధించిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. -
టాలీవుడ్ బిగ్ పాన్- ఇండియా సినిమాలో అలియా భట్
బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ మరోసారి టాలీవుడ్కు రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు కథనాలు బాలీవుడ్ మీడియాలో రావడం విశేషం. రాబోయే పాన్-ఇండియా తెలుగు చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం అలియా భట్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ఖరారైతే ఇండస్ట్రీలో సంచలనంగా మారనుంది. ఆపై ఈ ప్రాజెక్ట్కు దేశవ్యాప్తంగా బలమైన ప్రచారం జరుగుతుంది. అయితే, ఏ సినిమాలో అలియా నటించనున్నారనే అంశం చాలామందిలో ఆసక్తి నెలకొంది.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్).. ఈ ప్రాజెక్ట్లో అలియా భట్ కీలకపాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే, ఆలియా కోసం ఒక కీలకమైన, పవర్ఫుల్ పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది . ఆలియా భట్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో సీతగా కనిపించిన విషయం తెలిసిందే.ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆల్ఫా’ లో కూడా ఆమె పవర్ఫుల్ పాత్రలో నటిస్తుంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రైవల్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్లో నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. -
ఆశా భోంస్లేకి నివాళి.. పాకిస్తాన్ ఛానల్కు నోటీసులు!
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణించారంటూ తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, ఆ సందర్భంగా భారతీయ వీడియో క్లిప్పింగులను ప్రదర్శించినందుకు పాకిస్తాన్కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'జియో న్యూస్' చిక్కుల్లో పడింది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఛానల్కు నోటీసులు జారీ చేసింది.తప్పుడు వార్తలు ప్రసారంలెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. శనివారం తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. సోమవారం ఆమె అంతక్రియలు జరిగాయి. అయితే ఆమె అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగానే.. ఆశా భోంస్లే మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్కు చెందిన 'జియో న్యూస్' కూడా ఈ పుకార్లను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది.పాటలతో పాటు వీడియో క్లిప్పింగులుఆశా భోంస్లే మరణవార్తను కవర్ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా ఛానల్లో ప్రసారం చేశారు. పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్ను ప్రసారం చేయొద్దు. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పెమ్రా సీరియస్ అవుతూ.. సదరు న్యూస్ ఛానల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.దీనిపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. తప్పేముంది?పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ స్పందిస్తూ.. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు, వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు, వారి కృషిని పునఃపరిశీలించి, కీర్తించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. నిజానికి, ఆశా భోస్లే వంటి గొప్ప కళాకారిణికి సంబంధించి, ఆమె కాలాతీతమైన, చిరస్మరణీయమైన పాటలను మనం పంచుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పంచుకోవాల్సింది. అయినప్పటికీ పెమ్రా (PEMRA), దీనిని పరిమితం చేయాలని నిర్ణయించుకుంది’ అని అబ్బాస్ ట్వీట్ చేశారు. భారతీయ కంటెంట్ను ప్రసారం చేశారన్న సాకుతో నోటీసులు ఇవ్వడాన్ని పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. కళాకారులకు నివాళులర్పించడాన్ని కూడా నేరంగా చూడటం ఏంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. భారతీయ సంస్కృతి, కంటెంట్ పట్ల పాక్ ఆర్మీకి ఉన్న భయానికి ఇది నిదర్శనమని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. PEMRA has issued a show-cause notice to Geo News for airing content related to the legendary subcontinent singer Asha Bhosle.It has always been customary to revisit and celebrate the work of iconic artists when reporting on them. In fact, for an artist of Asha Bhosle’s stature,… pic.twitter.com/AuhFPyGZCL— Azhar Abbas (@AzharAbbas3) April 13, 2026 -
న్యాయం చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి.. సజ్జనార్తో మంగ్లీ
ప్రముఖ సింగర్ మంగ్లీ, న్యాయవాది సుబ్బారావు వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా CP సజ్జనార్ను కలిశారు. ఇదే కేసులో పంజగుట్ట పోలీస్స్టేషన్లో ఇప్పటికే హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె తమ్ముడు మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు భాధితులతో కలిసి ఆధారాలు సమర్పించేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చారు. తన మాటతీరు చూసి పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. సుబ్బుకు 27 రీడింగ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.మైక్రోఫైనాన్స్ పేరుతో తాను డబ్బులు వసూలు చేశానని న్యాయవాది సింగపోగు సుబ్బు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని మంగ్లీ ఇప్పటికే పోలీస్స్టేషన్కు వెళ్లి తెలిపారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంటే అధారాలు చూపించాలని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా CP సజ్జనార్ను ఆమె కలిశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తన మీద దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, అందకు కారణమైన అడ్వకేట్ సుబ్బరావ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో మైక్రోఫైనాన్స్ పేరుతో మోసపోయిన బాధితులకి న్యాయంచేయాలని కోరింది. డబ్బు కాజేసిన అసలు వ్యక్తులను పట్టుకోవాలని మంగ్లీ కోరడంతో నెటిజన్లు కూడా ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు.నాకు ఎలాంటి వ్యాపారం లేదుతనకు పాటల ప్రపంచం పాటలు తప్ప వేరే వ్యాపారం లేదని మంగ్లీ తెలిపారు. న్యాయవాది అని చెప్పుకునే సింగపోగు సుబ్బు డబ్బు డిమాండ్ చేయడమే కాకుండా, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అతడు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని సత్యవతి ముడావత్ అలియాస్ మంగ్లీ పంజగుట్ట పోలీసులకు తన న్యాయవాదితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. డబ్బుల వసూలులో తన పాత్ర ఉందంటే తాను ఏ పోలీస్, కోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్ధమే అన్నారు. డబ్బుల కట్టలు ఉన్న వీడియోలో డబ్బు లెక్కపెట్టేది తన సోదరుడు కాదని, అనవసరంగా అతన్ని ప్రచారం చేస్తున్నారని అన్నారు. న్యాయవాది సుబ్బుకు భరతనాట్యం వస్తుందని, అతను బిగ్బాస్ వెళ్లాలని, ఫేమస్ కావాలని ఇప్పటికే ఫేమస్గా ఉన్న తనను వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 22వ తేదీన న్యాయవాది సుబ్బు అతని అనుచరులు తనను కలిసి సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన వీడియోలు డిలీట్ చేయాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, దానికి తాను ఒప్పుకోకపోవడంతో తనను బెదిరించడం, వేధించడం చేశారన్నారు. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
చిరంజీవి వారసత్వం, పిల్లల పెంపకంపై చరణ్ వ్యాఖ్యలు
మెగా హీరో రామ్ చరణ్ తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై స్టైలీష్గా కనిపించారు. ఈ క్రమంలోనే వారికి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో తన సినిమాలతో పాటు కుటుంబ విషయాలను పంచుకున్నారు. గతంలో ఇదే మ్యాగజైన్లో జూనియర్ ఎన్టీఆర్ మెరిశారు. తర్వాత ఆ గౌరవాన్ని అందుకున్న నటుడిగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.పిల్లలను స్ట్రాంగ్గా పెంచుతానురామ్ చరణ్- ఉపాసన దంపతులకు మొదట క్లింకార జన్మించగా రీసెంట్గా కవలలు (ఒక బాబు, ఒక పాప) కలిగిన విషయం తెలిసిందే.. శివ రామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అని నామకరణం కూడా చేశారు. అయితే, పిల్లల పెంపకంపై చరణ్ ఇలా చెప్పుకొచ్చారు. 'ఇంట్లో పిల్లలు చేసే అల్లరిని చూసి వాళ్లను మరింత ఎంకరేజ్ చేస్తాను. వారి విషయంలో నేను కాస్త రఫ్గానే ఆలోచిస్తాను. పిల్లలను దూకనిస్తాను.. వారు పడిపోయినప్పటికీ మళ్లీ నిలబడేలా చూస్తాను. మట్టిలో ఆటలాడినా.. ఎత్తుపల్లాలు ఎక్కినా నేను అసలు భయపడను. వాళ్లు చిన్నతనం నుంచే ధైర్యంతో పాటు సాహసం నింపుకొని పెరగాలని ఆశిస్తాను. కానీ, వాళ్ల అమ్మ చాలా సున్నితంగా చూసుకుంటుంది. పిల్లల విషయంలో ఎక్కువ కంగారుపడుతుంది. అయితే, వాళ్ల అమ్మ ఎప్పుడైనా తిట్టినప్పుడు క్లీంకార నా దగ్గరకు వచ్చేస్తుంది.' అని తెలిపారు.నాన్న చెప్పడంతోనే అయ్యప్ప దీక్షఅయ్యప్ప దీక్ష గురించి కూడా రామ్ చరణ్ పలు విషయాలు పంచుకున్నారు. నాన్న (చిరంజీవి) సూచనతో 17ఏళ్ల వయసులో తొలిసారి అయ్యప్ప దీక్ష ప్రారంభించినట్లు చరణ్ గుర్తుచేసుకున్నారు. తన ఆలోచనలతో పాటు క్రమశిక్షణను అయ్యప్ప దీక్ష పెంచిందని ఆయన అన్నారు. చిరంజీవి వారసత్వంతో పాటు కష్టపడి పనిచేయడం కూడా తాను తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఓటీటీలో ఇన్వెస్టిగేటివ్ కోర్ట్రూమ్ డ్రామా సినిమా
నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'అస్సీ' (Assi). హిందీ వర్షన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్రూమ్ డ్రామాను థియేటర్స్లో ప్రేక్షకులను మెప్పించింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించింది. మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కన్నీళ్లు తెప్పించే పాత్రలో కనిపించింది.'అస్సీ' (Assi) చిత్రం 2026 ఏప్రిల్ 17 నుండి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం పితృస్వామ్యం, సామాజిక ఉదాసీనత, బాధితులను నిందించడం, లైంగిక దాడి వల్ల కలిగే దీర్ఘకాలిక మానసిక క్షోభ వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఈ చిత్ర కథను గౌరవ్ సోలంకి, అనుభవ్ సిన్హా రచించి నిర్మించారు. -
నటి త్రిషకు వార్నింగ్.. రంగంలోకి దిగిన పోలీసులు
ఇటీవల సినీ సెలబ్రిటీ ఇళ్లలో బాంబు బెదిరింపు కాల్స్ అధికం అవుతున్నాయనే చెప్పాలి. రెండు రోజుల క్రితం స్థానిక పోయస్ గార్డెన్లోని నటుడు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబు పెట్టినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో హుటాహూటిన పోలీసులు తమ టీమ్తో పాటు పోయస్ గార్డెన్కు వెళ్లి సర్చింగ్ చేశారు. కొన్ని గంటల పాటు నటుడు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడ బాంబులు పెట్టిన జాడ తెలియకపోవడంతో అది బాంబు బూచి అని తెలిసింది. తాజాగా స్థానిక తేనాంపేటలోని నటి త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి ఫోన్కాల్ వచ్చింది. దీంతో స్థానిక తేనాంపేట పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు, డాగ్స్తో పాటు నటి త్రిష ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబులు కనిపించకపోవడంతో తప్పుడు సమాచారం ఇచ్చిన ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసిన వారిని పట్టుకునేపనిలో ఉన్నారు. -
ఆశా భోంస్లేకు కన్నీటి వీడ్కోలు
భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సోమవారం ముగిశాయి. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆశా భోంస్లే భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముంబైలోని లోయర్ పారెల్లోని ఆమె నివాసంలో ఉంచారు. మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిండే, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటులు ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్, వివేక్ ఒబెరాయ్, విక్కీ కౌశల్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ‘శివ సేన’ పార్టీ ఆధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వంటి వారితో పాటు పలువురు సినిమా, పొలిటికల్, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆశా భోంస్లే నివాసం నుంచి దాదర్లోని శివాజీ ΄పార్క్ శ్మశాన వాటిక వరకు భారీ జనసందోహం నడుమ ఆమె అంతిమయాత్ర కొనసాగింది. ఆశా భోంస్లేని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ‘ఆశా భోంస్లే అమర్ రహే’ అనే నినాదాలతో, అశ్రునయనాల నడుమ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. తల్లి ఆశా భోంస్లేకు కుమారుడు ఆనంద్ భోంస్లే అంత్యక్రియలు నిర్వహించారు. -
రజనీకాంత్, కమల్ హాసన్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా?
రజనీకాంత్ 173వ చిత్రం గురించి ఏ ముహూర్తాన అనుకున్నారో గాని అది ఇప్పటి వరకు సెట్ కావడం లేదు. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వం జైలర్–2 చిత్రాన్ని పూర్తిచేశారు. ఈ చిత్రం జూలై నెలలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తదుపరి నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంతో పాటు, కమలహాసన్తో కలిసి నటించే చిత్రానికి రజనీకాంత్ కమిట్ అయ్యారు. కమల్, రజినీ కలిసి నటించే చిత్రానికి దర్శకుడు నెల్సన్ పేరు ఖరారు అయ్యింది. అయితే దానికి ముందు రజనీకాంత్ హీరోగా కమలహాసన్ నిర్మించనున్న చిత్రానికే దర్శకుడు ఇంకా నిర్ణయం కాలేదు. మొదట ఈ చిత్రానికి సుందర్.సి పేరు ఖరారైంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాంటిది ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు దర్శకుడు సుందర్.సి ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో రజనీకాంత్ తనకు కథ పూర్తిగా సంతృప్తి కలిగిన తరువాతే షూటింగ్కు వెళ్తామని కమలహాసన్ ప్రకటించారు. దీంతో కథ సెట్ కాకపోవడంతోనే సుందర్.సి ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు అర్థమైంది. ఆ తరువాత ఈ చిత్రానికి డాన్ చిత్రం ఫేమ్ సిబి.చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం కథ సింగిల్ విన్న రజనీకాంత్, కమలహాసన్ బాగుందని ఈ దర్శకుడికి పచ్చజెండా ఉంటారని సమాచారం. ఈ చిత్రం అందరినీ సంతృప్తి పరుస్తుందని దర్శకుడు సిబి.చక్రవర్తి ఇటీవల లవ్ టుడే చిత్ర వేదికపై బలంగా చెప్పారు. అంతే కాకుండా ఈ చిత్రం మే నెలలో సెట్ పైకి వెళుతుంద న్న ప్రచారం జరుగుతోంది. అలాంటిది పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి సిబి.చక్రవర్తి కూడా వైదొలగినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచా రం వైరల్ అవుతోంది.అంతే కాదు ఈ చిత్రానికి డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారి ముత్తు దర్శకత్వం వహిస్తారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. -
డెకాయిట్ సంతృప్తి ఇచ్చింది: సుప్రియ
‘‘సినిమా అంటే ఒక మ్యాజిక్ ఉండాలి. అలాంటి మ్యాజిక్ ‘డెకాయిట్’ చిత్ర కథలో ఉంది. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించకుండా తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం. అన్నీ బడ్జెట్ పరంగా ఆలోచిస్తే కథకు న్యాయం చేయలేం. అలాగే మంచి సినిమాకి ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. ‘డెకాయిట్’ చిత్రానికి పతాక సన్నివేశమే అందం’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘డెకాయిట్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం సుప్రియ విలేకరులతో పంచుకున్న విశేషాలు....⇒ ‘డెకాయిట్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని ఇస్తోంది. హరి పాత్రలో శేష్ అద్భుతంగా నటించారు. మృణాల్ పోషించిన సరస్వతి పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ బలంగా ఉన్న సినిమా తీయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది. ‘డెకాయిట్’ చిత్రం ఆ సంతృప్తి ఇచ్చింది.⇒ డిస్ట్రిబ్యూషన్ పరంగా, నిర్మాణపరంగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నాం అంతే. నాగార్జునగారి వందో సినిమా గురించి, 2027 సంక్రాంతికి ఆయన హీరోగా రానున్న సినిమా గురించి ప్రస్తుతం నేను ఏం చెప్పలేను.. ఆయనే చెబుతారు. మా ఎస్ఎస్ క్రియేషన్స్లో మళ్లీ సినిమా చేసేందుకు కథలు వినాల్సి ఉంది.⇒ ఓ సినిమా థియేటర్స్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధనపై నిర్మాతలందరూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే నిర్మాతలు–ఎగ్జిబిటర్స్ మధ్య పర్సెంటేజ్ వి«ధానం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. రెంటల్ విధానంవైపే నేను మొగ్గు చూపుతాను. కాకపోతే సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం థియేటర్స్వారికి లాభం చేకూర్చేలాగా ఆలోచించాలి. ఈ అంశంపై నువ్వా? నేనా? అనే ధోరణితో కాకుండా మనం అనుకుని అందరం కలిసి మాట్లాడుకోవాలి. -
ప్రతి ఊరి కథ: మునిరాజు
సాయితేజ్, వేద జలంధర్ జోడీగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. వి. మునిరాజు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నిర్మించారు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వి.మునిరాజు విలేకరులతో మాట్లాడుతూ–‘‘దర్శకుడు కావాలనే కలతో ఇండస్ట్రీకి వచ్చి, ఆన్లైన్ ఎడిటర్గా కెరీర్ను ప్రారంభించాను. కొద్ది రోజుల తర్వాత మా ఊరు తిమ్మరాజుపల్లికి వెళ్లి అక్కడి ప్రజలతో ఓ డెమో సినిమా చేశాను. ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్లో ఉండగా కిరణ్ అబ్బవరంగారితో పరిచయం ఏర్పడింది.నా డెమో మూవీ గురించి ఆయనకు చెప్పాను. పూర్తిస్థాయిలో కథ డెవలప్ చేశాక ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రారంభం అయింది. ఇది ప్రతి ఊరి కథ. తిమ్మరాజుపల్లి అనే ఊరికి తొలిసారిగా ఓ టీవీ వస్తుంది. కానీ, ఆ టీవీ మాయం అవుతుంది. ఆ టీవీ ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. మంచి సస్పెన్స్ డ్రామాతో కథనం సాగుతుంది. మన పల్లెటూరి సంస్కృతి, ఊరి ప్రజలు, అహం, భావోద్వేగం, ప్రేమ వంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించాను. ప్రస్తుతం నా వద్ద వైవిధ్యమైన కథలు ఉన్నాయి’’ అని చెప్పారు. -
ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు: అనన్య
‘‘లీసా’ చిత్ర కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదనిపించింది. హీరోయిన్లుగా ఇలాంటి చిత్రాలు మాకు అరుదుగా దక్కుతుంటాయి. ‘లీసా’ నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లీసా’. జవహర్లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. సౌజన్య సతీష్ రెడ్డి మాసం కోప్రోడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు జవహర్లాల్ రాజు మాట్లాడుతూ–‘‘లీసా’లో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు’’ అని తెలిపారు. ‘‘ఈ స్టోరీ విన్న తర్వాత బలమైన ప్రాజెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని రామకృష్ణ ఐలా పేర్కొన్నారు. ‘‘లీసా’ హిట్ అయితే మాకు మరో సినిమాని పారితోషికం తీసుకోకుండా చేస్తానని అనన్య చెప్పారు’’ అన్నారు వెంకట్ దుగ్గిరెడ్డి. -
'డెకాయిట్'లో హీరోయిన్ మార్పు నిర్ణయం సరైనదేనా?
కొన్ని నెలల క్రితం 'డెకాయిట్' చిత్రంలో హీరోయిన్గా ఎంపికైన శృతి హాసన్ అనుకోకుండా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే తను స్వచ్ఛందంగా తప్పుకుందా లేక డెకాయిట్ టీమ్ తొలగించిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఆ పాత్రకు ఆమెకు సంబంధం లేకుండా పోయింది. వెంటనే ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్ను తీసుకున్నారు.అయితే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత, మృణాల్ పోషించిన "సరస్వతి" పాత్రపై చర్చలు మొదలయ్యాయి. శృతి అభిమానులు ఈ పాత్రను ఆమె మరింత బాగా పోషించి ఉండేదంటున్నారు. కానీ తెరపై మృణాల్ నటన చూసిన ప్రేక్షకులు మాత్రం ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో డెకాయిట్ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని వంద శాతం సమర్థిస్తున్నారు.నటనలో శృతిని తక్కువ చేసి చూడలేం. తను కూడా ఈ పాత్రను బాగా చేసి ఉండేది. కానీ ప్రేక్షకులు ఆమెను తెరపై చూడలేకపోయారు. ఆ అవకాశాన్ని మృణాల్ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. సినిమాలో శృతి లేని లోటును మృణాల్ తీర్చిందనే చెప్పాలి. మొత్తానికి శృతి హాసన్ ఒక మంచి పాత్రను మిస్ అయింది. అదే సమయంలో మృణాల్ ఠాకూర్ తన కెరీర్లో మరో బలమైన పాత్రను సంపాదించుకుని ఆ పాత్రకు న్యాయం చేసింది. -
'అలా అయితేనే ఒప్పుకుంటా': అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల హీరోయిన్గా వస్తోన్న మూవీ "లీసా". సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ హైదరాబాద్లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..' నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేది చూసుకుంటా. డిఫరెంట్గా ఉంటేనే ఆ మూవీని ఒప్పుకుంటా. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ నేను ఎప్పుడూ చేయలేదనిపించింది. ఈ సినిమాలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. లీసా మూవీలో నటిస్తున్నప్పుడు నటిగా కొత్తదనాన్ని ఫీలయ్యా. హీరోయిన్స్గా మాకు అరుదుగా ఇలాంటి చిత్రాలు దక్కుతుంటాయి. డైరెక్టర్ జవహర్ లాల్ రాజు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా షూట్ చేసేవారు. సతీష్ రెడ్డి బ్యూటిపుల్ విజువల్స్ అందించారు. లీసా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.దర్శకుడు జవహర్ లాల్ రాజు మాట్లాడుతూ..' లీసా సినిమాలో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు.ఈ సినిమా చూస్తూ షాక్ అవుతారు. ఈ సినిమాకు సతీష్ రెడ్డి అన్న బ్యాక్ బోన్లా నిలిచారు. మా ప్రొడ్యూసర్స్కు సినిమా మేకింగ్ మీద మంచి ప్యాషన్ ఉంది. అనన్య ఫర్మామెన్స్ మీ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమా మేకింగ్ క్రమంలో నాకు సపోర్ట్గా నిలిచిన అందరికీ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, దశరథ్, కిషోర్ దాస్, రవిరెడ్డి , సత్యశ్రీ, మాసం రత్నాకర్ రెడ్డి, హను శ్రీ, గీత, భాను కీలక పాత్రల్లో నటించారు. -
విష్ణు ప్రియ వివాదం.. మొహం చాటేసిన యాంకర్..!
టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ పేరు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై . ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అంశంపై ఆమెను మీడియా ప్రశ్నించేందుకు యత్నించగా మొహం చాటేసుకున్నారు. మీరు ఎంత డబ్బులు సంపాదించారని కొందరు ఆమెను అడిగారు. దీంతో తన చేతులను మొహానికి అడ్డుగా పెట్టుకుని.. మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అసలేం జరిగిందంటే?..ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Anchor :- #VishnuPriya గారిని ఎంత డబ్బులు సంపాదించారు#VishnuPriya : “Mummy” pic.twitter.com/zo5rP9h3w4— Milagro Movies (@MilagroMovies) April 13, 2026 -
'బావ బావ అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే'.. రవితేజ వారసుడి లవ్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి బావ బావ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. బావ, మరదళ్ల లవ్ సాంగ్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను ప్రశాంత్ ఆర్.విహారి కంపోజ్ చేశారు.కాగా.. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఓ ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మ ఎలా కాపాడిందనే కోణంలో కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
ట్రెండింగ్ బ్యూటీ చీర కడితే.. చిచ్చుబుడ్డి జోనిత ఇలా!
బ్లాక్ డ్రస్లో రచ్చ లేపుతున్న తృప్తి దిమ్రిగోవాలో 'చిచ్చుబుడ్డి' సాంగ్ ఫేమ్ జోనితా గాంధీబైక్తో అనన్య నాగళ్ల గ్లామరస్ పోజులుపింక్ డ్రస్లో మాయ చేస్తున్న రీతూ చౌదరిచీర కట్టిన ట్రెండింగ్ బ్యూట జైన్ మేరీ ఖాన్చీరలో క్యూట్నెస్ పంచేస్తున్న శివానీ నాగారం View this post on Instagram A post shared by Priyanka Jawalkar ✶ (@jawalkar) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
అడివి శేష్ డెకాయిట్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం డెకాయిట్. ఈ నెల ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఓవరాల్గా చూస్తే మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. ఈ చిత్రం ఆదివారం రోజు రూ. 6.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విదేశీ మార్కెట్లోనూ రాణిస్తోంది. సండే ఒక్క రోజే రూ. 2.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ వసూళ్లు ఇప్పటివరకు రూ. 11.65 కోట్లకు చేరుకున్నాయి.ఇక ఇండియా వ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే రూ. 23.12 కోట్ల గ్రాస్ సాధించగా.. రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అడివి శేష్ నటించిన హిట్-2తో పోలీస్తే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా డకాయిట్ ముందంజలో ఉంది. హిట్-2 విడుదలైన మూడు రోజుల్లోనే భారతదేశంలో రూ. 16.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా.. అదే సమయంలో డెకాయిట్ రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. కాగా.. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించగా.. మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.. -
ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా
రెండు నెలల క్రితం 'ఫంకీ'తో వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాలు సెట్స్పై ఉండగా తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఎన్టీఆర్తో 'దేవర' తీసిన నిర్మాణ సంస్థలో నటించేందుకు సిద్ధమైపోయాడు. ఈ మూవీ అధికారికంగా సోమవారం లాంచ్ అయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఐదేళ్ల క్రితం అల్లు అర్జున్-కొరటాల శివ కాంబోలో సినిమాని ప్రకటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువసుధ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ.. దాన్ని అలా పక్కనబెట్టేసి ఎన్టీఆర్-కొరటాల శివతో 'దేవర'ని అనౌన్స్ చేసింది. 2024 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీని సీక్వెల్ అప్పుడు ఇప్పుడు అంటున్నారు గానీ అసలు వస్తుందా రాదా అనేది తెలియట్లేదు. అదలా ఉండగానే విశ్వక్ సేన్తో ఈ సంస్థ, కొత్త మూవీ ప్రకటించింది.రొమాంటిక్ కామెడీ స్టోరీతో తీసే ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకుడు. కొరటాల శివనే ఈ మూవీకి క్లాప్ కొట్టారు. ఇకపోతే 'దేవర' రిలీజైన దగ్గర నుంచి కొరటాల ఖాళీగానే ఉన్నారు. దేవర సీక్వెల్ చేస్తారా వేరే హీరోతో మూవీస్ ఏమైనా చేస్తారా అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు.(ఇదీ చదవండి: హీరో రామ్కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా?)The journey begins with divine blessings ✨Production No.3 of @YuvasudhaArts starring ‘Mass Ka Das’ @VishwakSenActor, a new-age rom-com, is officially launched ❤🔥▶️ https://t.co/K7l4o1nisTDirector – @RajathDirProducer – #SudhakarMikkilineniAn auspicious pooja ceremony… pic.twitter.com/AjVTprZ4Ep— Yuvasudha Arts (@YuvasudhaArts) April 13, 2026 -
హీరో రామ్కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా?
