breaking news
Tollywood
-
ది ప్యారడైజ్ ప్రీమియర్ షో.. టికెట్ ధర ఎంతంటే?
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ది ప్యారడైజ్ టీమ్కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్లో మొదటి నాలుగు రోజులు రూ.48 పెంచుకోవచ్చని తెలిపింది. మల్టీప్లెక్స్లో రూ.94 అదనంగా వసూలు చేసేందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత 28వ తేదీ నుంచి అక్టోబరు 3 వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.23, మల్టీప్లెక్స్ల్లో రూ.45 పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది.అంతేకాకుండా తెలంగాణలో ఈనెల 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా పర్మిషన్ వచ్చేసింది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ ఎల్ఎల్పీ రూ.కోటి అందజేసింది. -
మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్ డేట్ వైరల్..!
మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కించిన ఈ సోషల్ ఫాంటసీ చిత్రం రిలీజ్ డేట్పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. చిరు మరో మూవీ కాకా.. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుండగా.. విశ్వంభరపై మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.అయితే ఇటీవల ఓటీటీ డీల్ కుదిరినట్లు వార్తలొచ్చాయి. దీంతో మరోసారి విశ్వంభర రిలీజ్పై చర్చ మొదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో టాక్ వినిపిస్తోంది. ఇదే ఏడాదిలోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుందని లేటేస్ట్ టాక్ వైరలవుతోంది. వచ్చేనెల దసరాకు టైమ్ సరిపోనందున వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.అయితే దసరా తర్వాత నవంబర్లో విశ్వంభర రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ ఏడాదిలోనే విశ్వంభర చూసే ఛాన్స్ మెగా ఫ్యాన్స్కు దక్కనుంది. రాబోయే రోజుల్లోనైనా రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా..విశ్వంభరలో చిరు సరసన త్రిష హీరోయిన్గా చేసింది. ఈ చిత్రంలో సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించగా.. కీరవాణి సంగీతమందించారు. -
ఏజ్ ఉంది.. ఓపిక ఉంది.. అన్ని నేనే చేశా : నాని
స్టార్ హీరోల సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెరపై హీరో ఎంత రిస్క్ తీసుకున్నట్లు కనిపించినా.. వాస్తవానికి కొన్ని యాక్షన్ సీన్లను డూప్ల సాయంతో పూర్తి చేయడం సాధారణమే. ముఖ్యంగా ప్రమాదకరమైన ఫైట్లు, హై-రిస్క్ స్టంట్స్ ఉన్నప్పుడు హీరోలకు బదులుగా డూప్లు రంగంలోకి దిగుతుంటారు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం తన సినిమాల విషయంలో ఈ పద్ధతికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడట. తనకు డూప్తో సన్నివేశాలు చేయించడం అసలు ఇష్టం లేదని చెబుతున్నాడు.నాని నటించిన భారీ మాస్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న విడుదల కాబోతుంది.మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని యాక్షన్ సీన్లను డూప్తో చేశారా? లేక మీరే చేశారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. నాని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.‘నాకిప్పుడు ఏజ్ ఉంది.. ఓపిక ఉంది..అందుకే అన్నీ నేనే చేశాను. 50 ఏళ్లు దాటిన తర్వాత డూప్ని పెడతానేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నా సినిమాల్లో డూప్ని పెట్టడం నాకు నచ్చదు. నా సినిమాలో ఒక్క డూప్ షాట్ కనిపించినా ఎంజాయ్ చేయలేను. సినిమా చూస్తున్నప్పుడు ఆ షాట్ నాది కాదనుకోండి.. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూనే.. ఆ సీన్ రాగానే ‘అబ్బా.. డూప్ షాట్’ అనుకుంటా. దాన్ని నేను ఓన్ చేసుకోలేను. ప్రశంసలు కూడా తీసుకోలేను. ఎవరైనా ‘నాని బాగా చేశావ్’ అంటే.. ‘ఆ నాలుగు డూప్ షాట్లు తప్పితే’ అని నా మనసు నాకు చెబుతూనే ఉంటుంది. అందుకే చిన్న చిన్న లెగ్ షాట్స్ కూడా నేనే చేస్తా. ఒక్కోసారి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాంటి సీన్లను డూప్తో చేద్దామని అనుకుంటారు. కానీ నేను ముందుగానే వాళ్లకు చెబుతా.. నా సీన్లన్నీ నేనే చేస్తానని చెప్పి క్యారవ్యాన్లోకి వెళతా. అయితే ఈ కసి, ఓపిక మరో పదేళ్ల తర్వాత కూడా ఇలాగే ఉంటుందో లేదో చెప్పలేను. ప్రస్తుతానికి మాత్రం సినిమాల్లో డూప్ లేకుండా వీలైనంత వరకు అన్ని సన్నివేశాలను నేనే చేయాలని అనుకుంటున్నాను’అని నాని చెప్పుకొచ్చాడు. -
చిరు లీక్స్.. కాకాలో మెగాస్టార్ రోల్ ఇదే..!
చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే మెగాస్టార్ అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించి లీక్స్ చేస్తుంటారు. గతంలో చాలాసార్లు టైటిల్స్ లీక్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుంటారు. తాజాగా కాకాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. ఈ మూవీలోని తన పాత్ర పేరును బయట పెట్టేశారు. ఇటీవల ఓ ఈవెంట్కు హాజరైన చిరంజీవి తన రోల్ వెల్లడించారు.కాకాలో తాను కదిరి కాళీదాస్ పాత్రలో కనిపించనున్నట్లు చిరు వెల్లడించారు. తన పక్కనే ఉన్న యాంకర్ స్రవంతిని చూపిస్తూ.. తన ఊరి పేరునే తన క్యారెక్టర్లో పెట్టుకున్నానని నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాకా… కదిరి కాళిదాస్ ❤️🔥❤️🔥❤️🔥#KAAKA - JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk— Kaaka (@KaakaMovie) September 20, 2026 -
శోభిత కొత్త సినిమా.. కోడలిపై నాగార్జున ప్రశంసలు
అక్కినేని కోడలు శోభిత ధూళిపాల నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వెట్టువం. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రాచీన యుద్ధ కళలను చూపించారు. ఈ సీన్స్ కోసం నటీనటులు యుద్ధ కళలు నేర్చుకున్నారని వెల్లడించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేసింది.ఈ మూవీ శోభిత రోల్ మరింత ఇంట్రెస్టింట్గా ఉండనుందని ఈ వీడియోలో చూస్తే అర్థమవుతోంది. ఇది వీక్షించిన హీరో నాగార్జున.. కోడలిపై ప్రశంసలు కురిపించారు. శోభిత పడుతున్న కష్టాన్ని ప్రశంసించారు. ఈ మూవీ కోసం ఆత్మరక్షణ కళలను నేర్చుకున్న శోభితన ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం శోభిత చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది.. వెట్టువం వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని నాగ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమాలో శోభిత రాధి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
వినాయక నిమజ్జనంలో దిల్ రాజు సతీమణి మాస్ డ్యాన్స్..వీడియో వైరల్
హైదరాబాద్లో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు సందడిగా మారాయి. డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, నృత్యాలతో యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా నిమజ్జన వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దిల్ రాజు కూడా తన కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో ఆయన సతీమణి తేజస్వినితో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీన్మార్ పాటకు దిల్ రాజు తన సతీమణితో కలిసి స్టెప్పులు వేస్తూ కనిపించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆయన ఉత్సాహంగా నృత్యం చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.నిన్న గణేశ్ నిమజ్జనం వేడుకల్లో నిర్మాత #DilRaju జోష్ pic.twitter.com/gP4if8uslS— Rajesh Manne (@rajeshmanne1) September 20, 2026దిల్ రాజు వైఫ్ తేజస్విని తీన్మార్ డాన్స్ 🔥💃ఫుల్ మాస్ ఎనర్జీ… అదిరిపోయిందిగా! 🔥😍#Tejaswini #TeenmaarDance #DilRaju pic.twitter.com/jXjJvDqK0l— Janya Digital Media (@janyamedia1) September 19, 2026 -
‘పదో తరగతి కలిసి చదివాం.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్యాం..’
అనీష్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకుడు మహేష్ ఉప్పాల గురించి మాట్లాడే సమయంలో బాగా ఎమోషనల్ అయ్యారు.చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ..చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ స్నేహం గురించి మాట్లాడుతూ... ‘నేను, మహేశ్ పదో తరగతి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మేం క్లాస్మేట్స్. పదో తరగతిలో ఉన్నప్పుడు ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని అనుకున్నాం. ఈ రోజు నేను రాకాస డైరెక్టర్ని. మహేశ్ కూడా ‘ఇట్లు అర్జున’ దర్శకుడు అయ్యాడు. నిజంగా నా జీవితంలో అత్యంత హ్యాపీ మూమెంట్ ఇదే. నేను 'రాకాస' కూడా ఇంతలా ఎమోషనల్ అవ్వలేదేమో అని కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది -
సినిమా పండుగకు సిధ్ధం.. వేదిక మారింది.. ప్రత్యేకత ఎంటంటే?
భారతీయ సినీ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులు చరిత్రలో తొలిసారిగా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఇక నుంచి నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానాన్ని దేశరాజధాని ఢిల్లీకే పరిమితం చేయడం లేదు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వేదికను మారుస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తాజా అవార్డుల ప్రదానం గుజరాత్లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ (కేవడియా) లో ఈ సెప్టెంబర్ 22, మంగళవారం జరగనుంది.1970లో ఓసారి మద్రాసులో...1954లో తొలి జాతీయ అవార్డుల నాటి నుంచి ఇప్పటివరకు అనేక దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగానే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సాగుతూ వచ్చింది. ఒకే ఒక్కసారి 1969వ సంవత్సరానికి సంబంధించిన 17వ జాతీయ అవార్డుల ప్రదానం మాత్రం మద్రాసులో జరిగింది. 1970 నవంబర్ 21న మద్రాసులోని యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఆ ఉత్సవాన్ని చేశారు. అయితే, ఆ తర్వాత గత 55 ఏళ్ళలో నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం వేదికను మార్చే ప్రయత్నం జరగలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు తొలిసారిగా ఈ ఏడాది వేదిక మారుతోంది. ఏటేటా రాష్ట్రపతి చేతుల మీదుగా సాగే ఈ ప్రదానోత్సవం... ఈసారీ అదే సంప్రదాయాన్ని మాత్రం కొనసాగించనుంది. ఈ నెల ద్వితీయార్ధంలో గుజరాత్ పర్యటనలో ఉండనున్న భారత రాష్ట్రపతి ఈ 72వ జాతీయ అవార్డులను విజేతలకు అక్కడే అందజేయనున్నారు. 2024వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డు విజేతల పేర్లను మొన్న జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.విగ్రహం వద్దే వేదికకై ఏర్పాట్లునర్మదా తీరంలో 2018లో ఏర్పాటైన 597 అడుగుల వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)తో గుజరాత్లోని ఏక్తా నగర్ కొంతకాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహ నిర్మాణంగా రికార్డులకెక్కిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ దగ్గర ఈ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2024వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు గాను అందించనున్న తాజా నేషనల్ అవార్డ్స్ ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ ఎంపికైంది. ఉత్తమ నటిగా యామీ గౌతమ్ (‘ఆర్టికల్ 370’), ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్మూట్టి (‘భ్రమయుగం’), కార్తీక్ ఆర్యన్ (‘చందు ఛాంపియన్’)లు సంయక్తంగా విజేతలయ్యారు. ఈసారి నాన్ ఫీచర్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్కి రావడం విశేషం. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతంలో జాతీయ అవార్డుల ప్రదానం జరగడం గమనార్హం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, మరాఠీ, గఢ్వాలీ సహా వేర్వేరు భాషల్లో రూపొందించిన చిత్రాలు అవార్డులను అందుకోనున్నాయి. సంథాలీ భాషలో రూపొందిన ఓ సినిమాకి తొలిసారిగా నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం.మార్పు ఎందుకంటూ విమర్శలు‘అవార్డుల ప్రదాన వేదికను ఢిల్లీ నుంచి మారిస్తే మార్చారు కానీ, గుజరాత్కి మార్చడమేమిట’ని జాతీయ అవార్డుగ్రహీత – సినీ దర్శకుడు రాహుల్ డోలకియా సహా పలువురు ఇప్పటికే విమర్శించారు. అయితే, ఇక నుంచి ఏటేటా వేర్వేరు నగరాల్లో ఉత్సవం జరపాలన్నది సరికొత్త విధాన నిర్ణయమనీ, అందులో భాగంగా ఈ ఏడాది గుజరాత్తో ఆ మార్పుకు శ్రీకారం చుట్టామనీ, రాబోయే సంవత్సరాల్లో వేరే నగరాలూ ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆతిథ్యమిస్తాయనీ అధికార వర్గాలు వివరిస్తున్నాయి. దేశమంతటినీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు ఈ ప్రయత్నం ఉపకరిస్తుందనీ చెబుతున్నాయి. ఆ వాదనపైనా రాజ్ ఠాక్రే లాంటి రాజకీయ నేతలు కొందరు విమర్శించారు. ‘ఒకవేళ దేశ రాజధాని బయట అవార్డుల ప్రదానం చేయాలనుకుంటే, బొంబాయి మొదలు భారతీయ సినిమాను ఇవాళ ప్రపంచ పటంపై నిలుపుతున్న హైదరాబాద్ సహా దక్షిణాది నగరాలు ఎంచుకోవాల్సింద’ని ఆయన ధ్వజమెత్తారు. కాగా, ప్రముఖ నటుడు పరేశ్ రావల్ లాంటి మరికొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. ‘భారతదేశంలో గుజరాత్ అంతర్భాగమే కదా! అదేమీ పాకిస్తాన్ కాదు. అలాంటప్పుడు గుజరాత్లో ఎందుకు అవార్డుల ప్రదానోత్సవం చేయకూదు?’ అని ఘాటుగా జవాబిస్తున్నారు.జాతీయ అవార్డులకు... అలా శ్రీకారం!1953లోజాతీయ ఫిల్మ్ అవార్డులు ఇవ్వడం ఆరంభమైంది. 1953లో నిర్మాణమైన ఉత్తమ చలన– చలన చిత్రాలకు గాను 1954లో తొలిసారిగా ఈ అవార్డుల ప్రదానం చేశారు. నిజానికి, ఉత్తమ ప్రమాణాలను గుర్తించి, ప్రోత్సహిస్తూ ఇలా ప్రభుత్వమే సినిమాలకు అవార్డులు ఇవ్వడమనేది అప్పటికి ఇంకా ఏ దేశంలోనూ లేదట. అప్పటికే, అంతర్జాతీయ సినీ ప్రపంచంలో ‘ఆస్కార్ అవార్డులు’ పేరొందాయి. కానీ, అవి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కావు. అలాగే, అప్పటికే ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఆఫ్ బ్రిటన్’ కూడా ఉన్నాయి కానీ, అవి కూడా అక్కడి ప్రభుత్వం ఇచ్చే అవార్డులేమీ కావు. వెరసి, ఒక దేశ ప్రభుత్వం సినీ రంగాన్ని గుర్తించి, గౌరవించి అవార్డులివ్వడమనే సంస్కృతికి మనమే శ్రీకారం చుట్టినట్టయిందన్న మాట.అప్పట్లో తొమ్మిది అవార్డులే!చలనచిత్ర విచారణ సంఘం (ఫిల్మ్ ఎంక్వైరీ కమిటీ) ఇచ్చిన సిఫార్సు దృష్ట్యా ఈ అవార్డులను కేంద్ర సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఆచరణ రీత్యా ఆ సిఫార్సుకు కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అప్పట్లో జాతీయ అవార్డులంటే అఖిల భారత స్థాయిలో అంతా కలిపి తొమ్మిదే తొమ్మిది అవార్డులుండేవి. జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం, ఉత్తమ డాక్యుమెంటరీలకు రాష్ట్రపతి బంగారు పతకాలు ఇచ్చేవారు. అలాగే, ఉత్తమ బాలల చిత్రానికి ‘ప్రధానమంత్రి పతకం’ అందించేవారు. అవే కాకుండా, పై మూడు విభాగాల్లోనూ రెండేసి చొప్పున ప్రశంసా పత్రాలు అందజేసేవారు. అంతే!ఆ వేదికపైనే చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీతొట్ట తొలి జాతీయ అవార్డుల ప్రదానోత్సవమే మరో కీలక ఘట్టానికి కూడా వేదికైంది. ఆ తొలి అవార్డుల్లో భాగంగానే ఉత్తమ బాలల చిత్రానికి ప్రధానమంత్రి పతకం అందిస్తామని ప్రకటించారు కానీ, వచ్చిన ఎంట్రీలేవీ తగిన ప్రమాణాలతో లేవు. ‘ఖేలా ఘర్’ అనే బెంగాలీ సిని మాకు ప్రశంసా పత్రం మాత్రం బహూకరించి, సరిపెట్టాల్సి వచ్చింది. ఇలా లాభం లేదని, బాలల చిత్రాలనుప ప్రోత్సహించడం కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్ బి.వి. కేస్కర్ ఆ అవార్డుల ప్రదానోత్సవం వేదికపైనే ‘చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ’ అనే రిజిస్టర్డ్ సంస్థను ్ర΄ారంభించనున్నట్టు ప్రకటించారు.రెండో ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లోనూ...జాతీయ అవార్డులు ఆరంభమైన రెండో ఏడాదే ప్రాంతీయ భాషలకూ ప్రత్యేకంగా అవార్డులివ్వడం ప్రారంభించారు. జాతీయ స్థాయి ఉత్తమ చిత్రానికి ఇచ్చే రాష్ట్రపతి బంగారు పతకంతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లోని ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి రజత పతకం అందించే విధానాన్ని ప్రవేశపెట్టారు. అలా ప్రాంతీయ భాషా చిత్రాలకూ జాతీయ గుర్తింపు ఇవ్వడం ప్రారంభించగానే... ఆ ఏడాదికి తెలుగులో వాహినీ వారి ‘పెద్ద మనుషులు’ రాష్ట్రపతి రజత పతకం అందుకుంది. అలాగే, స్వీయ నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్పై హీరో ఎన్టీఆర్ నిర్మించి, నటించిన ‘తోడుదొంగలు’, అక్కినేని – భానుమతి నటించిన భరణీ పిక్చర్స్ వారి ‘విప్రనారాయణ’ చిత్రాలకు ప్రశంసా పత్రాలు లభించాయి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త కేటగిరీలలో అవార్డులను ప్రవేశపెట్టడంతో, అవార్డుల జాబితా అంతకంతకూ విస్తరించింది.దక్షిణాన అందరి కన్నా ముందే... ఆంధ్రప్రదేశ్! కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్రాలలో మున్ముందుగా అడుగులు వేసింది... హిందీ చిత్రపరిశ్రమకు కేంద్రమైన బొంబాయి నగరం ఉన్న మహారాష్ట్ర. 1962 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర స్థాయి సినిమా అవార్డులతో మరాఠీ చిత్రపరిశ్రమను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఆ వెంటనే రెండేళ్ళకు దక్షిణాదిలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల పేరిట 1964 నుంచి ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు అవార్డులిచ్చి, అభినందించడం ఆరంభించింది. అప్పటికి దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమలన్నీ మద్రాసులోనే ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నాయి. అయినప్పటికీ, తమిళనాడు తదితర రాష్ట్రాలన్నిటి కన్నా మున్ముందుగా తెలుగు రాష్ట్రమే ఈ రకమైన ప్రాంతీయ అవార్డుల సంస్కృతికి శ్రీకారం చుట్టడం విస్మరించరాని విశేషం. తమిళనాడు సైతం 1967 నుంచి తమ రాష్ట్రంలో ఫిల్మ్ అవార్డులను ఇవ్వనారంభించింది.మన తెలుగు మెరుపులుఒకప్పుడు జాతీయ అవార్డులకూ, తెలుగు సినిమాకూ చుక్కెదురు. మహా అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే తప్ప తెలుగు సినిమాలు పెద్దగా జాతీయ స్థాయిలో కనిపించేవి కావు. జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు లాంటివి మనకెప్పుడూ అందని ద్రాక్షలుగానే ఉండేవి. తెలుగు నటి శారద లాంటి వాళ్ళు మలయాళం (‘తులాభారం’–1968, ‘స్వయంవరం’– 1972) నుంచి తెలుగు (‘నిమజ్జనం’–1977) దాకా వేర్వేరు భాషా చిత్రాల్లో నటనతో మూడు సార్లు ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డు అందుకోవడం ఒక్కటే కాస్త ఊరటగా ఉండేది.ఆనాడు ‘శంకరాభరణం’... ఇటీవల ‘బాహుబలి’కె. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ 1979వ సంవత్సరానికి గాను తొలిసారిగా జాతీయ స్థాయిలో స్వర్ణకమలం (ప్రత్యేక విభాగంలో) సాధించింది. ఆ 27వ జాతీయ అవార్డుల్లో ‘అత్యధిక ప్రజాదరణ, పూర్తి స్థాయి వినోదం, కళాత్మక విలువలు నిండిన చిత్రం’గా ‘శంకరాభరణం’ స్వర్ణకమలాన్ని సాధించింది. జాతీయ అవార్డులు మొదలయ్యాక ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఒక తెలుగు సినిమా స్వర్ణకమలం సాధించడం అదే ప్రథమం. అయితే, విచిత్రం ఏమిటంటే, ఆసారి జ్యూరీకి సారథి సాక్షాత్తూ తెలుగు దర్శక – నిర్మాత ఎల్వీ ప్రసాద్. అయినప్పటికీ, కారణాలేమో కానీ, అన్ని అర్హతలూ ఉన్న ‘శంకరాభరణం’ కన్నా ఓ సాధారణ హిందీ చిత్రం (‘శోధ్’)కి ఆయన జ్యూరీ పెద్దపీట వేయడం శోచనీయం. ‘శంకరాభరణం’ తర్వాత 63వ జాతీయ అవార్డుల్లో మన తెలుగు ‘బాహుబలి–1’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. దర్శకుడు రాజమౌళి తొలిసారిగా పూర్తి స్థాయిలో తెలుగు సినిమాను జాతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలో అగ్రస్థానంలో నిలిపారు. అలా ‘శంకరాభరణం’ తర్వాత రెండోసారి స్వర్ణకమలం సాధించిన మన సినిమా ‘బాహుబలి’ అయ్యింది. ‘శంకరాభరణం’ చిత్రానికి 4 జాతీయ అవార్డులొస్తే, ఆపైన వచ్చిన బి. నరసింగరావు ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డుల్లో ఏకంగా 5 (ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ కళాదర్శకుడు) పురస్కారాలు గెలుచుకుంది. ఒక తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో అన్ని అవార్డులు రావడం అదే ప్రథమం. తర్వాత రోజుల్లో నటి విజయశాంతి 1990వ సంవత్సరానికి గాను 38వ జాతీయ అవార్డుల్లో ‘కర్తవ్యం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు.సంస్కృతంలో తెలుగు వారికి స్వర్ణకమలం!తెలుగు సినిమా కాక΄ోయినప్పటికీ, ఓ తెలుగు నిర్మాత నిర్మించిన చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలం సాధించడం ఒకే ఒక్కసారి జరిగింది. అది జి.వి. అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన సంస్కృత చిత్రం ‘భగవద్గీత’. 1992వ సంవత్సరానికి గాను ఇచ్చిన 40వ జాతీయ అవార్డుల్లో దేశమంతటిలోకీ అత్యుత్తమ చిత్రంగా ‘భగవద్గీత’ నిలిచింది. అంతటి ఘనత సాధించిన ఆ చిత్రాన్ని నిర్మించింది మన తెలుగువాడైన ప్రముఖ ΄ారిశ్రామికవేత్త, సినీ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి కావడం విశేషం.పెరుగుతున్న తెలుగు గాలి!జ్యూరీల్లో తెలుగు వారికి పెరిగిన ప్రాధాన్యం సహా అనేక కారణాల వల్ల ఇటీవల జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా మునుపటి కన్నా మెరుగైన ఫలితాలే సాధిస్తోంది. ఆ మధ్య 2018వ సంవత్సరానికి గాను 66వ జాతీయ అవార్డుల్లో నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటనకు గాను కీర్తీ సురేశ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అటుపైన 2021వ సంవత్సరానికి గాను 69వ జాతీయ అవార్డుల్లో ‘పుష్ప–1’తో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సాధించి, సంచలనం సృష్టించారు. తెలుగు నుంచి ఆ అవార్డును అందుకొన్న తొట్ట తొలి నటుడనే రికార్డు సృష్టించారు.ఇప్పుడు 2024వ సంవత్సరానికి గాను ఈ సెప్టెంబర్ 22న ప్రదానం చేయనున్న తాజా 72వ జాతీయ అవార్డుల్లో మన తెలుగు సినిమా ఏకంగా 9 అవార్డులతో మెరిసిపోతోంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించి, ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా ప్రభాస్ ‘కల్కి’, ఉత్తమ బాలల చిత్రంగా ‘35... చిన్న కథ కాదు’, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు సుకుమార్ (‘పుష్ప–2’), ఉత్తమ సంభాషణల రచయితగా మరో దర్శకుడు వెంకీ అట్లూరి (‘లక్కీ భాస్కర్’) అవార్డు విజేతల్లో ఉన్నారు. ఇంకా ఉత్తమ బాల నటుడు (అరుణ్ దేవ్ పోతుల – ‘35... చిన్న కథ కాదు’), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌధరీ – ‘కల్కి’), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (దీపాలీ నూర్, శీతల్ శర్మ ‘పుష్ప2’), ఉత్తమ మేకప్ (పి. రవికుమార్ ‘కమిటీ కుర్రోళ్ళు’) కేటగిరీల్లోనూ మన తెలుగు సినిమా జెండా ఎగరేసింది. -ఆర్. జయ -
మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది
అనీష్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అనీష్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను చేసిన అర్జున పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. ఇందులో యాక్షన్ కొత్తగా ఉంటుంది. అర్జున మాటలు మీకు వినిపించక΄ోవచ్చు. తన ప్రేమ గట్టిగా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘అర్జున పాత్రను అనీష్ చాలెంజ్గా తీసుకుని చేశాడు. మానసతో కలిసి ఈ కథను ఇష్టపడి రాశాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు మహేష్ ఉప్పల. ‘‘నేను దర్శకుడిగా ఉన్నప్పుడు సీన్ గురించి మాత్రమే ఆలోచించేవాడిని. ఇప్పుడు బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను’’ అని తెలిపారు వెంకీ కుడుముల. ‘‘ఈ చిత్రంలోని కీర్తి పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ, చేశాను’’ అని చెప్పారు అనస్వర. ‘‘ఈ చిత్రంలో మూగవాడైన అర్జున పాత్రలో అనీష్ నటించాడు. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అని అన్నారు దర్శకురాలు మానసా శర్మ. -
కొత్త బిజినెస్లోకి చిరంజీవి.. ప్రపంచ రికార్డ్ బద్దలయ్యేలా ప్లాన్!
మెగాస్టార్ చిరంజీవి కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో పలు అత్యాధునిక మల్టీప్లెక్స్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి చిరంజీవి ఓ భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ఏషియన్ సునీల్తో కలిసి హైదరాబాద్లో ఈ వెంచర్ను ఏర్పాటు చేయనున్నట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ తెరను ఏర్పాటు చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇప్పటికే పలువురి హీరోలతో..ఇప్పటికే మహేశ్బాబుతో ఏఎంబీ సినిమాస్, అల్లు అర్జున్తో ఏఏఏ సినిమాస్, రవితేజతో ఏఆర్టీ సినిమాస్, విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్ వంటి మల్టీప్లెక్స్ ప్రాజెక్టులను ఏషియన్ సునీల్ తీసుకొచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మరో భారీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టనున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది. ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్లో మరో అత్యాధునిక మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. చిరంజీవి–ఏషియన్ కాంబినేషన్పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: పాండా అంటూ ట్రోలింగ్.. బిగ్బాస్ వినాయకుడు ఎలిమినేట్..? -
పాండా అంటూ ట్రోలింగ్.. వినాయకుడు ఎలిమినేట్..?
బిగ్బాస్ సీజన్ 10లో ఎలిమినేషన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కృష్ణుడి ఆటపై అసంతృప్తి..నిన్నటి ఎపిసోడ్లో బిగ్బాస్ కృష్ణుడు, సృష్టిల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వీకెండ్లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్ రూంలో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడుని అన్ సేఫ్లోనే ఉంచారు. దీంతో కృష్ణుడి ఆటతీరుపై బిగ్బాస్ కూడా ఫోకస్ పెట్టాడనే చర్చ మొదలైంది.నెటిజన్లు మీమ్ వీడియోలు..మరోవైపు హౌస్లో కృష్ణుడి ఆట కూడా పెద్దగా హైలైట్ కావడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ.. కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్ కూడా వైరల్గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కనిపిస్తోంది.వినాయకుడి నిమార్జనానికి వేళైంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో చైత్ర విషయంలోనూ..గతంలో చైత్ర విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలై.. చివరకు ఆమె ఎలిమినేట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కృష్ణుడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్ ఫలితమా? లేక కేవలం ప్రేక్షకుల అంచనా మాత్రమేనా? అనేది తెలియాలంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.(ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్)#Debjani ee #Krishnudu konchem #Panda laaga unnadu 🤣🤣🤣#BiggBossTelugu10 pic.twitter.com/gOlYGi5I9n— Naresh Bandari (@BiggBossAddict) September 10, 2026 -
సమవర్తి మా టీమ్కి ఓ సాహసం: సత్యదేవ్
‘‘నేను ఇప్పటిదాకా ఎవర్నీ చాన్స్ ఇవ్వమని అడగలేదు. అందుకు నా మొహమాటమే కారణం. అయితే మోహమాటాన్ని వదలిపెట్టి నాతో సినిమా చేయమని నేను అడిగిన తొలి వ్యక్తి దర్శకుడు అజయ్’’ అని సత్యదేవ్ అన్నారు. సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘సమవర్తి’. గానవి లక్ష్మణ్ హీరోయిన్గా నటించారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘నేను డ్రీమ్గా భావించిన షాట్స్, సీన్స్ను నాతో అజయ్ చేయించాడు. దక్షిణ భారతదేశంలో ఎన్ని అడవులున్నాయో అన్నింట్లో మేం షూటింగ్ చేశాం. మాకు ఇదొక గ్రేట్ అడ్వెంచర్ అనిపించింది. థియేటర్స్లో మీకూ అదే ఫీల్ కలిగిస్తుంది’’ అన్నారు.‘‘ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు శ్రీకాంత్. ‘‘నా ఆరంభం’ సినిమా తర్వాత సత్యదేవ్ అన్న పిలిచి మరీ ‘సమవర్తి’కి చాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. షూటింగ్లో గాయపడ్డారు కూడా. శ్రీకాంత్గారు చేసిన క్యారెక్టర్తోనే సినిమా ్రపారంభం అవుతుంది’’ అని చెప్పారు అజయ్ నాగ్ .వి.‘‘తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మార్చే చిత్రం ఇది’’ అన్నారు శశిధర్. ‘‘ఈ టీమ్లోని ప్రతి ఒక్కరి కెరీర్లో గుర్తుండిపోయే విజయం లభిస్తుంది’’ అని తెలిపారు శివచరణ్ రెడ్డి. -
ప్రచారంలో ఉన్నట్లు రీషూట్స్ చేయలేదు: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
‘‘నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లైనా తీస్తాను. ఈ విషయంలో మా ప్యారడైజ్’ టీమ్ను ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత రీషూట్ జోలికి వెళ్లను’’ అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ ఓదెల చెప్పిన సంగతులు.. ⇒ ‘దసరా’తో నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చిన వ్యక్తి నానీగారు. ఆ సినిమా రిలీజ్కు ముందే రిజల్ట్తో సంబంధం లేకుండా మరో మూవీ చేద్దామని నానీగారు అన్నారు. ‘ది ప్యారడైజ్’లో జడల్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. నానీగారికి జడలు వేద్దామని నా టీమ్తో అంటే వద్దన్నారు. కానీ కథని, క్యారెక్టర్ని నమ్మి నానీగారు ఒప్పుకున్నారు. మోహన్బాబుగారు ఇందులో మెయిన్ విలన్. ఆయన, నానిమధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ⇒ ‘ది ప్యారడైజ్’ని 171 రోజులు షూట్ చేశాం. నేను అనుకున్నట్లు సినిమా తీయడానికి, టార్గెట్ రీచ్ కావడానికి కాస్త ఆలస్యమైంది. దీంతో యూనిట్ అందరి కాల్షీట్స్ మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అంతేకానీ ప్రచారంలో ఉన్నట్లు రీ షూట్స్ చేయలేదు. బౌండ్ స్క్రిప్ట్లో మార్పులు చేయలేదు. షూటింగ్ ప్లాన్ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యానేమో అనిపించింది. నెక్ట్స్ టైమ్ ఇచ్చిన మాటపై నిలబడాలనుకుంటున్నాను.. అంటే చెప్పిన టైమ్కి సినిమాను రిలీజ్ చేయడం, అనుకున్న టైమ్లో షూట్ పూర్తి చేయడం వంటివి. ⇒ ‘ది ప్యారడైజ్’లో బిట్ సాంగ్స్తో కలిపి ఆరు పాటలున్నాయి. నా చిన్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ‘ఏషనాగుల..’ పాట వినేవాడిని. ‘దసరా’ చిత్రానికే ఈ పాట పెడదామనుకున్నా. ‘ది ప్యారడైజ్’కు కుదిరింది. ⇒ నా దర్శకత్వంలో ఓ లవ్స్టోరీ చేయాలని ఉంది. అలాగే చిరంజీవిగారితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత మా ఫ్యామిలీతో టైమ్ గడపాలి. ఆ తర్వాత నా నెక్ట్స్ మూవీ గురించి చెబుతాను. -
విశ్వక్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం #‘కల్ట్’. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ కాకరాల మరో నిర్మాత. #‘కల్ట్’ సినిమాను అక్టోబరు 30న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.‘‘ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ అప్పీల్తో కూడిన కథ ఉన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
అక్టోబరులో పూర్తి
మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రాజమౌళి దర్శకత్వంలో కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇందులో రుద్ర, శ్రీరాముడు.. ఇలా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా, ప్రకాష్రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని తెలిసింది. ‘వారణాసి’లో తన వంతు షూట్ను పూర్తి చేయడానికి మహేశ్బాబు 15 రోజులు షూటింగ్లో పాల్గొంటే సరిపోతుందట. అక్టోబరు కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఎస్ఎస్ కార్తికేయ పేర్కొన్నారు. -
ఆ నలుగురు సేఫ్.. ఆ ఇద్దరు వరస్ట్.. వీకెండ్ హైలెట్స్ ఇవే..!
