Tollywood
-
కోర్ట్ తర్వాత సినిమాలు వద్దని చెప్పా.. నా మాట వినలేదు!
కోర్ట్ సినిమాతో హర్ష్ రోషన్, శ్రీదేవి వెండితెరపై హీరోహీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమాకే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిలో పడ్డారు. గతేడాది కోర్ట్ మూవీతో పలకరించిన ఈ జంట ఈ ఏడాది బ్యాండ్మేళంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్లో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలు మర్చిపోండిఆయన మాట్లాడుతూ.. చందు-జాబిలి(కోర్ట్ మూవీలో ప్రధాన పాత్రల పేర్లు).. వీళ్లనెప్పటికీ ఇదే పేర్లతో పిలుస్తుంటాను. కోర్ట్ తర్వాత వీళ్లు ఏం చేస్తారు? ఏమైపోతారనుకున్నాను. నేనైతే.. కోర్ట్ అయిపోగానే మీరు కనపడొద్దని చెప్పాను. సినిమాలు మర్చిపోండి, మూడునాలుగేళ్లు కనిపించకూడదు. మంచి కాలేజీలో చేరి చదువుకోమని చెప్పాను. పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు కానీ కాలేజీకి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. కాలేజీ డేస్ మిస్ మీరు ఫస్ట్ కాలేజీకి వెళ్లండి, కళాశాల జీవితాన్ని మిస్ అవొద్దని చెప్పాను. ఈ వయసులో యాక్టింగ్లో బిజీ అయితే జీవితంలో ముఖ్యమైన కాలేజీ డేస్ మిస్ అవుతారన్నాను. కానీ నా మాట వినలేదు. వినుంటే బ్యాండ్ మేళం వచ్చేది కాదు.. విననందుకు థాంక్స్ అన్నాడు. బ్యాండ్మేళం విషయానికి వస్తే.. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీని కోన వెంకట్ నిర్మించారు.చదవండి: ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్ -
‘పెద్ది’ వస్తే.. ‘గాయపడ్డ సింహం’ వాయిదా వేస్తాం : దిల్ రాజు
‘‘గాయపడ్డ సింహం’ మూవీ గురించి తరుణ్ భాస్కర్ చెప్పాడు. డైరెక్టర్ పవన్ని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అడిగితే.. టీజర్ చూపించారు. టీజర్ చాలా నచ్చింది. ఆ తర్వాత మొత్తం కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని మా శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్పై రిలీజ్ చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించారు. ఈ మూవీ విడుదల హక్కులను ‘దిల్’ రాజు కొనుగోలు చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ – ‘‘మే 1న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించాం. అయితే ఏప్రిల్ 30కి ‘పెద్ది’ సినిమా వస్తే ‘గాయపడ్డ సింహం’ విడుదల తేదీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం పవన్గారు. నిర్మాతలు, జీ టీమ్ సపోర్ట్ చేశారు’’ అన్నారు కశ్యప్ శ్రీనివాస్. ‘‘మాలాంటి యంగ్ ఫిలిం మేకర్స్ని సపోర్ట్ చేస్తున్న ‘దిల్’ రాజు గారికి ధన్యవాదాలు’’ అని భాను కిరణ్ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 30న ‘పెద్ది’ వస్తోంది. మా మూవీకి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు కలిగితే విడుదల తేదీ మార్చుకుంటాం’’ అని పవన్ సాధినేని చెప్పారు. -
చిరంజీవితో పని చేయాలని కోరిక: మ్యూజిక్ డైరెక్టర్
దండోరా సినిమాకు నాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా గద్దర్ అవార్డు లభించడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రేక్షకులకు మరింత మంచి సంగీతం ఇచ్చేందుకు ఈ అవార్డు స్ఫూర్తినిస్తుంది. అలాగే సంగీత దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను అని చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్.గద్దర్ అవార్డుది ఘోస్ట్, మల్లేశం, జాంబిరెడ్డి, ఏజెంట్, సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలకు సంగీతం అందించి తన ప్రతిభ నిరూపించుకున్నారు. దండోరా సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న మార్క్ కె.రాబిన్ విలేకరులతో మాట్లాడుతూ.. నాకు బాల్యం నుంచే సంగీతం అంటే ఇష్టం. కొంతకాలం టీచర్గా పని చేశాను. లిరిసిస్ట్ కృష్ణకాంత్ నాకు మంచి మిత్రుడు. నానికి నచ్చడంతో..దర్శకనిర్మాత ప్రశాంత్ వర్మ, కృష్ణకాంత్, నేను తరచూ కలుస్తుండేవాళ్లం. అలా నేను, ప్రశాంత్ కలిసి ఇన్ ది డార్క్ అనే ఇండియా ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిలిం చేశాం. ఆ తర్వాత నానిగారి మజ్ను మూవీ ట్రైలర్కు ఆర్ఆర్ అందించాను. ఈ మ్యూజిక్ నానిగారికి నచ్చడంతో అ..! చిత్రానికి అవకాశం కల్పించారు.అదే నా కోరికఅలా మ్యూజిక్ డైరెక్టర్గా నా ప్రయాణం మొదలైంది. భావోద్వేగంతో నిండిన మనసుతోనే దండోరాకి సంగీతాన్ని అందించాను. చిరంజీవిగారితో సినిమా చేయాలన్నదే నా ఆకాంక్ష. సంగీతం విషయంలో మనం ఇప్పటికీ చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ప్రస్తుతం కథాకళి, రాజాది రాజా సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మగారితో రెండు సినిమాలు చేస్తున్నాను. హిందీలో సైఫ్ అలీఖాన్గారితో ఓ మూవీ చేయాల్సింది కానీ కుదర్లేదు. అదే విధంగా ఒక స్టార్ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు. -
రామ్చరణ్, మహేశ్కు అలా జరిగింది.. కానీ!: బండ్ల గణేశ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి సందడి చేసేందుకు వచ్చేస్తున్నారు. ఈసారి బ్యాండ్మేళం మూవీలో వీరు బావామరదళ్లుగా నటించారు. సతీశ్ జవ్వాజి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం (మార్చి 24న) ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్కు నిర్మాత బండ్ల గణేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.అరడజను మంచి డైరెక్టర్లకు ఛాన్స్ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కోన వెంకట్గారికోసమే ఈ ఈవెంట్కు వచ్చాను. ఇండస్ట్రీ మొత్తం ఒక పక్కనుంటే, కోన ఒక్కడే నీ పక్కనుంటే నువ్వు గెలిచేయొచ్చని వినాయక్ అన్నాడు. అది ఆయనకున్న పవర్.. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలను ఒప్పించి అరడజను మంది దర్శకులకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించడం అంటే జోక్ కాదు. హీరోలు 100 ప్రశ్నలు వేస్తారు, 200 డౌట్లు పడతారు. చస్తే ఆ పని చేయనుఎందుకంటే వాళ్లకు హిట్టు కావాలి! అలాంటి వాళ్లను ఎలాగోలా మాయ చేసి ఒప్పిస్తున్నారు. బాబీ, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్ శివ నిర్వాణ.. ఇలా ఎంతోమందిని డైరెక్టర్ల ముందడుగు కారణమై సక్సెస్ను ముందుకు తీసుకెళ్లడంలో కోన వెంకట్ ముందుంటాడు. బ్యాండ్మేళం కోసం ఆయన రెండు, మూడు ప్రాపర్టీలు అమ్మేశాడు. నేనయితే ప్రాణం పోయినా ఆ పని చేయను. ఆస్తి తాకట్టు పెట్టి సినిమా తీశారంటే మీకు సినిమా అంటే అంత ప్రేమ.సక్సెస్ మన చేతుల్లో లేదుహీరో హర్ష్ రోషన్ విషయానికి వస్తే.. టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఎవరైనా ఇండస్ట్రీకి రావొచ్చు. ఇండస్ట్రీలో స్టార్ కొడుకు స్టార్ అవడం చాలా అరుదు. మహేశ్బాబు, రామ్చరణ్లాంటివారికి జరిగింది. స్టార్ డైరెక్టర్స్.. తమ కుమారులకు వారసత్వంగా ఆస్తినిచ్చారు, కానీ సక్సెస్ ఇవ్వలేదు. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. నిజంగా రోషన్ను చూస్తే నా కొడుకుగా పుట్టుంటే బాగుండేదనుకున్నాను. ఈ అబ్బాయి సూపర్స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ కోన వెంకట్గారికోసమైనా సూపర్ హిట్ అవుతుంది అని బండ్ల గణేశ్ జోస్యం చెప్పాడు.చదవండి: నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి -
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్గా మాట్లడుతూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నత్తి వల్ల తనను ఎందరో వెక్కిరించేవారంటోంది.వెక్కిరింతలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో లోతుగా పాతుకుపోయుంటాయి.అదే నిజమనుకుని..ఉదాహరణకు.. ఆమె చాలా స్లో, వీక్ అంటుంటారు. ఇలాంటి పదాలు పదేపదే విన్నప్పుడు మనపై మనకే అనుమానం వేస్తుంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా సాహసం చేసేందుకు వెనుకాడతారు. పిల్లల్ని పదేపదే బుద్ధిహీనుడు, బలహీనుడు, ముసలివాడు.. అని పిలిస్తే వాళ్లు అదే నిజమనుకుంటారు. వాళ్లను వాళ్లు చూసుకునే విధానమే మారిపోతుంది. ఎవరినీ కించపర్చొద్దుఅదే నిజమని నమ్మి, అందరిలా దూకుడుగా ఉండలేరు. ఏవీ ప్రయత్నించకుండా సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలు.. వారికి ఏ సమస్య ఎదురైనా నాతో చెప్పమంటాను. ఎవరినీ కించపరచొద్దని చెప్తుంటాను. పిల్లలకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం చేస్తే మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. పర్సనల్ లైఫ్తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారంతా సపోర్ట్గా నిలబడితే పిల్లలు వారికెదురయ్యే సవాళ్లను ఒక అడ్డంకిగా కాకుండా.. దాన్నుంచి ఎలా బయటపడాలన్నది నేర్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. సమీరా.. 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి.. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ సినిమాల్లో నటించింది.చదవండి: హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం -
అలనాటి హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం
అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మి (83) ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం.లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. భానుప్రియకాగా భానుప్రియ 1998లో ఆదర్శ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. వీరికి కూతురు అభినయ సంతానం. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2005లో అతడి నుంచి విడిపోయి కూతుర్ని తీసుకుని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటోంది. 2018లో నటి మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో మరణించాడు. శాంతిప్రియభానుప్రియ చివరగా అయాలన్ అనే తమిళ సినిమాలో కనిపించింది. శాంతిప్రియ విషయానికి వ్తే.. ఈమె ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్దార్థ్ రాయ్ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2004లో సిద్దార్థ్ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు. -
బ్రిటిష్ సైనికుడు
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నారు.మార్చి 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీలో శ్రీకాంత్ పోషించిన బ్రిటిష్ పాత్ర పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడిగా శ్రీకాంత్ కనిపించనున్నారు. ఆయన లుక్కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ ద్వారా సాయి దుర్గాతేజ్ ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బర్త్ డే స్పెషల్
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన లుక్ సరికొత్తగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఇప్పటికే హీరోయిన్ దీపికా పదుకొనె భాగం కాగా, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.ఎందుకంటే... ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేయాలనే దిశగా అట్లీ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఈ టీజర్లోనే టైటిల్ కూడా ఉంటుందని టాక్. అంతే కాదు.. అల్లు అర్జున్ , దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లోని సినిమా అప్డేట్స్ కూడా ఏప్రిల్ 8న బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. మరి.. వచ్చేనెల 8న అల్లు అర్జున్ సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనే ఆసక్తి ఆయన ఫ్యాన్స్లో నెలకొంది. -
దృశ్యం-3 వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దృశ్యం. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో దృశ్యం-3 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా దృశ్యం-3 మేకర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు మోహన్ లాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది మే 21 దృశ్యం-3 విడుదల కానుందని హీరో ట్వీట్ చేశారు. కాగా.. మొదట ఏప్రిల్ 02న విడుదల కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా కనిపించనుండగా.. హిందీలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. హిందీ దృశ్యం3 కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది. కాగా..ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించారు. The past never stays silent…it only waits.Georgekutty arrives, May 21st 2026.#Drishyam3 | Worldwide Release @jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk #MeenaSagar @aashirvadcine @PanoramaMovies @PenMovies @ram_rampagepix @Rajeshmenon1969… pic.twitter.com/2r8KCVe98U— Mohanlal (@Mohanlal) March 23, 2026 -
స్విమ్ షూట్లో హీరోయిన్ అనితా.. సముద్రంలో ప్రగ్యా జైస్వాల్ చిల్..!
వైట్ బ్యూటీలా మెరిసిపోతున్న ది రాజాసాబ్ బ్యూటీ..సముద్రంలో జలకాలాడుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్...ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..స్విమ్ షూట్లో మెరిసిన హీరోయిన్ అనితా.. View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
మల్లన్న సేవలో హీరో శ్రీకాంత్ దంపతులు
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను తన భార్య, నటి ఊహతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం వెళ్లిన శ్రీకాంత్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికారు.అనంతరం మల్లిఖార్జున, భ్రమరాంబ అమ్మవార్లను హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీకాంత్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ శ్రీకాంత్ బర్త్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. Birthday boy #Srikanth in a brand new avatar as BRITISHUUU from #SambaralaYetiGattu 🎉🔥Stylish, fresh & intriguing look—setting the vibe already! 👀✨#SYG #SaiDharamTej #Tollywood #NewLook #BirthdaySpecial @actorsrikanth pic.twitter.com/ePycsIAR6A— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) March 23, 2026 -
విజయ్-రష్మిక పెళ్లి.. గబ్బర్ సింగ్ టీమ్ ఆవేదన..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు, కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలు, స్వీట్స్ పంపిణీ చేసింది విరోష్ జంట.అయితే ఇటీవల ఓ చిన్నారి అభిమాని పెళ్లికి పిలవలేదని అలిగింది. నేను మీ ఫ్యాన్నే నన్ను ఎందుకు పిలవలేదు? ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవలే ఆ చిట్టి అభిమానిని ఇంటికి పిలిచి లంచ్ ఏర్పాటు చేశారు. ఆ చిన్నారికి ఇష్టమైన స్వీట్స్ కూడా వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే అలాగే తాజాగా తమను పెళ్లికి పిలవలేదని మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం వాళ్లు చిట్టి అభిమానులు మాత్రం కాదండోయ్. గబ్బర్ సింగ్ చిత్రంలో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ గ్యాంగ్. వీరంతా విజయ్ దేవరకొండకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ తెలిపారు. మేము కూడా ఆర్టిస్తులమే కదా అన్నా.. మమ్మల్ని ఎందుకు పెళ్లి పిలవలేదు అన్న అంటూ వీడియోలో వేడుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Mammalni kuda Bhojananiki intiki pilvandi ani aduguthunna Gabbarsingh Villan Team🔥@TheDeverakonda @iamRashmika #Virosh pic.twitter.com/2YQUdeovLp— THE RWDY🗿X (@TheDEVERA_fan) March 23, 2026 -
మూడు సార్లు రిజెక్ట్ చేశారు.. తొక్కా అనుకున్నా: దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తనకు అమెరికా వీసా మూడు సార్లు తిరిస్కరణకు గురైందని తెలిపారు. కానీ ఆ తర్వాత 2009లో మరో చరిత్ర షూటింగ్ టైమ్లో నాకు వీసా లభించిందని అన్నారు. అప్పుడే తొలిసారి యూఎస్ వెళ్లానని వెల్లడించారు. వీసా రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటని యాంకర్ దిల్ రాజును ప్రశ్నించారు.దీనికి దిల్ రాజు బదులిస్తూ.. తొక్కా.. వాళ్లేంటి ఇచ్చేది.. వీసా వచ్చినప్పుడే పోదాం లే అనుకున్నా అని అన్నారు. అప్పటికే నేను ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలను నిర్మించానని దిల్ రాజు తెలిపారు. కాగా.. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం గాయపడ్డ సింహం. ఈ మూవీకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 1న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్కు నిర్మాత ముఖ్య అతిథిగా దిల్రాజు హాజరయ్యారు. రిలీజ్ డేట్ మారొచ్చు..అనంతరం ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు మాట్లాడారు. వీళ్లు మే 1వ తేదీకి రిలీజ్ చేస్తామని అంటున్నారు. కానీ ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కానుంది. అలాంటి టైమ్లో వీళ్లు వన్ వీక్ వెనక్కి వెళ్లే అవకాశముందని అన్నారు. కాకగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఓ యువకుడి జీవితం ఎలా మారింది? అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో తరుణ్ భాస్కర్కు జంటగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. అప్పట్లో అమెరికా వెళ్దాం అనుకుంటే.. నాకు... 3 సార్లు వీసా రిజెక్ట్ అయ్యింది 'మరో చరిత్ర' షూటింగ్ టైంలో దొరికింది తొక్క... వాళ్ళు ఇచ్చేది ఏంటి.. వచ్చినప్పుడే వెళదామని అనుకున్నాను అప్పటికే నేను 'ఆర్య' 'బొమ్మరిల్లు' సినిమాలు తీసిన నిర్మాతని : దిల్ రాజు#TharunBhascker… pic.twitter.com/1lmiOuwQPu— Filmy Focus (@FilmyFocus) March 23, 2026 -
కోట్లాది రూపాయల స్కామ్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన మంగ్లీ
సత్యవతి అలియాస్ ప్రముఖ సింగర్ మంగ్లీ పేరుతో కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు మంగ్లీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించి ఓ లాయర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించగా.. ఈ కేసులో మంగ్లీ తమ్ముడు శివ కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్లో ఏకంగా రూ.150 కోట్ల మేర క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయమై స్వయంగా మంగ్లీనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది)'మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలని ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజూ చాలామంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్విటేషన్ వివరాలవరకే గానీ, వాళ్ల వ్యక్తిగత వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరుని వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం' 'కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలని, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను' అని మంగ్లీ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
'తెరచాప' ట్రైలర్ రిలీజ్
అనన్య క్రియేషన్స్ బ్యానర్పై కైలాష్ దుర్గం నిర్మాతగా తీస్తున్న సినిమా 'తెరచాప'. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)తెరచాప ట్రైలర్ చూస్తుంటే సముద్రతీరంలో జరిగే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడమూ సహజమే. అలాంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితులపై ఎలా పోరాడాడు? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయిన ధురంధర్ 2) -
రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్)తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.మరోవైపు బాలీవుడ్లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) -
మనుషులు సైతాన్ ఎదురెదురుగా ఉండే ప్రదేశమిది.. టీజర్ రిలీజ్
'2018' అనే డబ్బింగ్ సినిమాతో పాటు పలు ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో పరిచయమున్న టొవిన్ థామస్.. ఇప్పుడు 'పల్లిచట్టంబి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 10న దక్షిణాది భాషల్లో ఇది రిలీజ్ కానుంది. లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్. తాజాగా ప్రమోషన్లలో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)ఓ ఊరిలో జరిగి అంతర్గత సమస్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తీసినట్లు టీజర్ బట్టి అర్థమవుతుంది. ఒకటి రెండు తెలిసిన ముఖాలు ఉన్నప్పటికీ.. టైటిల్ దగ్గర నుంచి కాన్సెప్ట్ వరకు ప్రతిదీ తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. దానికి తోడు అదే తేదీన 'డకాయిట్' మూవీ రిలీజ్ కానుంది. చూడాలి మరి 'పల్లిచట్టంబి' ఏం చేస్తుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) -
మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్లో మోహన్బాబు
టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూతురు నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది. ఆ వేడుకకు లక్ష్మి తల్లితో పాటు, సోదరుడు మంచు మనోజ్ భార్యాపిల్లలతో సహా హాజరయ్యాడు. ఎంతో సంబరంగా మేనకోడలిని పల్లకిలో ఎక్కించుకుని మరీ ఊరేగాడు. మరో సోదరుడు విష్ణు, తండ్రి మోహన్బాబు మాత్రం ఫంక్షన్లో ఎక్కడా కనిపించలేదు.మరోసారి ఫంక్షన్దీంతో మంచు కుటుంబంలో విభేదాలు తగ్గలేదా? అన్న అనుమానం మొదలైంది. తాజాగా మరోసారి హాఫ్ శారీ ఫంక్షన్కు సంబంధించిన ఈవెంట్ నిర్వహించడం చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. నిర్వాణ ఓణీల ఫంక్షన్ను మరోసారి ఇంట్లో గ్రాండ్గా నిర్వహించారు. తనకు నలుగుపెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హాజరవని విష్ణుఈ వేడుకను మోహన్బాబు దంపతులు దగ్గరుండి చూసుకున్నారు. మనవరాలిని మనసారా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు భార్య విరానిక, వారి పిల్లలు సైతం హాజరయ్యారు. కానీ విష్ణు మాత్రం హాజరవలేదు. అలాగే మనోజ్ దంపతులు కూడా ఈ ఫంక్షన్లో కనిపించలేదు. దీంతో విడిపోయిన కుటుంబం కోసం రెండుసార్లు ఈ వేడుక జరిపినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
తమిళ సాంగ్ రిలీజ్.. స్టెప్పులేసిన రోజా
మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తుండటంతో పాటు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్య రంగనాథన్ నటిస్తోంది.సాంగ్ రిలీజ్తమిళనాడులోని ఒక గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగిల్ సాంగ్ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు నటి రోజా కూడా స్టెప్పులేశారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రియులు రిపీట్ మోడల్ వింటున్నారు. సినిమారొమాంటిక్ వైబ్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే అన్బే డయానా ఆడియో, ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ గెలిస్ట్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. -
అరెరే... అరెరే
గాయని – నటి దియా తాజా మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ‘అరెరే... అరెరే..’. క్రాంతీ వర్మ దర్శకత్వంలో నూతన్ చేకూరి నిర్మించిన ఈ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, హీరో ఆకాశ్ పూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, మిమిక్రీ ఆర్టిస్టు–నటుడు శివ, సమీర్, సాగర్... ఈ ఆల్బమ్ సక్సెస్ అవ్వాలన్నారు.‘‘మంచి కాన్సెప్ట్తో రూపొందిన ఆల్బమ్ ఇది’’ అని చెప్పారు నూతన్ చేకూరి. ‘‘భావోద్వేగాలతో కూడిన విజువల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే ఈ ఆల్బమ్ చేశాం’’ అన్నారు క్రాంతీ వర్మ. ఈ ఆల్బమ్ మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ మాట్లాడారు. -
పాట కావాలయ్యా..!
సినిమా మొత్తం సీరియస్గా సాగుతోంది... మరోవైపు ఎమోషన్స్ కూడా కంట తడిపెట్టిస్తున్నాయి... ఇలాంటప్పుడే రిలీఫ్ కోసం ఒక పాట కావాలయ్యా అని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకైతే గ్రాండ్ లెవెల్లో స్పెషల్ సాంగ్ కావాలని ఉంటుంది. అందుకే ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. రానున్న కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈ తరహా పాటలు ఉన్నాయి. అయితే... ఈ స్పెషల్ సాంగ్స్ గురించి యూనిట్ నుంచి అధికారిక ప్రకటన లేదు. కానీ ప్రచారంలో ఉన్న ప్రకారం పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహీ ప్రత్యేక పాటల్లో కనిపించనున్నారట. ఆ పాటలు ఏ సినిమాలోనో తెలుసుకుందాం.హిట్ రిపీట్ అవుతుందా? టాప్ హీరోయిన్ పూజా హెగ్డే వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే చేసిన ‘మోనికా..’ సాంగ్ సూపర్హిట్గా నిలిచింది. రామ్చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేసిన ప్రత్యేక పాట ‘జిగేల్ రాణి’, వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 3’లో చేసిన స్పెషల్ సాంగ్ ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాల..’ కూడా చాలా పాపులర్. ఈ పాటల తరహాలోనే మరో హిట్ స్పెషల్ సాంగ్ను చేయనున్నారట పూజా హెగ్డే. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో దీపికా పదుకోన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు యూనిట్ ప్రకటించగా, హీరోయిన్స్ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ భోర్సేలు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ కోసం మేకర్స్ పూజా హెగ్డేని సంప్రదించారనే టాక్ తెరపైకి వచ్చింది.మరి... అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తారా? పూజా హెగ్డే గత ప్రత్యేక పాటల సక్సెస్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘అల.. వైకుంఠపుర ములో..’లోని సాంగ్స్ బాగా పాపులర్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. మాస్ సాంగ్ రామ్ చరణ్ నటించిన రూరల్ మాస్ మూవీ ‘రంగస్థలం’లోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి..’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మళ్లీ రామ్చరణ్ ఈ రూరల్ బ్యాక్డ్రాప్లో మరో సినిమా చేస్తున్నారు. అదే ‘పెద్ది’. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణను ఆరంభిస్తారు. అయితే బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్లో స్పెషల్ కూడా ఒకటి ఉందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్లో ముగ్గురు హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తారనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్గా మృణాల్ ఠాకూర్ చేయనున్నారని సమాచారం. అది మాత్రమే కాదు... ఈ చిత్రకథానాయిక జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కనిపిస్తారని భోగట్టా. రామ్ చరణ్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్లో రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ మాసీ సాంగ్ అంటే మాస్ ఫ్యాన్స్కు విజిల్ మూమెంట్స్ అనే చెప్పవచ్చు. అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని ఊహించ వచ్చు. ఏప్రిల్లో మొదటి వారంలో ఈ పాట చిత్రీకరణ జరగనుందని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్.జైలర్తో సందడి ‘నువ్వు కావాలయ్యా...’ అంటూ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ (2023)లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘జైలర్ 2’లో ఈ తరహా ప్రత్యేక పాట కావాలయ్యా... అంటున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే సీక్వెల్లోనూ బ్రహ్మాండమైన స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటకు నోరా ఫతేహీ డ్యాన్స్ చేశారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్–నోరా పాల్గొనగా చెన్నైలో ఎనిమిది రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారని సమాచారం.తొలి భాగానికి పాటలు స్వరపరచిన అనిరుధ్ రవిచందర్ ‘జైలర్ 2’కి కూడా సంగీతం అందించారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్కుమార్ మలి భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సీక్వెల్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలోని ప్రత్యేక పాటకు జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారని తెలిసింది. ఇది సౌత్ స్టైల్లో సాగే సాంగ్ అని, చాలా గ్రాండ్గా చిత్రీకరించారని చెన్నై ఫిల్మ్నగర్ అయిన కోడంబాక్కమ్లో ప్రచారమవుతోంది.ఇదిలా ఉంటే... తెలుగు, తమిళ, హిందీ... ఇలా పలు భాషల్లో నోరా ఫతేహీ ఇప్పటివరకూ ఎన్నో ప్రత్యేక పాటలు చేశారు. వాటిలో ఎన్టీఆర్ ‘టెంపర్’లోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’, ప్రభాస్ ‘బాహుబలి’లోని ‘మనోహరీ...’ పాటలు కూడా ఉన్నాయి. మరి... ‘జైలర్ 2’లోని పాటకు నోరా ఏ స్థాయిలో డ్యాన్స్ చేశారో జూన్లో తెలిసిపోతుంది. ఆ నెలలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఏడు వారాలు... పది కిలోలు
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి మేకోవర్కైనా ఎన్టీఆర్ సై అంటారు. అందుకు ఉదాహరణలుగా ‘అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. తాజా చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం ఈ చాలెంజ్ను స్వీకరించారని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభ సమయంలో కాస్త హెవీ బాడీ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో చాలా సన్నగా కనిపించారు. హీరో క్యారెక్టరైజేషన్ కోసమే ఎన్టీఆర్ ఇలా స్లిమ్ లుక్లోకి మారిపోయారని సమాచారం. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ ఏడు వారాల్లో పది కిలోల బరువు తగ్గారట.నిపుణుల సమక్షంలో ప్రతిరోజూ గంటన్నర పాటు వ్యాయామం, లో ప్రోటీన్ డైట్ను ఫాలో అవుతూ లీన్ లుక్లోకి మారిపోయారని టాక్. ఇలా సినిమా షూట్ ప్రారంభంలో కాస్త హెవీ బాడీ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత లీన్ లుక్లోకి మారారంటే... ‘డ్రాగన్’లో ఈ హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, టోవినో థామస్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోందని టాక్. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు!