తెలుగు హీరోల్లో బ్యాచిలర్స్ అనుకున్న వాళ్లకు కూడా ఒక్కొక్కళ్లకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ప్రభాస్, రామ్, సాయిధరమ్ తేజ్ లాంటి కొందరు మాత్రమే ఇంకా సింగిల్గా ఉన్నారు. వీళ్లలో ప్రభాస్ చేసుకుంటాడా అంటే సందేహమే. సాయిధరమ్ తేజ్ మాత్రం ఈ ఏడాదో వచ్చే ఏడాదో శుభవార్త చెప్పేలా ఉన్నాడు. రామ్ మాత్రం ఇప్పుడు తన సింగిల్ స్టేటస్, పెళ్లి వాటిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా ఉండటం అలవాటుపడ్డా. ఖాళీ టైంని ఒక్కడినే ఆస్వాదిస్తుంటా. స్నేహితులు, మిగతా వాళ్లతో గడపటం ఇష్టమే కానీ నాకోసం నేను టైమ్ కేటాయించుకోవడంలో ఆనందముంది. ఆ ఏకాంతం నాకు ఎంతో రిలాక్స్గా అనిపిస్తుంది. ఎవరైనా నా జీవితంలోకి వస్తే వాళ్లతో సమయం గడిపేందుకు సిద్ధమే. రాకపోయినా ఒంటరిగా సంతోషంగా ఉంటాను. ఇదేదో కావాలని తీసుకున్న నిర్ణయమైతే కాదు' అని రామ్ చెప్పుకొచ్చాడు.రామ్ మాటల బట్టి చూస్తుంటే జీవితాంతం సింగిల్గానే ఉండిపోతాడేమో అనిపిస్తుంది. ఇతడి గత సినిమా 'ఆంధ్ర కింగ్ తాలుకా' టైంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు రామ్ మాటల బట్టి చూస్తుంటే అవన్నీ ప్రమోషన్స్ కోసం సృష్టించినట్లే అనిపిస్తున్నాయి.ఇకపోతే ఇండస్ట్రీలో వందలాది మందితో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. అది తప్పదని చెబుతూనే, అందరి మధ్య కూడా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని చెప్పుకొచ్చాడు. లాక్డౌన్లో ఏడాదిన్నర పాటు ఒంటరిగానే బతికానని గుర్తుచేసుకున్నాడు. (ఇదీ చదవండి: రష్మి కాదు మరో యాంకర్తో సుడిగాలి సుధీర్ డేటింగ్?) -
రష్మి కాదు మరో యాంకర్తో సుడిగాలి సుధీర్ డేటింగ్?
జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం యాంకర్గా పలు షోలకు హోస్టింగ్ చేస్తున్న సుడిగాలి సుధీర్ గురించి ఇప్పుడో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. యాంకర్ దీపిక పిల్లితో ఇతడు ప్రేమలో ఉన్నాడని, వీళ్లిద్దరూ కలిసి విదేశాల్లో షికార్లు కూడా చేసేస్తున్నారని నిన్నంతా సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకున్నారు. దానికి కారణం ఓ ఫొటో. స్వయంగా దీపికనే దీన్ని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసేసరికి అంతా నిజమనే అనుకున్నారు. ఇంతలోనే దీపిక ట్విస్ట్ ఇస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: ఆమెతో బ్రేకప్.. గట్టిగా అరిచా, ఏంటేంటో చేసేశా : సుడిగాలి సుధీర్)సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే రష్మినే గుర్తొస్తుంది. ఎందుకంటే నిజంగా వీళ్లిద్దరూ ప్రేమికులే అన్నట్లు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించారు. తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చాలాసార్లు చెప్పినప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమికులే, త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అని నెటిజన్లు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లిద్దరూ ఇప్పటివరకు సింగిల్గా ఉండటమే దీనికి కారణమని చెప్పొచ్చు. అయితే సుధీర్.. యాంకర్ దీపిక పిల్లితో క్లోజ్గా ఉన్న ఫొటో బయటకొచ్చేసరికి అంతా షాకయ్యారు. ఇదసలు ఊహించనేలేదుగా అనుకున్నారు.ఇప్పుడు ఆ వైరల్ ఫొటోపై స్వయంగా దీపిక పిల్లి క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టింది. 'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయింది. గతరాత్రి నా స్టోరీలో షేర్ అయింది 'ఏఐ' జనరేటెడ్ ఫొటో. నా అనుమతి లేకుండా దాన్ని పోస్ట్ చేశారు. దీన్ని మీరెవరూ షేర్ చేయొద్దు. గత 24 గంటల్లో నా ఖాతాలో పోస్ట్ అయిన ఏ కంటెంట్తోనూ నాకు సంబంధం లేదు. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఈ సమస్యని పరిష్కరించే పనిలో ఉన్నా' అని దీపిక చెప్పుకొచ్చింది. సుధీర్-దీపిక కలిసి పలు షోలకు గతంలో హోస్టింగ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
పవర్ఫుల్గా గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ను తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో ఒక గ్లింప్స్తో మేకర్స్ షేర్ చేశారు. దర్శకుడు సంకల్ప్రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘భరతవర్ష’ (BharataVarsha) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఒక యోధుడి శూరత్వం ఏ రేంజ్లో ఉంటుందో చూపేందుకు గోపీచంద్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనకు జోడీగా రీతూ వర్మ నటిస్తున్నారు. ఒక గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్లోని ఈ 33వ సినిమాను పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. -
ముంబై, బెంగళూరు మ్యాచ్.. ఫైనల్గా జెర్సీ మార్చేసిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. తన భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్లతో పాటు కరీనా కూడా ముంబై జట్టు జెర్సీ ధరించి మద్ధతిచ్చారు. కుటుంబంతో కలిసి రావడంతో వారి వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ క్రమంలో ఆమెపై ట్రోల్స్ కూడా రావడం విశేషం.ఆదివారం జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను బెంగళూరు జట్టు మట్టికరిపించింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు కరీనా తన ఫ్యామిలీతో స్టేడియం బయట సందడిగా కనిపించారు, ఆ తర్వాత స్టాండ్స్లో కూర్చుని ఆటను ఆస్వాదిస్తూ కనిపించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత బయలుదేరి వెళ్తున్న సమయంలో మరిన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఒక ప్రత్యేకమైన క్లిప్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో, కరీనా అంతకుముందు మ్యాచ్ సమయంలో ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీకి బదులుగా, ఒక తెల్లటి టీ-షర్టు ధరించి కనిపించింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసిన తర్వాత, ఈ దృశ్యం ఆన్లైన్లో వైరల్ అయ్యింది. ముంబై జట్టు ఓడిపోయన తర్వాత ఆమె తన జెర్సీని తొలగించేశారని తెలుస్తోంది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.Kareena Kapoor came to the stadium wearing an MI jersey, but she removed it after MI’s loss against RCB, while Saif Ali Khan and Ibrahim were still seen in MI jerseys as they left Wankhede Stadium after the match 💔 pic.twitter.com/o7u6DlQpWd— Tejash (@Tejashyyyyy) April 13, 2026 -
'పెద్ది' సర్ప్రైజ్.. పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్తో సినిమా
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘పెద్ది’. కొద్దిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ బజ్ను క్రియేట్ చేసింది. దీంతో పెద్ది రాక కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడైంది. సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్న ఈ అప్డేట్ చాలామందిలో ఆసక్తిని పెంచుతుంది.గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'పెద్ది'లో సినీయర్ నటుడు సాయికుమార్ నటిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఒక అభిమాని చిత్రీకరించిన వీడియోతో ఈ చిత్రంలో ఆయన కూడా భాగమని వెల్లడైంది. పదేళ్ల క్రితం విడుదలైన 'ఎవడు' తర్వాత రామ్ చరణ్తో ఆయన తిరిగి కలవడం ఇదే మొదటిసారి. ఈ వార్త అభిమానులను ఉత్సాహపరుస్తున్నప్పటికీ, ఆయన పాత్ర వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఈ అంశం పెద్దిపై మరింత క్రేజ్ పెంచుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణపు చివరి దశలో ఉంది. ఇంకా ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించాల్సి ఉంది. అది పూర్తయిన తర్వాత, చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ఘనంగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల కానుందని ప్రకటించారు. అయితే, మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉంది. -
రూమర్స్ వేళ.. ఎన్టీఆర్ పవర్ఫుల్ ఫోటో విడుదల
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ మూవీ షూటింగ్ మొదలయ్యి చాలా కాలమైంది. కానీ, ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. అయితే, ఈ చిత్రం గురించి ఇటీవల ఒక రూమర్ వైరల్ అయింది. డ్రాగన్ సినిమా షెడ్యూల్ రద్దయిందన్న వదంతులు వచ్చాయి. వాటిని చిత్ర నిర్మాతలు ఖండించారు. ఈ ఉత్సాహానికి మరింత జోడిస్తూ.. తాజాగా ఒక పవర్ఫుల్ జిమ్ ఫోటోతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆశ్చర్యపరిచారు.'నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది' అంటూ ఎన్టీఆర్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. విశాలమైన భుజాలు, సన్నని నడుముతో చక్కటి వి-టేపర్ ఫిజిక్ను తారక్ ప్రదర్శించారు. అతని వీపు కండరాలు చాలా బలంగా, స్పష్టంగా కనిపించాయి. క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజులో అతని చేతులు, భుజాలు చక్కటి ఆకృతితో ప్రత్యేకంగా నిలిచాయి. తారక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.మొత్తమ్మీద అతని రూపం మంచి ఫిట్నెస్ను ప్రతిబింబిస్తూ పదునైన, దృఢమైన రూపాన్ని చూపుతుంది. డ్రాగన్ మూవీలో యాక్షన్ సీన్స్ ప్రధానంగా ఉన్నాయని తెలిసిందే. ఆ పాత్ర కోసం సిద్ధమవడానికి అతను కఠోరమైన శిక్షణ, ఆహారం రెండింటిలోనూ తీవ్రంగా కృషి చేస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తుంది'డ్రాగన్' తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. అదే సమయంలో, 'దేవర 2' కూడా నిర్మాణ దశలోనే ఉంది, దాని షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని తారక్ సినిమాల నుంచి మరిన్ని అప్డేట్లు వెలువడే అవకాశం ఉంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్. The quieter it gets…the louder it’s about to be. ⚡🔥#NTRNeel @tarak9999 pic.twitter.com/NT0lPwa0eW— NTR Arts (@NTRArtsOfficial) April 13, 2026 -
'జన నాయగన్' సినిమా లీక్.. ఆరుగురి అరెస్ట్
విజయ్ నటించిన 'జననాయగన్' మూవీ ఆన్లైన్లో లీక్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. సెన్సార్కు ముందే ఇలా సినిమా లీక్ కావడంతో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. జననాయగన్ మూవీ లీక్ కారణమైన ఆరుగురిని తమిళనాడు సైబర్ క్రైమ్ అదుపులోకి తీసుకుంది. ఈ అంశంపై చిత్ర యూనిట్కు సంబంధించిన లాయర్ ఒక పోస్ట్ షేర్ చేశారు.జననాయగన్ సినిమా నుంచి లీకైన సీన్లను ఎవరైనా డౌన్లోడ్ చేసినా, షేర్ చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సినిమాను లీక్ చేసిన ఆరుగురిని సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే అరెస్టు చేసిందని లాయర్ పేర్కొన్నారు. క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫారమ్లతో పాటు టెలిగ్రామ్ ద్వారా హై డెఫినిషన్ ప్రింట్ను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసి, పంపిణీ చేసిన ఒక సమన్వయ పైరసీ నెట్వర్క్లో ఈ అనుమానితులు భాగమని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందో లేదో నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
మృణాల్ ఠాకూర్ను లెజెండరి హీరోయిన్లతో పోల్చిన నాగ్ అశ్విన్
సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఆమె మరాఠీ అమ్మాయని తెలిసినప్పటికీ అంతా తెలుగమ్మాయిలాగే భావిస్తారు. తాజాగా ఆమెపై దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. అడివి శేష్తో కలిసి మృణాల్ నటించిన చిత్రం ‘డెకాయిట్’ భారీ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.. దీంతో సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు.డెకాయిట్ మూవీ విజయోత్సవంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మృణాల్ ఠాకూర్ను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మృణాల్ అద్భుతమైన నటి అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమెలాంటి నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. సాధారణమైన పాత్రలు చేసి నీ స్థాయిని తగ్గించుకోవద్దు. లెజెండరీ అలనాటి హీరోయిన్లు స్మిత పాటిల్, మధుబాల తరహాలో గొప్ప పాత్రలు చేయాలని కోరుకుంటాను' అని అన్నారు. అదే సమయంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డను నాగ్ అశ్విన్ అభినందించారు. సుప్రియ స్కూల్లో తన సీనియర్ అని ఆమె ఇంత గొప్ప సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని ప్రశంసించారు.అడివి శేష్ కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా డెకాయిట్ నిలిచింది. రెండురోజుల్లోనే ఏకంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ నిర్మాత సుప్రియ అంటూ అడివి శేష్ తెలిపారు. అయితే, మృణాల్ ఈ సినిమాకి మరో బలం అంటూ గుర్తుచేశారు. -
సినిమా లీక్పై జన నాయగన్ హీరోయిన్ల కామెంట్స్
నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా, చివరి చిత్రం జన నాయకన్. పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమిత బైజు, ప్రియమణి తదితరులు నటించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిఎన్ పిక్చర్స్ సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సి ఉంది. అయితే, సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయిన ఈ చిత్రం ఇటీవల ఇంటర్నెట్లో లీక్ కావడం యావత్ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర కథానాయకుడు విజయ్ మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా మౌనం వహిస్తున్నారు. అయితే చిత్ర కథానాయకి పూజహెగ్డే, మమిత బైజు జననాయకన్ చిత్రం ఇంటర్నెట్ లో లీక్ అయిన ఘటన గురించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పూజా హెగ్డే సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ “ ప్రియమైన అభిమానులారా ఒక చిత్ర నిర్మాణం అనేది ఎంతోమంది ఎన్నో రోజుల శ్రమ. ధైర్యంతో కూడిన ప్రయత్నాలు, వ్యక్తిగత త్యాగాలు. అదే విధంగా మీకు మంచి అనుభవాన్ని అందించాలన్న నమ్మకంతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా షూటింగ్లో పాల్గొనే యూనిట్ సభ్యుల సమష్టి ప్రయత్న ఫలితం. అలాంటి మా జననాయక్ చిత్రం ఇంటర్నెట్లో రావడం నాకు మాత్రమే కాకుండా ఈ చిత్రంలో పనిచేసిన యూనిట్ సభ్యులు అందరికీ తీవ్ర మనోవేదనను కలిగించింది. ఈ చిత్రాన్ని మనందరం థియేటర్లో చూడటానికి కొంచెం వేచి చూద్దాం. జననాయకన్ చిత్రం కచ్చితంగా థియేటర్లో సరైన సమయంలో విడుదలవుతుంది. పైరసీని ఎప్పటికీ ప్రోత్సహించవద్దు ‘‘ అని పేర్కొన్నారు. నటి మమిత బైజు కూడా ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేశారు. ’’ పలువురి శ్రమ, కృషితో రూపొందిన చిత్రాన్ని చట్టవిరుద్ధంగా చూడటం వేదనను కలిగిస్తోంది. కాబట్టి జననాయకన్ చిత్రాన్ని అధికారిక పూర్వంగా విడుదలయ్యే వరకు వేచి చూద్దాం “ అని నటి మమిత బైజు పేర్కొన్నారు. కాగా జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ కావడానికి సెన్సార్ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇకపోతే ఈ విషయం గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారులు తీవ్రం విచారణను చేపట్టారు. -
విజయ్ జననాయగన్ లీక్ సీన్స్ కలకలం
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం 'జననాయగన్' పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి దాదాపు గంటకు పైగా కంటెంట్ లీక్ కావడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఫుల్ సినిమానే లీక్ అయినప్పటికీ వెంటనే దానిని అడ్డుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని క్లిప్పులు మాత్రం వాట్సాప్ ఫార్వార్డుల రూపంలో విస్తృతంగా వ్యాపించాయి. కాగా లీక్ అయిన వీడియోలు చూసి కొంతమంది సోషల్మీడియా జనాలు రివ్యూలు చెబుతున్నారు. అయితే లీక్ సీన్స్లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు-నటుడు అమీర్ తమను ఉగ్రవాదులుగా చూపించారు. ఇదేనా మీ రాజకీయం?.. అంటూ ప్రశ్నించారు. సినిమాలో ఇలాంటి రాజకీయ కోణం ఎక్కువగా ఉండటంతోనే ఇంతకాలం సెన్సార్ క్లియర్ కాలేకపోయిందని అమీర్ అనుమానం వ్యక్తం చేశారు. కానీ సగటు సినీ అభిమానులు మాత్రం లీక్ సీన్స్లను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో రాజకీయంగా ఈ లీకేజీ వ్యవహారం విజయ్ పాపులారిటీని మరింత పెంచుతుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే విజయ్ స్టార్ పవర్ వల్ల లీక్ క్లిప్పులు పాపులారిటీని పెంచినా, నిర్మాతలు మాత్రం భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. -
శ్రీలంక వెకేషన్లో హీరోయిన్ ప్రణీత.. హాఫ్ శారీలో సురేఖవాణి కూతురు..!
శ్రీలంక వేకేషన్లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రణీత..లంగా ఓణిలో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..లైట్ పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..బాలీవుడ్ భామ ఇషితా దత్తా హాట్ ఫోజులు..శారీలో ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ లుక్స్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
సింగర్ ఆశా భోస్లే.. ఆమె పాడిన తెలుగు పాటలేవో తెలుసా?
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇవాళ కన్నుమూశారు. శనివారం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచారు. వేల పాటలతో శ్రోతలను అలరించిన ఆశా భోస్లే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె మరణం పట్ల యావత్ సినీ లోకం నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా ఆశా పాడిన పాటలను అందరూ గుర్తు చేసుకున్నారు.ఆశా భోస్లే దాదాపు 20 భాషల్లో పాటలు పాడారు. హిందీతో పాటు తెలుగులోనూ ఆమె తన గాత్రం అందించారు. లతా మంగేష్కర్ సిస్టర్ అయిన ఆశా తెలుగులో పాడిన పాటలు పాడి ఆడియన్స్ను అలరించారు. ఆమె మరణం వేళ... తెలుగులో పాడిన పాటలు ఓ సారి గుర్తు చేసుకుందాం.జల్లంది మది (ప్రేమకు ప్రేమంటే తెలుసా)ఇసాలకిడీ (పవిత్ర బంధం)వెన్నెల (ఇద్దరు)నాలో ఊహలకు (చందమామ)ఆశా భోస్తే పాడిన తెలుగు పాటలివే..ఇది మౌనగీతం (పాలు నీళ్లు)జీవితం సప్త సాగర (చిన్ని కృష్ణుడు)శీతాకాలం ప్రేమకు (అశ్వమేథం)ఓ ప్రేమ (అశ్వమేథం) -
'దయచేసి అర్థం చేసుకోండి'.. సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతం
టాలీవుడ్ సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతమైంది. తనపై వస్తున్న అసత్య ప్రచారంపై తన బాధను వ్యక్తం చేసింది. ఎవరో వచ్చి నాపై ఆరోపణలు చేస్తే.. ఏది పడితే రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. కేవలం పాటే నా ప్రాణమని మంగ్లీ ఆవేదన తెలిపింది. నిజనిజాలు తెలుసుకోకుండా నా గురించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని కోరింది. నేను కూడా సోషల్ మీడియా నుంచే వచ్చానని.. కానీ అదే నాకు శాపంగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.ఆ వ్యక్తి కేవలం ఫేమస్ అవ్వడం కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నాడని మంగ్లీ అన్నారు. నన్ను, నా ఫ్యామిలీని రోడ్డుకు లాగకండని కోరింది. మీడియా అంటే తనకు చాలా గౌరవం ఉందని.. దయచేసి ఈ విషయంలో మీరు వెనక, ముందు చూసుకోవాలని సూచించింది. ఎవరెవరో నేనంటే పడని వాళ్లు.. నాపై ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. నాపై పార్టీ ముద్రలు వేయడంతో 2003 తర్వాత ఏ పార్టీకి కూడా తాను పాటలు కూడా పాడలేదన్నారు. -
OTT: హాయిగా అనిపించే, ఆహ్లాదం కలిగించే సినిమా కావాలా?
పెద్దవాళ్లకు మధ్య వయస్కులకు కొరియా ఒక దేశం అని మాత్రమే తెలుసునేమో గానీ నేటి యువత, టీనేజర్స్కు అదొక ఎమోషన్. కొరియన్ కల్చర్కు పట్టం కట్టే వెబ్ సిరీస్, కె–పాప్...వంటివి ఇప్పుడు భారతీయ యువతని ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద వినోదాలు. అలా మన యువత అభిరుచులలో అగ్రగామిగా మారిన ఆ కొరియన్ కల్చర్... బహుశా ఈ సినిమా కధకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు.విదేశీ కలల విహారం... ఓ చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి తన కలల్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లే సినిమా కథలు మనం గతంలో చూశాం. పడమటి సంధ్యారాగం...లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తూనే కొత్తగా అనిపించే సినిమా ‘‘మేడ్ ఇన్ కొరియా’’. తమిళనాడులోని అందాల ఊటీకి దగ్గరలో ఉన్న లవ్ డేల్ అనే చిన్న గ్రామానికి చెందిన షెన్బా అనే యువతి కలల కధే ఈ మేడ్ ఇన్ కొరియా. చిన్నప్పటి నుంచే కొరియా అంటే మక్కువ పెంచుకుంటూ వచ్చిన ఓ అమ్మాయి ఏదో ఒకరోజు అక్కడికి వెళ్లాలని కలలు కంటుంది. అయితే తాను ఆశించిన విధంగా కాకుండా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయి కొరియాలో అడుగు పెట్టాల్సి రావడం, అనుకోని పరిస్థితుల్లో ఒంటరిగా కనీసం మాట్లాడడానికి తనకు భాష కూడా రాని మనుషుల మధ్య గడపాల్సి రావడం...వీటి వల్ల ఆమె జీవితం ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుంది ఒంటరితనం నుంచి ఆత్మవిశ్వాసం వరకు ఆమె ప్రయాణం ఎలా సాగుతుంది? అనేదే ఈ కథ.కొన్ని నవ్వులు...కొన్ని భావోద్వేగాలు...కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, దాన్ని చెప్పే విధానం మాత్రం చాలా సేఫ్గా, ఎక్కడా రిస్క్ తీసుకోకుండా సాగుతుంది. ఇది కామెడీ సినిమా కాదు. అలాగే హెవీ మెలో డ్రామా కూడా ఉండదు. కొరియాలో షెన్బా కొత్త జీవితం ప్రారంభించే భాగాలు ఆసక్తికరంగా కొన్ని చోట్ల నవ్విస్తూ సాగుతాయి. అలాగే ప్రత్యేకంగా మంచాన పడి ఉన్న వృద్ధురాలితో పెరిగిన అనుబంధం వారిరువురి నడుమ ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ మనసును తాకుతాయి. యువత ఆశలకు, తల్లిదండ్రుల నమ్మకాలకు నడుమ సాగే వాగ్వివాదాలు ఎప్పుడూ ఉన్నవే అయినా ఇప్పటికీ ప్రస్తావనార్హమే కాబట్టి ఈ సినిమాలోనూ కొన్ని అలాంటి బలమైన సన్నివేశాలు ఉంటాయి. అవకాశం ఉన్నా సినిమాలో ఎవరినీ విలన్ని చేయకపోవడం హాయిగా అనిపిస్తుంది. అలాగే కధానాయిక పుట్టిన ఊరు లవ్ డేల్ కూడా ప్రకృతి రమణీయతతో అలరారుతూ మనల్ని ఆకట్టుకుంటుంది.ఓజీ చిత్రంలో మనకు సాదా సీదాగా కనిపించిన ప్రియాంక మోహన్ ఈ సినిమా ద్వారా తన నటనలోని సత్తాను మనకు ప్రదర్శిస్తుంది. ఓ అమాయక అబల అనే పరిస్థితి నుంచి ఆత్మవిశ్వాసం గల సబలగా మారే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన బలం కాగా ఇండో–కొరియన్ కల్చర్ మిక్స్ కొత్తగా అనిపించడం మరో బలం.అయితే కథలోని భావోద్వేగాల్ని లోతుగా అన్వేషించే ప్రయత్నం చేయకుండా, సింపుల్గా ముగించేయడం ఎమోషన్స్ని ఇష్టపడే ప్రేక్షకులకు కొంత మేర నిరాశ కలిగిస్తుంది. ప్రారంభంలో కధానాయికకు కొరియా అంటే ఎంత ఇష్టమో అనేది చెప్పడంలో పెట్టిన శ్రద్ధ...ఆమె కొరియా వెళ్లిన తర్వాత ఆమె పొందిన ఉద్వేగం గురించి చెప్పడం మీద పెట్టలేదు. మొత్తంగా చూస్తే ‘‘మేడ్ ఇన్ కొరియా’’ ఒక లైట్, ఫీల్ గుడ్ సినిమా. ఒక వీకెండ్లో సరదాగా కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూసిన ఫీల్ని పొందాలంటే నిస్సందేహంగా మేడ్ ఇన్ కొరియా బెస్ట్ ఛాయిస్. ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. -
Karmastalam: యోధుడిలా అరవింద్ కృష్ణ
అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. రాయ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్ను, మేకింగ్ వీడియోని షేర్ చేశారు.అరవింద్ కృష్ణ ప్రస్తుతం సూపర్ హీరో పాత్రలతో ఆడియెన్స్ను ఆకట్టునేందుకు రెడీ అవుతన్నారు. ఇలాంటి టైంలో ఓ యోధుడిలా ‘కర్మస్థలం’లో కనిపించబోతోన్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్, మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక సెట్లోనే అరవింద్ కృష్ణ చేస్తున్న వర్కౌట్స్, రిహార్సల్స్ అన్నీ కూడా ఎంతో నేచురల్గా ఉన్నాయి. గుర్రపు స్వారీ కూడా ఈ చిత్రంలో హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. విజువల్స్, బీజీఎం ఈ సినిమాను అదనపు ఆకర్షణ అయ్యేలా ఉంది. -
'అందుకే నాపై దుష్ప్రచారం'.. పోలీసులకు మంగ్లీ ఫిర్యాదు
టాలీవుడ్ సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది సుబ్బారావుపై కంప్లైంట్ ఇచ్చారు. తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సింగర్ మంగ్లీ తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. ఇటీవల న్యాయవాది సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు.ఆ డబ్బులు ఇవ్వనందుకే తనపై మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుబ్బారావు డబ్బులు డిమాండ్ చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని మంగ్లీ పోలీసులకు తెలిపారు. తనపై పెట్టిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని సింగర్ అన్నారు. కాగా.. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
నెంబర్వన్.. అల్లు అర్జున్ ఆలోచన అదేనా?