బుల్లితెర రియాలిటీ షో అప్పుడే రెండో వారం చివరికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. ఈ వారం నేను చాలా ఎంజాయ్ చేశానని నాగ్ అన్నారు. అయితే ఈ వారంలో ఇద్దరు హౌస్లో ఉన్నట్లు అనిపించలేదని తెలిపారు.ఆ ఇద్దరు కృష్ణుడు, సృష్టి అని తెలియజేస్తూ ఓ వీడియోను చూపించారు. ఈ వారంలో వాళ్లిద్దరు హౌస్లో ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్లు వీడియోలో కనిపించింది. దీంతో వాళ్లద్దరినీ స్టోర్ రూమ్కు పంపించారు. అదే క్రమంలో సింగర్ ఝాన్సీపై ప్రశంసలు కురిపించారు. హౌస్లో నువ్వే తొలి మహిళ కెప్టెన్ అని కొనియాడారు. ఆటను వందశాతం ఎఫర్ట్తో ఆడుతున్నావని అన్నారు.హౌస్మేట్స్ను తమ లైఫ్లో జరిగిన సీక్రెట్ విషయాన్ని చెప్పాలని నాగ్ అడిగారు. దీనికి కంటెస్టెంట్స్ తమ జీవితంలోని జరిగిన సంఘటలను రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత హౌస్లో మానిపులేటర్, పప్పెట్స్ ఎవరంటూ నాగ్ హౌస్మేట్స్ను అడిగారు.సుధీర్ను వర్షిని మానిపులేట్ చేస్తోందని చరణ్ అన్నారు. ఆ తర్వాత గేమ్లో రూల్స్ చదవకుండా గేమ్ ఆడతావా అని చరణ్ను నాగ్ ప్రశ్నించారు. ఇది మళ్లీ రిపీట్ చేయొద్దని సూచించారు. ఆ తర్వాత రామ్ ప్రసాద్ను మానిపులేటర్ ఎవరని అడగ్గా.. వంశీని త్రిగుణ్ కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. త్రిగుణ్ చేతిలో వంశీ పప్పెట్ అని తేలిపోయింది. రోహిత్ సైతం వంశీ, త్రిగుణ్నే ఎన్నుకున్నారు.సంచాలక్గా ఇద్దరు ఫెయిల్..సంచాలక్గా రామ్ ప్రసాద్ ఫెయిల్ అయ్యావంటూ నాగ్ అన్నారు. దీనికి అవును సార్ అంటూ రామ్ ప్రసాద్ తన తప్పును అంగీకరించారు. ఆ తర్వాత హౌస్లో చరణ్ను రోహిత్ మానిపులేట్ చేస్తున్నారని వర్షిని చెప్పింది. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. అవుననే ఎక్కువమంది ఓటేశారు.ఆ తర్వాత వర్షినిని సంచాలక్గా సరిగ్గా వ్యవహరించలేదని నాగ్ అన్నారు. సంచాలక్గా మీ నిర్ణయం కరెక్ట్గా లేదని.. అందుకే ఈ వారంలో నువ్వు సంచాలక్గా ఉండడానికి వీల్లేదని నాగార్జున చెప్పేశారు. గేమ్లో భాగంగా షాలిని, వర్షిణి మధ్య జరిగిన ఫైట్లో షాలినిదే తప్పని నాగ్ తేల్చేశారు. ఈ వారంలో ముకేశ్, దేబ్జానీ, ఝాన్సీ, శాలిని సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత త్రిగుణ్, కృష్ణుడు, సృష్టి, సుధీర్, వర్షిణి, రోహిత్ అన్సేఫ్గా మిగిలారు. -
వీకెండ్ ఎంటర్టైన్మెంట్.. ఆ ఇద్దరిపై నాగ్ సీరియస్..!
ఈ ఏడాది బిగ్బాస్ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్సీ రేస్ ముగియడంతో ఎలిమినేషన్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశముంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో నాగార్జున కంటెస్టెంట్స్కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.హౌస్లో సృష్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగా.. ఆట బాగా ఆడితే తానే కిస్ ఇస్తానంటూ కౌంటరిచ్చాడు. ఈ వీక్లో కృష్ణుడు, సృష్టి ఆటతీరుపై నాగ్ అగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరిని వెనకవైపు కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. మీరిద్దరు కేవలం ప్రేక్షకుల్లాగే వీక్షించాలని నాగ్ అన్నారు. ఈ ప్రోమోలో నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. నాని మూవీ ది ప్యారడైజ్ లుక్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రోమో ఇవాల్టి ఎపిసోడ్పై బిగ్బాస్ ఆడియన్స్లో మరింత ఆసక్తి పెంచుతోంది. -
బీచ్కి రావాలంటే అమ్మాయి ఉండాల్సిందే.. బోల్డ్గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డానీ’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ల మీద రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్జీ గోగణ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామా నుంచి ఫస్ట్ స్ట్రైక్ ను తాజాగా విడుదల చేశారు.‘నువ్వు బీచ్కి ఎప్పుడూ ఒంటరిగా వస్తావా?’.. అని అమ్మాయి అడగడం.. ‘నేను బీచ్కి రావాలంటే కచ్చితంగా అమ్మాయి ఉండాల్సిందే’ అని హీరో చెప్పే డైలాగ్.. ఆ తర్వాత వచ్చే బోల్డ్ డైలాగ్, బీచ్లో అమ్మాయి అందాలు ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ టీజర్ని గమనిస్తే కావాల్సినంత యాక్షన్తో పాటు రొమాన్స్ కూడా ఉందని అర్థం అవుతోంది. బోల్డ్, రా అండ్ రస్టిక్గా ‘డానీ’ రానుందని ఈ ఫస్ట్ స్ట్రైక్ చెప్పకనే చెబుతోంది.కళ్యాణ్జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్లో వచ్చిన ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబో మరోసారి ‘డానీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ఆసక్తి, క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.డానీ ఫస్ట్ స్ట్రైక్ లోని విజువల్స్, కెమెరా వర్క్ టాప్ నాచ్లో ఉంది. సాయి కార్తీక్ బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీకి ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏకే ఆనంద్ కెమెరామెన్గా, మణికాంత్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. -
'ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే'.. ఇట్లు అర్జున టీజర్ చూశారా?
అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఇట్లు అర్జున. ఈ మూవీతోనే అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్ ఎంటర్టైనర్కు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మొదటి సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ చూస్తే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ టీజర్లో సన్నివేశాలు కామెడీతో పాటు థ్రిల్ పంచేలా ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. Arjun & Keerthi welcomes you to their world filled with love, silence & a hint of madness ❤️🔥#ItlluArjuna Teaser Out Now!— https://t.co/UlrwGqDjQITHIS OCTOBER 30th, 𝘩𝘪𝘴 𝘭𝘰𝘷𝘦 𝘸𝘪𝘭𝘭 𝘣𝘦 𝘩𝘦𝘢𝘳𝘥 𝘪𝘯 𝘵𝘩𝘦𝘢𝘵𝘦𝘳𝘴 𝘸𝘰𝘳𝘭𝘥𝘸𝘪𝘥𝘦 🫶💥A @MusicThaman Musical… pic.twitter.com/ZmNVv1RAZu— What Next Entertainments (@WhatNextEnts) September 19, 2026 -
‘కోకో కొకొరొకో..నేనో నాటుకోడి’.. ఈ పాట విన్నారా?
తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ముగ్గురు కోతులు’.కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్షిక పాశం హీరోయిన్గా నటించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు ఆడియెన్స్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ ఆడియెన్స్కి నచ్చే మంచి ఐటం నంబర్ను విడుదల చేశారు.నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కో కో కొకొరొకో’ అంటూ సాగే స్పెషల్ ఐటం సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ముగ్గురు కోతులు’ చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.‘కోకో కొకొరొకో’ అంటూ సాగే ఈ పాటకు జగదీష్ అందించిన సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది. సుహాస్ ఇచ్చిన బాణీ అయితే శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. లాస్య ప్రియ ఆలపించిన పాట కుర్రకారుకి ఇన్ స్టంట్గా ఎక్కేసేలా ఉంది. ఈ సాంగ్లో ముగ్గురు హీరోలు, వారితో పాటు స్టెప్పులు వేసిన నటీమణి, ఆమె అందాలు హైలెట్ కానున్నాయి. వినోద్, రఘు, సాయి కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్లో బ్లాస్ట్ కానుంది. -
‘ఇరుముడి’.. ఇంకాస్త ఆగితే బాగుండేది!
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా రెండు వారాలకు మించి ఆడడం లేదు. అది కూడా హిట్ టాక్ వస్తేనే. ఇక యావరేజ్ టాక్ వస్తే.. మూడు రోజులకే థియేటర్స్ నుంచి ఖాలీ చేస్తున్నారు. అలాంటిది ‘ఇరుముడి’ నెల రోజులుగా థియేటర్స్లో రన్ అవుతూ.. రవితేజ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా కోసం థియేటర్స్కి వెళ్తున్నారు. అంతలోనే ఓటీటీలోకి వదిలేశారు మేకర్స్. ఫలితంగా ఈ చిత్రం ఓ మంచి రికార్డును కోల్పోయింది.100 కోట్ల రికార్డు మిస్శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం ఆగస్ట్ 21న థియేటర్స్లో విడుదలైంది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి థియేటర్స్ అన్ని నిండిపోయాయి. అలా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. ఇక మొత్తంగా రూ. 240 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అందులో ఒక్క నైజాం ఏరియా నుంచే రూ.90 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇంకో వారం ఆగితే రూ. 100 కోట్ల క్లబ్లో చేరేది. కానీ అంతలోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఫలితంగా నిన్నటి నుంచి ఈ సినిమాకు టికెట్స్ పెద్దగా తెగడం లేదు. ఇంట్లోకి వచ్చిన సినిమా కోసం థియేటర్స్కి వెళ్లడం కష్టమే. వారం రోజుల తర్వాత ఓటీటీలోకి వదిలితే.. రూ. 100 కోట్ల కలెక్షన్స్ ఈజీగా వచ్చేవని సినీ పండితులు అంటున్నారు. అలా అయితే నైజాంలో రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించిన అతి కొద్ది సినిమాల జాబితాలో ఇరుముడి కూడా చేరేది.రూ. 250 రికార్డు కోల్పోయిందిఇరుముడి చిత్రం మరో రికార్డును కూడా కోల్పోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 240 కోట్లు వసూలు చేసింది. ఈ వారం కూడా తెలుగులో పెద్ద సినిమాలేవి రిలీజ్ కాలేదు. విడుదలైన చిన్న చిత్రాలేవి హిట్ టాక్ని సంపాదించుకోలేదు. అలా చూస్తే.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి చిత్రం హవానే కొనసాగేది. ఈ నెల 24 వరకు అయితే కచ్చితంగా ఈ సినిమా థియేటర్స్లో ఆడేది. ఆ తర్వాత ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఈ సినిమాని పక్కన పెట్టేవారు. ఈ వారంలో ఓవరాల్గా రూ. 10 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం అయితే మెండుగా ఉంది. కానీ సడెన్గా ఓటీటీలో రిలీజ్ చేయడంతో.. ఇప్పుడు ఆ స్థాయి కలెక్షన్స్ రావడం కష్టమే. అలా వస్తే..రూ. 250 కోట్ల క్లబ్లో కూడా ఈ చిత్రం నిలిచేది. మొత్తంగా ఇరుముడి ఓ రెండు రికార్డులను అయితే కోల్పోయింది. -
‘ది ప్యారడైజ్’లో ‘సమ్మక్క’.. అంచనాలు పెంచేసిన నాని
ది ప్యారడైజ్.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్, టీజర్ ..ప్రతీది సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్కి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం అంతా ప్రమోషన్స్లో బిజీ అయిపోయింది. నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడమేకాకుండా..సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.ఇది ‘సమ్మక్క’ కథ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నానికి సినిమా టైటిల్పై ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ ది ప్యారడైజ్ చిత్రానికి మరో పేరు పెట్టాల్సి వస్తే..ఏం పెడతారు?’ అని యాంకర్ అడిగింది. దానికి నాని వెంటనే ‘సమ్మక్క’ అనే టైటిల్ ఈ కథకు వందశాతం సెట్ అవుతుందని చెప్పారు.(ఇదీ చదవండి: ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..)సమ్మక్క ఎవరు?నాని నోటి నుంచి సమ్మక్క అనే పేరు రావడంతో.. అసలు సమ్మక్క ఎవరు? భారీ యాక్షన్ కథకు ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాని తల్లి పెరు ‘సమ్మక్క’ అట. ఇది తల్లి కొడుకు కథ అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా సార్లు చెప్పారు. తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పాడు. అందుకే నాని ఈ కథకు ‘సమ్మక్క’ అనే టైటిల్ సరిపోతుందని చెప్పాడు. (ఇదీ చదవండి: ‘పీరియడ్స్ వస్తే నరకం.. నొప్పి భరించలేక కార్వాన్లో..’) తల్లి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ఉంటాయట. ఈ సినిమాలో నాని తల్లిగా మరాఠి నటి సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె లుక్, క్యారెక్టర్ డిజైన్ గురించి ఇప్పటి వరకు ఏ విషయం బయటకు రాలేదు. ఇప్పుడు నాని చేసిన కామెంట్స్తో ఆ పాత్రను ఎలా చూపిస్తారనే అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. -
బన్నీ ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. పాన్ వరల్డ్ మైథలాజికల్ విజువల్ వండర్ గా రూపొందుతోంది. అయితే రాకా నుంచి బిగ్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ అప్డేట్పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు)37 అనే క్రిప్టిక్ పోస్టర్ను..ఇటీవలే 37 అనే క్రిప్టిక్ పోస్టర్ను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్చ్ షేర్ చేయడంతో అభిమానుల్లో ఇంతటి ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 21న అట్లీ పుట్టినరోజు కావడంతో ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దీన్ని చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఓ సరికొత్త విజువల్స్తో వేరే ప్రపంచాన్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోనే కీలక పాత్రలో కనిపించనుంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసినట్లు టాక్. రష్మిక మందన్న నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ సినిమా 2028లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. Get ready to witness a global triumph! ✨ #Raaka pic.twitter.com/IWAskqz7Lw— Sun Pictures (@sunpictures) September 18, 2026 -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్తో..‘అగధ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 25 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంటి నుంచే ఈ మిస్టిక్ థ్రిల్లర్ను చూసే అవకాశం దక్కింది. రెండు గంటల 17 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్తో పాటు హీరోహీరోయిన్లు, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్కు ప్రశంసలు దక్కాయి. హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘అగధ’ ఓటీటీ ప్రీమియర్ ఆసక్తికరంగా మారింది.కథ ఏంటంటే..మహిమ (ఉల్కా గుప్తా) ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఓ గుహను చూస్తుంది. ఆ గుహ వద్ద ఓ వింత ఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బబ్లూ మరణిస్తాడు. ఆమె ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి) మాత్రం కనిపించడు. ఇంకో వైపు మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఊర్లోని ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటుంది. ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. ఇక కొన్ని రోజులకు మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి మహిమ మరణంతో మహాదేవి సొంత ఊరికి వస్తుంది. తన ఇంటికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉందని మహాదేవి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో సింహా నుంచి మహాదేవి తెలుసుకున్న అంశాలు ఏంటి? ఈ షికావో గుహ వద్ద ఏం జరిగింది? అసలు ఈ అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్ని ఈ అగధ ఎందుకు చంపుతోంది? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? ఈ కథలో హరిణి (జోవికా విజయ్ కుమార్) పాత్ర, బాబా (షిజు) కారెక్టర్ ఏంటి? అన్నదే కథ. ఇదీ చదవండి: ‘పీరియడ్స్ వస్తే నరకం.. నొప్పులు భరించలేక..: శ్రుతిహాసన్ View this post on Instagram A post shared by Zee 5 Telugu (@zee5telugu) -
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘ఇరుముడి’ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సినిమా మిస్ అయినవారు ఇంటి వద్దే చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుండడంతో వైరల్గా మారుతున్నాయి.ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు.. ముఖ్యంగా పల్లెల్లో ‘ఇరుముడి’ని ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. వీధుల్లో పెద్ద స్క్రీన్లు పెట్టి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సినిమాను చూస్తున్న వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా కొన్ని గ్రామాల్లో వెండి తెరపై సినిమాను ప్రదర్శించడం విశేషంగా మారింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులు ఇలా తమ గ్రామాల్లోనే సినిమాను చూసే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘ఇరుముడి’ ఓటీటీలోనే జోరు చూపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రామల్లో ప్రదర్శనల వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.200 కోట్లకు పైగా కలెక్షన్లుకాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో విశేషాదరణ దక్కించుకుంది. దీంతో బాక్సాఫీసులో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబరు 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదీ చదవండి: బిగ్బాస్ తొలి కెప్టన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా Vizianagaram district devada village lo irumudi movie grama prajalu inkaa aadharisthunnaru. Vinayaka chavithi sandharbam gaa committee members ilaa grama prajaliki chupisthunnaru🙏🙏🙏#irumudimovie #mythrimoviemakers#gvprakash#raviteja#sivanirvana pic.twitter.com/xPBhrmbrlJ— 𝗥𝗔𝗝𝗔𝗦𝗔𝗔𝗕 (@RAJU_BHAI_LUV) September 18, 2026 -
బిగ్బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ రేసు ఆసక్తికరంగా సాగింది. ఓవైపు కంటెస్టెంట్లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడుతుండగా.. మరోవైపు హౌస్లో నవ్వులు పూయించేలా కామెడీ స్కిట్ చేశారు. రాంప్రసాద్, నరేశ్, వంశీ, రోహిత్, అమన్ కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఓ సూరీడు’ కామెడీ సీన్ను రీక్రియేట్ చేశారు. మరి నిన్నటి ఎపిసోడ్లో ఝాన్సీ కెప్టెన్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి!ఓ సూరీడు.. అదిరిపోయిన స్కిట్స్కిట్లో వంశీ ప్రభాస్ పాత్రలో కనిపించగా.. రాంప్రసాద్ చిన్న పిల్లాడు సూరీడుగా అలరించాడు. నరేశ్ రౌడీ కాట్రాజ్ పాత్రలో నటించాడు. అమన్ వంశీ ఫ్రెండ్గా కనిపించగా.. ఝాన్సీ సూరీడు తల్లి పాత్రలో నటించింది. సినిమా సీన్ను హౌస్మేట్స్ తమదైన శైలిలో రీక్రియేట్ చేయడంతో స్కిట్ మొత్తం నవ్వులు పూయించింది. స్కిట్ పూర్తయ్యాక బిగ్బాస్ కూడా మంచి మార్కులే ఇచ్చాడు. స్కిట్ బాగుంది.. కానీ నరేశ్ కాట్రాజ్ పాత్రలో కండలు మరీ ఎక్కువగా చూపించాడంటూ సరదాగా కామెంట్ చేశాడు. అలాగే రాంప్రసాద్ను ఉద్దేశించి సూరీడు మరీ పసిపిల్లాడిలా అయిపోయాడంటూ జోక్ చేశాడు.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘చిక్కకు దొరకకు’.. కెప్టెన్సీ టాస్క్ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న ముకేశ్, షాలిని, ఝాన్సీ, రాంప్రసాద్, త్రిగుణ్లకు బిగ్బాస్ ‘చిక్కకు దొరకకు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో మిగిలిన పది మంది గార్డులుగా వ్యవహరించాలి. ఈ ఐదుగురు పోటీదారులు జైలులో ఉండాలి. గార్డుల నుంచి తప్పించుకుని గోడ దాటి సేఫ్ జోన్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. సేఫ్ జోన్లోకి చేరుకోలేని పోటీదారులు కెప్టెన్సీ రేసు నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ టాస్క్లో వంశీ, రోహిత్ హెడ్ గార్డులుగా వ్యవహరించారు. టాస్క్ ప్రారంభానికి ముందు ఐదుగురు పోటీదారులు తాము ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరూ కెప్టెన్ అయితే హౌస్లో ఏం చేస్తారో చెప్పారు. ఇదీ చదవండి: మహిళల అభివృద్ధికి సినీ సెలబ్రిటీల సంచలన నిర్ణయంబయట ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినట్టుగానే.. హౌస్లోని కంటెస్టెంట్లు కూడా తాము కెప్టెన్ అయితే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. దీంతో వారి చిన్నపాటి ‘కెప్టెన్సీ మేనిఫెస్టో’ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత గార్డులు తమ నిర్ణయం ప్రకారం చివరికి రాంప్రసాద్, ఝాన్సీలను కెప్టెన్సీ పోటీలో నిలిపారు. దీంతో వీరిద్దరి మధ్య చివరి పోటీ ఆసక్తికరంగా మారింది.ఝాన్సీనే కొత్త కెప్టెన్రాంప్రసాద్, ఝాన్సీలకు బిగ్బాస్ ‘పవర్ ఆఫ్ కెప్టెన్సీ’ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇద్దరు పోటీదారుల ముందు ఇనుప నెట్ను ఏర్పాటు చేశారు. పట్టకర్రతో ఆ నెట్ను తొలగిస్తూ లోపలికి వెళ్లాలి. అక్కడ ఉన్న పెట్టెలోని కీని తీసుకుని.. అందులో ఉన్న చిన్న మూటను తీసుకోవాలి. ఆ మూటలో ఉన్న ‘C’ అనే లెటర్ను జెండాకు అతికించి.. ఆ తర్వాత కెప్టెన్ జెండాను ఎగరేయాలి. ఈ టాస్క్లో రాంప్రసాద్పై ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్బాస్ హౌస్కు కొత్త కెప్టెన్గా ఝాన్సీ నిలిచింది. కెప్టెన్గా ఎంపికైన ఝాన్సీకి వైట్ గోల్డ్ సంస్థ.. లక్ష విలువైన గోల్డ్ కాయిన్ బహుమతిగా అందించింది. అనంతరం ఝాన్సీ కోసం ప్రత్యేకంగా కెప్టెన్సీ గదిని కూడా బిగ్బాస్ ఓపెన్ చేశాడు. అయితే ఆ రూంలో కెప్టెన్కి మాత్రమే ప్రవేశం ఉంటుందని గుర్తుచేశాడు.ఇదీ చదవండి: ‘ఆయా షేర్’ రీల్స్ కోసం లక్ష జడలు కొన్నారు: నాని -
కిరణ్ అబ్బవరం నిర్మాణంలో మరో సినిమా.. ఆసక్తిగా టీజర్
కిరణ్ అబ్బవరం హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పటికే తన బ్యానర్లో తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో నిర్మాతగా మారారు. తాజాగా తన క ప్రొడక్షన్స్ నిర్మాణంలో మరో సినిమా వచ్చేస్తోంది. ఈ సారి థ్రిల్లర్ జానర్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో వస్తోన్న థ్రిల్లర్ మూవీ హతః. ఈ సినిమాకు అనుష్ గోరాక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లోని సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని దీపావళి కానుకగా నవంబరు 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు జేసిన్ జార్జ్ సంగీతమందిస్తున్నారు. -
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు మనదేశం నుంచి ఊహించని చిత్రం ఎంపికైంది. దాదాపు 30కి పైగా సినిమాలు పోటీపడగా..ఇండియా నుంచి ఓ చిన్న మూవీ జాక్పాట్ కొట్టేసింది. మరాఠీలో తెరకెక్కించిన గోంధాల్ మూవీ ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 99వ అకాడమీ అవార్డులకు గానూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఎంపిక చేసింది.ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్లో మై వాపస్ ఆవుంగా, బోర్డర్ 2, ధురందర్, 120 బహదూర్, సింగ్ గీతం, పెద్ది, ఇరుముడి, లాంటి సినిమాలు కూడా పోటీపడ్డాయి. ఈ చిత్రాలను వెనక్కి నెట్టి గోంధల్ అర్హత సాధించింది. ఈ లిస్ట్లో గోంధాల్ తర్వాత స్థానంలో ఇక్కీస్, అంఘ్ సినిమాలు నిలిచాయని జ్యూరీ వెల్లడించింది. గోంధాల్ మూవీ భారతీయ సంస్కృతిని చక్కగా చూపించారని..సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయని జ్యూరీ సభ్యుల్లో ఒకరు అన్నారు.ఈ చిత్రం ఒక రాత్రంతా జరిగే జానపద ప్రదర్శన అయిన సాంప్రదాయ మహారాష్ట్ర గోంధాల్ ఆచారం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంతో దర్శకుడు సంతోష్ దావఖర్ అరంగేట్రం చేశారు. ఇది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అక్కడ స్పెషల్ జ్యూరీ గుర్తింపుతో సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. గతేడాది నవంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ పరిమిత వసూళ్లు మాత్రమే సాధించింది. కాగా.. 99వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14, 2027న జరగనుంది. -
కెప్టెన్సీ పోరు.. షాలిని వర్సెస్ వర్షిణి.. హౌస్లో మాటల యుద్దం..!
బిగ్బాస్ హౌస్లో ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ నడుస్తోంది. హౌస్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు కంటెస్టెంట్స్ శతవిధాల పోటీపడుతున్నారు. ఈ రేసులో ఐదుమంది పోటీలో నిలిచారు. వీరికి బిగ్బాస్ టాస్క్లు పెట్టి పరుగులు పెట్టించాడు. పదిమంది కంటెస్టెంట్స్ను గార్డ్స్గా పెట్టగా.. మిగిలిన ఐదుగురు వాళ్లను దాటుకుంటూ వెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలి.ఈ టాస్క్లో షాలిని, వర్షిణి మధ్య మాటల యుద్ధం జరిగింది. షాలినిని వయసులో నువ్వు చిన్నదానివంటూ వర్షిణి అనడంతో మాటమాట పెరిగింది. దీంతో కాసేపు వీరిద్దరి మధ్య మాటలతో బిగ్బాస్ హౌస్ హోరెత్తింది. ఈ ప్రోమో చూస్తుంటే కెప్టెన్సీ రేసు కోసం కంటెస్టెంట్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి ఎపిసోడ్లో కెప్టెన్సీ ఎవరినీ వరిస్తుందో తెలియాలంటే మీరూ కూడా బిగ్బాస్ చూసేయాల్సిందే. -
శ్రీనందు లేటేస్ట్ మూవీ.. మగాళ్ల కోసమేనా?