కొన్నిసార్లు పోటీ కంటే తప్పుకోవడం వల్ల కూడా మంచి జరగొచ్చు. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య ఇలాంటి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా 'ధురంధర్ 2' గురించే. ఈ మూవీ నుంచి యష్ ఎలా తప్పించుకున్నాడు. పవన్ కల్యాణ్ ఎలా దొరికిపోయాడనేదే ఈ స్టోరీ.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)గతేడాది డిసెంబరు 5న 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయినా సరే 'కేజీఎఫ్' ఫేమ్ యష్ 'టాక్సిక్' మూవీని అదే తేదీకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా అనౌన్స్ చేశారు. మార్చి మొదలైన వరకు రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయేమోనని అనుకున్నారు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి వాతావరణాన్ని కారణంగా చూపిస్తూ 'టాక్సిక్' మూవీని వాయిదా వేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వల్లే ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు 'ధురంధర్ 2' రిలీజైన వారం తర్వాత అంటే మార్చి 26న తమ సినిమా రిలీజ్ చేస్తామని 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలుత చెప్పింది. కానీ 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందుకొచ్చారు. ధురంధర్ హిందీ సినిమానే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఉంది. ఇదేమైనా 'ఉస్తాద్..'కి నెగిటివ్ అవ్వొచ్చేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రిలీజ్ రోజున 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ రాకపోవడం, ఉగాది పండగ వల్ల 'ఉస్తాద్..'కి ఉన్నంతలో కలిసొచ్చింది.కానీ రెండో రోజు నుంచి 'ధురంధర్ 2' హిందీ బుకింగ్స్ పెరిగాయి. అదే టైంలో మూస కంటెంట్ వల్ల 'ఉస్తాద్..' వసూళ్లలోనూ విపరీతమైన డ్రాప్ కనిపించింది. అది మరింతగా కొనసాగుతోంది. ఈ వీకెండ్ వరకు ఓకే గానీ సోమవారం నుంచి పవన్ సినిమాకు అగ్నిపరీక్షే. ఎందుకంటే వర్కింగ్ డేస్లోనూ ఈ మూవీ నిలబడితే పర్లేదు. అలా జరగకపోతే మాత్రం కష్టమే. మరోవైపు 'ధురంధర్ 2' తెలుగు షోలకు ఇచ్చిన స్క్రీన్లు సరిపోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్ ఓనర్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపుతారా? లేదంటే 'ఉస్తాద్..'నే కొనసాగిస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్
అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని ఏ దర్శకులు కూడా తీసుకోవట్లేదు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈయన కీలక పాత్రలో నటించిన సినిమా 'బైకర్'. శర్వానంద్ హీరో. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే రాజశేఖర్.. తనకు అవకాశాలు ఇవ్వాలని బతిమలాడుకున్నారు.(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది)ఒకప్పుడు హీరోగా హిట్స్ కొట్టిన చాలామంది ఇప్పుడు తెరమరుగైపోయారు. మధ్యలో విలన్, సహాయ పాత్రలతో జగపతిబాబు లాంటి వాళ్లు వచ్చారు. ఒకరిద్దరు మాత్రమే బలంగా నిలబడ్డారు. ఇప్పుడు రాజశేఖర్ 'బైకర్'లో హీరో తండ్రిగా, రేసింగ్ కోచ్గా మంచి నిడివి ఉన్న పాత్రనే చేసినట్లున్నారు. అయితే తనని ఏ దర్శకుడు కూడా సంప్రదించకపోయేసరికి.. స్వయంగా ఈయనే 'ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి' అని రిక్వెస్ట్ చేశారు.సెకండ్ స్టేజీకి వచ్చేశానని ఇన్నాళ్లు అనుకున్నానని.. కానీ అలాంటివేం ఇప్పుడు లేవని తన కూతుళ్లు చెప్పడంతోనే 'బైకర్'లో నటించానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్ర షూటింగ్లో తనని రెండో హీరోలా ట్రీట్ చేశారని, శర్వానంద్ కూడా నేనే హీరోని అన్నట్లు ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా రాజశేఖర్ లాంటి నటుడు.. ఇలా అవకాశాల కోసం బతిమలాడుకోవడం వింతగా అనిపించింది. రీసెంట్ టైంలో అయితే గోటీల ఫ్యాక్టరీ అనే మాటతో తెగ వైరల్ అవుతున్నారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
చీరలో ముద్దుగుమ్మలా ఆషిక.. వావ్ అనేలా తమన్నా
చీరలో అందాలు చూపించేస్తున్న ఆషికవావ్ అనేలా మెరిసిపోతున్న తమన్నాగ్లామరస్ వీడియోతో సంయుక్త హొయలుమెరుపు తీగ కంటే సన్నగా మౌనీ రాయ్మాల్దీవుల్లో చిల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ మెరుపులు View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది
శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బైకర్'. ఒకప్పటి హీరో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులోనే ఈ మూవీ రిలీజవ్వాలి. కానీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అదిరిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)రేసింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అందులోనూ బైక్ రేసింగ్ కాన్సెప్ట్తో ఇప్పటివరకు అయితే రాలేదు. ఇందులో శర్వానంద్, రాజశేఖర్.. తండ్రికొడుకులు పాత్రలు చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉన్నాయి. మరి మూవీ ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?) -
పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?
గతంలో పవన్ కల్యాణ్ వరస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు 'దబంగ్'ని రీమేక్ చేసి 'గబ్బర్ సింగ్' తీసిన దర్శకుడు హరీశ్ శంకర్ హిట్ కొట్టాడు. ఇది 2011లో జరిగింది. మూవీలో కంటెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేసరికి ప్రేక్షకులు ఆదరించారు. దాదాపు అదే టెంప్లేట్తో తీసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ అభిమానుల కోసం దీన్నే తీశానని హరీశ్ శంకర్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్లే ఫ్యాన్స్కి తప్పితే సగటు ఆడియెన్స్కి నచ్చలేదు. బుకింగ్సే అందుకు నిదర్శనం.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)ఇప్పుడు పవన్తో మరో సినిమా తీస్తానని హరీశ్ శంకర్ అంటున్నాడు. ఈసారి స్టోరీ కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చేలా తీస్తానని అంటున్నాడు. అయితే ఈ దర్శకుడు మూవీ చేస్తానని అనడం బాగానే ఉంది గానీ పవన్ ఒప్పుకొన్నాడా లేదా అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సురేందర్ రెడ్డి మూవీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒప్పుకొన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి తర్వాత మూవీస్ చేస్తాడా అనేది సందేహమే.హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. అప్పుడెప్పుడో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. గద్దలకొండ గణేశ్, మిస్టర్ బచ్చన్ లాంటి రీమేక్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇప్పుడు తీసిన 'ఉస్తాద్..' ప్రకటించి, పూర్తి చేసి రిలీజ్ చేయడానికే ఐదేళ్లు పట్టేసింది. ఇప్పుడు మరో సినిమా అంటే అయ్యే పనేనా అని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకొన్న ప్రొడ్యూసర్ ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!) -
షకీరా భారత్ పర్యటన బ్రేక్
పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న ఘర్షణల కారణంగా షకీరా భారత సంగీత కచేరీ వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్లో ముంబై, ఢిల్లీలలో జరగాల్సిన ఈ ప్రదర్శనలను "భౌగోళిక రాజకీయ పరిస్థితి, ప్రాంతీయ ఉద్రిక్తతల" కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్టు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తిగా డబ్బు వాపసు ఇవ్వబడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమం గురించి నిర్వహాకులు ఇలా ప్రకటించారు. "ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా.. షకీరా పాల్గొనవలసిన 'ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్' మరో తేదీకి వాయిదా వేయబడింది. అభిమానుల రక్షణే మా యూనిట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. టిక్కెట్టు కొనుగోలు చేసిన వారందరికీ పూర్తి వాపసు ఇవ్వబడుతుంది," అని డిస్ట్రిక్ట్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ తమ హ్యాండిల్లో ఒక పోస్ట్ పేర్కొంది.కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. కొలంబియన్ సింగర్ షకీరా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. భారత్లో తొలిసారి ముంబైలో(2007) ఒక అద్భుతమైన కచేరీ చేసింది. ఇక్కడ అదే ఆమెకు తొలి ప్రదర్శన కావడం విశేషం. ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్, "లాస్ ముజెరెస్ యా నో లోరన్ వరల్డ్ టూర్" (Las Mujeres Ya No Lloran World Tour) తో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇస్తోంది. -
లంగా ఓణితో పార్టీకి వెళ్లలేం కదా.. డ్రెస్సింగ్పై నిహారిక కామెంట్స్
మహిళల వస్త్రధారణ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంది దుస్తులు ధరించాలనేది వారిష్టం కానీ, సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మెలగాలని ఆమె అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించొచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత మనం సొసైటీతో ఎన్నో రిలేషన్స్ పెట్టుకొని ఉంటాం, వాటికి అనుగుణంగానే వస్త్రధారణ ఉండాలి. నేను ఏదైనా ఒక పెళ్లికి వెళితే కచ్చితంగా చీర కట్టుకొనే వెళ్తాను. అలాగే నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళితే లంగా ఓణి వేసుకొని వెళ్లలేను కదా? అలా వెళ్తే.. అందరూ కింది నుంచి పైవరకు అలా చూస్తారు(నవ్వుతూ..). మనం వెళ్లే సందర్భాన్ని బట్టి దుస్తులు ఉండాలి. టీనేజ్ లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఇలాంటి డ్రెస్ వేసుకొద్దు.. అలా రెడీ కావాలని చెబుతుంటారు. అది మనకు కండీషన్లు పెట్టినట్లు కాదు..బయట సమాజం గురించి తెలియదు కాబట్టే వాళ్లు ప్రొటెక్ట్ చేస్తున్నారనీ అర్థం. నాక్కుడా నాన్న అలాంటి సలహా ఇచ్చేవారు. అమ్మ కూడా ‘ఇది నీకు సెట్ అవ్వలేదు..అది వేసుకో బాగుంటుంది’ అని చెప్పేది. అందులో తప్పేం లేదు. టీనేజ్ దాటిన తర్వాత కూడా అలాంటి కండీషన్లు పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్లకు తెలుసు. ఏ డ్రెస్ వేసుకుంటే.. ఎలాంటి కామెంట్స్ చేస్తారో. మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దుస్తులు ధరించాలి’ అని నిహారిక చెప్పుకొచ్చింది. నిహారిక కెరీర్ విషయానికొస్తే.. నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి.. నిర్మాణ సంస్థపై ఫోకస్ చేసింది. తన బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై వరుస సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతోంది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. -
'నూరేళ్లు కాదు.. 130 ఏళ్లు'.. సుమకు రాజీవ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాలకు ఆమె భర్త ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ సుమ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను వ్యక్తం చేశారు. తెలుగులో వేద మంత్రాన్ని రాస్తూ తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు… కాదు కాదు.. ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నానంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నారు రాజీవ్ కనకాల. ఇది చూసిన అభిమానులు సైతం సుమకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. రాజీవ్ కనకాల, సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కుమారుడు రోషన్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి పరిచయం సీరియల్స్తోనే మొదలైంది. అలా ప్రేమలో పడిన ఈ జోడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. గతంలో ఓ సినిమా ఈవెంట్లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ వారి పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. సుమ - రాజీవ్ కలిసి నటించిన సూపర్ హిట్ సీరియల్ 'శాంతి నివాసం' సీరియల్తోనే వారి మధ్య ప్రేమ చిగురిందని అన్నారు.శుభజన్మదినం తుభ్యంశుభజన్మదినం తుభ్యంశుభజన్మదినే తవ హేసకలం సఫలం భూయాత్సకలం చ శుభం భూయాత్నిండూ నూరేళ్లు… కాదు కాదు, ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నాను ✨Happy Birthday @ItsSumaKanakala ❤️ pic.twitter.com/nxYUpFVVKb— Raajeev kanakala (@RajeevCo) March 22, 2026 -
అల్లు అర్జున్- అట్లీ సినిమాలో అనుష్క
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి(AA 22) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. పుష్ప-2 తర్వాత బాలీవుడ్లో అల్లు అర్జున్కు భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో తను నటించబోయే సినిమాల్లో హిందీ హీరోయిన్లనే ఎంపిక చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే అట్లీ సినిమా కోసం దీపికా పదుకోణ్ను తీసుకున్నారు. లోకేశ్ కనగరాజ్ మూవీ కోసం శ్రద్ధా కపూర్ పేరు పరిశీలనలో ఉంది. ఇంతలోనే మరో క్రేజ్ హీరోయిన్ పేరు తెరపైకి రావడం విశేషం.అల్లు అర్జున్- అట్లీ మూవీ కోసం అనుష్క శర్మను తీసుకోనున్నట్లు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. కానీ, ఈ వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే, అనుష్క ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయనున్నారు. క్రికెటర్ కోహ్లీతో వివాహం తర్వాత అనుష్క కాస్త సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అర్జున్తో సినిమా కావడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.AA22 చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సైన్స్ఫిక్షన్ మూవీలో హీరో పాత్ర మూడు విభిన్న కోణాల్లో సాగుతుందని టాక్. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణ్తో పాటు అనుష్క శర్మ ఎంట్రీ ఇస్తే ఇదో సంచలనంగా మారడం ఖాయం. -
'మామయ్య ఎల్లప్పుడు నీ వెంటే ఉంటారు'.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
మంచువారి ఇంట ఇటీవలే శుభకార్యం జరిగింది. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ హాఫ్ శారీ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు కూడా పాల్గొన్నారు. తన కోడలి ఓణీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ ఫంక్షన్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. దేవుడు నాకేమిచ్చాడని అడిగితే.. అందులో మా సిస్టర్ కూడా ఒకరని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆమె నాకు ఎల్లప్పుడు ప్రేమను, ఆప్యాయతను, బలాన్ని ఇస్తుందని రాసుకొచ్చాడు.మంచు మనోజ్ తన ఇన్స్టాలో రాస్తూ..' దేవుడు నాకిచ్చిన వాళ్లలో మా సిస్టర్ కూడా ఒకరు. ఆమె నాకు నిరంతరం ప్రేమ, ఆప్యాయత, బలాన్ని ఇచ్చింది. తనకు కూడా అదే ప్రేమను తిరిగి ఇవ్వాలన్న కోరిక నాలో ఎప్పుడూ ఉండేది. చిన్నారి విద్యా నిర్వాణ మా జీవితాల్లోకి అడుగుపెట్టినప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. తనకు మామగా నా ప్రయాణం మొదలైంది. విద్యా నిర్వాణకు మామగా ఉండటం కేవలం ఒక బిరుదు కాదు.. అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. తన రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా, ఊహించనంత ప్రేమను ఇవ్వాలని కోరుకునే వ్యక్తిగా మను మామ, అత్త, ధైరవ్, దేవసేన ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటారు. నేను నీకు కనిపించనప్పుడు కూడా సున్నితమైన హృదయంతో ఈ ప్రపంచాన్ని జయించు. నీకు బలంగా, నీకు అండగా, నిశ్శబ్దంగా నీ వెనుక నిలబడతా.. లవ్ యూ నా బంగారు తల్లి ' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
'ధురంధర్' విజయం వెనుక తెలుగు హిట్ సినిమా: ఆదిత్య ధర్
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్- 2: ది రివెంజ్’.. బాక్సాఫీస్ వద్ద మూడురోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయింది. గతేడాదిలో విడుదలైన పార్ట్-1 భారీ విజయం అందుకోవడంతో దర్శకుడు ఆదిత్య ధర్ పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అయితే, ఇంతటి బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ను డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ తాజాగా తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు. 'ధురంధర్' సినిమా విజయం వెనుక తెలుగు హిట్ సినిమా స్పూర్తి అని ఆయన పంచుకున్నారు.నాగార్జున ఐకానిక్ చిత్రం 'శివ'(1989)పై దర్శకుడు ఆదిత్య ధర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని నేటికీ తప్పక చూడాలని ఆయన అన్నారు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు శివ సినిమా చూసినట్లు గుర్తుచేసుకున్నారు. శివ చిత్రం చాలామంది దర్శకులకు దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సినిమా ద్వారా టెక్నికల్ వాల్యూస్, మేకింగ్ స్టైల్లో కొత్త ఒరవడిని RGV సృష్టించారని ఆయన మెచ్చుకున్నారు.శివ సినిమాలోని ఇళయరాజా సంగీతంపై కూడా ఆదిత్య ధర్ ప్రశంసించారు. ఇందులో విప్లవాత్మకమైన సౌండ్ డిజైన్ ఉన్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. 'శివ' చిత్రం ఇప్పటికీ తాజాగా, శక్తివంతంగా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ చిత్రం భారతీయ సినిమా భాషను ఎలా మార్చిందో, తరతరాల చిత్రనిర్మాతలకు ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఒక ఆధునిక దర్శకుడి నుండి వచ్చిన ఈ అరుదైన ప్రశంస, నిజమైన క్లాసిక్లు కాలంతో పాటు మసకబారవని నిరూపిస్తుంది. రామ్గోపాల్ వర్మ తన సృజనాత్మక మేకింగ్తో తరతరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారని, ఆదిత్య ధర్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. A 6 year old kid saw #Shiva and today he became #AdityaDhar https://t.co/Y0Fh3GP55Z pic.twitter.com/ARbIY4t2j0— Nag Mama Rocks (@SravanPk4) March 21, 2026 -
ఇటలీలో భారీ విల్లా కొనుగోలు చేసిన ప్రభాస్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆస్తుల గురించి ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఆయనకు విదేశాల్లో భారీ ఆస్తులు ఉన్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ప్రభాస్ ఇటలీలో భారీ విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఆయనకు ఇటలీలో రెండు భారీ విల్లాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇటలీ అంటే పిచ్చి..ప్రభాస్కు ఇటలీ అంటే చాలా ఇష్టం. ఖాలీ సమయం దొరికితే చాలు ఇటలీలో వాలిపోతాడు. అక్కడి వాతావరణం, లొకేషన్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఎక్కువ సమయం ఇటలీలో గడిపేందుకు ప్రయత్నిస్తాడు. ఇప్పటికే అక్కడ ఓ భారీ విల్లాను కొనుగోలు చేశాడట. ఇటలీ వెళ్లిన ప్రతిసారి ప్రభాస్ అదే విల్లాలో ఉంటాడని, మిగతా సమయంలో రెంట్కి ఇస్తాడని గతంలో వార్తలు వినిపించాయి. వీటిపై ప్రభాస్ ఎప్పుడూ స్పందించలేదు.యూరప్లో సెటిల్?ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకునే నటుడు ప్రభాస్. తన సంపాదనలో ఎక్కువ భాగం భూమిపైనే పెట్టేందుకు ఆసక్తి చూపుతాడట. తన బంధువులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. మరికొంత భాగాన్ని ఇలా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కేటాయిస్తాడట. అయితే వరుసగా ఇటలీలోనే రెండు విల్లాలు కొనడంతో..ఇక భవిష్యత్తులో ప్రభాస్ అక్కడే సెటిల్ అవుతాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల మోకాలీ సర్జరీకి కూడా ప్రభాస్ ఇటలీకే వెళ్లాడు.వరస సినిమాలతో బిజీ బిజీప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు ఆయన నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘పౌజీ’ కూడా రిలీజ్కు రెడీ అవుతుంది. మరోవైపు కల్కీ సీక్వెల్ కల్కీ 2 మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. -
కల్కి సీక్వెల్లో స్టార్ నటుడు ఎంట్రీ..!
ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ లేకుండానే ఇప్పటికే కల్కి పార్ట్-2 షూటింగ్ పనులు కొద్దిరోజుల క్రితమే మొదలయ్యాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్తో భాగమైన సీన్స్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీలో మరో స్టార్ నటుడు చేరాడని తెలుస్తోంది.హైదరాబాద్లో కొనసాగుతున్న కల్కి-2 షూటింగ్ సెట్స్లోకి ప్రముఖ హీరో జె.డి. చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చారని సమాచారం. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీలో ఆయన ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. అతి త్వరలోనే కల్కి సెట్స్లోకి ప్రభాస్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నగా.. దీపికా పదుకోన్ స్థానంలో ఒక కొత్త నటి రానుంది. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. -
మేనకోడలికి ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు
బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. జైన్ మేరీ ఖాన్ బర్త్ డే (మార్చి 20) సందర్భంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, యూనిట్కు అభినందనలు తెలిపారు ఆమిర్ ఖాన్. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘లవ్, యాక్షన్, హార్ట్బ్రేక్ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ–నిర్మాత: సునీల్ నారంగ్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గ్యాని. -
హుక్ స్టెప్ సవాల్.. గెలిస్తే రూ. లక్ష సొంతం!
పార్థ గోపాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. మేఘన హీరోయిన్గా నటించారు. సూర్య జి. యాదవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొని, పాటలను విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ ఎమోషన్ అండ్ రివెంజ్ మూవీ ఇది. ఏప్రిల్లో రిలీజ్ చేయనున్నాం. ఈ చిత్రంలోని ‘మరదలివే..’ పాటలోని హుక్ స్టెప్ రీల్స్ చేసి, పంపించేవారిలో విజేతలకు నగదు బహుమతులు ఇస్తాం’’ అని తెలిపారు పార్థ గోపాల్. మొదటి బహుమతి కింద లక్ష రూపాయలు, రెండో బహుమతిగా రూ. 50 వేలు అందిస్తామని చెప్పారు. ‘‘పెద్దపల్లి రోహిత్ ఈ సినిమాకు మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు’’ అని పేర్కొన్నారు సూర్య జి. యాదవ్. -
విరోష్ జంట హనీమూన్.. సోషల్ మీడియాలో ఫోటో లీక్..!
టాలీవుడ్ జంట రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ కొత్త ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లికి కొన్ని రోజుల ముందే తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించారు. వీరిద్దరి పెళ్లి వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో విరోష్ జంట సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని సందడి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు.తాజాగా ఈ జంట పెళ్లి తర్వాత హనీమూన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. విరోష్ జంట తమ హనీమూన్ కోసం థాయ్లాండ్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫుల్ రొమాంటిక్గా ఉన్న ఈ ఫోటో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ థాయిలాండ్ హనీమూన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోలో విరోష్ జంట ఒక మెట్లపై ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ప్రశాంతంగా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న 'రణబలి' చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ మూవీ బ్రిటిష్ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. View this post on Instagram A post shared by ⭐VDFC MAHARASHTRA™⭐ (@vijaydeverakonda_maharashtra) -
కాంట్ అవాయిడ్
‘వయొలెన్స్ ... వయొలెన్స్ ... వయొలెన్స్ ... ఐ డోంట్ లైక్... ఐ అవాయిడ్... బట్.. వయొలెన్స్ లైక్స్ మీ... ఐ కాంట్ అవాయిడ్’ అంటూ ‘కేజీఎఫ్ 2’ సినిమాలో యశ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... ప్రస్తుతం తెరకెక్కుతోన్న సినిమాల్లో అధిక శాతం ‘కాంట్ అవాయిడ్... కథలో వయొలెన్స్ ఉంటే తప్పదు గురూ’ అన్నట్లుగా వయొలెన్స్ డామినేటెడ్ కథల్లో నటిస్తున్నారు కొందరు స్టార్స్. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, యశ్, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడివి శేష్, శర్వానంద్ వంటి హీరోలు వెండితెరపై వయొలెన్స్ చూపించనున్నారు. ఆ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం...కాన్సెప్ట్ పోస్టర్తోనే అంచనాలు చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన బ్లాక్బస్టర్ అందున్నారు. ఈ మూవీకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘మన శంకర వరప్రసాద్గారు’ తర్వాత తన భుజానికి చిన్న సర్జరీ చేయించుకున్నారు చిరంజీవి. ఈ కారణంగా బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న షూటింగ్ ఆరంభం కాలేదు.ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకున్న ఆయన బాబీ డైరెక్షన్లో రూపొందనున్న మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే... మరో యువ దర్శకుడు, ‘దసరా’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లోనూ చిరంజీవి ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ మూవీతో నానీని ఫుల్ మాస్ లుక్లో చూపించి, హిట్ అందుకున్నారు. తొలి సినిమాతోనే రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చిరంజీవితో సినిమా చేసే లక్కీ చాన్స్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు శ్రీకాంత్. ఈ మూవీలోనూ ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు నాని. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.ఈ చిత్రం విడుదల తర్వాత చిరంజీవి సినిమాపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారాయన. చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల మూవీకి సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. చేతి నుంచి రక్తం కారుతున్న ఆ పోస్టర్ ఈ మూవీలో ఏ స్థాయి వయొలెన్స్ ఉండబోతోందో చెప్పింది. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. హీరో నాని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనుడంటం విశేషం. 1970–74లో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో చిరంజీవి సరికొత్తగా కనిపిస్తారని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ షూటింగ్ని ఆరంభిస్తామని సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. మూడువేల మందితో... ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో వయొలెన్స్ , యాక్షన్కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి ‘కేజీఎఫ్ 1, 2 ’ చిత్రాల్లో వయొలెన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ పేర్కొంది. అంతేకాదు.. ఈ మూవీ కోసం జోర్డాన్ లోనూ రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పోరాట సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని అలరిస్తాయట.ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూపాయలతో సినిమాలో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించారు. ఈ సెట్లోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట మేకర్స్. ఇలా... ఈ సినిమాలోని ఫైట్స్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ సినిమాకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో... ‘ది రాజా సాబ్’ వంటి హిట్ మూవీ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’ లో వైలెన్స్ ని ఏ స్థాయిలో చూపించారో సందీప్ రెడ్డి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ వయొలెన్స్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ తన పంథా ఏమాత్రం మార్చుకోకుండా తనదైన శైలిలోనే వెళుతున్నారాయన. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ని కూడా ఫుల్ వయొలెన్స్ గా చూపించనున్నారట ఆయన. తన మార్క్ ఇంటెన్స్, యాక్షన్, ఎమోషన్స్, రా పవర్తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్. తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘స్పిరిట్’ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న గ్రాండ్గా విడుదల కానుంది. సలార్ 2లోనూ.... ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్ 1–సీజ్ ఫైర్’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా 2023 డిసెంబరు 22న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో హైలెట్గా నిలిచాయి. ఈ మూవీకి సీక్వెల్గా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రానున్న విషయం తెలిసిందే. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్లో వయొలెన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయని ఫిల్మ్నగర్ టాక్. ఈ ఎపిసోడ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని పంచుతాయని తెలిసింది.ఇదిలా ఉంటే... ఈ మూవీపై గత కొన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ– ‘‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ షూటింగ్ని త్వరలోనే ప్రారంభిస్తాం. మొదటి భాగంతో పోలిస్తే ద్వితీయ భాగం అందర్నీ మరింత ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్–నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారట ప్రశాంత్ నీల్.అంతకు మించి... ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ మూవీస్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రో డక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ కలిసి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తే...‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ సినిమాలకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ ‘టాక్సిక్’లో ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం యశ్ సరికొత్త ఫిజిక్తో మేకోవర్ అయ్యారు.ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో ఈ నెల 19న రిలీజ్ కావాల్సి ఉండగా జూన్ 4కి వాయిదా పడింది. ‘‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం నిర్మించాం. ఎంతో అంకితభావం, ఎన్నో ఏళ్ల శ్రమతో తీసిన మా సినిమాని మార్చి 19న రిలీజ్ చేసి మా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాం. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో జూన్ 4న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓవర్సీస్లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం. మా భాగస్వాములు, మా ప్రేక్షకుల ప్రయోజనాల దృష్ట్యా మా సినిమా విడుదలను తిరిగి షెడ్యూల్ చేయడానికి మేం నిర్ణయం తీసుకున్నాం. ఇలానే మీ ప్రేమ, అభిమానం, సహకారం ఉంటాయని ఆశిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ‘టాక్సిక్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్్సపై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.పవర్ఫుల్ కల్ట్విశ్వక్ సేన్ హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కల్ట్’. ‘ఫలక్నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ ఇతర పాత్రలు పోషించారు. తారక్ సినిమాస్ బ్యానర్పై సందీప్ కాకరాల నిర్మించారు.ఈ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీలో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే రక్తంతో తడిసిన ఇంటెన్స్ లుక్లో విశ్వక్ సేన్ కనిపించగా, భారీ హైప్ సృష్టించింది. అదే విధంగా ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘‘జనాలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్’ సినిమా తీశాను.‘ఫలక్నుమా దాస్’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి’’ అంటూ టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మాస్ జడల్ ‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై రూపొందుతోన్న ఈ సినిమాలో మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీలో నానీని పవర్ఫుల్ మాస్ పాత్రలో చూపించారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ మూవీ తర్వాత వీరి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో జడల్ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తారు నాని. ‘హిట్ 3’లో నాని వయొలెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అయితే ‘ది ప్యారడైజ్’లోని వయొలెన్స్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని మరింత స్పష్టం అవుతోంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నానిపై చిత్రీకరించిన ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్...’ని ఇటీవల విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని కూడా యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్... ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21కి విడుదల వాయిదా వేశారు మేకర్స్. మాస్ రణబాలి హీరో విజయ్ దేవరకొండ ఒకేసారి ‘రౌడీ జనార్థన, రణబాలి’ వంటి రెండు వయొలెన్స్ సినిమాలు చేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఫుల్ వయొలెంట్గా ఉంటుంది. 1980 దశకం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదంటూ నిర్మాత ‘దిల్’ రాజు చె΄్పారు కూడా.ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడుతుండటం విశేషం. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. ఒక హీరో నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అలాంటి కథ, కథనాలతో ‘రౌడీ జనార్థన’ మూవీని తెరకెక్కిస్తున్నా. ఫ్యాన్స్ కి పండగే. ఎక్కడా నిరుత్సాహపడరు’’ అంటూ డైరెక్టర్ రవికిరణ్ కోలా స్పష్టం చేశారు. టీజర్తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది.హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2018 నవంబరు 17న విడుదలైన ఈ సినిమా హిట్గా నిలిచింది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్, రాహుల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల తర్వాత విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమించిలి రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ వయొలెన్స్ , యాక్షన్ సన్నివేశాలు మరో లెవల్లో ఉండనున్నాయి. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పెళ్లి పాట ‘ఏందయ్య సామీ...’కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా నటిస్తున్న ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.రగ్డ్ డెకాయిట్ అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహంచిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీతో కొత్త లుక్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో తన కెరీర్లో ఇప్పటివరకూ కనిపించని మాస్, రగ్డ్ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్. ‘‘డెకాయిట్’ ఒక కొత్త జోనర్లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ల జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్గా ఉంటుంది. చుట్టూ గన్స్, బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందనేది కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. హిందీలో కొన్ని సీన్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మ్యాసీవ్ ఔట్డోర్లో చిత్రీకరించిన ఈ మూవీ క్లైమాక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అంటూ అడివి శేష్ పేర్కొన్నారు. ఎ బ్లడ్ ఫెస్ట్శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ట్యాగ్లైన్గా పెట్టారంటే ఈ మూవీలో ఏ స్థాయిలో వయొలెన్స్ , రక్తపాతం సన్నివేశాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్డే సందర్భంగా ‘భోగి’ మూవీ నుంచి విడుదల చేసిన ఆయన ఇంటెన్స్ పోస్టర్కి అద్భుతమైన స్పందన వచ్చింది.గుబురు గడ్డంతో రా అండ్ రెబెలియస్ లుక్లో కనిపించారు శర్వా. పెదవుల మధ్య బీడీ పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని యాటిట్యూడ్ను మరింత హైలైట్ చేసింది. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ రూపొందుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఈ చిత్రం ఒకటిగా ఉంటుంది. మా సినిమాని రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కథానాయకులు కూడా వయొలెన్స్ , ఫుల్ యాక్షన్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
ఇప్పుడు ఫైట్... నెక్ట్స్ పాట
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ సెట్లో జరుగుతోందని సమాచారం. రామ్చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్ సీక్వెన్స్ లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.ఈ చిత్రీకరణలో భాగంగా ఓ ఫైట్ కూడా ఉందని భోగట్టా. ఈ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందట. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. -
'పెద్ది' వాయిదా రూమర్స్.. ఏం జరుగుతోంది?