స్టార్స్ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ డమ్ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా మారుతోంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్ పరంగా చూసినా, అల్లు అర్జున్ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ. ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్ స్టార్ కాస్తా ఒక్క ఉదుటున నెం1 ఐకాన్ స్టార్గా చేసింది పుష్పరాజ్ పాత్ర. ప్రస్తుతం అల్లు అర్జున్ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్ సినిమా వండర్ అనీ త్వరలోనే మరో టాప్ హీరో నెం1 ఛెయిర్ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్ డమ్ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్ లాంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్కి కేరాఫ్గా నిలిచిన లోకేష్ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్ జోసెఫ్లను ఐకాన్ స్టార్ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్ల మిశ్రమాన్ని అందించడం ద్వారా భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్ విన్యాసాలకు కేరాఫ్ లాంటి ప్రశాంత్ నీల్ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్ కనగరాజ్ ల వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్ సక్సెస్కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్ వంటి సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు...లతో పాటు పలువురు టాప్ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది. -
'అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయాం'.. మెగాస్టార్, ఎన్టీఆర్ నివాళి
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె గాత్ర తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ.. భారతీయ సినిమాకు ఓ శాశ్వతమైన తోడుగా నిలిచిందని ట్వీట్ చేశారు. ఆమె ప్రతి పాటకు తీసుకొచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని.. బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని మెగాస్టార్ రాసుకొచ్చారు. భారతీయ సినిమా అత్యంత అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందన్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరు పోస్ట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ నివాళి..లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్ర బాధపడ్డానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన గాత్రం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణనాడిగా నిలిచిందన్నారు. ఆమె స్వరం లక్షలాది హృదయాలను తాకిందని.. ఆమె తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని వదిలివెళ్లారని సంతాపం వ్యక్తం చేశారు. అది ఎల్లప్పుడూ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకోవాలని.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) ఇవాళ కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. Growing up meant waking up to melodies that felt like home, and so many of them carried the voice of Asha Bhosle ji.From old radios in the morning to late-night songs playing softly in the background, she was always there, without us even realizing how deeply she shaped our… pic.twitter.com/OV8Ythx6ms— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) April 12, 2026 Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026 Deeply saddened by the news of Asha Bhosle ji’s passing. Her magical voice was the heartbeat of Indian cinema for decades and touched millions of hearts. She leaves behind a legacy that will live on for generations and will always be remembered with respect and love. My deepest… pic.twitter.com/U81F2NBBeD— Jr NTR (@tarak9999) April 12, 2026 -
మృణాల్.. టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకో : అల్లు అరవింద్
స్టేజ్పై సరదాగా మాట్లాడే టాలీవుడ్ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. ఓ సినిమా ఈవెంట్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సీతారామం ఫేం మృణాల్ ఠాకుర్ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.తాజాగా ఆయన అడివి శేష్-మృణాల్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్ తేజ్ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్ నవ్వుతూ అన్నాడు. #AlluAravind to #MrunalThakur,"You should marry somebody from here (Tfi ) and settle."We all know what happened when #AlluAravind said this on stage last time🤫😙 pic.twitter.com/3F9KQxvYft— MovieMind (@_MovieMind) April 12, 2026 -
చెల్లెలు ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
లెజెండరి సింగర్ ఆశా భోంస్లే ఆదివారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆమె అభిమానులు తన జీవిత ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన అక్క లతా మంగేష్కర్తో ఉన్న విభేదాన్ని షేర్ చేస్తున్నారు. ఒక కుటుంబంలో రెండు గానకోకిలలు గొంతెత్తి పాటలు పాడుతుంటే సంబరిపడిపోయిన ప్రేక్షకులు వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసి ఆందోళన చెందారు.అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు నిజమేనా..?లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇద్దరూ భారతీయ సంగీతంలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. అయితే వారి మధ్య గొడవలు అన్నది కొంతవరకు నిజం, కొంతవరకు అపోహలతో కూడిన విషయమని చెబుతారు. ఆశా భోంస్లే చిన్న వయసులోనే కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో లతా మంగేష్కర్ దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. ఆపై ఇద్దరూ ఒకే రంగంలో (ప్లేబ్యాక్ సింగింగ్) ఉండటం వల్ల సహజంగానే పోటీ ఉండేది.లతా మంగేస్కర్ ఎక్కువగా ప్రధాన హీరోయిన్లకు పాటలు పాడితే.., ఆశా భోస్లే భిన్నమైన, వెరైటీ పాటలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కొంతమంది సంగీత దర్శకులు ఒక్కరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా ఇద్దరి మధ్య సమస్య వచ్చేది. అయితే, కొంతకాలం దూరం ఉన్న తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు. కుటుంబ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు గౌరవం వ్యక్తం చేశారు.1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్కా రీ బెహ్కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. కానీ, సుమారు పన్నేండేళ్ల క్రితం లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’లో ఆశా భోంస్లే ఒక పాటను పాడారు. ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్లు కలిసి 2014లో గానం చేశారు. ఆ సమయంలో తన సోదరి గురించి లతా మంగేష్కర్ ఇలా అన్నారు ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. లతా మంగేష్కర్ 2022లో కోవిడ్-19, న్యుమోనియా సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే మరణించారు. -
పిల్లలను ఎలా పెంచాలి?..ఆలియాకు సద్గురు సలహా ఇదే
ఆమె ఒక అగ్రగామి బాలీవుడ్ ప్రముఖుడి కుమార్తె..ఆ తర్వాత అందాల బాలీవుడ్ నటి బోలెడన్ని విజయాలు చవిచూసింది. బోలెడు మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే మాత్రమేం... నిన్నటి బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ గత కొన్ని వారాలుగా అయోమయానికి గురవుతోంది. తన నాలుగేళ్ల చిన్నారిని ఎలా పెంచాలో తెలీక సతమతమవుతోంది. గత నవంబర్ 6, 2022న మాతృత్వంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి, ఆమె తాను చదువుతున్న పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను ఇన్ స్ట్రాగామ్ వేదికగా తరచు పంచుకుంటూ ఉండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలోనే ఆమె తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ (సద్గురు)తో సంభాషణలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సద్గురు ముందు తాను ఎదుర్కుంటున్న సమస్య... పిల్లల పెంపకంపై సలహా ఇవ్వమని కోరడం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. అయితే దానికి సద్గురు ఇచ్చిన సలహా ఇంటర్నెట్ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెఐటిఓ) చెన్నైప్లస్ ఆధ్వర్యంలో ఇన్ కన్సర్వేషన్ విత్ మిస్టిక్ అనే థీమ్తో నిర్వహించిన ఈకార్యక్రమానికి హాజరైన ఆలియా భట్, సద్గురువుతో ఒక వ్యక్తి ఎంత సమయం నిద్రపోవాలి అనే అంశం మొదలుకుని ప్రధానంగా పిల్లల పెంపకం, ఇంటర్నెట్ యుగం, ట్రోల్స్, వైఫల్యం పట్ల భయం, అనే విషయాలపై చర్చించారు.ఈ సందర్భంగా ‘మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తమ లాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?‘ అని ఆలియా భట్ సద్గురువును అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ‘ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు.‘ ఆందోళన చెందే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వారు అంతగా ఆందోళన చెందడం ద్వారా తమకు తామే హాని చేసుకుంటారు’’ అంటూ సద్గురు అలియాకు స్పష్టం చేశారు. దీనికి స్పందిస్తూ, ఆలియా భట్, ‘పిల్లల పెంపకం అనే ఆందోళనను తల్లిదండ్రుల్లో తొలగించగలమని నేను అనుకోను. మీరు కూడా దీనిని అంగీకరిస్తారని భావిస్తున్నాను,‘ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె రాహాకు ఏం నేర్పించాలనే అంశంపై కూడా తాను మధనపడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో సద్గురు స్పందిస్తూ పిల్లలకు సంతోషంగా ఉండడం సహజంగానే వస్తుందని వారికి మీరు నేర్పించేంది ఏముంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించారు. మీ కుమార్తె రాహాకు కష్టపడి ఏదేదో నేర్పించే బదులు సంతోషంగా ఎలా జీవించాలో తన కుమార్తె రాహా నుంచి నేర్చుకోమని సద్గురు ఆలియా భట్కు ఎదురు సలహా ఇచ్చారు. అనవసరమైన హడావిడి లేని తల్లిగా ఉండమని,జీవితంలోని ఆనందాలు ఎలా ఆస్వాదించాలో తన కుమార్తె నుంచి నేర్చుకోమని ఆలియా భట్కు సద్గురు సూచించారు. ఆ సంభాషణలో భాగంగా అలా నేర్చుకోవడం ఎలా అనేది కూడా సద్గురు ఆమెకు వివరించారని ఆయన అధికారిక యూట్యూబ్ ఛానెల్ వెల్లడించింది. ఏది ఏమైనా పిల్లల పెంపకంపై నిత్యం ఆందోళన చెందే తల్లిదండ్రుల ఆలోచనలకు అద్దం పడుతూ అలియాభట్ వేసిన ప్రశ్నకు సద్గురు ఇచ్చిన సమాధానం ఓ పెద్ద చర్చనే లేవనెత్తిందని చెప్పాలి. -
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత
లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆశా భోంస్లే.. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1950వ దశకంలో బాలీవుడ్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆశా భోంస్లే 1952లో సంగ్దిల్ చిత్రంతో గుర్తింపుపొందారు.1970 దశకంలో పియా తు అబ్ తో ఆజా , దమ్ మారో దమ్ , చురా లియా హై తుమ్నే పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా”, “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” వంటి పాటలు నేటికీ ఎవర్గ్రీన్ హిట్స్గా నిలిచాయి. ఆపై ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోంస్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” “యే మేరా దిల్” వంటి డ్యాన్స్ నంబర్లతో అప్పట్లోనే సంచలనం సృష్టించిన ఆశా భోస్లే కమర్షియల్ పాటలకే పరిమితం కాకుండా గజల్స్ పాడి జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. 90వ దశకంలో ‘రంగీలా’ చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆశా భోంస్లే.. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందారు. -
నా కూతురి రూపంలో ఆమె తిరిగొచ్చింది.. పూర్ణ ఎమోషనల్
హీరోయిన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ.. గత నెలలో మరోసారి తల్లయింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ చిన్నారి నూలేకెట్టి వేడుకని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ విషయాన్ని చెప్పిన పూర్ణ.. తన కూతురు ఫొటోలని తొలిసారి పంచుకుని, ఆమెకు పెట్టిన పేరు గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు)'జమీలా అనేది నా అమ్మమ్మ పేరు. చిన్నప్పుడే కోల్పోయిన ఆమె జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు గనక కూతురు పుడితే ఆమె పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా కుమార్తెని ఒడిలోకి తీసుకున్న ఆ క్షణం.. అమ్మమ్మ నా దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. పాప పుట్టడం మా కుటంబానికి అపారమైన ఆనందాన్ని తీసుకొచ్చింది' అని పూర్ణ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.పాప పుట్టన తర్వాత 28వ రోజున నూలేకెట్టి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారమని.. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారని.. హమ్దాన్ పెద్ద అన్నయ్యగా మారి కుటుంబంలో కొత్త బాధ్యతను స్వీకరించాడని పూర్ణ చెప్పుకొచ్చింది. 'దువా జమీలా'కి కుటుంబం ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాసుకొచ్చింది.కేరళకు చెందిన ఈమె.. సీమటపాకాయ్, అవును తదితర సినిమాలతో తెలుగులో గుర్తింపు సాధించింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ మూవీస్ చేసింది. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ, టీవీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. చివరగా 'అఖండ 2'లో కనిపించింది. వ్యక్తిగత విషయానికొస్తే 2022లో దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ని పెళ్లి చేసుకుంది. 2023లో ఈ దంపతులకు బాబు పుట్టగా, ఇప్పుడు పాప జన్మించింది.(ఇదీ చదవండి: 'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
'డెకాయిట్' రెండురోజుల కలెక్షన్స్
టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన చిత్రం డెకాయిట్.. ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీని దర్శకులు షానియల్ డియో తెరకెక్కించారు. తాజాగా రెండురోజుల కలెక్షన్స్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా అదే రేంజ్లో సత్తా చాటింది. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ మూవీలో ,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు.డెకాయిట్ చిత్రం రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రం విదేశాలలో కూడా బాగా రాణిస్తోంది, ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటింది. రాబోయే రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరగవచ్చని ఆశిస్తున్నారు. డెకాయిట్ చిత్రం బాగుందని ఇప్పటికే చాలామంది ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దని పోస్టులు షేర్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. దీంతో చాలా థియేటర్స్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో సత్తా చాటుతుంది. #Dacoit pulls off a massive heist at the box office, stealing audience love ❤️Collects ₹28+ CRORES GROSS worldwide in just 2 days 💥Don’t miss it in theatres near you 🤩Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/9NSGeIyELD— Annapurna Studios (@AnnapurnaStdios) April 12, 2026 -
ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు
తెలుగు యాంకర్ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై ఫిర్యాదు రావడంతోనే ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)అసలేం జరిగిందంటే?ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పలు షోలతో అలరించే విష్ణుప్రియ, కాసులకు కక్కుర్తి పడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే విష్ణుప్రియ ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు కేసు నమోదైంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్) -
కోలీవుడ్లో సీక్వెల్స్ జోరు.. లైన్లో పది హిట్ సినిమాలు
‘ముదల్ పగుది’ (ఫస్ట్ పార్ట్) అదిరింది. అయితే ఆ కథ అక్కడితో ఆగలేదు. కొనసాగించే స్కోప్ ఉంది. అంతే... ‘ఇరండామ్ పగుది ఇరుక్కు’ (సెకండ్ పార్ట్ ఉంది) అంటూ సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ ఇరండామ్ పగుది రెండింతల మజానివ్వాలని ప్రేక్షకులకు, ఆయా చిత్రాల హీరోల అభిమానులకు ఉంటుంది కదా. అది దృష్టిలో పెట్టుకునే మరింత జాగ్రత్తగా సీక్వెల్ కథలను సిద్ధం చేసుకున్నారు దర్శకులు. 2026–2027లో తమిళ ‘వెండి తిరై’ (వెండి తెర) బోలెడన్ని సీక్వెల్స్ చూడబోతోంది. చెప్పాలంటే... కొన్ని సినిమాలకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ తెలుగులోనూ విడుదలైంది. సో... ఇరండామ్ పగుది కూడా ఇక్కడ విడుదల కాకుండా ఉండదు. మరి... ఏయే సినిమాకి సీక్వెల్ రానుందో పడిక్కలాం (చదువుదాం) వాంగ (రండి). మరింత యాక్షన్ డోస్తో...టైగర్ ముత్తువేల్ పాండియన్ రాక కోసం అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముత్తువేల్ పాత్రను రజనీకాంత్ అంత స్టైలిష్గా చేశారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023)లో రజనీ పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివ రాజ్కుమార్ వంటి స్టార్స్ అతిథులుగా నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయింది. ఇక జైలర్గా రజనీ తనదైన స్టైల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం కన్నా మలి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రకు మరింత యాక్షన్ డోస్ పెంచి, రజనీని మరింత స్టైలిష్గా చూపించనున్నారు నెల్సన్. ఈ సీక్వెల్ కథ అంతర్జాతీయ క్రైమ్ నెట్ వర్క్ నేపథ్యంలో సాగుతుందని, ముత్తువేల్ పాండియన్ గతాన్ని కూడా చూపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్ 2’లోనూ మోహనల్ లాల్, శివ రాజ్కుమార్ కనిపించనున్నారు. విజయ్ సేతుపతి కూడా అతిథి పాత్ర చేశారు. అదనపు ఆకర్షణగా షారుక్ ఖాన్ కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. విద్యా బాలన్, మిథుర్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్ని మరింత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారన్నది ప్రస్తుత సమాచారం. తొలి భాగంలానే మలి భాగం కూడా అదే టైటిల్తో తెలుగులో విడుదల కానుంది. త్వరలో సెట్స్కి కంగువ 2గతం, వర్తమానం... ఇలా రెండు టైమ్లైన్స్లో సాగే చిత్రంగా ‘కంగువ’ (2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో కంగువాగా, ఫ్రాన్సిస్ థియోడోర్గా డ్యుయల్ రోల్లో కనిపించి, ఆకట్టుకున్నారు సూర్య. ‘కంగువ’ విడుదల సమయంలోనే సెకండ్ పార్ట్ ఉంటుందని చిత్రనిర్మాత జ్ఞానవేల్ రాజా స్పష్టం చేశారు. సీక్వెల్ కథ కూడా సిద్ధమైంది. గత ఏడాది చివర్లోనే క్లాప్ కొట్టి, చిత్రాన్ని ఆరంభిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగలేదు. త్వరలో చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది విడుదల చేయాలన్నది టీమ్ ప్లాన్. ఇదిలా ఉంటే... తొలి భాగం చివర్లో కార్తీ పాత్ర పరిచయం అవుతుంది. దాంతో ఈ సీక్వెల్ సూర్య, కార్తీ మధ్య సాగే భారీ యాక్షన్ మూవీగా ఉంటుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. తమిళ, తెలుగులో భాషల్లో తొలి భాగం విడుదలైనట్లుగానే ‘కంగువ 2’గా ఈ రెండు భాషల్లో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో సర్దార్ 2... 2027లో సెట్స్కి డిల్లీ ఒకటి కాదు... రెండు సీక్వెల్స్లో కనిపించనున్నారు కార్తీ. ఒకటి ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది అదే ‘సర్దార్ 2’. మరొకటి ‘ఖైదీ 2’. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. సర్దార్ ఎప్పుడు వస్తాడు? కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్దార్’ (2022) సూపర్ హిట్ అయింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీకి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘సర్దార్ 2’ రూపొందిన. నిజానికి ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది జూన్లో పూర్తయింది. డిసెంబరులో విడుదలవుతుందని చాలామంది ఊహించారు. కానీ, అది జరగలేదు. చివరికి ఈ ‘సర్దార్’ సమ్మర్కి వస్తాడనే టాక్ ప్రచారంలో ఉంది. అయితే ఏ తేదీకి వస్తాడు? అనే విషయం గురించి చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తొలి బాగంలో ఏజెంట్ సర్దార్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్గా డ్యుయల్ రోల్ చేసిన కార్తీ మలి భాగంలోనూ ఈ రెండు పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్లో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందని సమాచారం. తొలి భాగం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.రెండింతల యాక్షన్... ఎమోషన్ డిల్లీ అంటే ఎవరో ‘ఖైదీ’ (2019) సినిమా చూసినవాళ్లకి తెలుసు. ఆ సినిమాలో హీరో కార్తీ పాత్ర పేరు డిల్లీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని లోకేశ్ గతంలో పేర్కొన్నారు. అయితే ఇంకా పట్టాలెక్కకపోవడంతో ‘ఖైదీ 2’ లేదని చాలామంది ఫిక్స్ అయిపోయారు. మఖ్యంగా డిల్లీ పాత్రను చాలా ఇష్టపడిన కార్తీ అభిమానులను ఈ సీక్వెల్ ఆగిందనే వార్తలు నిరాశకు గురి చేశాయి. నిజానికి ఈ సినిమా ఆగిందని ప్రచారం జరగడానికి కారణం అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి లోకేశ్ కనగరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అయితే ‘ఖైదీ 2’ ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిల్లీ సెట్స్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ‘ఖైదీ’ సినిమా చివర్లో డిల్లీ తన కూతురు అముదిని కలుసుకోవడానికి బయలుదేరుతాడు. తన కూతురితో కొత్త జీవితం ్ర΄ారంభించాలనుకుంటాడు. కానీ అతను జైలులో ఉన్నప్పుడు పని చేసిన డ్రగ్ మాఫియా గ్యాంగ్ పూర్తిగా నాశనం కాదు. ఆ గ్యాంగ్లో మిగిలిన సభ్యులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తారు. ‘ఖైదీ 2’ కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం. ఫస్ట్ పార్ట్తో పోల్చితే సీక్వెల్ రెండింతల యాక్షన్, ఎమోషన్తో ఉండేలా లోకేశ్ ΄ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ అంటోంది. కార్తీ అన్ని సినిమాలూ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి కాబట్టి ‘ఖైదీ 2’ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది. మరోసారి అమ్మవారిగా...నయనతార కథానాయికగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘మూకుత్తి అమ్మన్’ (2020). దర్శకుడిగా బాలాజీకి ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్ర పోషించారు. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందింది. రెండో భాగంలోనూ నయనతార కథానాయికగా నటించారు. అయితే దర్శకుడు మారారు. రెండో భాగాన్ని దర్శకుడు సుందర్. సి తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బూ, స్నేహ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఊర్వశి, రెజీనా కసాండ్రా, సునీల్, యోగిబాబు, అభినయ తదితరులు నటించారు. ఇటీవలే ‘మూకుత్తి అమ్మన్ 2’ షూటింగ్ పూర్తయింది. తొలి భాగం ‘అమ్మోరు తల్లి’ టైటిల్తో తెలుగులో విడుదలైంది. రెండో భాగం కూడా విడుదల కానుంది. ఈ ఏడాదే ఈ సీక్వెల్ సిల్వర్ స్క్రీన్కి వస్తుంది. అయితే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. మళ్లీ బాక్సింగ్ రెడీబాక్సింగ్ నేపథ్యంలో ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సార్పట్ట పరంపర’ (2021). ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదలైంది. తమిళనాడులోని అట్టడుగు వర్గాలు నివాసం ఉండే ప్రాంతం నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామాని రూపొందించారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే సీక్వెల్ ప్రకటించారు. ఈ జూన్లో సీక్వెల్ షూటింగ్ని ప్రారంభిస్తామని తాజాగా ఆర్య స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే... పా.రంజిత్ దర్శకత్వంలోనే ఆర్య హీరోగా ఆరంభమైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘వెట్టువమ్’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల ఓ లీడ్ రోల్లో కనిపిస్తారు. ఈ ఏడాదే ‘వెట్టువమ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమా పనులు ఒక కొలిక్కి రావడంతో ‘సార్పట్ట పరంపర 2’ షూటింగ్ని జూన్లో ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘తని ఒరువన్ 2’ ఆగదు‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘తని ఒరువన్’ (2015). ఈ చిత్రకథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్, ‘జయం’ రవి పర్ఫార్మెన్స్... ఇలా అన్నింటికీ ప్రశంసలు దక్కాయి. వసూళ్ల పరంగా కూడా భేష్ అనిపించుకుంది. ఈ చిత్రం తెలుగులో రామ్చరణ్ హీరోగా ‘ధ్రువ’ పేరుతో రీమేక్ అయింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘తని ఒరువన్’కి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. అయితే పదేళ్లయినా సీక్వెల్ ఇంకా పట్టాలెక్కక΄ోవడంతో రెండో భాగం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆగలేదని, గత ఏడాది సెప్టెంబర్లో త్వరలో ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఆ తర్వాత వేరే న్యూస్ ఏదీ రాలేదు. నిర్మాణంలో జాప్యం జరుగుతుందే కానీ సీక్వెల్ నిర్మించాలనే ఆలోచనను యూనిట్ విరమించుకోలేదని కోలీవుడ్ టాక్. కుస్తీకి రెడీవిష్ణు విశాల్ హీరోగా రెజ్లింగ్ నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గట్ట కుస్తీ’ (2022). ‘మట్టి కుస్తీ’గా తెలుగులో విడుదలైంది. మరోసారి ఈ హీరో–దర్శకుడు వెండితెరపై కుస్తీ చూపించడానికి రెడీ అయ్యారు. ‘గట్ట కుస్తీ 2’ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. నీలాంబరి రిటర్న్స్రజనీకాంత్ హీరోగా నటించిన ‘పడయప్పా’ (1999 – తెలుగులో ‘నరసింహా’) లో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబర్చిన నటనను అంత సులువుగా మరచిపోలేం. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. రెండో భాగానికి రజనీకాంత్ కథ రాస్తున్నారని ఆయన రెండో కుమార్తె సౌందర్య పేర్కొన్నారు. కానీ ఎవరు నటిస్తారు? దర్శకత్వం వహిస్తారు వంటి విషయాలు తెలియజేయడానికి ఇది ‘టూ ఎర్లీ’ అవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. కథ పూర్తయ్యాక ఆ వివరాలను తెలియజేస్తారు. అయితే టైటిల్ మాత్రం ‘నీలాంబరి’ అనుకుంటున్నారట. మరగద నాణ్యం 2‘మరకతమణి’గా విడుదలైంది. ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీకి సీక్వెల్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మరగద నాణ్యం 2’ని ఆరంభించారు. ఆది పినిశెట్టి హీరోగా, నిక్కీ గల్రానీ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా ఏఆర్కే శరవణన్ దర్శకత్వంలోనే రెండో భాగం రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లానే సీక్వెల్ కూడా ఫ్యాంటసీ కామెడీ నేపథ్యంలోనే సాగుతుంది. కాగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆది, నిక్కీ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ఇద్దరూ 2022లో పెద్దల సమ్మతంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులోనూ విడుదలవుతుంది. -