టాలీవుడ్ హీరో శ్రీనందు, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ మగాళ్లు జిందాబాద్. ఈ సినిమాకు నారా ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ టైటిల్ చూస్తుంటే మగాళ్ల జీవితాల నేపథ్యంలోనే కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో వైవా హర్ష, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాలా, మదిన్ ఎస్కే సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. -
‘సీక్రెట్ సోల్జర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సీక్రెట్ సోల్జర్నటీనటులు:నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.నిర్మాణ సంస్థ: మూన్ లైట్ డ్రీమ్స్రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డిసంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతుఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్విడుదల తేది: సెప్టెంబర్ 18, 2026కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన మీరావలి అలియాస్ వలి (నిహాల్ కోదాటి), పృథ్వి (సూర్య శ్రీనివాస్) ప్రాణ స్నేహితులు. వలికి దేశభక్తి ఎక్కువ. అయినా కూడా మతం కారణంగా అందరూ అతని దేశ భక్తిని అనుమానిస్తుంటారు. దీంతో తన దేశభక్తిని చాటేందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటాడు. కానీ అది చేజారిపోతుంది. దీంతో ‘రా’(Raw)లో చేరాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే.. ఇతనిపై ఉగ్రవాది అనే ముద్రపడుతుంది. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ చేయడంలో వలి పాత్ర ఉందని అనుమానిస్తారు. ‘రా’ అధికారులు తమదైన శైలీలో విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు తెలుస్తాయి. అవేంటి? కీలకమైన డిఫెన్స్ సమాచారం లీకేజీ వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు? వారి లక్ష్యం ఏంటి? దేశం కోసం వలి ఏం చేశాడు? వలికి సంబంధించిన కీలక సమాచారం తెలిసిన తర్వాత పృథ్వి ఏం చేశాడు? ఇద్దరు మిత్రులు ఈ మిషన్లో ఎలా భాగమయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్తో తెరకెక్కిన చిత్రమే సీక్రెట్ సోల్జర్. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీకైన సంఘటనకు, నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యను పరిష్కరించగలిగారా లేదా? అనేది ఈ సినిమా కథ. దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి ఈ స్పై యాక్షన్ డ్రామాను చాలా డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశాడు. స్పై డ్రామా సినిమాల్లో కనిపించే హంగులేవి ఇందులో కనిపించవు.ఫస్టాఫ్ అంతా ఇద్దరు స్నేహితుల చుట్టూనే తిరుగుతుంది. విభిన్నమైన నేపథ్యలు ఉన్న ఈ ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఊర్లో సాదాసీదాగా తిరిగే ఈ ఇద్దరు కుర్రాళ్లు.. డిఫెన్స్ సమాచారం లీకేజీ ఇష్యూలోకి ఎలా వచ్చారనేది సహజంగా చూపించారు.ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఉగ్రవాదుల మిషన్ని అడ్డుకునేందుకు ‘రా’టీమ్ చేసే ప్రయత్నాలు..ఇందులో స్నేహితులిద్దరూ భాగమయ్యే తీరు, వాళ్లు చేసే సాహసాలు అన్ని ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు హీరో క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం బాగోలేదు. ఒక స్పైగా అతన్ని చూపించి.. శత్రువుల చేతుల్లో ఎప్పుడూ ఓ పావులాగే మారేలా చేశారు. ఆ పాత్ర చేసే సాహసాల కంటే శత్రువులు వేసిన ఎత్తుగడలే గొప్పగా చూపించారు. అలాగే దేశభద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను శత్రువులు తస్కరించే తీరు కూడా మరీ సినిమాటిక్గా అనిపిస్తుంది. అయితే కొంతమంది గూఢచారుల జీవితాలు ఎలా ముగుస్తాయి? వాళ్లకు దక్కే గుర్తింపు ఎలా ఉంటుంది? అనేది ఇందులో చూపించిన తీరు బాగుంది. కథను మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. దేశభక్తి ఎక్కువగా ఉన్న వలి పాత్రలో నిహాల్ కోదాటి చక్కగా నటించాడు. ఇక ధనవంతుడి కొడుకుగా సూర్య శ్రీనివాస్ ఒదిగిపోయాడు. వీరిద్దరు స్నేహబంధం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిజమైన ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుకుంటారు? ఆపద వస్తే ఎలా ఆదుకుంటారు? అనేది చాలా సహజంగా చూపించారు. హర్షిత బండ్లమూరి, శిరీష నూలుతో పాటు రఘుబాబు, తులసి, వడ్లమాని శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగార్, కమల్ కామరాజు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ రివ్యూ
టైటిల్: పిఠాపురంలో అలా మొదలైందినటీనటులు: డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, తదితరులునిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య)దర్శకత్వం: మహేశ్ చంద్రవిడుదల తేది: సెప్టెంబర్ 18, 2026కథేంటంటే..పిఠాపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ప్రెసిడెంట్ వీర రాఘవ(రాజేంద్రప్రసాద్), స్కూల్ మాస్టర్ విశ్వనాథం(కేదార్ శంకర్), భూస్వామి బంగారయ్య(పృథ్వీ)..ముగ్గురు మంచి స్నేహితులు. వీరి కూతుళ్లు అంజని(ప్రత్యూష), కీర్తన(శ్రీలు), గీత(రిహానా)కూడా చిన్నప్పటి నుంచి కలిసే ఉంటారు. పదో తరగతి తర్వాత ఇంటర్ చదివేందుకు పిఠాపురం వెళ్తారు. ముగ్గురు ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. అక్కడ కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముగ్గురు ముగ్గరు అబ్బాయిలతో ప్రేమలో పడతారు. టాపర్గా నిలిచే గీత.. డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. గీత..జల్సాలకు అలవాటు పడి..ప్రియుడు ఆకాశ్ మాటలు విని గోవాకు పారిపోతుంది. ఇలా ఇద్దరు స్నేహితులు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తన ప్రేమ విషయం నాన్నకు చెప్పేందుకు అంజని భయపడుతుంది. చివరకు తన ప్రేమ విషయాన్ని నాన్న వీర రాఘవకు చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తల్లిదండ్రుల ప్రేమను కాదని ప్రియుడుతో వెళ్లాలనుకున్న గీత, కీర్తన..పెరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలకున్న అంజన.. వీరిలో ఎవరి నిర్ణయం మంచిదైంది? తల్లిదండ్రుల పెంపకం.. పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ప్రేయసి రావే, చెప్పాలని ఉంది, ఆలస్యం అమృతం లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ టాలీవుడ్ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు చంద్ర మహేశ్. చాలా కాలం తర్వాత తన పేరును మహేశ్ చంద్రగా మార్చుకొని ‘పిఠాపురంలో అలా మొదలైంది’అనే సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు కావడం.. టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ‘పిఠాపురంలో అలా మొదలైంది’సినిమాపై కొంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలతో సినిమాకు వెళ్తే మాత్రం కొంత నిరాశ తప్పదు. అలా అని తీసిపారేసే సినిమా అని చెప్పలేం. పాత తరహా కథాంశాన్నే ఎంచుకున్నప్పటికీ, నేటి యువతకు, తల్లిదండ్రులకు ఒక మంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, ఇచ్చిన సందేశం బాగుంది. అయితే దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాల రొటీన్గా ఉన్నాయి. బ్రహ్మానందం వాయిస్ ఓవర్తో ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ కథ ప్రారంభం అవుతుంది. ముగ్గురు యువతులు..వారి పెరెంట్స్ చుట్టూ కథ తిరుగుతుంది. ఫస్టాప్ మొత్తం స్కూల్ డేస్.. కాలేజీ.. కొత్త పరిచయాలతో అమ్మాయిల్లో వచ్చే మార్పులు..లవ్ ట్రాక్..ఇలా సాగుతుంది. అయితే ఆయా సన్నివేశాలన్నీ రొటీన్గానే ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఇంట్లో నుంచి పారిపోయిన గీత, కీర్తనలకు ఎదురైన సమస్యలు చూపించారు. ఆ సన్నివేశాలు ఎమోషనల్గా సాగుతాయి. అయితే ఈ తరహా కథలను ఆల్రెడీ చూసేయడంతో కొత్తగా అనిపించదు. క్లైమాక్స్తో అందరు కలవడం.. పెళ్లి తంతు, పెరెంట్స్ భావోద్వేగాలు అన్ని ఆకట్టుకుంటాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్ చెప్పే మాటలు కూడా ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారంటే.. ప్రెసిడెంట్ వీరరాఘవ పాత్రకి రాజేంద్ర ప్రసాద్ న్యాయం చేశాడు. ఆయన అనుభవం ఈ పాత్రకు చాలా ఉపయోగపడింది. ఇక స్ట్రిక్ట్ ఫాదర్గా కేదార్ శంకర్ బాగా నటించాడు. బాగా డబ్బున్న తండ్రిగా పృథ్వీ మెప్పించాడు. ముగ్గురు యువతులుగా చేసిన రిహానా, శ్రీలు, ప్రత్యూష తమ క్యారెక్టర్ల పరిధి మేరకు చక్కని అభినయం కనబరిచారు. గ్లామర్ పరంగానే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
మహిళల అభివృద్ధికి సెలబ్రిటీల సంచలన నిర్ణయం
మహిళల అభివృద్ధికి సెలబ్రిటీలు పెద్దపేట వేస్తున్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరుతో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో పాల్గొనేందుకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భాగమవుతున్నారు.1000మంది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్నిన్న( సెప్టెంబర్ 17) నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూనే సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. 1000మంది మహిళలకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ దశగానే బాలీవుడ్ యాక్టర్స్ సైతం అడుగులు వేశారు. తాజాగా ముంబైలోని లాల్బాడ్చా రాజాను దర్శించుకున్న రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, అలియా భట్ ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.‘సేవా సంకల్ప్ అభియాన్లో పాల్గొని 1000మంది బాలికలను చదివిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పనిని వినాయకుడు నా వెనుక ఉండి నడిపిస్తాడని నమ్ముతున్నాను’ అని రణ్వీర్ తెలిపారు. అలియా భట్, రణ్బీర్ కపూర్ కూడా ముంబైలోని 20 పాఠశాలలను డెవలెప్మెంట్ చేసే బాధ్యతలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. (ఇదీ చదవండి: రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!) Ranveer Singh has already shaken up the others lobby with Dhurandhar. 🫡And today, once again, by seeking Ganpati’s blessings on Narendra Modi’s birthday, he has slapped again others lobby right in the face Ranveer: Mera pichla saal kafi accha gaya mere liye aur mere… pic.twitter.com/LjQ9xHgq9v— NIKs (@Neeteshx5) September 17, 2026 -
జాంబీల ప్రపంచంలోకి ఉపేంద్ర ఎంట్రీ
తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాంబీ రెడ్డి2’. 2021లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్గా రూపొందిస్తున్నారు. సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆరోజు(సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టినరోజు కావడంతో ఈయనకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ని చిత్రం బృందం విడుదల చేసింది. పోస్టర్లో ఆయన చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న ఫొటో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.కాగా బాలనటుడిగా అందరి ప్రశంసలు పొంది ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమయ్యాడు తేజ సజ్జా. అతని పుట్టినరోజు(ఆగస్టు23)న పీపుల్స్ మీడియా అభిమానులకు ‘జాంబీ రెడ్డి నెక్ట్స్ లెవల్’ అంటూ ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్ రోబోతోందటూ ప్రకటించింది. మూవీ అప్డేట్ వచ్చిన నుంచి సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2027లో ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషల్లో విడుదల కానుంది. Wishing the Real Star @nimmaupendra a very Happy Birthday 💥#ZombieReddy2 NXT LVL will unleash a whole new flavour of madness, menace & mass with his never-before-seen avatar ❤️🔥🧟♂️Superhero @tejasajja123 @Suparn @PrasanthVarma #ShanayaKapoor @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/pSPSdlozwY— People Media Factory (@peoplemediafcy) September 18, 2026 -
‘హీరో నానినే.. నా ఇన్స్పిరేషన్’
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది.(ఇదీ చదవండి: నటనకు ప్రాణం పెట్టిన తారలు.. కోట్లలో కలెక్షన్లు)డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ ‘టైటిల్ విని మా నిర్మాతలు ఈ సినిమా ని ఒకే చేశారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు మంచి ఆదరణ వచ్చింది. చాలా కష్టపడి ఈ సినిమాని తీర్చిదిద్దాం’ అని అన్నారు. ఖాన్ దురాని మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాని సెప్టెంబర్ 18 బదులు సెప్టెంబర్ 25 కి రిలీజ్ చేస్తున్నాం. పారడైజ్ కి పోటీ వెళ్తున్నారా అని చాలామంది అడిగుతున్నారు. మేము ఎవ్వరికీ పోటీ వెళ్లడం లేదు. మొన్న జరిగిన ఈవెంట్ లో కూడా చెప్పా నాని అంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నా ఇన్స్పిరేషన్’ అని అన్నారు. (ఇదీ చదవండి: రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!) -
రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. అజయ్-అతుల్ సంగీతం అందించిన ‘ఎందయ్యా సామి’ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాట అందుబాటులోకి రానుంది.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రణబాలిగా, రష్మిక మందన్న జయమ్మగా కనిపించనున్నారు. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల నేపథ్యంలో కథ సాగనుంది. 130 రోజుల పాటు షూటింగ్ జరిపిన ఈ మూవీ అక్టోబర్ 16, 2026న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
‘మిస్సింగ్ మేఘన’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
చిన్న సినిమా అయినా.. ట్రైలర్తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న చిత్రం మిస్సింగ్ మేఘన. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ అండ్ మిస్టరీ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ‘మిస్సింగ్ మేఘన’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(సెప్టెంబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమ కథంతా విశాఖపట్నంలో జరుగుతుంది. సొంతంగా బేకరీ రన్ చేస్తున్న మేఘన(అమ్ము అభిరామి) రాత్రి పది దాటినా..ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి(గోపరాజు రమణ) పోలీసులను ఆశ్రయిస్తాడు. వాళ్లు పట్టించుకోకపోవడంతో కాబోయే అల్లుడు ఏసీపీ అర్జున్(కౌశిక్) కి చెప్తాడు. అతను రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. బ్యాంకు మేనేజర్తో గొడవ జరిగిందనే విషయం తెలుస్తుంది. అతన్ని విచారిస్తే.. మేఘన మిస్సింగ్ తో తనకు సంబంధం లేదని చెబుతాడు. అలా అనుమానితులను ఒక్కొక్కరిని విచారించగా.. చివరగా బైక్ రైడర్ కార్తీక్ (రామ్ కార్తీక్) ఆమెను ఓ చోట డ్రాప్ చేశారనే విషయం తెలుస్తుంది. అతన్ని పిలిచి విచారిస్తే.. మేఘన ఎవరో తెలియదని.. ఆద్య(వైదిక సెంజాలియా)తో ఉన్న బ్రేకప్ స్టోరీ చెప్తాడు. అయితే మేఘన కాల్ లిస్ట్ చూస్తే.. గత కొన్నాళ్లుగా కార్తీక్తో మాట్లాడుతున్న విషయం బయటపడుతుంది. వారిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం కూడా ఏసీపీకి తెలుస్తుంది. అందులో నిజం ఎంత? ఏసీపీతో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కార్తీక్తో మేఘన నిజంగా ప్రేమలో పడిందా? మేఘనతో పరిచయం ఉన్నప్పటికీ..తనకు తెలియదని కార్తీక్ ఎందుకు చెప్పాడు? అసలు కార్తీక్-మేఘనల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కార్తీక్ -ఆద్యల బ్రేకప్ స్టోరీ ఏంటి? మేఘనను కిడ్నాప్ చేసిందెవరు? ఈ కథలో ఆకాశ్(అంకిత్ కొయ్య) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఓ వ్యక్తి మిస్ అవ్వడం.. ఆ కేసును చేధించే క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వడం.. చివరిలో అసలు నిందుతులను పట్టుకోవడం.. ఈ సినిమా కథనం కూడా అలానే సాగుతుంది. అయితే ఇందులో డిఫరెంట్ లవ్స్టోరీ ఉండడం కొత్త పాయింట్. అది కొంతవరకు ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా రొటీన్గానే సాగుతుంది. అయితే కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా..మరికొన్ని మాత్రం థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ రెగ్యులర్గా చూసేవాళ్లకు కీలకమైన ట్విస్టులు ముందుగానే ఊహించలగలరు. కానీ నార్మల్ ఆడియన్స్ మాత్రం వాటిని పసిగట్టలేరు. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఎలాంటి సాగదీత లేకుండా ఫస్ట్ సీన్తో అసలు కథ ప్రారంభించాడు. మేఘన కనిపించడంలేదని ఆమె తండ్రి పోలీసు స్టేషన్కి వెళ్లడం..ఏసీపీ రంగంలోకి దిగడం.. విచారణలో ఒక్కో విషయం బయటపడడం..ఇలా ఆసక్తికరంగా కథనం సాగుతుంది. అయితే ఫస్టాఫ్లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలలో ఎమోషన్ సరిగా పండలేదు. కార్తీక్ బ్రేకప్ స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉన్నా.. కాసేపటి తర్వాత పరుగులు పెడుతుంది. మిస్సింగ్ కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారడంతో దీని వెనుక ఎవరున్నారనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే అతను ఎవరనేది ఈజీగా అర్థమైపోతుంది. కానీ అతన్ని హీరో ఎలా పట్టుకుంటాడు అనేది మాత్రం ఆసక్తికరంగా చూపించారు. నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అయితే స్క్రీన్ప్లే, క్యాస్టింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. లవ్ ఫెయిల్యూర్ కుర్రాడు కార్తిక్ పాత్రలో రామ్ కార్తీక్ బాగా నటించాడు. ఇక మేఘన పాత్రకు అమ్ము అభిరామి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక ఏసీపీ అర్జున్ పాత్రలో కౌశిక్ బాగానే మెప్పించాడు. అంకిత్ కొయ్య పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక మేఘన తండ్రిగా గోపరాజు రమణ రెగ్యులర్ పాత్ర పోషించి.. మెప్పించాడు. వెంప కాశి, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, షాని, పండు.. తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే..ఆర్.ఆర్.ధృవన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్గానే ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గటు ఉన్నతంగా ఉన్నాయి. -
ఈసారి నాని కాదు.. ఆ పేరుతో పిలుస్తారు: నాని
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీనికి తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ తరహాలోనే చైన్నైలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సినిమా చూసి వచ్చాక..నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన చిత్రమిది. ఓ మంచి కథని భోవోద్వేగాలతో తెరపైకి తీసుకొస్తున్నాం. సినిమాపై చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఇప్పుడు నన్ను అంతా నాని అని పిలుస్తున్నారు. సినిమా చూసి వచ్చాక జడల్ అనే పేరుతో పిలుస్తారు. జడలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో మహిళలకు హ్యాట్సాఫ్. ఎందుకంటే జీవితాంతం ఆ జడలతోనే ఉంటారు. కయాదు చాలా బాగా నటించింది. సుబ్బు అనే పాత్రకు నూరుశారం న్యాయం చేసింది’ అని అన్నారు. (ఇదీ చదవండి: బిగ్బాస్లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..)కాగా ట్రైలర్ లేకుండా డైరెక్ట్గా థియేటర్లలోకి వస్తుండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించాడు. మోహన్బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదీ చదవండి: సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారో తెలుసా? -
ఇద్దరు స్నేహితుల కథ ఇది: దర్శకుడు విశ్వనాథ్ రెడ్డి
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్నేహం, దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రం ఇది. నెల్లూరులోని ఇద్దరు స్నేహితుల్లో ఒకరు స్పై కావాలనుకుంటే, మరొకరు తనకు హ్యాపీ లైఫ్ ఉంటే చాలనుకుంటాడు. ఈ రెండుపాత్రల మధ్య సాగే సినిమా ఇది. చైనాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. నేను గమనించిన ఓ ఘటనను ఆధారంగా చేసుకుని అల్లిన కల్పిత కథ ఇది. తొలుత మా సినిమాకు ‘చైనా పీస్’ అనే టైటిల్ అనుకున్నాం. సెన్సార్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘సీక్రెట్ సోల్జర్’గా మార్చాం. ఇక ఈ సినిమా సబ్జెక్ట్ను ముందు కొంతమంది నిర్మాతలకు చెప్పగా, వారికి నచ్చింది. కానీ స్టార్ హీరోలు చేస్తేనే బాగుంటుందని అభి్ర΄ాయపడ్డారు. అయితే స్టార్ హీరోలు చేస్తే కథ ఉద్దేశం పక్కదారి పడుతుందేమోనని అనిపించింది. దీంతో మనల్ని మనమే నమ్ముకోవాలని నేనే ఈ సినిమాను నిర్మించాను’’ అని చెప్పారు. -
37 అంటే..?
37 అంటే ఏంటి? సినిమాలోని ఏదైనా పాత్రకు సంబంధించిన నంబరా? హీరోకి కలిసొచ్చే నంబరా? అతని వయసా? అసలు... 37 అంటే ఏమిటి? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’కి సంబంధించిన పోస్టర్లో ‘37’ కనిపించడమే ఈ చర్చకు కారణం. ఈ పోస్టర్ను ‘రాకా’ టీమ్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది. దీంతో సినిమా లవర్స్, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఈ ‘37’ అంటే ఏంటి? అని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ నెల 21న ‘రాకా’ చిత్రదర్శకుడు అట్లీ పుట్టినరోజు. ఆ రోజు ఇవ్వనున్న అప్డేట్ను ఉద్దేశించే ఇలా ‘37’ అంటూ ‘రాకా’ మేకర్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ లీడ్ రోల్లో నటిస్తుండగా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా కూడా ఈ చిత్రంలో భాగమయ్యారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఈ చిత్రంలో తాత, తండ్రి, ఇద్దరు కొడుకులు.. .ఇలా నాలుగు విభిన్నమైన గెటప్స్లో అల్లు అర్జున్ కనిపిస్తారని భోగట్టా. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘రాకా’ చిత్రం 2027 డిసెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
మహేశ్ బాబు ఇంట గణేశుడి నిమజ్జనం.. వీడియో వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇంట వినాయక నిమజ్జనం వేడుక నిర్వహించారు. గణనాథుని పూజలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి వీడ్కోలు పలికారు. మహేశ్ బాబు కూతురు సితార వినాయకుడిని తన చేతుల మీదుగా ఎత్తుకుని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ వేడుకలో మహేశ్ బాబు ఫ్యామిలీతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని మోస్ట్ అడ్వెంచరస్గా అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. Superstar #MaheshBabu ఇంట్లో గణేషుడి నిమజ్జనం ❤️🙏#Varanasi #SitaraGhattamaneni #NamrataShirodkar #TeluguFilmNagar pic.twitter.com/XhZKRHvwRC— Telugu FilmNagar (@telugufilmnagar) September 17, 2026 -
బంగారంలా మెరిసిపోతున్న హన్సిక.. బ్లాక్ డ్రెస్లో లైగర్ భామ..!
బంగారంలా మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ..గ్రీస్లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..శారీలో బాంధవి శ్రీధర్ హోయలు..ఫ్యామిలీతో మ్యాడ్ బ్యూటీ రెబా మోనిక జాన్ చిల్..బ్లాక్ డ్రెస్లో లైగర్ భామ అనన్య పాండే అందాలు.. View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
ఇప్పుడంతా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. అందరు గణనాథుని పూజలతో బిజీగా ఉన్నారు. పండుగ సీజన్ వేళ సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు సినిమాలు రెడీ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా '418', కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన లాంటి చిత్రాలు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక వీకెండ్ రాగానే ఓటీటీలపైనే సినీ ప్రియుల చూపు ఎప్పుడు ఉంటుంది. వారి కోసం బోలెడు చిత్రాలు సిద్ధమైపోయాయి. వీటిలో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఇరుముడి ఓటీటీ ప్రియులను ఊరిస్తోంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ మూవీస్ చాలానే ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్ ఇరుముడి (తెలుగు సినిమా) - సెప్టెంబరు 18 లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 18 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 18 మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 18 ద స్కాండల్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 18 జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) - సెప్టెంబరు 18 సిన్నర్స్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 18 స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85-సీజన్ 2(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 18 మాన్స్టర్- ది లిజి బార్డన్ స్టోరీ(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 18 ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19 స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 20 అమెజాన్ ప్రైమ్ రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) - సెప్టెంబరు 18 యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18జియో హాట్స్టార్ తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18 మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ అంగీకారం (తమిళ మూవీ) - సెప్టెంబరు 18 -
ఆకాశంలో ఒక తార.. వచ్చేది ఎప్పుడంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ తేదీని ఖరారు చేశారు మేకర్స్. ఈ మూవీని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు.ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ మూవీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ అఫీషియల్గా ప్రకటించింది. నక్షత్రాల వైపు ప్రయాణం మొదలైంది..నవంబర్ 20, 2026న థియేటర్లకు రండి..మీ కోసం ఒక అందమైన ప్రపంచం వేచి ఉందంటూ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.. నవంబర్ 20న ఈ ప్రపంచాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి వేచి ఉండలేనంటూ హీరో దుల్కర్ సల్మాన్ రాసుకొచ్చాడు. కాగా.. ఈ చిత్రంలో దుల్కర్ కృష్ణ అనే పాత్రలో కనిపించనుండగా.. వ్యోమగామి కావాలని కలలు కనే గ్రామీణ యువతిగా సాత్విక నటించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.The journey to the stars begins ✨ #AakasamLoOkaTara / #AOTMovie - 20th November 2026 in theatres ❤️Come along… there’s a beautiful world waiting for you 🫶🏻#AOTonNOV20th @dulQuer @pavansadineni @GeethaArts @SwapnaCinema @Lightboxoffl @shrutihaasan @satveeravalli… pic.twitter.com/96M2Oo5xlv— Geetha Arts (@GeethaArts) September 17, 2026 -
సంక్రాంతికి వచ్చేది కాకానే.. మరి విశ్వంభర పరిస్థితేంటి?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న మూవీ కాగా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యం అనే పాత్రలో చిరు నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ తేదీని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగనుంది. అయితే చిరంజీవి నటించిన మరో మూవీ విశ్వంభర. ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగానే డేట్ ప్రకటించిన కాకా వాయిదా పడనుందనే టాక్ వినిపించింది. దీంతో కాకా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.కాకా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో కాకా వాయిదా పడుతుందన్న వార్తలకు చెక్పడింది. మరి విశ్వంభర రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేతా పేతురాజ్, సునీల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027. First Single Soon🕺🎶 #KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy— KVN Productions (@KvnProductions) September 17, 2026 -
మన శత్రువులు ఎవరో కాదు.. వాళ్లే: శోభితా ఆసక్తికర పోస్ట్
అక్కినేని కోడలు, నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాల ఆసక్తికర కామెంట్స్ చేసింది. మనం ఎదగాలని కోరుకునే వాళ్లు చాలా తక్కువగా ఉంటారని పేర్కొంది. ముఖ్యంగా మహిళల పట్ల ఎప్పుడు చిన్నచూపు ఉంటుందని రాసుకొచ్చింది. ఏదైనా సాధించాలనుకునే వారికి ఎవరు సహకరించరని తెలిపింది. ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ వీడియోను శోభితా ఈ విధంగా స్పందించింది. అందుకే తాను 16 ఏళ్ల వయసులో తాను ఇంటిని విడిచి ముంబయికి వెళ్లిపోయానని పేర్కొంది.హైదరాబాద్కు చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఓ వీడియోను షేర్ చేసింది. మనం ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తే మనవాళ్లే మనకు వ్యతిరేకంగా మాట్లాడాతారని ఆ వీడియో తెలిపింది. కొత్తగా ఏదైనా ప్రయత్నించేవారికి ఎల్లప్పుడూ అదే మద్దతు అందించరని మాట్లాడింది. ఒక తెలుగు వ్యక్తికి ఉన్న శత్రువు మరో తెలుగు వ్యక్తేనని..ఇది నిజంగా చాలా విచారకరమని పేర్కొంది. ఇది చూసిన శోభిత తమ సొంత అనుకున్న వాళ్లే మనకు శత్రువులు అవుతారంటూ ఆ పోస్ట్కు శోభితా మద్దతు పలికింది.శోభితా మాట్లాడుతూ..' తాను 16 ఏళ్ల వయసులో ఉండగా నా బ్యాగులు సర్దుకుని ముంబయికి బయలుదేరా. విజయం సాధిస్తాననే గ్యారెంటీ ఏమీ లేదు. కానీ నేను నా అదృష్టాన్ని పరీక్షించుకున్నా. ఎందుకంటే కలలు కనడానికి సాహసించే వారి పట్ల, ముఖ్యంగా మీరు ఏ రంగంలోకి ప్రవేశించాలనుకున్నా ఇక్కడి వాతావరణం మనకు అనుకూలంగా ఉండదని తెలుసు. మరి ముఖ్యంగా ఒక మహిళకు అయితే ఈ వ్యతిరేకత మరింత రెట్టింపుగా ఉంటుంది' అని తెలిపింది.అయితే సంవత్సరాలు గడిచేకొద్దీ పరిస్థితి మారి ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే శోభితా చీకటిలో అనే మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఇందులో శోభిత సరసన విశ్వదేవ్ రాచకొండ నటించారు. కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్ బాబు నిర్మించారు. -
బిగ్బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?
బిగ్బాస్ విడుదల చేసిన తాజా ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమోలో కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా హౌస్లోకి రావడం.. షాలినీని పట్టుకుని బయటకు తీసుకెళ్లడం కనిపించింది. వారిని చూడగానే ఇంట్లోని సగం మంది కంటెస్టెంట్లు భయపడిపోయారు. దీంతో అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.అయితే ఇదంతా నిజంగా జరిగిన ఘటన కాదని, హౌస్మేట్స్ను ఆటపట్టించేందుకు చేసిన ప్రాంక్ కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటే బిగ్బాస్ ఫార్మాట్ ప్రకారం నామినేషన్లు, ఎలిమినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అలాంటిది ఎలాంటి ప్రక్రియ లేకుండా షాలినీని తీసుకెళ్లడం వెనుక ఏదైనా టాస్క్ లేదా ట్విస్ట్ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.బిగ్బాస్ అసంతృప్తి..ఇదిలా ఉంటే.. షాలినీ విషయంలో బిగ్బాస్ ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమయపాలన పాటించడం లేదంటూ ఆమెను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రోమోలో షాలినీని టార్గెట్ చేయడంతో హౌస్లో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.చరణ్ ఎంట్రీకి సంబంధించిన వారేనా..మరోవైపు చైత్ర కంటే చరణ్కే ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. చరణ్ త్వరలోనే బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టనున్నట్లు ఈరోజు ఎపిసోడ్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రోమోలో కనిపించిన వ్యక్తులు చరణ్ ఎంట్రీకి సంబంధించినవారేనా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అసలు షాలినీని పట్టుకెళ్లడం వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటి? ఇది ప్రాంక్నా.. టాస్క్లో భాగమా? చరణ్ ఎంట్రీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అన్నది పూర్తి ఎపిసోడ్లోనే క్లారిటీ రానుంది.(ఇదీ చదవండి: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..) -
వెనక్కితగ్గని ‘రణబాలి’.. షూటింగ్ పూర్తి..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ప్రత్యే పోస్టర్ను పంచుకుంది.కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
‘గబ్బర్ సింగ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గతంలో ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కి గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకొని గబ్బర్సింగ్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని చూస్తున్న వీడియో వైరల్ అవుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) ద్వారా రమేశ్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఆ సినిమాలో వచ్చే ‘అంత్యాక్షరి’ కామెడీ ఎపిసోడ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కల్యాణ్తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనంతరం అత్తారింటికి దారేది సినిమాలో కూడా కాసేపు కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ పాత్రల్లో నటించాడు. సోషల్ మీడియాలో కూడా రమేశ్ యాక్టివ్ గా ఉండేవారు. ‘గబ్బర్సింగ్’ ఫేమ్ నటుడు రమేశ్కు బ్రెయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ❤️🩹ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 🙏❤️#Ramesh #GabbarSingh #GetWellSoon #Tollywood #Trending pic.twitter.com/YKmvFWn0Ok— Sanjuuuuu🐦 (@speaks57458) September 17, 2026 -
దేవిశ్రీ ప్రసాద్కి జోడీగా అనంతిక!
'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా 'ఎల్లమ్మ'. ఎప్పటినుంచో సెట్స్ మీద ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టుతో హీరోగా పరిచయమవుతున్నాడు. కొన్నాళ్ల క్రితం గ్లింప్స్ లాంటి వీడియో రిలీజ్ చేశారు. ఆ తరువాత దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మరో అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో దేవిశ్రీ సరసన ఎవరు నటిస్తారనే చర్చ ఉంది. అయితే ఈ ఛాన్స్ అనంతిక సనిల్కుమార్ కొట్టేసిందట. ఇప్పటికే 'మ్యాడ్', '8 వసంతాలు', 'రోమాంచకం' వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ తార. ఇదే నిజం అయితే మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ సినిమా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎవరికీ తెలీదు: అల్లు అరవింద్ఇప్పటికే విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో పార్సి అనే కుర్రాడిగా కనిపించబోతున్నాడు. క్లీన్ షేవ్ చేసిన లుక్లో దేవి డిఫరెంట్గా ఉన్నాడు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
‘బాహుబలి, పుష్పాలకే ప్లాప్ అన్నారు.. తెలుగోళ్లకే ఎందుకిలా ?’
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లో ఎగిరిపడ్డ కంటెస్టెట్లు.. ఆడపిల్ల అని కూడా చూడలేదు)‘సంజయ్ను తెలుగు సినిమాకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, గుర్తింపు ఇచ్చారు. సంజయ్ అనుకుంటే ఎవరితోనైనా సినిమా చేయగలరని, కానీ నాతోనే తొలి చిత్రంలో హీరోగా తనను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. ‘సిగ్మా’ కోసం నన్ను ఎంపిక చేసినప్పుడు తమిళనాడులో ఎలాంటి సందేహాలు వ్యక్తం కాలేదు. కానీ తెలుగులో మాత్రం సందీప్ను ఎందుకు హీరోగా తీసుకున్నారనే ప్రశ్నలు వచ్చాయని సందీప్ తెలిపారు.మనోళ్లను మనమే ఎందుకు తక్కువ చేస్తాం?తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటని సందీప్ అన్నారు. అయితే ఆ సినిమా విడుదలైన తొలినాళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనే ప్లాప్ టాక్ వచ్చిందని గుర్తుచేశారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. ‘మనోళ్లను మనం పెంచుకోవడానికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? మన వాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లి గొప్పగా చేస్తుంటే.. ‘తెలుగోళ్లు ఏదో చేయగలరు’ అంటూ ఇతర రాష్ట్రాల వారు మన టాలెంట్ను గుర్తిస్తున్నారు. ఇదే మన తెలుగు గొప్పతనం’ అని సందీప్ కిషన్ పేర్కొన్నారు.కాగా సినిమా విషయానికి వస్తే ‘సిగ్మా’లో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో ‘సిగ్మా’పై తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. -
బిగ్బాస్లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!
బిగ్బాస్10 హౌస్ కెప్టెన్సీ రేస్ మరింత రసవత్తరంగా మారింది. కెప్టెన్గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య బిగ్బాస్ కంటెస్టెంట్లకు వరుసగా టాస్క్లు ఇచ్చారు. మొదటి లెవల్లో ‘యానిమల్ పార్క్’ టాస్క్ ఇవ్వగా.. రెండో లెవల్లో ఫిజికల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఒక దశలో రోహిత్, వంశీ మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి!యానిమల్ పార్క్.. మొదటి లెవల్లో భాగంగా ‘యానిమల్ పార్క్’ టాస్క్ను బిగ్బాస్ ఇచ్చారు. ఈ గేమ్లో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ప్రతి జంటలో ఒకరు కర్టెన్ వెనుకకు వెళ్లి.. అక్కడ ఇచ్చిన జంతువుల సీక్వెన్స్ ప్రకారం ఒక్కొక్క జంతువులా నటించాలి. మరో కంటెస్టెంట్ రోప్ సహాయంతో కర్టెన్ను లాగుతూ.. తన పార్ట్నర్ ఏ జంతువులా యాక్ట్ చేస్తున్నాడో గుర్తించాలి. సరైన సమాధానం చెబితే పక్కనే ఉన్న ఆయా జంతువుల బ్లాక్స్ను తీసుకుని.. తమ పార్ట్నర్ ఉన్న ఫ్రేమ్లో జంతువులను సరైన సీక్వెన్స్లో అమర్చాలి. అన్ని బ్లాక్స్ను సరైన క్రమంలో అమర్చిన తర్వాత ఫ్రేమ్ వెనుక ఉన్న హ్యాండిల్ను స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లాలి. చివర్లో ఉన్న కంటెండర్ బోర్డును ఎవరు ముందుగా తీసి చూపిస్తారో.. ఆ జంట విజేతగా నిలుస్తుంది. అయితే కంటెస్టెంట్లు జంతువుల బ్లాక్స్ను ఏ క్రమంలో అమర్చారనేది సరిగ్గా ఉందా? లేదా? అన్నది సంచాలకులు నిర్ణయిస్తారు. ఈ టాస్క్లో గెలిచిన ఇద్దరు కంటెస్టెంట్లు కెప్టెన్సీ రేసులో కొనసాగడంతో పాటు.. ఓడిపోయిన ఇద్దరిలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం కూడా పొందుతారు. ఈ టాస్క్లో సృష్టి, వంశీలను సంచాలకులుగా బిగ్బాస్ నియమించారు.జాన్సీ–ముకేశ్ జోడీ విజయంఈ గేమ్లో జంటలుగా ఎవరు ఆడతారనే ప్రశ్న రావడంతో ముకేశ్–ఝాన్సీ ఒక జోడీగా, శాలిని–అమర్ మరో జోడీగా బరిలోకి దిగారు. టాస్క్లో మొదటి నుంచి ఇద్దరు జంటలు గట్టిగానే పోటీపడ్డారు. చివరికి ఝాన్సీ,ముకేశ్ జోడీ విజయం సాధించింది. దీంతో ఝాన్సీ, ముకేశ్ కెప్టెన్సీ రేసులో కంటెండర్లుగా నిలిచారు. అంతేకాదు.. ఓడిపోయిన జంటలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం వారికి లభించింది. దీంతో వారు అమర్ను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు. (ఇదీ చదవండి: తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్)రెండో లెవల్లో అసలు ఫిజికల్ వార్!ఆ తర్వాత రెండో లెవల్ మొదలైంది. ఈ లెవల్లో ఎలాంటి పోరాటం ఉండాలనేది ప్రేక్షకులు తమ పవర్తో నిర్ణయించారు. మానసిక బలాన్ని పరీక్షించాలా? శారీరక దృఢత్వాన్ని పరీక్షించాలా? అనే ప్రశ్నకు ప్రేక్షకులు శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్కు మొగ్గుచూపారు. దీంతో లెవల్-2లో ఫిజికల్ ఛాలెంజ్ ఉంటుందని బిగ్బాస్ ప్రకటించారు. ఈ టాస్క్కు ‘స్నాచ్ ఇట్.. టీమ్ ఇట్.. త్రో ఇట్’ అనే పేరు పెట్టారు. ఇందులో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి పోటీపడాలి. సమయానుసారం బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలోకి బ్యాగ్స్ పడుతుంటాయి. ఆ బ్యాగ్లను దక్కించుకునేందుకు రెండు జంటలు పోటీ పడాలి. ఎవరైతే బ్యాగ్ను దక్కించుకుంటారో.. అందులో ఉన్న బాల్స్తో ఫ్రేమ్లో ఏర్పాటు చేసిన డిస్క్లను కొట్టాలి. బజర్ పూర్తయ్యే సమయానికి ఎవరు ఎక్కువ డిస్క్లను పడగొడతారో వారే విజేతలుగా నిలుస్తారని బిగ్బాస్ వివరించారు. ఈ టాస్క్కు వంశీని సంచాలకుడిగా నియమించారు.రోహిత్,దేబ్జానీ వర్సెస్ రాంప్రసాద్,త్రిగుణ్రెండో లెవల్లో దేబ్జానీ ,రోహిత్ ఒక జోడీగా, రాంప్రసాద్, త్రిగుణ్ మరో జోడీగా బరిలోకి దిగారు. గేమ్ మొదలైన వెంటనే ఫిజికల్ ఛాలెంజ్ కావడంతో కంటెస్టెంట్లు తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. రాంప్రసాద్–త్రిగుణ్ జోడీ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు దేబ్జానీకి ఫిజికల్ టాస్క్ కావడంతో చాలా కష్టంగా మారింది. ఆమె పూర్తిస్థాయిలో రాణించలేకపోవడంతో రోహిత్ దాదాపు ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. గేమ్లో ఒత్తిడి పెరగడంతో ఒకానొక సమయంలో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. తాను ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ రోహిత్ తన జోడీని గెలిపించేందుకు చివరి వరకు పోరాడాడు. ఒకానోక సందర్భంలో త్రిగుణ్, రాంప్రసాద్లు ఆట తీవ్రస్థాయికి చేరుకోవడంతో గాల్లోకి ఎగిరిపడిపడ్డారు. అలాంటి సన్నివేశాల్లో హౌస్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ టాస్క్లో రాంప్రసాద్, తిగ్రణ్లు విజయం సాధించగా రోహిత్ కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?)రోహిత్,వంశీ మధ్య భారీ గొడవఇదే సమయంలో టాస్క్ నిర్వహణ విషయంలో రోహిత్, సంచాలకుడు వంశీ మధ్య వివాదం మొదలైంది. గేమ్లో జరిగిన అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా మాట్లాడుకోవడంతో పరిస్థితి అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. మాటలు తీవ్రం కావడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఒక దశలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో పరిస్థితి కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కనిపించింది. ఇలా కెప్టెన్సీ రేసులో భాగంగా ఇచ్చిన రెండో లెవల్ టాస్క్ కేవలం గేమ్గా కాకుండా.. కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకోవడం, రోహిత్ ఒంటరిగా పోరాడటం, చివర్లో రోహిత్, వంశీ మధ్య గొడవతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు బిగ్ సర్ప్రైజ్) -
వేవేల ఊహలే చూపినా...
టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా తదితరులు నటించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న రిలీజ్ కానుంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వేవేల ఊహలే చూపినా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా, శ్రీ సాగర్ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘వేవేల ఊహలే చూపినా..’ అనే సాంగ్ డిఫరెంట్ స్టైల్లో సాగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి’’ అన్నారు. -
సుబ్బులక్ష్మి అమ్మ సంగీతమే మనకు సందేశం
‘‘సుబ్బులక్ష్మి అమ్మ సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ... ఇలా ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తెచ్చేలా ఆ పాట ఉండేది. తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి. ఆమె సంగీతమే మనకు సందేశం’’ అని కమల్హాసన్ తెలిపారు. సంగీత సామ్రాజ్ఞి, గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ పేరుతో వెండితెరపైకి రానుంది. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను కమల్హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ర ష్మికా మందన్నపై చిత్రీకరించిన సన్నివేశానికి కమల్హాసన్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మన దేశపు గొప్ప సంగీత సామ్రాజ్ఞి గురించి సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నాం’’ అని చెప్పారు అల్లు అరవింద్. ‘‘ఈ సినిమా నిర్మించడం నాకు దక్కిన గౌరవం’’ అన్నారు బన్నీ వాస్. ‘‘ఈ సినిమా వెనక ఏడెనిమిదేళ్ల ప్రయత్నం ఉంది’’ అన్నారు రాక్లైన్ వెంకటేశ్. ‘‘నటిగా గొప్ప చాన్స్ దక్కినందుకు కృతజ్ఞతతో మనసు నిండిపో తోంది. అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పారు రష్మిక. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు. -
గూఢచారి డేట్ ఫిక్స్
‘జీ2’ అంటూ అడివి శేష్ మళ్లీ గూఢచారిగా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా రూపొందిన ‘గూఢచారి’కి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం ‘జీ2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా 2027 ఫిబ్రవరి 5న రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఏజెంట్ 116గా వామికా గబ్బి నటిస్తోన్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు: జేసన్ సంజయ్
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘సిగ్మా’ చిత్రంతో ఆయన మెగాఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో జేసన్ సంజయ్ తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాలు తన ఆల్టైమ్ ఫేవరెట్స్ అని తెలిపారు.నా సినిమా చూడ్డానికి మా నాన్న ఆసక్తిగా ఉన్నారు ‘‘సిగ్మా’ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్న జేసన్ సంజయ్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా అందర్నీ వినోదపరుస్తుంది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా లైకాప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ తెలుగు–తమిళ భాషల్లో నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 2న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్వీఆర్ సినిమా సీడెడ్లో రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో జేసన్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘నేను కాలేజీలో డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్ చదువుకున్నాను. సినిమా ప్రయాణంలో 24 క్రాఫ్ట్స్తో కలిసి పని చేశాను. ఈ ప్రయాణంలో మా నాన్న (విజయ్), నా కుటుంబం, అభిమానులు ఎంతగానో సపోర్ట్ చేశారు. ‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ నటన నచ్చడంతోనే ‘సిగ్మా’ కోసం ఆయనను హీరోగా ఎంపిక చేశాను. నేను ఎలాంటి సినిమా చేశానో చూడటానికి మా నాన్నగారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘సిగ్మా’ నా తొలి తమిళ చిత్రం అయినప్పటికీ డబ్బింగ్ చెప్పాను’’ అని ఫరియా పేర్కొన్నారు. ‘‘సిగ్మా’తో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరో పెద్ద విజయం సాధిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు మైత్రీ శశిధర్ రెడ్డి. -
కేంద్ర సెన్సార్ బోర్డులో సుప్రియ, ప్రీతి జింటా.. CBFCలో కీలక మార్పులు
ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో చోటు దక్కింది. CBFCని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ 18 మంది సభ్యులతో కొత్త బోర్డును ప్రకటించింది.ఛైర్మన్గా శశి శేఖర్ వేంపటి కొనసాగనుండగా, సుప్రియతో పాటు బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రియదర్శన్, రిక్కీ కేజ్ తదితర సినీ, కళారంగ ప్రముఖులకు సభ్యులుగా అవకాశం కల్పించారు. -
జపాన్లో మంచు ఫ్యామిలీ సందడి.. అనసూయ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో..!
జపాన్లో మంచువారి ఫ్యామిలీ చిల్..టాలీవుడ్ నటి అనసూయ డ్యాన్స్ ప్రాక్టీస్..వినాయక నిమజ్జనంలో నటి బిందు మాధవి..శారీలో హెబ్బా పటేల్ అందాలు..గ్రీన్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ సావిత్రి.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
జూనియర్ ఎన్టీఆర్ దేవర బ్యూటీ.. ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది..!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా దేవర-2 కూడా ఉందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.దేవర భార్యగా శృతి..అయితే దేవరలో ఎన్టీఆర్ భార్యగా మెప్పించిన బ్యూటీ శృతి మరాఠే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. ఇందులో కేవలం నటనతో మాత్రమే కాదు.. తన గ్లామర్తో సినీ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా శృతి పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇప్పుడు ఉన్నట్లుండి శృతి మరాఠే నెట్టింట వైరల్గా మారింది. ట్విటర్లో ఆమె పేరు ఏకంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. అసలు శృతి ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుందో మనం కూడా తెలుసుకుందాం.స్పెషల్ అట్రాక్షన్గా శృతి..దేవరలో ఎన్టీఆర్ భార్యగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో సందడి చేసింది. ముంబయిలో గణేశ్ ఆగమన్ సందర్భంగా హీరోయిన్ శృతి మరాఠే బ్యాండ్ వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇందులో శృతి డోలు వాయిస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆమెను చూసిన నెటిజన్స్ దేవరలో హీరోయిన్గా శృతినే తీసుకోవాల్సిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. వినాయక చవితి వేడుకల్లో #ShrutiMarathe#Devara ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్! ✨#NTR #JrNTR pic.twitter.com/tEkWjgnWe2— Bollam Suresh (@bollamsuresh11) September 15, 2026 -
హనుమాన్ అంశ్ తెలుగు వర్షన్ వాయిదా.. అసలు కారణమిదే
బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో సినీ ప్రియుల్లో ఈ మూవీ రిలీజ్పై సందిగ్ధత నెలకొంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తెలుగు రిలీజ్ ఈ నెల 18న కావడం లేదని ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. అందుకు గల కారణాన్ని సైతం వెల్లడించింది. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాలేదని తెలిపింది. అందువల్లే హనుమాన్ అంశ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.కాగా.. త్రివిక్రమ్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఈ డీల్ నుంచి తప్పుకోవడం వల్లే విడుదల ఆగిపోయిందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా డబ్బింగ్ పనుల వల్లే రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. దీంతో తెలుగు రిలీజ్పై ఉన్న సస్పెన్స్కు తెరపడింది. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. HANUMAN ANSH TELUGU Version Postponed Due To A Delay In Dubbing Works. A New Release Date Will Be Announced Soon.#HanumanAnsh North America By @PrathyangiraUS@Swambhumedia @filmervishal #ShobhinawSatyaa #VihaanShedge @chandananand #PurnimaTiwari @AKRastogi #GulshanPandey… pic.twitter.com/jESSRArxtP— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 16, 2026 -
రూ.200 కోట్ల ఇరుముడి.. మా ఇంటి బంగారాన్ని దాటలేదు..!
ఇటీవలే రిలీజైన రవితేజ ఇరుముడి సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. తండ్రి, కూతురి సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. అలా సామ్ లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సైతం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఓవర్సీస్లో రివర్స్..రవితేజ ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మైలురాయి అందుకున్నప్పటీ.. సమంత మూవీ కంటే వెనకే ఉంది. ఓవర్సీస్ వసూళ్లపరంగా చూస్తే సమంత మా ఇంటి బంగారం ముందుంది. ఈ లిస్ట్లో రామ్ చరణ్ పెద్ది తొలిస్థానంలో(రూ.53 కోట్లు) ఉండగా.. రెండోస్థానంలో మనశంకరవరప్రసాద్గారు(రూ.43 కోట్లు).. మూడోస్థానంలో ది రాజాసాబ్(రూ.34 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత నాలుగో స్థానంలో సమంత మా ఇంటి బంగారం(రూ.28 కోట్లు) నాలుగోస్థానంలో ఉండగా.. రవితేజ ఇరుముడి(రూ.22 కోట్లు) ఐదోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా చూస్తే రూ.200 కోట్లు దాటేసిన ఇరుముడి.. ఓవర్సీస్లో మాత్రం వెనకపడిపోయింది. -
బిగ్బాస్ లేటేస్ట్ ప్రోమో.. గేమ్లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-10 అప్పుడే పదో రోజుకు చేరుకుంది. రెండో వారంలో నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య ఆటల పోటీ మొదలైంది. బిగ్బాస్ ఇచ్చే టాస్క్లతో హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు. దీంతో బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ హాట్హాట్గా సాగుతోంది.తాజాగా పదో రోజుకు సంబంధించిన రెండో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో బ్యాగ్ కోసం పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. ఈ గేమ్లో రెండు టీమ్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోటీలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్పై మరింత ఆసక్తిని పెంచుతోంది. హౌస్లో అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఆస్పత్రిలో సెలైన్ బాటిల్తో శ్రీహరి భార్య.. ఫోటో వైరల్
దివంగత నటుడు, రియల్స్టార్ శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్పై సెలైన్ బాటిల్స్తో కనిపించింది. ఈ ఫోటోని స్వయంగా డిస్కో శాంతినే తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తూ తన హెల్త్ కండీషన్పై అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. ఆస్పత్రి నుంచి ఇంటికి కూడా చేరుకున్నట్లు ఆమె పేర్కొంది. అయితే ఆస్పత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చిందనేది మాత్రం చెప్పలేదు. ఏదేమైనా ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుందని, అదే చాలని సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా చేస్తున్న ఆస్మాన్ చిత్రం నుంచి ఈ రోజే టీజర్ రిలీజ్ అయింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కి డిస్కో శాంతి హాజరుకాలేదు. అనారోగ్యం కారణంగానే ఆమె ఈవెంట్కి రానట్లు సమాచారం.(ఇదీ చదవండి: హాలీవుడ్లోకి ‘మహారాజా’.. తొలి చిత్రంగా రికార్డు!)డిస్కో శాంతి విషయానికి వస్తే.. హీరోయిన్ గా చేయకపోయిన్పటికీ అంతకు మించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా 90’sలో సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటే కచ్చితంగా డిస్కో శాంతి ఉండాల్సిందే. బంగారు కోడి పెట్ట లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ లో స్టార్ హీరోలకు సమానంగా స్టెప్పులేసిందీ శాంతి. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే రియల్ స్టార్ శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు డిస్కో శాంతి. పెళ్లి తర్వాత సినిమాలను బాగా తగ్గించేశారామె. ఇక 2013లో శ్రీహరి మరణం తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలే జీవితంగా జీవనం గడుపుతున్నారామె. -
రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?
బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో సినీ ప్రియులు సందిగ్ధంలో పడిపోయారు.ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవుతుందా? లేదా అనే డైలామాలో పడేశారు. తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడటంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొన్ని కారణాలతో త్రివిక్రమ్ ఈ సినిమా నుంచి వైదొలిగారని.. దీంతో సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. విడుదల తేదీ మార్పుపై కూడా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్ 18న తెలుగు రిలీజ్ వాయిదా పడనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
చిత్రమైన కాన్సెప్ట్తో శ్రీహరి కొడుకు సినిమా.. టీజర్ రిలీజ్
మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ దర్శకత్వం వహించిన ‘ఆస్మాన్’. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా బుధవారం టీజర్ విడుదల చేశారు. అయితే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ లాంటి దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ చిత్రాల్ని విడుదల చేస్తుంటారు. కానీ దీనిని మాత్రం హిందీలో కాకుండా అరబిక్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించుకున్నారు.‘మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు.. అదే నిజం’ అంటూ అద్భుతమైన డైలాగ్స్, హీరో వాయిస్ ఓవర్తో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. టీజర్లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. టీజర్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంది. పాత్రలన్ని కళ్లకు గంతలు కట్టుకోవడం లాంటి సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. -
ఒక్క నిర్ణయం.. త్రివిక్రమ్ జీవితాన్నే మార్చేసింది
మనం జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన ఫేట్ డిసైడ్ చేస్తాయి. అయితే అవి ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ నిర్ణయాన్ని తీసుకుని ఇప్పుడు ఇలా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఉన్న కొందరికే తెలిసిన త్రివిక్రమ్ సీక్రెట్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ రచయిత బీవీఎస్ రవి బయటపెట్టాడు. రూ.3 వేల జీతానికి పనిచేసిన త్రివిక్రమ్.. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో వెల్లడించాడు.(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)90ల్లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత త్రివిక్రమ్.. పోసాని దగ్గర రచయితగా పనిచేసేవాడు. అప్పట్లోనే త్రివిక్రమ్కి రూ.40 వేల జీతం ఇచ్చేవారు. తిరిగేందుకు కారు, స్టోరీ డిస్కషన్ కోసం లగ్జరీ హోటల్స్లో రూమ్స్ ఇలా ఓ రేంజులో జీవితం ఉండేది. కానీ దర్శకుడు కావాలనే ఆశతో ఈ ఉద్యోగం మానేశాడు. కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా రూ.3 వేల జీతానికి చేరాడు. ఇది చూసిన బీవీఎస్ రవి.. త్రివిక్రమ్ని ఇదే విషయం అడగ్గా.. నేను డైరెక్టర్ అవ్వడానికి వచ్చా, పోసానికి అసిస్టెంట్గా అవ్వడానికి కాదని తనతో అన్నట్లు బీవీఎస్ రవి చెప్పుకొచ్చాడు. అప్పుడు కలగన్నాడు కాబట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాడని త్రివిక్రమ్ తీసుకున్న లైఫ్ మారిపోయే నిర్ణయం గురించి బయటపెట్టాడు.త్రివిక్రమ్.. 'సముద్రం' కోసం కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇతడితో పాటు నందినిరెడ్డి, శ్రీవాస్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేశారు. తర్వాత కాలంలో వీళ్లంతా డైరెక్టర్స్ అయ్యారు. కానీ రచయితగా త్రివిక్రమ్ ఎంత పేరు తెచ్చుకున్నాడో.. దర్శకుడిగా అంతకు మించిన స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు.నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి లాంటి సినిమాలతో రైటర్గా హిట్ కొట్టిన త్రివిక్రమ్.. నువ్వే నువ్వే, అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అఆ, సన్నాఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేశ్తో 'ఆదర్శ కుటుంబం' తీస్తున్న గురూజీ.. త్వరలో ఎన్టీఆర్ హీరోగా కుమారస్వామి నేపథ్య కథతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.(ఇదీ చదవండి: రూ.50 కోట్ల ఖరీదైన నగలు కొట్టేస్తే.. రూ.110 మాత్రమే పరిహారం)Writer BVS Ravi:“Director #Trivikram's Salary was ₹40K in the 90s as a Writer. He left the Job and joined as an AD under Krishna Vamsi garu for ₹3K.Just for his Dream of becoming a Director, he took that step.Today, he is Director Trivikram Srinivas.” pic.twitter.com/g3GXXNBhA2— Telugu Chitraalu (@CineChitraalu) September 16, 2026 -
నేను త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని కాదు : సీనియర్ నటి అంబిక
మొన్నటి వరకు కోలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్ త్రిష పేరు రాష్ట్రంలో బాగా వినిపిస్తోంది. ఆయన ఎన్నికల్లో గెలిచి, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనీ, రాజకీయాల్లోనూ త్రిష పేరు మరింత ట్రెండ్ అయింది. ప్రతి పక్షాలు సైతం ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆమె పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. సీఎం విజయ్, త్రిషల మధ్య ఉన్న సంబంధంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్లు కలిసి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల సీఎం విజయ్ యూకే పర్యటనకు వెళ్లగా.. త్రిష కూడా అతని వెంట వెళ్లింది. ఇద్దరు లండన్లో కలిసి కనిపించిన వీడియో ఇటీవల నెట్టింట బాగా వైరల్ అయింది. కారు రేసింగ్ ఈవెంట్స్కి విజయ్ వెళ్లగా..త్రిష కూడా అక్కడ కనిపించింది. రేసింగ్ ఈవెంట్ను విజయ్ గ్యాలరీ నుంచి వీక్షిస్తుండగా సడెన్గా త్రిష మధ్యలోకి వచ్చింది. అయితే విజయ్ వెంటనే తన ముఖం వీడియోలో పడకుండా పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. వీరిద్దరు కలిసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో త్రిష, విజయ్ల స్నేహం మరోసారి చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ‘బిర్యానీ’ కోసం జుట్టు, గెడ్డం పెంచా.. యాక్షన్ సీన్స్ కూడా చేశా : సంపూర్ణేష్ బాబు)తాజాగా దీనిపై నటి అంబిక స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త్రిష స్థానంలో ఉంటే తాను అలా కెమెరాల ముందు కనిపించేదాన్ని కాదని చెప్పింది. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకున్నంత మాత్రాన పాత స్నేహాలను వదులుకోవాల్సిన అవసరం లేదు.కానీ, మనం ఆలోచించినంత ఉన్నతంగా బయటి వ్యక్తులు ఉండరు. మన ప్రవర్తన వల్ల మన స్నేహితుడిపై విమర్శలు వస్తాయని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను త్రిష స్థానంలో ఉంటే, విమర్శలు వస్తాయని తెలిస్తే, నేను విజయ్తోపాటు వెళ్లకుండా ఉంటాను. ఇది నా అభిప్రాయం. మనం స్నేహానికి విలువ ఇవ్వాలి, కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి’ అని అంబిక చెప్పుకొచ్చింది. అంబిక విషయానికొస్తే.. కన్నడ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, మురళీ మోహన్, కృష్ణ రాజు వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. దాదాపు ఆమె 300పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించింది. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో కూడా నటించి, తన నటనా ప్రస్థానాన్ని కొనసాగించారు. 1988లో, అంబిక అమెరికాకు చెందిన ఒక డాక్టర్ మీనన్ ను వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లారు. ఎనిమిది సంవత్సరాల పాటు వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన తర్వాత, కొన్ని కారణాల వల్ల 1996లో ఆమె విడాకులు తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀#Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP— Gokul (@ItzGokulVJ) September 12, 2026 -
పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నటి పూర్ణ.. కేరళకు చెందిన ఈమె దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్ షనీద్ అసిఫ్ అలీని కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది. 'జైలర్ 2'లోనూ స్పెషల్ సాంగ్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 10: ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్)ఇలా సినిమాలతో ఓవైపు బిజీగా ఉంటూనే మరోవైపు దుబాయిలో ఓ డ్యాన్స్ స్టూడియోని కూడా పూర్ణ నడుపుతోంది. ఇందులో చాలామంది పిల్లలకు డ్యాన్స్ ట్రైనింగ్ ఇస్తోంది. అయితే తన స్టూడియోలో డ్యాన్స్ నేర్చుకునే ఓ పాప చనిపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న పూర్ణ.. చాలా విచారం వ్యక్తం చేసింది.'కొన్ని వీడ్కోలు మాటలకు అందవు. ఎంతలా కన్నీళ్లు పెట్టుకున్నా గుండెల్లోని బాధ తొలగిపోదు. చిన్నారి అమాయకమైన చిరునవ్వు, డాన్స్ నేర్చుకునే సమయంలో వేసిన చిన్ని చిన్ని అడుగులు స్టూడియోలోని ప్రతి మూలలో ఎప్పటికీ జ్ఞాపకాలుగా నిలిచిపోతాయ్. ఈమె నా స్టూడెంట్ మాత్రమే కాదు. నా కుటుంబంలో ఒకరిగా భావించా. డాన్స్ స్టూడియో ఉన్నంతకాలం ఈ చిన్నారి మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, నీకు కన్నీటి నివాళి అర్పిస్తున్నాం' అని నటి పూర్ణ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా: నటి పూర్ణ) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
సస్పెన్స్... మిస్టరీగా ‘మిస్సింగ్ మేఘన’
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రధారులుగా నటించిన సస్పెన్స్ అండ్ మిస్టరీ సినిమా ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వంలో పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీమ్ మంచి టాలెంటెడ్. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నేను గతంలో సినిమా చేయడం మిస్ అయిన అందరితో ఈ సినిమాకి పని చేశాను. మా సినిమాను థియేటర్స్లో చూడండి’’ అని చెప్పారు రామ్ కార్తీక్. ‘‘వాచస్పతిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు’’ అన్నారు అంకిత్. ‘‘ప్రేక్షకులు మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు వాచస్పతి. -
‘బిర్యానీ’ కోసం జుట్టు, గెడ్డం పెంచా.. యాక్షన్ సీన్స్ కూడా చేశా : సంపూర్ణేష్ బాబు
‘‘నేను ఇప్పటివరకూ చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. అయితే ‘ది ప్యారడైజ్’లో చేసిన బిర్యానీ పాత్ర చాలా సీరియస్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం నేను వేరే ఏ సినిమాలు ఒప్పుకోలేదు. జుట్టు, గెడ్డం పెంచడంతో పాటు బరువు పెరిగి ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాను. యాక్షన్ సీన్స్ కూడా చేశాను. నా కెరీర్లో బిర్యానీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని సంపూర్ణేష్ బాబు తెలిపారు. (ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)నాని, కయాదు లోహర్ జంటగా నటించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎల్వీ సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘ది ప్యారడైజ్’ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని బిర్యానీ పాత్రకు లుక్ టెస్ట్ చేసి, సరిపోతానని నన్ను ఎంపిక చేశారు శ్రీకాంత్ ఓదెల. నానీగారి అనుచరుడిగా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తాను. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా ఒప్పుకున్నాను. ‘ది ప్యారడైజ్’ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. -
దీపావళికి మహాశక్తి
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్గా దూసుకెళుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. సుందర్ .సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీనా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇషారి కె. గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘మహాశక్తి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నామని యూనిట్ పేర్కొంది. నయనతార లీడ్ రోల్లో ఆర్జె బాలాజీ, ఎన్జె శరవణన్ దర్శకత్వం వహించిన ‘మూకుత్తి అమ్మన్’ 2020 నవంబరు 14న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్గా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందుతోంది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార నటన, కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ పేర్కొన్నారు. గతంలో ‘మూకుత్తి అమ్మన్’ చిత్రం దీపావళి పండగ సందర్భంగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ ‘మహాశక్తి’ని కూడా నవంబర్లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పండగ సమయంలో దైవిక కథాంశంతో కూడిన చిత్రాలకు కుటుంబ ప్రేక్షకాదరణ బాగుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. -
యాక్షన్... అడ్వెంచర్
సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్ వీఆర్ సినిమా సీడెడ్లో రిలీజ్ చేస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్గా రూపొందిన చిత్రం ‘సిగ్మా’. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. లైకా ప్రొడక్షన్స్ , మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ కలిసి రావడం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక ఎన్ వీఆర్ సినిమా అసోసియేషన్ కూడా మరో ప్లస్గా నిలవనుంది. గాంధీ జయంతి హాలిడేకు తోడు వీకెండ్ కూడా కలసి రావడంతో సినిమాకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
‘కిల్లర్’ సూపర్ షీ ఛాలెంజ్.. ఒక్కొక్కరికి రూ.10 వేలు
పూర్వాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్’. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా నటించారు. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఉర్వీశ్ పూర్వాజ్ సమర్పణలో ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్పై పూర్వాజ్, పద్మనాభరెడ్డి .ఎ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్లో డ్రిస్టిబ్యూట్ చేస్తోంది. అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో ఈ సంస్థ రిలీజ్ చేయబోతోంది. కాగా మహిళల కోసం ‘సూపర్ షీ ఛాలెంజ్’ను అనౌన్స్ చేశారు ‘కిల్లర్’ మేకర్స్. ‘‘రాత్రికి రాత్రే మీకు సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారో చెబుతూ రీల్స్ చేసి పంపించాలి. బెస్ట్ రీల్స్ చేసిన పది మందికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం. అలాగే ఆన్సర్స్ను టెక్ట్స్ మెసేజ్ పంపిన వారిలో బెస్ట్ ఆన్సర్స్ పంపిన 20 మందికి రెండు వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇస్తాం. త్వరలో జరగనున్న ‘కిల్లర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజేతలను వేదిక మీదకు పిలిచి ఈ క్యాష్ ప్రైజ్ అందిస్తాం. ఔత్సాహికులు తమ రీల్స్, టెక్ట్స్ మెసేజ్లు జ్యోతి పూర్వాజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు ట్యాగ్ చేసి పంపించాలి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ, లైన్ ప్రొడ్యూసర్స్: దశరథ మాధవ్, సీతారామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డీఎస్ బాష. -
'ది ప్యారడైజ్' టికెట్ రేట్లు పెంచుతారా?.. ఎందుకీ రిస్క్?
ఇటీవల సాధారణ టికెట్ రేట్లతోనే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’ రెగ్యులర్ ధరలతోనే డబుల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇలాంటి సమయంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ రేట్ల పెంపుతో వస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ చిత్రం ప్రీమియర్స్కు ఫ్లాట్గా రూ.400 ధర నిర్ణయించినట్లు, తొలి రోజు నుంచి పది రోజుల వరకు ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక జీవోలు రావాల్సి ఉంది.అయితే అసలు ప్రశ్న టికెట్ రేట్లు ఎంత పెంచుతున్నారనేది కాదు.. ఎందుకు పెంచుతున్నారనేదే. కంటెంట్పై నమ్మకం ఉంటే సాధారణ ధరలతోనే సినిమా విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ‘ఇరుముడి’ వంటి సినిమాలు నిరూపించాయి.‘ది ప్యారడైజ్’ మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమాను ట్రైలర్ లేకుండా రిలీజ్ చేస్తూ ఓ రిస్క్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుతో మరో రిస్క్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సినిమాకు ప్లస్ అవుతుందా.. లేక ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందా అనేది రిలీజ్ తర్వాతే తేలనుంది.తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 24 తేదీనే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. -
ఫ్యామిలీతో టాలీవుడ్ హీరో.. గణపతి పూజలో బుల్లితెర జంట
ఫ్యామిలీతో హీరో శౌర్య వినాయక చవితి సెలబ్రేషన్స్..బుల్లితెర జంట నిరుపమ్- మంజుల గణపతి పూజలు.. వెకేషన్లో టాలీవుడ్ నటి రోహిణి..గణపతి పూజలో బాలీవుడ్ భామ జాస్మిన్ బాసిన్..శారీలో ఇషితా దత్తా పోజులు.. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Jasmine Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Manjula Paritala (@manjula_paritala_official) -
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా శ్రీరస్తు
ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా నటిస్తోన్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శ్రీరస్తు'. ఈ మూవీని హరి క్రియేషన్స్ పతాకంపై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతకు ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఓకేసారి తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే కామెడీతో ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. హీరో, హీరోయిన్ పాత్రల మధ్య ప్రేమకథ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో సుమన్, దేవి ప్రసాద్, అమని, చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. -
ట్రైన్ పొడవంతా సినిమా టైటిల్.. ట్రైలర్ చూశారా?
ఒక సినిమా టైటిల్ మహా అయితే పదక్షరాల లోపే ఉంటుంది. లేదంటే ఓ పదిహేను అక్షరాల వరకు కూడా ఉండొచ్చు. ఇదేంటి ఏకంగా ఒక లైన్ అంతా టైటిల్ పెట్టేశారు. ఒక సినిమాకు ఇంత పెద్ద టైటిల్ కూడా పెడతారా అనే సస్పెన్స్కు తెరదించారు వీళ్లు. మొత్తానికి ఇలా కూడా టైటిల్ పెడతారా అనే చర్చకు తెరతీశారు. 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' అంటూ ట్రైన్ పొడవంతా అతిపెద్ద టైటిల్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. టైటిల్ పొడవు చాలదన్నట్లు 'ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా' అనే ఉపశీర్షిక కూడా పెట్టారు. ఈ మూవీకి చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్తో వస్తున్న సినిమాగా రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. -
టాలీవుడ్కు ఏమైంది.. దసరాకు కనిపించని అగ్ర హీరోలు..!
దసరా వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు క్యూ కడతాయి. ముఖ్యంగా టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల తర్వాత అంతటి క్రేజ్ ఉన్న పండుగ ఇదే. ఈ పండుగకు సరిగ్గా నెలకు పైగా సమయం మాత్రమే ఉంది. పండుగ సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ టాలీవుడ్లో ఈసారి దసరా సెలవులకు పెద్ద సినిమాల హడావుడి లేనట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ అగ్ర హీరోలు తప్పుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రతారలు ఈ విజయదశమి పోటీ నుంచి తప్పుకున్నారు. కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే ఈ పండుగ బరిలో నిలవనున్నట్లు కనిపిస్తోంది. ఆయన హీరోగా వస్తోన్న రణబాలి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కానుందని అఫీషియల్గా ప్రకటించారు.విశ్వంభరపై వీడని సస్పెన్స్..ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దసరాకైనా రిలీజ్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో విశ్వంభర విజయదశమికి వస్తుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. మరికొద్ది రోజులు ఆగితే కానీ ఈ విషయంలో స్పష్టత వచ్చేలా లేదు. రాబోయే రోజుల్లోనైనా విశ్వంభరపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే. అయితే ఈ విజువల్ వండర్ను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవలే ఓటీటీ హక్కుల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చింది.దసరా బరిలో బాలయ్య నిలుస్తాడా?టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య సైతం దసరా బరిలో నిలుస్తాడని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చేనెల దసరా బరిలో నిలుస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. రాబోయే షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయ్యాక రిలీజ్ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.ముందుగానే ఆదర్శ కుటుంబం..దసరా కంటే ముందుగానే వెంకీమామ- త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఆదర్శ కుటుంబం రిలీజ్ కానుంది. ఈ మూవీ వచ్చేనెల 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. దీంతో దసరా బరి నుంచి వెంకీమామ తప్పుకున్నట్లే. బాక్సాఫీస్ వద్ద కనిపించని సందడి..ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించడం లేదు. విజయ్ దేవరకొండ రణబాలి మాత్రమే బాక్సాఫీస్ వద్ద బరిలో నిలవనుంది. తెలుగు అగ్రహీరోల సినిమాలు ఈ విజయదశమికి లేకపోవడం సినీ ప్రియులను నిరాశకు గురి చేస్తోంది. దీంతో రణబాలి మాత్రమే దసరా బాక్సాఫీస్ను శాసించేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో విజయ్కు జోడీగా ఆయన సతీమణి రష్మిక మందన్నా నటించింది. వీరిద్దరి పెళ్లి తర్వాత వస్తోన్న తొలి సినిమా రణబాలి కావడం విశేషం. -
ఆ ఒక్క సినిమా నా కెరీర్నే మార్చేసింది : సూరి
ఒక్క సినిమా చాలు.. ఓ నటుడి కెరీర్నే మార్చేయడానికి. మంచి బొమ్మ పడాలే కానీ.. అప్పటివరకు ఉన్న ఇమేజ్ను పక్కనపెట్టి రాత్రికి రాత్రే స్టార్గా మారిపోవచ్చు. అందుకు తమిళ నటుడు సూరి ప్రయాణమే ఓ చక్కటి ఉదాహరణ. కమెడియన్గా ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించిన సూరి.. ‘విడుదలై’తో ఒక్కసారిగా తనలోని సీరియస్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘గరుడన్’, ‘కొట్టుక్కాళి’, ‘మామన్’ వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘మండాడి’తోనూ మరోసారి తన సత్తా చాటుతున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 65 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూరి..తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.నేను కమెడియన్గా చాలా సినిమాలు చేశాను. చాలా మంది దర్శకులు నాతో రకరకాల కామెడీ చేయించారు. కానీ నాలో ఉన్న భిన్నమైన నటుడిని గుర్తించింది మాత్రం వెట్రిమారన్. ఆయన దర్శకత్వం వహించిన ‘విడుదలై’(తెలుగులో ‘విడుదల) చిత్రం నా కెరీర్నే మార్చేసింది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం నేను ఆయన దగ్గరకు వెళ్లాను. కానీ ఆయన నన్నే హీరోగా తీసుకొని సినిమా చేశాడు. హీరోగా మారిన తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులను నేను ఎంతో గౌరవిస్తాను. వారి అంచనాలకు తగ్గట్లుగా కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. మన గతాన్ని మర్చిపోకుండా, అహంకారానికి పోకుండా ఉంటే.. సినిమా మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. కొత్త, పాత దర్శకులతో కలిసి పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను’ అని సూరి అన్నారు. -
ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు సర్ప్రైజ్
‘ఇరుముడి’ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నక్షత్ర (మణమ్మ) కీలక పాత్రలో నటించింది. చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రీకూతురు సెంటిమెంట్ సన్నివేశాల్లో నక్షత్ర నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సన్నివేశాలను చూసి చాలామంది ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. (ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!)నక్షత్రతో కేక్ కట్ చేయించి..తాజాగా నక్షత్ర చదువుతున్న పాఠశాల యాజమాన్యం ఆమె విజయాన్ని ప్రత్యేకంగా అభినందించింది. స్కూల్లో నక్షత్రతో కేక్ కట్ చేయించి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు. చిన్నారి నక్షత్రను అందరూ ప్రశంసిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమా విజయంతో పాటు నక్షత్ర నటనకు ఇంతటి గుర్తింపు రావడంపై నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే.. Nakshatra Celebrated the success of #Irumudi with her teachers and friends l! 🥹✨#RaviTeja #BlockbusterIrumudi pic.twitter.com/lrCyYv01IB— Neeraj Kumar (@73forever_) September 15, 2026 -
షాలినీపై నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు.. బిగ్బాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్
బిగ్బాస్ సీజన్-10లో నామినేషన్ కారణంగా చైత్ర ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా నరేశ్ చేసిన వ్యాఖ్యలపై చైత్ర స్పందించిన తీరు నెట్టింట వైరల్గా మారింది.ఇదీ చదవండి: ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే వెలిశారుచైత్రను ప్రస్తావిస్తూ.. నిన్నటి ఎపిసోడ్లో నరేశ్.. షాలినీ ఎలిమినేషన్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో చైత్రను ప్రస్తావిస్తూ ఆమెతో జరిగిన గొడవను గుర్తు చేశాడు. ‘ఆ రోజు చైత్రకు సారీ చెప్పాల్సింది పోయి.. తిరిగి ఆమెనే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పేలా చేశావు. అది సరైనది కాదు’ అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.మీమ్ రూపంలో.. ఈ క్లిప్ను చైత్ర తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీమ్ రూపంలో షేర్ చేసింది. అంతేకాకుండా నరేశ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ‘బాగా చెప్పాడు’ అంటూ తన రియాక్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా బిగ్బాస్ హౌస్లో ఉన్న సమయంలో చైత్ర, షాలినీ మధ్య ఓ విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైత్రనే షాలినీకి సారీ చెప్పింది. ఈ పరిణామంతో ఆమె హౌస్మేట్స్తో పాటు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే ఘటనను నరేశ్ ప్రస్తావించడంతో.. చైత్ర ఈ క్లిప్ను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by ₵Ⱨ₳ł₮ⱧⱤ₳Ɽ₳ł17.ⱧØⱠł₵ (@chaithrarai17.holic) -
స్కూల్ పిల్లల చేతుల మీదుగా ‘మెస్సి’ ఫస్ట్ లుక్ రిలీజ్
ఆకర్ష ఆలపాటి సమర్పణలో ధామా టేల్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రం ‘మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’. నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించారు. జమునా అబ్దు రెహ్మాన్, విజయన్, సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ గ్లింప్స్ను స్కూల్ పిల్లల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేశారు. చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించినట్లు చిత్రబృందం తెలిపింది. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జేక్స్ బిజాయ్ సంగీతం సమకూరుస్తున్నారు. నౌఫల్ అబ్దుల్లా ఎడిటింగ్, అశోక్ మల్లికార్జున్ వీఎఫ్ఎక్స్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ.. కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మరిన్ని వినూత్న ప్రాజెక్టులతో ముందుకు రానున్నామని చెప్పారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ‘మెస్సి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరవింద్ బత్తిని, అర్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రానికి ప్రేక్షకులు, మీడియా మద్దతు అందించాలని కోరారు. -
ఏషనాగుల సాంగ్.. పుష్ప, దేవర రికార్డ్స్ బ్రేక్..!
నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ అభిమానులు ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇటీవల రిలీజైన ఫోక్ సాంగ్ ఏషనాగుల ఏకంగా పూనకాలు తెప్పిస్తోంది. ఈ మూవీ యూట్యూబ్లో రికార్డులు తిరగరాస్తోంది.తాజాగా ఈ సాంగ్ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. విడుదలైన కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. సింగిల్ లాంగ్వేజ్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న టాలీవుడ్ సాంగ్గా రికార్డ్ సృష్టించింది. ఇదే క్రమంలో పుష్ప మూవీలోని ఊ అంటావా మావా, దేవర సినిమాలోని చుట్టమల్లే పేరిట ఉన్న రికార్డులను అధిగమించింది. కాగా.. ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే వెలిశారు
నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఒక రికార్డు సృష్టించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాంన్నటాయి.వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వాడవాడలా గణేషుడి మండపాలు వెలిశాయి. అయితే ఈ ది ప్యారడైజ్ మూవీ విడుదల కాకముందే అభిమానులు తమదైన స్టైల్లో సంబరాలు నిర్వహించుకుంటున్నారు. విశాఖపట్నంలో ‘ది ప్యారడైజ్’ థీమ్ను తలపించేలా ఏకంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి పూజలు నిర్వహించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ( సమంత సీమంతం వేడుక.. అసలెందుకు ఇంత స్పెషల్?)ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్కాగా ఇటీవల‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్#TheParadise గణేష్ ….. pic.twitter.com/qGruzAux4L— Rajesh Manne (@rajeshmanne1) September 14, 2026 -
సుహాస్ మండాడి.. బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు..!
టాలీవుడ్ హీరో సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ మండాడి. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. కేవలం మౌత్ టాక్తో మండాడి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సెప్టెంబర్ 10న తెలుగులో రిలీజ్ చేశారు. మండాడి కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు. #Mandadi crossed 65cr+ world wide gross 🔥Marching towards 100cr 💥@sooriofficial consistency 👌🏻 pic.twitter.com/MFsptPdvn1— Quality Pixels (@Quality_Pixels) September 15, 2026 -
ప్లీజ్.. రూ. 5 లక్షలు ఇస్తా వదిలెయ్ : ‘ఢీ’రాజు ఆడియో వైరల్
బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనను రాజు లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి మీయాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రాజుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉంటే..తాజాగా రాజుకు, కేసు పెట్టిన యువతికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించినదిగా చెబుతున్న ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్తో గొడవ.. స్పందించిన దర్శకుడు)ఆడియోలో రాజు... ఇప్పటి నుంచి కేవలం స్నేహితుడిగానే ఉంటానని చెబుతున్నాడు. ప్లీజ్ శిరీష వద్దు.. తనను వదిలేసేందుకు రూ.5 లక్షలు ఇస్తానని అంటున్నాడు. అందుకు నిరాకరించిన యువతి.. తనతోనే ఉంటే కష్టం అనేది రాకుండా చూసుకుంటానని చెబుతోంది. వేరే అమ్మాయి కోసమే తనను వదిలేస్తున్నావా..? అంటూ రాజును యవతి నిలదీసింది. కానీ ఎవరితో తాను తిరగడంలేదని ఈ రిలేషన్ షిప్ వద్దని రాజు కోరారు. అయినప్పటికీ తనతోనే ఉండాలని యవతి కోరుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే రాజు మాత్రం తనను ఒక ఫ్రెండ్లా మాత్రమే చూశానని.. ప్రేమ, పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నాడు. అంతేకాదు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. తనతో మాత్రం రోజుకు ఒకసారి కలుస్తానని అంటున్నాడు. చివరికి రూ.5 లక్షలు ఇచ్చి వెళ్లిపోపోవచ్చని, ఫ్రెండ్ లా ఉండాలన్నా మరో యువతిని నీ పక్కన చూస్తూ ఉండలేనంటూ ఎమోషనల్ అయింది. అయితే ఆడియోలో ఉన్న వాయిస్ నిజంగా రాజుదేనా లేదా ఫేక్ ఆడియోనా అనేది తెలియాల్సి ఉంది.ఢీ షో విజేత రాజు ఆడియో కాల్నేను వేరే పెళ్లి చేసుకుంటా.. ఫ్రెండ్గా ఉంటా.. రెండు రోజులకు ఒకసారి అయినా కలుస్తా... నీ దగ్గర తీసుకున్న డబ్బులన్నీ తిరిగి ఇస్తాను.. నన్ను వదిలేయ్ వేడుకున్న రాజునేను మనస్ఫూర్తిగా ప్రేమించాను.. నీతో వేరే అమ్మాయిని ఊహించుకోలేను అంటూ వేడుకున్న యువతి pic.twitter.com/UwoZXr8dTO— greatandhra (@greatandhranews) September 15, 2026 -
సమంత సీమంతం వేడుక.. అసలెందుకు ఇంత స్పెషల్?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ ఏడాది గ్రాండ్ సక్సెస్ కొట్టింది. మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సీమంతం వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటితో పాటు ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది. సమంత సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సీమంతం ప్రత్యేకతలివే..అయితే సమంత సీమంతం వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయ సీమంతం కంటే భిన్నంగా నిర్వహించిన తీరు ఆకట్టుకుంది. మరి ముఖ్యంగా ప్రత్యేక శ్రీవిద్య పూజా విధానంలో నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పూజ ఎందుకు చేస్తారని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. సమంత సీమంతంలో నిర్వహించిన ప్రత్యేక పూజా విధానం వెనక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం.సాధారణంగా జరిగే సీమంతం వేడుకల్లో ఆశీర్వాదాలు, సంప్రదాయ ఆచారాలు ప్రధానంగా కనిపిస్తాయి. కానీ సమంత సీమంతంలో మాత్రం ఆధ్యాత్మిక విశిష్టతకు పెద్దపీట వేశారు. శ్రీవిద్య ఉపాసకుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో శ్రీచక్ర యంత్రం మధ్యలో సమంతను కూర్చోబెట్టి ప్రత్యేక మంత్రోచ్ఛారణలు చేశారు.ఈ పూజతో తల్లి గర్భంలోని శిశువుకు దైవిక రక్షణ కలగాలనే సంకల్పంతో ఖడ్గమాలా స్తోత్ర పారాయణం, పవిత్ర జలాలతో శుద్ధి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు సమంత వెల్లడించారు. తల్లి, బిడ్డ చుట్టూ ఆధ్యాత్మిక రక్షణ వలయం ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. శ్రీవిద్యా సంప్రదాయంలో పాతుకుపోయిన సాంప్రదాయ కళా ఆవరణ (శ్రీ కల్పం) ఆచారాన్ని నిర్వహించి సమంత హాట్ టాపిక్గా మారారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గర్భిణిని దేవి స్వరూపంగా భావించే ఈ ఆచారం తనను ఎంతో కదిలించిందని రాసుకొచ్చింది. తన బిడ్డ కోసం ఇలాంటి పవిత్ర అనుభూతిని పొందడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.(ఇది చదవండి: సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్)సామ్ తన ఇన్స్టాలో రాస్తూ.." మన సంప్రదాయాల పట్ల నాకు ఎల్లప్పుడూ ప్రగాఢమైన గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక మంత్ర ధ్వనిలో.. జపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిలో..ప్రాచీన ఆచారాలు తరతరాలుగా జాగ్రత్తగా అందించబడిన విధానంలో ఏదో ఒక లోతైన శక్తి పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతాను" అని పోస్టు చేసింది. కాగా.. సమంత గతేడాది ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక కోయంబత్తూరులో జరిగింది. -
ప్రమోషన్స్కి దూరంగా హీరోయిన్.. కారణం ఇదేనా?
ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే కష్టం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం జనాల్లోకి వెళ్లడం లేదు. పెద్ద సినిమాలకు సైతం ప్రమోషన్స్ గట్టిగానే చేయాల్సి వస్తుంది. హీరో హీరోయిన్లతో పాటు చిత్రబృందం అంతా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అప్పుడే ఆ సినిమాపై కాస్త బజ్ ఏర్పడి.. జనాల్లో దానిపై చర్చ జరుగుతుంది. ఇక చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారణం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసినా.. సినిమా టైటిల్ జనాల్లోకి వెళ్లడం లేదు. అందుకే పేరున్న నటీనటులతో ఇంటర్వ్యూలు ఇప్పించడం..హీరో హీరోయిన్లతో మీడియా సమావేశాలు పెట్టి.. వీలైనంత వరకు సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లు ప్రతి ఈవెంట్లోనూ పాల్గొంటున్నారు. అయితే కొన్ని చిన్న సినిమాలో నటించిన నటీనటులు మాత్రం ప్రమోషన్స్కి దూరంగా ఉంటున్నారు. చిన్న చిన్న కారణాలు చెప్పి..ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. తాజాగా మిస్సింగ్ మేఘన అనే సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.(ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?)వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించింది. ఈ ఈవెంట్కి హీరోతో పాటు మిగతా నటీనటులంతా హాజరయ్యారు. కానీ హీరోయిన్గా నటించిన అమ్ము అభిరామి మాత్రం..ఈవెంట్కి రాలేదు. దర్శకుడితో గొడవ జరిగిందని.. అందుకే ఆమె ప్రమోషన్స్కి దూరం ఉందనే పుకార్లు కూడా ఉన్నాయి. అయితే దర్శకుడు మాత్రం తనతో ఎలాంటి గొడవ జరగలేదనే క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇంకొంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉందని..అందుకే రాలేదని చెప్పాడు. అయితే హీరో మాత్రం మరోలా చెప్పాడు. తను వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉందని.. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్కి హాజరకాలేదని చెప్పాడు. అసలు కారణం ఏదో తెలియదు కానీ..ప్రమోషన్స్కి హీరోయిన్ రాకపోవడం మాత్రం సినిమాకు ఎంతో కొంత మైనస్ అనే చెప్పాలి. -
ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?
సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు కొన్నివారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం బిగ్ స్క్రీన్స్పై కాకుండా నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఓటీటీల్లో హిట్ అయిన సిరీస్ల్లోని పాత్రలని తీసుకుని వాటిని సినిమాలుగా మార్చి థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. రీసెంట్ టైంలో అలా 'మీర్జాపుర్', 'ఎపిక్' వచ్చాయి. కానీ ఓటీటీలో వీటికి దక్కిన ఆదరణకు.. థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్కి ఏ మాత్రం సంబంధం లేదు. మరి వీటి విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?(ఇదీ చదవండి: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. అధికారిక ప్రకటన)'మీర్జాపుర్'.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఈ సిరీస్.. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపుర్ అనే ఊరిలో జరిగే కల్పిత కథ. తెలుగుతో ఎలాంటి సంబంధం లేదు. అయినాసరే డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మనోళ్లకు తెగ నచ్చేసింది. మున్నా భయ్యా, కాళీన్ భయ్యా, గుడ్డు భయ్యా, బబ్లూ భయ్యా.. ఇలా ఈ సిరీస్లోని పాత్రలు, కథాకథనాలు మర్చిపోలేనంతగా రిజిస్టర్ అయిపోయాయి.2018లో తొలి సీజన్ రిలీజ్ కాగా 2020లో రెండోది, 2024లో మూడో సీజన్ వచ్చాయి. తొలి సీజన్ అదరగొట్టినప్పటికీ మిగిలిన వాటికి మిశ్రమ స్పందన వచ్చింది. ఓటీటీలో అదరగొట్టిన ఈ సిరీస్ని సినిమాగా తీస్తున్నాం అనేసరికి ఇంకేం స్టోరీ చూపిస్తారా అని చాలామంది అనుకున్నారు. కానీ పాత్రల్ని మాత్రమే తీసుకుని కొత్త క్యారెక్టర్లని ప్రవేశపెట్టి భిన్నంగా ప్రెజెంట్ చేశారు. కానీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. సిరీస్లో ఉన్నట్లు హై ఇచ్చే సీన్స్ పెద్దగా లేకపోయేసరికి ఓవరాల్గా ఓకే ఓకే అనిపించుకుంది.(ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ)ఇక 'ఎపిక్' విషయానికొస్తే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన తెలుగు సినిమా ఇది. మన దగ్గరే హిట్ అయిన #90స్ వెబ్ సిరీస్లోని ఆదిత్య అనే పిల్లాడి పాత్రని తీసుకుని వాడు పెరిగి పెద్దయి.. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఓ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్తో మూవీ తీశారు. ట్రైలర్, పాటలతో కాస్త ఆసక్తి కలిగించారు గానీ మూవీని సరిగా తీయలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా కొట్టేసింది.ప్రేమకథ అన్నారు గానీ ఏ మాత్రం రిలేటబుల్గా లేని సన్నివేశాలతో విసుగెత్తించారని 'ఎపిక్' చూసిన చాలామంది చెప్పారు. సిరీస్లో పాత్రని చూసి తమలా ఉందని చాలామంది అనుకున్నారు. అదే మూవీ చూస్తున్నప్పుడు మాత్రం అలాంటి ఫీలింగ్ రాకపోవడం పెద్ద మైనస్. ముద్దు, శృంగార సన్నివేశాలు కూడా మరీ ఎక్కువైపోవడం ఈ చిత్రానికి మరింత నెగిటివిటీకి కారణమైంది.ఈసారి ఎవరైనా దర్శకనిర్మాతలు.. ఓటీటీలో హిట్ అయిన సిరీస్లని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు తీద్దామనుకుంటే మాత్రం ఇలాంటి తప్పుల్ని రిపీట్ చేయకుండా కాస్త రిలేటబుల్ కంటెంట్తో వస్తే బెటర్. అలా కాదని క్రేజ్ని క్యాష్ చేసుకుందామనుకుంటే మాత్రం మొదటికే మోసపోవచ్చు!(ఇదీ చదవండి: నాయకత్వం అంటే ఇది కాదు.. తమిళ బిగ్బాస్లో రాజకీయ రగడ) -
ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. అధికారిక ప్రకటన
తెలుగింటి కోడలైన రష్మికని మరో అద్భుతమైన అవకాశం వరించింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న అవార్డ్ గ్రహీత ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్లో రష్మిక నటించబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. దీంతో గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్కి చెక్ పడింది.(ఇదీ చదవండి: రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో)ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రస్తావన గత కొన్ని నెలల నుంచి వస్తూనే ఉంది. సాయిపల్లవి, రుక్మిణి వసంత్ తదితరుల పేర్లు వినిపించాయి. కానీ చివరకు రష్మిక ఈ సదావకాశం దక్కించుకుంది. సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో ఈ మూవీ గ్రాండ్ లాంచ్ జరగనుంది. కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.'MS – A Legacy on Screen' (ఎమ్ఎస్: ఏ లెగసీ ఆన్ స్క్రీన్) పేరుతో ఈ బయోపిక్ రానుంది. చెన్నైలో జరిగే లాంచ్ ఈవెంట్లో ఇండియన్ చోరల్ ఎన్సెంబుల్ ప్రత్యేకంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన కొన్ని ప్రముఖ గీతాలను ప్రదర్శించి ఆమెకు నివాళులు అర్పించనున్నారు. ఇకపోతే అల్లు అరవింద్, బన్నీవాసు, రాక్ లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెర్సీ, మళ్లీరావా, కింగ్డమ్ చిత్రాలు తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించబోతున్నాడు.ఇప్పటివరకు కమర్షియల్, యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తున్న రష్మిక.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా ఎలా కనిపించనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తోంది. భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్రవేసిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి.. సంగీత రంగానికే పరిమితం కాలేదు. సేవాసదనం, శకుంతలై, సావిత్రి, మీరా లాంటి సినిమాల్లోనూ కనిపించారు.రష్మిక విషయానికొస్తే చాన్నాళ్లుగా తెలుగులో నటిస్తున్న ఈమె.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లిచేసుకుంది. వివాహం తర్వాత వీళ్లిద్దరూ కలిసి 'రణబాలి' అనే మూవీ చేశారు. వచ్చే నెల 16న ఇది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. అలానే రష్మిక చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' నవంబర్ 27న రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: రష్మికతో ఐటెం సాంగ్.. ఆ భయంతో తీసేశారు: తమన్) -
చిరు ఆర్డర్ చేసిన లాకెట్.. చరణ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు
మెగాహీరో రామ్ చరణ్ కెరీర్లోనే టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అంటే అందరూ చెప్పే పేరు 'రంగస్థలం'. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. అయితే ఈ చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ దగ్గర శ్రీకాంత్ ఓదెల పనిచేశాడు. తర్వాత కాలంలో 'దసరా'తో డైరెక్టర్ అయిన ఇతడు.. నానితో 'ప్యారడైజ్' తీశాడు. వచ్చేవారం ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రంగస్థలం' షూటింగ్ టైంలో చరణ్ని చాలా ఇబ్బంది పెట్టానని గుర్తుచేసుకున్నాడు. అప్పటి సంగతులు పంచుకున్నాడు.(ఇదీ చదవండి: టీజర్, పాటల దెబ్బ.. రిలీజ్కి ముందే నాని ‘ది ప్యారడైజ్’ రికార్డు)శ్రీకాంత్ ఓదెల, 'ప్యారడైజ్'లో విలన్గా చేసిన హిందీ నటుడు రాఘవ్ జుయెల్ సరదాగా కారులో తిరుగుతూ మాట్లాడుకున్నారు. ఇందులో శ్రీకాంత్ మెడలోని హనుమంతుడి లాకెట్ గురించి ప్రస్తావన వచ్చింది. 'ఈ లాకెట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే చిరంజీవి స్వయంగా చెన్నై వెళ్లి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి రెండే పీసులు తయారు చేయించారు. అందులో ఒకటి చిరంజీవి దగ్గరుంటే రెండోది 'రంగస్థలం' మూవీలో చరణ్ అన్న ధరించారు. ఈ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ ఇన్ఛార్జ్గా పనిచేశా''కాస్ట్యూమ్స్ విషయంలో చరణ్ అన్నని చాలా టార్చర్ పెట్టేవాడిని. తెల్లవారుజామున 3:30, 4 గంటలకే నిద్రలేపి ఆ కాస్ట్యూమ్ ఏది? ఈ లుక్ సరిగ్గా ఉందా? అని పరుగులు పెట్టించాను. షూటింగ్ చివరిరోజున చరణ్ అన్న నన్ను కారవాన్లోకి పిలిచారు. సాధారణంగా ఆయన ఎవరినీ అనవసరంగా పిలవరు. నేను కారవాన్లోకి వెళ్లగానే ఏం మాట్లాడకుండా ఈ లాకెట్ తీసి నా చేతిలో పెట్టారు. 'శ్రీకాంత్.. ఇది నీ దగ్గరే ఉంచుకో' అని చెప్పారు' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.'ఆ సమయంలో చరణ్ అన్నని ఇదెందుకు ఇస్తున్నారని ఒక్క ప్రశ్న అడగలేదు. అప్పుడు తీసుకున్న ఆ లాకెట్ ఇప్పటి వరకు నా మెడలోంచి తీయలేదు. రీసెంట్గా రామ్ చరణ్ని కలిసినప్పుడు “అన్నా.. ఈ లాకెట్ గుర్తుందా?” అని అడిగితే.. ఒక్కక్షణం ఆలోచించి అప్పటి సంగతి గుర్తుచేసుకున్నారు. “అవును కదా.. నేనే నీకు ఇచ్చాను” అని సంతోషపడ్డారు' అని శ్రీకాంత్ ఓదెల గుర్తుచేసుకున్నాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)#SrikanthOdela : రంగస్థలం సినిమాకి పనిచేసినప్పుడు #RamCharan అన్నని నేను బాగా టార్చర్ చేసే వాడిని..ఎర్లీ మార్నింగ్ టైంలో డ్రెస్సింగ్ దగ్గర బాగా డిస్కషన్ జరిగేవి.. లాస్ట్ డే షూటింగ్ అప్పుడు నన్ను పిలిచి ఈ లాకెట్ నాకు ఇచ్చారు.. ఇది #Chiranjeevi గారు ఆర్డర్ పెట్టాలా… pic.twitter.com/H3LaxDCqGI— CHITRAMBHALARE (@chitrambhalareI) September 14, 2026 -
గణనాథుని సేవలో నమ్రతా.. వినాయకుడి పూజలో అనసూయ
టాలీవుడ్ అనసూయ వినాయకుని పూజలు..గణనాథుని సేవలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా..ఫ్యామిలీతో నవీన్ చంద్ర వినాయక పూజలు..ఆది పినిశెట్టి- నిక్కీ గార్లానీ జంట వినాయక చవితి సెలబ్రేషన్స్..గణపతి బప్పా మోరియో అంటోన్న బుల్లితెర భామ తేజస్విని గౌడ.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Naveen Chandra (@naveenchandra212) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
వినాయక చవితి వేళ.. టాలీవుడ్ ప్రేమజంట పూజలు..!
టాలీవుడ్లో మోస్ట్ ఫేమస్ జంటల్లో వీరిది ఒకటి. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఇషా రెబ్బా గురించి ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలా సార్లు ఈ జంట రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చాయి. గతంలో ఇషాతో రిలేషన్పై తరుణ్ స్పందించారు. తాను ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువని స్పష్టం చేశారు. అనుకున్నట్లు జరిగితే గుడ్ న్యూస్ చెప్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు.తాజాగా వీరిద్దరి రిలేషన్పై మరోసారి చర్చ మొదలైంది. ఇవాళ వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా జంటగా పూజలు చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇవీ చూసిన కొందరు వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజా ఫొటోతో వీరి రిలేషన్పై మరోసారి జోరుగా చర్చ మొదలైంది. కాగా.. ఈ ఏడాది వీరిద్దరు హీరో, హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదలైంది. ఇది మలయాళ మూవీ జయ జయ జయహేకి రీమేక్గా తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Tharun Bhascker Dhaassyam (@tharunbhascker) -
సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ ఏడాది గ్రాండ్ సక్సెస్ కొట్టింది. మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సీమంతం వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటితో పాటు ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది.సామ్ తన ఇన్స్టాలో రాస్తూ.." మన సంప్రదాయాల పట్ల నాకు ఎల్లప్పుడూ ప్రగాఢమైన గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక మంత్ర ధ్వనిలో.. జపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిలో..ప్రాచీన ఆచారాలు తరతరాలుగా జాగ్రత్తగా అందించబడిన విధానంలో ఏదో ఒక లోతైన శక్తి పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతాను" అని పోస్టు చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఈ సీమంతం ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. సమంత గతేడాది ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక కోయంబత్తూరులో జరిగింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
'ప్రతి విషయానికి అనుమానమే..'ఫుల్ కామెడీ ట్రైలర్ చూశారా?
రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ చిత్రానికి విమల్కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రతి చిన్న విషయానికి అనుమానపడే వ్యక్తి వల్ల అతనితో పాటు.. చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే కోణంలోనే ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. -
టీజర్, పాటల దెబ్బ.. రిలీజ్కి ముందే నాని ‘ది ప్యారడైజ్’ రికార్డు
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో.. ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లోనూ కనిపిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ దూకుడు మొదలైంది.నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి నార్త్ అమెరికాలో భారీ స్పందన లభిస్తోంది. ప్రముఖ ఓవర్సీస్ పంపిణీ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 23న నార్త్ అమెరికా ప్రీమియర్ షోలు గ్రాండ్గా ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరందుకున్నాయి.తాజాగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్లో ‘ది ప్యారడైజ్’ 250K డాలర్ల మార్క్ను దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్లో తన సత్తా చాటుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్కు వస్తున్న స్పందన చూస్తుంటే.. ప్రీమియర్ షోల సమయానికి ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇక ‘ది ప్యారడైజ్’పై నాని అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘దసరా’కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో.. ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై హైప్ను మరింత పెంచింది.మొత్తానికి.. థియేటర్లలోకి రాకముందే ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్లో రికార్డుల వేట మొదలుపెట్టింది. నార్త్ అమెరికా ప్రీమియర్స్కు ఇంకా సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయికి చేరుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.#ThePARADISE North America PREMIERES PRE-SALES $250K and Counting 💥Bookings Open Now 🎟️Overseas By @PrathyangiraUS , Premieres On SEPTEMBER 23 👊@NameisNani @Odela_Srikanth @AnirudhOfficial @SudhakarCheruk5 @SLVCinemasOffl @TheParadiseOffl pic.twitter.com/50lUAYqiTr— Vamsi Kaka (@vamsikaka) September 14, 2026 -
బిగ్బాస్లో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం
బిగ్బాస్ సీజన్-10లో ఎలిమినేషన్స్ వేడి మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లు తమకు నచ్చని వారి పేర్లు చెబుతూ.. అందుకు కారణాలను వివరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కాస్తా హౌస్లో మాటల యుద్ధానికి దారితీసినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లను పూర్తి చేసేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. మరోవైపు ఎలిమినేషన్ పాయింట్స్లోనూ ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.తాజా ప్రోమోలో నరేశ్.. షాలినీని ఎలిమినేషన్కు నామినేట్ చేస్తూ తన కారణాలను చెప్పాడు. దీనికి షాలినీ కూడా గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ కనిపించారు. మరోవైపు వర్షిణి, షాలినీ మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమోలో చూపించారు. వీరిద్దరి మధ్య అసలు గొడవకు కారణమేంటి? ఎలిమినేషన్ పాయింట్స్ విషయంలో ఎవరి వాదన సరైనది? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే బిగ్బాస్ హౌస్లో పోటీ రసవత్తరంగా మారగా.. ఎలిమినేషన్ ప్రక్రియతో మరింత వేడి పెరిగినట్లు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఏం జరిగింది? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ఎవరి మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లిందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
పావలా శ్యామల మరణం.. 'మా' కీలక నిర్ణయం
సీనియర్ నటి పావలా శ్యామల కూతురికి మా అండగా నిలిచింది. తల్లి మరణంతో ఒంటరైన ఆమె కూతురు మాధవి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. తీవ్ర అనారోగ్యం, నిస్సహాయ స్థితిలో ఆమెకు సహాయ, సహకారాలు అందిస్తామని మా ప్రకటించింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు నేతృత్వంలో సమావేశమైన ఈసీ కమిటీ మాధవికి సంబంధించి పలు నిర్ణయాలు వెల్లడించింది.ఆమెకు ఏడాది పాటు ఉచిత వైద్యం, ఫిజియోథెరపీ అందించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో వీల్ ఛైర్కే పరిమితమైన మాధవి తిరిగి తన కాళ్లపై నిలబడేలా, ఎంత ఖర్చైనా ఒక సంవత్సరం పాటు పూర్తి ఉచిత వైద్య సహాయంతో పాటు ఫిజియోథెరపీ అందించాలని 'మా' కీలక నిర్ణయం తీసుకుంది. మా అసోసియేషన్ బైలాస్ ప్రకారం ఆర్టిస్టుల కుటుంబ సభ్యులను జీవితాంతం పోషించడం సాధ్యపడదని.. అందుకే ఈ వైద్య సాయాన్ని ఒక ఏడాదికే పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ఇష్టప్రకారం సురక్షితమైన ఆశ్రమం, పునరావాస కేంద్రంలో చేర్పించనున్నారు. కాగా. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యతలను మా దగ్గరుండి జరిపించగా.. మాధవి భవిష్యత్తు అవసరాల కోసం మురళీమోహన్, వీకే నరేశ్ లాంటి సీనియర్ నటులు ఆర్థిక సహాయం ప్రకటించారు. -
అడుగుపెట్టగానే ఫేమస్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
బిగ్బాస్ సీజన్10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్ ఒకరు. బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హౌస్లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్మేట్స్కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. మరి ఆమె కోసం కొన్ని ముచ్చటైన విషయాలు తెలుసుకుందామా..!దేబ్జానీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్బా మోదక్ వ్యాపారవేత్త.. తల్లి మితా మోదక్ గృహిణి. ఈమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి లేదు. అనుకోకుండా ఓ సీరియల్లో అవకాశం రావడంతో అలా బుల్లితెరపై అడుగుపెట్టి బెంగాలీ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.ఎన్నెన్నో జన్మల బంధంతో గుర్తింపు...తెలుగులో బేబ్జానీకి మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్ ‘ఎన్నెన్నో జన్మల బంధం’. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అప్పట్లో ఈమె.. తన నటన, మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదీ చదవండి: బిగ్బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?బిగ్బాస్లో ఫస్ట్ కంటెస్టెంట్గా..ఇప్పుడు అదే గుర్తింపుతో బిగ్బాస్ సీజన్10లో ఫస్ట్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి తన మాటలతో అటు హౌస్మేట్స్తో పాటు ఇటు ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు.బిగ్బాస్లో ప్రపోజల్ హింట్..బిగ్బాస్లో తొలివారం బేబ్జానీ పేరే హైలెట్గా నిలిచింది. ఆమె ఆడే తీరు అలాంటిది మరి. అయితే బిగ్బాస్లో ఓ కంటెస్టెంట్ అంటే కూడా చాలా ఇష్టమని తన మాటల్లోనే చెప్పింది. ‘ బిగ్బాస్ హౌస్లో ఉన్న ముకేశ్ అంటే నాకు చాలా ఇష్టం. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ నా దగ్గరకు మాత్రం రావడం లేదు. అందుకే ఈ విషయం అతనితో చెప్పలేకపోయా. నీక కాఫీ అంటే ఎంత ఇష్టమో అతను అంటే కూడా అంతే ఇష్టం. అతని కళ్లు కూడా చాలా బాగుంటాయి’ అని బిగ్బాస్ హౌస్లో ఓ సందర్భంలో తన మనసులోని మాటను బయటపెట్టింది దేబ్జానీ. ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?అంతే కాకుండా తాను ఆరో తరగతి తొలసారి ఫైయిల్ కావడంతో రెండు సార్లు చదవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే నిజంగానే అతనంటే ఇష్టమా లేక గేమ్ కోసం చెప్పిందా అని సందిగ్దత నెలకొంది. ఏదీఏమైనప్పటికీ ఈ బిగ్బాస్లో దేబ్జానీ జర్నీ ఎంతవరకు సాగుతుంది?. ఈ సారి కప్ ఈమె కొడుతుందో లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సంక్రాంతి రేసులో మరో సినిమా.. ఇంకెన్నిరా బాబు!