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. లెక్క ప్రకారం ఈనెల 27న చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యమయ్యేసరికి నెలరోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 30న తీసుకొస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది చాలారోజులైపోయింది. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' వాయిదా గురించి రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)'పెద్ది' ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో 4 రోజుల టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ ఇంకా చేయాల్సి ఉందట. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. టీమ్ మాత్రం కచ్చితంగా చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తోపాటు షూటింగ్ ఇన్ టైంలో పూర్తి చేస్తారా సందేహం కలుగుతోంది.మరోవైపు 'పెద్ది' వాయిదాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించారు. దీనిబట్టి చూస్తే దాదాపు ఏప్రిల్ 30నే పాన్ ఇండియా రిలీజ్ అని అనుకోవచ్చు. కానీ ఏమైనా ఆలస్యమైతే మాత్రం జూలైలో తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో హిట్ కొట్టారు. రీసెంట్గా పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. దీనికి ఏమంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తమ అశలన్నీ 'పెద్ది'పైనే పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
పెళ్లిలో అల్లు స్నేహా.. మెరిసిపోతున్న శ్రీలీల
ఫ్రెండ్ పెళ్లిలో అల్లు స్నేహా చీరలో ఇలాడిజైనర్ డ్రస్లో మెరిసిపోతున్న శ్రీలీలసెల్ఫీలన్నీ ఒకేసారి పోస్ట్ చేసిన రకుల్కాన్ఫిడెన్స్తో పోజులిచ్చిన జ్యోతికఎర్రని గౌనులో ధగధగమనేలా శాన్విగ్లామర్ చూపించేస్తున్న అనన్య నాగళ్ల View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) -
ట్రోలింగ్ భరించలేక ఏడ్చా.. సినిమాలు మానేయాలనుకున్నా
హిట్టు పడితే యాక్టర్స్ను నెత్తిన పెట్టుకునే జనాలు ఫ్లాప్ రాగానే వారిని దారుణంగా విమర్శిస్తుంటారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లపై ఈ ట్రోలింగ్ తీవ్రస్థాయిలో ఉంటుంది. కథానాయికలనైతే రెండు మూడు ఫ్లాపులు రాగానే ఐరన్ లెగ్ అని ముద్రవేస్తారు. తనకు మరో మూవీ ఛాన్స్ వచ్చిందనగానే అయితే అది ఫ్లాప్ అవడం ఖాయం అని దారుణంగా మాట్లాడుతుంటారు.వరుస ఫ్లాప్స్ఇలాంటి ట్రోలింగ్ను కొన్నేళ్లుగా చవిచూస్తోంది శ్రీలీల. మాస్ జాతర, రాబిన్ హుడ్, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ, స్కంద.. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. తమిళంలో చేసిన పరాశక్తి కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తనను ఈ ఫ్లాప్ ట్యాగ్ నుంచి గట్టెక్కించలేకపోయింది.వెళ్లిపోదామనుకున్నా..అయితే ఈ ట్రోలింగ్ భరించలేక ఎప్పుడో సినిమాలు మానేయాలనుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే ఈ ట్రోల్స్కు విపరీతంగా భయపడ్డాను, బాధపడ్డాను, ఏడ్చేశాను. అమ్మా.. ఇదంతా నావల్ల అవుతుందా? కాలేజీకి తిరిగెళ్లిపోనా? అని అడిగాను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. కానీ, ఇప్పుడు వాటిని ఎదుర్కొనేంత ధైర్యం వచ్చింది అని పేర్కొంది. అదే భయంమరో హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. నాకు ఇప్పుడే కొంత భయంగా ఉంది. ఎందుకంటే ఇటీవలికాలంలోనే ఈ ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ఏదో ఒకటి అనేస్తున్నారు. అదే అసలు సమస్య! ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటాం. దాన్ని వాళ్లు చెడగొట్టేస్తున్నారన్న బాధ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా, శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది.చదవండి: ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన స్నేహ ఉల్లాల్ -
శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!
ఓ సినిమా హిట్-ఫ్లాప్ అనేది చాలా కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అంటే స్టార్ హీరోల మూవీస్ ఓ మోస్తరుగా ఉన్నా ఆడేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అభిమానుల కోసం స్పెషల్గా తీశామని దర్శకులు చెబుతున్నా ఎందుకనో పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చింది. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్)విడుదలైన రోజు ఉగాది కావడం, 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ షోలు పడకపోవడంతో ఉన్నంతలో ఆడియెన్స్ ఈ మూవీకి వచ్చారు. దీంతో రూ.30 కోట్లకు పైనే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ రెండురోజుకి(శుక్రవారం) వసూళ్లలో విపరీతమైన డ్రాప్ కనిపించింది. కేవలం రూ.9 కోట్లే వచ్చాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వీకెండ్ అయ్యేసరికి మరింతగా వసూళ్లు తగ్గిపోవచ్చు.ఇకపోతే ఈ మూవీలో పవన్ సరసన రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. రాశీఖన్నా పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండాఫ్ని ఫ్లాష్ బ్యాక్లో శ్రీలీల కనిపిస్తుంది. ఈమె వరకు యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఎందుకనో ఈ మూవీ కూడా ఈమెకు కలిసివచ్చేలా కనిపించట్లేదు. 'ఉస్తాద్..' సక్సెస్పై ఈమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ కోసం రెండు మూడు చిత్రాలు కూడా వదిలేసుకుంది. చూస్తే ఇప్పుడి పవన్ కల్యాణ్ కూడా ఈమెని కాపాడలేకపోయాడనిపిస్తోంది.తెలుగులో గత ఐదేళ్ల నుంచి శ్రీలీల సినిమాలు చేస్తోంది. తొలి చిత్రం 'పెళ్లి సందడి' పర్లేదనిపించింది. రవితేజతో చేసిన 'ధమాకా' సూపర్ హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే హిట్ అనిపించింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డీనరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్హుడ్, జూనియర్, మాస్ జాతర వరకు అన్ని ఫెయిల్యూర్సే. తమిళంలో ఈ సంక్రాంతికి వచ్చిన మొదటి మూవీ 'పరాశక్తి'ది కూడా ఇదే ఫలితం. ఇప్పుడు పవన్ 'ఉస్తాద్..' కూడా ఇదే లిస్టులో చేరేలా కనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
‘శంబాల’ డైరెక్టర్ కొత్త మూవీ.. ఈ సారి సోషియో ఫాంటసీ!
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మళ్లీ ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. ‘శంబాల’ తరువాత దర్శక, నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురుచూపుకి సమాధానంగా సందీప్ కిషన్తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు.ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ను వదిలారు. ఈ పోస్టర్లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అనే క్యాప్షన్ చూస్తే ఈ చిత్రం ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శక, నిర్మాతలు సక్సెస్ ఫుల్ హీరో సందీప్ కిషన్ను ఎంచుకున్నారు. ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్తో ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇది దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్. ఈసారి సృజనాత్మక, సాంకేతిక ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాని రూపొందించేందుకు రెడీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఒక గొప్ప సినిమా అనుభూతిని అందించడానికి, నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలో అన్ని విధాలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని త్వరలో ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు. -
త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే!
ఇప్పటివరకు తేజ సజ్జాను హీరోగానే చూశాం.. కానీ త్వరలో అతడిని ఓ హోస్ట్గానూ చూడబోతున్నాం. బాలీవుడ్లో వచ్చిన ద ట్రైటర్ షో త్వరలోనే తెలుగులోనూ రానుంది. సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోకి తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది.మొహమాటం లేదుఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్లో తేజ సజ్జా పెళ్లి వార్తలపై స్పందించాడు. త్వరలోనే నా పెళ్లి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. ఏదైనా ఉంటే నేనే చెప్తాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిర్మొహమాటంగా సిల్వర్ జ్యువెలరీ వేసుకుని మరీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇకపోతే ఇక్కడ స్వయంవరం జరగడంలేదు, కాబట్టి నా పెళ్లి గురించి చర్చ వద్దు అని చెప్పాడు.టాలీవుడ్లో పెళ్లి సందడికాగా ఈ ఏడాది ప్రారంభంలోనే పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ సోదరుడు, హీరో శిరీష్ మార్చి 6న పెళ్లి చేసుకున్నాడు. కొంతంకాలంగా ప్రేమలో ఉన్న నయనికా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. తాజాగా బిగ్బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం కూడా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇటీవలే తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు.చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్బాస్ బ్యూటీ పునర్నవి -
‘బిచ్చగాడు’ కాంబోలో ‘వంద దేవుళ్లు’.. ఫస్ట్లుక్ రిలీజ్
విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎన్ని రికార్డుల్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ కాంబో కలిసి వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘వంద దేవుళ్లు’ అనే చిత్రం రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా డైనమిక్ స్టార్ విష్ణు మంచు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో ఇంటెన్స్గా కనిపిస్తోంది. చెరుకు తోటలో విజయ్ ఆంటోనీ కత్తి పట్టుకున్న తీరు, వెనకాలే స్వాసిక మాసీ లుక్ అదిరిపోయింది.విజయ్ ఆంటోని ఇందులో రా అండ్ రస్టిక్ పాత్రని పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేస్తూ చిత్రయూనిట్కు విష్ణు మంచు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ మూవీకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. హరిష్ యువరాజ్ ఎడిటర్గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో ఆడియెన్స్ను టీం అలరించనుంది. -
ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి.. ఫోటోలు వైరల్
బిగ్బాస్ ఫేమ్, నటి పునర్నవి భూపాలం పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఫ్రెండ్స్ గ్యాంగ్తో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు పునర్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది పునర్నవి. హేమంత్ వర్మకు ఎస్ చెప్పానంటూ ఫోటోలు షేర్ చేసింది. సినిమాఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. నెల తిరిగేలోపు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. పునర్నవి.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా నటించింది. ఆ తర్వాత కూడా పిట్టగోడ, మనసుకు నచ్చింది, సైకిల్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉండేది.చదవండి: కోర్ట్ జంట బ్యాండ్ మేళం ట్రైలర్ -
అలా విడిపోవడం చాలా బాధాకరం..నిహారిక కామెంట్స్ వైరల్
నటిగానే కాకుండా నిర్మాతగానూ దూసుకెళ్తున్నారు మెగా డాటర్ నిహారిక. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకొని.. చిన్న బడ్జెట్తో మంచి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఆమె బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ అయింది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరో. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్లో నిహారిక బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల విషయంపై స్పందించారు.నాన్నకే చెప్పా.. నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డ అనే అబ్బాయిని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల కలిసి కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2023లో ఈ జంట విడిపోయింది.అయితే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే నిహారిక ఈ విషయాన్ని ముందుగా నాన్న నాగబాబుతో పంచుకుందట. ‘రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలని అనుకున్నప్పుడు ముందుగా మా నాన్నకు ఈ విషయాన్ని చెప్పా. ఆయన విషయం మొత్తం విని సైలెంట్ అయ్యారు. నేను సంతోషంగా లేననే విషయం వాళ్లకు కూడా తెలుసు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నగారే సలహా ఇచ్చారు’ అని నిహారిక చెప్పారు.విడిపోవాలని పెళ్లి చేసుకోరు..చాలా మంది ‘ఈ మధ్య విడాకులు కామన్ అయిపోయాయి’ అంటున్నారు. కానీ గతంలోనూ భార్యభర్తలు మధ్య విబేధాలు, గొడవలు జరిగేవి. కానీ తిరిగి ఇంటికి వెళ్తే..మా నాన్న పోషించగలరా అన్న భయంతో అలాగే కొనసాగేవారు. అప్పట్లో ఒక మహిళ తన అవసరాల కోసం కూడా అబ్బాయిపై ఆధారపడేది కానీ ఇప్పట్లో అమ్మాయిలు వాళ్లకేం కావాలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగా చూసుకునే పేరెంట్స్ ఉంటున్నారు. ఎవ్వరూ కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. మా మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివి అనిపించింది అందుకే విడాకులు తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఒకరినొకరు బాగా కొట్టుకొని విడిపోతే అది తొందరగా మరచిపోతారు కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం’ అని నిహారిక అన్నారు. విడాకుల తర్వాత మాజీ భర్తలో టచ్లో ఉన్నారా అని యాంకర్ అడగగా.. ‘అలాంటిదేమి లేదు. ఇంతవరకు మేము మళ్లీ కలుసుకోలేదు. ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది. -
నిన్ను మస్తు లవ్ చేశిన.. బ్యాండ్మేళం ట్రైలర్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను శనివారం (మార్చి 21న) విడుదల చేశారు. చిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే నా అన్నని మా అమ్మ లెక్క చూసుకున్న.. నేనడిగితే పాణం కూడా ఇస్తడు అన్న డైలాగ్తో వీడియో మొదలయింది. ఎమోషనల్గా ట్రైలర్నేను నిన్ను మస్తు లవ్ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు. మొత్తానికి ట్రైలర్ ఎమోషనల్గా సాగింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు కలెక్షన్స్ -
ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్సింగ్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. గబ్బర్ సింగ్ మాదిరి పవన్ కెరీర్లోనే గుర్తుండిపోయేలా మూవీ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తే.. వారి లెక్కలు తారుమారు అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద రెండురోజుల కలెక్షన్స్ చూస్తే నిర్మాతలకు నష్టాలు తప్పవని తెలుస్తోంది. తొలిరోజు కాస్త పర్వాలేదనిపించిన కలెక్షన్స్ రెండోరోజు 80శాతం పడిపోయాయి. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇప్పటికీ అధికారికంగా కలెక్షన్స్ ప్రకటించలేకపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది.ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఫస్ట్ డే దేశవ్యాప్తంగా రూ 34.75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. అయితే, రెండోరోజు కేవలం రూ. 9.25 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. దీంతో రెండురోజుల్లో మొత్తంగా రూ. 44 కోట్ల నెట్ రాబట్టింది. మొదటి రోజుతో పోల్చి చూస్తే.. దాదాపు 80 శాతం వసూళ్లు మరుసటి రోజుకు పడిపోయాయి. ఉగాది, రంజాన్ పండుగలతో లాంగ్ వీకెండ్లోనే ఇలా ఉంటే.. సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఆపై నేడు (మార్చి 21) ధురంధర్-2 తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఆదివారం వరకు బుకింగ్స్ 95శాతం పైగానే పూర్తి అయ్యాయి. దీంతో చాలాచోట్ల ఉస్తాద్ భగత్సింగ్ను తొలగించి ధురంధర్-2 చిత్రాన్ని వేయనున్నారు. ఉదయం ఆటలతో పాటు ఏపీలో టికెట్ రేట్ల పెంచి భారీ సంఖ్యలో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ .. కలెక్షన్స్ పరంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నడంతో ట్రేడ్ వర్గాలను కూడా కలవరపెడుతుంది. -
రూమర్స్కు క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల
అక్కినేని కుటుంబంలో వారసుడు రాబోతున్నాడు.. నాగచైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ కొద్దిరోజుల క్రితం సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ గాసిప్స్ రావడానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో ఎలాంటి వేడుక జరిగినా సతీసమేతంగా నాగచైతన్య వెళ్తాడు. శోభితా ధూళిపాళ్లతో పెళ్లయిన తర్వాత దాదాపు అన్ని కార్యక్రమాలకు ఇద్దరూ కలిసే హాజరయ్యారు. కానీ, రీసెంట్గా జరిగిన అల్లు శిరీశ్ పెళ్లితో పాటు విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్లో చైతూ ఒక్కడే కనిపించడంతో శోభిత తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి.శోభిత ప్రెగ్నెన్సీ రూమర్లకు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఉగాది నాడు జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకకు భర్తతో కలిసి శోభిత హాజరైంది. అయితే, రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలకు మరో ఛాన్స్ ఇవ్వకుండా పల్చటి చీరతో కనిపించింది. అలా డ్రెస్ సెన్స్తో శోభిత క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో ప్రెగ్నెన్సీ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. 2024 డిసెంబర్లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరిగింది. ఆ తర్వాత చైతూ నటించిన తండేల్ సూపర్ హిట్ కావడం ఇప్పుడు ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోవడంతో శోభితతో పాటు లక్ కూడా తన జీవితంలోకి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఒక ఈవెంట్లో నాగార్జున కూడా ఇలాంటి వార్తలపై రియాక్ట్ అయ్యారు తమ కుటుంబంలో ఏవైనా శుభవార్తలు ఉంటే.. తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. -
స్నేక్ డ్యాన్స్ కోసం నిహారిక మాస్ ఎంట్రీ
'రాకాస' సినిమా నుంచి తాజాగా స్నేక్ డ్యాన్స్ సాంగ్ను విడుదల చేశారు. అయితే పాట చివర్లో నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది. సంగీత్ శోభన్- నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మానస శర్మ తెరకెక్కించగా.. నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. టీజర్తోనే మెప్పించిన మేకర్స్ ఇప్పుడు అదిరిపోయే సాంగ్ను విడుదల చేసి అలరించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఇరుముడిలో అయ్యప్ప భక్తులకు ఇష్టమైన పాట రీమిక్స్
భక్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో మెప్పించిన మాస్ మహారాజా రవితేజ తర్వాతి సినిమా సెట్స్లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడారు.జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ విడుదల కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే ఇరుముడి సినిమా గురించి ప్రశ్నించగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన “ఎక్కినాడు పల్లకి” (అయ్యప్ప స్వామిని కీర్తించే గీతం) పాటను రీమిక్స్ చేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. ఈ పాటను రీమిక్స్ చేయమని ఇప్పటికే చాలామంది తనను అడిగినట్లు జీవీ ప్రకాశ్ తెలిపారు. దీంతో తాను కూడా పలుమార్లు ఆ సాంగ్ విన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే, తుది నిర్ణయం దర్శకుడు, నిర్మాతలదేనని జీవీ ప్రకాష్ తెలిపారు.ఈ చిత్రంలో రవి తేజ అయ్యప్ప స్వామి భక్తునిగా కనిపించనున్నారు. ఇది భక్తి చిత్రం కాదు, బేబీ నక్షత్ర పోషించిన తన కుమార్తెతో అతనికున్న సంబంధం చుట్టూ అల్లుకున్న ఒక ఎమోషనల్ డ్రామా. ఫస్ట్లుక్ పోస్టర్లో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించడంతో భారీ బజ్ క్రియేట్ అయింది. -
హీరో పేరు చెప్పకుండానే తాప్సి విమర్శలు
నటి తాప్సి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ఉత్తరాది భామ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా నటిస్తూ టాప్ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా హిందీలో పలు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఏదో ఒక సంచలన వార్తతో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉన్నారు. కథానాయికలకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు నటించడానికి పలువురు హీరోలు సంశయిస్తున్నారని అన్నారు. ము ఖ్యంగా తనకు జరిగిన ఒక విషయం గుర్తు చేస్తూ తనకు ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో హీరోగా నటించడానికి ఒక ప్రముఖ నటుడిని నిర్మాత సంప్రదించారని, అయితే కథ విన్న ఆయన ఇందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉందని చెప్పి నటించడానికి నిరాకరించారని చెప్పారు. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఈ అమ్మడు తాను నటించిన చిత్రాన్ని ఏ హీరో నిరాకరించారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైర ల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ 38 ఏళ్ల భామ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. -
సంయుక్త మీనన్ గ్లామరస్ పిక్స్.. మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్..!
హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామరస్ లుక్స్..బాలిలో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..రెడ్ డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ అందాలు..శారీలో దిల్ రాజు సతీమణి తేజస్విని పోజులు..మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
దురంధర్-2 మూవీకి రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్లో రాసుకొచ్చారు.రామ్ చరణ్ తన ట్వీట్లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్ మ్యూజిక్ మరో రేంజ్కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.#DhurandharTheRevenge is raw, gripping and impactful 🔥@AdityaDharFilms brings scale and emotion together seamlessly. What he has done with this film is truly remarkable.@RanveerOfficial delivers a phenomenal performance - full of intensity and holds your attention…— Ram Charan (@AlwaysRamCharan) March 20, 2026 -
దేవుళ్లనుకునే ఆ హీరోలకు ఇక మనుగడ లేదు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: 'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి')'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇన్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్తో చేసిన సిక్స్ ప్యాక్లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)The @Dhurandhar2 is a HORROR.It is a horror for all filmmakers who built their careers and their fortunes on dumbed down, over the top cinema. The cinema that demanded the brain to be left at home . The cinema that was rammed down our throats full of LOUDNESS and MASALA which…— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2026 -
టాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ కామాఖ్య. ఈ చిత్రంలో సమైరా, సముద్రఖని, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వడ్డేపల్లి శ్రీ వానినాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఓ మిస్టరీ కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. కానీ ఇలాంటివీ జరిగినప్పుడే అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా? అని భయం వేస్తుంది' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, మధునందన్, వైష్ణవ్, ధన్రాజ్, రాఘవ, ఐశ్వర్య, గడ్డం నవీన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జ్ఞాని సంగీతమందిస్తున్నారు. -
మాట నిలబెట్టుకున్న విజయ్.. చిన్నారిని ఇంటికి పిలిచి మరీ..
పెళ్లంటే ఇలా ఉండాలి అన్నంత అద్భుతంగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వైభవంగా పెళ్లిదేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ కూడా చేశారు. హైదరాబాద్లో మార్చి 4న గ్రాండ్గా రిసెప్షన్ జరుపుకున్నారు. అయితే ఇంత గొప్పగా పెళ్లి చేసుకున్న విరోష్ జోడీ తననెందుకు పిలవలేదని ఓ చిన్నారి అలిగింది. లడ్డూలు ఇవ్వొచ్చు కదా!నేను కూడా విజయ్కు అభిమానినే కదా.. నన్ను కూడా పెళ్లికి పిలవచ్చు కదా.. లడ్డూలు ఇవ్వొచ్చు కదా.. అంటూ క్యూట్గా రిక్వెస్ట్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో రౌడీబాయ్ కంటపడింది. బుజ్జితల్లి.. మా ఇంటికి రా.. నీకు నచ్చిన ఫుడ్, స్వీట్స్.. అన్నీ ఇంట్లోనే నీకోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తా అన్నాడు. అనడమే కాదు చేసి చూపించాడు కూడా! విప్రేమతో ముద్దుల వర్షంరోష్ జోడీ ఆ బుజ్జితల్లిని ఇంటికి పిలిచి తనకు నచ్చిన భోజనం వడ్డించారు. లడ్డూలు తినిపించారు. విజయ్ ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకుంటే రష్మిక తనపై ప్రేమతో ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పటినుంచి మనం కూడా ఫ్రెండ్సే అంటూ పాపతో సంభాషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం కూడా ఫ్రెండ్సేకదా.. అనుకుంటూనే మొత్తానికి సాధించావ్, విరోష్ను కలిశావ్ అంటూ జనం కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli) చదవండి: తెలుగు హీరోలని కొడతారెందుకు? ఎందుకంత కోపం? హీరోయిన్ ఆన్సరిదే! -
నా పాత్రపైన 'పుష్ప 2' టీజర్.. తీరా సినిమా రిలీజయ్యేసరికి
సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నటీనటుల్ని తీసుకుంటారు. వాళ్లతో బోలెడన్ని రోజులు పనిచేయించుకుంటారు. కానీ చివరకొచ్చేసరికి ఏమైనా జరగొచ్చు. దర్శకుడు లేదా హీరో అనుకున్న ఔట్పుట్ బయటకొస్తుంది. సినిమా రిలీజైన తర్వాత కొందరు నటీనటుల.. ఇలా ఎడిటింగ్లో తన పాత్రని తగ్గించడం లేదా తీసేయడం గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తెలుగు బిగ్బాస్ ఫేమ్ దివి కూడా 'పుష్ప 2' విషయంలో తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)'నాకు చెప్పినప్పుడు చాలా పెద్ద రోల్. నా క్యారెక్టర్పైనే టీజరే వచ్చింది. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుందని నేను అలానే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సినిమా వచ్చే టైంకి అన్ని ఉండవు. నేను చాలా బ్యాడ్గా ఫీలయ్యాను. కానీ ఎవరు వింటారు? ఇప్పుడు మన బాధ ఎవరు పట్టించుకుంటారు? దాని నుంచి మూవ్ అయిపోవాల్సిందే. నా పది మంది ఫ్రెండ్స్ని థియేటర్కి తీసుకెళ్లా. షూటింగ్ 20 రోజులు చేస్తే డబ్బింగ్ 10 రోజులు చెప్పాను. చాలా బాగా చేశామని నాకు తెలుసు. కానీ సినిమా చూసిన తర్వాత షాకయ్యాను' అని నటి దివి చెప్పింది.ఈ సినిమా నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు అందులో దివి పాత్రనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ టీజర్లో చూపించిన ఏ సీన్ కూడా సినిమాలో లేదు. కేవలం ఒకటి రెండు సన్నివేశాల్లో రిపోర్టింగ్ చెబుతున్నట్లు మాత్రమే దివి కనిపిస్తుంది. తనేం మోసపోయానని చెప్పలేదు గానీ ఇలా చేయడం మాత్రం తనని చాలా బాధపెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు) -
'నాన్న బ్రాండ్లోనే విచిత్రమైన నాన్న సార్'.. హ్యాపీరాజ్ ట్రైలర్ చూశారా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ హ్యాపీరాజ్. ఈ చిత్రానికి మరియా రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్పై జైవర్ద నిర్మించారు. ఈ మూవీతోనే సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటనే కోణంలో తీసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరో అబ్బాస్ నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
తమిళ హీరోలతో రొమాన్స్.. తెలుగు హీరోలపై కోపం?
తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్టుడే సినిమాకు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్ (మరియ ఇళంజెళియన్) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు హీరోలపై కోపం?ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.నేనేమైనా కంకణ కట్టుకున్నానా?ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్ చేస్తున్నారు అని బదులిచ్చింది.సినిమాతెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్, మ్యాడ్, మెయిల్ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్ మూవీలో ఈమె.. హీరో రామ్ నితిన్ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్స్టోరీ చిత్రాలున్నాయి.చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్ కపుల్ -
ఓటీటీలో హనుమాన్ హీరో ఎంట్రీ.. ఏకంగా హోస్ట్గా ఛాన్స్..!
హనుమాన్ మూవీతో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించకున్న టాలీవుడ్ తేజ సజ్జా. ఆ తర్వాత మిరాయ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ యంగ్ హీరో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన ప్రముఖ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించనున్నారు. గతంలో బాలీవుడ్లో సక్సెస్ అయిన ఈ షోను తెలుగులోనూ తీసుకొస్తున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ‘ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోకు తేజ సజ్జా హోస్ట్గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఓటీటీలోనూ హనుమాన్ హీరో సందడి చేయనున్నాడు. ఇలాంటి ఇంటర్నేషనల్గా క్రేజ్ ఉన్న షోకి హోస్ట్గా వ్యవహరించడం వల్ల అతని క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్తో కలిసి తేజ సజ్జా వేదికపై సందడి చేశారు.ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన షో ట్రైటర్స్. ఈ షోలో కేవలం చాలా ఇంటలిజెన్స్తో ఉన్నవాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ గ్లోబల్ షో తెలుగు వర్షన్ ప్రైమ్ వీడియోలో రానుంది రాబోతోంది. అయితే ఈ అప్ కమింగ్ షోకి మన టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ హోస్ట్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. గతేడాది హిందీలో వచ్చిన ఈ ట్రైటర్స్ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో ఈ రియాలిటీ షో జరగనుంది. -
ఎన్టీఆర్ జాతీయ అవార్డ్పై చిరంజీవి, చరణ్ ట్వీట్
ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్మీడియాలో స్పందించారు. ఉగాది నాడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై ఈ గౌరవాన్ని చిరు పొందారు. ఈ క్రమంలో ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ తనకు లభించడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన పంచుకున్నారు.'చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే…N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా…ఆయన పోషించిన కొన్ని పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ ఆయనది. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.'మెగా హీరో రామ్చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డ్తో తన తండ్రిని గౌరవించడం తమ కుటుంబానికి అత్యంత గర్వకారణమైన క్షణమని అన్నారు. సినిమాపై ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రేమ, నిబద్ధత చాలామందికి స్ఫూర్తిదాయకమని చరణ్ అన్నారు. ఇండస్ట్రీలోని ప్రతిభను గుర్తించి అవార్డులతో గౌరవించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
పాకిస్తాన్ టీవీలో 'ధురంధర్-2'.. వీడియో షేర్ చేసిన జర్నలిస్ట్
‘ధురంధర్-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. కానీ, ఈ చిత్రం పాకిస్తాన్లో విడుదల కాలేదు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఈ మూవీని తెరకెక్కించడం కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ పాక్ దేశ ప్రజలు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో పాక్ ప్రజలు ఈ సినిమా పైరసీ వెర్షన్ను చూస్తున్నారు.పాక్లోని లాహోర్లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేశారు. అదే పోస్ట్ను భారత్కు చెందిన ఆదిత్య రాజ్ కౌల్ తన సోషల్మీడియాలో షేర్ చేశారు. 'ధురందర్' చిత్రానికి రీసెర్చ్ కన్సల్టెంట్గా ఆయన ఉన్న విషయం తెలిసిందే. పాక్లోని లాహోర్లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేసిన ట్వీట్ను ఆదిత్య రీషేర్ చేశారు. పాకిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయడం గురించి ఈ సినిమా ఉన్నా సరే వారు పైరసీ కాపీ కోసం వెతికి మరీ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారతీయ చిత్రాలు నిషేధించబడినప్పటికీ, అక్కడి ప్రజలు మన సినిమాల పైరసీ వెర్షన్లను చూసి ఆనందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, పొరుగు దేశంలో ధురందర్ పార్ట్ 1 పైరసీ వెర్షన్ను కూడా చూశారు. ఆ సమయంలో మూవీ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్లోడ్ నమోదయ్యాయని అంచనా. ఇప్పుడు ధురందర్ -2 పైరసీ కాపీని టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో పార్ట్-1 విడుదలైనప్పుడు కూడా పాక్లో ట్రెండింగ్లో నిలిచింది. -
యాక్టింగ్ రాదని ట్రోలింగ్.. : రష్మిక మందన్నా ఎమోషనల్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డ్స్ వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేశారు. 2025లో విడుదలైన సినిమాలకుగానూ అవార్డులు అందించారు. ది గర్ల్ఫ్రెండ్ సినిమాకుగానూ రష్మిక మందన్నా ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, హీరో రామ్చరణ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం స్టేజీపై భావోద్వేగానికి లోనైంది. రష్మిక మాట్లాడుతూ.. ఒకప్పుడు నాకు యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు. కానీ, ఈ రోజు నా పర్ఫామెన్స్ మెచ్చి రాష్ట్రస్థాయిలో అవార్డు ఇచ్చారు. అది నాకెంతో గర్వంగా ఉంది.తెలంగాణ కోడలిగా..గర్ల్ఫ్రెండ్ లాంటి సినిమాకు అవార్డు రావడం నిజంగా చాలా స్పెషల్. డైరెక్టర్ రాహుల్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పటివరకు నన్ను కూతురిలా ఆదరించారు. ఇప్పుడు నేను తెలంగాణ కోడలిగా మీ ముందు నిల్చున్నాను. మీ ప్రేమాభిమానాలకు నేను సర్వదా కృతజ్ఞరాలిని. నా ఫ్యామిలీని బాగా చూసుకోండి అని చెప్పుకొఒచ్చింది. రష్మిక ప్రసంగం వింటూ విజయ్ దేవరకొండ తల్లి భావోద్వేగానికి లోనైంది.చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంట్.. ఒప్పుకోలేదు: నటుడు -
ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..