పెళ్లయిన మూడోరోజే భార్య వదిలేస్తే.. ఫన్నీగా ట్రైలర్
అడపాదడపా హీరోగా సినిమాలు చేసే తిరువీర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. గతేడాది డిసెంబరులో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన ఇతడు.. ఇప్పుడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)1998లో గోదావరిలో జరిగే కథగా దీన్ని చూపించారు. ప్రతాప్, బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటాడు. కానీ మూడో రోజే ఆమె.. ప్రతాప్ని వదిలి వెళ్లిపోతుంది. తర్వాతరోజు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడుతుంది. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రతాప్ ఏమైనా చేశాడా? ప్రతాప్కే ఏమైనా జరిగిందా అనేదే కాన్సెప్ట్లా అనిపిస్తుంది. 'ఒకమ్మాయి ఇల్లు వదిలి వెళ్లిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు. కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరూ అడగరు' అనే డైలాగ్ ఆసక్తికరంగా అనిపించింది. నవ్వుని నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కథ అని చివరో ఓ లైన్ వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
బీడు భూమితో లాభాలు.. రైతులకు మాధవన్ చూపిన దారి
ఒకప్పుడు నిరుపయోగంగా, బీడుగా ఉన్న భూమి ఇప్పుడు కొబ్బరి చెట్లతో పచ్చని తోటగా మారింది. నేల సారవంతాన్ని పునరుద్ధరించడం, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తూ నటుడు మాధవన్ ఈ ప్రాజెక్టును తన వ్యక్తిగత అభిరుచిగా సుమారు ఆరేళ్ల క్రితం చేపట్టారు. ఓర్పు, ప్రణాళిక, సుస్థిర పద్ధతులతో నిరుపయోగంగా ఉన్న భూమిని ఎలా పునరుజ్జీవింపజేయవచ్చో ఆయన కృషి ప్రపంచానికి తెలియజేస్తుంది.'ధురంధర్' చిత్రంలో బలమైన పాత్రతో వెండితెరపై బహుముఖ నటనతో మెప్పించి ప్రశంసలు పొందిన నటుడు ఆర్. మాధవన్.. 2019 సమయంలో తమిళనాడులోని పళనిలో తన సోదరుడు శుభయోగ్యన్తో కలిసి కొబ్బరి సాగు ప్రారంభించారు. నిరూపయోగంగా ఉన్న బీడు భూమిని కౌలుకు తీసుకుని, కేవలం మూడేళ్లలోనే విజయవంతంగా ఫలవంతమైన కొబ్బరి తోటగా మార్చారు. ఈ ఏడాది కొబ్బరికాయల దిగుబడి మరింత పెరగడంతో ఆదాయం కూడా వస్తుంది. ఆయన నిరంతర కృషితో బీడు భూమి ఇప్పుడు కొబ్బరి చెట్లతో ఫలవంతమైన తోటగా రూపాంతరం చెందింది. 2020లో, ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మొదటిసారి ఈ విషయాన్ని వెల్లడించారు. చివరకు, తమిళనాడులోని పళనిలో కొబ్బరి సాగు ప్రాజెక్ట్ పూర్తయిందంటూ రైతులకు పలు సూచనలు ఇచ్చారు. నేల సారవంతాన్ని పునరుద్ధరించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. బీడుగా ఉన్న భూమిలో హైబ్రిడ్ కాని, స్వచ్ఛమైన పొట్టి రకం కొబ్బరికాయలను పండించవచ్చని ఒక వ్యాసం ద్వారా రైతులకు సూచనలు ఇచ్చారు. రసాయన ఎరువులపై ఆధారపడకుండానే దిగుబడి పెంచుకోవచ్చని రుజువుతో చూపారు. మాధవన్ ముంబైల్నోఇ తన ఇంటి టెర్రస్పైన కూడా పలు చెట్లను పెంచుతున్నారు. చెర్రీస్, బొప్పాయ వంటి వాటితో ఆర్గానిక్ ఫలాలు పొందుతున్నారు. తన పడక గది పక్కనే కూరగాయలు పండుతున్నాయంటూ ఒక వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
ఆశా భోస్లే అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మనవరాలు
లెజండరి సింగర్ ఆశా భోస్లే (92) ఏప్రిల్ 11, శనివారం నాడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, తాజాగా ఆమె మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో స్పందించారు. ఆశా భోస్లే అనారోగ్యంతో ఉన్నారనే విషయాన్ని ఆమె ధృవీకరిస్తూ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కల్పించాలని కోరారు. ఈ క్రమంలో ఆమె ఇలా రాశారు. "మా అమ్మమ్మ, ఆశా భోస్లే(Asha Bhosle) తీవ్రమైన అలసటతో ఉన్నారు. ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. దయచేసి మా గోప్యతకు విలువ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాము. చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందిస్తాము. ఎలాంటి ప్రచారం చేయకండి" అని ఆమె కోరారు.తన కాలంలోని అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరైన ఆశా భోస్లే, 1943లో వచ్చిన 'మాఝా బాల్' అనే మరాఠీ నాటకంతో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత 1948లో వచ్చిన 'చునరియా' చిత్రంలోని 'సావన్ ఆయా' పాటతో బాలీవుడ్లోకి ప్రవేశించారు.ఆమె సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'ఇన్ ఆంఖోం కి మస్తీ కే', 'రంగీలా రే', 'రాధా కైసే నా జలే', 'షరారా షరారా' వంటి చిరస్మరణీయ గీతాలకు ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
గ్లామర్తో ట్రెండ్ మార్చనున్న వైరల్ బ్యూటీ
ఇతర భాషా నటీమణులు ముఖ్యంగా ఉత్తరాది కథానాయకలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉంటోంది. అలా చాలా మంది దక్షిణాది చిత్రాలలో నటిస్తూ మకాం వేస్తున్నారు. అలాంటి వారిలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరు అని చెప్పావచ్చు. ఈ మరాఠి బ్యూటీ మిస్టర్ బచ్చన్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, భాగ్యశ్రీ బోర్సే మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. కారణం చూడగానే ఇట్టే ఆకర్షించే అందం, శరీర ఆకృతి కావచ్చు. అయితే స్టార్ హీరోల సరసన నటిస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించలేదు. అదే విధంగా తమిళంలోకి కాంత చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నటనకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ అమ్మడు ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే నటించారు. అలా నటించడం వల్లే ఈ అమ్మడికి రావలసిన క్రేజ్ రావడం లేదని తెలిసి వచ్చినట్లు సమాచారం. దీంతో ఇకపై తన పాత్రల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. అంటే ఇకపై గ్లామర్ విషయంలో కాస్త డోస్ పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల మాట. అందులో భాగంగానే ఈ బ్యూటీ లేటెస్ట్గా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇతర కార్యక్రమాల్లోనూ మోడరన్ దుస్తులు ధరించి పాల్గొంటున్నారు. ఇలాగైనా తన ఫేట్ను మార్చుకోవాలని భాగ్యశ్రీ యతి్నస్తున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఇకపై ఈ అమ్మడిని మరో కోణంలో చూడబోతున్నామన్న మాట. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
యాక్షన్ హీరోలా చూపించారు: వెంకట్
‘‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి యాక్టింగ్తో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకో వాల్సి వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో వెంకట్ చెప్పారు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, శివ రామరాజు’ వంటి చిత్రాల్లో నటించిన వెంకట్ హీరోగా నటించిన తాజా సినిమా ‘హరుడు’.హెబ్బాపటేల్, సలోని హీరోయిన్లుగా నటించారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వీఆర్ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ–‘‘మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘హరుడు’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఆ మాట నిలబెట్టుకున్నాం: శర్వానంద్
‘‘నేను మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాననే తెలుగు ప్రేక్షకుల నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ‘బైకర్’ చిత్రం తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని మొదటి నుంచే చెబుతున్నాను. మంచి ఫ్యామిలీ సినిమా తీసి, ఆ మాట నిలబెట్టుకున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ మౌత్ టాక్ వల్ల మా చిత్రం అద్భుతంగా ఆడుతోంది’’ అని హీరో శర్వానంద్ తెలిపారు.అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్’. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో శర్వానంద్ మాట్లాడుతూ–‘‘అభిలాష్ మంచి తండ్రీ కొడుకుల కథ చెప్పాడు. నాకు అద్భుతమైన సినిమా అందించిన యూవీ క్రియేషన్స్కు ధన్యవాదాలు. నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను.ఈ ఏడాది నాకు రెండు హిట్లు వచ్చాయి’’ అని చెప్పారు. అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మా సినిమాలోని రేసింగ్తో పాటు తండ్రీ కొడుకు, భార్యాభర్తల భావోద్వేగాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే థియేటర్లకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘మా మూవీలోని ఎమోషన్ కు ఆడియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు మాళవిక నాయర్. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయింత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. లోక్మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. :ఆమెకు ఐసీయూ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దాని ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.సినిమా పాటలతో పాటు గజల్స్, ఖవ్వాలీ, శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగులేదని లెజెండరీ సింగర్గా నిరూపించుకున్నారు. పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశ సుమారు 800లకు పైగా చిత్రాల్లో 12 వేల పైచిలుకు పాటలు పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. -
సింగర్ మంగ్లీ కేసుతో నాకు సంబంధం లేదు.. ప్రచారం ఆపండి: సినీ దర్శకుడు
మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్లు మోసం చేశారని గాయని మంగ్లీపై నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని కథనాలు వచ్చాయి. ఈ అంశంపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. మంగ్లీ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.వేణు ఊడుగుల స్పందిస్తూ..' గాయని మంగ్లీ వివాదంలో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఆ వార్తలు చూసి చాలా బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని మాత్రమే నేను సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా లేదు. అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు. మీ వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించగలరు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడూ అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా.' అని ఆయన పేర్కొన్నారు.I’m deeply hurt to see my name linked to the Mangli case.I have no involvement in this issue. I only suggested a peaceful resolution as both parties are known to me.Even in the FIR, my name is not listed as an accused. The complainant advocate Subbarao has also clarified… pic.twitter.com/gsffRWTYwi— v e n u u d u g u l a (@venuudugulafilm) April 11, 2026 -
శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్
యాంకర్, నటి అనసూయ మరోసారి నటుడు శివాజీపై కౌంటర్ వేసింది. కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన చెత్త వ్యాఖ్యలపై అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా చీర కట్టుకుని తన కుటుంబంతో పాటుగా అనసూయ గుడికి వెళ్లింది. కొందరు నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ.. శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆమె కూడా కౌంటర్ ఇచ్చింది.నెటిజన్లు షేర్ చేసిన థంబ్నైల్ ఎలా ఉండాలో తనదైన స్టైల్లో అనసూయ ఒక సలహా కూడా ఇచ్చింది 'శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ థంబ్నైల్ పెడుతారనుకున్నాను. సరైన హెడ్లైన్ కూడా ఇదే కదా.. ఎందుకంటే మేము గతంలో ఎప్పుడు చీరలు కట్టుకోలేదు. ఏమైనా పోస్ట్ చేసేముందు చూసుకోవాలి కదా..' అంటూ కౌంటర్ ఇచ్చింది. వాస్తవంగా చాలా ఈవెంట్లలో అనసూయ చీరకట్టులోనే కనిపించిన సందర్భాలు ఉన్నాయి. గుడికి వెళ్తున్న సమయంలో దాదాపు చీరకట్టులోనే వెళ్తారనే విషయం తెలిసిందే. అనసూయ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా షేర్ చేస్తున్నారు. Tappu tappu! “Sivaji srushtinchina cheera ane vastraanni dharinchi tirugutunna Anasuya” Idi kada undali header!! Endukante antaku mundu memanta asalu cheerale kattukoledu 🙄 entamma.. chuskovali kada post chesemundu 🤦🏻♀️ https://t.co/9IiFZ7PQgh— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 11, 2026 -
కొరియన్ కనకరాజు ఫస్ట్ సాంగ్
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై వరుణ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తాజాగా విడుదలైన పాటను కాసర్ల శ్యామ్ రచించగా సిధ్ శ్రీరామ్ ఆలపించారు. సంగీతం తమన్ అందించారు. -
పాపం హరీష్ శంకర్.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు
పాపం ప్రతాప్ సినిమా ట్రైలర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శకుడు హరీష్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' భారీ డిజాస్టర్ అయినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కూడా హరీష్ దానిని తీవ్రంగా ప్రచారం చేస్తూనే వచ్చారు. అతను వాస్తవాన్ని అంగీకరించడం లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే, తిరువీర్ నటించిన 'పాపం ప్రతాప్' సినిమా కార్యక్రమంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆశించిన స్థాయిలో ఆడలేదని ఎట్టకేలకు అంగీకరించాడు.దర్శకుడు హరీష్ శంకర్ ఈ వేదికపై ఇలా అన్నాడు. "ఈ కార్యక్రమానికి వస్తుండగా యాంకర స్రవంతి నన్ను ‘పాపం హరీష్’ అని పిలిచింది. నా సినిమా (ఉస్తాద్ భగత్ సింగ్) థియేటర్లలో సరిగ్గా ఆడకపోవడం వల్లే ఆమె అలా పిలిచిందని మొదట అనుకున్నాను. ఆ తర్వాత, ఆమె అందరినీ ‘పాపం’ అనే సంబోధనతో పిలవడం మొదలుపెట్టింది. అందుకే ఫర్వాలేదని అనుకున్నాను," అని హరీష్ శంకర్ అన్నారు. అందుకు సంబంధించిన క్లిప్ వైరల్ అవుతుంది. -
నెట్ఫ్లిక్స్, అమెజాన్.. సబ్స్క్రైబర్ల నంబర్ ఎంతో తెలుసా?
ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారత మార్కెట్లో జోరు పెంచింది. సుమారు మూడేళ్ల క్రితం సబ్స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించి వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. భారత్లో అమలు చేసిన ఈ ప్లాన్ విజయవంతం కావడంతో పలు దేశాల్లో దీనిని అమలు చేస్తుంది. ఎక్కువ కంటెంట్తో భారత ప్రజలను అలరించిన అమెజాన్ ప్రైమ్ వీడియోను దాటి నెట్ఫ్లిక్స్ ముందుకు వచ్చేసింది.నివేదికల ప్రకారం, భారత్లో నెట్ఫ్లిక్స్ సంస్థకు 92 మిలియన్ల (9.2 కోట్లు) నెలవారీ వినియోగదారులు ఉన్నారు. ప్రైమ్ వీడియోకు 67 (6.7కోట్లు) మిలియన్ల నెలవారీ వినియోగదారులతో వెనుకపడింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో ప్రైమ్ వీడియోపై నెట్ఫ్లిక్స్ పైచేయి సాధించింది. నెట్ఫ్లిక్స్ రోజురోజుకు కొత్తవారిని తనవైపు తిప్పుకుంటూ వృద్ధిని సాధిస్తుండగా, ప్రైమ్ వీడియో మాత్రం నిరంతర క్షీణతను చవిచూస్తుంది. నెట్ఫ్లిక్స్ ఇప్పుడు చిత్రనిర్మాతలకు ప్రధాన వేదికగా మారింది. భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కథలతో కూడిన ఒరిజినల్స్పై దృష్టి సారించడం ద్వారా ఈ ప్లాట్ఫామ్ తన స్థాయిని కూడా పెంచుకుంది. ధరలు కొద్దిగా తగ్గించడం కూడా బాగా కలిసొచ్చింది. అయితే, ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టడం మేలు కంటే కీడే ఎక్కువ చేసింది, ఆపై సబ్స్క్రిప్షన్ ఖర్చు కూడా పెరిగింది. అయితే, భారత్లో జియోహాట్స్టార్ టాప్లో ఉంది. ఏకంగా 500 మిలియన్ల ( 50 కోట్ల) నెలవారి వినియోగదారులు ఈ సంస్థకు ఉన్నారు. -
సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!
సాక్షి,హైదరాబాద్: సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై ఆరోపణులు చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు.. నాపై లాయర్ సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారు. గతనెల 21న తానే పరిచయం చేసుకుని అమర్యాదగా మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు.. నేను నిరాకరించా. నోట్ల కట్టల వీడియో చూపించి నన్ను బెదిరించారు. సుబ్బారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరా’నని తెలిపారు. మంగ్లీ ఫిర్యాదుతో న్యాయవాది సుబ్బారావుపై బీఎన్ఎస్ సెక్షన్లు 79,351(3)కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు.. మంగ్లీపై ఆరోపణలు చేస్తూ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మంగ్లీ పేరుతో మోసం చేశారని రెండు నెలల క్రితం బాధితులు నన్ను కలిశారు. విచారణ చేపట్టగా ఈ మోసంలో మంగ్లీతో పాటు ఆమో సోదరుడు శివ,మధు ఉన్నట్లు తేలింది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం మంగ్లీని కలిసే ప్రయత్నం చేశా. మంగ్లీతో మాట్లాడిన సమయంలో చాలా యారగెంట్గా మాట్లాడారు. ప్రధాన నిందితుడు మధు రూ.200కోట్ల పెట్టుబడి రూపంలో సేకరించారు. భారీ లాభాలు ఇస్తాయని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో బాధితులు మమ్మల్ని కలిశారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి నన్ను బెదిరించారు. ఇప్పటికే బెదిరింపుల మీద కేసు నమోదైంది. సివిల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ బాధితులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సింగర్ మంగ్లీపై కేసుసింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు మోసం చేశారని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సతీమణి పేరుతో రిషబ్ శెట్టి బిగ్ ప్లాన్.. మరో సినిమా కష్టమేనా?
కాంతార ఫ్రాంచైజీ సినిమాలతో కన్నడ నటుడు రిషబ్ శెట్టికి పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడని వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఆయన తన సోషల్మీడియాలో పలు ఖాతాలను అన్ఫాలో చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంతార సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ను ప్రస్తుతం రిషబ్ ఫాలో కావడం లేదు. దీంతో నిర్మాత విజయ్ కిరగందూర్తో విభేదాలు కలిగాయని వార్తలు వచ్చాయి. ఇకపై కాంతార నుంచి మరో సినిమా రాకపోవచ్చని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. అయితే, ఇందులో తన సతీమణి ప్రగతి శెట్టి పాత్ర ఎక్కువగా ఉందని రూమర్స్ వస్తున్నాయి.కాంతార ఛాప్టర్-1 ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరడంతో రిషబ్ శెట్టి తన రెమ్యునరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 75 కోట్ల రెమ్యునరేషన్తో పాటు తన సతీమణి సహ-నిర్మాతగా ఉండాలని కండీషన్ పెట్టారట. ఈ ఢీల్ హోంబలే ఫిల్మ్స్కు నచ్చలేదని టాక్.. డబ్బు విషయం కంటే ఒక సినిమాకు సంబంధించి పూర్తి హక్కులు తమ సంస్థకే చెందాలని నిర్మాత విజయ్ కిరగందూర్ ఉంటారట.. ఇలాంటి కండీషన్ను వారు ఎట్టిపరిస్థితిల్లోనూ అంగీకరించరట. ఈ కారణంతోనే ఆ సంస్థకు సంబంధించిన సోషల్మీడియా ఖాతాలను రిషబ్ శెట్టి అన్ఫాలో కొట్టారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ రిషబ్ శెట్టి కలుగజేసుకుని ముందుకు వస్తేనే కాంతార నుంచి మరో సినిమా వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అసలు విషయం ఏదైనప్పటికీ రిషబ్పై సోషల్మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
‘ది ప్యారడైజ్’.. అంచనాలు పెంచేసిన సుబ్బలక్ష్మి!
దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట సోషల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా హీరోయిన్గా నటిస్తున్న కయాదు లోహర్ లుక్ని కూడా విడుదల చేశారు. కయాదు బర్త్ డే సందర్భంగా ఈ రోజు(ఏప్రిల్ 11) ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ బర్త్డే విషెస్ తెలిపారు. ఇందులో ఆమె సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘వెండితెర పై వెలగని తార’ మా సుబ్బలక్ష్మిని చూడండి అంటూ కయాదు పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. శ్రీకాంత్ ఓదెల సినిమాలో హీరోయిన్కి చాలా ప్రాధన్యత ఉంటుంది. దసరాలో కీర్తి సురేశ్ పోషించిన వెన్నెల పాత్ర ఏ రేంజ్లో పేలిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్ర కూడా అదే స్థాయిలో బలంగా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం కయాదు ఓ మధ్యతరగతి యువతిగా కనిపించబోతునట్లు సమాచారం. ఇందులో నాని ‘జడల్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఆగస్ట్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’. మార్చి 19న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం..అక్కడ సూపర్ హిట్ టాక్తో భారీ కలెక్షన్స్ని రాబట్టింది. ఇక అదే నెల 27న తెలుగులో విడుదలైంది. అయితే తమిళ్తో పోలిస్తే..తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.యూత్ కథేంటంటే..ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026 -
ఆ బాధ నాకే ఎక్కువ తెలుసు..: విజయ్ దేవరకొండ
ఒక సినిమా రూపుదిద్దుకోవడం వెనక వందలాది మంది కష్టం దాగి ఉంటుంది. ఆ మూవీ రిలీజై ఆదరణ పొందినప్పుడు వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కినట్లు లెక్క! కానీ రిలీజ్కు ముందే పైరసీ బారిన పడితే వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ పైరసీ అతిపెద్ద భూతంగా మారింది. తాజాగా విజయ్ చివరి మూవీ జననాయగణ్ సినిమాకు లీకుల బెడద తప్పలేదు.జననాయగణ్ లీక్థియేటర్లలో విడుదలవడానికి ముందే ఈ చిత్రంలో అనేక సన్నివేశాలను ఆన్లైన్లో లీక్ చేశారు. దీనిపై చిత్రనిర్మాణ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఆ పైరసీ వీడియోలు చూసినా, షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంది. ఇక ఎంతోమంది సెలబ్రిటీలు జన నాయగణ్కు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.ఆ బాధ అనుభవించా..తాజాగా హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'జననాయగణ్ సినిమా లీక్ అయిందన్న విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సినిమా లీకైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.. కెరీర్ తొలినాళ్లలోనే ఆ బాధను, నష్టాన్ని చవిచూశాను. మనల్ని టార్గెట్ చేయడంతో మన ఆశలన్నీ అడియాసలైపోతాయి. నేను కేవలం నా గురించి మాత్రమే చెప్పడం లేదు. నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా సినిమాలో భాగమైన ఎంతోమందికి ఇదే వర్తిస్తుంది.ఎంత దిగజారుతున్నారు?ప్రస్తుత సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అలాగే దీని వెనక ఉన్న వ్యక్తులను గుర్తించాలి. అది గనక చేయలేకపోతే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. అవతలివారికి హాని చేయడానికి మనుషులు ఎంత దిగజారుతున్నారు? అనేదానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న జననాయగణ్ మూవీ టీమ్కు నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది' అని ట్వీట్ చేశాడు.టాక్సీవాలాకాగా విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలో టాక్సీవాలా సినిమా చేశాడు. ఈ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే లీక్ అయింది. అది చూసి విజయ్ మానసిక క్షోభ అనుభవించాడు. తన పనైపోయిందని గదిలో కూర్చుని ఏడ్చాడు. ఏదైతే అదైందని, సినిమా రిలీజ్ చేద్దామని పట్టుబట్టాడు. అలా పైరసీ జరిగిన సినిమాను థియేటర్లలో విడుదల చేసి మరీ హిట్టు కొట్టాడు. The #JanaNayagan leak makes me angry.I’ve experienced personally the pain and sense of loss when something like this happens, early in my career. You feel like a target, you feel a loss of hope, it’s not just about me, there are co-actors, directors, producers, and so many who…— Vijay Deverakonda (@TheDeverakonda) April 11, 2026 చదవండి: డెకాయిట్కు ఊహించని కలెక్షన్స్.. తొలిరోజు ఎంతంటే? -
ప్రేమతో మా సినిమా చూస్తున్నారు.. ధన్యవాదాలు: అడివి శేష్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిన్న (శుక్రవారం) రిలీజైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసింది ‘డెకాయిట్’ యూనిట్. అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను మేం ప్రేమతో చేశాం. మీరు కూడా ప్రేమతో చూశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో సరస్వతి పాత్ర చేసిన మృణాల్ మా హీరో (నవ్వుతూ). నా బెస్ట్ ఫ్రెండ్ షానియల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం నాకు ఎమోషనల్గా అనిపిస్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన సరస్వతి పాత్ర మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు మృణాల్ ఠాకూర్. ‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు షానియల్ డియో. -
ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు కాస్త లేటుగా ఓటీటీలోకి వస్తాయి. ఫ్లాప్ సినిమా అయినా సరే థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత కనీసం నాలుగు వారాల గ్యాప్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ పవన్ కల్యాణ్ తాజాగా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెటిఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.థియేటర్స్లో ఫ్లాప్ టాక్.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల, రాఖీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. మరోవైపు అదే రోజు వచ్చిన దురంధర్ 2 చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో ఉస్తాద్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే నిర్మాణ సంస్థ కనీసం కలెక్షన్స్ పోస్టర్ కూడా వేసుకోలేకపోయింది.నెలలోపే.. వాస్తవానికి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కనీసం 5-6 వారాల గ్యాప్తో ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. కానీ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ముందే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి నెట్ఫ్లిక్లో అందుబాటులోకి వస్తుంది. తెలుగులో పాటు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. మరి ఓటీటీలో అయినా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 16 వరకు ఆగాల్సిందే. Peru Bhagat, kaani udhyamam ey thana gurthimpu 🔥🚨 pic.twitter.com/5tYUxKmuKA— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026 -
డెకాయిట్ 1st డే కలెక్షన్స్: శేష్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్..