సంక్రాంతికి డబ్బులొస్తున్నాయి కదా అని లెక్కకు మించి తెలుగు సినిమాలు ఈ పండగనే టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే అరడజనుకు పైగా మూవీస్ బరిలో ఉండగా ఇప్పుడు మరొకటి కూడా వచ్చి చేరింది. గతంలో 'సామజవరగమన'తో సక్సెస్ అందుకున్న హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కొత్త చిత్రానికి 'ఫ్యామిలీ ప్యాక్' టైటిల్ ఫిక్స్ చేశారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)వచ్చే పండగ రేసులో మొదట రాబోతున్న సినిమా 'మహాకాళి'. డివోషనల్ సబ్జెక్ట్తో తీసిన ఈ చిత్రం జనవరి 08న రాబోతుంది. గత కొన్నేళ్లుగా ప్రతిసారి సంక్రాంతికి వస్తున్న అనిల్ రావిపూడి.. ఈసారి 'జనవరి 12 విడుదల'ని జనవరి 12న తీసుకొస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు', చిరంజీవి 'కాకా' మూవీస్ 13వ తేదీన.. శర్వానంద్-శ్రీనువైట్ల 'జార్జ్ క్రిష్' 14వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. వీటిని అధికారికంగా ప్రకటించారు. వీటికి తోడుగా ఇప్పుడు 'ఫ్యామిలీ ప్యాక్' వచ్చి చేరింది.ఎప్పటినుంచో పెండింగ్లో ఉండిపోయిన 'విశ్వంభర', డిసెంబరులో రావాల్సిన ప్రభాస్ 'ఫౌజీ' కూడా వచ్చే సంక్రాంతికి రావొచ్చని అంటున్నారు. చూస్తుంటే ఈసారి పండక్కి పెద్ద లిస్టు రెడీ అవుతోంది. కానీ చివరకొచ్చేసరికి ఇందులో ఎన్ని నిలబడతాయనేది చూడాలి?(ఇదీ చదవండి: కళ్లుచెదిరేలా సీక్వెల్.. నయనతార 'మహాశక్తి' టీజర్ రిలీజ్)Sankranthi is for FAMILY. ❤️This Sankranthi is for #FamilyPack 🤪💥The SREE VISHNU X RAM ABBARAJU 2 combo is back with a pack full of FUN & MADNESS! 🔥Happy Vinayaka Chavithi ✨Come with your FAMILY PACK to theatres this Sankranthi 2027! 😜#FamilyPackedSankranthi 😎… pic.twitter.com/V6b1jNCNw3— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2026 -
దేవిశ్రీని పక్కన పెట్టిన సుక్కు.. రామ్చరణ్ సినిమాకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్!
సినిమా హిట్లో దర్శకుడి విజన్ ఎంత కీలకమో.. దానికి తగ్గట్టుగా ఆ విజన్ను తెరపై ఆవిష్కరించే టెక్నీషియన్ల పాత్ర కూడా అంతే కీలకం. అందుకే కొందరు దర్శకులు తమకు బాగా సింక్ అయ్యే టెక్నీషియన్లను ఎప్పటికీ వదులుకోరు. ముఖ్యంగా సంగీత దర్శకుల విషయంలో ఈ కాంబినేషన్లు మరింత ప్రత్యేకంగా నిలుస్తాయి. టాలీవుడ్లో ఇలాంటి కాంబినేషన్ అంటే వెంటనే గుర్తొచ్చే జోడీల్లో రాజమౌళి-కీరవాణి, సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ ముందుంటారు. అయితే ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లలో ఒకదానికి బ్రేక్ పడబోతోందనే ప్రచారం ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది.రాజమౌళి మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కీరవాణితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సుకుమార్ కూడా దాదాపు తన కెరీర్ ఆరంభం నుంచి దేవిశ్రీ ప్రసాద్తో కలిసి పనిచేస్తూ వచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అందుకే సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ సంగీతం తప్ప మరొకరిని ఊహించడం కూడా కష్టమే అన్నంతగా వీరి కాంబినేషన్ ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసింది.(ఇదీ చదవండి: సంక్రాంతి రేసులో మరో సినిమా.. ఇంకెన్నిరా బాబు!)అయితే ఇప్పుడు సుకుమార్ మాత్రం ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. రామ్చరణ్తో సుకుమార్ చేయబోయే కొత్త సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో ‘దురంధర్’ ఫేమ్ శశ్వత్ సచ్దేవ్ను సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ వార్త మాత్రం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే ‘పుష్ప 2’ విషయంలో సుకుమార్-దేవిశ్రీల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ఈ సినిమాలో కొంత భాగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ను సామ్ సీఎస్తో చేయించుకోవడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు రామ్చరణ్ సినిమాకు కూడా దేవిశ్రీ కాకుండా మరో సంగీత దర్శకుడిని ఎంచుకుంటున్నారనే వార్తలు రావడంతో.. ఈ ఇద్దరి మధ్య నిజంగానే దూరం పెరిగిందా? అనే చర్చ మొదలైంది.ఈ ప్రచారం దేవిశ్రీ ప్రసాద్ అభిమానులను మాత్రం తీవ్రంగా అసంతృప్తికి గురిచేస్తోంది. మొదటి నుంచి దేవితో కలిసి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అందించిన సుకుమార్.. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్ సినిమాల విజయాల్లో దేవిశ్రీ పాత్రను గుర్తు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘జగడం’, ‘ఆర్య 2’, ‘1 నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి సినిమాల్లో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. వాటి పాటలు, నేపథ్య సంగీతానికి మంచి స్పందన లభించింది. అందుకే సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదని, ఆయన సినిమాటిక్ విజన్ను అర్థం చేసుకున్న కీలక భాగస్వామి అని అభిమానులు చెబుతున్నారు.అయితే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం వల్లే సుకుమార్ మరో సంగీత దర్శకుడిని ఎంచుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ దేవిశ్రీ ఇతర ప్రాజెక్టులకు సంగీతం అందిస్తుండటాన్ని ఉదాహరణగా చూపిస్తూ అభిమానులు ఈ కారణాన్ని అంగీకరించడం లేదు. అసలు కారణం మరేదైనా ఉందా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్కు నిజంగానే బ్రేక్ పడుతుందా? రామ్చరణ్-సుకుమార్ కొత్త సినిమాకు శశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించనున్నారా? అన్నది అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఈ కాంబినేషన్ మార్పుపై జరుగుతున్న ప్రచారం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్గా కొనసాగనుంది. -
కళ్లుచెదిరేలా సీక్వెల్.. నయనతార 'మహాశక్తి' టీజర్ రిలీజ్
ఆరేళ్ల క్రితం అంటే లాక్ డౌన్ టైంలో వచ్చిన ఓ తమిళ సినిమా 'మూకుతి అమ్మన్'. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించి, లీడ్ రోల్ చేశాడు. ఇందులో అమ్మవారిగా నయనతార నటించింది. అప్పట్లో ఇది చిన్న చిత్రం. ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంది. చాన్నాళ్ల క్రితం దీని సీక్వెల్ మొదలుపెట్టారు. సుందర్.సి దర్శకుడు. వినాయక చవితి సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'విశ్వంభర' బండి కదిలింది)ఐసరి గణేశన్, నయనతార సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్కి తెలుగులో 'మహాశక్తి' టైటిల్ నిర్ణయించారు. ఈ నవంబరు 06న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తొలి పార్ట్ ఓ మాదిరిగానే తీసినప్పటికీ ఈసారి మాత్రం కళ్లుచెదిరేంత భారీ కథతో వస్తున్నారు.రిలీజైన టీజర్ బట్టి చూస్తే.. పలువురు దుండగుల బారినుంచి ఓ రాజకుమారుడిని రక్షించుకునేందుకు అతడి తల్లి.. అమ్మవారికి తనని తాను అర్పించుకుంటుంది. దీంతో మహాకాళిగా నయనతార సాక్షాత్కరిస్తుంది. తర్వాత జరిగే శత్రు సంహారమే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. తెలుగు నటుడు సునీల్, రెజీనా, కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో కీలక పాత్రలు చేశారు.ఇకపోతే ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో దక్షిణాది, హిందీ భాషల్లో మూవీస్ చేసిన నయన్.. ఈసారి మాత్రం సోలోగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతుంది. మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
‘అమ్మవారి’పై నయనతార భారీ ఆశలు
ఇంతకు ముందు నటి నయనతార ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్జే.బాలాజీ తెరకెక్కించిన సోషియల్ డివోషన్ కథా చిత్రం మూక్కుత్తి అమ్మన్. 2020లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం మూక్తుత్తి అమ్మన్ 2. ఐసరి గణేశన్కు చెందిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనే టైటిల్ పాత్రను నటి నయనతార పోషిస్తున్నారు. నటి స్నేహా, రెజీనా, ఊర్వశి, అభినయ,ఇనియ, మైనా నందిని, యోగిబాబు, దునియా విజయ్, రామచంద్రరాజు, అజయ్ గోష్, సింగంపులి, విచ్చు విశ్వనాథ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.దీనికి హిప్హాప్ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ చిత్రంపై నటి నయనతార చాలా నమ్మకాన్ని పేట్టుకున్నారు. ఇటీ వల ఒక బేటీలో ఆమె పేర్కొంటూ మూక్కుత్తి అమ్మన్– 2 చిత్రం తన కెరీర్లో చాలా ముఖ్యమైన కథా చిత్రం అని, మైలు రాయిగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని వ్యక్తిం చేశారు. చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పలు ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రంలోని మహాశక్తి అనే పల్లవితో సాగే పాటను వినాయక చవితి సందర్భంగా సోమవారం విడుదల చేయనున్నట్లు వేల్స్ ఫలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరిగణేశన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్శంగా విడుదల కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఎట్టకేలకు 'విశ్వంభర' బండి కదిలింది
చిరంజీవి 'విశ్వంభర' సినిమా గురించి మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా దాదాపు మర్చిపోయారు. ఇదొకటి ఉందనే సంగతి కూడా చాలామందికి గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం అట్టహాసంగా మొదలైన ఈ ప్రాజెక్ట్.. విజువల్ ఎఫెక్స్ట్ వల్ల మూలన పడిపోయింది. ఇప్పుడు అప్పుడు రిలీజ్ అని ఊరిస్తూ వచ్చారు గానీ ఎంతకీ తేల్చట్లేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీ డీల్ ఖరారు కావడంతో పాటు విడుదలకు లైన్ క్లియర్ అయిందని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)'విశ్వంభర' మూవీని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఏడు లోకాలు అనే సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ దీని కథ. వశిష్ఠ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. లెక్క ప్రకారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం వచ్చే సంక్రాంతి బరిలో దీన్ని దింపాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ కుదిరిందట.'విశ్వంభర' సంక్రాంతికి రిలీజైతే మరి ఇదే చిరంజీవి నుంచి వచ్చే సంక్రాంతికి వస్తుందని ప్రకటించిన 'కాకా' సంగతి ఏంటనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మరి రెండింటిని పండగ బరిలో దింపుతారా లేదంటే 'కాకా' తప్పుకొంటాడా?'విశ్వంభర'లో చిరు సరసన త్రిష హీరోయిన్గా చేసింది. సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. కీరవాణి సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్బాస్) -
బెస్ట్ ఎంటర్టైనర్ వెంకటేశ్... యాక్టర్ నాగచైతన్య
సైమా అవార్డుల వేడుక (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్–2026) బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిగింది. తొలి రోజు తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేయగా, రెండో రోజు తమిళ, మలయాళ భాషల చిత్రాల్లో ప్రతిభ చూపిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్కు అవార్డుల ప్రదానం జరిగింది. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు సాధించింది. నాలుగు విభాగాల్లో ‘మిరాయ్’ సినిమాకు అవార్డులు లభించాయి. బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు వెంకటేశ్కి, ‘తండేల్’ సినిమాలోని నటన నాగచైతన్యకు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకువస్తే, ‘మిరాయ్’ చిత్రానికిగానూ తేజ సజ్జాకు క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. ఉత్తమ చిత్రంగా ‘మిరాయ్’ నిలవగా, ఉత్తమ దర్శకుడి అవార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకుగానూ అనిల్ రావిపూడి అందుకున్నారు. క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డు నటి ఐశ్వర్యా రాజేష్ (‘సంక్రాంతికి వస్తున్నాం’)కు లభించింది. 2025లో విడుదలైన దక్షిణాది సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు. -
వెండితెర వినాయకుడు
గణ నాయకుడు ఘనంగా వచ్చేశాడు. ఎక్కడ చూసినా ఈ నాయకుడి పూజకు వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గణేశుడు వెండితెరపైకి కూడా నాయకుడిగా వచ్చాడు. వినాయకుడిపై పలు చిత్రాల్లో వచ్చిన పాపులర్ పాటలు కూడా చాలా ఉన్నాయి. ఈ వినాయక చవితి సందర్భంగా వెండితెర వి‘నాయకుడు’, పాటల గురించి తెలుసుకుందాం. వినాయక చవితి (1957) శమంతకోపాఖ్యానం నేపథ్యంలో దర్శకుడు సముద్రాల రాఘవాచార్య తెరకెక్కించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి తదితరులు ప్రధాన తారలుగా నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే... వినాయక చవితి నాడు శ్రీకృష్ణు్ణడు పాలలో చంద్రుడిని చూస్తాడు. దీంతో శమంతక మణిని దొంగలించాడనే అపవాదు పడుతుంది. వినాయక వ్రతం చేసి కృష్ణుడు ఆ అపవాదు నుంచి ఎలా బయటపడ్డాడనేది ఈ సినిమాలో చూపించారు. వినాయకుడిని పూజించే సంప్రదాయం వెనక ఉన్న పురాణ విశ్వాసాలను గుర్తు చేస్తూ సాగిన ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. శ్రీ వినాయక విజయము (1979) వినాయకుని జన్మ వృత్తాంతంతో రూపొందిన అద్భుత చిత్రం ‘శ్రీ వినాయక విజయము’. శివపార్వతులుగా కృష్ణంరాజు, వాణిశ్రీ, గణేశుడిగా ఎంజీవీ మదన్గోపాల్ నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. స్నానానికి వెళ్లేటప్పుడు నలుగు పిండితో బాలుణ్ణి చేసి, గుమ్మం దగ్గర కాపలాగా పెడుతుంది పార్వతీ దేవి. ఆ బాలుడు గుమ్మం దగ్గర నిలబడి ఎవర్నీ లోపలికి రానివ్వడు. అయితే స్వయంగా పరమశివుడే రావడం, ఆయన్ను కూడా ఈ బాలుడు అడ్డుకోవడం, ఆ తర్వాత అతని తలకి ఏనుగు తల రావడం... ఆ బాలుడు గణపతిగా మారడం, గణాధిపతిగా ఆయనకు స్థానం లభించడం, మూషికాసురుని సంహారం వంటి ఘట్టాలతో ‘శ్రీ వినాయక విజయము’ రూపొందింది. దేవుళ్ళు (2000) కోడిరామకృష్ణ తెరకెక్కించిన సూపర్హిట్ సినిమా ‘దేవుళ్ళు’. పృథ్వీరాజ్, రాశీ, మాస్టర్ నందన్, బేబీ నిత్య లీడ్ రోల్స్లో నటించిన ఈ ఆధ్యాత్మిక చిత్రానికి మంచి ఆదరణ లభించింది. కథ రీత్యా... విడాకులు తీసు కోవాలనుకుంటున్న తమ తల్లిదండ్రులను (పృథ్వీ, రాశీ) తిరిగి ఒక్కటి చేయాలనే సంకల్పంతో ఇద్దరు పిల్లలు (నందన్, బేబీ) వారి నానమ్మ మొక్కులను నెరవేర్చడానికి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు. విఘ్న నివారకుడైన కాణిపాక వినాయకుని దర్శనంతోనే ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో వినాయక స్వామి నేపథ్యాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రాశస్త్యంతో ముడిపెట్టారు కోడి రామకృష్ణ. భక్తుల ఇష్ట కామ్యాలను తీర్చే కాణిపాక గణపతి లీలలను చూపించారు. ‘దేవుళ్ళు’ సినిమాలో వచ్చే ఈ వినాయక స్వామి ఎపిసోడ్ కథకు కీలకంగా ఉంటుంది. ఈ చిత్రంలో వినాయకుడి పాత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చక్కగా ఒదిగిపోయారు.ఇలా చెప్పుకుంటే ‘వినాయకుడు’ ప్రధానాంశంగా, వినాయకుడి ప్రస్తావన ఉన్న చిత్రాలు చాలా ఉన్నాయి. సినిమాల్లో వినాయకుడి పాటలు ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా నటించిన ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ (1973) సినిమాలోని ‘దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లారా.. పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఉంటుంది. వెంకటేశ్ ‘కూలీ నెం.1’ (1991)లో ‘దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా... దయుంచయ్యా దేవా.. పాట వినాయక చవితి పండగ మండపాల్లో వినిపించకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ‘దేవుళ్లు’ (2000) లోని ‘జయ జయ శుభకర వినాయకా... శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయకా... పాట చాలా పాపులర్. చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ (2005) చిత్రంలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా.. జయములివ్వు బొజ్జ గణేశా.. పాట బాగా పాపులర్. మహేశ్బాబు ‘పోకిరి’ (2006) లోని ‘జగడమే.. పాటలో బిట్ సాంగ్లా వినిపించే ‘గణపతి బ΄్పా మోరియా..’ మాస్ లెవల్లో ఉంటుంది. రామ్ ‘గణేష్’ (2009) చిత్రంలోని ‘రాజా మహరాజా’ వినాయకుడి పాటగానే వినిపిస్తుంది. బాలకృష్ణ ‘డిక్టేటర్’ (2016)లో ‘గం గం గం గం గం గం గణేశా... గౌరీ తనయా సర్వేశా... పాట గణనాథుణ్ణి కీర్తిస్తుంది. నాగార్జున, నాని హీరోలుగా నటించిన ‘దేవదాస్’ (2018)లో ‘లక లక లకుమీకర లంబోదర... జగజగ జగదోద్ధార విఘ్నేశ్వర’ అని సాగే పాట ఉంది. ‘ఏడాదికోసారి మాకై దిగి రారా... లోకంలో లోపాలు పాపాలన్నీ తుడిచెయ్రా... వెళుతూ వెళుతూ అట్టా గంగమ్మలో కలిపెయ్రా’ అంటూ సాగే ఈ పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలోనే ఉంటుంది. -
ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్బాస్
బిగ్బాస్ సీజన్-10లో ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు పండగ శుభాకాంక్షలు తెలిపి షోను ప్రారంభించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్ కీతో హౌస్లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చారు. ఇక రెండో వీకెండ్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి ఓ లుక్కేద్దాం..ఇంగ్లీష్పై నాగార్జున అసంతృప్తిహౌస్లో కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడటంపై నాగార్జున స్పందించారు. హౌస్లో జరిగే విషయాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ రాని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలుగు సరిగా మాట్లాడటం రాకపోయినా ప్రయత్నిస్తున్న దేబ్జానీని ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు.దేబ్జానీకి ఫుల్ క్రేజ్.. రోహిత్కు వార్నింగ్కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారు? ఎవరు దూరంగా అనిపిస్తున్నారు? తెలుసుకునేందుకు నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ఎక్కువమంది దేబ్జానీ పేరును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు చాలా పాపులర్ అయిపోతున్నావు’ అంటూ ఆమెతో సరదాగా అన్నారు. మరోవైపు రోహిత్ పేరును ద్వేషిస్తున్నట్లు తెలపడంతో రోహిత్ను హౌస్లో మరింత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు.ఎక్కువ మంది చదివింది: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుబ్లాక్ కీతో అసలు ట్విస్ట్ఆదివారం ఎపిసోడ్లో బ్లాక్ కీతో బిగ్బాస్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని ఎవరికి ఇస్తే.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కీ పవర్ పనిచేయకుండా పోతుందని తెలిపారు. దీంతో ఆ బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కంటెస్టెంట్ల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరిలో ఎక్కువమంది సృష్టి పేరు చెప్పారు. చివరికి బ్లాక్ కీని సృష్టికి ఇవ్వాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటనఇదే సమయంలో ఇప్పటివరకు మ్యాజిక్ కీ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్ను సొంతం చేసుకునేందుకు నిర్వహించిన టాస్క్లో సుదీర్ విజయం సాధించాడు. దీంతో సృష్టి తన దగ్గర ఉన్న బ్లాక్ కీని సుదీర్కు అందించింది. ఇక సుదీర్ చేతికి చేరిన ఈ బ్లాక్ కీతో హౌస్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఎలిమినేషన్లో ట్విస్ట్..ఈ ఎపిసోడ్లో హౌస్మేట్స్గా అమన్, ముకేశ్, సృష్టి, నరేశ్లన ఎంపిక చేశారు. ఇప్పటివరకు హౌస్మేట్స్కానీ సుదీర్, వర్షిణి, కృష్ణుడుని యాక్టివిటీ రూంలోకి పంపించారు. ‘ మీ ముగ్గురులో హౌస్మేట్స్ ఎవరు.. ఎలిమినేట్ ఎవరు అవుతారో అక్కడ ఉన్న డోర్స్ తెరిస్తే తెలుస్తుంది’ అని నాగార్జున వాళ్లకి తెలిపాడు. ఇక్కడ ఓ మ్యాజిక్ జరిగింది అంతా సుదీర్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ ఈ ముగ్గురూ హౌస్మేట్స్గానే ఎంపికయ్యారు.ముకేశ్ కళ్లపై నాగార్జున కామెంట్ముకేశ్ కళ్లను గమనించిన నాగార్జున.. ‘నీ కళ్లు చాలా బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీనికి ముకేశ్ థ్యాంక్యూ చెప్పాడు. ‘మీరు చెబుతుంటే నమ్మాలని అనిపిస్తుంది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున సరదాగా ‘ఏంటి.. దేబ్జానీ చెబితే అర్థం కాలేదా?’ అంటూ నవ్వించారు. దీంతో పక్కనే ఉన్న దేబ్జానీ ‘నేను నిజంగానే చెప్పా సార్’ అంటూ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్సినిమా టాస్క్..కంటెస్టెంట్ల కోసం నాగార్జున సినిమా టాస్క్ నిర్వహించారు. నరేశ్ను రెండు టీమ్లుగా విభజించమని చెప్పడంతో అతడు ఏ, బీ టీమ్లుగా విభజించాడు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్ విజయం సాధించింది. విజేతలకు స్వీట్ బాక్స్లను అందించారు. ఆ సమయంలో దేబ్జానీ రాత్రిపూట తనకు కాఫీ కావాలని నాగార్జునను కోరింది. అయితే కాఫీ కావాలంటే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలని నాగార్జున కండిషన్ పెట్టారు.ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్దేబ్జానీ తన సీక్రెట్ చెబుతూ.. తాను ఆరో తరగతి రెండుసార్లు చదవాల్సి వచ్చిందని, తొలిసారి ఆరో తరగతిలో ఫెయిల్ అయ్యానని చెప్పింది. అయితే ఈ సీక్రెట్తో బిగ్బాస్ సంతృప్తి చెందలేదని నాగార్జున చెప్పడంతో మరో సీక్రెట్ బయటపెట్టింది. బిగ్బాస్ హౌస్లో ఉన్న ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ సీక్రెట్తో నాగార్జున ఆమెకు కాఫీని సాంక్షన్ చేశారు.రెండో వీకెండ్.. ప్రేక్షకుల చేతుల్లోనే!ఇక ఎపిసోడ్ చివర్లో వచ్చే వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలిపే ఓ క్లిప్ను చూపించారు. ‘నెక్ట్స్ వీకెండ్ అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్లో మరో ఆసక్తికరమైన పరిణామానికి తెరలేచినట్లైంది. అసలు వచ్చే వారం ప్రేక్షకుల చేతుల్లో ఉండబోయేది ఏంటి? ఎవరి గేమ్పై ఎలాంటి ప్రభావం పడనుంది? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో త్రివిక్రమ్ ప్లానేంటి? -
బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. సెప్టెంబరు 18న కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో తీస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి యావత్ భారతీయ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిదీ ఈ చిత్రం. చిన్న సినిమాగా మొదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ మూవీని తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబరు 18న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. మరి అక్కడ సంచలనం సృష్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కంటెంట్ బలంగా..సాధారణంగా ప్రేక్షకులకు కంటెంట్ బలంగా ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆదరించడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా వైవిధ్యమైన కథాంశం, ఆసక్తికరమైన స్క్రీన్ప్లే ఉంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. ‘హనుమాన్ అంశ్’ విషయంలోనూ ఇదే ప్లస్ పాయింట్గా మారుతుందా లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్ఎంతవరకు ప్రభావం చూపుతుందని..అయితే తెలుగు మార్కెట్ పూర్తిగా భిన్నం. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమయంలో.. ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమా ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటంతో సినిమాకు అదనపు క్రేజ్ వస్తోంది.కేవలం వసూళ్లను చూసి సినిమాపై అంచనాలు పెట్టుకోవడం ఒక ఎత్తయితే.. తెలుగు నేటివిటీకి సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది అసలు పరీక్ష. హిందీలో ప్రేక్షకులను మెప్పించిన అంశాలు తెలుగులోనూ వర్కౌట్ అయితే ‘హనుమాన్ అంశ్’ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..ఆదర్శ కుటుంబం..మరోవైపు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్ విడుదల చేశారు. టీజర్లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఓ స్పెషల్ మూమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.‘రణబాలి’లో జయమ్మ పాత్రలో నటిస్తున్న రష్మిక తన షూటింగ్ పార్ట్ను పూర్తి చేశారు. ఇంజ్యూరీ నుంచి కోలుకున్న తర్వాత ఆమె తిరిగి సినిమా సెట్స్లో అడుగుపెట్టారు. తాజాగా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసిన సందర్భంగా చిత్రబృందం ఆమెకు వీడ్కోలు పలికింది. ఈ సమయంలో రష్మికను అభినందించేందుకు విజయ్ దేవరకొండ కూడా సెట్కు వచ్చారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..షూటింగ్ పూర్తయిన సందర్భంగా..రష్మిక షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్ ఆమెను ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఈ స్పెషల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ అభిమాన జంటను ఇలా చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.బ్రిటిష్ పాలన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇదీ చదవండి: ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు It's a wrap for Jayamma ✨We will dearly miss you on sets, @iamRashmika ❤️The much loved #EndhayyaSaami out very soon.#RanabaaliTeaser TRENDING #1 on YouTube 🔥▶️https://t.co/tqKGJM7RdG#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th pic.twitter.com/qHX008QMkF— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026 -
ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు
రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. గత నెల మూడో వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసింది. చిన్నాపెద్దా అని తేడాలేకుండా పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు. ఈ సినిమాని చూసిన పలువురు ఇప్పటికే ప్రశంసలు కురింపించారు. ఆ తరహాలోనే 'ఇరుముడి' విడుదలైన సమయంలో సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని చిరంజీవి, రామ్చరణ్లు అభినందించారు. తాజాగా ‘ఇరుముడి’ టీమ్ని స్వయంగా కలిసి మరో సారి శుభాకాంక్షలు తెలిపారు. రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ నిర్మాతలు నవీన్ , వై. రవి శంకర్ లతో ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అడుతోంది. ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన A special moment of celebration ❤️🔥Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu and the team of #Irumudi to celebrate the film’s massive success ✨❤️Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI /… pic.twitter.com/qncXARM9eY— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026 -
‘ప్రాణం పెట్టి తీసిన సినిమా ‘పిఠాపురంలో అలా మొదలైంది’
‘ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో... అలా మొదలైంది’ అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పిఠాపురంలో అలా మొదలైంది’. దర్శకుడు చంద్ర మహేష్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ క్రమంలో శనివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్ను విడుదల చేశారు.దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. సినిమా బాగా వచ్చింది’ అని తెలిపారు. సుమన్ మాట్లాడుతూ .. చంద్ర మహేష్తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలన్నారు. ‘ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ చెబుతున్నా.. మంచి సినిమాని థియేటర్కి వెళ్లి చూడండి’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. -
ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..
నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఆయా షేర్, ఏషనాగుల సాగ్స్ ఎలాంటి రికార్స్ సృష్టించారో చెప్పనవసరంలేదు. ఒక్క ఏషనాగుల సాంగే విడుదలైన కొద్ది రోజులకే 52 మిలియన్ వ్యూస్ దాటింది. మరి ఈ పాటలు పాడిన సింగర్కు ఎంత పారితోషకం ఇచ్చుంటారని సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా..ఈ పాటలను పాడింది సింగర్ జంగి రెడ్డి అని విషయం తెలిసిందే.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ తన రెమ్యునరేషన్ కోసం వెల్లడించారు. ‘ ఆ పాటల ద్వారా లభించిన విజయం , ప్రజాదరణ ముందు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ చాలా చిన్నది. పాటల సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు ‘అంత స్థాయిలో పారితోషికం ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అయితే నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుట్రైలర్ లేకుండానే సినిమా..కాగా ఈ చిత్రం సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. -
అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగు
తెరపై మాస్ హీరోగా అభిమానులను అలరించే రామ్ పోతినేని.. నిజ జీవితంలోనూ తన మంచి మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ అభిమాని గురించి తెలుసుకుని గతంలో అండగా నిలిచిన ఆయన.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల శశి చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని గతంలో చెప్పాడు. తాజాగా ఆమె కుటుంబానికి అవసరమైన వస్తువులను పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మంచానికే పరిమితం..తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశి కొంతకాలంగా తీవ్రమైన అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి కారణంగా ఆమె మతిస్థిమితం కోల్పోయి చాలా ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆమె పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా రామ్ తెలుసుకున్నారు.ఇదీ చదవండి: 'సైమా'లో మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్రామ్ అంటే ఎంతో అభిమానం..శశికి.. రామ్ పోతినేని అంటే ఎంతో అభిమానం. రామ్ ఫొటోలు చూస్తే ఆమె స్పందిస్తుందని.. ఆయనను చూపిస్తే అన్నం కూడా తింటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్.. శశితో వీడియో కాల్లో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పడంతో పాటు చికిత్సకు అవసరమైన ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోఅప్పుడు ఇచ్చిన మాటను రామ్ ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. శశికి అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు, పౌష్టికాహారాన్ని ఆమె కుటుంబానికి పంపించారు. తన కళ్లజోడును కూడా శశికి బహుమతిగా పంపంచారు.( 'ఇరుముడి' సూపర్ క్యూట్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్)అభిమానుల ద్వారా అందజేతరామ్ పంపించిన వస్తువులను ఆయన అభిమానులు శశి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా శశి కుటుంబ సభ్యులు రామ్కు కృతజ్ఞతలు తెలిపారు. అభిమాని కష్టాల్లో ఉందని తెలుసుకుని స్పందించడమే కాకుండా.. ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలుస్తున్న రామ్పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెరపై హీరోగా కనిపించే రామ్.. నిజ జీవితంలోనూ ‘రియల్ హీరో’ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. A fan girl’s dream came true ❤️🔥From a surprise video call to standing by her with regular support for medicines & groceries… and today, a special gift from her favourite hero @ramsayz 🥹❤️For a fan, he’s not just a HERO… he’s a beautiful memory for life 🫶🔥#RamPothineni pic.twitter.com/UuXnn2JpSN— RAPO Fan Trends (@RAPOFanTrends) September 13, 2026 -
'సైమా'లో మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్
2026 సంవత్సరానికిగానూ సైమా అవార్డ్స్ వేడుక.. బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దక్షిణాది సినీ తారలు హాజరై సందడి చేశారు. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ చూపించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డ్స్ అందుకున్నాడు. అయితే తెలుగు నుంచి మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఫుల్ డామినేషన్ చూపించాయి.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)‘మిరాయ్’లో నటనకుగానూ తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నాడు. ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డుని ‘సంక్రాంతికి వస్తున్నాం’లో చేసిన ఐశ్వర్య రాజేశ్ దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం), ఉత్తమ హాస్యనటుడిగా బుల్లిరాజు రేవంత్ నిలిచారు. ‘కాంతార: చాప్టర్1’లో నటనకుగానూ రిషబ్శెట్టి ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నాడు.ఉత్తమ నటుడు - తేజ సజ్జా (మిరాయ్)ఉత్తమ నటి - ఐశ్వర్య రాజేశ్ (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ దర్శకుడు - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)ఎంటర్టైనింగ్ ఇయర్ ఆఫ్ ది ఫిల్మ్ - (సంక్రాంతికి వస్తున్నాం)బెస్ట్ ఎంటర్టైనర్ - వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ సహాయ నటుడు - సత్యదేవ్ (కింగ్డమ్)ఉత్తమ సహాయ నటి - శ్రద్ధా శ్రీనాథ్ (డాకు మహారాజ్)ఉత్తమ హాస్య నటుడు - బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ సినిమాటోగ్రఫీ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)ఉత్తమ నేపథ్య గాయకుడు - రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ నేపథ్య గాయని - సమీరా భరద్వాజ్ (కోర్ట్)ఉత్తమ నటుడు (పరిచయ) - హర్ష్ రోషన్ (కోర్ట్)ఉత్తమ నటి (పరిచయ) - శ్రీదేవి (కోర్ట్)ఉత్తమ నటి (పరిచయ) - సాక్షి మడోల్కర్ (మోగ్లీ)ఉత్తమ గేయ రచయిత - పూర్ణా చారి (కోర్ట్)(ఇదీ చదవండి: ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ) -
'ఇరుముడి' సూపర్ క్యూట్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్
రవితేజ 'ఇరుముడి' మూవీ రిలీజై మూడు వారాలు అయిపోయినా సరే ఇప్పటికీ అద్భుతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది. ఈ శుక్రవారం నుంచే నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇదలా ఉండగానే ఇందులో సూపర్ క్యూట్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: చెప్పులతో పోస్టర్లపై కొట్టారు.. గలీజ్ మాటలు మాట్లాడారు: వైష్ణవి చైతన్య)'ఇరుముడి'లో అయ్యప్ప స్వామి నేపథ్యంతో పాటు తండ్రి-కూతురు ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. తండ్రిగా రవితేజ, కూతురిగా నక్షత్ర మంచి యాక్టింగ్ చేశారు. వీళ్ల మధ్య, కుటుంబ అనుబంధాన్ని చూపించేలా 'యాలాలో యాలాలో' అనే సాంగ్ సినిమాలో ఉంది. ఇప్పుడు దీని ఫుల్ వీడియోని యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఇప్పటికే మల్లెపూల పల్లకి, ఇరుముడి కట్టు, కార్తీకమాసం పాటలకు సంబంధించిన వీడియోలు వదిలారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన) -
చెప్పులతో పోస్టర్లపై కొట్టారు.. గలీజ్ మాటలు మాట్లాడారు
షార్ట్ ఫిల్మ్ నటిగా మొదలై తెలుగు సినిమాల్లో హీరోయిన్ అయ్యేంతవరకు వచ్చిన వైష్ణవి చైతన్య.. రీసెంట్గా 'ఎపిక్' మూవీతో థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వైష్ణవికి 'బేబి' రిలీజ్ తర్వాత ఎదురైన నెగిటివిటీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ అప్పుడు తాను ఎలాంటి మానసిక వేదన అనుభవించానో బయటపెట్టింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)''బేబి' నాకు ఓవర్నైట్ వచ్చిన సక్సెస్ కాదు. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, క్యారెక్టర్ రోల్స్ ఇలా చాలా చేసుకుంటూ ఇక్కడివరకు వచ్చాను. అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది నోటికి వచ్చినట్టు గలీజ్ మాటలు మాట్లాడారు. చెప్పులు తీసుకుని పోస్టర్లపై కొట్టారు. మంచిగా అనిపించలేదు. మస్తు బాధ అయింది. మూవీ ఇంత సక్సెస్ అయిందని ఎంజాయ్ చేయాలా? లేదా నేను చేసినదంతా దీని కోసమా అని బాధపడాలా అనే జోన్లోకి వెళ్లిపోయినా. కొన్నాళ్లకు దాని గురించి పట్టించుకోవడం మానేసి పాజిటివ్ అంశాలపై ఫోకస్ చేయడం మొదలుపెట్టా' అని వైష్ణవి చైతన్య బాధపడుతూ తన బాధని చెప్పుకొచ్చింది.2023లో రిలీజైన 'బేబి' సినిమాతో వైష్ణవి చైతన్య పేరు మార్మోగిపోయింది. ఇందులో ఈమె యాక్టింగ్, కొన్ని సీన్స్ చూసి చాలామంది ఈమెని తిట్టుకున్నారు. విపరీతమైన ట్రోలింగ్ కూడా చేశారు. ఇప్పటికీ ఈమె పేరు చెబితే 'బేబి'నే చాలామందికి గుర్తొస్తుంది. అలాంటిది చిత్రం హిట్ అయినా సరే అంతలా బాధపడిందని లేటెస్ట్ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది.(ఇదీ చదవండి: పైలెట్ని పెళ్లి చేసుకున్న ప్రముఖ హీరోయిన్)Actress #VaishnaviChaitanya about Negativity She Faced After Baby Release:Baby చూసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారంట… చెప్పులు తీసుకుని పోస్టర్లపై కొడుతున్నారు… గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు… మంచిగా అనిపించలేదు. మస్తు బాధ అయింది.BABY ఇంత సక్సెస్ అయిందని ENJOY చేయాలా…… pic.twitter.com/NBft9OEhgv— cinee worldd (@Cinee_Worldd) September 12, 2026 -
'సీక్రెట్ సోల్జర్.. కొత్త అనుభూతినిచ్చే స్పై డ్రామా సినిమా'
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలని పెంచింది. ఈ శుక్రవారమే అంటే సెప్టెంబర్ 18న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిహాల్, సూర్య శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)'చైనా పీస్’గా మొదలైన ప్రయాణం ‘సీక్రెట్ సోల్జర్’గా ఎలా మారింది?‘చైనా పీస్’ పేరుతోనే టీజర్ రిలీజ్ చేశాం. అలాగే రెండు పాటలు కూడా విడుదల చేశాం. అదే పేరుతో చాలా మార్కెటింగ్ చేశాం. మార్చిలో సినిమా రిలీజ్ చేద్దామని సెన్సార్కు పంపించాం. సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు దాటుకుని లిస్ట్ పంపించారు. అందులో మొదటి పాయింట్.. టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదు. ఈ కథ ఆలోచన, ఉద్దేశంతో ఆలోచించుకుని ‘సీక్రెట్ సోల్జర్’ అయితే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం.సెన్సార్లో దాదాపు 8 నెలలు ఈ సినిమా ఉన్నప్పటికీ, మేం ఏ ఆలోచనతో సినిమా తీశామో.. ఆ ఆలోచన విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మా డైరెక్టర్ విశ్వనాథ్ చాలా కష్టపడ్డారు. కంటెంట్ విషయంలో తగ్గించడానికి ఎక్కడా కూడా రాజీ పడలేదు. విజువల్స్ పరంగా చాలా చిన్న కట్స్ మాత్రమే వచ్చాయి. ఇండియాకి సంబధించిన ఓ కీలక సమాచారం లీకవుతుంది. ఆ సంఘటనకి నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యని పరిష్కరించగలిగారా లేదా? అనేది స్టోరీ లైన్. స్నేహం, దేశభక్తి ఈ రెండు ఎమోషన్స్తో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇందులో అలాంటి ఒక కొత్త ఎమోషన్ను ఆడియన్స్ చూడబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు.(ఇదీ చదవండి: నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ) -
కాకా ధూమ్ ధమాకా...