‘ధురంధర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది. స్ట్రీ 2, జవాన్, యానిమల్ వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి, బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18 నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్స్లోకి వచ్చేసింది. ఫస్ట్ డే ‘ధురంధర్ 2’ కలెక్షన్స్ దుమ్మురేపింది. భారతీయ చిత్ర పరిశ్రమలో 'పుష్ప-2' తర్వాత భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ధురంధర్2 నిలిచింది. గతేడాదిలో విడుదలైన ‘పార్ట్-1’ తొలిరోజు కలెక్షన్లు రూ.28.60 కోట్ల (నెట్) రాబట్టిన విషయం తెలిసిందే.ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. నెట్ పరంగా అయితే రూ. 145.55 కోట్లు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో నెట్ కలెక్షన్లలో రూ.100 కోట్లు దాటిన మొదటి హిందీ సినిమాగా ధురంధర్- 2 నిలిచింది. కేవలం హిందీ నుంచే ఈ సినిమాకు రూ.103 కోట్ల నెట్ కలెక్షన్లు రావడం విశేషం. ఇప్పుడు వరసు సెలవులు ఉండటంతో ఫస్ట్ వారంలోనే రూ. 700 కోట్ల మార్క్ను సులువుగా దాటుతుందని అంచనా వేస్తున్నారు.‘ధురంధర్: ది రివెంజ్’ ప్రీమియర్స్తోనే హిట్ టాక్ తెచ్చుకోవడం ఆపై ఉగాది, రంజాన్ వంటి పండుగల సెలవులు ఉండటంతో ఈ మూవీకి కలిసిసొస్తుంది. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీకి మరింత బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ‘ధురంధర్ 2’కు వస్తున్న ఆదరణ చూస్తుంటే కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సర్ఫ్రైజ్.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు.. ఆయన నటించిన తాజా చిత్రం ‘ విష్ణు విన్యాసం సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన ఈ సినిమాకు థియేటర్స్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో శ్రీవిష్ణుకు జోడిగా నయన్ సారిక నటించగా.. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలలో మెప్పించారు.థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాలకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో విష్ణు విన్యాసం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి బహుళ భాషల్లో అందుబాటులో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మూవీకి పాన్-ఇండియన్ ఓటీటీ విడుదల లభించడంతో శ్రీ విష్ణు పేరు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరడానికి సహాయపడుతుంది.కథేంటంటే..విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్రూమ్ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి
ఉగాది పండుగ నాడు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఉగాది అనగానే గతంలో చిత్రసీమ సినీ పురస్కారాలు ఘనంగా జరిగేవి. అయితే, పలు కారణాలతో సుమారు 13ఏళ్లుగా ఈ పురస్కారాలకు టాలీవుడ్ నోచుకోలేకపోయింది. అయితే, గతేడాది నుంచి సినిమా రంగంలోని ప్రతిభకు పట్టం కడుతూ తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ను అందిస్తూ వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి ప్రసంశించారు. సినిమా నటీనటులను గుర్తించడంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందని చిరు అన్నారు.కాంతారావు పురస్కారాన్ని అందుకున్న ఆర్.నారాయణమూర్తి ఇలా అన్నారు. సినిమా అవార్డ్స్ కోసం పదమూడేళ్లపాటు చిత్ర పరిశ్రమ ఎదురు చూసింది. అయితే, సూపర్స్టార్ కృష్ణ అభిమాని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ చూపించి గతేడాది నుంచి మళ్లీ అవార్డ్స్ ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, కళాకారుల్ని గౌరవించినందుకు నా అభినందనలు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్ రెడ్డిగారికి థ్యాంక్స్.'చంద్రబాబునాయుడు గారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు. చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.' అని ఏపీ ప్రభుత్వం గురించి నారాయణమూర్తి అన్నారు.పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవిఎన్టీఆర్ జాతీయ అవార్డుగ్రహీత చిరంజీవి ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి ఇలా అన్నారు. 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు.పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది.' అన్నారుహాలీవుడ్ సినిమా అంటే ఎవరికైనా సరే అమెరికానే గుర్తొస్తుందని చిరంజీవి అన్నారు. కానీ, ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని సీఎంతో అన్నారు. -
అమ్మాయిలతో జాగ్రత్త.. యూత్కు హీరోయిన్ సలహా
నటి పూనం బాజ్వాను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ప్రస్తుతం చిత్రాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఈమె తరచూ హల్చల్ చేస్తూనే ఉంటారు. పలు భాషల్లో కథానాయకిగా నటించిన బ్యూటీ తెలుగులో మెదటి సినిమా (2005)లో ఎంట్రీ ఇచ్చింది. అయితే, పరుగు, బాస్ సినిమాలతో పాపులర్ అయింది. తమిళంలో తేనావట్టు , కచేరి ఆరంభం, సేవల్ , తంబికోట్టై వంటి పలు చిత్రాలు నటించింది. అయితే స్క్రీన్ ప్లే అందాల ఆరబోతలో హద్దులు చెరీపేస్తూ కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించిన ఈ అమ్మడు కథానాయకిగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారనే చెప్పాలి. అయితే ఇంటర్నెట్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యువత దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న ఈమె ఇన్ స్ట్రాగామ్లో దాదాపు 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. కాగా ఇటీవల తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నటి పూనం బాజ్వా(Poonam Bajwa) పేర్కొంటూ మీకు స్నేహితురాలుగానో, ప్రేయసి గానో, భార్యగానో కలిసి ప్రయాణించే యువతి ఏ దేశానికి మహారాణి కాక పోవచ్చుగాక, అయినా ఆమెను రాణి మాదిరిగానే భావించాలన్నారు. ఆమె అందాన్ని, ప్రేమను, శక్తిని అభినందించాలన్నారు. అంతేకాకుండా అన్ని మర్చిపోదాం అని చెప్పే యువత మరింత జాగురూకత వహించాలన్నారు. ఎందుకంటే మహిళలు ఏ విషయాన్ని మర్చిపోరని ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఇతర అమ్మాయిలకు సంబంధించిన విషయాలను మర్చిపోరన్నారు. కాబట్టి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని నటి పూనం బాజ్వా పేర్కొన్నారు. ఇవే పేర్కొన్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
పరాభవ నామ సంవత్సరం పసందుగా అవార్డుల ప్రదానోత్సవం
తెలుగువారి సంవత్సరాది ఉగాది సినీ ప్రేమికులకు కొత్త హుషారునిచ్చింది... అవార్డులు అందుకున్న వేళ తారల మనసులు మురిసిన వేళ... అభిమానులకు ఆనంద హేల... గురువారం ఉగాది పర్వదినాన హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో నాటి తారలు సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలకు నివాళిగా నేటి తార నిధీ అగర్వాల్ చేసిన డ్యాన్స్ ఓ హైలైట్... వేదికపై దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్... లవ్ సాంగ్స్ నుంచి మాస్ సాంగ్స్ వరకూ శ్రేయా ఘోషల్ పాడిన పాటలు... సింగర్ మంగ్లీ పాడిన పాటలు... ఇలా వీనుల విందుగా, తారల తళుకులతో కనువిందుగా జరిగింది ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక. ఆ విశేషాలు...అవార్డుల విషయంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందితెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి, అలాగే కమల్హాసన్ గారికి, నాగార్జునగారికి, జయసుధగారికి, నాగచైతన్య, రష్మికా మందన్నాతో పాటు ఇతర అవార్డుగ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్కి తెలంగాణ ప్రభుత్వం సినిమా వారిని ఆహ్వానించి, సినిమా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడం, సినిమాకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతకి థ్యాంక్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వేవ్స్’ కార్యక్రమంలో నన్ను, కమల్హాసన్ వంటి వాళ్లని భాగస్వామ్యం చేయడం సంతోషం. సినిమానే కదా అనే చిన్నచూపు చూడకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. హాలీవుడ్ సినిమా అంటే అమెరికా గుర్తొస్తుంది. ఈరోజు ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది. సీనియర్స్కి గౌరవం ఇచ్చే విధంగా, యంగ్స్టర్స్కి స్ఫూర్తినిచ్చేలా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. ఇందుకు జ్యూరీకి అభినందనలు.– చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ అవార్డుగ్రహీత)హద్దులు చెరిపేసినందుకు ధన్యవాదాలుమై ఫ్రెండ్ చిరంజీవిగారు... బ్రదర్ నాగార్జునగారు. నా ఫ్యామిలీ... చెన్నైలో ఎవరైతే ఉంటారో... వారందరూ ఇక్కడ ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో తొలిసారి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా హైదరాబాద్కు వచ్చాను ఏయన్నార్గారి ‘శ్రీమంతుడు’ సినిమా కోసం. అందుకే నా ‘దశావతారం’ సినిమాలో ‘ఎంతో చిన్నది జీవితం’ అనే పాట వినిపిస్తుంది. అలా అప్పట్నుంచి నేను హైదరాబాద్లో పని చేస్తున్నాను. కొంత సమయం కిందట నేను సింగీతంగారి అవార్డు అందుకున్నాను. అప్పుడు ఆయనతో నేను చేసిన తొలి సినిమా ‘సొమ్ము ఒకడిది... సోకు ఒకడిది’ గుర్తొచ్చింది. పని మొత్తం ఆయన చేశారు. అవార్డు నేను అందుకున్నాను. సింగీతంగారితో నేను 50 సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్నాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసన్ కనుక... సింగీతం శ్రీనివాసరావుగారంటే నాకు ఇష్టం అని కాదు. నా సినిమా కెరీర్లో నేను కలిసిన యంగస్ట్ సీనియర్ ఆయన. సింగీతంగారికి అవార్డును అందించినందుకు ధన్యవాదాలు సార్ (ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ...). నా బ్రదర్... చిరంజీవిగారు. సినిమాల్లో నా జూనియర్. పాలిటిక్స్లో సీనియర్. 1970లో మేం లీడ్ రోల్స్ చేశాం. ఇప్పుడు 70స్లోనే ఉన్నాం. నీ మనసు గురించి కాదు... నీ వయసు గురించి (నవ్వుతూ). గద్దర్గారి లక్షల అభిమానుల్లో నేను ఒకడిని. రచయిత, విప్లవకారులు అయిన గద్దర్గారి పేరిట అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఆయన అభిమానులుగా మేం థ్యాంక్స్ చెబుతున్నాం. ఇక నో మోర్ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్.. ఒకే ఒక సినిమా... ఇండియన్ సినిమా. ఆ హద్దులను మీరు చెరిపేశారు (టీజీఎఫ్ అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వం కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ని అవార్డుగ్రహీతలుగా, ప్రదానం చేసేవారుగా భాగం చేయడం). భవిష్యత్ తరాల కోసం మేం కూడా సపోర్ట్గా ఉంటాం. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. – కమల్హాసన్ (పైడి జయరాజ్ అవార్డుగ్రహీత)ఏపీలో తెలుగు చిత్రపరిశ్రమ ఉనికిని గుర్తించాలినంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అని గత 13 ఏళ్లుగా ఇండస్ట్రీ ఎదురు చూస్తున్నా ఇవ్వలేదు. అలాంటిది హీరో కృష్ణగారి అభిమాని రేవంత్ రెడ్డిగారు గద్దర్ అవార్డులు మేము ఇస్తాం అని చెప్పి, 2025లో ప్రారంభించి అమోఘంగా ప్రదానం చేశారు. ఇప్పుడు కూడా ఆ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, గౌరవించి ఇంతమంది కళాకారులను సగర్వంగా గౌరవిస్తున్నందుకు ఆయనకు సెల్యూట్. గొప్ప ప్రజా వాగ్గేయకారుడు అయిన గద్దర్గారి పేరు మీద అవార్డు ఇస్తున్న రేవంత్గారికి సెల్యూట్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కాంతారావుగారి అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్ రెడ్డిగారికి థ్యాంక్స్. చంద్రబాబునాయుడుగారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.– ఆర్. నారాయణమూర్తి (కాంతారావు అవార్డుగ్రహీత)ఏయన్నార్ అవార్డు అందుకోవడం ఆనందంముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ‘దిల్’ రాజు, ప్రియాంక, చిరంజీవి, కమల్హాసన్ గార్లతో పాటు... ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఏయన్నార్గారి అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగారికి థ్యాంక్స్. ఏయన్నార్గారి గురించి చె΄్పాలంటే... ఎంతో చె΄్పాలి. మా తరంలో ఆయనతో ఎక్కువ చిత్రాల్లో నటించాను. 1976 అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ ఫ్లోర్లో రామానాయుడుగారు నిర్మించిన ‘సెక్రటరీ’ సినిమాతో మా జర్నీ మొదలైంది. అక్కడ్నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు... ఎన్నో గొప్ప బ్లాక్బస్టర్స్. ఆయన ఎంత గొప్ప నటులో నేను చె΄్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు...ఆయన అన్నారు.. ‘ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా... నా స్టైల్ను నేను ఏమైనా మార్చుకోవాలా?, యాక్టింగ్లో ఏమైనా మార్పు తెచ్చుకోవాలా? నా బాడీ లాంగ్వేజ్లో మార్పు రావాలా?’ అని అందర్నీ అడిగేవారు. నన్ను కూడా అడిగారు. అంత గొప్ప నటులు ఆయన. అంత సింపుల్గా ఉంటారు. ఆయన్నుంచి మనందరం నేర్చుకోవాలి. నన్ను ఎప్పుడూ లిటిల్ ఫ్రెండ్ అంటుంటారు. నేను ఆయన లిటిల్ ఫ్రెండ్నే. ఆయన లెగసీ కంటిన్యూ అవుతోంది. నాగార్జునగారు, సుమంత్, సుశాంత్, అఖిల్... ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య. ఏయన్నార్ లివ్స్ ఆన్ . రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. సీయంగారు గత ఏడాది నాకు చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఏయన్నార్ అవార్డు వరించింది. నేను శాసన సభ్యురాలిగా ఫస్ట్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డైనమిక్ స్పీకర్. తెలంగాణ మూమెంట్ సమయంలో హౌస్ అడర్జ్న్డ్ అయినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, మాట్లాడేవారు. అసెంబ్లీ విధి విధానాల గురించి చెప్పేవారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు గర్వంగా ఉంది. ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యారు.– ఏయన్నార్ అవార్డుగ్రహీత జయసుధఈ అవార్డు నాకో మోటివేషన్అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పదహారు సంవత్సరాల సినిమా ప్రయాణంలో ముఖ్యమైన గౌరవం... గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చె΄్పాలి. గద్దర్గారు గొప్ప వ్యక్తి. నిజమైన విప్లవకారులు. కుల వివక్షపై వ్యతిరేకంగా, గౌరవం కోసం పోరాడారు. అలాంటి వ్యక్తి పేరిట ఇలాంటి గొప్ప ఇన్షియేట్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ‘దిల్’ రాజుగార్లకు ధన్యవాదాలు. ప్రతి సినిమాకు నేను వంద శాతం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను. కొన్ని వర్కౌట్ అయ్యాయి... మరికొన్ని కాలేదు. ‘తండేల్’ సినిమాలో నేను పోషించిన తండేల్ రాజు పాత్రను నా మనసులో పెట్టుకునేలా చేసింది. చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఎఫర్ట్స్కు ఇలాంటి ఓ అవార్డు రావడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు చూస్తుంటే ఇంకా నేర్చుకోవాలని, ఇంకా ఎదగాలని... నటుడిగా ఇంకా కథలు చె΄్పాలని మోటివేషన్ లా ఉంది. అల్లు అరవింద్గారికి, వాసు, చందు మొండేటి, దేవిగారు, సాయి పల్లవి, నవీన్ నూలి, కార్తీక్ ఘట్టమనేని, శేఖర్ మాస్టర్, సుప్రీమ్ మాస్టర్, కార్తీక్ తీడ... ఇలా ‘తండేల్’ సినిమాలోని అందరికీ థ్యాంక్స్. మీ అందరి ఎఫర్ట్స్ లేకుంటే ఇక్కడ అవార్డు తీసుకుని ఉండేవాడిని కాదు. నా పిల్లర్స్, నా స్ట్రెంత్... మా అమ్మా నాన్న. అలాగే శోభిత... అభిమానులందరికీ ‘ఈపాలి యేట గురి తప్పేదేలేదేస్... ఇక రాజులమ్మ జాతరే’.– నాగచైతన్య (ఉత్తమ నటుడు – ‘తండేల్’)ఈ అవార్డు మరింత నమ్మకాన్నిచ్చిందిఅందరికీ హాయ్.. హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రేవంత్ సార్... ఈ అవార్డును మీ చేతుల మీదుగా అందుకోవడం వెరీ వెరీ స్పెషల్. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, దిల్ రాజు సార్లకు, హోల్ జ్యూరీ కమిటీకి థ్యాంక్స్. ఒకప్పుడు నా నటనపైన నేను ట్రోల్స్ ఎదుర్కొన్నాను. కానీ, ఈరోజు నా నటన నచ్చి రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే నేను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటాననుకుంటున్నాను. ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాకి అవార్డు రావడం చాలా ప్రత్యేకం. పైగా ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించే నమ్మకాన్ని ఇచ్చింది. నన్ను భూమా పాత్రలో అద్భుతంగా చూపించిన రాహుల్ రవీంద్రన్ కి థ్యాంక్స్. దీక్షిత్, ధీరజ్ సార్, విద్య మేడం, గీతా ఆర్ట్స్కి థ్యాంక్స్. చాలా సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కూతురుగా భావించి ప్రేమ ఇచ్చారు. ఈ రోజు కోడలిగా మీ ముందు నిల్చున్నాను... ఇది చాలా గర్వంగా ఉంది. మీ ప్రేమకు ధన్యవాదాలు.. – రష్మికా మందన్నా, (ఉత్తమ నటి, ‘ది గర్ల్ ఫ్రెండ్’)అవార్డు విజేతలుఉత్తమ నటుడు – నాగ చెతన్య (తండేల్)ఉత్తమ నటి – రష్మికా మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయిఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరాఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వాఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాంఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్ఉత్తమ బాలల చిత్రం – అనగనగనాఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)ఉత్తమ సహాయ నటి– భూమిక (యుఫోరియా)ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె. రాబిన్ (దండోరా)ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్)ఉత్తమ బాలనటుడు – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర (ఛాంపియన్)ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి (ఛాంపియన్ )ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ (అఖండ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (చంద్రకాంత్)ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్ ) -
హైదరాబాద్ అంటే బిర్యానీయే కాదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా, బిర్యానియే కాదు.. దేశస్థాయిలో సినీపరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా రాణించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. జపాన్, కొరియా లాంటి దేశాల్లో ఫిలిం ఇండస్ట్రీ కోసం ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయని, అదే తరహాలో మన ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డుల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆ నలుగురే కారణంఈ వేడుకలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్న సినీపరిశ్రమ హైదరాబాద్కు తరలిరావడానికి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కృష్ణ.. ప్రధాన కారణం. సినీ కార్మికులు ఇల్లు కట్టుకునేందుకు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేశారు. సినీపరిశ్రమలో ఏ సంక్షోభం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు వాటిని పరిష్కరించి.. శాశ్వతంగా ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో నిలిపేందుకు కృషి చేశారు.సంతోషంబాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప వంటి సినిమాలు జాతీయ స్థాయిలో మన సినీ పరిశ్రమను నిలబెట్టాయి. అలాంటి ఇండస్ట్రీ కోసం ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గతేడాది గద్దర్ పురస్కారాలను ప్రవేశపెట్టాం. వరుసగా రెండోసారి ఈ అవార్డులను అందించాం. ఈ కార్యక్రమానికి ఖుష్బూ, జయసుధ వంటి వారు రావడం సంతోషం. నాగచైతన్య, రష్మిక అందరూ యంగ్స్టర్స్. వీళ్లకు అవార్డులు ఇచ్చేందుకు వచ్చిన సీనియర్స్ అందరినీ అభినందిస్తున్నాను.సూచనహైదరాబాద్లో.. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసేవారికి అన్నిరకాల అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తుంది. ఆన్లైన్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతున్నాను. ఇకపోతే గద్దర్ ఒక ప్రజాయుద్ధ నౌక.. ఆయన పేరు కోట్లాదిమందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించింది.సమాజంలోని సమస్యలపై సినిమాఆయన గళం తెలియనివారు దేశంలో లేరు. గద్దర్ ఒక చైతన్యం, స్ఫూర్తి. అందుకే ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టాం. సినిమా అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సమాజంలోని సమస్యలపై పోరాడేందుకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలి అని రేవంత్రెడ్డి మాట్లాడారు.అవార్డుల వేడుక'గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025' కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, రాంచరణ్, ఖుష్బూ, నాగచైతన్య, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
అనసూయ ఉగాది వైబ్స్..థాయ్లాండ్ వేకేషన్లో అభినయ..!
టాలీవుడ్ నటి అనసూయ ఉగాది వైబ్స్..మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఉగాది లుక్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ఉగాది పోజులు..టాలీవుడ్ నటి హంసానందని ఉగాది సెలబ్రేషన్స్..థాయ్లాండ్ వేకేషన్లో టాలీవుడ్ నటి అభినయ.. View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
కుటుంబానికి దూరంగా.. నాన్న పేరుపై అర్చన: మనోజ్
ప్రతి ఉగాదికి ఫ్యామిలీతో కలిసి ఉండేవాడిని, కానీ ఈసారి దూరంగా ఉండాల్సి వచ్చిందంటున్నాడు హీరో మనోజ్ మంచు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నేను ఎప్పటినుంచో ఒకటి బలంగా నమ్ముతాను.. సనాతన సాంప్రదాయం, మనకు చిన్నప్పుడు నేర్పించిన విలువలు ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్లవు.ఉగాది అంటే..మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ విలువలు మనలో, మనతోనే ఉంటాయి. ఈరోజు కూడా నా రాబోయే సినిమా డేవిడ్ రెడ్డి షూటింగ్ కోసం దూరంగా ఉండాల్సి వచ్చింది. బాధ్యతలతో బిజీగా ఉన్నా.. ఆ అనుబంధం మాత్రం అలాగే ఉంది. నాకైతే ఉగాది అంటే నూతన సంవత్సరానికి నాంది మాత్రమే కాదు, అది మనలో జరిగే నిశ్శబ్ధ పునరుజ్జీవనం, ఋతువుల మార్పు, ధర్మం మళ్లీ మేల్కొనడం, కాలపురుషుడి ఆవిర్భావం.నాన్న పేరుపై అర్చనఈ చైత్ర శుక్ల ప్రతిపద రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని నెలకొల్పి, యుగాల చక్రాన్ని ప్రారంభించాడని నమ్ముతారు. అదే మనం ఉగాదిగా జరుపుకుంటాం. నేను ఎంతో దూరంలో ఉన్నప్పటికీ గుడిలో ఉన్న నా కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా చూశాను. ఆ ఆధ్యాత్మికతను నేనూ ఫీల్ అవుతున్నాను. మౌనిక, ధైరవ్, చిట్టి దేవసేన.. నాన్న (మోహన్బాబు) పేరుమీద అర్చన చేయించారు. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన మనవళ్లకెప్పుడూ ఆయన ఆశీస్సులుంటాయి.ఇలా తొలిసారిఓపక్క పనిలో బిజీగా ఉంటూనే నా మూలాలను మర్చిపోకుండా ఉండగలగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. మార్చి 19 అంటేనే నాకు పండుగ.. ఇది నాకు చిన్నప్పటినుంచి సెలవురోజు, ఎందుకంటే ఈరోజు నా తండ్రి పుట్టినరోజు. ఆయనతో కలిసి గడిపే ప్రత్యేకమైన రోజు. కానీ, తొలిసారి ఆ సెలవురోజు పనిదినంగా మారింది. నాకు కుటుంబం తర్వాత అత్యంత ఇష్టమైనది పని! నేను ఏం చేసినా, అందరితో ప్రశంసలు అందుకునేలా పని చేస్తున్నా.. అదంతా మీకోసమే నాన్న.. హ్యాపీ బర్త్డే అని రాసుకొచ్చాడు. चैत्रे मासि जगत् ब्रह्मा ससर्ज प्रथमेऽहनि।शुक्ल पक्षे समग्रेतु तदा सूर्योदये सति॥I have always believed that the Sanatana tradition and the values we are raised with never really leave us. They stay within us, no matter where we are or what we are doing. Even today, being away… pic.twitter.com/c8WE4OAib4— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 19, 2026 చదవండి: రొమాంటిక్ సాంగ్.. డైరెక్టర్కు కాజోల్ వార్నింగ్ -
గ్రాండ్గా గద్దర్ అవార్డ్స్ వేడుక
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, టీఎఫ్డీసీ దిల్ రాజు హాజరయ్యారు. ఈ వేదికపైనే జ్యూరీ సభ్యులకు మెమొంటోలతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు.కాగా.. ఇప్పటికే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 విజేతలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన చిత్రాలకు అవార్డ్స్ ప్రకటించారు. తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా అవార్డులను అందజేశారు. గద్దర్ -2025 ఫిల్మ్ అవార్డ్స్లో రాజు వెడ్స్ రాంబాయి, ఛాంపియన్ సినిమాలు అత్యధికంగా అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. తండేల్ సినిమాకు గాను నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్ ) మూవీకి గాను ఉత్తమ నటిగా ఎంపికైంది. ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది. నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు దక్కడం విశేషం. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు వరించింది. -
ఓటీటీ ప్రపంచంలో కిరణ్ అబ్బవరం.. గ్లింప్స్ చూశారా?
క, కె- ర్యాంప్ సినిమాలు కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి. అయితే వీటి మధ్యలో వచ్చిన దిల్రూబా మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడీ హీరో. ఓపక్క వెండితెరపై సినిమాలు చేసుకుంటూనే ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.వెబ్ సిరీస్ఈసారి సినిమాతో కాకుండా వెబ్సిరీస్తో ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్లాన్ చేశాడు. తాజాగా ఆ వెబ్ సిరీస్ టైటిల్తో పాటు గ్లింప్స్ కూడా వదిలారు. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వం వమిస్తున్న ఈ సిరీస్కు గువ్వల చెరువు ఘాట్ టైటిల్ ఫిక్స్ చేశారు. రూరల్ బ్యాక్డ్రాప్ పొలిటికల్ డ్రామాతో ఈ సిరీస్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సిరీస్ఇందులో తిరువీర్, సంయుక్త మీనన్, తేజస్వి రావు, సిద్ధిఖి, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ లుక్ గ్లింప్స్ చూస్తుంటే ఇంట్రస్టింగ్గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. -
ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ రేసు గుర్రం. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రం మాస్ ఆడియన్స్ను ఓ రేంజ్లో ఆకట్టుకుంది. ఈ మూవీతో రవి కిషన్ టాలీవుడ్లో ఫేమస్ అయిపోయారు. విలన్గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం రోల్ ఎప్పటికీ గుర్తుంటుంది. చివరి 30 నిమిషాల్లో బ్రహ్మనందం అదరగొట్టేశారు. ఈ మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్ 8న రేసుగుర్రం 4కె వర్షన్లో థియేటర్లో రీ రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరోసారి మద్దాలి శివారెడ్డి విలనిజం, బ్రహ్మనందం ఫుల్ యాక్షన్ మోడ్ చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. ఇవాళ ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. Wishing everyone a very Happy Ugadi 🥭#RaceGurram4K is all set to hit theatres on April 8, 2026 mark the date in your calendars !!Get ready to witness the madness of this iconic character once again and experience the frenzy on the big screen 🔥@alluarjun @shrutihaasan… pic.twitter.com/kSQDq2c512— Race Gurram 4K (@RGTheFilm) March 19, 2026 -
రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా.. ఇంత తక్కువ లాభమా?
కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా రెండు ఫ్లాట్లు అమ్మేశాడు. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని మినర్వా బిల్డింగ్లోని ఫ్లాట్లను తక్కువ లాభానికే వదిలేసుకున్నాడు. సుమారు రూ.14.80 కోట్లకు ఈ ఫ్లాట్స్ అమ్మేశాడు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది.అప్పట్లో..కాగా వీటిని ప్రభుదేవా 2012లో రూ.14.45 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఒక ఫ్లాట్ 32వ అంతస్తులో ఉండగా, మరొకటి 33వ అంతస్తులో ఉంది. ఒక్క ఫ్లాట్ సుమారు 1295 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగుంది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని అమ్మితే ప్రభుదేవాకు కేవలం రూ.35 లక్షలు మాత్రమే లాభం వచ్చింది. ఇది చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.చదవండి: సూర్య అడుగుజాడల్లో చిరంజీవి.. త్వరలోనే.. -
మాట నిలబెట్టుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్ లైఫ్లోనూ శెభాష్ అనిపించుకుంటున్నారు. ఇటీవల ఏపీలోని బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం చేస్తానని మాటిచ్చారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.తాజాగా తాను ఇచ్చిన మాటను అల్లు అర్జున్ నిలబెట్టుకున్నారు. తండ్రిని కోల్పోయిన దుర్గ అనే యువతికి రూ.7,500 ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్షాట్ను బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్కు కృతజ్ఞతలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు మరణించారు. అంతేకాకుండా ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు.అయితే, ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ తెలిపారు. After the tragic fire accident at a Kakinada fireworks factory claimed her father's life, Allu Arjun stepped up to support Kadimpalli Durga, a mentally challenged young girl left in distress.He pledged financial assistance of ₹7,500 every month for her entire life to ensure… pic.twitter.com/7DvsBnSZm2— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) March 18, 2026 -
ఉగాది రోజు చిరంజీవి కీలక ప్రకటన.. త్వరలోనే..
మెగాస్టార్ చిరంజీవి మరో బృహత్తర కార్యక్రమానికి ముందడుగు వేయబోతున్నారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన ఆయన.. ఇప్పుడు నిరుపేదలకు ఉచితంగా విద్య అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అందుకే బ్లడ్ బ్యాంక్ఉగాది పర్వదినం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. ప్రజలే. నన్ను ఇంతటివారిని చేశారు. అలాంటి వారికోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. సమయానికి రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి ఆనాడు బ్లడ్ బ్యాంక్ స్థాపించాను. అక్కడితోనే ఆగిపోవడం నాకిష్టం లేదు. ఇంకా సేవ చేయాలనుంది. నన్ను స్ఫూర్తిగా తీసుకుని..నిరుపేద చిన్నారులకు ఉచితంగా విద్య ఎలా అందించాలని ఆలోచిస్తున్నాను. పిల్లలకు మంచి విద్య అందితే ఆ కుటుంబమే బాగుపడుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాను. తమిళనాడులో హీరో సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని అగరం ఫౌండేషన్ స్థాపించినట్లు ఎన్నోసార్లు చెప్పారు. ఆ సంస్థ ద్వారా ఎంతోమందికి ఉచిత విద్య అందించారు. ఇప్పుడు తనే నాకు ఇన్స్పిరేషన్అలా ఆయన చేస్తున్న విద్యాదానం నన్నెంతగానో మోటివేట్ చేసింది. ఒకప్పుడు ఆయనకు నేను ఇన్స్పిరేషన్.. కానీ ఇప్పుడు నేను సూర్య నుంచి స్ఫూర్తి పొందుతున్నాను. నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే నా భవిష్యత్తు కార్యాచరణ అని చిరంజీవి పేర్కొన్నారు.చదవండి: 32 ఏళ్ల తర్వాత.. మోహన్బాబు బర్త్డే స్పెషల్ వీడియో -
స్టార్ బాయ్ కొత్త సినిమా ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గతేడాది రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా మూవీతో ప్రేక్షకులను అలరించాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక కొత్త ఏడాదిలో ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు మన యంగ్ హీరో.తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్ చేశారు. కొత్త చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ మూవీకి అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఈవెంట్కు నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాలు బ్యానర్సపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. A new journey begins this Ugadi 🔥Star Boy @Siddubuoyoffl x Sithara Entertainments ~ #ProductionNo42 launched with a grand pooja ceremony! ✨A big-scale fantasy entertainer 💥Rolling from this April 🎬Directed by @AforAnilkumar Produced by @vamsi84 & #SaiSoujanya… pic.twitter.com/iN7FuI5ZkW— Sithara Entertainments (@SitharaEnts) March 19, 2026 -
32 ఏళ్ల తర్వాత ఇలా..: మోహన్బాబు
టాలీవుడ్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. విలక్షణ నటుడు మోహన్బాబు విలన్గా యాక్ట్ చేస్తున్నారు. నేడు (మార్చి 19న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో మోహన్బాబు 32 సంవత్సరాల తర్వాత నేను విలన్గా యాక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను మాయ చేశాడు అని పేర్కొన్నారు. ఆయనను షికంజి పాత్ర కోసం ఎలా సన్నద్ధం చేస్తున్నారనేది చూపించారు.మోహన్బాబు బర్త్డే స్పెషల్ గ్లింప్స్చివర్లో మోహన్బాబుకు ఎలివేషన్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఈ జనరేషన్కు మోహన్బాబు సర్ అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. కానీ, ప్యారడైజ్తో ఆయనేంటో చూపిస్తాం అన్నాడు. అయితే ఈ గ్లింప్స్ నిడివి కేవలం 46 సెకన్లు మాత్రమే కలిగి ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: 41 ఏళ్ల వయసులో తల్లయిన బుల్లితెర నటి -
సమంత ఉగాది పచ్చడి .. భర్త రాజ్ షాకింగ్ కామెంట్..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆమె పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ జరిగింది. పవిత్రమైన భూతశుద్ధి పేరుతో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వివాహానికి కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.అయితే ఇవాళ ఉగాది కావడంతో సామ్ సైతం పండుగను సెలబ్రేట్ చేసుకుంది. యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి ఉగాది పచ్చడి చేసింది. ఈ సందర్భంగా తన భర్త రాజ్ నిడిమోరుకు లైవ్లో ఫోన్ చేసి మాట్లాడింది. ఉగాది పచ్చడి చేశానంటూ తన భర్తకు చెప్పింది. నువ్వు చేశావా? అంటూ రాజ్ అనడంతో పక్కనే ఉన్న సుమ, నందిని నవ్వు ఆపుకోలేపోయారు. అంతకుముందు సామ్.. హాయ్ బాబు అని రాజ్ను ముద్దుపేరుతో పిలవడంతో యాంకర్ సుమ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : ఉస్తాద్ భగత్ సింగ్నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ తదితరులునిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలిరచన, దర్శకత్వం: హరీష్ శంకర్స్క్రీన్ప్లే: కె. దశరథ్, రమేష్ రెడ్డిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్నేపథ్య సంగీతం: తమన్సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్ఎడిటర్: కార్తిక శ్రీనివాస్విడుదల తేది: మార్చి 19, 2026‘గబ్బర్ సింగ్’తర్వాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చన రెండో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వాస్తవానికి 2020లోనే హరీష్-పవన్ సినిమా ఫిక్స్ అయింది. మైత్రీ మూవీస్ సంస్థలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పవన్ రాజకీయాలలో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యం అయింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఉగాది పండగ సందర్భంగా నేడు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..తెలంగాణాలొని లింగయ్య గూడెం గ్రామానికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్(కేఎస్ రవికుమార్).. చిన్నయ్య అనే కుర్రాడినికి చేరదీసి పెద్ద చదువులు చదివిస్తాడు. చిన్నయ్య ప్రవర్తన, లక్షణాలను చూసి చిన్నప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ అని నామకరణం చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మాస్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. భగత్ సింగ్ ఐపీఎస్ అధికారి అవుతాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో సీఎంపై దాడి జరుగుతుంది. ఆ దాడి వెనుక మంత్రి నాగప్ప (పార్తిపన్) ఉన్నట్లు తెలుస్తుంది. తన గురువుని కాపాడుకునేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ ఏం చేశాడు? నాగప్పతో ఉస్తాద్కు ఉన్న వైర్యం ఏంటి? ఆర్జే లీలా(శ్రీలీల) తో ఉస్తాద్కు ఉన్న సంబంధం ఏంటి? ఐపీఎస్గా విధులు నిర్వహించాల్సిన ఉస్తాద్.. సీఎంపై దాడి తర్వాత అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? భగత్ సింగ్ గతమేంటి? శ్లోక(రాశీ ఖన్నా) ఎవరు? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఈ రోజుల్లో బలమైన కంటెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్లడం లేదు. ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే.. కథలో కొత్తదనం లేకుంటే ఆ సినిమాను ఆదరించడం లేదు. ఇలాంటి రోజుల్లో దర్శకుడు హరీష్ శంకర్ రొటీన్ కథతో ‘ఉస్తాద్ భగన్ సింగ్’ తెరకెక్కించాడు. కథ, కథనం ఏమాత్రం కొత్తగా అనిపించదు. సినిమా చూస్తున్నంత సేపు పాత సినిమాల సన్నివేశాలన్నీ కళ్లముందు కదులుతాయి. స్క్రీన్ప్లే అయితే మరీ దారుణంగా ఉంది. ఒక్కచోట కూడా ఆసక్తికరంగా కథనం సాగదు. పైగా పవన్తో చేయించిన కామెడీ ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. నార్మల్ ఆడియన్స్ని పక్కన పెట్టు..కనీసం అభిమానులు ఆశించిన అంశాలు కూడా ఇందులో ఉండకపోవడం గమనార్హం. ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా పవన్లో స్టెప్పులు వేయించారు. కానీ కథలో అది ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. డ్యాన్స్..డ్యాన్స్ అంటూ హీరోకి హైప్ ఇచ్చి.. ఆ సందర్భంలో పెట్టిన పాటకు సరైన స్టెప్పులే వేయించలేదు. అలాంటి అప్పుడు అంత హైప్ ఇవ్వడం ఎందుకో? మరోవైపు ‘ధేఖ్ లేంగే సాలా’సాంగ్ మిస్ప్లేస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ కథకి టెర్రరిజం, సనాతన ధర్మం అంశాలను యాడ్ చేయడం కూడా ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. హీరోని దృష్టిలో ఉంచుకోనే ఆయా సన్నివేశాలను యాడ్ చేశారనిపిస్తుంది. ఎలివేషన్ ఇస్తూ..ఏదో చెప్పేస్తే చాలు ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోతారని భావించారేమో. అప్పుడే హీరో కామెడీ చేస్తాడు.. కాసేపటికే సీరియస్ అవుతాడు. ఆ లోపే మరో కొత్త పాయింట్ తెరపై వస్తుంది. వాటిలో ఏ ఒక్కటి కూడా ఆకట్టుకునేలా ఉండడకపోవడమే మైనస్. ఇక ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా ఈ కథ ‘తెరి’ సినిమాకు పూర్తిగా రీమేక్ కాకపోయినా.. హీరో పాత్రతీరుతో పాటు ఒకటి రెండు సీన్లు ఆ సినిమాను గుర్తు చేస్తాయి. సీఎంపై దాడి చేసే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. హీరో బాల్యం చూపిస్తే.. సీఎంతో అతనికి ఉన్న అనుబందాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శ్లోకగా రాశీ ఖన్నా ఎంట్రీ అయినప్పటి నుంచి కథనం రొటీన్గానే సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ కూడా రొటీన్గానే ఉంటుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. శ్రీలీల-పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తొలి ప్రేమలో సినిమాలోని ‘ఈ మనసే..’ పాట రీమేక్ ఫ్యాన్స్కి అలరిస్తుంది. ఆ తర్వాత మళ్లీ రొటీన్గానే సాగుతుంది. ఫస్టాఫ్తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త బెటర్. మొత్తంగా మాత్రం ఉస్తాద్ .. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. కొత్తదనం ఆశించి వెళితే..అభిమానులకు సైతం నిరాశ తప్పదు. ఎవరెలా చేశారంటే.. నటనపరంగా మెప్పించేందుకు ఇందులో పవన్ కొత్తగా చేసిందేమి లేదు. ఈ తరహా పోలీసు పాత్రను ఆయన ఆల్రేడీ చేసేశాడు. ఓ పాటకు స్టెప్పులు వేయడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. శ్రీలీల పాత్ర ఎంట్రీ సెకండాఫ్లో ఉంటుంది. అయినప్పటికే తన స్క్రీన్ ప్రజెన్స్తో ఆకట్టుకుంది. రాశీ ఖన్నా పాత్రకు నిడివి తక్కువే. అంతగా ప్రాధాన్యత కూడా లేదు. పార్తీబన్ విలనిజం జస్ట్ ఓకే. కేఎస్ రవికుమార్, కిల్లి క్రాంతి, శ్రీనాథ్ మాగంటితో పాటు మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఓకే . తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల సన్నివేశాలతో సంబంధం లేకుండా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
అనుష్క పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్
హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలో ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకోనుందని ఈ మధ్య మళ్లీ రూమర్స్ వచ్చాయి. గతంలోనూ ఇలానే రాగా వాటి గురించి ఎవరూ స్పందిచంకపోయేసరికి అంతా ఊరుకున్నారు. ఇప్పుడు మాత్రం అనుష్క సీరియస్ అయింది. ఈ మేరకు ఆమె టీమ్ ఓ నోట్ విడుదల చేసింది. పెళ్లి రూమర్స్ గురించి క్లారిటీ ఇస్తూనే వయసు గురించి ఎందుకు ఇంతలా హైలైట్ చేస్తున్నారని టీమ్ ప్రశ్నించింది.(ఇదీ చదవండి: వాళ్లు చెప్పిందే నమ్మా.. ఇలా చేస్తారనుకోలేదు: నోరా ఫతేహి)'ఒకరి జీవితాన్ని రోజువారీ న్యూస్గా మార్చేముందు కనీసం అది నిజమా కాదా అని కూడా చూడటం లేదు. ఊహించడం, అంచనా వేయడం, అనధికారిక సమాచారాన్ని పదేపదే ప్రచురించడం కరెక్ట్ కాదు. ఆమె వయసుపై అనవసరమైన శ్రద్ధ చూపడం, ప్రతి పోస్టులో '44' అనే నంబర్ని ఏదో వివాదాస్పదమైన అంశంలా హైలైట్ చేయడం అన్నింటికంటే నిరాశ కలిగించే విషయం. వయసు అంత పెద్ద సమస్య అయితే.. హీరోల విషయంలో కూడా ఇదే ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు? మహిళలకే ఎందుకు భిన్నంగా ఉంటుంది?''అనుష్క శెట్టి తన కెరీర్ని ప్రతిభ, గౌరవంతో నిర్మించుకున్నారు. ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్పై ఆధారపడలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలని అనుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతిఒక్కరూ తమ జీవితంలో జరిగే విషయాలనీ అందరికీ చెప్పలనుకోరు. ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. వివాహం వ్యక్తిగత విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు. ట్రెండ్ కాదు. కేవలం వ్యూస్ కోసం సెన్సేషనలైజ్ చేయాల్సిన విషయం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. హద్దులని గౌరవించండి. ప్రచురించే ముందు నిజాన్ని నిర్ధారించుకోండి. హీరోయిన్లని కూడా హీరోలతో సమానంగా గౌరవించండి' అని అనుష్క టీమ్ రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?
తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. 'ధురంధర్ 2' మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. రిలీజ్ నాడు పడాల్సిన తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయిపోయాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి. టికెట్ డబ్బులని తిరిగి ఇచ్చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది? తెలుగు షోలు ఎప్పటి నుంచి ఉండొచ్చు?(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)గతేడాది డిసెంబరు తొలివారంలో వచ్చిన 'ధురంధర్'.. 50 రోజులకు పైనే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. తర్వాత ఓటీటీలోకి వస్తే అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలి పార్ట్ రిలీజైనప్పుడే సీక్వెల్.. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ కూడా ఈసారి ఉంటాయని మాటిచ్చారు. కానీ ఇప్పుడది తప్పారు.18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి తెలుగు షోలు ఉంటాయని చెప్పినప్పటికీ వాటిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆదిత్య ధర్.. రాత్రి 9 గంటల నుంచి ఉంటాయని పోస్ట్ పెట్టాడు. రాత్రి సంగతి పక్కనబెడితే తర్వాత అంటే 19వ తేదీ అయిన ఈ రోజు కూడా హైదరాబాద్లో తెలుగు వెర్షన్ షోలు రద్దయ్యాయి. డబ్బింగ్ ఇంకా పూర్తిగా జరగకపోవడం, చివరి నిమిషంలో హడావుడి లాంటివి సమస్యలుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుక్ మై షోలో 20వ తేదీకి తెలుగు షోలు ఉన్నప్పటికీ.. అవి అయినా వేస్తారా లేదా అనేది సందేహమే?'ధురంధర్ 2' విషయానికొస్తే.. రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు.అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష) -
పవన్ VS రణ్వీర్.. ఇది మూడోసారి
భారతీయ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల వరకు పోటీగా రిలీజైన చిత్రం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. వీటి టాక్ ఏంటి? చూసిన వాళ్లు ఏమంటున్నారు? అనే విషయాల్ని పక్కనబెడితే పవన్ vs రణ్వీర్ పోటీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలోనూ ఈ హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)రణ్వీర్ సింగ్.. హిందీ సినిమాలే చేసినప్పటికీ తెలుగులోనూ కాస్తంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఇక్కడ కూడా ఇతడి మూవీస్ రిలీజయ్యాయి. గతంలో అంటే 2011లో పవన్ కల్యాణ్ 'పంజా' వచ్చినప్పుడే రణ్వీర్ 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్' మూవీ కూడా వచ్చింది. వీటిలో పంజా ఫ్లాప్ కాగా రణ్వీర్ ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. 2023లోనూ మళ్లీ వీళ్లిద్దరూ ఒకేరోజున చిత్రాల్ని రిలీజ్ చేశారు. పవన్ 'బ్రో' సినిమాతో రాగా రణ్వీర్ 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'తో వచ్చాడు. ఇక్కడ సేమ్ సీన్ రిపీటైంది పవన్ మూవీ ఫ్లాప్ కాగా రణ్వీర్ హిట్ కొట్టాడు.ఇపుడు ముచ్చటగా మూడోసారి రణ్వీర్ వర్సెస్ పవన్ పోటీలో నిలిచారు. ఈసారి రణ్వీర్ 'ధురంధర్ 2' ఆధిపత్యమే కొనసాగేలా కనిపిస్తోంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'కి ప్రీమియర్ల నుంచే నెగిటాక్ వస్తోంది. కంటెంట్ మరీ ఔట్ డేటెడ్గా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 'ధురంధర్ 2' హవా తెలుగులోనూ గట్టిగానే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సినిమా 'ధురంధర్'. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రిలీజ్ కాగా.. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ వచ్చేసింది. నిన్నటి(మార్చి 18) నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడ్డాయి. చూసిన ప్రతిఒక్కరూ అదిరిపోయిందని మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ప్రీమియర్ చూసి తనదైన రివ్యూ ఇచ్చేశాడు. మూవీని ఆకాశానికెత్తేశాడు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'దేశభక్తి, స్వాగ్తో ఇప్పుడే 'ధురంధర్ 2' చూశాను. ప్రతి భారతీయుడిని గర్వంగా ఫీలయ్యేలా చేసింది. సినిమాలో క్లాప్స్ కొట్టే సందర్భాలెన్నో. చిత్రబృందానికి శుభాకాంక్షలు. మాధవన్ సహా నటీనటులు అందరూ అదరగొట్టేశారు. నీలాంటి భిన్నమైన యాక్టర్ దేశంలో ఉండటం గర్వకారణంగా ఉంది బ్రదర్ రణ్వీర్ సింగ్. ఆదిత్య ధర్.. మరోసారి బ్లాక్బస్టర్ కొట్టేశాడు. నీలాంటి దర్శకులు మన దేశంలో ఉన్నందుకు గర్వంగా ఉంది. షో రాకర్. ఇది ఇంటర్నేషనల్ స్వాగ్తో తీసిన భారతీయ కథ. జైహింద్' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.మామ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైనప్పటికీ.. అల్లు అర్జున్ ముందుగా 'ధురంధర్ 2' చూసి ఏకంగా రివ్యూ ఇవ్వడం తెలుగు ప్రేక్షకుల్లో చర్చకు కారణమైంది. ఎందుకంటే పవన్ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. మొత్తం నెగిటివ్ టాక్ వస్తోంది. అల్లు అర్జున్తో పాటు విజయ్ దేవరకొండ తదితరులు.. 'ధురంధర్ 2' సినిమాని బుధవారం సాయంత్రం అల్లు సినిమాస్ థియేటర్లో చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి?) -
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి?
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. తొలి నుంచి ఇది తమిళ మూవీ 'తెరి'కి రీమేక్ అని ప్రచారం సాగింది. గత కొన్నాళ్ల నుంచి ఈ విషయాన్ని డైరెక్టర్ ఖండిస్తూ వచ్చాడు. అయినా సరే దీనిపై పెద్దగా బజ్ లేదు. దానికి తోడు 'ధురంధర్ 2'కి పోటీగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఆంధ్రలో ఎర్లీ మార్నింగ్, ఓవర్సీస్ షోలు పడ్డాయి. మూవీ చూసిన ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో ఏముంటున్నారు? ట్విటర్ టాక్ ఏంటి?(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తిగా ఔట్ డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. రైటింగ్ పరంగా కొత్తగా ఏం ఆశించలేం కానీ ఉన్నంతవరకైనా బాగా తీయాలిగా. అది కూడా సరిగా తీయలేదు. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. కామెడీ, కమర్షియల్ రైటింగ్ విషయంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘోరంగా ఫెయిలయ్యాడు. అలానే పవన్ ఎనర్జీ కూడా మిస్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)#UstaadBhagatSingh A Completely Outdated Commercial Entertainer!A commercial film like this doesn’t necessarily need out of the box writing, but it atleast needs some freshness. This one feels outdated to the core from the start to end. A few elevation blocks work, but the film…— Venky Reviews (@venkyreviews) March 18, 2026#UstaadBhagatSingh - PK’s look, Screen presence & Dialogues r the positives in this Routine, Outdated Drama. Parthiban Naidu as weak villain. Sreeleela ok. Raashi Khanna has no scope. Thaman does a Anirudh work in BGM. One melody track nice. Narration is a Patience Tester. BORE!— Christopher Kanagaraj (@Chrissuccess) March 18, 2026Indukenemo manaki raanidi..mana valla kaanidi cheyyakudadu antuntaru.. #HarishShankar @/harish2you#UstaadBhagatSingh #UBSReview https://t.co/Maam0Ys7tM pic.twitter.com/Pw5e37SahX— Sasi Kiran (@SasiKir54703134) March 18, 2026#UstaadBhagatSinghOutdated from start to finish.A few elevation scenes work, but overall feels like stitched mass compilation with weak flow.#PawanKalyan shines in bits, but energy is missing.#HarishShankar disappoints wth forced comedy & writing.⭐ 1.5/5 - Save your money. pic.twitter.com/N6ZoLLhQqS— theindia.360 (@theindiaa360) March 19, 2026ఫస్ట్ హాఫ్ పర్లేదు అనుకునేలోపు, సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష పెట్టింది. #UstaadBhagatSingh@PawanKalyan@harish2you— 𝕤𝕣𝕚𝕟𝕦 𝕧𝕚𝕥𝕒𝕝 (@srinuvital) March 19, 2026Painful 1st half.. PawanKalyan lost his touch in acting, trying his best.. Not a single ticket worthy episode. Weak writing with no proper story & screenplay underlined by excellent bgm.. collar etthara song is good. Worst interval, hope 2nd half saves #UBS #UstaadBhagatSingh— Peter Reviews (@urstrulyPeter) March 18, 2026 -
వైవిధ్యమైన పాత్రల్లో...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు మంచు మోహన్బాబు. నేడు (మార్చి 19) ఆయన పుట్టినరోజు. ‘స్వర్గం నరకం’ (1975) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారాయన. ఆ తర్వాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా గొప్ప పాత్రలు ΄ోషించారు. నిర్మాతగానూ తిరుగులేని విజయాలను అందుకున్నారు. ఒక నటుడు నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం విశేషం. 600లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పటికీ నటుడిగా బిజీగా ఉన్నారు. వైవిధ్యమైన పాత్రలతో నేటి తరాన్ని కూడా మెప్పించబోతున్నారు. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘ది ΄్యారడైజ్’, ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాసమంగాపురం’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను ΄ోషిస్తున్నారు మోహన్బాబు. -
అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది
‘‘తెలుగు నూతన సంవత్సరాది కానుకగా మా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నేడు విడుదలవుతుండటం మాకు చాలా ప్రత్యేకం. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. ఒక మంచి తెలుగు సినిమా అయిన మా మూవీ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని శ్రీలీల తెలిపారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ నేడు రిలీజ్ అవుతోంది. బుధవారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘పాటలు, డ్యాన్స్, డైలాగ్స్, ప్రేమ, హాస్యం, విలన్తో పవర్ఫుల్ సీన్స్... ఇలా అన్ని అంశాలు ‘ఉస్తాద్ భగత్సింగ్’లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్లాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్లు మరిన్ని సినిమాలు తీస్తూ పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి’’ అని చె΄్పారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘వినోదం, భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు నిండి... ఆద్యంతం ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు రాశీ ఖన్నా. -
‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: ధురంధర్: ద రివేంజ్నటీనటులు: రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులుసంగీతం: శాశ్వత్ సచ్దేవ్సినిమాటోగ్రఫీ: వికాల్ నోవ్లఖాఎడిటర్: శివకుమార్ వి పనికర్రచన-దర్శకత్వం: ఆదిత్య ధర్నిర్మాతలు: జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్నిడివి: 229 నిమిషాలువిడుదల తేదీ: 19 మార్చి 2026గతేడాది డిసెంబరులో ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా 'ధురంధర్'. సీక్వెల్ గురించి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాటపై నిలబడి 'ధురంధర్: ద రివేంజ్'ని థియేటర్లలోకి తీసుకొచ్చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తొలి భాగాన్ని మించిపోయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఒక జైలు ఖైదీని సీక్రెట్ ఏజెంట్గా పాకిస్తాన్కి పంపడం అనే కొత్త పాయింటే ధురంధర్ విజయానికి కారణం అయింది. ఇంతవరకు వచ్చిన స్పె యాక్షన్ సినిమాలకు ధురంధర్కు మత్య ఉన్న తేడా అదే. దానికి తోడు యాక్షన్ సన్నివేశాలు, బీజీఎం అదిరిపోవడంతో రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్ : ది రివెంజ్ కూడా అదే రేంజ్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్కి కూడా పెద్ద పీట వేశారు. పార్ట్ 1 చూసిన వాళ్లు సినిమా ప్రారంభం నుంచే ధురంధర్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. చూడనివారికి కూడా కథను చాప్టర్ల వారిగా విడగొట్టి.. అర్థమయ్యేలా తెరపై చూపించాడు దర్శకుడు. అయితే పార్ట్ 1 చూస్తేనే కొన్ని పాత్రలకు తాలుకు పవర్ తెలిసి..తర్వాత ఏం జరుగుతుందో ఊహించొచ్చు.చివరిలో వచ్చే కొన్ని ట్విస్టులను మాత్రం ఊహించలేం. అవి థ్రిల్కి గురి చేస్తాయి. పార్ట్1 కంటే నిడివి ఎక్కువైనా.. ఎక్కడా బోర్ కొట్టదు.హమ్జా పాత్ర ప్లాష్బ్యాక్తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో పగ తీర్చుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు అయితే ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు యాక్షన్ సీన్స్ను ఓ రేంజ్తో తీర్చిదిద్దారు. ల్యారీ పీఠం దక్కించుకునేందకు హమ్జా ఆడే మైండ్ గేమ్ అదిరిపోతుంది. ఉగ్రవాదులకు అంతం చేసేందుకు వేసే ఎత్తులు థియేటర్స్లో చప్పట్లు కొట్టించేలా ఉంటాయి. 2016లో జరిగిన నోట్ల రద్ధు ఘటనను కూడా ఈ కథలో ప్రస్తావించారు. నోట్ల రద్దు సరైన నిర్ణయం అనేలా ఈ చిత్రంలో చూపించారు. అలాగే మాఫీయా డాన్ దావూద్ని కూడా ఈ కథకు ముడిపెట్టడం ఆసక్తిరేకెత్తించే అంశం. ఫస్టాఫ్ వరకు కాస్త స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ద్వితియార్థంలో ఏం జరుగుందా అనే ఆసక్తిని ప్రేక్షకులను కలిగించేలా ఇంటర్వెల్ కట్ చేశారు. ఇక సెకండాప్ మొత్తం కథనం పరుగులు పెడుతుంది. హమ్జాపై ఎన్సీ అస్లాం చౌదరిపై అనుమానం రావడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హమ్జా భారత ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. క్లైమాక్స్ ఎమోషనల్గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే..సీక్రెట్ ఏజెంట్ హమ్జా పాత్రలో రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్గా అర్జున్ రాంపాల్ అద్భుతంగా నటించాడు. ఎస్పీ చౌదరిగా నటించిన సంజయ్ దత్ నిడివి కాస్త తక్కువే. ఆయన పాత్ర ముగింపు బాగుంటుంది. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్గా మాధవన్ తెరపై కనిపించేది తక్కువే అయినా.. గుర్తిండిపోయేలా నటించాడు. జమీల్ జమాల్గా నటించిన రాకేశ్ బేడి నవ్వులు పూయించడంతో పాటు థ్రిల్లింగ్కి కూడా గురిచేశాడు. సారా అర్జున్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలినవారంతా బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శాశ్వత్ సచ్దేవ్ బీజీఎం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పోరాట ఘట్టాలు వాస్తవికంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ దివి..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి..!