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్. ప్రేమకథ, యాక్షన్ మేళవించి ఉన్న చిత్రాన్ని షానియల్ డియో డైరెక్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఫస్ట్ డే కలెక్షన్స్భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం అడివి శేష్ కెరీర్లో ఇదే మొదటిసారి! మరి మొదటిరోజే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన డెకాయిట్ రానున్నరోజుల్లో ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి!సినిమా కథతక్కువ కులానికి చెందిన హరి (అడివి శేష్)ని అగ్రకులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రేమిస్తుంది. కానీ, కులం కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఈ క్రమంలో ఓ కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పి హరిని జైలుకు పంపిస్తుంది సరస్వతి. 13 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన హరి తర్వాత అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను కేసులో ఇరికించిన సరస్వతిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఇంతలో హరి, సరస్వతికి డబ్బు సమస్య వస్తుంది. మరి హరి.. సరస్వతిపై పగ తీర్చుకున్నాడా? డబ్బు కోసం ఇద్దరు కలిసి ఏం చేశారు? అతడు సరస్వతి అతడిని జైలుకు ఎందుకు పంపించింది? అన్నది డెకాయిట్ చూసి తెలుసుకోవాల్సిందే! #Dacoit opens with a BANG ❤️🔥❤️🔥15 CRORES+ GROSS ON DAY 1 🔥The Biggest opening ever for @AdiviSesh 💥💥💥Don’t miss it in theatres near you 🤩Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/3WON13una1— Annapurna Studios (@AnnapurnaStdios) April 11, 2026 చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ -
అదే నిజమైన విజయం: నిహారిక
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ‘రాకాస’ వసూళ్ల పరంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ‘రాకాస’ యూనిట్ హైదరాబాద్లో సక్సెస్మీట్ను నిర్వహించగా, బ్రహ్మాజీ, మైత్రీ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మైత్రీ రవి మాట్లాడుతూ– ‘‘నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ సాధించాం. భవిష్యత్లో ఆమె చేసే సినిమాలన్నింటినీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ అంటే సినిమా హిట్ అయినట్లే. ‘రాకాస’ చిత్రాన్ని నమ్మి, తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు ‘థ్యాంక్స్’ అని చెప్పారు సంగీత్ శోభన్. ‘‘మా డిస్ట్రిబ్యూటర్లందరూ సంతోషంగా ఉన్నారంటే అదే నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియన్స్ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు’’ అని చెప్పారు నిహారిక. ‘‘నా డ్రీమ్ని, నా కథను ఇంత వరకు తీసుకుని వచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కు థ్యాంక్స్’’ అని చెప్పారు మానస. పంపిణీదారులు సన్నీ, భాస్కర్, రమేశ్ యాదవ్, పాండు, సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు. -
రూ.10 కోట్ల మోసం.. సింగర్ మంగ్లీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసు కేసు నమోదైంది. మంగ్లీ తనను రూ.10 కోట్ల మేర మోసం చేసిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు.. మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 351 (2), 352 కింద వీరిపై కేసు నమోదైంది.మంగ్లీ నేపథ్యంమంగ్లీ అసలు పేరు సత్యవతి చౌహాన్. తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాపులర్ అయింది. ఆ తర్వాత బతుకమ్మ, బోనాలు, భక్తి పాటలు పాడుతూ జనానికి మరింత దగ్గరైంది. పుట్టింది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణ జానపదంపై తనకు మంచి పట్టుంది. తను పాడిన ఎన్నో పాటలు లక్షలాది వ్యూస్ను రాబడుతూ సోషల్ మీడియాను షేక్ చేశాయి.సినిమాల్లో సాంగ్స్ఇదే స్పీడుతో తర్వాత సినిమాల్లోనూ ఎంటర్ అయింది మంగ్లీ. శైలజా రెడ్డి అల్లుడు మూవీలో 'శైలజా రెడ్డి అల్లుడు చూడే' సాంగ్ పాడింది. జార్జ్ రెడ్డిలో 'వాడు నడిపే బండి', అల వైకుంఠపురములోలో 'రాములో రాములా', సీటీమార్లో 'జ్వాలారెడ్డి', లవ్స్టోరీలో 'సారంగదరియా', రౌడీ బాయ్స్లో 'బృందావనం నుంచి', విక్రాంత్ రోనాలో 'రారా రక్కమ్మా', ధమాకాలో 'దండకడియాల్', 'జింతాక్' , బలగంలో 'ఊరు పల్లెటూరు..' ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించింది. చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ మూవీ.. తాయ్ కిళవి రివ్యూ -
డేట్ ఫిక్స్
రవిబాబు ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రోడక్షన్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే నెల 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలి పారు.‘‘మా నాన్న చలపతిరావుగారి జయంతి సందర్భంగా మా సినిమాను మే 8న రిలీజ్ చేస్తున్నాం. నాపై ఆయన ఆశీర్వాదాలు ఉన్నట్లుగానే ప్రేక్షకుల ఆశీర్వాదాలూ లభిస్తాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు రవిబాబు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. రాజేశ్. -
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి అనసూయ యాంకర్గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాకుండా మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాడుతూ వారికి మద్దతుగా తనవంతు పోరాటం చేస్తోంది. ముఖ్యంగా మహిళలపై ట్రోల్స్ చేసేవారికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తుంది.తాజాగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. యూకేలో జరిగిన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ మహిళను ఆంటీ అని పిలిచిన ఓ వ్యక్తికి లండన్లోని కోర్టు ఏకంగా రూ.1.5 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్ను అనసూయ తన ట్విటర్లో షేర్ చేసింది. హమ్ అంటూ.. ఈ తీర్పును సమర్థిస్తూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. గతంలో కొందరు నెటిజన్స్ అనసూయను సైతం ఆంటీ అంటూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్)కాగా.. గతంలో నటుడు శివాజీ మహిళల దుస్తులను ఉద్దేశించి ఓ మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్కు అనసూయ కౌంటరిచ్చింది. మహిళలు ఎలాంటి దుస్తులైనా ధరించడం వాళ్ల వ్యక్తిగతమని పేర్కొంది. ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చని.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని అనసూయ తెలిపింది. Hmmmm…. pic.twitter.com/NlOfnWbt8l— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 9, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. Actress #Sreeleela visited Tirumala Tirupati Devasthanams today to seek divine blessings 🙏 pic.twitter.com/TBSdj6FQ6G— Eluru Sreenu (@IamEluruSreenu) April 9, 2026 -
'మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నా'.. ఐకాన్ స్టార్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడాన్ని అభినందించారు. ప్రతి ఏటా ఒక మంచి పని చేయడం.. హెచ్పీవీ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించిన అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరంతా కలిసి అద్భుతమైన పని చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. మీరందరూ అద్భుతమైన పని చేశారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం.' అంటూ పోస్ట్ చేశారు. I am truly soo proud of all my fans for embracing the “One Good Deed Every Year” initiative and taking up a meaningful programme like the #HPVVaccine Awareness Drive. You guys have outdone yourself and it truly fills my heart seeing every activity . Soo glad all of your energy is…— Allu Arjun (@alluarjun) April 10, 2026 -
‘డైమండ్ డెకాయిట్’ మూవీ రివ్యూ
పార్థ గోపాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి. యాదవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు(ఏప్రిల్10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ఒక మనిషిని రక్షించేందుకు ప్రయత్నించిన గోపాల్ కుటుంబం చిన్నాభిన్నాం అవుతుంది. భయంకర డెకాయిట్గా పేరు తెచ్చుకున్న మునుస్వామి నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎదుగుతాడు. జైలు నుంచి విడుదలైన గోపాల్ అతని గ్యాంగ్లో చేరుతాడు. అయితే బయటకు అతను మునుస్వామి నాయుడికి నమ్మకస్తుడిగా కనిపించినా, లోపల మాత్రం అమాయకులను రక్షిస్తూ డబుల్ లైఫ్ గడుపుతుంటాడు. గోపాల్ గతంలో ఎందుకు జైలుకు వెళ్లాడు? అతని అసలు లక్ష్యం ఏమిటి? వరుస హత్యలు, మరో హత్యా యత్నం వెనుక ఉన్న నిజం ఏమిటి? గోపాల్ ఎందుకు బండిపోటుగా మారుతాడు? చివరకు బయటపడే నిజాలు కథకు కీలకం అవుతాయి.ఎలా ఉందంటే..క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ కలయికతో రూపొందిన కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా అంతర్లీనంగా ఒక హృద్యమైన ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయి. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథను నడిపించిన తీరు బాగుంది.అసలు కథను ప్రారంభించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా, ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగించాడు. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో కథనం కాస్త ఎమోషనల్గా సాగుతుంది. స్క్రిన్ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. హీరోగా, నిర్మాతగా పార్ధ గోపాల్ రెండు విభాగాలకు న్యాయం చేశాడు. నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరోగా బాగానే నటించాడు. యాక్షన్తో ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథ, స్క్రీన్ప్లే, మాటలతో సినిమాను భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు.సాయి రాజు రాసిన డైలాగ్స్ సహజం ఉన్నాయి. : పీఆర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్.గోపాల్ కుటుంబం ఊరి నుంచి వెళ్లిపోయే ముందు వచ్చే పాటు బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -రేటింగ్: 2.5/5 -
రాకా మూవీ.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. రాకా పేరుతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తోడేలు లుక్లో ఉన్న అల్లు అర్జున్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఐకాన్ స్టార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా టైటిల్ రివీల్ వేళ టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మూవీలో బన్నీ పారితోషికంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి ఐకాన్ స్టార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్కు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్గా రష్మిక కనిపించనున్నారని టాక్. నేషనల్ క్రష్కు దాదాపు రూ. 5-7 కోట్లు చెల్లించనున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్తో 'జవాన్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను దాదాపు రూ. 700 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీపిక పదుకొణె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. -
నయనతార ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ టాక్ ఏంటి?
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కాన్సెప్ట్ బాగున్నా.. తెరపై ఆకట్టుకునేలా తీయడంతో దర్శకుడు విఘ్నేష్ విఫలం అయ్యాడని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.కథ విషయానికొస్తే.. ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ టుడే’ మాదిరే ఈ చిత్రం కూడా ఫోన్ చుట్టూనే నడుస్తుంది. అయితే ఇందులో కథను 14 ఏళ్లు ముందుకెళ్లి..అంటే 2040లో నడుస్తున్నట్లుగా చూపించారు. అప్పటి వరకు మొబైల్, సోషల్ మీడియా ప్రభావం మన జీవితాలపై ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు విఘ్నేష్. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అంటూ ప్రేమకు కూడా ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరమైన పాయింటే కానీ.దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపై చూపించి ఉంటే బాగుండేదని సినిమా చూసిన నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. #LIK (Tamil) {2.25/5} - Lyt Idi Kuda.#LoveInsuranceKompany #LIKReview #CMReviews pic.twitter.com/qi58kxTikQ— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 10, 2026#LIK - 2/5Movie has a unique futuristic concept, but the story is weak and not very engaging. PR gives a good performance and tries hard to carry the film with his energy. Some scenes and comedy work, but the slow narration and uneven screenplay make it boring at times.…— Raghavendra (@SRaghavendra87) April 10, 2026 -
'జననాయగన్' కు చిరంజీవి సపోర్ట్
విజయ్ నటించిన 'జననాయగన్' విడుదల కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తుండగా ఆన్లైన్లో పలు సీన్లు ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ చర్యపై చిరంజీవితో పాటు చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్, నటుడు శివకార్తికేయన్ ఫైర్ అయ్యారు. సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాని ఈ చిత్రం నుంచి సుమారు 5 నిమిషాల సీన్తో పాటు ఒక సాంగ్ను లీక్ చేశారు. తమ అనుమతి లేకుండా కొందరు ఇలాంటి పనిచేయడంపై మేకర్స్ ఆగ్రహించారు. మూవీ వీడియోలను షేర్ చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు.విజయ్ సినిమాకు అండగా చిరంజీవి జననాయగన్కు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. సినిమా లీక్ కావడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఇలాంటి చర్యలు ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. క్రియేటివ్ వర్క్కు రక్షణ అవసరమన్నారు. జననాయగన్కు తన మద్ధతు ఉంటుందని చిరు భరోసా కల్పించారు. పైరసీని అరికడదాం.. సినిమా పరిశ్రమను కాపాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. జననాయగన్ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తన్న విషయం తెలిసిందే. అయితే, చిరంజీవి-బాబీ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మిస్తుండటం విశేషం.జననాయగన్ మూవీకి సంబంధించిన వీడియోలు లీక్ కావడంపై నటుడు శివకార్తీకేయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను నిర్మించేందుకు వేలాదిమంది రక్తం, చెమట చిందిస్తారని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి పైరసీకి పాల్పడకండి. సినిమాను థియేటర్లలోనే చూసి మా కష్టాన్ని గౌరవించండి. సినిమా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అని ఆయన కోరారు. -
ట్రెండింగ్లో 'లెజెండ్' ప్రభాస్
బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డితో కలిసి హైదరాబాద్లోని అల్లు సినిమాలో చూశారు. ఈ క్రమంలో వారిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ కూడా స్పందించారు. ప్రభాస్, సందీప్ రెడ్డివంగాకు ధన్యవాదాలు తెలిపారు.ధురంధర్-2 చిత్రాన్ని చూసి మెచ్చుకున్న ప్రభాస్పై అదిత్య ధర్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ ఒక లెజెండ్ అంటూ కొనియాడారు. ఈ వ్యాఖ్యలను ఫ్యాన్స్ త్వరగా వైరల్ చేశారు. సినిమాలో ఎక్కువగా కల్పిత అంశాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు విమర్శలు వస్తున్న సమయంలో 'ధురందర్ 2'కు మద్దతు ఇచ్చినందుకు సందీప్ రెడ్డి వంగాను కూడా ఆదిత్య ధర్ అభినందించారు. ప్రభాస్ను "లెజెండ్" అని సంబోధిస్తూ ధర్ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో సంచలనం సృష్టించాయి. అప్పటి నుండి ఈ పదం అన్ని ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్లో ఉంది. 'బాహుబలి' నుండి తన ఇటీవలి ప్రాజెక్టుల వరకు, ప్రభాస్ పాన్-ఇండియా స్థాయిలో ఎవరికీ అందనంత ఆదరణను సంపాదించుకున్నారు. -
చిన్న సినిమా ఘన విజయం.. వారం రోజుల్లోనే సెంచరీ
మలయాళంలో రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిత్రాల్లో "వాళా" ఒకటి. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పనీపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తారు. వాళా చిత్రానికి 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్' అనేది ట్యాగ్లైన్ ఇచ్చారు.మలయాళంలో హిట్ కొట్టిన తెలుగు డైరెక్టర్2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు. సెంచరీ కొట్టిన వాళా 2ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం ఏకంగా సెంచరీ కొట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోవడం విశేషం. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్గారుతో హిట్ అందుకున్న సాహు గారపాటి.. మూడు నెలల్లో వాళా 2తో మరో బ్లాక్బస్టర్ అందుకున్నాడు. కాగా వాళా మొదటి భాగం హాట్స్టార్లో మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Vaazha-2 Movie (@vaazhamovie) చదవండి: గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఉంటే.. -
‘జయహో జనార్ధన’.. టైటిల్ పోస్టర్ రిలీజ్
నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జయహో జనార్ధన’. పానుగంటి శరత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, బీవీఎం శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నందమూరి హరి, కెమెరామెన్ గా విజయ్ ఠాగూర్ ఆర్ డైరెక్టర్ గా భూపతి యాదగిరి పనిచేయగా మ్యూజిక్ అందించింది చరణ్ అర్జున్.ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లాంచ్ విజనరీ డైరెక్టర్ సంపత్ నంది గారి చేతుల మీదుగా జరిగింది. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు నిర్మాత, దర్శకుడు అయిన పానుగంటి శరత్ రెడ్డి గారు.పోస్టర్ లాంచ్ తర్వాత సంపత్ నంది గారు మాట్లాడుతూ ..నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి ని మరియు మూవీ టీం ని అభినందించి ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
భారత్లో బ్యాన్ చేస్తే మళ్లీ వైరల్ అవుతున్న ఫోటోలు
గత ఏడాదిలో జరిగిన పుల్వామా దాడి తర్వాత పాకిస్తానీ నటీమణులు హానియా అమీర్, మహిరా ఖాన్ తదితరుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారతదేశంలో నిషేధించారు. దీంతో వారి అకౌంట్లు ఇక్కడ కనిపించవు. అయితే, సడెన్గా వారి ఇన్స్టాలోని పోస్టులతో పాటు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు అందుబాటులో లేవు. అవి మళ్ళీ చూపించలేదని గుర్తించారు.పాక్ సెలబ్రిటీల సోషల్మీడియా ఖాతాలు మళ్లీ భారతదేశంలో కనిపించడంతో నిషేధాన్ని ఎత్తివేశారా..? అనే అంశంపై నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు మళ్లీ కనిపించకపోవడంతో, ఇది సాంకేతిక లోపం కావచ్చునని కూడా చాలామంది పోస్ట్ చేశారు.పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ కేంద్రంగా కొనసాగుతున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు భారత్లో నిలిపివేస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రక్షణ మంత్రి ఖాతాతో పాటు స్టార్ క్రికెటర్స్ సోషల్మీడియా ఖాతాలను కూడా బ్యాన్ చేశారు. -
నీ పెళ్లాన్ని సన్నగా చేయ్ అని ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే..: విశ్వ
నటుడు విశ్వ సీరియల్స్లో, సినిమాల్లో యాక్ట్ చేశాడు. తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితమే విశ్వ ఫిట్నెస్ క్లబ్ ఓపెన్ చేసి జిమ్ ట్రైనర్గానూ మారాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. విశ్వ మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్లవుతోంది. 10వ తరగతి అయిపోగానే పరిశ్రమలో అడుగుపెట్టాను. పెళ్లికోసం, విద్యార్థి వంటి పలు చిత్రాల్లో నటించాను. తర్వాత సీరియల్స్ చేశాను. తొక్కేశారుకొంతకాలంగా సీరియల్స్కు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాను. అయితే ఒకానొక సమయంలో నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేశారు. అప్పుడు నా తమ్ముడి సంపాదనపైనే బతికాను. ఆరునెలలపాటు వాడే ఇంటిని నడిపించాడు. అలాగే నాన్నకు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. ఎప్పుడైనా పనివాళ్లు రాకపోతే నేను గిన్నెలు కడిగేవాడిని. రేషన్ బియ్యం తిన్న రోజులున్నాయి అన్నాడు.నా అభిమానిశ్రద్ధతో తన లవ్స్టోరీ గురించి చెప్తూ.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో శ్రద్ధ నన్ను చూసి ఇష్టపడింది. అప్పటికి నేను బ్రేకప్ బాధలో ఉన్నాను. నిజమైన ప్రేమ లేదని తెగ బాధపడిపోతూ ఉన్నాను. ఆ సమయంలో శ్రద్ధ మెసేజ్ చేయడంతో టైంపాస్ చేద్దామని నా నెంబర్ ఇచ్చాను. తనకు చాలా కనెక్ట్ అయిపోయాను. వారం రోజులకే తను ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్లు మొదట ఒప్పుకోలేదు. నా గురించి పూర్తిగా ఆరా తీశాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ట్రోల్స్ఆమెను దేవుడు నాకోసం పంపిన ఏంజెల్ అని భావిస్తాను. విశ్వ ఫిట్నెస్ క్లబ్లో శ్రద్ధ డైట్ ప్లాన్, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటుంది. నేనేమో ఎక్సర్సైజ్ చేయిస్తాను. అయితే మేమిద్దరం కలిసి సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పెడితే చాలు.. ముందు నీ పెళ్లాన్ని సన్నగా చేయు, వేరేవాళ్లకు నీతులు చెప్పడం కాదు, ఇంట్లో సక్కగ చూసుకో అని ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్లు అన్నదాంట్లో తప్పు లేదనుకోండి.ఆ వ్యాధి వల్లే..అయితే రెండోసారి కొడుకు పుట్టిన తర్వాత హార్మోన్ల అసమతుల్యత కారణంగా శ్రద్ధ విపరీతంగా బరువు పెరిగిపోయింది. కొన్ని నెలలకు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. కానీ తనకు కార్పెల్ టన్నెల్ అనే అరుదైన వ్యాధి వచ్చింది. దానివల్ల చేతులు బలహీనంగా మారిపోయాయి. పిల్లాడికి షర్ట్ బటన్ కూడా పెట్టేంత శక్తి లేకపోయింది. అంటే.. తన పనులు తను చేసుకోలేదు. ఆ వ్యాధి వల్ల ఎక్సర్సైజ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కోలుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది' అని విశ్వ చెప్పుకొచ్చాడు.చదవండి: లోక సినిమా.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి -
'కుంభమేళా' మోనాలిసాకు బిగ్ షాక్.. భర్తపై పోక్సో కేసు!
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఫేమస్ అయిన మోనాలిసా భోంస్లే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 11న కేరళలోని అరుణ్మనూర్లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో ఆమె ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి రోజుకి మోనాలిసా ఇంకా మైనరే అని..ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేననే ఆరోపణలు వచ్చాయి. దీనికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణ జరపగా..అది నిజమేనని తేలింది. దీంతో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది?మహాకుంభమేళాలో తన అందం, అభినయంతో నెటిజన్ల మనసు గెలుచుకున్న మోనాలిసా.. పెద్దలను ఎదురించి, ఫేస్బుక్ ద్వారా పరిచమైన ఫర్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికి ఆమె మైనర్ అని, ఫర్మాన్ ఆమెను ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. మోనాలిసా మైనర్ అని, ఈ వివాహం చెల్లదంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) కేరళ విభాగం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపట్టింది. కమిషన్ జరిపిన విచారణలో మోనాలిసా వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువని, ఆమె మైనర్ అని ఆధారాలతో సహా తేలింది. పెళ్లి రోజుకు ఆమె వయసు 16 సంవత్సరరాల 2 నెలల,12 రోజులు మాత్రమేనని తేలడంతో భర్త ఫర్మాన్పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. -
భారత్ సీక్రెట్ మిషన్ 'మిస్టర్- ఎక్స్' ట్రైలర్
కోలీవుడ్ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మిస్టర్ ఎక్స్.. దర్శకుడు మను ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. కోలీవుడ్లో ఎఫ్ఐఆర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఫ్రేమ్ మను ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తుండటంతో బజ్ క్రియేట్ అయింది. ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది.దర్శకుడు మను ఆనంద్ మిస్టర్ ఎక్స్ కథను గతంలో ఒకసారి మీడియాతో పంచుకున్నారు. 1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించామన్నారు. 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్ చిత్రమని చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్ఐఆర్ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్ పేర్కొన్నారు. -
‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: డెకాయిట్ నటీనటులు: అడివి శేష్,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులునిర్మాత: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్కథ, స్క్రీన్ప్లే: అడివి శేష్ దర్శకత్వం: షానియల్ డియోసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్విడుదల తేది: ఏప్రిల్ 10, 2026అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్తో అంచనాలు పెంచేసిన ఈ టీం మరి ఆడియెన్స్ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.ఎలా తీశారంటే?..ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథల్ని ఎంత కొత్తగా, ఎంత అట్రాక్టివ్గా చెప్పామన్నదే విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆ విషయంలో డెకాయిట్ కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రేమకు కులం అడ్డు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇందులోనే అదే పాయింట్ను చూపించారు. కానీ ఇందులోని ప్రేమ కథను, ప్రేమికుల్ని కాస్త కొత్తగా, భిన్న శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేయసి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హీరో. ఇద్దరూ కలిసి దొంగ తనాలు కూడా చేస్తుంటారు. ఇంటర్వెల్కు ఓ చిన్న పాటి ట్విస్ట్లాంటిది ఇస్తారు.ఇక సెకండాఫ్లో హీరోకి అసలు విషయం తెలియడం, గతానికి సంబంధించిన నిజం, తన కోసం ప్రేయసి చేసిన త్యాగం ఇవన్నీ తెలుస్తాయి. ఇక ప్రేయసికి ఉన్న ఇబ్బందిని తీర్చేందుకు ప్రియుడు చేసే త్యాగంతో క్లైమాక్స్ కాస్త బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తారు. కాబట్టి చివరకు అదేదో పెద్ద ట్విస్ట్, త్యాగంలా అనిపించదు. పైగా ఇది వరకు సినిమాల్లో చూసేసి ఉండటంతో ఇక్కడ ఆ ట్విస్ట్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు.అయితే ఈ చిత్రంలో కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడి, వ్యవహరించిన తీరుని మాత్రం బాగానే చూపించారు. ఈ సినిమాలో చాలా వరకు కరోనా నాటి పరిస్థితులు, అప్పటి వైద్య వ్యవస్థ గురించే చర్చించారు. ఆ పార్ట్ వరకు డెకాయిట్ ఆడియెన్స్ని మెప్పించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు.ఎలా చేశారంటే?అడివి శేష్ ఈ సారి కాస్త కొత్తగా కనిపించాడు. యాసలోనూ చాలా వరకు మాడ్యులేషన్ చూపించాడు. ఆ యాస వల్లే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు. లుక్స్, యాక్షన్ పరంగా అడివి శేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్గా మృణాళ్ ఆడియెన్స్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఇక అనురాగ్ కశ్యప్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సునీల్, ప్రకాష్ రాజ్ కారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి. ప్రతీ పైసాకి తగ్గ వర్క్ తెరపై కనిపిస్తుంది. -
నాకు లక్ లేదనడం బాధగా ఉంది: హీరోయిన్ కృతీ శెట్టి
‘‘ఓ నటిగా నేను చేసే ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్ని సినిమాలకు సరైన బాక్సాఫీస్ ఫలితాలు రాలేదు. దీంతో నా హార్డ్వర్క్ గురించి కాకుండా నాకు లక్ లేదని కామెంట్ చేస్తున్నారు. అది నాకు బాధగా ఉంది. సినిమా రిజల్ట్ అనేది నా చేతిలో ఉండదు. కానీ అలాంటి కామెంట్స్ వల్ల ఒక అవకాశం మిస్ కావడమనేది బాధగా ఉంటుంది. ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా రిలీజవుతోంది.‘ఈ సినిమాలో ఈ అమ్మాయి ఉంది కాబట్టి డౌట్గా ఉంది’ (సినిమా రిజల్ట్ను ఉద్దేశించి) అని కామెంట్ చేస్తున్నారు. నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులు ఇలా అనుకోవడం నాకు బాధగా ఉంది. కానీ ఎప్పటిలానే ప్రతి సినిమాకీ నా వంతు కృషి చేస్తాను’’ అని చెప్పారు కృతీ శెట్టి. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. శ్రీ పద్మినీ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు.⇒ ఈ చిత్రంలో నేను ధీమా అనే పాత్ర పోషించాను. తనకు నోమోఫోబియా. అంటే ధీమా దగ్గర మొబైల్ ఫోన్ లేకపోతే ఆమెకు భయం వేస్తుంది. సోషల్ మీడియాకి బానిస అయిన అమ్మాయి. ఈ పాత్ర చేయడం నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో నయనతారగారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఓ ప్రాబ్లమ్ వచ్చి, నయనతారగారికి ఫోన్ చేయగా, ఆమె మంచి సలహా ఇచ్చారు... చక్కగా గైడ్ చేశారు. ⇒ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కథ 2040లో జరిగినా అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే... ఇప్పుడు కూడా అందరూ మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియాను ఎక్కువగానే వినియోగిస్తున్నారు. నెగటివ్ ట్రోల్స్ చేసేవారు నెగటివ్గా థింక్ చేస్తుంటారు. ఈ ఆలోచనా ధోరణి వాళ్ల జీవితాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. ఈ మధ్య అందరూ అన్నీ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. ఏమో... భవిష్యత్లో లవ్ను ఇన్సూరెన్స్ చేసే చాన్స్ ఉంటే, అలా చేస్తారేమో. నాకైతే పాత కాలపు ప్రేమలంటేనే ఇష్టం. ప్రస్తుతం నా ఫోకస్ అంతా యాక్టింగ్పైనే ఉంది. ఐదేళ్ల తర్వాతో, పదేళ్ల తర్వాతో... ఒక వ్యక్తితో డేటింగ్ చేసి, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడిగారితో సినిమా చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా అంగీకరించాను. హిందీలో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి.. -
ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు!
‘ఊరోళ్లంతా చందాలు ఏసుకొని ఈ శివరాత్రికి సతీష్కి కాసులు ఈయండి. ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు’ అనే డైలాగ్తో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్ ఆరంభమైంది. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్తో కలిసి కేఏ ప్రోడక్షన్స్ పై కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ని హీరో వెంకటేశ్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ ప్రెస్మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్ను రిలీజ్ చేసిన వెంకటేశ్గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ చూడండి... మీకు నచ్చితేనే థియేటర్స్కు వెళ్లి మా టీమ్ని సపోర్ట్ చేయండి. ‘తిమ్మరాజు పల్లి’కి వస్తే మీ ఊరు, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని గ్యారెంటీ ఇస్తున్నాను’’ అని తెలిపారు. వి. మునిరాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. ఇందులో అంతరించిపోతున్న మన సంస్కృతి, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే భావోద్వేగాలను చూస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘ట్రైలర్లో మీరు చూసిన కంటెంట్కి మించి సినిమాలో చూస్తారు. ఈ నెల 17న మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్తో మా సినిమా చూసేందుకు వెళ్లండి’’ అని వేద చెప్పారు. ‘‘మన లైఫ్లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి’’ అన్నారు సాయి తేజ్. -
అసలు కథ ఇదేనా?
ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి ఏ వార్త బయటకొచ్చినా చర్చనీయాంశమౌతోంది. తాజాగా ‘వారణాసి’ స్టోరీ లైన్ ఇది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తున్న స్టూడియో ఒకటి ఈ సినిమా కథను క్లుప్తంగా తన వెబ్సైట్లో రాసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ‘‘శివభక్తుడు (మహేశ్బాబు) కాలాతీతమైన ఓ సాహసోపేతమైన ప్రయాణం చేస్తూ, శతాబ్దాలుగా మరుగున పడిన ప్రాచీన నిగూఢ రహస్యాలను చేధించుకుంటూ ముందుకు సాగుతుంటాడు. అపారమైన శక్తి కలిగిన ఒక వస్తువు జాడ కనుక్కుని, దాన్ని చేజిక్కించుకోవడం అతని లక్ష్యం.ఈ క్రమంలో తాను ప్రయాణం చేసేలా పరిస్థితులను సృష్టించి, ప్రపంచంపై శాశ్వత ఆధిపత్యం సాధించాలనే క్రూరమైన సంకల్పం కలిగిన వ్యక్తి నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ శివభక్తుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఆ తర్వాతి పరిణామాలు ఏంటి? అన్నదే ‘వారణాసి’ కథాంశం’’ అని’’ ఆ వీఎఫ్ఎక్స్ కంపెనీ రాసుకొచ్చింది. దీంతో... ‘వారణాసి’ స్టోరీ ఇదేననే ప్రచారం సాగుతోంది. మరి... అసలు కథ ఇదేనా? అనేది తెలియాల్సి ఉంది. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారాణాసి’. ఈ సినిమాలో రుద్రగా, శ్రీరాముడిగా మహేశ్బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు.విలన్ కుంభగా పృథ్వీరాజ్, మందాకినిగా ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్తో పృథ్వీరాజ్ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. మహేశ్బాబు, ప్రియాంకాలపై చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక సెట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెట్లో మహేశ్బాబు, ప్రియాంకలపై ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. బాబుల్ సుప్రియోతో ఓ పాటను రికార్డు చేసినట్లుగా చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి ఇన్స్టాలో పేర్కొన్నారు. ఈ పాటను ఉద్దేశించే ఆయన పేర్కొన్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్’ చిత్రాలు, ‘బిగ్ బాస్’ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. నాగ శివ దర్శకత్వంలో గణపర్తి శ్వేత సమర్పణలో గణపర్తి నారాయణరావు తేలప్రోలు, ప్రసన్న ఆంజనేయులు నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.‘పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించగా, దేవ్ జాండ్ సంగీతం అందించారు. మరోవైపు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఓ కీలక పాత్రలో అర్జున్ అంబటి నటిస్తున్నారు. -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త హడావుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న డకాయిట్, కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో డకాయిట్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎల్ఐకే మూవీపై కూడా కాస్తా బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల్లోనూ ఫ్రైడే సినిమాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటిలో తాయ్ కిజవి, తూ యా మైన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10టర్న్ ఆఫ్ ది టైడ్- సీజన్-3-(హాలీవుడ్ సిరీస్) ఏప్రిల్ 10అమెజాన్ ప్రైమ్ క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10 ఓ రోమియో(హిందీ సినిమా)- ఏప్రిల్ 10జియో హాట్స్టార్తాయ్ కిజవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10హ్యాక్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 10సోనీ లివ్ తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10జీ5ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా(హిందీ మూవీ)- ఏప్రిల్ 10సన్ నెక్స్ట్ హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10 కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10ఆపిల్ టీవీ ప్లస్ ఔట్కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10లయన్స్ గేట్ ప్లే వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10 -
'ఎండు మిర్చి ఒక్కటే సరిపోదు.. మొత్తం తగలబెట్టేయాల్సిందే'.. సందీప్ రెడ్డి కౌంటర్
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దురంధర్ మూవీపై టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నిన్న రాత్రి ఈ సినిమా చూశానని.. చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. అదే సమయంలో విమర్శకులపై తన స్టైల్లో ఇచ్చిపడేశారు. రచయితలు, నటులు అనేవాళ్లు ప్రాపగండతోనే తమ కెరీర్ నిర్మించుకున్నారని.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మాత్రం పిల్లుల్లా సైలెంట్ అయిపోయిందన్నారు.ఇప్పుడదే వర్గం దురంధర్ను ఎగతాళి చేస్తోందని సందీప్ రెడ్డి వంగా విమర్శించారు. మీ మొదటి ప్రవృత్తి ఎగతాళి చేయడమే అయితే.. మిమ్మల్ని మీరు ఉదారవాదులు అని పిలిపించుకోలేరని రాసుకొచ్చారు. నిజానికి ప్రాపగండ అనే ముద్ర ఎప్పుడు పడిందో తెలియదన్నారు. ఈ విషయంలో ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. దురంధర్ మూవీకి ఈ నల్ల దృష్టి ఇలా వెళ్లదు... గుప్పెడు మిరపకాయలతో పని జరగదు.... మొత్తం పొలం తగలబెట్టాల్సిందే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కాగా.. కొందరు దురంధర్ రిలీజైనప్పటి నుంచి ప్రాపగండ ముద్ర వేస్తూ విమర్శలు చేస్తున్నారు. వారికి తన ట్వీట్తో ఇచ్చిపడేశారు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీ చేయనున్నారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like cats. Now the same clan mock Dhurandhar. You don’t get to call yourself liberal if your first instinct is to Mock. Don’t know when truth started getting labeled as propaganda...... strange times.…— Sandeep Reddy Vanga (@imvangasandeep) April 9, 2026 -
'చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా'.. రష్మిక ట్వీట్ వైరల్
ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దు గుమ్మ రష్మిక మందన్నా. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో సీక్రెట్ రిలేషన్లో కన్నడ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లాడింది. ఉదయ్పూర్లో వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. ఇటీవలే తన పెళ్లి తర్వాత తొలి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. విజయ్తో పెళ్లి తర్వాత చేసుకున్న తొలి పుట్టినరోజు కావడంతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తాజాగా తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ ఏడాది 30వ పుట్టినరోజు ఇంతకుముందు కంటే భిన్నంగా చేసుకున్నానంటూ ట్విటర్లో రాసుకొచ్చింది రష్మిక. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్లానని.. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా గుడికి కూడా వెళ్లానని ఆనందం వ్యక్తం చేసింది. సమయం లేకపోవడం వల్ల నా స్కూల్ను బయటి నుంచే చూశా.. అలా కాసేపు నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నానని చెప్పింది. ఈ రోజు నాకు ఎప్పటికీ తోడుగా ఉండబోయే వారి మధ్య కేక్ కట్ చేశానని సంతోషాన్ని పంచుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఆశీర్వదిస్తున్న వారిని.. నా పెళ్లికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులను చిన్న డిన్నర్ పార్టీలో కలిశానని తెలిపింది. ఈ రోజు వరకు నా ప్రతి విషయంలో భాగమైన నా స్కూల్ ఫ్రెండ్స్.. కుటుంబంలా మారిన నా స్నేహితుల వరకు నా లైఫ్లో ప్రతీదీ ఒక మంచి కోసమే జరుగుతుందని నేను భావిస్తున్నానంటూ రష్మిక ట్వీట్ చేసింది. నా జీవితంలో ప్రతిదీ సార్థకమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చింది. My 30th birthday was kinda different this time. ❤️Went back home after a while. Went to the temple I’ve grown up going to.. ❤️Went to my school and saw it from outside (because of time constraints 🐒🙈) and revisited childhood for a quick bit.. ❤️Cut the cake amongst the… pic.twitter.com/5ZGxuBpUAD— Rashmika Mandanna (@iamRashmika) April 9, 2026 -
నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. కేఏప్రోడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే సాగే కథగా తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. టీవీ సౌకర్యం లేని ఓ ఊరి కథగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్లో గ్రామంలోని అందరూ కలిసి ఓకే చోట టీవీ చూడటం లాంటి సీన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. -
'విశ్వంభర' విడుదల తేదీ వైరల్
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. విడుదల తేదీ గురించి నెట్టంట ఒక వార్త వైరల్ అవుతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్కు ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో చిత్ర నిర్మాతలు విఎఫ్ఎక్స్ (VFX)పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో ఆలస్యమైంది.తాజా అంచనాల ప్రకారం విశ్వంభర చిత్రం 2026 జూలై 10న థియేటర్లలోకి రావచ్చన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు తేదీలు ప్రచారంలో ఉండగా.. ఈ తేదీపైనే అందరి చూపు ఉంది. అయితే, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయినందున, విడుదల తేదీ ప్రకటనను వీడియో కంటెంట్తో చేస్తే మరింత బజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఆ విధంగా, కొత్త తేదీ ప్రేక్షకుల మనసుల్లో బలంగా నాటుకుపోతుందని చెప్పుకొస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకరవరప్రసాద్గారు’ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న చిరంజీవి మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబీతో మరో సినిమాను పట్టాలెక్కించారు. త్వరలో షూటింగ్లో కూడా చిరు పాల్గొననున్నారు. -
అవన్నీ పీరియడ్స్లో ఉండగానే చేశా: శ్రీలీల
శ్రీలీల.. తక్కువకాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. సన్నజాజి తీగలా ఉండే ఈ బ్యూటీ తన డ్యాన్స్ స్టెప్పులతో మరింత ట్రెండ్ అయింది. అయితే తాను నటించిన చాలా పాటలు పీరియడ్స్లో ఉండగానే చిత్రీకరణ జరిగాయంటోంది. తాజాగా ఓ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ.. 'నేను చాలా పాటలకు డ్యాన్స్ చేశాను. అందులో హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నెలసరి సమయంలో చేసినవే! సమానత్వం కోరుకున్నప్పుడు మనం పీరియడ్స్ను సాకుగా చూపించకూడదని నా అభిప్రాయం. సాకుగా చూపించొద్దుమనం శారీరకంగా, మానసికంగా అన్నింటిని అధిగమించి ముందుకు సాగాలి. పురుషులతో సమానంగా అవకాశాలు, అధికారం, హక్కులు కోరుతున్నప్పుడు నెలసరి వంటి సమస్యలను సాకుగా చూపించి వెనక్కు తగ్గడం కరెక్ట్ కాదు. మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి' అని పేర్కొంది. అయితే ఆమె కామెంట్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలసరిలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదని, దాన్ని ఎవరూ కావాలని సాకుగా చూపించరని కామెంట్లు చేస్తున్నారు.తప్పేముంది?డాక్టర్ చదివిన శ్రీలీలకు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా పనిచేసేవారు ఎంతమంది లేరు, ఆ ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకు వెళ్లాలని చెప్పిందే తప్ప.. తప్పుగా ఏం మాట్లాడిందని మరికొందరు శ్రీలీలను సమర్థిస్తున్నారు. ఇకపోతే శ్రీలీల చివరగా ఉస్తాద్ భగత్ సింగ్లో నటించింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.చదవండి: నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు: నటుడు -
ఓటీటీలో 'ధురంధర్-2' ట్విస్ట్.. మరింత ఆలస్యం
రణవీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్ మూవీ 'ధురంధర్-2'.. ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. అనుకున్న తేదీకంటే మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్కు రావచ్చని సమాచారం. హౌస్ఫుల్ థియేటర్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 1700 కోట్లకుపైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది. ఈ చిత్రం హక్కులు జియోహాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు టాక్ ఉంది.సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు 8వారాల థియేటర్ రన్ తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తారు. ఈ క్రమంలో ధురంధర్-2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లెక్కన మే 20లోపు ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈసారి లెక్కలు మారిపోయాయని టాక్. ప్రస్తుతం కొనసాగుతున్న ఊహాగానాల ప్రకారం, ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని జూన్ మొదటి వారానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుపుతున్నారు. మే నెల మధ్యలో టోర్నమెంట్ ఉత్కంఠభరితమైన తుది దశకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో క్రికెట్ సందడి పతాక స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్ ధురంధర్-2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే వీక్షకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఐపీఎల్ ముగియగానే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని జియోహాట్స్టార్ వ్యూహాత్మకంగా ప్రణాళిక రచిస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు. -
ధురంధర్-2కు మరో కొత్త చిక్కు
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే సుమారు రూ. 1700 కోట్ల కలెక్షన్స్ మార్క్ను అందుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కాపీరైట్ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మూవీలో తమ అనుమతి లేకుండా సాంగ్ను రీమిక్స్ చేశారని ప్రముఖ నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది.ధురంధర్-2 సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ (Hum Pyar Karne Wale) సాంగ్ బాగా వైరల్ అయింది. అయితే, ఈ సాంగ్ త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రిమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్కు సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఇదే చిత్రం నుంచి ఐకానిక్ పాట 'ఓయ్ ఓయ్'ని కూడా ధురందర్ 2లో రీమిక్స్ చేయడం విశేషం.దీంతో దర్శకుడు ఆదిత్య ధర్, బి62 స్టూడియోస్ దీనికి సమాధానమివ్వాలని కోరింది. వెంటనే ఈ పాటను మూవీ నుంచి తొలగించాలని కోరింది. లేదంటే నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఇప్పటికే ధురంధర్-2 కథ కూడా తను రాసుకున్న స్టోరీనే అంటూ సంతోశ్ కుమార్ అనే దర్శకుడు ఆరోపించిన విషయం తెలిసింది. ముంబై హైకోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేశారు. అయితే.. చోర్(దొంగతనం)లాంటి వ్యాఖ్యలు చేయడంపై కోర్టు సంతోశ్ను మందలించింది. బహిరంగంగా అలాంటి కామెంట్లు చేయొద్దని చెప్పడంతో.. ఆదిత్య ధర్కు తాత్కాలిక ఊరట లభించినట్లయ్యింది. -
రేణూ దేశాయ్పై అసభ్య కామెంట్స్.. నిందితుడి అరెస్ట్
సామాజిక మాధ్యమాలలో నటి రేణు దేశాయ్పై అసభ్యకర పోస్టు చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంటూరుకు చెందిన చెన్నయ్య ఖాళీ సమయంలో తరచుగా యూట్యూబ్లో రీల్స్ చూస్తుంటాడు. ఇటీవల నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక రీల్ను చూశాడు. ఆ రీల్ చూసిన తర్వాత చెన్నయ్య తన యూట్యూబ్ ఖాతా నుంచి ఆమెను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యను పోస్ట్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడు చెన్నయ్య గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లి చెన్నయ్యను అరెస్టు చేసి, గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
అత్తామామకు సర్ప్రైజ్ ఇచ్చిన నయనిక
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్- నిర్మల దంపతుల ఇంట ఇటీవలే ఓ శుభకార్యం జరిగింది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డిని ప్రేమించగా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. మార్చి 6న ఎంతో ఘనంగా ఈ వివాహం జరిగింది.అరవింద్ పెళ్లిరోజుతాజాగా ఈ కొత్త జంట ఇంట్లోవారికి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్ 7న అల్లు అరవింద్ - నిర్మల పెళ్లిరోజు. ఈ సందర్భంగా అత్తామామల కోసం చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసింది కొత్త కోడలు నయనిక. వారితో కేక్ కట్ చేయించి ఈ వెడ్డింగ్ యానివర్సరీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.డిన్నర్ పార్టీ'అమ్మానాన్నల 52వ పెళ్లిరోజు. నేను, నయనిక కలిసి ఇంట్లోనే డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాం' అని తెలిపాడు. ఈ వేడుకలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా భాగమైంది. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టడంతోనే అత్తామామలకు మంచి సర్ప్రైజ్ ఇచ్చిందని నెట్టింట నయనికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.చదవండి: సాయిపల్లవి మూవీ.. క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్ ఖాన్ -
డెకాయిట్ నిర్మాత సుప్రియపై సమంత ప్రశంసలు
సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న డెకాయిట్ సినిమాపై నటి సమంత ఒక పోస్ట్ షేర్ చేశారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని షానియల్ డియో తెరకెక్కించారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపిస్తూనే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు.డెకాయిట్ చిత్రం విజయం సాధించాలని నిర్మాత సుప్రియకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. 'డియర్ సుప్రియ డెకాయిట్ చిత్రం కోసం నువ్వు చాలా కష్టపడ్డావ్.. సినిమాపై నీవు చూపే అంకితభావం చాలా గొప్పగా ఉంటుంది. ఈ చిత్రం కోసం నీవు పడిన శ్రమ, నిబద్ధత అన్నీ నేను చాలా దగ్గరగా చూశాను. ఒక నిర్మాతగా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవాలని దానికి పూర్తి అర్హత నీకుందని నేను నమ్ముతున్నాను. దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ నీకు ఉంటాయ్.. ఈ మూవీలో నటించిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్కు నా అభినందనలు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలని కోరుకుంటున్నాను.' అని ఆమె పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమయం ఇవ్వండి.. సౌత్ ఫ్యాన్స్కు కయదు లోహర్ రిక్వెస్ట్
డ్రాగన్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ అస్సామీ భామ కయాదు లోహర్. ఆ చిత్రం అనూహ్య విజయంతో ఈమె పేరు సినీ వర్గాల్లో మారుమోగింది. అంతే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. మలయాళం, తెలుగు, కన్నడం, మరాఠి భాషల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగులో నటించిన ఫంకీ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే మలయాళంలో నటించిన పళ్లిచటంబి చిత్రం త్వరలో తెరపైకి రానుంది.ఇలా పలు భాషల్లో చుట్టేస్తున్న కయదు లోహర్(Kayadu Lohar) ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తమిళంలో స్పష్టంగా మాట్లాడటం లేదే అని అడుగుతున్నారనీ, ఇప్పుడే ఒక్కో భాషల్లో చిత్రాలు చేస్తున్నానని, అయితే తాను దక్షిణాదికి చెందిన అమ్మాయిని కాదని అన్నారు. అయినా తనవల్ల అయినంత వరకూ ఒక్కో భాషను నేర్చుకోవడానికి యత్నిస్తున్నానని అన్నారు. ఏ భాషలో నటించినా, ఆ భాషలో మాట్లాడటమే ముఖ్యం అన్నారు. అందుకే ఇతర భాషలను నేర్చుకోవడానికి నూరు శాతం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కొంచెం సమయం ఇవ్వండి తమిళం, తెలుగు, మలయాళం తదితర దక్షిణాది భాషల్లో సరళంగా మాట్లాడతానన్నారు. డ్రాగన్ చిత్రం తరువాత కోలీవుడ్లో వరుసగా నటించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు తాను మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని, మంచి సక్సెస్ఫుల్ చిత్రంతో మళ్లీ వస్తానని చెప్పారు. డ్రాగన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులు తనపై చూసిన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ అన్నారు. కాబట్టి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించి వారిని అలరించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా తెలుగులో ఈ అమ్మడు నానికి జంటగా ది పారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా ఇంతకు ముందు తమిళంలో నటించిడానికి అంగీకరించిన ఇమ్మార్టల్, ఇదయం మురుళి చిత్రాలు విదుదల కావలసి ఉంది. కాగా నటుడు శింబుకు జంటగా ఆయన 49వ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారీ బ్యూటీ. -
కడదాకా ఉంటానన్నావ్, మధ్యలోనే వదిలేశావ్: నటుడి భావోద్వేగం
మనకు బాగా కావాల్సినవారిని కోల్పోతే ఆ బాధ మాటల్లో వర్ణించలేం. ప్రముఖ నటుడు ఉత్తేజ్ కొన్నేళ్లుగా అదే బాధలో ఉన్నాడు. జీవితాంతం చేయి వదలనని మాటిచ్చిన భార్య మధ్యలోనే ఊపిరి వదిలేయడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఉత్తేజ్ భార్య పద్మావతి 2021లో క్యాన్సర్తో కన్నుమూసింది. తాజాగా పెళ్లిరోజు సందర్భంగా భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు.మార్గమధ్యంలో చేయి వదిలేశావ్'పద్దూ, ఈరోజు మన పెళ్లిరోజు. ఇపుడు బాగా గుర్తుంటోంది. అప్పట్లో నీ పుట్టినరోజుని, మన పెళ్లిరోజుని మాత్రం రెండు నెలల ముందునుంచే గుర్తుపెట్టుకొని.. డేట్ వల్లె వేస్తూ ఉండేవాడిని.. ఎక్కడ మర్చిపోతానో అని! ఇది అందరి మొగుళ్లకి అనుభవైకవేద్యమే.. ఎలా ఉన్నావు పద్దూ.. కడదాకా, నే కడతేరే దాకా నా వెంటే ఉంటానన్నావు. మార్గమధ్యంలో చెయ్యి వదిలేశావ్... పట్టు సడలి కిందపడ్డాను.. లేచి చూస్తే నువ్వు లేవు.. పిలిచా, అరిచా, ఏడ్చా.. నువ్వులేవు. ముందుగా వెళ్తావనుకోలేఇంకా వెదుకుతూనే ఉన్నా.. సంతలో తప్పిపోయిన పిల్లాడు అమ్మకోసం వెదుక్కున్నట్టు! తప్పు చేశావు పద్దూ.. నన్ను మరీ డిపెండెంట్ చేశావ్.. అన్నింటికీ తోడున్నావ్.. అన్నింటికీ ముందున్నావు. నేనున్నాను పదయ్య అన్నావు. నేనున్నాగా పర్లేదన్నావ్.. ధైర్యం అయ్యావు. ఆలంబన అయ్యావు. ఆసరా అయ్యావు. ముందుంటావనుకున్నా.. ముందుగా వెళ్తావనుకోలేదు. అన్ని పనులు... భోజనం, ఆలనా పాలనా ఓ మ్యాజిక్లా సాక్షాత్కారమయ్యేవి. తిట్టుకున్నా, అరుచుకున్నా నవ్వుతా.. తుళ్ళుతా ఉండేదానివి. మిస్ యూనాన్నలా భుజం తట్టావు. తిట్టావు కూడా.. అమ్మలా అక్కున చేర్చుకున్నావు.. ఫ్రెండ్లా తోడున్నావు. పాటమ్మకి నిన్ను తెచ్చివ్వలేను, ఆ స్పర్శని అందివ్వలేను, కానీ నీ బాధ్యతని, నీ ప్రేమని అందించే ప్రయత్నం చేస్తున్నా.. నాన్నలా 100% ఉంటాను.. దానికి నేనయినా ఉన్నాను... నాకే ఎవరూ లేరు.. లవ్యూ పద్దూ, నిన్ను చాలా మిస్ అవుతున్నాం' అని రాసుకొచ్చాడు. కాగా ఉత్తేజ్.. మనీ మనీ, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, మహాత్మ వంటి పలు చిత్రాలకు సంభాషణలు రాశాడు. హిట్లర్, ప్రేమించుకుందాం రా, అభిషేకం, అన్నయ్య, బద్రి, ఖడ్గం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, జై చిరంజీవ.. ఇలా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. View this post on Instagram A post shared by Uttej Artiste (@uttejartiste) చదవండి: విజయ్ ర్యాలీలో ప్రమాదం.. రజనీకాంత్ హెచ్చరిక -
సుకుమారి పూర్తి
‘మసూద, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రాల ఫేమ్ తిరువీర్ హీరోగా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫొటోలో తిరువీర్, ఐశ్వర్యతో పాటు టీమ్ మొత్తం హ్యాపీ వైబ్లో కనిపించారు. ‘‘వినోదాత్మక చిత్రంగా రూపొందుతోన్న మూవీ ‘ఓ..! సుకుమారి’. ‘రజాకార్, పొలిమేర’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సీహెచ్ కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామేన్గా వ్యవహరించారు. భరత్ మంచిరాజు మంచి సంగీతం అందించారు. మా సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
భావోద్వేగాల లెనిన్
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఓ డిఫరెంట్ స్టోరీతో ‘లెనిన్’ రూపొందిస్తున్నాం. భావోద్వేగాలతో పాటు ఆకట్టుకునే కథనంతో కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు మురళీ కిషోర్ అబ్బూరు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్తో మా చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. అక్కినేని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జూన్ 26న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: లియోన్ బ్రిట్టో. -
ఆ థియేటర్లలో మా సినిమాలు వేయం
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC).. సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పర్సంటేజీ విధానంపై సినిమాలు ప్రదర్శించాలని ఆదేశించింది. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదని పేర్కొంది. పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేసింది.ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి తమ కండీషన్స్ మేరకు సినిమాలని విడుదల చేస్తామని.. అలానే ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించిన పర్సంటేజీ విధానం అనుసరించే థియేటర్లలో తమ చిత్రాల్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా లేమని గిల్డ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి లేఖలో ఈ విషయాల్ని పేర్కొంది.ప్రస్తుతం యాక్టింగ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల్లో రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్, నాగవంశీ, రవికిశోర్, సుప్రియ, స్వప్నదత్, సుధాకర్ చెరుకూరి, బాపినీడు, సాహు గారపాటి తదితరులు ఉన్నారు. అద్దె విధానానికి బదులు మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ విధానంలోకి హైదరాబాద్లోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లు వస్తాయని ఫిల్మ్ ఛాంబర్ ఈ మధ్యే నిర్ణయించింది. ఈనెల 3వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ దీన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. -
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ.. హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..!
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్..అమ్మ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న నిత్యా మీనన్..ఐటమ్ సాంగ్ లుక్లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్ పిక్స్..హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్.. వేకేషన్లో చిల్ అవుతోన్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బుల్లిరాజుకు ప్రతిష్టాత్మక అవార్డ్
గతేడాది సంక్రాంతికి బ్లాక్బస్టర్గా నిలిచిన ఫుల్ ఫ్యామీలీ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు.తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ(ఐఎన్సీఏ) అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ డైరెక్టర్తో పాటు బెస్ట్ యాక్టర్ కామెడీ రోల్ విభాగంలో అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ డైరెక్టర్గా అనిల్ రావిపూడి అవార్డ్ సొంతం చేసుకోగా.. కామెడీ రోల్ బెస్ట్ యాక్టర్గా రేవంత్(బుల్లిరాజు) దక్కించుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ప్రత్యేక పోస్టర్స్ను రిలీజ్ చేస్తూ గుడ్ న్యూస్ పంచుకుంది. ఐఎన్సీఏ అవార్డులు ప్రకటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. #SankranthikiVasthunam shines again on national stage 🌟'Hit Machine' @AnilRavipudi's directorial bags two prestigious honours at #INCA2026 🤩🏆#AnilRavipudi - Best Director#Revanth - Best Actor in a Comedy RoleVictory @VenkyMama @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/6meCSmPrRD— Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2026 -
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
ప్రపంచంలో స్వేచ్ఛకు సరిహద్దు ఉండకపోవచ్చు గాని వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రం హద్దులు, సరిహద్దులతో పాటు పరిమితులు కూడా ఉంటాయి. స్నేహితులైనా, కుటుంబసభ్యులైనా అంతెందుకు కట్టుకున్న భాగస్వామికి అయినా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనివ్వాలి అనే సందేశాన్ని సుస్పష్టంగా ఇచ్చిన సిరీస్ చిరయ్యా. దివి నిథి శర్మ ఆలోచనకు శశాంత్ సింగ్ దర్శకత్వం వహించి తెర రూపమిచ్చిన సిరీసే ఈ చిరయ్యా. చాలా సున్నితమైన అంశాన్ని చక్కటి డ్రామాతో 6భాగాలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు.పెళ్ళైతే చాలు కట్టుకున్న పెళ్ళాం ఇష్టం తో పని లేకుండా తనని తన సొంత ఆస్తిలా భావించే ప్రబుద్ధులకు ఈ సిరీస్ ఓ గుణపాఠమనే చెప్పాలి. హాట్ స్టార్ లో తెలుగులోనూ లభ్యమవుతున్న ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే. కాని చూసిన ప్రతి ప్రేక్షకుడి మనస్సు చివుక్కుమనడం ఖాయం. పెళ్లైన ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది. అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓసారి చూద్దాం. పెద్దలు కుదిర్చిన సంబంధంతో పూజ అరుణ్ ని పెళ్ళి చేసుకుని అత్తింట్లో అడుగుపెడుతుంది. అత్తమామలు ఇద్దరితో పాటు మిగతా కుటుంబసభ్యులంతా ఎంతో అపురూపంగా చూసుకుంటారు పూజని. ఆ కుటుంబంలో అరుణ్ వదిన దివ్య మొదట్లో పూజని కాస్త బెట్టుగా చూసినా తరువాత కలిసిపోతుంది. అందరూ బాగున్నా అరుణ్ తో పూజకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య గురించి తాను ఎవ్వరితో చెప్పుకోలేదు. అప్పుడు దివ్యకి పూజ సమస్య తెలుస్తుంది. కన్నబిడ్డ కన్నా ఎంతో అనురాగఆప్యాయతలతో పెంచిన అరుణ్ అసలు స్వరూపం తెలుసుకున్న దివ్య పూజకి ఎలాంటి పరిష్కారం చూపుతుందో చిరయ్యా సిరీస్ చూసే తెలుసుకోవాలి. నిజానికి ఈ సిరీస్ లోని పాయింట్ చాలా సున్నితమైన అంశం. దర్శకుడు ఎక్కడా అశ్లీలతకు ఎక్కువగా తావివ్వకుండా ఎంతో హుందాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతే ధీటుగా ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునేలా ఉందీ సిరీస్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పరిష్కారం సూపర్ అని చెప్పాలి. పెద్దలు మాత్రమే చూడదగ్గ ఈ సిరీస్ వీకెండ్ కు మంచి కాలక్షేపం.-హరికృష్ణ ఇంటూరు -
అల్లు అర్జున్ రాకా.. అసలు ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా?