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, వీకే నరేశ్, అఖిల్ ఉడ్డెమారి నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కాకా ధూమ్...’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను జంగి రెడ్డి పాడారు. సురేష్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ చేశారు. ‘కాకా ధూమ్ ధమాకా, లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక, అరే బాపు రచ్చ లేపు, ఈడ గుమ్మిగూడాక, మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు...’ అంటూ ఈ పాట సాగుతుంది. -
దేవుడు వరమందిస్తే...!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం మైథాలజీ , డివోషనల్ బ్యాక్డ్రాప్ సినిమాల ట్రెండ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన తెలుగు సినిమా ‘ఇరుముడి’, సూర్య తమిళ సినిమా ‘కరుప్పు’, బాలీవుడ్ సినిమా ‘హను మాన్ అంశ్’, యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ చిత్రాల సక్సెస్ను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైథలాజీ అండ్ డివోషనల్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఏంటి? దేవుడు వరం అందిస్తే... తమకు హిట్ కావాలన్నట్లుగా ఏయే హీరోలు ఈ జానర్లో సినిమాలు చేస్తున్నారు? అన్న అంశాలపై మీరూ ఓ లుక్ వేయండి.భూలోకం టు సత్యలోకం బ్రహ్మదేవుడి సత్యలోకం ఎలా ఉండబోతుందనేది వెండితెరపై ‘విశ్వంభర’ సినిమాలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వంభర’. ఈ మైథాలజీ అంశాలతో కూడిన ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటించారు. కథ రీత్యా... పధ్నాలుగు లోకాలు దాటుకుని సత్యలోకంలో ఉన్న హీరోయిన్ను హీరో ఎలా భూలోకానికి తిరిగి తీసుకు వస్తాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో దొరబాబు అనే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, కథలో భాగంగా దొరబాబు పాత్రకు ఐదుగురు సిస్టర్స్ ఉంటారనే ప్రచారం సాగుతోంది. సురభి, రమ్య పసుపులేటి వంటి నటీమణులు ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ పనులు కూడా తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ ఏడాది అక్టోబరులో దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగింది. కానీ ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ కాకపోవచ్చని, వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి తొలి వారంలో (జనవరి 9న విడుదల అని ఫిల్మ్నగర్ టాక్) తెరకు రావొచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘కాకా’ జనవరి 13న రిలీజ్కి షెడ్యూల్ అయ్యింది. దీంతో వచ్చే సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ అవుతుందా? లేక ముందుగా అనుకున్నట్లుగా ‘కాకా’నే సంక్రాంతికి థియేటర్స్లో సందడి చేస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. రామాయణం ఆధారంగా వారణాసి మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ అడ్వెంచరస్ యాక్షన్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయిందని ఈ చిత్రదర్శకుడు రాజమౌళి ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ‘వారణాసి’ సినిమా ప్రధాన కథాంశం తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమా కథనంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, మైథాలజీ అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలోని ఓ 30 నిమిషాల సీక్వెన్స్లో రాముడు పాత్రలో మహేశ్బాబు కనిపించనున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణంలోని ఓ ప్రధాన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సీక్వెన్స్ను తెరకెక్కించినట్లుగా రాజమౌళి అండ్ టీమ్ ఆల్రెడీ పేర్కొంది. దీంతో రాముడి గెటప్లో మహేశ్బాబు ఎలా ఉండబోతున్నారు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇంకా ఈ మైథాలజీ సీక్వెన్స్ ‘వారణాసి’ సినిమాకు ఎంత హైలైట్గా ఉండబోతుంది? అన్న అంచనాలు కూడా ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేశ్బాబు క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని తెలిసింది. రుద్రగా, రాముడిగా మహేశ్బాబు కనిపించనున్నారు. ఈ రెండు పాత్రల్లోనే కాకుండా మరో మూడు డిఫరెంట్ గెటప్స్లో మహేశ్బాబు కనిపిస్తారని, థియేటర్స్లో ఇవి ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఇంకా ఈ చిత్రంలోని మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శివభక్తుడి పాత్రలో ప్రకాష్రాజ్ నటిస్తున్నారని తెలిసింది. ఇక ప్రపంచ సంరక్షణ కోసం కాలాతీతంగా సాహసోపేతమైన ప్రయాణం చేసే ఓ వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో ‘వారణాసి’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. తొలిసారిగా... ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలో కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అలాంటి విజయ్ దేవరకొండనే మెయిన్ హీరోగా ఓ మైథాలజీ డ్రామా వస్తే ఆయన అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అందుకే ఈ తరహా సినిమాను త్వరలోనే సెట్స్కు తీసుకుని వెళ్లనున్నారు విజయ్ దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సినిమా బ్యాక్డ్రాప్పై సరైన స్పష్టత రావాల్సి ఉంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమాల రిలీజ్ తర్వాత శౌర్యువ్ సినిమాను విజయ్ సెట్స్కు తీసుకువెళ్తారని ఊహించవచ్చు. ఇటు జై హనుమాన్ – అటు మహాకాళి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ‘హను–మాన్’ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో సినిమా ‘జై హను మాన్’. ‘కాంతార’ ఫేమ్ కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కథనం ప్రధానంగా లార్డ్ హనుమాన్ నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇందులో రానా, బాలీవుడ్ నటి వామికా గబ్బి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రంలోని రాముడు పాత్రలో ఓ టాప్ టాలీవుడ్ స్టార్ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ‘జై హనుమాన్’ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్లో రిలీజ్ కానుంది. అలాగే ఈ ‘పీవీసీయూ’ యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న మరో మైథాలజీ బ్యాక్డ్రాప్ సినిమా ‘మహాకాళి’. ‘ది ఎండ్ బిగిన్స్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రేయా రెడ్డి, రోహిత్ సరాఫ్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ‘శుక్రాచార్య వార్ క్రై’ పేరిట ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారి తీస్తున్నట్లు గ్లింప్స్లో చూపించారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్గా, పూజ అపర్ణ కొల్లూరు దర్శ కత్వంలో ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ ఖన్నా, అమ్మవారి పాత్రలో శ్రియా రెడ్డి నటిస్తున్నారని ఇటీవల విడుదలైన, గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఈ ‘మహాకాళి’ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వడ్డీ కాసులవాడు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న డివోషనల్ ఫిల్మ్ ‘వడ్డీ కాసులవాడ’. ఈ చిత్రంలో రవి మోహన్ (‘జయం’ రవి) వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తున్నారు. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏటీవీ సమర్పణలో కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం ఈ సినిమాకు సహ–నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇలా మైథాలజీ అండ్ డివోషనల్ అంశాలు మిళితమైన మరికొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి.దేవ సేనాపతి ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి యాక్షన్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండోసారి సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. లార్డ్ కుమారస్వామి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ సినిమా అనౌన్స్మెంట్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. కొంత కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోని ‘డ్రాగన్’ సినిమాతో ఇటు ఎన్టీఆర్, వెంకటేశ్ హీరోగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో అటు త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు.‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు నెలలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్తో తాను చేయబోయే సినిమాతో త్రివిక్రమ్ మరింత బిజీ అవుతారని ఊహించవచ్చు. అంతే కాదు... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కోసం ‘దేవ సేనాపతి’, ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్స్ను రిజిస్టర్ చేయించిందట యూనిట్. ఈ చిత్రం 2028లో థియేటర్స్లోకి రావొచ్చనే ఊహాగానాలు కూడా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.భక్తి నేపథ్యంలో కూడిన సినిమాలకు ఇటీవలి కాలంలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోందని తెలుస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందినప్పటికీ ఈ సినిమాకు కాస్త డివోషనల్ టచ్ ఉంది. అయ్యప్పస్వామి బ్యాక్డ్రాప్ని కథలో కన్విన్సింగ్గా మిళితం చేయడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. ⇒ సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’గా రిలీజైంది). ఈ సినిమా వీరభద్రుడి స్వామి బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ⇒ జస్ట్ రూ. 2 కోట్లతో తీసిన హిందీ సినిమా ‘హనుమాన్ అంశ్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి, ట్రేడ్ వర్గీయులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్ డివోషనల్ సినిమాకు డా. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. రాగిణి ఎస్, నమ్రత జి. సింగ్, అనుప్రియ ఎ. నగర్, డా. విశాల్ చతుర్వేది నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. త్రివిక్రమ్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 18న రిలీజ్ చేస్తోంది.⇒ నయనతార నటించిన మైథాలజీ అండ్ డివోషనల్ ఫిల్మ్ ‘ముక్కుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాదేవి’) ఈ దీపావళికి రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది. సుందర్.సి ఈ సినిమాకు దర్శకుడు. ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.మైథాలజీ, భక్తి నేపథ్యంలో లైవ్ యాక్షన్ సినిమాలే కాకుండా, యానిమేషన్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను సాధిస్తున్నాయి. ‘మహావతార్ సినిమాటిక్’ యూనివర్స్ నుంచి ఇప్పటికే వచ్చిన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ 2025లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ యూనివర్స్ నుంచి రెండో భాగంగా ‘మహావతార్ పరశురామ్’ 2027లో థియేటర్స్లో రిలీజ్ కానుంది. మొత్తం ఏడు సినిమాలు ఈ యూనివర్స్ నుంచి రిలీజ్ కానున్నాయి. అశ్విన్ కుమార్ ఈ యానిమేషన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సంవత్సరాలకొకసారి ఈ యూనివర్స్ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుందని, అప్పట్లో మేకర్స్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ⇒ ‘బాహుబలి’ ఎంతటి బ్లాక్బస్టర్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యూనిమేషన్ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం వచ్చే ఏడాది రానుంది. స్వర్గలోకాధిపతి ఇంద్రుడికి, బాహుబలికి మధ్య వైరం ఎలా మొదలైంది? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘బాహుబలి’ని మైథాలజీ వరల్డ్లోకి రాజమౌళి తీసుకువచ్చారు. రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ యానిమేషన్ సినిమాను నిర్మిస్తుండగా, ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూనిమేషన్ మూవీలోని బాహుబలి పాత్రకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వనుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ⇒ ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్లో ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. లార్డ్ హనుమాన్ ఆధారంగా ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై మరోమారు సరైన అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ యానిమేషన్ సినిమాను తీస్తున్నారని, కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారని, త్వరలోనే ఈ అంశంపై ఓ అప్డేట్ రానుందనే ప్రచారం సాగుతోంది. ఇలా మైథాలజీ, భక్తిభావంతో కూడిన మరికొన్ని యూనిమేషన్ సినిమాల రూపకల్పనకు తెలుగు దర్శక– నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. – ముసిమి శివాంజనేయులు -
తలా అజిత్తో సీఎం విజయ్.. ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ట్రీట్!
తమిళనాడు సీఎం, హీరో విజయ్.. స్టార్ హీరో అజిత్ కుమార్ను లండన్లోని సిల్వర్స్టోన్ రేసింగ్ ట్రాక్లో కలిశారు. ప్రస్తుతం ‘మిచెలిన్ లీ మ్యాన్స్ కప్’లో పాల్గొంటున్న అజిత్ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండేది. వీరిద్దరి అభిమానుల మధ్య రైవల్రీ కూడా ఉన్నప్పటికీ.. వీరి తాజా భేటీ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లగా.. అక్కడే అజిత్తో ఈ అరుదైన కలయిక చోటుచేసుకుంది. ఒకరిని ఒకరు చూసిన వెంటనే ఆనందంతో విజయ్ పరుగెడుతూ వెళ్లి అజిత్ను ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరు రాజకీయ నాయకుడిగా, మరొకరు సినీ రంగంతో పాటు మోటార్ స్పోర్ట్స్లో రాణిస్తున్నారు. ఇలా ఇద్దరూ తమ తమ రంగాల్లో సరికొత్త ప్రయాణం సాగిస్తున్న వేళ జరిగిన ఈ భేటీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.The way Thalapathy Vijay Hugged Ajith Kumar & AK welcomed @actorvijay ❤️ What an incredible Moment !!! An WHOLESOME Video !!! https://t.co/5IxWCYarp0— Let's X OTT GLOBAL (@LetsXOtt) September 12, 2026 -
బిగ్బాస్లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?
బిగ్బాస్ తెలుగు సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్ శనివారం గ్రాండ్గా సాగింది. ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించారు. తప్పులు చేసినవారిని ప్రశ్నిస్తూనే.. బాగా ఆడినవారిని అభినందించారు. తనదైన పంచ్లు, సరదా సంభాషణలతో హౌస్లో నవ్వులు పూయించారు.ముందుగా కంటెస్టెంట్లతో మాట్లాడేందుకు వచ్చిన నాగార్జున కాసేపు సీరియస్గా కనిపించడంతో హౌస్మేట్స్ కాస్త భయపడ్డారు. ఆ తర్వాత నవ్వుతూ వారిని పలకరించారు. దీంతో ‘అలా చూడకండి సార్.. భయంగా ఉంది’ అంటూ కంటెస్టెంట్లు చెప్పగా.. నరేశ్ కూడా అదే మాట అనడంతో ‘నీకు కూడా భయం వేసిందా నరేశ్?’ అంటూ నాగార్జున నవ్వులు పూయించారు.రాంప్రసాద్, నరేశ్ రివ్యూలపై..ఇక రాంప్రసాద్, నరేశ్ కలిసి హౌస్లో ఎవరు ఎలా ఆడుతున్నారనే విషయంపై సరదాగా రివ్యూలు ఇచ్చారు. ఈ రివ్యూలను నాగార్జున టీవీలో వీక్షించారు. అనంతరం ఇద్దరినీ అభినందించారు. అయితే రాంప్రసాద్తో పోలిస్తే నరేశ్ తన అభిప్రాయాలను మరింత హార్ట్ఫుల్గా చెప్పాడని పేర్కొన్నారు.‘అసలు ఆట ఇప్పుడే మొదలైంది’అగ్నిపరీక్ష తర్వాత అసలైన మహాపరీక్ష మొదలవుతుందని బిగ్బాస్ ముందే చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టగా.. వారిలో కొందరు ఇప్పటికే హౌస్మేట్స్గా మారారని, మరికొందరు ఎలిమినేట్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్లో ఉన్నారని చెప్పారు. అదే సమయంలో చరణ్, చైత్రలు ఇంకా సీక్రెట్ రూమ్లో ఉన్నారా? అనే అనుమానం కంటెస్టెంట్లలో ఉందని గుర్తించిన నాగార్జున.. వారితో మాట్లాడించారు. దీంతో హౌస్మేట్స్ డౌట్స్కు క్లారిటీ ఇచ్చారు.( ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్)షాలినీకి చరణ్ ధైర్యంచరణ్కు నాగార్జున ఓ ప్రత్యేక అవకాశం ఇచ్చారు. హౌస్లో ఉన్న ఒకరితో మాట్లాడొచ్చని చెప్పారు. దీంతో చరణ్ షాలినీతో మాట్లాడాడు. ‘నువ్వు బాగా ఆడుతున్నావు.. అలాగే ఆడు’ అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత చైత్రకు కూడా ఇదే అవకాశం ఇచ్చారు. ఆమె ముకేశ్తో మాట్లాడింది. ‘నువ్వు చెప్పిన మాట విని ఉంటే బాగుండేది’ అంటూ చైత్ర చెప్పింది. అనంతరం రోహిత్ ఆటతీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’ముగ్గురికి మిల్క్షేక్లుముగ్గురు హౌస్మేట్స్ రోహిత్, రాంప్రసాద్, టెంపర్ వంశీ బాగా ఆడుతున్నారని మెచ్చుకున్న బిగ్బాస్.. వారికి మిల్క్షేక్లు పంపించా. అయితే వారు తాగిన గ్లాసులను నాగార్జునే కడిగారు. దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. ‘ఏ పని చిన్నది కాదు.. ఏ పని తక్కువది కాదు. అలాంటి ఆలోచన ఉంటే ఇక్కడ ఉండొద్దు’ అంటూ క్లాస్ తీసుకున్నారు. అనంతరం మిగిలిన 11 మంది ఇంకా రిస్క్లోనే ఉన్నారని నాగార్జున తెలిపారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.త్రిగుణ్, రోహిత్ తీరు అసహనం..ఆ తర్వాత ముకేశ్, త్రిగుణ్, వర్షిణిలను గార్డెన్ ఏరియాలోని పసుపు లైన్ దగ్గర నిల్చోమని బిగ్బాస్ ఆదేశించారు. వీరిలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం హౌస్మేట్గా మారబోతున్నారని నాగార్జున తెలిపారు. చివరికి నాలుగో హౌస్మేట్గా త్రిగుణ్ ఎంపికయ్యాడు. రోహిత్, త్రిగుణ్ ప్రవర్తనపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. రోహిత్కు క్షమాపణ చెప్పాలని త్రిగుణ్ను ఆదేశించారు. అంతేకాదు.. స్విమ్మింగ్ పూల్ చుట్టూ టైర్ను చేతితో ఎత్తుకుని తిరగాలని పనిష్మెంట్ ఇచ్చారు. ‘ఎంగిలి కప్పులు కడగాలి’ అనే మాట విషయంలోనూ రోహిత్కు క్షమాపణలు చెప్పాలని సూచించారు. అలాగే బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ను పూర్తి చేయకపోవడంపై రోహిత్ను నాగార్జున ప్రశ్నించారు. ఇకపై బిగ్బాస్ ఇచ్చే టాస్క్లను అందరూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితదేబ్జానీకి నాగార్జున ప్రశంసలుహౌస్లో తెలుగులో మాట్లాడుతున్న దేబ్జానీని నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించారు. మరోవైపు రాంప్రసాద్ నవ్వించాలనే ప్రయత్నంలో కొన్ని పదాలు ఉపయోగిస్తున్న తీరును కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఇకపై రాంప్రసాద్ అలా మాట్లాడకుండా చూసుకునే బాధ్యతను నరేశ్ తీసుకోవాలని సరదాగా చెప్పారు.షాలినీ చేసిన ఓ కామెంట్ నేపథ్యంలో రాంప్రసాద్ను అతడి మొదటి సంపాదన ఎంత అని నాగార్జున అడిగారు. దానికి రాంప్రసాద్ తన మొదటి సంపాదన రూ.500 అని చెప్పాడు. అనంతరం షాలినీకి సారీ చెప్పడం కోసం 500 సార్లు sorry అని రాయాలని రాంప్రసాద్కు పనిష్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా బేబ్జానీ సరదాగా స్పందిస్తూ.. ‘నీ మొదటి సంపాదన రూ.20 అని చెప్పాల్సింది’ అంటూ నవ్వులు పూయించింది.పోటీ మరింత ఆసక్తికరంగా..ఆ తర్వాత కంటెస్టెంట్ల మనసులోని మాట తెలుసుకునేందుకు నాగార్జున ప్రయత్నించారు. మీకు నచ్చిన ఒకరి పేరు, నచ్చని ఒకరి పేరు చెప్పాలంటూ అడగడంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివర్లో మరో కీలక ప్రకటన చేశారు. లాస్ట్ హౌస్మేట్గా దేబ్జానీ ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో తొలి వీకెండ్లోనే బిగ్బాస్ హౌస్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో రిస్క్లో ఉన్న వారిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు? అన్నది ఉత్కంఠగా మారింది. -
‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’
సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘రొమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలపై మాట్లాడిన ప్రణయ్.. రివ్యూవర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.‘రివ్యూ చేయడం చాలా ఈజీ’..సినిమా రివ్యూ చేయడం చాలా సులభమైన పని అని ప్రణయ్ అభిప్రాయపడ్డారు. దాదాపు 90 శాతం సినిమాలు లేదా 10లో 9 సినిమాలు విడుదలైన తర్వాత విఫలమవుతుంటాయని.. వాటిని రివ్యూ చేయడం సులభమేనని అన్నారు. చివరికి ప్రేక్షకుల తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‘స్పిరిట్’తో చూస్తాం!ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ‘రొమాంచకం’ చిన్న సినిమా కాబట్టి దానిపై రివ్యూవర్లు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ సినిమా విషయంలో చేసినట్లే పెద్ద సినిమా అయిన ‘స్పిరిట్’ విషయంలోనూ చేయగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘స్పిరిట్’ విడుదలైనప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!తాము ఆ సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నామని చెప్పారు. దీంతో ప్రణయ్ రెడ్డి వంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాత ప్రణయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!