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ బ్యూటీ దివి..రెస్టారెంట్లో ఆరగిస్తున్న హీరోయిన్ మన్నారా చోప్రా..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..కల్లు తాగుతూ చిల్ అవుతోన్న హేమ, సురేఖావాణి..బీచ్లో ఎంజాయ్ చేస్తోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by @natasastankovic__ -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో.. తండ్రి నిర్మాత, అన్న డైరెక్టర్
వయసు మీద పడితే ఎవరైనా సరే మారిపోతారు. కొందరిని గుర్తుపట్టొచ్చు కానీ మరికొంతమందిని మాత్రం సడన్గా చూస్తే గుర్తుపట్టలేం. ఇప్పుడు అలానే ఓ హీరోకి సంబంధించిన లేటెస్ట్ ఫొటో వైరల్ అవుతోంది. అతడి కొత్త మూవీ షూటింగ్లో భాగంగా ఓ నటి సదరు హీరోతో ఫొటోలు తీసుకుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?)కర్తవ్యం, భారతీయుడు, ఖుషి తదితర సినిమాలని నిర్మించిన ఏఎం రత్నం.. రీసెంట్ టైంలో అయితే పవన్ కల్యాణ్తో 'హరిహర వీరమల్లు' తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఈయన పెద్ద కొడుకు జ్యోతికృష్ణ దర్శకుడు కాగా చిన్న కొడుకు రవికృష్ణ మాత్రం నటుడిగా మారాడు. పైన కనిపిస్తున్నది అతడే. 7జీ బృందావన కాలనీ మూవీతో అప్పట్లో అద్భుతమైన సక్సెస్ అందుకున్న రవికృష్ణ.. తర్వాతి కాలంలో అరడజనుకి పైగా చిత్రాలు చేసినప్పటికీ హిట్స్ కొట్టలేకపోయాడు. చివరగా 2011లో ఓ తమిళ సినిమా చేసిన ఇతడు.. ప్రస్తుతం 7జీ బృందావన కాలనీ సీక్వెల్ అయిన '7జీ రెయిన్ బో కాలనీ 2' చేస్తున్నాడు.మలయాళ నటి అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్ కాగా తొలి పార్ట్ తీసిన సెల్వ రాఘవన్.. దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కమెడియన్ సుమన్ శెట్టి కూడా ఇందులో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్లో భాగంగానే దియా మెర్సి అనే నటి, రవికృష్ణతో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిని చూస్తే రవికృష్ణ ఎంతలా మారిపోయాడో అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఇతడికి 21 ఏళ్ల వయసున్నప్పుడు 7జీ మూవీ వచ్చింది. ఇప్పుడు 43 ఏళ్ల వయసులో దీనికి సీక్వెల్ చేస్తుండటం విశేషం.రవికృష్ణ సోదరుడు జ్యోతికృష్ణ విషయానికొస్తే.. దర్శకుడిగా ఆరు మూవీస్ చేశాడు. క్రిష్ బయటకొచ్చేసిన తర్వాత 'హరిహర వీరమల్లు' మిగిలిన భాగానికి దర్శకత్వం చేశాడు. కానీ ఈ మూవీ ఘోరమైన ఫ్లాప్ అయ్యేసరికి కనుమరుగైపోయాడు.(ఇదీ చదవండి: సరికొత్త 'స్పైడర్ మ్యాన్' సినిమా ట్రైలర్ రిలీజ్) -
బాపు బొమ్మలా సమంత.. మీనాక్షి సోయగాలు
బాపు బొమ్మలా మెరిసిపోతున్న సమంతకూర్చుని క్యూట్ పోజులిచ్చిన మీనాక్షి చౌదరిరెడ్ డ్రస్లో గ్లామరస్గా బ్యూటీ అషూరెడ్డిమెగా డాటర్ నిహారిక లేటెస్ట్ స్టిల్స్గోవాలో షూటింగ్ బిజీలో బిగ్బాస్ దివిఇండోనేసియా ట్రిప్లో రాయ్ లక్ష్మీ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
కల్లు తాగుతూ టాలీవుడ్ తారల చిల్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హేమ, సురేఖవాణి ముందువరుసలో ఉంటారు. పలు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. ఎప్పుడు సినిమా వర్క్ లైఫ్లో బిజీగా ఉండే వీరిద్దరు సమ్మర్లో చిల్ అవుతూ కనిపించారు.తాజాగా ఓ గ్రామానికి వెళ్లిన హేమ, సురేఖవాణి ఫుల్గా చిల్ అయ్యారు. ఈత చెట్టు నుంచి కల్లు తీస్తూ కనిపించారు. ఇద్దరు కలిసి సరదాగా కల్లు తాగుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
తిలక్ వర్మకు గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. అదేంటంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రైరై రారా అంటూ సాంగ్స్ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా పెద్ది మూవీ సెట్స్లో వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. మూవీ షూటింగ్ సెట్స్కు వెళ్లిన తిలక్ వర్మ.. రామ్ చరణ్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు రామ్ చరణ్ ఓ బ్యాట్ను గిఫ్ట్గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్లో వాడిన పాత బ్యాట్ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. అంతేకాకుండా వరల్డ్ కప్లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పెద్ది మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. T20 World Cup champion @TilakV9 visited the sets of #Peddi ❤🔥He caught a glimpse of the film’s sports sequences and was thoroughly impressed.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/Csyce4KCNH— Vriddhi Cinemas (@vriddhicinemas) March 18, 2026 -
'ఒత్తిడిలో మెడిసిన్లా ఈ సినిమా..' డైరెక్టర్పై నాగార్జున ప్రశంసలు
మేడ్ ఇన్ కొరియా మూవీపై టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్ఏ కార్తీక్ను అభినందించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశానని.. పూర్తిగా అస్వాదించానంటూ ట్వీట్ చేశారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్గా పనిచేస్తుందని నాగ్ కొనియాడారు. ఈ సినిమాలో మెప్పించిన ప్రియాంక మోహన్ను ప్రత్యేకంగా అభినందించారు.కొరియన్ కాన్సెప్ట్తో తీసిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో నంబర్వన్గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రశంసించారు. Congratulations to my director @Rakarthik_dir for this uplifting film feel good #MadeinKorea on Netflix!! Totally enjoyed it 😊the right medicine for these stressful times💐 special shout out to @priyankaamohan https://t.co/vV5Kqa3Pdq— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2026 -
'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్
'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.(ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు)'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అయ్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)🙏🧿♥️#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @ranveersingh @rampal72 @duttsanjay @actormaddy #AkshayeKhanna @saraarjunn @therakeshbedi @adityadharfilms #JyotiDeshpande @dhar_lokesh… pic.twitter.com/wgO61vrUUQ— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026 -
'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో పావుగా వాడుకునే వస్తువులు కాదని ట్వీట్ చేశారు. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయన్నారు. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను శక్తిగా గౌరవిస్తామని రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల కోసం అవమానించేలా ఉండకూడదని పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.విజయ్- త్రిష ఎపిసోడ్పైనే..ఇటీవల కోలీవుడ్లో విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Reading about the political campaigns in my Tamil Nadu. Felt It’s in extremely poor taste to drag actresses into political narratives. Not just in TN but anywhere. Actors are not political punching bags. They are individuals with families, dignity, and a life beyond the…— Vishnu Manchu (@iVishnuManchu) March 17, 2026 -
'యూత్' ట్రైలర్: హీరో వెనక పడుతున్న ముగ్గురమ్మాయిలు
తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్. ఈ మూవీకి కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా సంగీతం అందించాడు. ఇటీవలే తమిళ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా యూత్ తెలుగు ట్రైలర్ వదిలారు. యూత్ తెలుగు ట్రైలర్'మీకు పుట్టినవాడు సాధారణమైన అబ్బాయి కాదు మేడమ్.. ఆ దేవుడే మీకు బిడ్డగా పుట్టాడు. వాడిని బ్యాడ్ బాయ్స్తో చేరనివ్వకండి' అన్న సంభాషణతో వీడియో మొదలవుతుంది. తీరా హీరో.. తనను ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెగ సంబరపడిపోతాడు. ఫైటింగ్, లవ్, కామెడీకి ఏమాత్రం కొదవ లేనట్లుగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. -
'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిలో 'ధురంధర్' ఒకటి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబరులో రిలీజయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలీదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ రెడీ చేశారు. ఈ రోజే(మార్చి 18) ప్రీమియర్ షోలు పడనుండగా.. రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్లో ఏం జరగొచ్చనేది చూద్దాం.'ధురంధర్' పూర్తి స్టోరీ30 డిసెంబరు 1999, అఫ్గానిస్తాన్లోని కాందహార్ ఎయిర్పోర్ట్లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్లు.. ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులు రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలం అనే దగ్గర నుంచి కేవలం ముగ్గురిని విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్).. విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్లలో ఒకడు.. మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యాల్తో దారుణంగా మాట్లాడుతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుబెట్టేందుకు 'ధురంధర్' అనే మిషన్ ఉందని అజయ్ సన్యాల్.. విదేశాంగ శాఖమంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైమ్ తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.కట్ చేస్తే 13 డిసెంబరు 2001లో పార్లమెంట్పై దాడి జరుగుతుంది. కాందహార్ హైజాక్లో భాగమైన ఓ టెరర్రిస్ట్.. దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్లంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయింది. సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్యాల్ చెప్పిన 'ధురంధర్' ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ మజారీ(రణ్వీర్ సింగ్) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. నేరుగా పాకిస్తాన్కి వెళ్లకుండా ఆఫ్గానిస్తాన్ మీదుగా పాక్లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హంజా.. ఆలం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ ఆలం భాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ.. లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు.లయరీని ఏలుతున్న బాబు డకాయిట్ అక్రమ సంతానం రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా). ఈ విషయం చిన్నప్పుడే రహమాన్కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైర్ బలూచ్ తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు.. ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్ కి డాన్ లా తయారయ్యాడు. రహమాన్ కి ఇద్దరు కొడుకు నయిమ్, ఫైజల్. రహమాన్ అండతో స్థానిక ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్. కానీ రహమాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ముస్లిం మూమెంట్ పార్టీ.. బాబు డకాయిట్, అర్షద్ పప్పు చేతిలో ఉంటుంది. బాబు డకాయిట్ కి పక్షవాతం రావడంతో రహమాన్ ని ఎదుర్కొనేందుకు అర్షద్ తో చేతులు కలుపుతాడు. హంజా.. అక్కడే పనిచేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ రెండు గ్యాంగ్స్ లో ఏదో ఒకదానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్ లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు డకాయిట్ గ్యాంగ్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారాన్ని సదరు ఏజెంట్.. హంజాకి చెబుతాడు.అనుకున్నట్లే ఆ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు-అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రహమాన్ పెద్ద కొడుకు నయిమ్ చనిపోతాడు. ఇతడిని కాపాడి, రహమాన్ గ్యాంగ్లో హంజా చేరాలనేది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకుని రమమాన్కి హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని.. తనని గ్యాంగ్లో చేర్చుకోమంటాడు. అలా రహమాన్ గ్యాంగ్లో హంజా జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్.. రహమాన్కి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా.. ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిట్ని నడిరోడ్డుపై రహమాన్ దారుణంగా చంపుతాడు.2007లో పీఏపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. రహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్ లో ఖనానీ బ్రదర్స్.. రహమాన్ ని కలుస్తారు. వీళ్లలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రహమాన్ కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా.. జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఈలోపు ఖనానీ బ్రదర్స్, మన రూ.500,రూ.1000 నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్ కి తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్, రహమాన్ కలిసేలా ఖనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మేడిన్ అమెరికా, మేడిన్ రష్యా అని ఉండాలని చెబుతాడు. ఇలానే ఎందుకంటే రేప్పొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తాన్ని ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదనేది మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రహమాన్కి రాజకీయంగానూ సాయం చేస్తానని చెప్పడంతో డీల్కి ఓకే చెబుతాడు.ఆ తర్వాత రహమాన్.. ఇక్బాల్కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్నిరోజులకు ముంబైలోని తాజ్ హోటల్లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకున్న హంజా.. రహమాన్ ని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్.. రహమాన్ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రహమాన్ కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా.. జమీల్, ఎస్పీ అస్లాం చౌదరిలతో చేతులు కలిపి చివరకు రహమాన్నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు.రెండో భాగంలో స్టోరీ ఏం ఉండనుంది?మరి రహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హమ్జా ఎలా శాసించాడు? రహమన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు? అతడిని హమ్జా ఏం చేశాడు?అసలు హమ్జా అలియాస్.. జస్కీరాత్ సింగ్ రంగీ.. మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్లాడు? ఏం నేరం చేశాడు? ఇతడినే ఎందుకు గూఢచారిగా పంపించారు?తొలి భాగంలో హమ్జాని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యలీనాకి ఈ విషయం తెలిసిందా?ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్కి హమ్జా దొరికేస్తాడా? రహమాన్ని చంపేందుకు హమ్జాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి.. హమ్జాని ఏమైనా అడ్డుకున్నాడా?స్వయానా అల్లుడే.. భారతీయ గూఢచారి అని జమీల్ కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్.. సీక్వెల్లో కనిపిస్తాడా? లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏమైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నింటికి 'ధురంధర్ 2'లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలి? -
సన్నాఫ్ కింగ్.. బిజినెస్లో రాకింగ్
కోట్లాది మందికి నాగ చైతన్య ఒక నటుడిగానే తెలుసు. కానీ కొంత మందికి మాత్రం ఆయనలో గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడని కూడా తెలుసు. తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్నూ, రాష్ట్ర అవార్డ్ను కూడా అందుకున్న నాగ చైతన్య యువ హీరోల్లో దూసుకుపోతున్న యువహీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు. సీనియర్ హీరోల్లో నాగార్జున సైతం వ్యాపార రంగంలో ముఖ్యంగా రెస్టారెంట్ రంగంలో తనను తాను నిరూపించుకున్న నేపధ్యంలో అందులోనూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నాగ చైతన్య. కుటుంబ సంబంధ పరిశ్రమకు అనుబంధంగా దక్షిణ భారతదేశంలోని అత్యంత అధునాతన సౌండ్ మిక్సింగ్ స్టూడియోలలో ఒకదానిని ఏర్పాటు చేయడం వంటివాటితో పాటు సినిమాకు అవతల కూడా తనదైన వ్యాపార సామ్రాజ్యాన్ని చైతూ నిర్మించుకుంటున్నాడు.టాలీవుడ్ టూ టేస్టీ ఫుడ్...లాక్డౌన్ సమయంలో చాలా మంది నటీనటులు కొత్త కధలు వింటూనో, విభిన్న భాషా చిత్రాలను చూస్తూనో గడిపితే.. నాగ చైతన్య మాత్రం క్లౌడ్ కిచెన్ అనే సరికొత్త కాన్సెప్ట్కి శ్రీకారం చుడుతూ దాని కోసం మెనూలను డిజైన్ చేస్తూ గడిపాడు. జపనీస్ స్ఫూర్తితో ఆయన ప్రారంభించిన క్లౌడ్ కిచెన్ పేరు.. ’షోయు’, నిజానికి ఇది ఒక వ్యాపార ప్రణాళికతో మొదలవ్వలేదు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో చైతూ చేతిలో ఉన్న ఖాళీ సమయంతో మొదలైంది. ‘జపనీస్ వంటకాలంటే నాకు చాలా ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, మొదటగా రుచి చూసేది జపనీస్ వంటకాలే. ఆ రుచిని, ఆ అనుభూతిని ఏదో ఒక విధంగా హైదరాబాద్కు తీసుకురావాలనుకున్నాను,‘ అని ఆయన గుర్తు చేసుకున్నాడు. తన అభిరుచికి అనుగుణంగా మొదట ఆయన ఒక జపనీస్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసినా కరోనా మహమ్మారి కొత్త ఆలోచనలు అందించింది. డైనింగ్ రూమ్లు మూతపడటం, డెలివరీ యాప్లు విపరీతంగా పెరగడం అనే సంక్షోభం నుంచి ఆయన క్లౌడ్ కిచెన్. అనే ఒక కొత్త అవకాశాన్ని గుర్తించాడు. ‘రెస్టారెంట్లో వడ్డించినట్లుగా ఆహారాన్ని చక్కగా ప్యాక్ చేసి ఇంటికి పంపే క్లౌడ్ కిచెన్ కు మన మార్కెట్లో మంచి స్కోప్ ఉందని గమనించాడు. వినియోగదారుడి ఇంటికి ఆర్డర్ చేసిన ఫుడ్ సరైన విధంగా చేరేలా చూసుకోవడానికి ప్రత్యేకమైన క్రమశిక్షణ కావాలి ‘క్లౌడ్ కిచెన్ లో క్లయింట్ ఏమీ చూడలేరు. ఓ ప్యాకెట్ డెలివరీ బాయ్ ద్వరా తన ఇంటికి రావడం మాత్రమే జరుగుతుంది. అంతా ఆహారం మాత్రమే చెప్పాలి. అక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడదు.‘ అని చైతన్య అంటున్నాడు. కొత్త వంటకాలను తయారు చేస్తున్నప్పుడు, వాటిని మొదటగా రుచి చూసేది నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాలే. ‘ఇంట్లో, ఫుడ్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు నేను కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటే, శోభిత ఆ వంటకాలను రుచి చూస్తూ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది,‘ అని ఆయన చెప్పాడు. మెనూలను తీర్చిదిద్దడంలో ఆమె సలహాలు కూడా ఒక భాగమని ఆయన వివరిస్తారు. ‘ఈ విషయంలో కుటుంబం నాకు గొప్ప మద్దతుగా నిలుస్తోంది..‘అంటాడు చైతూ.తొలి బ్రాండ్ షోయు మంచి సక్సెస్ కావడంతో రెండవ బ్రాండ్ అయిన స్కూజీ కూడా దూసుకొచ్చింది. తొలి బ్రాండ్కు శోభిత ఫ్యాన్ అయితే చైతూ తండ్రి నాగార్జున రెండ బ్రాండ్కి ఫ్యాన్గా మారారు. తన తండ్రి తమ పిజ్జాలకు వీరాభిమాని అని చైతూ సంతోషంగా చెబుతాడు. అలా నాగచైతన్య స్థాపించిన షోయు శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్లోని అవుట్లెట్, ఎయిర్పోర్ట్ అవుట్లెట్కు అదనంగా, బెంగళూరు ఢిల్లీలో కూడా క్లౌడ్ కిచెన్ లను ఏర్పాటు చేసింది.. బ్రెడ్ చీజ్ ఆధారంగా రూపొందించిన కంఫర్ట్ ఫుడ్ బ్రాండ్ అయిన స్కూజీ, కూడా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. వచ్చే జూలై నెలలో మాదాపూర్లో ఒక పూర్తి స్థాయి కేఫ్ ప్రారంభం కానుంది. ఈ రెండు బ్రాండ్లు ఇప్పటికే స్వయం సమృద్ధిని సాధించడం విశేషం.నాటి స్కూల్ డేస్ నుంచి నేటి రేసింగ్ లీగ్ దాకా..ఎందుకో సరిగ్గా తెలియకపోయినా చెన్నైలోని సర్క్యూట్లలో వేగంగా దూసుకుపోయే కార్లను, నాడు స్కూల్ విద్యార్థి గా చైతూ ఆసక్తిగా చూసేవాడు. ‘‘చాలా చిన్నప్పటి నుంచే రేసింగ్ నా హాబీగా ఉంది. నా స్కూల్ రోజుల్లో, దాదాపు ప్రతి వారాంతం శ్రీ పెరంబుదూర్ రేస్ట్రాక్కు వెళ్లి స్థానిక జాతీయ ఛాంపియన్ షిప్లను చూసేవాడిని. రేసింగ్ పట్ల ఇష్టం అక్కడి నుంచే వచ్చింది.’’అంటూ గుర్తు చేసుకుంటాడు.ఆ చిన్ననాటి వారాంతపు అభిరుచి ఇప్పుడు ఓ ట్రాక్ వైపు దారితీసింది. ఇప్పుడు ఇండియన్ రేసింగ్ లీగ్లోని హైదరాబాద్ బ్లాక్బర్డ్స్కు నాగ చైతన్య సహ–యజమానిగా మారేలా చేసింది. ఈ ఓపెన్ సీటర్ ఫార్ములా కార్లతో మోటార్స్పోర్ట్ను ఇంత దగ్గరగా చూడటం దాదాపు ఒక కల నిజమైనట్లుగా ఉంది. స్ట్రీట్ సర్క్యూట్ ఫార్మాటే ఈ లీగ్ను ప్రత్యేకంగా నిలుపుతుందని ఆంటాడు చైతూ.సినిమా అనేది తనను మేల్కొలిపే పలు అంశాలలో ఒకటి మాత్రమేనని చైతూ చెబుతున్నాడు. ‘‘చేస్తున్న ప్రతి పనిలో, పాలుపంచుకున్న ప్రతి చోట, సృజనాత్మకంగా ఉత్తేజితుడనవుతాను. అదే నన్ను సంతోషంగా ఉంచుతుంది, నన్ను ముందుకు నడిపిస్తుంది. మీరు నిజంగా ఆనందించే పనులు చేస్తున్నప్పుడు, ఇక ఏ సమస్య లేదు’’ అని అంటాడీ యంగ్ బిజినెస్ లీడర్.తనలాగే ఒకే కెరీర్కు మించి ఏదైనా నిర్మించాలనుకునే యువ అభిమానులకు ఆయన ఇచ్చే సలహా... ‘రాత్రికి రాత్రే ఫలితాలు రావాలని లక్ష్యంగా పెట్టుకోవద్దు. మంచి విషయాలన్నింటికీ సమయం పడుతుంది. మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలానికి ప్రణాళిక వేసుకోండి. విజయానికి చిన్న చిన్న అడుగులు వేయాలి. షార్ట్కట్స్ వెతకడానికి ప్రయత్నించవద్దు. నిజమైన సహజమైన మార్గాన్ని ఎంచుకోండి.‘ అని. -
సైలెంట్గా వస్తారు.. స్పెషల్గా ఉండిపోతారు: రవికృష్ణ
చెన్నైలో ఓ సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన రవికృష్ణ తర్వాత నటుడిగా మారాడు. మొగలి రేకులు సీరియల్తో నటుడిగా సెన్సేషన్ అయ్యాడు. అనంతరం బిగ్బాస్ షోతో గుర్తింపు పొందాడు. ఈ షో తర్వాత సినిమా ఛాన్సులు ట్రై చేశాడు. పలు చిత్రాల్లో నటించాడు. విరూపాక్ష సినిమాతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. లవ్ మీ: ఇఫ్ యు డేర్, దండోరా.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ప్రేమలో..విజయవాడకు చెందిన ఇతడు ఆమె కథ అనే సీరియల్ చేస్తున్న సమయంలో నటి నవ్య స్వామితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఏ షోకి వెళ్లినా జంటగా కలిసే వెళ్లేవారు. అయితే ప్రేమలో ఉన్నామని మాత్రం ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ నవ్య బర్త్డే రోజు మాత్రం తనతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ ఇస్తుంటాడు. మంగళవారం (మార్చి 17న) నవ్య బర్త్డే. మనకు తెలియకుండానే స్పెషల్ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన రెండు పిక్స్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఓయ్ స్వామి.. హ్యాపీ బర్త్డే. ఇలాగే క్రేజీగా, అందంగా జ్ఞాపకాలను కూడబెట్టుకుంటూ ఉండాలి. కొందరు మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు. కానీ, మనకు తెలియకుండానే ఎంతో ప్రత్యేకంగా మారిపోతారు. అలాంటి అరుదైనవారి జాబితాలో నువ్వు కూడా ఒకదానివి! అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని అడుగుతున్నారు. విజయ్-రష్మిక జోడీలాగే మీ జంట కూడా అద్భుతంగా ఉంటుందని, త్వరగా వివాహం చేసుకోమని కోరుతున్నారు. View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) చదవండి: పీలింగ్స్ చూశారు.. దీనికేమైందని అంత రాద్ధాంతం?: నటి -
ఈ స్థాయికి హ్యాపీ: రాశీ ఖన్నా
‘‘చిత్ర పరిశ్రమలో నాకెలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పటికీ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను? అన్నది చూసుకుంటే సంతోషంగా ఉంటుంది. దాదాపు 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా చెప్పా రు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నా పాత్ర పేరు శ్లోక. చాలా మోడ్రన్ అమ్మాయి. మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీలో నాకు ఒక మాస్ సాంగ్ ఉంది.నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ పాట చిత్రీకరణని చాలా ఎంజాయ్ చేశాను. తెలుగువారి పండగైన ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వస్తోంది. ఈ మూవీ చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి థియేటర్లో చూడొచ్చు. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్గారితో ఒక సినిమా, అలాగే ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్ సిరీస్లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్లో ‘రౌడీ అండ్ కో’ మూవీలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కథలు వింటున్నాను’’ అని చెప్పా రు. -
చీరలో ఈషా ఇలా.. నభా నటేశ్ అలా
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈషా రెబ్బానాభి అందాలతో హీరోయిన్ నయన సారికఅందాలతో మాయ చేస్తున్న నభా నటేశ్గ్లామర్ డోస్ పెంచేసిన యాంకర్ శ్రీముఖిబ్లాక్ చీరలో రచ్చ లేపుతున్న సోనాల్ చౌహాన్'ఉస్తాద్..' ఈవెంట్ కోసం రాశీఖన్నా ఇలా View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా అనౌన్స్మెంట్ మొదలు రిలీజ్ వరకు అన్నింట్లోనూ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఇక హీరో-డైరెక్టర్, హీరో, హీరోయిన్ల కాంబినేషన్ విషయంలోనూ సెంటిమెంట్ చూస్తుంటారు. ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్కి ఎవరినైనా గెస్ట్గా పిలవాలంటే.. దానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఫలానా హీరో ప్రీరిలీజ్ ఈవెంట్కి వస్తే సినిమా హిట్ అవుతుందని నమ్మే దర్శకనిర్మాతలు చాలానే ఉన్నారు. ఇదంతా పాజిటివ్ సెంటిమెంట్. ఇదే ఇండస్త్రీలో నెగెటివ్ సెంటిమెంట్ కూడా ఉంది. పలాన హీరో.. పలానా దర్శకుడితో సినిమా తీస్తే ఫ్లాప్ గ్యారెంటీ.. ఆ ఇద్దరు స్టార్స్ రెండోసారి కలిస్తే.. అపజయం తప్పదు అనే నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు ఎక్కువగా ఈ నెగెటివ్ సెంటిమెంట్లను నమ్ముతుంటారు. కొన్ని సందర్భాలలో వారి నమ్మకం నిజం అవుతుంటాయి కూడా. ఇప్పుడు ఇలాంటి ఒక బ్యాడ్ సెంటిమెంట్ పవన్ కల్యాణ్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. అదేంటో చదివేయండి..రెండోసారి ఫ్లాప్పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక డైరెక్టర్తో రెండో సినిమా తీస్తే ప్లాప్ గ్యారెంటీ. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మినహా..ఆయన కెరీర్ మొత్తంలో రెండోసారి సినిమా చేసిన దర్శకులందరికీ అపజయమే ఎదురైంది. పవన్ కల్యాణ్కి ‘తొలిప్రేమ’తో తొలి హిట్ అందించిన దర్శకుడు కరుణాకరన్. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాలు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అలాగే ‘సుస్వాగతం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు కాంబినేషన్లో వచ్చిన ‘అన్నవరం’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.పవన్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘బద్రి’ సూపర్ హిట్ అయితే.. రెండో చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ డిజాస్టర్ అయింది. ‘ఖుషీ’ తర్వాత ఎస్ జే సూర్య దర్శకత్వంలో నటించిన ‘కొమరం పులి’ సినిమా కూడా ప్లాప్ అయింది. కిషోర్ పార్ధసాని (డాలీ), పవన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘గోపాల గోపాల’ ఓ మోస్తరు విజయం సాధిస్తే.. ‘కాటమ రాయుడు’ డిజాస్టర్గా నిలిచింది. త్రివిక్రమ్ ఒక్కడే.. పవన్తో రెండోసారి సినిమా తీసిన దర్శకులంతా అపజయాలనే అందించారు. ఒక త్రివిక్రమ్ మాత్రం వరుసగా రెండు హిట్లు(జల్సా, అత్తారింటికి దారేది) ఇచ్చాడు. ఇదే జోష్లో ముచ్చటగా మూడో సినిమాగా ‘అజ్ఞాతవాసి’ తీస్తే..అది అతిపెద్ద డిజాస్టర్ అయింది.ఉస్తాద్ రిలీజ్..టెన్షన్లో ఫ్యాన్స్ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ చూసే పవన్ అభిమానులు భయపడుతున్నారు. హరీశ్ శంకర్- పవన్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh). అంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్సింగ్’బ్లాక్ బస్టర్ అయింది. సెంటిమెంట్ ప్రకారం చూస్తే.. మార్చి 19న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫ్లాప్ కావాలి. ఇప్పుడు అదే అభిమానులను కలవర పెడుతుంది. ఇప్పటీకీ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఈ చిత్రానికి పోటీగా వస్తున్న ‘ధురంధర్ 2’ బుకింగ్స్ విషయంలో దూసుకెళ్తుంది. ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్కు మిశ్రమ స్పందన రావడం.. బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి సెంటిమెంట్ ప్రకారం సినిమా ప్లాప్ అవుతుందా లేదా సెంటిమెంట్ని బద్దలు కొట్టి హిట్ అవుతుందా అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. -
చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!