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైటిల్ వచ్చేసింది. అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు ఫుల్ మాస్ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఇకపై రాకా అనే పేరుతో తెరకెక్కించునున్నారు. టైటిల్తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ టైటిల్ గురించి టాలీవుడ్లో నెట్టింట చర్చ మొదలైంది. అసలు రాకా అంటే అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. మనిషి, మృగం కలగలిపిన పోస్టర్ చూస్తుంటే.. రాక్షసుడనే అర్థం వచ్చేలా టైటిల్ ఎంచుకున్నారా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు బన్నీ నెగెటివ్ రోల్ చేయనున్నారని టాక్. అది చెప్పేందుకే రాకా పేరును ఎంచుకున్నారేమోనని కొందరు అంటున్నారు.మరికొందరేమో రాకా అంటే.. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని కూడా అలానే పిలుస్తారని అంటున్నారు. ఎందుకంటే చీకటి, చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు అభిమానులు భావిస్తున్నారు. పౌర్ణమి రోజు మనుషులు తోడేళ్లుగా మారుతారనే అపోహలు కూడా ఉన్నాయని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్పై ఎవరికీ తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు వెతుక్కుంటున్నారు. మరి అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ తెలిసేలా కనిపిచడం లేదు.The wait is over.Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026 -
నల్లగా, గలీజ్గా ఉందన్నారు.. అమ్మ ఘోరంగా ఏడ్చింది : జబర్ధస్త్ ఫైమా
వచ్చే జన్మలో అయినా ఆడపిల్లగా కాకుండా మగాడిగా పుట్టాలని అంటోంది జబర్ధస్త్ ఫైమా. పటాస్ షోతో వెండితెరకు పరిచయం అయిన ఈ లేడి కమెడియన్.. జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయింది. ఇక బిగ్బాస్ రియాల్టీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలతో దూసుకెళ్తుంది. అయితే కెరీర్ ప్రారంభంలో మాత్రం ఫైమా చాలా అవమనాలను ఎదుర్కొందట. నల్లగా ఉందంటూ కొంతమంది ట్రోల్ చేశారట. తాజాగా ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్న ఫైమా.. తన కెరీర్ గురించి.. పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.అమ్మ ఘోరంగా ఏడ్చింది..కెరీర్ ప్రారంభంలో చాలా అవమనాలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్లకు నాకు హైప్ వచ్చింది. అందరూ ‘వీ వాంట్ ఫైమా’ అని అంటుంటే..కొందరు మాత్రం ‘ఏముంది దీనిలో అంత పొడుగుతున్నారు. గలీజ్గా, నల్లగా ఉంది’ అని ట్రోల్ చేశారు. నాతో పాటు మా అక్కలు కూడా అవి చూసి బాధపడ్డారు. ఒక రోజు నేను మా అమ్మకు ఫోన్ చేసి ‘ఎందుకు అమ్మ నన్ను ఇంత నల్లగా కన్నావు’ అని అడిగా. అప్పుడు అమ్మ ఘోరంగా ఏడ్చింది.కొత్త డ్రెస్ కోసం ఏడ్చేదాన్నిమాది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. వేసుకోవడానికి సరైన డ్రెస్లు కూడా ఉండేవి కాదు. ఇంటి పక్కనవాళ్లు కొత్త డ్రెస్ వేసుకుంటే ఏడ్చేదాన్ని. మేం మొత్తం నలుగురం అక్కాచెల్లెళ్లం.నేనే అందరికంటే చిన్నదాన్ని. వాళ్లు వేసుకున్న డ్రెస్సులే నాకు ఇచ్చేవాళ్లు. ఎప్పుడైనా డ్రెస్ కొనుక్కోవాల్సి వస్తే.. నలుగురు అక్కలకు కొనుక్కున్న డ్రెస్ ముక్కల నుంచి ఒక్కొక్కటి ఇచ్చి నాకు కొత్త డ్రెస్ కుట్టించేవాళ్లు. ఇప్పుడు అలా కుట్టించుకుంటే ఫ్యాషన్ అంటున్నారు(నవ్వుతూ..).గడ్డి మందు ఇచ్చి చంపాలి..ఇక చిన్న పిల్లలపై జరుగున్న అఘాయిత్యాల గురించి ఫైమా మాట్లాడుతూ..‘అలాంటి పనులు చేసినవాళ్లను గడ్డి మందు ఇచ్చి చంపాలి. చనిపోయే ముందు అయినా ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలియాలి. నాను పవర్స్ ఇస్తే అలానే చేస్తా. ఒక ఆడపిల్లగా జీవించడం చాలా కష్టం. ఆడపిల్లగా పుట్టినందుకు నేను అస్సలు హ్యాపీగా లేను. మనం అనుకున్నంత ఈజీ కాదు ఆడపిల్లగా బతకడం. చాలా కష్టాలు ఉంటాయి. వచ్చే జన్మలోనైనా నేను మగాడిలా పుట్టాలని కోరుకుంటున్నాను’ అని ఫైమా అన్నారు. -
అడివి శేష్ డకాయిట్.. ఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఇటీవల ట్రైలర్ రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో హిట్ కొట్టాలని అడివి శేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఆడియన్స్ను అలరించాయి. నీవెంట నేను అంటూ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. శ్రీరామచంద్ర ఆలపించారు. ఈ సాంగ్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. కాగా.. మూవీని ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. A melody born from a heart that truly loves 🎶💕#Dacoit third single out now ❤️#NeeventaNenu (Telugu) sung by @Sreeram_singer ▶️ https://t.co/Ins3Eg6tx6#TuJahaan (Hindi) sung by @AdityaRikhariii ▶️ https://t.co/1UxWgVECH5Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS… pic.twitter.com/SespX3usQI— Annapurna Studios (@AnnapurnaStdios) April 8, 2026 -
ఆమెతో బ్రేకప్.. గట్టిగా అరిచా, ఏంటేంటో చేసేశా : సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. కామెడీ కంటే ఎక్కువ ఆ షో హోస్ట్ రష్మితో నడిపిన లవ్ట్రాక్ సుధీర్ని మరింత ఫేమస్ చేసింది. ఆ ఫేమ్లో పలు షోలకు హోస్ట్గా చేసే అవకాశం వచ్చింది. అవి కూడా సక్సెస్ కావడంతో సుధీర్కు వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన పలు షోలకు హోస్ట్గా చేస్తున్నాడు. అందులో ఒకటి సర్కార్ సీజన్ 6. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది.ఇక ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్లో 'పాపం ప్రతాప్' మూవీ టీమ్ సందడి చేసింది. ఇందులో సుధీర్ తన బ్రేకప్ స్టోరీని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.14 ఏళ్ల పాటు ప్రేమలో..సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఒకనొక దశలో యాంకర్ రష్మితో ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాళ్లిద్దరు కేవలం షో కోసం మాత్రమే లవ్ట్రాక్ నడిపామని చెప్పడంతో ఆ పుకార్లకు బ్రేక్ పడింది. అయితే రష్మితో కానీ మరో అమ్మాయితో సుధీర్ 14 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడట. చివరి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి సింగిల్గానే ఉంటున్నాడట. బ్రేకప్.. నెక్లెస్ రోడ్పై పరుగెత్తా..సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ఎపిసోడ్లో సుధీర్ బ్రేకప్ స్టోరీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘14 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నాం. ఆ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. విషయం తెలిసి..ఏంటి ఇదంతా అని అడిగితే..‘ ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా..డిస్ట్రబ్ చేయకు’ అని చెప్పింది. చాలా బాధపడ్డా. నెక్లెస్ రోడ్డులో పరిగెడుతున్నా, అరుస్తున్నా.. ఏంటేంటో చేసేశా.. అంటూ బ్రేకప్ చెప్పిన రోజు జరిగిన విషయాన్ని వివరిస్తూ.. ఎమోషల్ అయ్యాడు. పక్కనే ఉన్న కో హోస్ట్ విష్ణు ప్రియ.. సుధీర్ని హగ్ చేసుకొని ఓదార్చింది. -
పెద్ది ఐటమ్ సాంగ్.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్కు ఛాన్స్.!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఈ స్టోరీ ఉండనుంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ హైలెట్గా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు ఇప్పటికే మృణాల్ ఠాకూర్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా టాలీవుడ్లో మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హిట్ కొట్టిన మానస వారణాసిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. యంగ్ హీరోయిన్ అయితే ఈ పాట మరింత హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ చేసేందుకు మృణాల్ ఠాకూర్ నో చెప్పినట్లు సమాచారం. అయితే మానస వారణాసి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. -
ప్రాణాలు పణంగా పెట్టా.. నన్నెవరూ పట్టించుకోలేదు: ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఈ మధ్య చెప్పి మరీ హిట్ కొడుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' మూవీతో విజయం అందుకున్నాడు. ఇప్పుడు సమ్మర్లో 'బైకర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. శర్వానంద్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయలేదు. పెద్ద ప్రమాదంకేవలం కథల్ని మాత్రమే నమ్ముకుంటూ ముందుకు వెళ్లాను. జాను మూవీ కోసం థాయ్లాండ్లో స్కైడైవింగ్ చేస్తూ పెద్ద ప్రమాదానికి గురయ్యాను. అది కేవలం సినిమా కోసమే చేశాను.. నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇండస్ట్రీలో ఎవరూ స్పందించలేదు. అది చూసి బాధ పడ్డాను. అసలు నాకు ప్రమాదం జరిగిందని కూడా కొందరికి తెలియనే తెలియదు. అంటే నేను అంత తక్కువవాడినా? నేను సరిగా కష్టపడట్లేదా? నా పనైపోయిందా? అని చాలా ఫీలయ్యాను. బైకర్తో నేనేంటో నిరూపించుకోవాలనుకున్నాను, నిరూపించుకున్నాను అని శర్వానంద్ తెలిపాడు. ఇది విన్న అభిమానులు శర్వా మనసులో ఇంత బాధ ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీలో ఉన్నా: మృణాల్ ఠాకూర్ -
కేవలం సినిమా మాత్రమే కాదు.. అంతకు మించి: రాకాపై అట్లీ ట్వీట్
ఐకాన్ స్టార్ అభిమానులకు ఈ రోజు పండగే. బన్నీ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ అట్లీ. ఎక్కడా లీక్ కాకుండా అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. బన్నీ పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూవీకి రాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ అట్లీ.. హీరో అల్లు అర్జున్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సార్ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. రాకా కేవలం సినిమా మాత్రమే కాదన్నారు. కొన్నేళ్లుగా నా వెంట మోసుకొస్తున్న భాగమన్నారు. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నా.. అది ఎప్పటికీ మసకబారకుండా చూసుకున్నానని అట్లీ ట్వీట్ చేశారు. అది నన్ను పరీక్షించడమే కాకుండా తీర్చిదిద్దేలా చేసిందన్నారు. ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచిందని రాసుకొచ్చారు. నిజం చెప్పాలంటే... ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అట్లీ పోస్ట్ చేశారు. #Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs— atlee (@Atlee_dir) April 8, 2026 -
ఆ హీరో వల్లే ఇండస్ట్రీలో ఉన్నా.. నా సక్సెస్కు అతడే కారణం: మృణాల్
తెరపై అవకాశాలు సంపాదించడం అంత ఈజీ కాదు. ఒక్క ఛాన్స్ రావడానికి కొందరికి ఏళ్లకు యేళ్లు పడుతుంది. మరికొందరికి వెంటనే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. అందులోనూ బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ ఛాలెంజెస్ను దాటుకుని బుల్లితెర నటి అన్న ట్యాగ్ నుంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ నుంచి సినిమాల్లోకి..2012లో ముజ్సే కుచ్ కేటి.. యే ఖామోషియాన్ సీరియల్లో నటించింది. తర్వాత అర్జున్, కుంకుమ భాగ్య సీరియల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మరాఠిలో ఒకే ఏడాది (2014) మూడు సినిమాలు చేసింది. అయినా మృణాల్ ఠాకూర్కు బ్రేక్ రాలేదు. మళ్లీ సినిమా చేయడానికి నాలుగేళ్లు పట్టింది. అయితే ఓ హీరోతో చేసిన యాడ్ వల్ల తన కెరీర్ మలుపు తిరిగిందంటోంది మరాఠి బ్యూటీ.ఆ హీరో వల్లే..మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెకాయిట్. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. హీరో రణ్వీర్ సింగ్ నా లక్కీ చార్మ్. నేను చిత్రపరిశ్రమలో ఉండటానికి ఆయనే కారణం. కెరీర్ తొలినాళ్లలో మోడల్గా ఆయనతో కలిసి ఓ హెయిర్బ్రాండ్ యాడ్లో నటించాను. ఆ వాణిజ్య ప్రకటన రిలీజైన తర్వాతే చాలామంది దర్శకనిర్మాతలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే ఈ సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనే ఇస్తాను. ఆయన నాకెంతో సాయం చేశారు. తనెప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటాడు. సినిమాధురంధర్ మూవీలో అయితే నాకు రణ్వీర్ కనిపించలేదు, హంజా మాత్రమే కనిపించాడు. అంత అద్భుతంగా నటించాడు. ఆయన ఇలాంటి బ్లాక్బస్టర్స్ మరెన్నో అందుకోవాలి అని చెప్పుకొచ్చింది. కాగా రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవగా.. ఈ ఏడాది మార్చి 19న దానికి సీక్వెల్ వచ్చింది. అదే ధురంధర్: ద రివేంజ్. రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.చదవండి: అల్లు అర్జున్- అట్లీ సినిమా టైటిల్ ఇదే.. గుండుతో కనిపించిన బన్నీ -
రష్మిక ఊర్లో రిసెప్షన్.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఇద్దరూ స్టార్ సెలబ్రిటీలే.. కానీ ఇద్దరి మధ్య ఎక్కడా కించిత్తు గర్వం కనిపించదు. ప్రేమ, అనురాగానికి తప్ప మరోదానికి చోటు లేదు అన్నట్లుగానే కనిపిస్తారు. వారి పెళ్లి వేడుకలు కూడా అలాగే చేసుకున్నారు. కేవలం వారికి మాత్రమే గుర్తుండిపోయేలా కాకుండా నలుగురూ గుర్తుపెట్టుకునేలా, నాలుగు కాలాలపాటు మాట్లాడుకునేలా సెలబ్రేషన్స్ జరిపారు. కొడవ పద్ధతిలో రిసెప్షన్అభిమానులకు స్వీట్లు పంచడం, ఊర్లోని మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రకటించడం, ఊరందరికీ భోజనాలు పెట్టడం.. ఇలా వారు చేసిన ప్రతీ పని మెచ్చుకోదగినదే! అయితే రష్మికను తెలుగింటి కోడలిగా పరిచయం చేస్తూ విజయ్ ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. అచ్చం అలాగే రష్ పేరెంట్స్ కూడా బంధువులకు, స్థానికులకు విజయ్ను అల్లుడిగా పరిచయం చేస్తూ తమ సొంతూరైన విరాజ్పేటలో రిసెప్షన్ నిర్వహించారు. మర్చిపోలేని కానుకకొడవ సాంప్రదాయం ప్రకారమే ఈ వేడుక జరిపారు. ఈ సందర్భంగా రష్మిక తండ్రి మదన్ మందన్నా కూతురికి విలువైన కానుక ఇచ్చాడు. పెళ్లయ్యాక అత్తారింటికి సాగనంపిన కూతురి కోసం కలకాలం గుర్తుండిపోయే బహుమతిచ్చాడు. విరాజ్పేట సమీపంలో సెరెనిటీ పేరుతో ఉన్న ఓ బంగ్లాను కూతురికి రాసిచ్చాడు. తండ్రిచ్చిన గిఫ్ట్తో రష్మిక భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది.సినిమాకాగా రష్మిక మందన్నా- విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. వీరు గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం రణబాలి సినిమాలో జంటగా యాక్ట్ చేస్తున్నారు.చదవండి: ఆగిపోయిన డ్రాగన్ షూటింగ్? స్పందించిన ప్రశాంత్ నీల్ టీమ్ -
రాజమౌళి చేయలేనిది.. ‘రాకా’ టీమ్ చేసింది!
సాధారణంగా ఓ పెద్ద సినిమా వస్తుందంటే.. టైటిల్ ముందుగానే లీకవుతుంది. ఇలా షూటింగ్ మొదలవ్వగానే అలా లుక్ బయటకు వస్తుంది. చిత్ర యూనిట్ ఎంత గోప్యంగా ఉంచినా సరే.. ఏదో ఒక రకంగా లీకేజీలు జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లు అర్జున్-అట్లీ సినిమా విషయంలో ఇది జరగలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఒక్క లీకేజీ కూడా బయటకు రాలేదు. సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ముందే లీక్ చేసే మీడియా కూడా ఈ సినిమా టైటిల్ ని పసి గట్టలేకపోయింది. లెగసీ, వైల్డ్ ఫైర్, అయాన్, స్పార్క్..ఇలా రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఈ చిత్రానికి ‘రాకా’(Raaka) అనే టైటిల్ని ఖరారు చేసిన విషయం అధికారికంగా ప్రకటించేవరకు ఎక్కడ బయటకు రాలేదు.ఎంతో గోప్యంగా షూటింగ్ మొదలుపెట్టే రాజమౌళి సైతం ఈ లీకేజీ భారీ నుంచి తప్పించుకోలేకపోయాడు. మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ టైటిల్..అధికారిక ప్రకటనకు ముందే బటయకు వచ్చేసింది. అలాగే మహేశ్ లుక్తో పాటు కొన్ని స్టిల్స్ కూడా ముందే నెట్టింట దర్శనమిచ్చాయి. అలాగే ‘ఫౌజీ’లోని ప్రభాస్ లుక్ కూడా ముందే లీకైపోయింది. ఈ లీకేజీని అరికట్టడంలో ‘రాకా’టీమ్ సక్సెస్ అయింది. (చదవండి: 'రాకా' పోస్టర్ రిలీజ్.. ఊహించని లుక్లో బన్నీ..)టైటిల్ విషయం చిత్ర యూనిట్కి కూడా ముందుగా చెప్పలేదట. నిర్మాతలతో పాటు అల్లు అర్జున్-అట్లీకి తప్పా..మిగతావారెవరికీ ఈ సినిమా టైటిల్ తెలియకుండా జాగ్రత్త పడ్డారట. అలాగే అల్లు అర్జున్ లుక్ కూడా ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. మనిషి, మృగం కలగలిపిన బన్నీ లుక్కి సంబంధించిన సన్నీవేశాలను చాలా గోప్యంగా చీత్రీకరించారట. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క లీకేజీ కూడా రాలేదు. ఈ విషయంలో ‘రాకా’ టీమ్ నుంచి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి. వాళ్లు తీసుకున్న జాగ్రత్తలను ఫాలో అయితే.. లీకేజీల బాధ నుంచి బయటపడతారు. రాకా విషయానికొస్తే.. ఈ చిత్రంలో బన్నీ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రిలీజ్ చేసింది విలన్ లుక్. హీరో పాత్రకు సంబంధించిన లుక్ చాలా స్టైలీష్గా ఉంటుందని టాక్. మరి ఆ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో దీపికా పదుకొణె పేరు అధికారికంగా ప్రకటించారు. మరో ఇద్దరు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంచారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. The wait is over.Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026 -
అల్లు అర్జున్- అట్లీ మూవీ టైటిల్ ఇదే.. రాక్షసుడిగా బన్నీ లుక్!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అప్పటివరకు సౌత్లో ఫాలోయింగ్ తెచ్చుకున్న అతడు పుష్ప తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. నేషనల్ లెవల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవల్లోనూ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పైజీపైనా స్థానం సంపాదించుకున్నాడు. సినిమా కోసం ఎంతదూరమైనా వెళ్లే బన్నీ.. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.రాకాఈ మూవీకి లెగసీ, అయాన్, స్పార్క్.. ఇలా రకరకాల టైటిల్స్ పరిశీలించగా చివరాఖరకు ఓ మంచి టైటిల్ను ఫైనల్ చేశారు. నేడు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి "రాకా" టైటిల్ను ప్రకటించారు. అలాగే పోస్టర్ కూడా వదిలారు. ఇందులో బన్నీ అరగుండుతో, తోడేలు వంటి చేయితో నెగెటివ్ లుక్లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు పోస్టర్ చాలా వైవిధ్యంగా ఉందని, బన్నీ లుక్తో తమ కడుపు నింపేశారని చిత్రయూనిట్ను కొనియాడుతున్నారు.సినిమారాకా సినిమా విషయానికి వస్తే.. ఇది పునర్జన్మల కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న చిత్రమని సమాచారం. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ముందునుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేడు రాక్షసుడిగా బన్నీ లుక్ను వదిలినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. #AA22xA6 is now #Raaka ⚔️Prepare yourself for a vision beyond limits ✨@alluarjun @Atlee_dir @deepikapadukone⁰#राका | #రాకా | #ರಾಕಾ | #ராக்கா | #രാക്ക | #রাকা | راکا# pic.twitter.com/ymTBHoOfpI— Sun Pictures (@sunpictures) April 8, 2026 చదవండి: నయన్ సడన్ సర్ప్రైజ్.. స్టేజ్పై భర్త ఎమోషనల్ -
ఆగిపోయిన డ్రాగన్ షూటింగ్? స్పందించిన టీమ్
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్). కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. గత నెలలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే కొద్దిరోజులుగా తారక్ మేకోవర్ గురించి, అలాగే షెడ్యూల్ రద్దయిందంటూ కొన్ని రూమర్స్ వైరలవుతున్నాయి.అందులో నిజం లేదుఈ ప్రచారంపై చిత్రయూనిట్ స్పందించింది. లుక్ గురించి కానీ, షెడ్యూల్ రద్దయినట్లు వస్తున్న ప్రచారంలో కానీ ఏమాత్రం నిజం లేదు. కేవలం చిన్నపాటి విరామాలతో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే సినిమా ముందుకు సాగుతోంది. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయొద్దని, నమ్మవద్దని కోరుతున్నాం అని ట్వీట్ చేసింది. దీంతో తారక్ సినిమా కొత్త షెడ్యూల్ క్యాన్సిల్ అయిందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.సినిమాసినిమా విషయానికి వస్తే.. ఇందులో కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాను ఈ సినిమాలో లేనని మలయాళ నటుడు టొవినో థామస్ మీడియా ముఖంగా చెప్పాడు. కానీ అతడి పాత్ర మాత్రం సినిమాలో ఉందని వినికిడి! రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come…— NTR Arts (@NTRArtsOfficial) April 8, 2026 చదవండి: భర్తకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన నయనతార -
స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అయ్యాడు. తన మొదటి సినిమా ‘గంగోత్రి’ నుంచి పుష్ప-2 వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలో కొత్త రకమైన వైవిధ్యం ఉంటుంది. మాస్, క్లాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఇలా అందరిని మెప్పిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఫాలో అవుతూ స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) నేడే. ఈ సందర్భంగా బన్నీ సినీ కెరీర్పై ఓ లుక్కేద్దాం.చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విజేత(1985) సినిమాలో బాలనటుడిగా నటించి మెప్పించిన బన్నీ.. ఆ తర్వాత 1986లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. ఆ తర్వాత ఏకంగా 15 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2001లో వచ్చిన చిరంజీవి ‘డాడీ’ సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి స్టూడెంట్గా తనదైన స్టైల్లో స్టెప్పులతో అదరగొట్టాడు.హీరోగా గంగోత్రి.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో ఓ సారి అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు. చాలా మంది డ్యాన్స్ చేస్తుంటే బన్నీ కూడా స్టెప్పులతో అదరగొట్టేశారు. అదే టైమ్లో ఈ వేడుకలకు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి(నిర్మల)దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తానని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్గా ఇచ్చి.. ఆ తర్వాత కొద్ది రోజులకు ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశారు రాఘవేంద్రరావు. ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గరే ఉందట.రెండో సినిమాకే నంది అవార్డు..ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 'ఆర్య'(2004) సినిమాలో లవర్ బాయ్గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. ఇక మూడో చిత్రం ‘బన్నీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు.బన్నీ వల్లే టాలీవుడ్కు సిక్స్ పాక్..టాలీవుడ్కి సిక్స్ ప్యాక్ బాడీని పరిచయం చేసింది కూడా అల్లు అర్జునే. దేశ ముదురు చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్ప్యాక్తో కనిపించాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీలో హన్సిక హీరోయిన్గా నటించింది. 'గంగోత్రి'లో అమాయకుడిగా కనిపించే బన్నీ 'దేశముదురు'లో మాత్రం సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా అలరించాడు. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ చాలామంది టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్లో కనిపించారు.ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్..మొదట్లో అందరు అల్లు అర్జున్ని స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీకి మరో బిరుదు ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప'తో ఐకాన్ స్టార్గా అయిపోయారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. -
అనుమానం అక్కర్లేదు... బ్లాక్బస్టర్ ఖాయం: వెంకటేశ్
‘‘కొన్ని సినిమాలు ఆరంభించినప్పుడే ఒక మంచి అనుభూతి ఉంటుంది. ‘డెకాయిట్’ ఆరంభమైనప్పుడే సుప్రియ ఓ మంచి సినిమా తీస్తోందనే ఫీల్ ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే తను చాలా ప్యాషనేట్. క్రమశిక్షణ ఉన్న టీమ్ని ఎంచుకుంది. అడివి శేష్ వరుస హిట్స్ కొడుతున్నాడు. మరిన్ని బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ‘డెకాయిట్’ కూడా బ్లాక్బస్టర్ అవుతుంది... ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని హీరో వెంకటేశ్ చెప్పారు. అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించారు.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సుప్రియ కోసం ఇక్కడికి వచ్చాననుకుంటున్నారు.నిజాయతీగా చెప్పాలంటే నాకు ఇష్టమైన మా సురేంద్ర మామ (సుప్రియ తండ్రి)కోసం వచ్చాను. ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. మృణాళ్ మంచి నటి. ఈ మూవీ ట్రైలర్ చూడగానే లవ్స్టోరీలోనే యాక్షన్, ఎమోష న్ అన్నీ ఉన్నాయని తెలిసిపోయింది. ఇలాంటి మంచి కథ ఎంచుకున్నందుకు గౌరవంగా ఉంది. యూనిట్కి ఆల్ ది వెరీ బెస్ట్’’ అని పేర్కొన్నారు. సుప్రియ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి ఎస్ఎస్ క్రియేష న్్స బ్యానర్లో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉంది. అందువల్లే ‘డెకాయిట్’ ఆరంభించాను. ఈ లోగోలో మా తాతగారి (ఏఎ న్ ఆర్) పంచె, మా నానమ్మ (అన్నపూర్ణ) కుంకుమ, పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత... దాని వెనుక మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్. ఇవన్నీ కూడగట్టి ఓ పదిహేను సెకన్లలో మా ఫ్యామిలీ కథ ఎలా చూపించుకోవాలా అనుకున్నాను. ‘డెకాయిట్’కి సైలెంట్గా ప్రోడ్యూస్ చేసి బ్యాక్బో న్ గా నిలిచిన మా అన్నయ్య సుమంత్కి థ్యాంక్స్’’ అని తెలిపారు. -
వెండితెరపై ఆధ్యాత్మిక శోభ