బిగ్బాస్ సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్కు రంగం సిద్ధమైంది. వారమంతా హౌస్లో కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు, టాస్కులతో సందడి నెలకొనగా.. వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో మరింత ఆసక్తి పెరగనుంది. కంటెస్టెంట్లు చేసిన తప్పులను ప్రశ్నించడంతో పాటు.. బాగా ఆడినవారిని అభినందిస్తూ నాగార్జున తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయనున్నారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితఊహించని సర్ప్రైజ్ఈ వారం హౌస్లో అన్ని అంశాల్లోనూ తమ ఆటతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లుగా రామ్ప్రసాద్, రోహిత్, వంశీలు నిలిచారు. వారి ఆటతీరును నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు.. ఈ ముగ్గురికి ఊహించని సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.వారు తాగిన మిల్క్షేక్ గ్లాసులను స్వయంగా నాగార్జున కడగడం ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లను ప్రోత్సహించేలా ఆయన చేసిన ఈ పని చూసి హౌస్మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో తొలి వీకెండ్ ఎపిసోడ్లో రామ్ప్రసాద్, రోహిత్, వంశీలకు నాగార్జున ఇచ్చిన ఈ ప్రత్యేక గౌరవం హైలైట్గా నిలిచింది. -
అందుకే ‘శ్రీలత’ పాటని తెలంగాణ స్టైల్ లో కంపోజ్ చేయలేదు
‘శ్రీలత..’ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాం. పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుదిరాయి. ప్రజలు ఈ పాటను ఓన్ చేసుకునేలా ఉండాలని డిజైన్ చేసి ముందే రిలీజ్ చేశాం.ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్ గా తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్ గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశాను’ అని అన్నారు సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి. ప్రియదర్శి, ఫోక్ డాన్సర్ నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీవాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘శ్రీలత..’పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. .సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. 'శ్రీలత..' పాట మా ఫ్యామిలీ మెంబర్స్ కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాస్ గారిది. మీరు ఇన్ని సాంగ్స్ కు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. నేను ప్రజలకు తెలియాలి అనే ఆలోచన నాలో కూడా ఉండేది. అందుకే ఒక ప్రైవేట్ సాంగ్ నేనే పర్ ఫార్మ్ చేస్తూ చేయాలని కూడా అనుకున్నాను. పాటలో నటించడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ పాటలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. లిరిక్ రైటర్ అలరాజు అన్న డైరెక్టర్ వంశీరెడ్డి అన్నకు ఫ్రెండ్. నాకు కూడా అలరాజు అన్న తెలుసు. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో ఐడియా ఉంది. ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటకు కనెక్ట్ అయ్యారు. పాట బాగుందని కాల్ చేసిన చెబుతున్నారు.లిరిక్ రైటర్ అలరాజు మాట్లాడుతూ.. ‘ఈ పాట రాసేప్పుడు డైరెక్టర్ వంశీ రెడ్డి ..‘కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలి’అని చెప్పారు. మీరు ఇప్పుడు ఆడియో వింటుంటే నచ్చుతుంది. కానీ సినిమాలో చూసినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ పాటను ఇష్టపడతారు. హీరో హీరోయిన్స్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది. శ్రీలత అలకకు కారణం ఏంటి, శ్రీనివాస్ ఏం చెప్పి ఆమెను బుజ్జగించాడు అనే నేపథ్యంతో ఈ సాంగ్ రూపకల్పన చేశారు. రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించాను. టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్ లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశాను. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల కంఫర్ట్ గా లిరిక్స్ రాశాను. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇడుపుకాయితం గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటాను’ అన్నారు. -
సినిమాల్లో అవకాశం అంటూ మోసం.. రోడ్డెక్కిన బాధితులు
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్షల్లో వసూలు చేసి మోసానికి ఒడిగట్టిన ఘటన హైదరాబాద్లో కలకలం సృష్టించింది. ఈమేరకు తమకు న్యాయం చేయాలంటూ భాదితులు అంబర్పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ తమ దగ్గర రూ.లక్షల్లో డబ్బులు వసూళు చేసినట్లు బాధితులు తెలిపారు. తీరా అడిగే సరికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని వారంతా వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇప్పించాలని వారంతా కోరారు. శివకుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: డీ10 విన్నర్ రాజు పై కేసు.. Victims protest at the residence of film distributor Shivakumar Goud.They alleged that Shivakumar had collected lakhs of rupees from several individuals by promising to secure film offers for them. pic.twitter.com/sQCOa6f0IC— Shakeel Yasar Ullah (@yasarullah) September 12, 2026 -
టీవీ షో డీ10 విన్నర్ రాజు పై కేసు.. యువతిని వేధించాడంటూ ఆరోపణలు
డీ10 టీవీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ యువతిని లైంగికంగా వేధించాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఈ నెల 9న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే రాజుపై కేసు నమోదు చేసిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్నిరోజులుగా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.డీ10 టీవీ షో ద్వారా రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షో విన్నర్గా నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. -
బిగ్బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్బాస్ సీజన్10లో అగ్ని పరీక్ష తర్వాత మొదలవుతుంది అసలైన మహాపరీక్ష అని ముందే చెప్పినట్టుగానే బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు అసలు ఆట మొదలైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టగా.. కేవలం ముగ్గురు మాత్రమే హౌస్మేట్స్గా మారారు. మరో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్లో కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!అయితే ఎలిమినేట్ అయిన ఇద్దరినీ బిగ్బాస్ ఇంకా సీక్రెట్ రూమ్లోనే ఉంచాడని పలువురు కంటెస్టెంట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున.. చరణ్, చైత్రలతో ఫోన్లో మాట్లాడి.. వాళ్లు తమ ఇంటి దగ్గరే ఉన్నారని కన్ఫామ్ చేయించారు. దీంతో ఇక ఎలిమినేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని వారికి క్లారిటీ ఇచ్చారు. కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్..ఈ క్రమంలో నాగార్జున కూడాడఇచ్చాడు. ఆటలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. గేమ్లో ఎవరు నిర్లక్ష్యం చేసినా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో 11 మంది రిస్క్లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు తమ గేమ్ను మరింత పదును పెడతారో చూడాలి. -
'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. తాజాగా టీజర్ విడుదల చేసి థియేటర్లలోకి వచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టీజర్ విషయానికొస్తే.. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
‘ఇరుముడి’ థీమ్తో బోజ్జ గణపయ్య.. వీడియో వైరల్
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గణనాథుడి విగ్రహాలు సరికొత్త రూపాల్లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంటాయి. ట్రెండ్కు తగ్గట్టుగా విభిన్న ఆకారాల్లో విగ్రహాలను తయారు చేయడం ఆనవాయితీగా మారింది. అంతేకాదు.. బ్లాక్బస్టర్ సినిమాల థీమ్లను కూడా వినాయకుడి విగ్రహాల్లో ప్రతిబింబిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా థీమ్తో గణేశుడి విగ్రహాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. హీరోల రూపాల్లోనూ విగ్రహాలు దర్శనమిస్తూ నెట్టింట వైరల్గా మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థీమ్తో రూపొందించిన వినాయకుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహాన్ని వైజాగ్లో తయారు చేశారు.శివుడు, పార్వతి కలిసి వినాయకుడికి ఇరుమడి కడుతున్నట్లుగా ఉన్న ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక ఇరుముడి సినిమా విషయానికొస్తే.. రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్స్లో రిలీజై..తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. విడుదలైన రెండు వారాలకే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. మూడో వారం ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 225 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర కీలక పాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. #IRUMUDI Effect 🤌👌Chudataniki Chala Bagundi 🛐స్వామియే శరణం అయ్యప్ప 🙏 pic.twitter.com/digPReR1ER— Hari SaaHo (@HariSaaho19) September 12, 2026 -
పాక్ సినిమాలో 'సలార్' ఫైట్ కాపీ? వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా 'సలార్'. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించేసరికి ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల విషయంలో పలుమార్లు వాయిదా పడటంతో ఎందుకనో థియేటర్లలో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదు. కానీ తర్వాత కాలంలో ఓటీటీ, టీవీలో ప్రసారమైన తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో 'సలార్' గురించి వినిపిస్తూనే ఉంటుంది.కానీ రీసెంట్గా కొన్నిరోజుల నుంచి 'సలార్' ఫైట్ సీన్ని పాకిస్తాన్కి చెందిన ఓ సినిమాలో కాపీ కొట్టారని చెప్పి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. పాక్కి చెందిన హసీబ్ బిలాల్ అనే ఇన్ఫ్లుయెన్సర్.. ఏఐ ఉపయోగించి 'సలార్' స్ఫూర్తిగా తన ప్రతిరూపంలో వీడియో సృష్టించి దానిని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. చూడటానికి ఇది రియల్గా ఉండేసరికి చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో 'డ్రాగన్' చేస్తున్నాడు. మరి వీళ్లు ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత 'సలార్ 2' కోసం కలుస్తారేమో చూడాలి? దీని కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు.What's going on in pakistan 😂#prabhas #salaar #prashanthneel #SpiritMovie pic.twitter.com/Ja8HbVt7RL— Rishika nayak (@karthiknayak897) September 7, 2026 -
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
ప్రతివారాంతంలో కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజవుతూనే ఉంటాయి. ఈ వారం అలా స్ట్రెయిట్, డబ్బింగ్ రూపంలో నాలుగైదు మూవీస్ విడుదలయ్యాయి. వీటిలో కార్తీ 'సర్దార్ 2', ఆనంద్-వైష్ణవి 'ఎపిక్', సుహాస్ 'మండాడి', సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' చిత్రాలున్నాయి. ఇంతకీ ఇవెలా ఉన్నాయి? వీటి రివ్యూలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ'బేబి' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్'. 90స్ వెబ్ సిరీస్లోని చిన్న పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయి.. పై చదువుల కోసం లండన్ వెళ్లి ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్తో తీశారు. బోల్డ్ సీన్స్, రొమాన్స్ కాస్త ఎక్కువగానే దట్టించారు. అయితే స్టోరీ పెద్దగా లేకపోవడంతో చాలామంది ప్రేక్షకులకు ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్నిచోట్ల ఎమోషన్ పర్లేదనిపించింది.పూర్తి రివ్యూ: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ2022లో వచ్చిన 'సర్దార్' సినిమాకు సీక్వెల్ 'సర్దార్ 2'ని స్పై యాక్షన్ థ్రిల్లర్గా తీశారు. కార్తీ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నప్పటికీ మిగిలిన విషయాలు పెద్దగా అలరించలేదు. ఎస్జే సూర్య విలనిజం కాస్త బోర్ కొట్టించగా.. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ గ్లామర్ సరిపోలేదు. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి భాగాన్ని తీసినంత ఎంగేజింగ్గా దీనిని తీయలేకపోయారు.పూర్తి రివ్యూ: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూతెలుగు నటుడు సుహాస్ చేసిన తమిళ చిత్రం 'మండాడి'. సూరి హీరో కాగా సుహాస్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించాడు. సముద్రంలోని బోట్ రేసింగ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఇది తీశారు. తెరపై కష్టం బాగా కనిపించింది. కథాకథనాలు పర్లేదనిపించాయి. ప్రస్తుతానికైతే తెలుగులో ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ కనిపిస్తున్నాయి.పూర్తి రివ్యూ: మండాడి మూవీ రివ్యూసుమంత్ హీరోగా చేసిన డివోషనల్ థ్రిల్లర్ సినిమా 'మహేంద్ర గిరి వారాహి'. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేశ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఓ ఊరు, రాజకుటుంబం, ఓ శాపం, 33 ఏళ్ల వయసొచ్చేసరికి రాజకుటుంబంలోని పురుషులు చనిపోవడం అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తీశారు. ఈ రహస్యం వెనకున్న నిజాన్ని బయటకు తీసే యూట్యూబర్గా సుమంత్ చేశాడు. ఈ మూవీ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.పూర్తి రివ్యూ: ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ -
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
'బేబి' సినిమాతో మూడేళ్ల క్రితం హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా మూవీ 'ఎపిక్'. గతంలో వచ్చిన #90స్ వెబ్ సిరీస్లోని పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమలో పడితే అనే స్టోరీతో దీన్ని తీశారు. నిన్న(సెప్టెంబరు 11) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి చాలావరకు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం తొలిరోజు బాగానే వచ్చాయి.ఇదీ చదవండి: బిగ్బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'ఎపిక్' సినిమాకు తొలిరోజు(ప్రీమియర్లతో కలిపి) మన దేశంలో రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా ఓవర్సీస్తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్తో కలిపి మొత్తగా రూ. 5 కోట్ల వరకు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తొలిరోజు టాక్ నెగిటివ్గా ఉన్న నేపథ్యంలో వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది చూడాలి?పైచదువుల కోసం యూకే వెళ్లిన ఓ తెలంగాణ పల్లెటూరి కుర్రాడు.. ఓ మోడ్రన్ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే వాళ్లు ఎంతవరకు హద్దులు దాటేశారు. ఈ క్రమంలోనే ఏమేం తెలుసుకున్నారు? తదితర అంశాలతో ఈ సినిమా తీశారు. అయితే ఎమోషన్స్ గానీ అటు లవ్ యాంగిల్ గానీ సరిగా వర్కౌట్ కాలేదని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మరికొందరు మాత్రం తమకు నచ్చిందని అంటున్నారు. ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించారు.ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ -
రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు
భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన పురాణ గాథలకు సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ మరోసారి సరికొత్త రూపం ఇవ్వబోతోంది. ఒకప్పుడు ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి సీరియళ్లతో దేశ టీవీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన సాగర్ కుటుంబం.. ఇప్పుడు వెండితెరపై మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ పేరుతో లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.శ్రీమద్భాగవత మహాపురాణం విస్తృతమైన కథా ప్రపంచాన్ని కలిగి ఉంది. ఇంతటి విస్తారమైన కథని ఒకే సినిమాలో చెప్పడం కంటే ఏడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత పెంచుతోంది. ‘విష్ణురథ’ ఈ ఏడు భాగాల ప్రయాణానికి తొలి అధ్యాయం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామానంద్ సాగర్ కుటుంబానికి చెందిన ఈ తదుపరి తరం దర్శకులు ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని కొత్త తరహా సినిమా భాషతో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించారు. -
నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్
మరో రెండు వారాల్లో నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మార్చి, ఆగస్టు అని చెప్పి రెండుసార్లు వాయిదా పడింది. ఈసారి కూడా అలానే జరగొచ్చు అని పుకార్లు వస్తున్న నేపథ్యంలో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టారు. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!'ప్యారడైజ్' సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. గతంలో ఇతడు నానితో 'దసరా' తీశాడు. ఇప్పుడు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ఎప్పుడు చూసినా గానీ శ్రీకాంత్ సీరియస్గా ఫేస్ పెట్టి కనిపిస్తుంటాడు. పెద్దగా నవ్విన సందర్భాలు కూడా లేవు. ఎవరో ఈ విషయమై కామెంట్ చేయగా.. దీనికి రిప్లై ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'నా ముఖమే అంతా' అని ఓ మీమ్ ఫొటోని పోస్ట్ చేసి సమాధానమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.పీరియాడికల్ సినిమాగా తీసిన 'ప్యారడైజ్'లో ప్రధానంగా తల్లికొడుకుల ఎమోషన్ ఉండనుందని హీరో నాని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ లాంటిది ఏం లేకుండానే చిత్రం థియేటర్లలోకి రానుందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అంచనాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? దీని తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవితో మూవీ కమిట్ అయ్యాడు.ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు😂♥️#TheParadiseWillRiseFromSept24 https://t.co/pw00Bli9v0 pic.twitter.com/Sb3obcARmG— Nani (@NameisNani) September 11, 2026 -
అమ్మతనం కెరీర్కి అడ్డంకి కాదు: పరిణితీ చోప్రా
‘‘తల్లయిన హీరోయిన్లకు గతంలో అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. హీరోయిన్గా చాన్స్లు వచ్చేవి కాదు. కానీ, ప్రస్తుతం అలా కాదు... పెళ్లయ్యాక, తల్లయ్యాక కూడా కథానాయికల సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. నటించాలనే ఆసక్తి ఉన్నంతకాలం అమ్మతనం కెరీర్కు అడ్డంకిగా మారదు’’ అని పరిణితీ చోప్రా తెలిపారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘షఖ్: ట్రస్ట్ నో వన్’. ఈ నెల 24 నుంచి నెట్ ఫ్లిక్స్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా పరిణితీ చోప్రా మాట్లాడుతూ–‘‘పెళ్లి, పిల్లలు తర్వాత అవకాశాలు అందుకునే విషయంలో గతంలో ఒక తరం నటీమణులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తల్లయిన మహిళలను లీడ్ రోల్స్లో చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. నాటి ప్రేక్షకులు, పరిశ్రమ ఆలోచనా విధానం వల్ల ఒక తరం నటీమణులు కెరీర్ను త్యాగం చేయాల్సి వచ్చింది. బిడ్డకు జన్మనివ్వడం జీవితంలో అందమైన విషయం. ఆ కారణం వల్ల పని కోల్పోవాల్సి వస్తే బాధగా ఉంటుంది. ఇప్పుడు తల్లులైన హీరోయిన్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుండటం వల్లే రచయితలు, దర్శకులు వారికి తగ్గ కథలను సిద్ధం చేస్తున్నారు. ఆలియా, దీపికా, ప్రియాంకా చోప్రా వంటి వారు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే కెరీర్ను ముందుకు తీసుకెళుతుండటం సంతోషం. నటిగా నేను కూడా ఒకే తరహా పాత్రలు కాకుండా నాకు సరిపోయే వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... పొలిటీషియన్ రాఘవ్ చద్దాని 2023లో పరిణితి పెళ్లి చేసుకున్నారు. వీరికి నీర్ అనే కుమారుడు ఉన్నారు. -
పుట్టినరోజు ప్రత్యేకం
‘బింబిసార, సర్, విరూపాక్ష’ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరోయిన్ సంయుక్త. సెప్టెంబరు 11న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె నటిస్తున్న ఐదు సినిమాల అప్డేట్స్ని పంచుకున్నారు మేకర్స్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’లో సంయుక్త కథానాయికగా నటించారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ సెట్ ఫొటోలు విడుదల చేశారు. కాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాపో 23’ (వర్కింగ్ టైటిల్). కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలియజేసింది యూనిట్. అదే విధంగా సంయుక్త లీడ్ రోల్లో యోగేష్ కేఎమ్సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ‘ది బ్లాక్గోల్డ్’ చిత్రంలోని కొత్త పోస్టర్, సంయుక్త నటిస్తున్న ‘స్వయంభు, హైందవ’ సినిమాల నుంచి కూడా పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్. -
ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలకే కాదు.. కొత్త హీరోలకు కూడా ఓ కొత్త ఇమేజ్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన సినిమా వస్తుందంటే కథ కంటే ముందు హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డైలాగులు ఎలా పేలబోతున్నాయి? అనే ఆసక్తి ఉండేది. ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘పోకిరి’, ‘బిజినెస్మ్యాన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది?ముఖ్యంగా మహేశ్బాబు కెరీర్లో ‘పోకిరి’, ‘బిజినెస్మ్యాన్’ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్తో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి మరోసారి మాస్ పల్స్ తనకు ఎంత బాగా తెలుసో చూపించారు. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దీంతో పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటి? మళ్లీ ఆయన పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది? అనే చర్చ మొదలైంది.మళ్లీ ఆ పూరి కనిపిస్తారా..?పూరి జగన్నాథ్ కెరీర్లో ఎత్తుపల్లాలు కొత్తేమీ కాదు. పూరి సినిమాలు వరుసగా కనిపించకపోవడంతో ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ అనే యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారైనా పూరి పూర్వ వైభవం చూపిస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..? -
15 ఏళ్లుగా మూసి ఉన్న భవనం.. ఆ రూమ్లో ఏం జరిగింది?
హారర్ సినిమాలంటేనే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే ట్విస్టులు గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జానర్లో సరికొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అలాంటి ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘418’. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, భయానక వాతావరణంతో ఆసక్తిని పెంచుతోంది.సెప్టెంబర్ 18న విడుదల..సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వెంకీ జీజీ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ముందుగా జూలై 31న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదీ చదవండి: బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్లో భారీ నష్టం -
బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్లో భారీ నష్టం
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజైంది. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. అయితే ఆ జోరు ఒక్కరోజుకే పరిమితమైంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంత రాబెట్టిందని ప్రస్తుతం అనే చర్చ జరుగుతోంది.తొలిరోజే రూ.100 కోట్లకు పైగా..ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్’ తొలి రోజే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.145 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఇండియాలో కేవలం రూ.37 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 10 నాటికి ‘టాక్సిక్’ ఇండియాలో రూ.247 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.339 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!భారీ నష్టాలు?‘టాక్సిక్’ సినిమా నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగే ఖర్చయిందనే వార్తలు వచ్చాయి. కనీసం రూ.500 కోట్ల బడ్జెట్ను పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుత నెట్ వసూళ్లతో పోలిస్తే భారీగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్’కు సంబంధించిన ప్రస్తుత ట్రేడ్ అంచనాలను పరిశీలిస్తే.. నష్టాల పరంగా ‘ఆదిపురుష్’ను కూడా అధిగమించినట్లు తెలుస్తోంది.కాగా ‘టాక్సిక్’లో యశ్తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విడుదలకు ముందే వివాదాలు, ఆసక్తికర ప్రచారం లభించాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మహిళలను చూపించిన తీరు చర్చనీయాంశంగా మారాయి. సీబీఎఫ్సీ ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. -
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!
నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం..‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. -
‘ది ప్యారడైజ్’ రిలీజ్పై క్లారిటీ.. వైరల్గా నానీ వీడియో!
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న థియేటర్లలోకి తీసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.హాయ్ నాన్న ప్రమోషన్స్లో..ఈ నేపథ్యంలో గతంలో ‘హాయ్ నాన్న’సినిమా ప్రమోషన్స్లో భాగంగా నానీ కేసీఆర్ స్టైల్లో మాట్లాడుతూ కాసేపు అలరించాడు. ఇప్పుడీ వీడయో ‘ది ప్యారడైజ్’ మూవీ ఎట్టి పరిస్థితిల్లో అనుకున్న సమయానికే వస్తుందని చెప్తూ అభిమానులు వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..‘తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉంది. అలాంటిది ఏం జరగదిక్కడ. సినిమా పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న సమయానికే వస్తుంది. ఆ రోజు థియేటర్ల దగ్గర దావత్ చేసుకోవాలి’ అని నాని కేసీఆర్ స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. Trailer cut has already been done and it is all set to air. The news of NO TRAILER is just a speculation. Team hasn't confirmed it yet either. #TheParadise pic.twitter.com/x04iEv8KAX— The Cine Gossips (@TheCineGossips) September 11, 2026 -
ఈ ఇద్దరి స్టార్ హీరోలు ఒకే స్కూల్.. ఎక్కడంటే..?
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్2. ఇటేవలే వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదల కావడంతో కార్తీ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తి చదువుకున్న స్కూల్ డేస్ కోసం ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఇద్దరూ చెన్నైలో..సూపర్స్టార్ మహేశ్ బాబు, కార్తి.. ఇద్దరూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు . వీరికి కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల పరంగా వీరిద్దరి ప్రయాణం వేర్వేరు అయినా స్కూల్ డేస్ లో వీరిద్దరికీ మంచి అనుభందం ఉందని మీకు తెలుసా.. మహేశ్బాబు, కార్తీ ఇద్దరూ చెన్నైలోని సెయింట బేడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ టైంలో మహేశ్బాబుకి కార్తి రెండు సంవత్సరాల జూనియర్. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్మీడియాలో వార్తను తెగ వైరల్ చేస్తున్నారు. ( ‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?)కలిసి నటిస్తారా..ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న ఈ కామన్ కనెక్షన్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సినిమాల పరంగా కాకుండా బయట కూడా మంచి స్నేహితులు కావడంతో వీళ్లకాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..మహేశ్బాబు విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి , సూపర్స్టార్ మహేశ్బాబు కాంబినేషన్లో తెరకెక్కుత్ను చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. . ప్రియంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా కనిపించనున్నాడు. 2027 ఏప్రిల్ 7 నాటికి థియేటర్లలతో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 80s నాటి లుక్స్తో ఉన్న ఫొటోలే కనిపిస్తున్నాయి. పాతకాలం నాటి హెయిర్స్టైల్, డ్రెస్సింగ్, ఫిల్మ్ కెమెరా లుక్తో తమ తమ ఫొటోలను మార్చుకుంటూ నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో, హీరోయిన్తో కలిసి పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటో క్రియేట్ చేసి అభిమానులు సోషల్మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఎంత సరదాగా ఉందో.. అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.APK ఫైల్స్ ఓపెన్ చేయద్దు.. కొంతమందికి ఈ ఫొటోలు ఎలా చేయాలో తెలియక ప్రామిట్ కోసం సోషల్మీడియాలోని వ్యక్తులను నమ్మివాళ్ల చేతిలో బలైపోతున్నారట. దీనికి కారణం సైబర్ నేరగాళ్లు పంపిన APK ఫైల్స్ ఓపెన్ చేయడమేనట. ఈ ట్రెడ్ క్రేజ్ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ( లోకేశ్ , అనిరుధ్కు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా BMW కార్లు!)ఫొటో అప్లోడ్ చేసే ముందు ఇదీ చూడండి..AI టూల్స్లో ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు, అభిమాన హీరోల ఫోటోలు అని వచ్చిన ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు అవి నిజమా కాదా అని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.‘1980ల ట్రెండ్ను ఫాలో అవుతున్న నెటిజన్లు సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అభిమాన హీరోల ఫొటోలని సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫేక్ యాప్స్, ఏపీకే ఫైళ్లను పంపిసూత మోసాలకు పాల్పడుతున్నారు. చాట్జీపీటీ పేరుతోనూ నకిలీ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాప్స్తో జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పద లింకులు తెరవకూడదు’ అని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: (బిగ్బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?) -
హెచ్పీవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవగాహన
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) ఆధ్వర్యంలో హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్నెస్ ఈవెంట్స్కు ఏఏఎఫ్ఏ మద్దతుగా నిలిచింది.3 లక్షల మందికి పైగా..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమం ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా యువతులకు చేరువైందని, సామాజిక బాధ్యత ఉన్న అల్లు అర్జున్ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించామనీ అభిమానులు పేర్కొన్నారు. గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులంతా ఒక్కటవడం చాలా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
హలో డార్లింగ్.. ప్రభాస్కి కేటీఆర్ 'ప్రాంక్ కాల్'
ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఊహించని ఫోన్ కాల్తో అవాక్కయ్యాడు. ఇది కూడా బీఆర్ఎస్ నేత కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చేసరికి కాస్త తికమక పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి ప్రాంక్ కాల్ గోల?మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 'ది అండర్ 18 వరల్డ్' అనే యూత్ టాక్ షో పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. అక్కడున్న పిల్లలు.. కేటీఆర్కు ఓ ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు. మీ వ్యక్తిగత మొబైల్ నుంచి ఎవరైనా స్టార్ హీరోకు కాల్ చేయాలని అడగ్గా.. ప్రభాస్కు కాల్ చేశారు. ప్రభాస్ కూడా వెంటనే స్పందించి 'గుడ్ ఈవెనింగ్ సార్' అని పలకరించారు. కానీ కేటీఆర్ బదులుగా పక్కనే కూర్చున్న ఒక పాప ఫోన్ అందుకుంది. చాలా అమాయకంగా నటిస్తూ.. "సార్, నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొబైల్ దొరికింది. ఇందులో చూస్తే మీ నెంబర్ కనిపించింది.. ఇంతకీ నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా?" అని ప్రశ్నించింది.కేటీఆర్ నంబర్ నుంచి తనకు ఫోన్ రావడం, తీరా చూస్తే గుర్తుతెలియని చిన్నారి వాయిస్ వినిపించేసరికి ప్రభాస్కు ఏం అర్థం కాలేదు. దీంతో వెంటనే కాల్ కట్ చేసేశాడు. ప్రభాస్ రియాక్షన్ చూసి కేటీఆర్ సరదాగా నవ్వుతూ తలపట్టుకున్నారు. తర్వాత స్వయంగా కేటీఆర్ మళ్లీ ప్రభాస్కి కాల్ కలిపారు. ప్రభాస్ లైన్లోకి రాగానే అసలు విషయం చెప్పారు.తాను ‘ది అండర్ 18 వరల్డ్’ పాడ్కాస్ట్ షోలో ఉన్నానని, అక్కడున్న పిల్లల కోరిక మేరకు సరదాగా ఈ ప్రాంక్ చేశామని వివరించారు. అసలు విషయం తెలుసుకున్న ప్రభాస్ పగలబడి నవ్వుతూ వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.When kids pranked Prabhas from KTR’s phone, pretending they found it on the road! Too cute. 😀🥰#Prabhas #KTR #PrabhasFans pic.twitter.com/ib7FSWUmV9— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) September 11, 2026 -
‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సుమంత్.. చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంటాడు. ఒకప్పుడు పక్కా మాస్ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అక్కినేని హీరో.. ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. కథలో కొత్తదనం, పాత్రలో వైవిధ్యం ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్న సుమంత్.. తాజాగా ‘మహేంద్రగిరి వారాహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐశ్వర్య రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘మహేంద్రగిరి వారాహి’తో సుమంత్ ఈసారి ఎలాంటి అనుభూతిని అందించాడు? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మహేంద్రగిరి రాజవంశస్థులకు ఓ శాపం ఉంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డ 33వ పుట్టినరోజున మరణిస్తాడు. ఈ శాపం 200 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంటుంది. అలా 1993లో ఆ వంశంలో పుట్టిన రాజేంద్ర వర్మ(సిద్దు జొన్నలగడ్డ)మరణిస్తాడు. ఇక ఈ సారి రాజేంద్రవర్మ అల్లుడు, ఆ రాజవంశానికి వారసుడు నరేంద్ర వర్మ(వంశీ చాగంటి) కూడా మరణిస్తాడని పూజారులు చెప్తారు. కథలో ఇదో భాగం.. మరోవైపు హైదరాబాద్కు చెందిన యూట్యూబర్ సిద్ధు అలియాస్ సిద్ధార్థ్(సుమంత్)..దెయ్యాలు, దేవుళ్ల పేరుతో కొంతమంది జనాలను మోసం చేస్తున్నారనేది ఆధారాలతో బయటపెడుతుంటాడు. అతని పెరెంట్స్తో పాటు అన్నయ్య రాజీవ్(కమల్ కామరాజు) కూడా దేవుడిని నమ్ముతాడు. పెళ్లి దోషం పోయేందుకు మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయంలో పూజలు చేయమని చెప్పడంతో, రాజీవ్ తన బర్త్డే రోజు ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో నరేంద్ర వర్మ కూడా ఆలయానికి వస్తాడు. మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో గుడి ముందే ఉండే దున్నపోతు ఇద్దరినీ పొడిచి చంపేస్తుంది. సరిగ్గా 33వ పుట్టిన రోజు నాడే ఇది జరుగుతుంది. తన అన్న మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు సిద్ధు. ఈ క్రమంలో మహేంద్రగిరి రాజవంశం శాపం వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అదేంటి? రాజవంశస్తులకు శాపం ఉంటే.. రాజీవ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అసలు 200 ఏళ్ల క్రితం ఆ శాపం ఎలా వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న మరణాలకు నిజంగా అమ్మవారి శాపమే కారణమా లేదా దాని వెనుక ఎవరైనా ఉన్నారా? సిద్ధార్థ్ రీసెర్చ్లో తెలిసిన అసలు నిజాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక వంశానికి అమ్మవారి శాపం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘మురారి’. ఆ తర్వాత ఇలాంటి శాపాలు, దేవుడి కథతో చాలా సినిమాలే వచ్చాయి. `మహేంద్రగిరి వారాహి` కూడా అలాంటి కథే. రాజవంశానికి శాపం ఉండడంతో 33 ఏళ్లకే చనిపోవడం.. దీనికి వెనుక ఒక కారణం ఉండడం.. హీరో రీసెర్చ్ చేసి అసలు కారణం తెలుసుకోవడం..చివరకు శాప విమోచనం.. కథ సుఖాంతం.. ఇదే మహేంద్రగిరి వారాహి చిత్రం కథ. ఇలాంటి కథలను మంచి ట్విస్టులతో, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో తెరపై చూపిస్తే ఆసక్తి కలుగుతుంది. మహేంద్రగిరి వారాహిలో అది మిస్ అయింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో మాత్రం కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలోనే శాపం బ్యాక్స్టోరీ చెబుతారు. అది కథపై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ తర్వాత కథనం రొటీన్గానే సాగుతుంది. యూట్యూబర్గా హీరో పరిచయం.. దెయ్యాలు, దేవుడు లేడని చెబుతూ చేసే యూట్యూబ్ వీడియోలు.. ఇవన్నీ రొటీన్గానే సాగుతాయి. మహేంద్రగిరి రాజవంశస్తులు శాఫ విమోచనం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆసక్తికరంగా సాగుతాయి. హీరో ప్యామిలీ మహేంద్రగిరి ఆలయం వద్దకు వచ్చిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. చావుల వెనుక ఉన్న అసలు నిజాన్ని కనుక్కునేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషనే సెకండాఫ్ కథ. ఫస్టాఫ్తో పోలిస్తే ద్వితియార్థం కొంత ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని సీన్లు థ్రిల్లింగ్గా ఉంటాయి. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. అమ్మవారి సంబంధించిన సీన్లు బాగుంటాయి. అయితే స్క్రీన్ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సిద్ధార్థ్ పాత్రకి సుమంత్ న్యాయం చేశాడు. ఫస్టాప్లో నార్మల్ యూట్యూబర్గా కనిపించడంతో అతని పాత్ర అంత ఇంపాక్ట్ చూపదు. కానీ సెండాఫ్లో మాత్రం బాగా నటించాడు.అయితే ఇప్పటికే ఆయన ఈ తరహా పాత్రలు చేయడంతో కొత్తగా అనిపించదు. ఇక రాజేంద్ర వర్మగా సిద్ధు జొన్నలగడ్డ తెరపై కాసేపు కనిపించి మెప్పించాడు. ఐశ్వర్య రాజేష్ పాత్ర కాసేపు సర్ప్రైజ్ చేస్తుంది. కమల్ కామరాజు పాత్ర నిడివి కూడా తక్కువే. పూజారి పాత్రకి బ్రహ్మానందం న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్టు ఆకట్టుకుంటుంది. రాజీవ్ కనకాల మంజు భార్గవి, మీనాక్షి గోస్వామితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం ఓకే.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఎపిక్నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి తదితరులుదర్శకత్వం: ఆదిత్య హాసన్సంగీతం: హేషమ్ వాహబ్సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్నిర్మాత: నాగవంశీవిడుదల తేదీ: 2026 సెప్టెంబరు 11‘బేబీ’తర్వాత ఇటు వైష్ణవి చైతన్య, అటు ఆనంద్ దేవరకొండ ఇద్దరూ బీజీ అయిపోయారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకోలేకపోయారు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు కలిసి జంటగా ‘ఎపిక్’ మూవీలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో నేడు(సెప్టెంబర్ 11 ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే?ఓటీటీలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన ‘#90స్’వెబ్ సిరీస్ లోని తమ్ముడు పాత్ర జీవితానికి సంబంధించిన కథ ఇది. ఆదిత్య(ఆనంద్ దేవరకొండ) పెద్దయ్యాక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం పైచదువుల కోసం లండన్ వెళ్లాలని ఒత్తిడి చేస్తారు. ప్లాన్ బిలో భాగంగా ఆదిత్య లండన్ వెళ్తాడు. అక్కడ కాలేజీలో తెలుగమ్మాయి కడలి(వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. తొలి రోజే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ప్రేమ, పెళ్లి వద్దనుకొని సహజీవనం ప్రారంభిస్తారు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు ఉన్న వీరి సహజీవనం ఎలా కొనసాగింది? పెళ్లి వద్దనుకొని లండన్ వచ్చిన కడలి.. ఆదిత్యతో బంధాన్ని ఎలా సాగించింది? వీరి బంధం సహజీవనానికే పరిమితం అయిందా లేదా ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిందా? ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడే ఆదిత్య.. ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?కొన్ని సినిమా కథలు చాలా సింపుల్గా ఉంటాయి కానీ తెరపై చూస్తుంటే మాత్రం ఎంటర్టైన్ అవుతాం. ఎపిక్ కూడా అలాంటి సినిమానే. ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది ఈ సినిమా కథ. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ పాయింట్ యూత్తో యూత్ని ఆకట్టుకునేలా సినిమా తీయొచ్చు. ఆదిత్య హాసన్ అదే చేశాడు. యువతరానికి నచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అవి వర్కౌట్ అయ్యాయి కానీ మిగతా చోట్ల చాలా వరకు రొటీన్గా, లాజిక్లెస్గా అనిపిస్తాయి. కడలి పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా సరిగా లేదు. మొదట్లో ఆ పాత్రను చాలా మెచ్యూర్డ్గా పరిచయం చేసి ఆ తర్వాత సాధారణ అమ్మాయిలాగే చూపించారు. ఆమె నేపథ్యం ఒకలా.. లండన్లో ఆమె ప్రవర్తించే తీరు మరోలా ఉంటుంది. ఆదిత్య, కడలి మధ్య ఉన్న బంధం ప్రేమేనా లేదా ఇంకా వేరేదా అనేది క్లారిటీ ఉండదు. పరిచయం అయిన తొలి రోజే కడలి మెచ్యూర్డ్ అమ్మాయి..ఆదిత్య రూమ్కి వెళ్లడం..ముద్దులు పెట్టుకోవడం..ఆ తర్వాత వెంటనే హద్దులు దాటడం అనేది కన్విన్సింగ్గా అనిపించదు. అయితే ఆయా సన్నివేశాలు మాత్రం యూత్ని బాగా ఆకట్టుకుంటాయి. అలా అని దర్శకుడు తెరపై రొమాన్స్ మాత్రమే చూపించలేదు. సింపుల్ కథే అయినా అందులో చాలా మంచి విషయాలు చర్చించాడు కూడా. ప్రస్తుతం సమాజంలో ఉన్న కులాల పట్టింపు, అమ్మాయిల ఎదుర్కొనే శారీరక సమస్యలు..లాంటి అంశాలను పైపైన చూపిస్తూనే ఆలోచింపజేశాడు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ రొమాంటిక్గా, యూత్ని ఆకట్టుకునే సన్నివేశాలతో కొనసాగతుంది. ఆదిత్య, కడలి పరిచయం అవ్వడం.. సహజీవనం కొనసాగించడం.. మధ్య మధ్యలో మిడిల్ క్లాస్ కష్టాలను చూపిస్తూ ప్రథమార్థం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. ఇద్దరి సహజీవనం కాస్త ప్రేమగా మారడం..ఆదిత్య గందరగోళానికి లోనై స్నేహితుడితో మాట్లాడడం.. అతను చెప్పినట్లుగా ఫాలో అవ్వడం ఇలా కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతుంది. దీంతో సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ముగింపు కూడా గొప్పగా ఉండదు.ఎవరెలా చేశారు?ఇక నటన విషయానికి వస్తే ఆనంద్, వైష్ణవి అనగానే 'బేబి' సినిమా గుర్తొస్తుంది. ఆ ఇమేజ్ నుంచి బయటపడి కొత్తగా కనిపించారు. ఆనంద్ తన పాత్రలో సహజంగా అనిపించగా, వైష్ణవి మోడ్రన్ అమ్మాయి పాత్రలో కాన్ఫిడెంట్గా నటించింది. శివాజీ, వాసుకి తమ పాత్రలకు న్యాయం చేశారు. కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి అక్కడక్కడా నవ్వించారు. సాంకేతిక అంశాలకొస్తే హేషమ్ అబ్దుల్ వాహబ్ నేపథ్య సంగీతం బాగుంది. అజీమ్ మహమ్మద్ కెమెరా పనితనం, యూకే లొకేషన్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయనని చెప్పొచ్చు.-అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
పిల్లలు లేకపోయినా పర్లేదనుకున్నాం.. కానీ
సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి, పిల్లల్ని కనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఈ విషయాల్ని కాస్త ఆలస్యంగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే తన ప్రెగ్నెన్సీ మాత్రం అనుకోకుండానే జరిగిందని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టింది.'నాకు ప్రెగ్నెన్సీ రావడం పెద్ద సర్ప్రైజ్. గర్భం దాలుస్తానని అస్సలు ఊహించలేదు. మా ఇంటి బంగారం సినిమాలోని తస్సాదియ్యా పాట షూటింగ్ చేస్తున్న టైంలో నాకు కాస్త నీరసంగా అనిపించింది. డాక్టర్ దగ్గరకెళ్తే నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే నేను,రాజ్.. పిల్లల కోసం ప్లాన్ చేయలేదు. పెళ్లికి ముందే ఈ సంగతి మాట్లాడుకున్నాం''ఒకానొక టైంలో నేను, రాజ్ ఇద్దరం పిల్లలు లేకపోయినా పర్లేదని అనుకున్నాం. నాకు ఓకే. రాజ్ కూడా ఓకే అని అన్నాడు. కానీ ఇలా ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యకరమైన విషయం' అని సామ్ చెప్పుకొచ్చింది. మగ-ఆడబిడ్డ ఎవరు పుట్టినా సరే వాళ్ల కోసం షాపింగ్ చేసేసింది. ఏం పేరు పెట్టాలనేది కూడా ముందే నిర్ణయించుకున్నామని కూడా సమంత చెప్పింది.గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. గతేడాది డిసెంబరులో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంది. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని అందుకుంది. దీని రిలీజ్ టైంలో సామ్ ప్రెగ్నెంట్ అయిందనే సంగతి బయటకొచ్చింది. ఈ డిసెంబరులోనే బిడ్డ పుట్టే అవకాశముందని తెలుస్తోంది. -
మాస్ ధమ్
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘చకోర’. దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో డా. చింతాడ హేమారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రసంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ధమ్ ధమ్... అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మెహర్ బాబా కొరియోగ్రఫీ చేశారు. అభిఖ్య తనికెళ్ళ ఈ పాటను పాడారు. ‘‘ఈ మాస్ సాంగ్ యువతను ఊర్రూతలూగించేలా ఉంది’’ అని పాటను విడుదల చేసిన సంగీతదర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ అన్నారు. అక్టోబరు 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
భావోద్వేగాల కళ్యాణం కమనీయం
ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి డైరెక్టర్ వీవీ వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘కళ్యాణం కమనీయం జీవితం’ సినిమా చిన్నదే గానీ తీసిన వాళ్లు చిన్నవాళ్లు కాదు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి’’ అన్నారు పైలా ప్రసాద్ రావు. ‘‘ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది’’ అని కిషోర్ గుండాల పేర్కొన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అని రవి లోకిరెడ్డి తెలిపారు.