టాలీవుడ్ దర్శకుల్లో చాలామందికి చిరంజీవితో సినిమా చేయాలని ఆశ. కానీ ఎప్పటికప్పుడు చిరంజీవి మూవీస్ లైనప్ మారిపోతూనే ఉంది. ప్రస్తుతానికైతే యంగ్ డైరెక్టర్స్కే ఎక్కువగా అవకాశమిస్తున్నారు. సంక్రాంతికి అనిల్ రావిపూడితో వచ్చి హిట్ కొట్టారు. 'విశ్వంభర' కోసం వశిష్ఠతో పనిచేశారు. ప్రస్తుతం బాబీతో, శ్రీకాంత్ ఓదెలతో తలో ప్రాజెక్ట్ చేయనున్నారు. తర్వాత ఎవరితో చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు హరీశ్ శంకర్.. చిరుతో మూవీ చేయాలని ఆశపడుతున్నాడు.(ఇదీ చదవండి: రిలీజ్కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!)పవన్తో కలిసి గతంలో 'గబ్బర్ సింగ్' చేసి బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న హరీశ్ శంకర్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' చేశాడు. ఈ గురువారమే సినిమా థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగానే చిరంజీవితో మూవీ చేయడం గురించి హరీశ్ శంకర్ మాట్లాడాడు. రౌడీ అల్లుడు, దొంగ మొగడు లాంటి ఎంటర్టైనర్ తీయాలని ఉందంటూ తన ఆశని బయటపెట్టాడు.'ఈ (ఉస్తాద్ భగత్ సింగ్) ట్రైలర్ చూసి చిరంజీవి నాతో 20 నిమిషాలు మాట్లాడారు. డైలాగ్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు. పవన్ అందంగా ఉన్నారని చెప్పారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు కొడుకు కూడా అనిపించింది. నేను చిరంజీవిని చాలాసార్లు కలిశాను. కలిసి కొన్ని యాడ్స్ కూడా తీశాను. ఆయనతో నా మూవీ ప్రాసెస్లో ఉంది. కచ్చితంగా మెగాస్టార్తో గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమా చేసి తీరతాను' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.హరీశ్ శంకర్ చెప్పడం వరకు బాగానే ఉంది గానీ చిరంజీవి యస్ చెబతారా అనేది ప్రశ్న. ఎందుకంటే హరీశ్ శంకర్ దర్శకుడిగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ లేవు. అప్పుడెప్పుడో వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రమే పెద్ద హిట్. తర్వాత చేసిన వాటిలో ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర ఓకే ఓకే అనిపించాయి. గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. 'ఉస్తాద్' సంగతేంటనేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. ఇది హిట్ అయి, హరీశ్ శంకర్ ఆశ నిజమవుతుందో లేదో చూడాలి? ఎందుకంటే గతంలోనే చిరు-హరీశ్ మూవీ అంటూ రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!) -
త్వరలోనే విజయ్తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!
టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం.. ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు. అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.అలా హింట్ ఇచ్చిందా?త్రిష,విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా విజయ్ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దీంతో విజయ్తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ..ఆమె లైక్ కొట్టిన పోస్ట్ని వైరల్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత పెళ్లివిజయ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. -
సినీ నటీనటులు వెబ్సిరీస్ల్లో నటించకూడదు
తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా తమిళ సినీ నిర్మాతల మండలి ఇటీవల చైన్నెలో సమావేశమైంది. తమిళ సినీ యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు టీజీ త్యాగరాజన్, తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం, తమిళనాడు సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు ఆరుళ్పతి ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా ‘‘ నటీనటులు గానీ, దర్శకులు, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు ఓ నిర్మాత నుంచి అడ్వాన్స్ పొంది ఉంటే ముందుగా ఆయన చిత్రాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత నివ్వాలి. సినిమాల్లో నటించే నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం వెబ్ సిరీస్లో నటించడం గానీ, దర్శకత్వం వహించడం గానీ చేయరాదని తీర్మానించారు. అలా కాని పక్షంలో వారికి సినిమాల్లో పనిచేయడానికి సహకరించబోమని స్పష్టం చేశారు. ప్రముఖ నటులు రెవెన్యూ షేర్ విధానంలో చిత్రాల్లో నటించడానికి సహకరించాలి. చిత్రాలు విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఈ విధానాన్ని తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ అమలు పరిచేలా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. ఈ తీర్మానాన్ని అమలు పరచడానికి డిస్టిబూటర్లు, థియేటర్లతో కలిపి ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు కట్టుబడి ఉండాలని తీర్మానం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు స్పష్టం చేశారు. -
నటనా ‘కోట’కు ఆస్కార్ నీరాజనం
కంకిపాడు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీనటుడు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. తన హావభావాలు, నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, తనకంటూ సినీ జగత్తులో కొన్ని పేజీలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన నటనకు మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తికాదు. సోమవారం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ సభలో ఇటీవల మరణించిన భారతదేశ సినీరంగ ప్రముఖులను స్మరించుకున్న నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కోట శ్రీనివాసరావును స్మరించటం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించొచ్చు. కంకిపాడు నుంచే అన్నీ.. గతేడాది జూలైలో కోట శ్రీనివాసరావు ఆకస్మికంగా మృతి చెందటం కళాభిమానులను కలచివేసింది. అయితే ఆస్కార్ వేదికగా దక్కిన అరుదైన గౌరవానికి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కోట పుట్టింది, పెరిగింది, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది కంకిపాడు నుంచే. చిన్న నాటి నుంచి ఇక్కడి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. పట్టణంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వస్థలం ఉంది. ఇక్కడే ఆయన నివాసం కూడా ఉంది. కోట తండ్రి సీతారామాంజనేయులు లాకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటరులోని ఓ ఇంటి వద్ద వైద్యుడిగా క్లినిక్ నడిపేవారు. వైద్యుడిగా అందరికీ సుపరిచితులు. కోట శ్రీనివాసరావు ఆయన సోదరులు నరసింహారావు, శంకర్రావు నాటకరంగం నుంచి సినీరంగం వరకూ ఎదిగి అందరి మన్ననలు పొందటం తెలిసిందే. స్థానికంగా ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను అభ్యసించిన కోట.. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. కంకిపాడు, విజయవాడ, హైదరాబాద్లోని ఎస్బీఐ బ్రాంచిల్లో ఉద్యోగిగా పనిచేస్తూ సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలి నాళ్లలో నాటకరంగంలో ప్రవేశించినా.. అంతటి ప్రాచుర్యం దక్కలేదు. అయితే సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించారు. ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించి గౌరవించారు. అరుదైన గౌరవం.. కోట సీతారామంజనేయులు కుటుంబం అందరికీ సుపరిచితం. తండ్రి వైద్య రంగంలో, కుమారులు కళారంగానికి వన్నె తెచ్చారు. మా ఇంటి పక్కనే నివాసం ఉండే వారు. వీలు దొరికినప్పుడల్లా ఆ కుటుంబంతో గడిపేవాళ్లం. ఆయన మరణం చాలా బాధించింది. అయితే ఆస్కార్ వేదికగా మా కంకిపాడు వాసికి గౌరవం దక్కటం సంతోషంగా ఉంది. – గాదంశెట్టి పరమేశ్వరరావు, కంకిపాడుసమయం చిక్కినప్పుడల్లా.. కోట ఎంత బిజీగా ఉన్నా.. ఏ కొంత సమయం చిక్కినా కంకిపాడుకు వచ్చేవారు. ఆయన స్వస్థలంలో ఉన్న నివాసానికి వచ్చి గ్రామస్తులతో ఇష్టాగోష్టి జరిపేవారు. సినీ అభిమానులు ఆయన్ను కలుసుకుని ఆశీర్వాదం పొందేవారు. కళారంగానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కళాభిమానుల్ని ప్రోత్సహించేవారు. -
పెళ్లి పీటలెక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?
అరుంధతి మూవీతో జేజమ్మగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న బ్యూటీ అనుష్క శెట్టి. ఆ తర్వాత బాహుబలి మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ప్రభాస్ సరసన నటించిన ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే అప్పుడప్పుడు వీరిద్దరిపై పెళ్లి రూమర్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ బోలెడు కథనాలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్గానే మిగిలిపోయాయి.తాజాగా ఈ స్వీటీ అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఓ బిజినెస్మెన్ను పెళ్లాడనుందని సమాచారం. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్న అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అబ్బాయి కన్నడ కుటుంబానికి చెందినవారని.. వీరిద్దరి వివాహ నిశ్చయానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో అనుష్క పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది ఘాటీ మూవీతో అభిమానులను మెప్పించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే భారీ బడ్జెట్ సినిమాలో అనుష్క నటిస్తున్నారు. -
'ఎవరికైనా అమ్మాయే టార్గెట్.. తన బాధ ఎవరికీ పట్టదు'.. రీతూ చౌదరి షాకింగ్ పోస్ట్
బిగ్బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. గతేడాది బిగ్బాస్ సీజన్లో మెరిసింది. అయితే ఈ సీజన్లో మరో కంటెస్టెంట్ డీమాన్ పవన్తో కాస్తా సన్నిహితంగా మెలగడంతో డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అయితే వీటిపై ఎవరూ కూడా స్పందించలేదు. తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. అమ్మాయిల జీవితం ఇంతేనంటూ తన లైఫ్లో జరిగిన బాధను వ్యక్తం చేసింది.ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉన్న రీతూ.. రెండేళ్ల క్రితం శ్రీకాంత్ అనే ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. తాజాగా అమ్మాయిల లైఫ్ గురించి పోస్ట్ చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.రీతూ చౌదరి తన స్టోరీలో రాస్తూ.. "ఈ సమాజం అమ్మాయిలను సులభంగా జడ్జ్ చేస్తారు. ఆమెకు గతంలో ఏం జరిగిందో ఎవరూ అడగరు. తన ప్రేమ, కేరింగ్, నిజాయతీ గురించి ఎవరికీ అక్కర్లేదు. కానీ చివరకు మోసపోయేది ఒక అమ్మాయే. రిలేషన్ షిప్ బ్రేకప్, డిప్రెషన్లో ఉన్న తన ఫ్యామిలీ కోసం, కెరీర్ కోసం నవ్వుతూ ఉంటుుంది. కానీ సమాజం తన బాధని చూడదు. అందరూ రూమర్స్, ఆరోపణలే చూస్తారు. నిజం ఏంటో తెలియకుండా అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ తను అమాయకురాలు అయితే ఎందుకు సైలెంట్గా ఉంది అంటారు' అని ఆవేదన వ్యక్తం చేసింది.'ఒక అమ్మాయి హార్ట్ బ్రేకప్ చేసి ఆ అబ్బాయి ముందుకు వెళ్లిపోతాడు. అతను చాలా ఈజీగా మరో అమ్మాయితో వెళ్లిపోతాడు. అన్ని తెలిసినా కూడా సైలెంట్గానే ఉంటుంది ఆ అమ్మాయి. కొన్ని సందర్భాల్లో స్నేహం కూడా ఆయధంగా మారింది. ఒక అమ్మాయి డబ్బు కోసం, చీప్ అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేస్తుంది. సమాజం ముందు బ్యాడ్ చేసింది. ఒక అమ్మాయి మరో అమ్మాయిని నాశనం చేస్తుందని తెలిసినా కూడా ఆ అమ్మాయి సైలెంట్గానే ఉంటుంది. అది తన బలహీనత కాదు..అదంతా తన కర్మ అని.. దేవుడిని నమ్ముతుంది. తన గురించి నిజాలు తెలియని ఈ సమాజం జడ్జ్ చేస్తున్నా కూడా సైలెంట్ ఆ బాధని భరిస్తుంది' అంటూ తన స్టోరీలో రాసుకొచ్చింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రీతూ చెప్పింది అంతా తన గురించేనా? అని చర్చించుకుంటున్నారు. అసలు ఆ అబ్బాయి ఎవరు? తనని నెగిటివ్ చేసిన అమ్మాయి ఎవరు? అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్టోరీ తనదేనా లేదంటే తన ఫ్రెండ్ గురించేనా? అనేది తెలియాలంటే రీతూ క్లారిటీ ఇవ్వాల్సిందే. -
'నా జుట్టు రంగు ఇంకా మారలేదు'.. హల్దీ వేడుకపై రష్మిక పోస్ట్
రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఫిబ్రవరి 26న ఈ వివాహా వేడుకలో అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యారు. వీరిద్దరి వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పెళ్లి తర్వాత అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.పెళ్లి తర్వాత రష్మిక తాజాగా మరో పోస్ట్ చేసింది. ఉదయ్పూర్లో జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. హల్దీ ప్లస్ హోలీ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో మేము ఎంతగా తడిసిపోయామో.. ఇప్పటికీ నా జుట్టు రంగు ఇంకా ఎర్రటి రంగులోనే ఉందన్నారు. ఇంతటి మధురమైన క్షణాల వేళ.. నా బ్రైడ్ టీమ్తో కలిసి ఆ రోజు అన్ని ఆటలను గెలిచానంటూ సంతోషం వ్యక్తం చేసింది. అయితే విజ్జూ కూడా ఆ రోజు టీమ్ బ్రైడ్ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. రష్మిక షేర్ చేసిన హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమకథ.. ఆసక్తిగా టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన టీజర్ చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దగా ఉన్న వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడడం ఈ చిత్రం ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. -
విజయ్ జన నాయగన్.. ఈ సారైనా మోక్షం లభించేనా?
కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన చిత్రం జన నాయగన్. రాజకీయల్లో ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. దీంతో ఈ మూవీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరడంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.ఈ మూవీని సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. ఈనెల 9న జరగాల్సిన రివైజింగ్ కమిటీ ప్రదర్శన వాయిదా పడింది. బోర్డ్ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను మార్చి 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ జరుగుతుందని సీబీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరగనుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్కు స్క్రీనింగ్కు సంబంధించి అధికారిక మెయిల్ అందినట్లు తెలుస్తోంది.జన నాయగన్ను జనవరి 9న గ్రాండ్గా విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఈ చిత్రం ఒక వర్గం ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ను నిలిపివేసింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన ఒక సభ్యుడు సైన్యానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ తర్వాత, జన నాయగన్ నిర్మాతలు జనవరి 6న కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ చర్యలతో జన నాయగన్ మేకర్స్, సెన్సార్ బోర్డ్కు మధ్య నెల రోజుల పాటు వివాదం కొనసాగింది. అయితే మూవీ టీమ్ తమ కేసును ఉపసంహరించుకోవడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడానికి సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సందేశాలు ఉన్నందున.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతిస్తుందో లేదో చూడాల్సిందే. -
బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే.. శ్రీనివాస మంగాపురం టీమ్ స్పెషల్ వీడియో
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతో నటి రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మంగ అనే పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఇప్పటికే 'ఉయి అమ్మ' అనే సాంగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇవాళ బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ మూవీ సెట్లో రషా నటన, హవభావాలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అందరూ కలిసి రషాకు హ్యాపీ బర్త్ డే విష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు ఇందులో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్నిచందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. Your smile is simple, but the magic is unforgettable ❤️🔥Happiest Birthday #RashaThadani 💐❤️🤩#SrinivasaMangapuram #JayaKrishnaGhattamaneni @themohanbabu @AshwiniDuttCh @gemini_kiran @gvprakash @CKPicturesoffl @VyjayanthiFilms @SwapnaCinema @AnandiArtsOffl pic.twitter.com/yrDAkbA3Ye— Ajay Bhupathi (@DirAjayBhupathi) March 16, 2026 -
నాలాగా మోసపోకండి.. నటుడి పోస్ట్ వైరల్
ప్రతి మనిషిలోనూ జాలి, కరుణ, దయ అనేది ఉంటుంది. ఇవే ఇప్పుడు మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. సెంటిమెంట్తోనూ ‘కొట్టేస్తున్నారు’. తాజాగా నటుడు, దర్శకుడు దేవీప్రసాద్ కూడా ఇలానే మోసపోయాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ ఓ వ్యక్తి ఫోన్ చేస్తే.. రూ. 6వేలు ట్రాన్స్ఫర్ చేశాడట. ఆ తర్వాత కూడా పదే పదే డబ్బులు అడగడంతో అనుమానంతో ఆరా తీస్తే.. అతనో మోసగాడని తెలిసిందంట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తనలాగా ఇంకెవరు మోసపోవద్దని దేవీప్రసాద్ కోరాడు.అసలేం జరిగింది?గత నెలలో దేవిప్రసాద్కు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ‘నమస్తేసర్. నేను లింగా... గుర్తున్నానా సర్’ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడట. శ్రీరంగనీతులు సినిమాలో మీతో కలిసి నటించాను అంటూ.. సెంటిమెంట్ డ్రామా స్టార్ట్ చేశాడట. ‘ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు సర్.కొన్నిరోజులుగా మలక్పేట యశోదాహాస్పిటల్ లో మా అమ్మగారు సీరియస్గా ఉన్నారు.మా దగ్గర డబ్బులు అయిపోయాయి .ఆరోగ్యశ్రీలాంటి కార్డులేవీలేవు. తెలిసినవాళ్ళు బెంగుళూరు షిఫ్ట్ చేస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తామన్నారు. అంబులెన్స్ కి 16 వేలు అడిగారు.పదివేలు దొరికాయి.6 వేలు తక్కువయ్యింది.టైమ్ లేదుసర్.ఏంచేయాలో అర్ధంకాక మీకు కాల్ చేశాను’ అని దీనంగా అడుగుతూ..ఆక్సిజన్ మాస్క్ఉన్న పెద్దావిడ ఫోటో,హాస్పిటల్లో ఓ ప్రదేశం ఫోటోలు పెట్టడంతో నిజమే అనుకొని దేవీప్రసాద్ రూ. 6 వేలు గూగుల్ పే ద్వారా పంపించారట.అలా దొరికిపోయాడుమరుసటి రోజు కూడా మళ్లీ కాల్ చేసి ఆపరేషన్ కోసం కొంత డబ్బులు కావాలని అడగడంతో దేవీప్రసాద్కి అనుమానం వచ్చిందట. శ్రీరంగనీతులు సినిమాకి పనిచేసినవాళ్ళకు కాల్ చేసి లింగారెడ్డి గురించి అడిగితే.. ఆ పేరుతో ఉన్నవాళ్లెవరు ఈ సినిమాలో పని చేయలేదని చెప్పారట. అంతేకాదు ఆ సినిమా పేరుచెప్పి రెండునెలలక్రితం హీరోని కూడా ఇలానే డబ్బులు అడిగారని చెప్పడంతో దేవికి అసలు విషయం తెలిసిపోయింది. మూడు రోజుల తర్వాత అవే ఫోటోలను పంపించి భాషా అనే నటుడి దగ్గర కూడా అలానే చెప్పాడట. అయితే దేవిప్రసాద్ ద్వారా భాషాకు ముందే అతని గురించి తెలియడంతో లొకేషన్ పెట్టమని అడిగాడట. అతను హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్కి మూడు వీధుల అవతలున్న ఓ లొకేషన్ పెట్టాడట. వెంటనే దేవిప్రసాద్ ఫోన్ చేసి ఇప్పుడెక్కడున్నారు అని అడిగితే బెంగుళూరులో జయదేవ్ హాస్పిటల్లో ఉన్నాం, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పాడట. దీంతో దేవిప్రసాద్ అతనిపై సీరియస్ అయ్యాడట. ఇలా తల్లిసెంటిమెంట్తో తనని మోసం చేశాడని.. తనలాగా ఎవరూ మోసపోవద్దనే ఈ పోస్ట్ పెడుతున్నానంటూ జరిగిన విషయం మొత్తం రాసుకొచ్చాడు. -
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావు ఫోటో.. ఎందుకంటే?
ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు.వెండితెరపై తమదైన నటన, హావభావాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరికి ఘనంగా నివాళులర్పించింది ఆస్కార్ వేదిక. తెలుగు వెండతెరపై దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన కోట శ్రీనివాసరావు గతేడాది జులై 13న మరణించారు. ఆ తర్పాత 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గతేడాది నవంబర్ 24న ఆయన మరణించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్తో సత్కరించింది.అయితే ఆస్కార్ వేడుక ప్రారంభంలో గతేడాది మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు.సినీ రంగానికి వారి సేవలను స్మరించుకుంటూ వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో ధర్మేంద్రను చూపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నెట్టింట అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని.. ఆ తర్వాత అందరి పేర్లను అఫీషియల్ సైట్లో ఉంచామని హాలీవుడ్ మీడియా క్లారిటీ ఇచ్చింది. -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ బాక్సాఫీస్ను షేర్ చేయగా సీక్వెల్గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్లో మాత్రమే కాస్తా బజ్ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20ది రైజ్ ఆఫ్ ది రెడ్హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20 ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20అమెజాన్ ప్రైమ్..ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18ది హౌస్మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20 అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20జీ5..ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19కాసర్గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20జియో హాట్స్టార్..చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20యాపిల్ టీవీ..ఇమ్పర్ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18సోనీ లివ్..జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19సన్ నెక్ట్స్..సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20 -
సల్మాన్ ఖాన్ దేశభక్తి సినిమా పేరు మారింది.. కారణం?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా దేశభక్తి చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’పేరు మారింది. ఈ సినిమాకు‘మాతృభూమి’ అని టైటిల్ మార్చినట్లు సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ప్రకటించారు. అయితే పేరు మార్పుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నట్లు సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ చిత్ర టీజర్ను విడుదల చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. అయితే చైనా మీడియా మాత్రం చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ఆరోపించింది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ పరిణామాల వేళ తాజాగా సినిమా పేరును మార్చడం గమనార్హం. ఆగస్ట్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. May War Rest In Peace #Maatrubhumi@LakhiaApoorva @IChitrangda #HimeshReshammiya #CchintanShah @SKFilmsOfficial @SKF_Music @ShamiraahN pic.twitter.com/8eE4VgNhAK— Salman Khan (@BeingSalmanKhan) March 16, 2026 -
ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్.. అదే ఆయన స్పెషాలిటీ
98వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ నిలిచాడు. సిన్నర్స్ చిత్రంలోని నటనకు ఆయనను ఈ అవార్డు వరించింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వహించిన సిన్నర్స్ చిత్రంలో జోర్డాన్ ద్విపాత్రాభినయంలో కనిపించి కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. ఒకే చిత్రంలో కవలలుగా నటించి ఆస్కార్ గెలుచుకున్న తొలి నటుడిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే, ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆరో నల్లజాతీయుడిగా నిలిచారు.బుల్లితెర టు వెండితెరచిత్ర పరిశ్రమలో రాణించడం అంతా ఈజీ కాదు. స్టార్ హోదా సంపాదించాలంటే చాలానే కష్టపడాలి. ఈ విషయంలో మైఖేల్ బీ జోర్డాన్ సినీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం అని చెప్పాలి. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి..వెండితెరపై రాణిస్తున్నాడు. చిన్నప్పుడు మోడలింగ్తో మొదలుపెట్టి, 'ది వైర్' (The Wire), 'ఫ్రైడే నైట్ లైట్స్' (Friday Night Lights) వంటి టీవీ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో వచ్చిన 'ఫ్రూట్వేల్ స్టేషన్' ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఆస్కార్ గెలిచిన 'సిన్నర్స్' దర్శకుడు ర్యాన్ కూగ్లర్తో ఆయనకు ఇది మొదటి సినిమా. ఇందులో మైఖేల్ నటనకు హాలీవుడ్ ఫిదా అయింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం 'క్రీడ్' చిత్రంతో వచ్చింది. ఇక మార్వెల్ చిత్రం బ్లాక్ పాంథర్ లో ఆయన పోషించిన 'కిల్మాంగర్' పాత్ర హాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది.అదే ఆయన ప్రత్యేకతసామాజిక సందేశాన్నిచ్చే చిత్రాల్లో నటిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఆయన స్పెషల్. హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు. హీరోగా బిజీ ఉన్న సమయంలోనే 'బ్లాక్ పాంథర్’లో విలన్గా నటించాడు.నటుడిగానే కాకుండా దర్శకుడిగాను రాణించాడు. 'క్రీడ్ III' చిత్రంతో ఆయన దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా కథా గమనాన్ని నడిపించడంలోనూ ఆయనది ప్రత్యేక. -
చెప్పీ చెప్పనట్లుగా...
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఎపిక్’ ఒకటి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆదివారం (మార్చి 15) ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ప్రోమోను విడుదల చేశారు.ఈ ప్రోమోలో హీరో తన ఫ్రెండ్స్తో కలిసి లండన్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, ఇండియాలో ఉన్న అతని తల్లిదండ్రులు ఫోన్ చేసి, శుభాకాంక్షలు చెప్పడం చూపించారు. అయితే తండ్రి మాత్రం చెప్పీ చెప్పనట్లుగా కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెçప్పడం కనిపిస్తుంది. ‘బేబీ’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ఇది. -
బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్.. బ్లూ శారీలో త్రిష అందాలు..!
యోగాసనాలు చేస్తోన్న నటి పూనమ్ బజ్వా..బీచ్లో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..ఫ్యామిలీతో అనసూయ వాకింగ్ టైమ్..బిగ్బాస్ దివి లేటేస్ట్ గ్లామరస్ లుక్..బ్లూ శారీలో హీరోయిన్ త్రిష అందాలు... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
బిగ్బాస్ అశ్విని శ్రీకి గాయాలు.. అసలేం జరిగిందంటే?