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, యాక్షన్, థ్రిల్, పొలిటికల్, హారర్... ఇలా అన్నమాట. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. భక్తి, హిందుత్వం, మైథలాజీ, ధర్మం ఆధారంగా రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ కూడా బాగా ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రేక్షకులకు ఆధ్యాత్మిక శోభ చూపించేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’, రవితేజ ‘ఇరుముడి’, మహేశ్బాబు ‘వారణాసి’, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రణ్బీర్ కపూర్ ‘రామాయణ’, నిఖిల్ ‘స్వయంభు’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ సినిమాలతో పాటు ‘మహావతార్ నరసింహా, వాయుపుత్ర’ వంటి యానిమేషన్ మూవీస్ కూడా రూపొందుతున్నాయి. ఆయా సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.హనుమంతుడు తోడుగా... ఆంజనేయస్వామికి హీరో చిరంజీవి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా హనుమంతుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారాయన. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’లోనూ మరోసారి హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉండనున్నాయి. తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందిన ‘విశ్వంభర’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు మేకర్స్. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఓ హైలెట్గా నిలుస్తాయని టాక్. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి వెనక నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ మూవీని విజువల్ వండర్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. గత ఏడాది తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా చిరంజీవి స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘‘చందమామ కథలా ‘విశ్వంభర’ ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్ని అందించేందుకు సమయం పడుతోంది. 2026 వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే గ్రాఫిక్స్కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట. ఈ కారణంగా ఈ మూవీ గురించి ఎలాంటి కొత్త అప్డేట్ ఇవ్వడం లేదట చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్లు ‘విశ్వంభర’ ఈ వేసవి ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే మరోసారి వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.అయ్యప్ప మాలధారిగా... వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకెళుతుంటారు రవితేజ. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ.‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ అద్భుతంగా రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా కోసం రవితేజ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ఇరుముడి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్బస్టర్ మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృతా అయ్యర్ జోడీగా నటించారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించి, అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్’కి కొనసాగింపుగా ‘జై హనుమా న్ ’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (‘కాంతారా’ మూవీ ఫేమ్) నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాముడి విగ్రహాన్ని హత్తుకుని ఉన్న హనుమంతుడిగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్బస్టర్గా నిలవడంతో ఆ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. పైగా ‘కాంతారా, కాంతారా చాప్టర్ 2’ మూవీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో టైటిల్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై ట్రేడ్ వర్గాల్లోనూ మరింత క్రేజ్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ‘హనుమాన్’ మూవీలో తనదైన నటనతో మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్నగర్ టాక్. శ్రీరాముడు–రుద్ర ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మహేశ్బాబు. వారణాసి నేపథ్యంలో భక్తి బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్బాబు మునుపెన్నడూ చూడని విధంగా శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణని జార్జియాతో పాటు పలు అంతర్జాతీయ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు... ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో వారణాసిని సృష్టించారు. అచ్చం వారణాసిలా తీర్చిదిద్దిన సెట్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఒక గొప్ప అనుభూతినిచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ విజువల్ వండర్ను చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. ఈ చిత్రం అందర్నీ గర్వపడేలా చేస్తుంది’ అని మహేశ్బాబు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.ఈ మూవీ భారతదేశంలోనే కాకుండా ‘గ్లోబ్ట్రోటర్, టైమ్ట్రోటర్’ అనే ట్యాగ్లై న్ లతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. మహేశ్బాబు, ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ విడుదల కానుంది. మహేశ్బాబు– రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల కానుంది. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రం ‘స్వయంభు’. ఇది పూర్తిగా పురాణ, భారతీయ యోధుల చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని స్టైలిష్, హిస్టారికల్ యాక్షన్ మైథలాజికల్గా రూపొందిస్తున్నారు. నిఖిల్ వేషధారణ, యాక్షన్ లుక్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపాయి.తన పాత్ర కోసం నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటె న్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందట. ఇండియాలోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయని తెలిసింది. ఈ విజువల్ వండర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ ఔట్పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్మెంట్తో పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘స్వయంభు’ రూపొందుతోంది.‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలతో చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో నిఖిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దశావతార ఆలయం నేపథ్యంలో... హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్షైన్ పిక్చర్స్పై మహేశ్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భక్తి నేపథ్యంలో రూపొందుతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అతను ఒంటరివాడు కాదు... అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఈ పోస్టర్లో ఇచ్చిన క్యాప్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.అలాగే టైటిల్ టీజర్కి కూడా మంచి స్పందన వచ్చింది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ కథాంశం యాక్షన్, ఆధ్యాత్మికతలను మేళవిస్తుంది. సర్పదేవత పచ్చబొట్టుతో పాటు పవిత్రమైన విష్ణు నామాలు వంటి చిహ్నాలు కూడా టీజర్లో కనిపిస్తాయి. దుండగుల బారి నుంచి దశావతార ఆలయాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న సాలిడ్ థ్రిల్లర్గా, భారతీయ ధర్మం, ఆచారాలపై ఆధారపడిన పౌరాణిక యాక్షన్ డ్రామాగా ‘హైందవ’ చిత్ర కథాంశం ఉండనుందట. ఈ మూవీలో ఓ ధార్మిక యోధుడి పాత్రలో కనిపించనున్నారట సాయి శ్రీనివాస్.నాగబంధం ‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ అభిషేక్ నామా తెరకెక్కించారు.మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్బాబు ‘నాగబంధం’ టీజర్ని విడుదల చేసి, ‘‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తి నేపథ్యంలో అల్లుకున్న సస్పె న్స్ బ్యాక్డ్రాప్లో ‘నాగబంధం’ని రూపొందించారని సమాచారం. ఇందులో విరాట్ కర్ణ శక్తిమంతమైన యోధుడిగా నటించారు. ఈ చిత్రంలో నాగబంధం, శివ తంత్ర విద్య, నాగబంధం ఆలయం వెనక ఉన్న గుప్తనిధులు వంటి అంశాలు కథలో హైలెట్ కానున్నాయట. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. గదాధారి హనుమాన్... రవి కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ‘‘మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘గదాధారి హనుమాన్’.ఈ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోష న్స్ను అద్భుతంగా పండించాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ఫుల్ అన్న దానిపై ఓ సీక్వె న్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని రవికిరణ్ తెలిపారు.యానిమేషన్ కూడా... ఇదిలా ఉంటే... రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్తో పాటు ‘మహావతార్ నరసింహా’, ‘వాయుపుత్ర’ వంటి యానిమేటెడ్ సినిమాలు కూడా రానున్నాయి. అశ్విన్కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేటెడ్ చిత్రం సూపర్ హిట్గా నిలవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. 2037 వరకు ఏడు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న యానిమేటెడ్ ఫిల్మ్ ‘వాయుపుత్ర’ పైనా మంచి అంచనాలున్నాయి.రామాయణం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్షణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్మైండ్ క్రియేష న్న్స్ సహకారంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, పరశురాముడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
బంపర్ ఆఫర్ కొట్టిన 'లిటిల్ హార్ట్స్' కుర్రోడు
ఆచితూచి సినిమాలు చేసే యంగ్ హీరో అడివి శేష్.. 'డెకాయిట్'ని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'గూఢచారి 2' కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ కూడా రిలీజ్ కానుంది. వీటి తర్వాత ఎవరితో చేస్తాడనే దానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. స్వయంగా సదరు దర్శకుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు.మంగళవారం రాత్రి హైదరాబాద్లో 'డెకాయిట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి 'లిటిల్ హార్ట్స్' దర్శకుడు సాయి మార్తాండ్ కూడా వచ్చాడు. మూవీ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే శేష్తో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించేశాడు. లవ్ స్టోరీతో దీన్ని తెరకెక్కించనున్నారు. 'గూఢచారి 2' పూర్తయిన వెంటనే ఇది సెట్స్పైకి వెళ్లనుంది.శేష్ విషయానికొస్తే చివరగా 2022లో 'హిట్ 2'తో థియేటర్లలోకి వచ్చాడు. మళ్లీ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'డెకాయిట్'గా వస్తున్నాడు. ట్రయిలర్ చూస్తే ఇది రివేంజ్ ప్రేమకథలా అనిపిస్తుంది. మరోవైపు 'లిటిల్ హార్ట్స్' మూవీతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తాండ్.. తొలి చిత్రంతో అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇప్పుడు శేష్తో చేయబోయే సినిమాతోనూ హిట్ కొడితే రేంజ్ పెరిగిపోవడం గ్యారంటీ. -
సుప్రియను వెక్కిరించడానికే వచ్చా.. నాగవంశీ ర్యాగింగ్
‘డెకాయిట్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ, సహ నిర్మాత సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేశారు. సినిమాలు ఎక్కువ రోజులు తీస్తున్నామని ఎప్పుడూ తమకు క్లాస్ పీకే సుప్రియ ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి ‘డెకాయిట్’ పూర్తి చేసిందనిక వెక్కిరిస్తూ మాట్లాడారు. మమ్మల్ని సినిమాలు ఎందుకు ఇన్ని రోజులు తీస్తున్నారంటూ సుప్రియ ఎప్పుడూ తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి 147 వర్కింగ్ డేస్లో సినిమా తీశారు. ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదని ఆటపట్టించారు. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియకు చూపించినందుకు అడివి శేష్కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే, “హీరోల్ని నెత్తిన ఎక్కించుకున్నామని ఎప్పుడూ క్లాస్ పీకే సుప్రియ, ఇప్పుడు తొలిసారి బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనుభవించారు. ఇంతకు ముందు తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీసిన సుప్రియకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరింత మంది హీరోలతో సుప్రియ సినిమాలు చేసి తమలాగే కష్టపడాలని చమత్కరించారు. ఓ వైపు నాగవంశీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంటే, పక్కనే ఉన్న సురేశ్ బాబు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
'అలా జరిగినందుకు క్షమించు'.. మృణాల్కు సారీ చెప్పిన సుమంత్
టాలీవుడ్ హీరో సుమంత్ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్కు క్షమాపణలు చెప్పారు. సీతారామం మూవీలో ఓ సీన్లో ఉందని అన్నారు. 'క్షమించు.. నీ రాముని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు' ఓ సీన్లో ఉందని అన్నారు. కానీ ఈ సీన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చిందని సుమంత్ తెలిపారు. అందుకే నేను 'డెకాయిట్లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించానని సుమంత్ వెల్లడించారు. డకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సుమంత్ ఈ కామెంట్స్ చేశారు.కాగా.. అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీని లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. మృణాల్ ఠాకూర్ ని క్షమాపణలు కోరిన సుమంత్ 'సీతారామం' లో నేను మృణాల్ కి క్షమాపణలు చెప్పిన సీన్ ఒకటి ఉంది అది ఎడిటింగ్ లో డిలీట్ చేశారు అందుకే నేను 'డెకాయిట్' లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించాను : సుమంత్#AdiviSesh #MrunalThakur #Dacoit #Sumanth pic.twitter.com/5a1tUXY1lh— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
అడివి శేష్ అంటే చాలా క్రష్ : టాలీవుడ్ నటి
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అడివి శేష్ అంటే నాకు క్రష్ ఉండేదని కామాక్షి భాస్కర్ల తన మనసులో మాటను బయటపెట్టింది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టమని వెల్లడించింది. కామాక్షి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. నాకు శేష్ అంటే చాలా క్రష్ ఉండేది : కామాక్షి భాస్కర్ల#AdiviSesh #MrunalThakur #Dacoit #KamakshiBhaskarla pic.twitter.com/wFNG7XC1Z3— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
'ఇది కేవలం నిశ్చితార్థం కాదు'.. టాలీవుడ్ హీరో ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటీవలే కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకైన శ్రీనివాస్ తెలుగులో హీరోగా రాణిస్తున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. మార్చి 29న తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోబోతున్నారు.తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్షణం నుంచి అంతా మారిపోతుందంటూ రాసుకొచ్చారు. నిండు మనసులతో.. ఒకరి కళ్లలో ఒకరు కనిపిస్తుండగా.. మేము ఎప్పటినుంచో నమ్ముతూ వచ్చిన ఆ శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాం అంటూ పోస్ట్ చేశారు. ఎలాంటి హడావిడి లేదు.. తొందర లేదు... కేవలం ప్రేమ మాత్రమే ఉందంటూ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఒక నిశ్చితార్థం మాత్రమే కాదు..ఇది ఒక శాశ్వత బంధానికి ఆరంభం అంటూ నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు బెల్లంకొండ శ్రీనివాస్కు అభినందనలు చెబుతున్నారు.కాగా.. అల్లుడు శ్రీను మూవీతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక శ్రీనివాస్కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. From this moment… everything changes.With hearts full and eyes only for each other,we stepped into a forever we’ve always believed in.No noise, no rush… just love, beautifully ours. 🖤This isn’t just an engagement,it’s the start of something timeless. ✨Location… pic.twitter.com/ufYAsHcYwK— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 7, 2026 -
అట్లీ-అల్లు అర్జున్ మూవీ టైటిల్ ఇదేనా!
పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #AA22XA6 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకు టైటిల్ని కానీ, హీరో లుక్ కానీ రిలీజ్ చేయలేదు. బన్నీ బర్త్డే సందర్భంగా రేపు(ఏప్రిల్ 8) ఈ సినిమా టైటిల్ని ప్రకటించబోతున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల టైటిల్స్ కానీ, లుక్ కానీ ముందుగానే లీకవుతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. ఇప్పటి వరకు షూటింగ్కు సంబంధించిన చిన్న ఫుటేజీ కూడా బయటకు రాకుండా టీమ్ జాగ్రత్త పడింది. ఇక టైటిల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి వైల్డ్ ఫైర్ అనే పేరు ఖారారు చేశారని ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు ‘లెగసీ’ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా ‘అయాన్’, ‘స్పార్క్’ అనే పేర్లు కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది మాత్రం రేపే తెలుస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ గురించి అట్లీ, బన్నీకి తప్ప మిగతావారెవరికి సమాచారమే లేదట. అందరితో పాటు చిత్రబృందం కూడా రేపే టైటిల్ ఏంటనేది తెలుసుకోబోతుంది.పునర్జన్మల కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ఫిక్షన్ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించబోన్నట్లు తెలుస్తోంది. ఇప్టపికే దీపికా పదుకొణె పేరును అధికారికంగా ప్రకటించారు. జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. -
విజయ్-రష్మిక గ్రాండ్ రిసెప్షన్... కొడగు స్టైల్లో మెరిసిన జంట..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న వీరిద్దరు ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఉదయ్పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలోఅత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.ఇటీవలే రష్మిక తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత తన తొలి బర్త్ డేను ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకుంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని ఇగ్గుతప్ప ఆలయాన్ని కూడా సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అయితే తాజాగా ఈ జంట మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించారు. రష్మిక సొంత గ్రామం కూర్గ్లో కొడగు సంప్రదాయంలో రిసెప్షన్ జరుపుకున్నారు. ఈ ఫంక్షన్లో రష్మిక కొడగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఈ రిసెప్షన్లో కూర్గి స్టైల్లో చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కొడగు రావడం ఇది మూడోసారని తెలిపారు. మొదటిసారి రష్మికను కలవక ముందే ఇక్కడకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. గతంలో ఒకసారి వచ్చినప్పుడు తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. అయితే తన ఫ్రెండ్ ఈ రిసెప్షన్కు హాజరు కాలేదని తెలిపారు. నా స్కూల్ టైమ్లో స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చానని పంచుకున్నారు.చాలా అందంగా ఉంటారు..తనకు కొడగు అందాలు అంటే చాలా ఇష్టమని.. ఇక్కడి మహిళలు కూడా అంతే అందంగా ఉంటారని కొనియాడారు. కూర్గ్ మహిళలు చాలా అందంగా ఉంటారని.. నేను కూర్గ్ అమ్మాయినే వివాహం చేసుకున్నానని విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. మిమ్మల్నందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కొడగు రిసెప్షన్కు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక- విజయ్ జంటహా 'రణబాలి' సినిమాలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. -
' నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యా'.. ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొద్దిమంది డైరెక్టర్లలో ఆర్జీవీ ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సరే అందులో ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. రోటీన్కు భిన్నంగా తన పంచ్లతో ఆకట్టుకుంటారు. అలా టాలీవుడ్లో విలక్షణ దర్శకుడిగా రాం గోపాల్ వర్మ అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు.ఇవాళ ఆర్జీవీ మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 7న రాం గోపాల్ వర్మ బర్త్ డే కావడంతో తనదైన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు అభిమానులు ఆర్జీవీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks 💐💐💐 pic.twitter.com/mkKLW9G32t— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026 -
వారణాసి కౌంట్డౌన్ ప్రారంభం.. కీరవాణి పోస్ట్
మహేశ్బాబు- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా రానున్న చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా కౌంట్డౌన్ ప్రారంభమైంది అని సంగీత దర్శకుడు కీరవాణి '365' నంబర్తో మెసేజ్ ద్వారా తెలిపారు. అంటే ఈ మూవీ వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వారణాసిలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నటం విశేషం.2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కానుందని చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అయితే, 'ధురందర్' ఫ్రాంచైజీ భారీ విజయం సాధించిన తర్వాత, రాజమౌళి కూడా 'వారణాసి'ని రెండు భాగాలుగా విభజించి, విడుదల ప్రణాళికను సవరించవచ్చని ఇటీవల వదంతులు వచ్చాయి. అయితే, ఇప్పుడు కీరవాణి చేసిన కౌంట్డౌన్ కామెంట్తో అనుకున్న సమయానికే వారణాసి విడుదల కానుందని క్లారిటీ వచ్చేసింది. ఆ పోస్ట్, వారణాసి చిత్రం కనీసం ప్రస్తుతానికి ఒకే భాగం (సింగిల్-పార్ట్)గా రాబోతోందని కూడా ధృవీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. విడుదలకు సరిగ్గా 365 రోజులు మిగిలి ఉండటంతో, ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటైన ఈ ప్రాజెక్ట్కు కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. -
అతన్ని పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కూడా కన్నాను : త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో త్రిష రిలేషన్తో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్కి హాజరవ్వడంతో.. ఈ పుకార్లు ఇంకా ఎక్కువైయ్యాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని..ఆమె సినిమాలకు గుడ్బై చెప్పి..రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ జరిగింది. దీనిపై త్రిష తనదైన శైలీలో స్పందించింది. చిత్రా లక్ష్మణ్ వాఖ్యలకు కౌంటర్గా ‘అవును నేను సినిమాలు మానేసి, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా?’ అని త్రిష ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్తో ఆమె సినిమాలు మానేసిందనేది పుకారు మాత్రమేనని తేలిపోయింది. త్రిష సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అమె ‘కరుప్పు’(తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్కు రెడీ అవుతుంది. దేవిధంగా మలయాళంలో మోహన్లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. -
అల్లు అర్జున్- అట్లీ సినిమా పోస్టర్ విడుదల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబినేషన్ సినిమా (AA22xA6) నుంచి అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టైటిల్ పోస్టర్ను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన ఒక పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో ఒక క్రూర మృగం పంజా (చెయ్యి) మాత్రమే కనిపిస్తోంది.ఈ సినిమాలో తోడేలు చేయి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుంది. హాలీవుడ్ ప్రమాణాలతో అల్లు అర్జున్ నుంచి ఒక భారీ ప్రయోగాన్ని అట్లీ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ ఒక వింత శక్తి ఉన్న పాత్రలో లేదా ఇలాంటి వింత జీవులతో పోరాడే పాత్రలో కనిపిస్తారని అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్పై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి పలు వివరాలు ప్రకటిస్తారని సమాచారం. Brace for the BlAAst💥Title Poster - Tomorrow @ 11 AM@alluarjun @Atlee_dir @deepikapadukone#AA22xA6 pic.twitter.com/pPHn70C77o— Sun Pictures (@sunpictures) April 7, 2026 -
ధురంధర్-2పై విరాట్ కోహ్లి రివ్యూ.. ఆశ్చర్యమంటూ దర్శకుడు పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ధరంధర్-2 చిత్రంపై టీమిండియా క్రికెటర్ కోహ్లీ, అనుష్క శర్మ స్పందించారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఆదిత్య ధర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా సినిమా చూసిన వారిద్దరూ రివ్యూ ఇచ్చారు. దీంతో వారు చేసిన పోస్ట్ను ఆదిత్య ధర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది.ధురంధర్ 2 మూవీ తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని విరాట్ దంపతులు తెలిపారు. ఈ మూవీ ఒక అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడూ కలగలేదని వారు అన్నారు. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయానన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగంతో ఉందని తెలిపారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించారని తెలిపిన విరాట్.. ప్రత్యేకంగా రణ్వీర్ను అభినందించారు. అతనొక శిఖరాన్ని చేరుకున్నారని కొనియాడారు. ఆపై మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ ఒక జీనియస్ అంటూ మెచ్చుకున్నారు. అనుష్క శర్మ కూడా ధురంధర్పై అభినందనలు కురిపించారు. సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే పాత్రను దక్కించుకుని, అద్భుతమైన నటనతో ప్రతిభ కనబరిచారని రణ్వీర్ను ప్రశంసించారు.అయితే, విరాట్ దంపతులు చేసిన పోస్ట్లపై ఆదిత్య ధర్ ధన్యవాదాలు చెబుతూ స్పందించారు. విరాట్ సినిమా చూసి అభినందించారని తెలిసి నమ్మలేకపోతున్నానంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. విరాట్ మాటలు ఎంతో విలువైనవి అని ఆయన అన్నారు. తాను విరాట్కు వీరాభిమానిని ఆదిత్య ధర్ తెలిపారు. దేశం గర్వించేలా గ్రౌండ్లో ఆయన చేసే పోరాటం తమకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు. అనుష్క ప్రశంసలు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
'మిస్ ఇండియా ఎర్త్' కిడ్నాప్.. భర్తపై ఫిర్యాదు
మిస్ ఇండియా ఎర్త్ -2019 విజేతగా చెప్పుకుంటున్న సయాలీ సుర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పూణేకు చెందిన ఈమె, 2019లో వివాహం చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి మారి ‘అలీజా’గా పేరు మార్చుకున్నారు. అయితే, పూణేలోని చించ్వాడ్లో ఉంటున్న ఆమె కనిపించడం లేదు. తన భర్త ఆతీఫ్ వేధించాడని, బలవంతంగా మతం మార్చాడని ఆరోపిస్తూ ఇటీవల హిందూ మతంలోకి తిరిగి మారారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశంగా మారింది. పూణే పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తింటివారే సయాలీ సర్వేని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు.2019లో మీరా-భయందర్కు చెందిన వ్యాపారవేత్త ఆతీఫ్ టాసేను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత, ఆమె ఇస్లాం మతంలోకి మారి, తన పేరును అతీజా టాసేగా మార్చుకుంది. గొడవల కారణంగా వారి వివాహ బంధం చాలా త్వరగా ముగిసిపోయింది. ఆతీఫ్ టాసేను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆమె గతంలో ఆరోపించారు. అతను పెట్టిన శారీరక హింసను కేవలం తన పిల్లల కోసం భరించానని పేర్కొంది. తనతో దూరం అయిన తర్వాత ఆమె తిరిగి హిందూ మతంలోకి చేరి తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకుంది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కిడ్నాప్ కావడం చర్చనీయాంశంగా మారింది.(గమనిక: కొందరు నివేదికల ప్రకారం, 2019లో అధికారిక 'మిస్ ఎర్త్ ఇండియా' విజేతగా డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఉన్నారు. ) -
రూ. 29 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన టాప్ సింగర్
నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ముంబైలో ఒక కొత్త విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. బాలీవుడ్ నివేదికల ప్రకారం, శ్రేయా ఘోషల్ తన తల్లి షమిష్ఠ ఘోషల్, తండ్రి బిశ్వజిత్ ఘోషల్లతో కలిసి వర్లీలో రూ.29.70 కోట్లకు ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం, ఈ అపార్ట్మెంట్ ముంబైలోని అత్యంత ప్రీమియం నివాస ప్రాంతాలలో ఒకటైన వర్లీలోని గోద్రెజ్ ట్రైలజీలో ఉంది.రిజిస్టర్ పత్రాల ప్రకారం ఈ ఫ్లాట్ మొత్తం వైశాల్యం 2,750.28 చదరపు అడుగులు ఉంది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026న అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ లావాదేవీలో రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లింపుతో పాటు రూ. 30వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉన్నాయని సమాచారం.‘సరిగమ’ విజేతగా కెరీర్ను ప్రారంభించిన శ్రేయాఘోషల్ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా ఎన్నో చిత్రాల్లో తన పాటలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. మొదట దేవదాస్ చిత్రంతో హిందీలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గజని, 3 ఇడియట్స్, దబాంగ్, ఢిల్లీ 6, ఆషికీ-2, క్రిష్, పద్మావత్ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలకు మంచి క్రేజ్ దక్కింది. తెలుగులో ఒక్కడు, సింహాద్రి, ఠాగూర్, సీతయ్య, వర్షం, మల్లీశ్వరి, నేనున్నాను, అతడు, అదుర్స్, రేసుగుర్రం, మనం, ఖైదీ నం. 150,గేమ్ ఛేంజర్ వంటి సినిమాలతో పాటు సుమారు 200కు పైగానే సాంగ్స్ పాడింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సాంగ్ కోసం సుమారు రూ. 25 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది.