బిగ్బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ. బిగ్బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్తో అదరగొట్టేసింది. ఈ షో ద్వారా టాలీవుడ్లో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది.తాజాగా అశ్విని శ్రీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన మొహానికి గాయాలైనట్లు వెల్లడించింది. ఉదయాన్నే కుక్కను వాకింగ్కు తీసుకెళ్తుంటే కిందపడ్డానని బిగ్బాస్ బ్యూటీ తెలిపింది. ఇలా గాయాలతో మీ ముందుకు వస్తానని ఎప్పుడు అనుకోలేదని అశ్విని బాధను వ్యక్తం చేసింది. ఫేస్కు తగలడంతో చాలా నొప్పిగా ఉందని తన బాధను పంచుకుంది. మీరంతా నాకోసం ప్రార్థిస్తున్నారని ఆశిస్తున్నా అంటూ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేశారు.నంబర్వన్గా ట్రెండింగ్..ఈనెల 12న స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్వన్గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. #MadeInKorea… Such a Warm, feel-good storytelling with lovely visuals. The small-town innocence of @priyankaamohan’s character stands out.. she delivered a beautiful performance… @Rakarthik_dir keeps it simple and engaging! Congratulations to the entire team 🫶 @NetflixIndia… pic.twitter.com/a3jKrMKep1— Naga Vamsi (@vamsi84) March 15, 2026 -
తమ్ముడి బర్త్ డే.. అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్
ఆనంద్ దేవరకొండ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎపిక్. ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ఈ మూవీలోని ఓ వీడియోను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్తో చేసిన వీడియో ఆనంద్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక వీడియోను అన్న విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ బాయ్ అంటూ తమ్ముడిపై బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతకుముందే రష్మిక సైతం డ్యాన్స్ చేస్తూ ఆనంద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. Happy Birthday to my fav boy ❤️May this year be EPICCCC for all of you 🤗😘#EPIC ~ First Semester#AnandDeverakonda #AdityaHasan @vamsi84 @HeshamAWMusic @Iamvaishnavi04 pic.twitter.com/kY9OfDRDhn— Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2026 -
ఆనంద్ దేవరకొండ బర్త్ డే.. వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్
ఇటీవలే టాలీవుడ్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో ఈ లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారు. ఇరువురి సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే సందడి చేశారు.తాజాగా ఇవాళ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే కావడంతో వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్ తెలిపింది. మరిది ఆనంద్ దేవరకొండతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత ఆనంద్ జరుపుకుంటోన్న తొలి పుట్టనరోజు కావడం మరో విశేషం. A sweet and joyful birthday wish from #RashmikaMandanna to #AnandDeverakonda!🥳🫶#TFNReels #TeluguFilmNagar pic.twitter.com/AOXFsiogYv— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2026 -
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
మలయాళ టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కల్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గతేడాది లోక చాప్టర్ 1 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించింది.కలలో కూడా అనుకోలేఅయితే ఆమె హీరోయిన్ అవడానికి కింగ్ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే సినిమా సెట్కు రావడానికి తనెప్పుడూ ఇష్టపడలేదు. తను ఆర్కిటెక్చర్ చదివింది. ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంది. నాగార్జున ఫోన్ చేయడంతో..కానీ, సడన్గా ఒకసారి నాగార్జున ఫోన్ చేసి కల్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. తనకు నటించడం రాదని చెప్పాను. కానీ నా కూతురు ఒకసారి ట్రై చేస్తే పోలా అంది. ఇక్కడ నేను కోల్పోయేదేం లేదు, నాకు సినిమాలు సెట్టవకపోతే మళ్లీ ఆర్కిటెక్చర్ వైపు వెళ్లిపోతానంది. అలా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తండ్రిగా తన సినీజర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను. తను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదు. సినిమా తప్ప..ఎందుకంటే తను ఇప్పటి జెనరేషన్ అమ్మాయి. ఈతరం వాళ్లు సినిమాను ఒకలా చూస్తారు. నేనేమో పాత స్కూల్కు చెందినవాడిని. మేమిద్దరం సినిమా తప్ప అన్నింటిగురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. కాగా హలో మూవీతో కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే కల్యాణి ప్రియదర్శన్ కూడా కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.చదవండి: దేవుడు నాకిలా రాసిపెట్టాడు: డిమాన్ పవన్ -
అసలు ఈ సుయోధన ఎవడు?.. ఆసక్తిగా టీజర్
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం సుయోధన. ఈ సినిమాకు వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు ఈ స్టోరీ నీకు ఎక్కడ దొరికింది? అనే డైలాగ్తో టీజర్ మొదలైంది. టీజర్ చూస్తుంటే దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
'ఆయన గురించి పవన్ కల్యాణ్కు తెలియకపోయినా..'.. సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్
ప్రముఖ కోలీవుడ్ గేయ రచయిత వైరముత్తుకు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు చెప్పడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ ట్వీట్ చేయడంపై చిన్మయి మండిపడింది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తుకు అభినందనలు చెప్పడంపై చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు.తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంవో ఆఫీస్ నుంచి వైరముత్తుకు అభినందనలు రావడంపై కూడా చిన్మయి స్పందించింది. అసలు పవన్ కల్యాణ్ గారికి ఆ కవి గురించి ఏమీ తెలియదని నాకు కచ్చితంగా తెలుసు.. ఎంతోమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆయనకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం నుంచి అభినందనలు తెలపడం విచిత్రంగా ఉందని ట్వీట్ చేసింది. అసలు ఒక సినిమా పాటల రచయితకు ఇంతమంది రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదంటూ చిన్మయి తన పోస్ట్లో రాసుకొచ్చింది.కాగా.. మీటూ ఉద్యమ సమయంలో ప్రముఖ లిరిసిస్ట్ అయిన వైరముత్తుపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. చిన్మయితో పాటు పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ చిన్మయి తన వాదన వినిపిస్తూనే ఉంది.With due respect - I am pretty sure Pawan Kalyan Garu has no idea about the poet - His office needs to tell him he is wishing "Complete health and happiness" to a molester named by several women.What is the need for so many politicians to wish a film song lyricist, I don't… https://t.co/RuABQDEJ1Z— Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2026 -
దేవుడు నాకిలా రాసిపెట్టాడు: పవన్ ఎమోషనల్
బిగ్బాస్ షోలో కొందరు ఎంత బాగా ఆడినా సరే ఎక్కువ హైలైట్ అవరు. అండర్ రేటెడ్ కంటెస్టెంట్గానే మిగిలిపోతారు. డిమాన్ పవన్ కూడా అదే కోవకి చెందుతాడు. అగ్నిపరీక్షను నెగ్గి తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. కానీ రీతూతో ఫ్రెండ్షిప్ కాస్త హద్దులు దాటడంతో అతడిపై విమర్శలు వచ్చాయి. బిగ్బాస్తో గుర్తింపువీరి లవ్ ట్రాక్ను కొందరు ఇష్టపడితే మరికొందరు అసహ్యించుకున్నారు. ఫలితంగా అతడి లవ్ ట్రాక్ తన కష్టాన్ని కప్పేసింది. మాటల్లో మెచ్యూరిటీ చూపించే అతడు రీతూ ఎలిమినేట్ అయ్యాక ఫుల్ హుషారుగా ఆడటం మొదలుపెట్టాడు. దీంతో సీజన్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. తన తండ్రి టంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ, ఎన్నడూ అది చెప్పి సింపతీ సాధించాలనుకోలేదు.తొలిసారి విమానంఫైనల్స్లో మాత్రం తండ్రి చికిత్స కోసం రూ. 15 లక్షల క్యాష్ప్రైజ్ అందుకుని బయటకు వచ్చాడు. కానీ పవన్ ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవలే పవన్ తండ్రి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. జీవితంలో తొలిసారి విమానం ఎక్కుతున్నట్లు తెలిపాడు. ఇది నా జీవితంలో ఫస్ట్ ఫ్లైట్.. అమ్మానాన్నతో లేదా బెస్ట్ఫ్రెండ్స్తో లేదంటే ఏదైనా ముఖ్యమైన కారణముంటేనే విమానం ఎక్కాలనుకున్నాను. దేవుడు నాకిలా రాసిపెట్టాడుఎందుకంటే అది నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి. దురదృష్టవశాత్తూ మా నాన్నతో నేనెప్పటికీ విమానం ఎక్కలేను. దేవుడు నాకిలా రాసిపెట్టాడు.. మా నాన్న కోసం నేను తొలిసారి ఫ్లైట్ ఎక్కి కాశీ వెళ్లబోతున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకం అని పవన్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) చదవండి: పురుషులే బాధితులా? హీరో భార్య కౌంటర్ -
నభా నటేశ్ నాగబంధం.. నమోరే సాంగ్ రిలీజ్
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధానపాత్రల్లో వస్తోన్న తాజా నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. నమో రే నమోరే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించగా.. జునైద్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరిఆలపించారు. ఈ మూవీని ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన నమో రే పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ ఆధ్యాత్మిక పాటకు వెయ్యి మంది డ్యాన్సర్స్ పాల్గొనగా.. భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్స్తో ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. -
కాళ్లు మొక్కడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
సినీ చిత్రపరిశ్రమలో 50 ఏళ్ల నటజీవితాన్ని ఊహించలేదంటున్నారు విలక్షణ నటుడు మోహన్బాబు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెండేళ్లకే మళ్లీ ఊరిబాట పడతాననుకున్నానని, కానీ సుదీర్ఘకాలంగా నటుడిగా కొనసాగుతున్నానన్నారు. మోహన్బాబు యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. 1975 నవంబర్ 22న నా మొదటి సినిమా స్వర్గం- నరకం విడుదలైంది. 50 ఏళ్లలో..ఏడాదో, రెండేళ్లు ఇక్కడుంటాను.. తర్వాత సినిమాలుండవు, ఊరికెళ్లిపోవాల్సిందే అనుకున్నాను. అలాంటిది 50 ఏళ్లలో 560 సినిమాలు చేశాను. విభిన్న పాత్రలు.. ఒకదాన్ని మించి మరొకటి చేశాను. తల్లిదండ్రులు, భగవంతులు, నన్ను ప్రోత్సహించిన దర్శకనిర్మాతలు, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇదంతా సాధ్యమైంది.అది చూసి ఆశ్చర్యపోతుంటా..విద్యార్థులారా.. మీకన్నీ తెలుసు.. ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? ఎలా బతకాలి? అన్నీ మీకు తెలుసు. మీ వయసులో నేనున్నప్పుడు ఈ కంప్యూటర్లు, సెల్ఫోన్లు లేవు. ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు సెల్ఫోన్లు.. అవి తల్లిదండ్రుల సంపాదనతో కొన్నవే! అది చూసి ఆశ్చర్యపోతుంటాను. ఒక పూట భోజనం చేసి, గంజి తాగి పిల్లల్ని స్కూలుకు పంపుతున్న తల్లిదండ్రులెంతోమంది!ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?అలాంటివాళ్లెందరికో మేము సాయం చేశాం, చేస్తూనే ఉన్నాం. మీరందరూ ఏది మంచిదారి, ఏది చెడుదారి ఆలోచించుకుని ముందుకెళ్లాలి. తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకండి. వారి పాదాలకు నమస్కరించడం తప్ప ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం? కాబట్టి మంచి మార్గంలో ప్రయాణించండి అని విద్యార్థులకు మోహన్బాబు సూచించారు.చదవండి: ఉస్తాద్ కోసం శ్రీలీల అంత పారితోషికం తీసుకుందా? -
‘ఉస్తాద్.. ’ కోసం శ్రీలీల అంత తీసుకుందా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ..ధమాకా చిత్రంతో భారీ హిట్ని ఖాతాలో వేసుకుంది. ఆ చిత్రం రిలీజ్ తర్వాత శ్రీలీలకు వరస అవకాశాలు వచ్చాయి. రామ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రాల్లోనూ నటించింది. దీంతో పాటు పుష్ప 2లో స్పెషల్ సాంగ్కి బన్నీతో స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడే బాలీవుడ్పై కన్నేసింది. అక్కడ కూడా తన టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh)మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీల(Sreeleela)తో పాటు రాఖీ ఖన్నా కూడా మరో హీరోయిన్గా నటించింది. కెరీర్తో తొలిసారి పవన్ కల్యాణ్తో కలిసి నటిస్తుంది ఈ భామ. అయితే ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం పుచ్చుకుందట.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దాని ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల రూ.2.5 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. గత సినిమాలతో పోలిస్తే..ఇది తక్కువే అని చెబుతున్నారు. ఆమె నటించిన ‘జూనియర్’ చిత్రానికి ఏకంగా రూ. 4 కోట్లు తీసుకుందంట. ఇక ధమాకా తర్వాత రవితేజతో కలిసి నటించిన మరో చిత్రం ‘మాస్ జాతర’కు రూ. 3 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మాటే మెసేజ్, జూ.ఎన్టీయార్కు సాటిలేని ఇమేజ్..
జనం మనసుల్ని గెలుచుకున్న సెలబ్రిటీల మాటలకు చాలా విలువ ఏర్పడుతుంది. అయితే ఆ విలువను పెంచుకునేలా మాట్లాడడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. విలువ పెంచుకోవడం మాట దేవుడెరుగు కనీసం తమ వయసుకు, సామాజిక హోదాకు తగ్గట్టుగా కూడా మాట్లాడలేకపోతున్న రోజులవి.. పారేసుకున్న నోరుని,సారీలతో కడుక్కోలేక అవస్థలు పడుతున్న నోటిదూల రాయుళ్ల కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో... తప్పకుండా ప్రస్తావించుకోవాల్సిన టాప్ సెలబ్రిటీ జూనియర్ ఎన్టీయార్.‘‘మహిళల్ని గౌరవించండి అంటూ ఇంకా స్కూల్స్లో కాలేజీల్లో చెప్పడం కాదు... అలాంటివి నేర్పడం ఇంటి దగ్గరే ప్రారంభం కావాలి’’ అంటూ ఆయన ఇటీవల ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారాయన. అంతేకాదు తన పిల్లల్ని మహిళలకు గౌరవం ఇచ్చేలా పెంచుతానని మాట ఇస్తున్నానంటూ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. ఇదొక్కటే కాదు గత కొంత కాలంగా జూ.ఎన్టీయార్ రకరకాల సందర్భాల్లో మాట్లాడిన మాటలు గమనిస్తే నలుగురికి మంచి చెప్పాలనే ఆయన తాపత్రయం కనిపిస్తుంది. #NTRInBengaluruNTR (@tarak9999) shared his heartfelt wishes on #HappyWomensDay and highlighted the invaluable role and importance of women. 👌👏🏻❤️#NTR #Bangalore pic.twitter.com/oq2VVEZmmY— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 8, 2026‘‘ ఆపరేషన్ ధియేటర్లో మృత్యువుతో పోరాడుతున్న రోగి లాంటిది సినిమా విడుదల సమయం.. ఆ రోగి ప్రాణం నిలుస్తుందా లేదా అని సంబంధీకులు అందరూ టెన్షన్ పడుతుంటారు. అలాంటి సమయంలో ఆపరేషన్ కాకుండానే, రోగిని చంపేయకండి’’ అంటూ ఆయన బాధ్యతా రహితంగా రివ్యూలు రాసి పారేసే సినిమా సమీక్షకుల్ని అభ్యర్ధించిన తీరు చాలా మందికి ఎప్పటికీ గుర్తుంటుంది. ఓ సినిమా కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ఈ మాటలు పలువురు రివ్యూయర్లను సూటిగా తాకాయి. అలాగే అరవింద సమేత సినిమా కార్యక్రమంలో ‘జీవితం అంటే కొట్టుకోవడం జీవితం అంటే తిట్టుకోవడం కాదు జీవితం అంటే బతకడం’’ అంటూ మాట్లాడి ఆకట్టుకున్నారు.. ‘‘గెలిచినా ఓడినా..... ఏది జరిగినా పదిమందికీ సమాధానం చెప్పాల్సిందే. మనదైన రోజున గెలుస్తాం కాని రోజున ఓడిపోతాం కానీ ప్రతీ రోజూ ప్రయత్నిస్తూనే ఉండాలి’ అంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాటలివి. ‘‘ప్రకృతితో కలిసి జీవించడం మాత్రమే కాదు దానిని గౌరవించడం కూడా నేర్చుకోవాలి..ఎందుకంటే అది లేకపోతే మనం నథింగ్’’అంటూ ఓ అవార్డ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడిన మాటలు అతిరధ మహారధుల హర్షధ్వానానాలను అందుకున్నాయి.‘‘గొప్ప కల కనడానికి ధైర్యం ఉండాలి దానిని నిజం చేసుకోవడానికి కఠినమైన క్రమశిక్షణ దానితో పాటే భయం కూడా ఉండాలి’’ అంటూ ఓ యువ హీరో చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా అంటాడు యంగ్ టైగర్. ‘‘ నెగిటివిటీ చాలా శక్తివంతమైనది. అది ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుంది. అదే పాజిటివిటీ అలా కాదు చాలా నిదానంగా మనలో పుట్టి పెరుగుతుంది. మన పిల్లల్లాగా మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి’ అంటూ మరో సందర్భంగా చెబుతాడు. ‘‘గెలుపోటములకు ఎవరూ అతీతులు కారు. నువ్వు కిందకు పడితేనే కదా లేవాలని అనుకుంటావు. ప్రతీ చర్యకూ ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఎంత వేగంగా కిందకు పడిపోతే అంతకు రెట్టింపు వేగంతో పైకి లేస్తావు’’ ‘‘విజయం ఆత్మవిశ్వాసం ఇస్తుంది ఓటమి కూడా తర్వాత విజయం సాధిస్తాననే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందుకే జయాపజయాల కన్నా, ఆత్మవిశ్వాసమే ముఖ్యం’’అంటూ ప్రతీ ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే ఆయన ప్రయత్నం అభినందనీయం అనకుండా ఉండగలమా? ‘‘నాలెడ్జ్ అంటే పాఠశాలల్లో , కళాశాలల్లో నేర్పేది కాదు.. అది మనం సంపాదించుకునేది. మన ప్రయాణించే దారిలో చూసిన సంఘటనలు ఎదుర్కున్న ఆటుపోట్లు అందిస్తాయి చూడండి అదే నాలెడ్జ్’’ అంటూ నేర్చుకోవాల్సింది ఏమిటో నేర్పుగా చెబుతాడు.పెద్ద ఎన్టీయార్లాగా తెరపై డైలాగులను దంచడంలో దిట్ట... తెరబయట పదిమంది మంచి కోరి మాట్లాడగల సామర్ధ్యం కూడా జూ. ఎన్టీయార్ స్వంతం. అందుకే ఆయన గత కొంత కాలంగా విభిన్న సందర్భాల్లో మాట్లాడిన మాటలు నెట్టింట్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ‘‘ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండబోవడం లేదు. శాశ్వతంగా ఉండేది మంచి పేరు మాత్రమే’’ అంటూ తరచుగా చెబుతారు జూ.ఎన్టీయార్. ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్కు జనం జై కొడతారు అంతమాత్రానే కళ్లు నెత్తికెక్కి నోరు పారేసుకుంటే అదే జనం ఛీ కొడతారు. తారలు అని కీర్తించినంత మాత్రాన వారు తాము ఉంటున్న ఆకాశం అనుకోకూడదు.. ఇది తమకు వచ్చిన అవకాశం అనుకోవాలి. మంచిగా ఉండేందుకు, ప్రతీ ఒక్కరిలో మంచిని పెంచేందుకు ...మంచి అవకాశం అని భావించాలి. అప్పుడే ప్రతీ సెలబ్రిటీ మాట మంత్రం అవుతుంది. పదిమంది అనుసరించే సూత్రంగా మారుతుంది. -
కొరియాలో కనకరాజు
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ని కొరియాలో ప్రారంభించినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ స్టోరీ టెల్లింగ్, యువీ క్రియేషన్స్–ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది.హారర్, కామెడీ ట్విస్ట్లతో ఇండియన్, కొరియన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ని సౌత్ కొరియాలో ప్రారంభించాం. వారం పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తాం. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనగా కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఈ షూట్ ప్లాన్ చేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని. -
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హోయలు..టాలీవుడ్ భామ విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్..నగలతో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ త్రిష..శారీలో దిల్ రాజు సతీమణి అందాలు..బ్లూ డ్రెస్లో హీరోయిన్ రెజీనా అందాలు.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
'ఆ డైరెక్టర్ తీరు నచ్చలేదు.. నాపై తప్పుడు ప్రచారం'.. లావణ్య త్రిపాఠి
మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్స్ చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్కు గురైనట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లావణ్య తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను ఓ తమిళ సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో దర్శకుడి తీరుతో చాలా అసౌకర్యానికి గురయ్యానని వివరించింది. అందువల్లే ఆ సినిమాకు నేను నో చెప్పేశానని లావణ్య త్రిపాఠి పేర్కొంది.ఆ సమయంలో నాకు ఎవరూ కూడా సపోర్ట్ కూడా లేదని లావణ్య తెలిపింది. ఆ తర్వాత నన్ను టార్గెట్గా చేసి వేధించారని అన్నారు. నాపై కేసు పెట్టడమే కాకుండా.. తప్పుడు కథనాలు కూడా రాసుకొచ్చారని ఆవేదన వ్యక్తం తెలిసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని లావణ్య త్రిపాఠి వివరించింది.లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..'ఒకప్పుడు నేను ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ఆ దర్శకుడి తీరు నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు అక్కడ సౌకర్యంగా లేదని అనిపించింది. అందుకే ఆ సినిమాకు నో అని చెప్పా. ఆ తర్వాత వారు నా గురించి వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలను ప్రచురించడం మొదలుపెట్టారు' అని చెప్పుకొచ్చింది. “There was a time when I was supposed to do a Tamil film, but I felt something was not right with the DIRECTOR and I didn't feel Comfortable, so I said NO.After that, they were started putting wrong articles about me in newspaper."– Actress #LavanyaTripathi | #Kollywood pic.twitter.com/QvEZ39watH— Whynot Cinemas (@whynotcinemass_) March 14, 2026 -
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ట్రైలర్ రిలీజ్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. -
హీరో రాజశేఖర్కు గోటీల బిజినెస్.. ఆయన ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్ ఆడియన్స్ను మెప్పించింది.అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్ ప్రారంభించారని నెట్టింట మీమ్స్ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.తాజాగా తనపై వచ్చిన మీమ్స్పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. -
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
తెలుగులో తొలి సినిమా 'ఊహలు గుసుగుసలాడె'తో గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. జోరు, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది. చివరగా తెలుగులో తెలుసు కదా మూవీతో అలరించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.సినిమా రిజల్ట్ ముందే ఊహించిన రాశీఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన రాశీ ఖన్నా తెలుసు కదా సినిమా వైఫల్యాన్ని ముందే ఊహించానంది. ఆమె మాట్లాడుతూ.. తెలుసు కదా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాకు నచ్చని పాయింట్స్ అన్నీ చెప్పాను. కొన్ని సీన్స్ చిత్రీకరించేటప్పుడు ఇదెందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తుందన్నాను. అదే సమయంలో ఇది దర్శకుడి విజన్ అని గౌరవించాను. అదే నేర్చుకున్నాకానీ, షూట్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను.. ఇదెక్కడో కొడుతోంది, క్లైమాక్స్ కూడా అందరూ ఒప్పుకునేలా ఉండాలి, కాబట్టి ఆపరేషన్ సీన్ చేయనన్నాను. చివరకు తప్పలేదు. అయినా ఈ సినిమా ద్వారా అందరూ ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అలా నేను కూడా నా అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నాను. ఆ మూవీ షూట్ చేస్తున్నకొద్దీ స్క్రిప్ట్ చాలా మారిపోయింది. నా చేతుల్లో ఏం లేదు అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ -
సినిమా టికెట్ల విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు వివరాలు ప్రభుత్వం 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో ఉంచాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ దాఖలు చేసిన పిటిషన్ను బెంచ్ శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రాష్ట్రంలో విడుదల కాబోయే అన్ని సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఎస్.నిరంజన్రెడ్డిలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల అమలును సుప్రీం ధర్మాసనం నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. -
కేవలం రూ.33 వేలతో సినిమా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ఈ రోజుల్లో సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. చిన్న సినిమాలకు సైతం ఐదారు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ. 33 వేల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించాడు ఓ దర్శకుడు. ఇది నమ్మశక్యంగా లేకున్నా.. వందశాతం నిజం. షార్ట్ ఫిలిమ్స్ సైతం లక్షల బడ్జెట్తో తీస్తున్న ఈ రోజుల్లో..దర్శకుడు రాహి అనిల్ ఈ ప్రయోగం చేశాడు. కేవలం 33 వేలతోనే 80 నిమిషాల నిడివి ఉన్న సినిమాను తెరకెక్కించాడు. రాహి అనిల్ ఎవరో కాదు.. తుంబాడ్, మంఝా, మాయాసభ లాంటి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది ఈ దర్శకుడే. ఇప్పుడు మన్ పిశాచ్ పేరుతో రూపొందిన సైకాలజికల్ హారర్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. మార్చి 18న ఈ మూవీ యూట్యూబ్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేశారు.ఈ మూవీలో కేవలం ఇద్దరు నటులు(యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే) మాత్రమే ఉన్నారు. ఐఫోన్ కెమెరాతో వీడియో తీసి.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అతి తక్కువ బడ్జెట్తో ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘ఇది నా కొత్త ప్రయోగం. సాంకేతికత ఎలా సినిమాలను మారుస్తుందో చూపించాలని కోరాను’ అని డైరెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ప్రభావం సినిమా రంగంపై ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లయింది. గతేడాది ఆగస్టులో గర్భం దాల్చిన ఆమె మార్చి 14న ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దేవుడి ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు లభించిన అపురూపమైన కానుక.సాఫీగా డెలివరీఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆస్పత్రి బృందానికి కూడా ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా 2023లో బాబు పుట్టాడు.సినిమాపూర్ణ మలయాళ నటి. సీమటపాకాయ్, అవును సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ మహాలక్ష్మి, నువ్వలా నేనిలా, రాజుగారి గది, అఖండ 2 ఇలా పలు చిత్రాల్లో నటించింది. మహేశ్బాబు గుంటూరు కారం సినిమాలో 'కుర్చీ మడతపెట్టి..' పాట ప్రారంభంలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ మూవీస్ చేసింది. View this post on Instagram A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali) చదవండి: గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత -
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
కంటికి కనిపించేదంతా నిజం కాదన్నట్లుగా సోషల్ మీడియాలో కనిపించేదంతా కూడా నిజం కాదు. ఆమాటకొస్తే రూమర్స్, ఫేక్ న్యూస్, ఏఐ వీడియోలే ఎక్కువగా ఆన్లైన్లో వైరలవుతుంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు రాజశేఖర్కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అక్కడ పనిచేసేవారికి లక్షల్లో జీతాలుంటాయంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. గోటీల ఫ్యాక్టరీఇంకేముంది, రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ చిత్ర విచిత్ర పోస్టులు ప్రత్యక్షమవడం, అవి కాస్తా నెట్టింట వైరలవడం జరిగింది. తాజాగా దీనిపై హీరో రాజశేఖర్ భార్య జీవిత స్పందించింది. అసలు గోటీల ఫ్యాక్టరీ ఏంటో? అదెందుకు సృష్టించారో తెలీదు. కానీ, అది చూసి నేను, మా ఆయన, పిల్లలు అంతా నవ్వుకున్నాం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలే ఎక్కువుంటున్నాయి. అందులో నెగెటివిటీ వచ్చిందా? దాన్ని చూసి బాధపడాలా? అనే ఆలోచన ఎవరికీ లేదు. అంతా ఫేక్ఆ ప్రచారం మాపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అయితే మాకు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బు లాగే ప్రయత్నం చేశారని విన్నాను. అది బాధాకరం. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్, రీల్స్.. అన్నీ 99% ఫేక్. ప్రతి ఒక్కరిదగ్గరికెళ్లి అది ఫేక్ అని చెప్పలేం. దయచేసి వాటిని ఎవరూ నమ్మకండి అని జీవిత కోరింది.చదవండి: మగవాళ్లు కూడా నగలేసుకోండి: అల్లు శిరీష్ సలహా -
అభిమానికి ముద్దు పెట్టిన తమన్నా..వీడియో వైరల్
సినీతారలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. కొంతమంది అయితే వాళ్లను పిచ్చిగా ప్రేమిస్తారు కూడా. వాళ్లను చూసేందుకే ఎంతో దూరం నుంచి వస్తారు. హాయ్ చెబితే చాలు.. ఆనందంతో పొంగిపోతారు. ఇక షేక్ హ్యాండ్ ఇస్తే.. దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటిది స్టార్ హీరోయిన్ తమన్నా ఏకంగా ఓ అభిమానికి ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.తమన్నా..ఒకప్పుడు టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. ఒకనొక దశలో అత్యధిక పారితోషికంగా తీసుకున్న దక్షిణాది నటిగానూ పేరు సంపాదించుకుంది. కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్కి తన మకాం మార్చింది. అయితే అక్కడ నటిగా కంటే..ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్య ఆమె ఎక్కువగా స్పెషల్ సాంగ్సే చేస్తోంది. అవి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటిన తమన్నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె ఓ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వెళ్లింది. అక్కడ ఓ డ్యాన్స్ గ్రూప్.. స్త్రీ 2 మూవీలో తమన్నా చేసిన ఆజ్కి రాత్ పాటకి డ్యాన్స్ చేసింది. వారి డ్యాన్స్కి ఫిదా అయిన తమన్నా..వెంటనే స్టేజ్పైకి వెళ్లి వాళ్లతో కలిసి కాళ్లు కదిపింది. ఆ గ్యాంగ్లో తమన్నాను బాగా ఇష్టపడే ఓ యువతి కూడా ఉంది. అభిమాన నటి.. తనతో కలిసి స్టెప్పులేస్తుంటే..ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది. ‘మేడం ప్లీజ్..ఒక కిస్ చేసుకోవచ్చా? అని ఆ యువతి అనగానే..తమన్నా ఓకే అన్నట్లుగా తల ఊపింది. ఇంకేముంది సదరు యువతి తమన్నా బుగ్గలపై ముద్దుపెట్టి గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయింది. అభిమాని ప్రేమకు ఫిదా అయిన తమన్నా..నవ్వుతూ.. ఆ యువతి బుగ్గపై ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఓ సాధారణ అభిమానికి ప్రేమగా ముద్దు పెట్టడం పట్ల నెటిజన్స్ తమన్నాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. A lady Fan kissed Tammy and she kissed back. Such a pure soul she is🤌🤌🤌💕💕💕#Tamannaah #TamannaahBhatia pic.twitter.com/g0chNWIkbO— Miss B fan(Tammu fan😘❣️) (@MissB_Fan) March 13, 2026 -
దర్శకుడిగా శేఖర్ మాస్టర్.. నిజమెంత?
టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ నటుటలతో పాటు ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్చరణ్ లాంటి స్టార్ హీరోల వరకు అందరికి ఆయన కొరియోగ్రఫీ చేశాడు. హుక్ స్టెప్పుల స్పెషలిస్ట్గానూ పేరుపొందాడు. ఆయన కొరియోగ్రఫీ అందించిన చాలా పాటలు నెట్టింట వైరల్గా మారాయి. ఒకవైపు సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ అందిస్తూనే..మరోవైపు పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇలాంటి సమయంలో ఆయనకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. త్వరలోనే ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. అందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా నటించబోతున్నాడట. ఈ వార్త గత రెండు, మూడు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే వాస్తవం ఏంటంటే.. ఆయన ఇప్పట్లో మెగా ఫోన్ పట్టే అవకాశమే లేదట. తన దర్శకత్వంలో ప్రభుదేవా కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నారనే వార్తలో ఎలాంటి నిజం లేదని శేఖర్ మాస్టర్ ‘సాక్షి’కి తెలిపారు. -
మారండ్రా బాబూ.. మగవాళ్లు కూడా నగలేసుకోండి: శిరీష్
ఆభరణాలు అనగానే ఆడవాళ్లే గుర్తొస్తారు.. ఏ మగవాళ్లు ఎందుకు వేసుకోకూడదు? అంటున్నాడు కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్. ఇటీవలే శిరీష్ మనసుపడ్డ అమ్మాయిని మనువాడాడు. నిశ్చితార్థం దగ్గరి నుంచి పెళ్లి వరకు తనకు నచ్చినట్లుగా రెడీ అయ్యాడు. నెక్లెస్ ధరించాడు. హీరో విజయ్ దేవరకొండ కూడా తన పెళ్లిలో వెరైటీ ఆభరణాలు ధరించి హైలైట్ అయ్యాడు.ఎంగేజ్మెంట్ సమయంలో ట్రోలింగ్అయితే ఇలా బంగారు, వజ్రాభరణాలు ధరించడం వల్ల శిరీష్పై కొంత ట్రోలింగ్ జరగ్గా అప్పట్లోనే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా మరోసారి తనపై జరిగిన ట్రోలింగ్పై స్పందించాడు. ఇప్పుడు ఆడ, మగ అని తేడాలు చూస్తున్నారు.. కానీ, అప్పట్లో మగవాళ్లు కూడా నగలు వేసుకున్నారు. వందేళ్ల క్రితం పురుషులకు, మహిళలకు కలిపే పర్ఫ్యూమ్స్ తయారు చేశారు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా..ఇప్పుడేమో అబ్బాయిలకు బ్లూ అని, అమ్మాయిలకు పింక్ ఫేవరెట్ అంటూ బేధాలు సృష్టించారు. అందుకే నన్ను ఎంత తిట్టుకున్నా సరే ఈ అడ్డుగోడల్ని కూల్చాలనే అనుకున్నాను. అయితే నా అభిప్రాయాల్ని నా చుట్టూ ఉన్న కొందరు అనుమానించారు. ఇప్పుడీ హారాలు వేసుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. ఎహె, ఊరుకోండి, మనం కూడా ట్రై చేయకపోతే ఇంకెవరు చేస్తారు? లేదంటే ఇంకో ఇరవై ఏళ్లు కూడా ఇలాగే ఉంటుంది అని బదులిచ్చాను. నేనే డిసైడ్ చేసుకుంటా..నా జీవితంలోని ప్రత్యేక సందర్భమైన పెళ్లి వేడుకలో నాకు నచ్చినట్లుగా రెడీ అయ్యాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మగవాళ్లు ఎలా ఉండాలి? ఆడవాళ్లు ఎలా ఉండాలి? అని ఇతరులు నిర్ణయించాల్సిన పని లేదు. నేనేం ధరించాలనేది నాకు తెలుసు, ఇతరులు చెప్పనక్కర్లేదు అని శిరీష్ ముగించాడు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: ధురంధర్ 2 ఛాన్స్ వదిలేసుకున్న ప్రముఖ నటుడు


