breaking news
Tollywood
-
మాస్ రౌడీ జనార్ధన
విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో కీర్తీసురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ని సోమవారం నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ జనార్ధన’ కోసం విజయ్తో తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. 1980 దశకం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది.ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నాడు. తను ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. నేను అభిమానించే కీర్తీ సురేష్, ‘దిల్’ రాజుగార్లతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం కూడా అంతే బాగుందని రాజుగారు అనేవారు’’ అని తెలిపారు రవికిరణ్ కోలా. శిరీష్, ప్రోడక్షన్ డిజైనర్ డినో శంకర్, కెమెరామేన్ ఆనంద్ సి. చంద్రన్ మాట్లాడారు. -
శంబాలపై పాజిటివ్ వైబ్ ఉంది: కిరణ్ అబ్బవరం
‘‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాలో ధర్మపాత్ర కోసం సాయి కుమార్గారిని కలిసినప్పుడు ఆయన మాకు చేసిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన వల్లే నా కెరీర్ బాగుందనుకుంటూ ఉంటాను. ‘శంబాల’ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ వైబ్ ఉంది.. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ మూవీతో ఆదిగారికి మంచి విజయం రావాలి’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరోలు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, అశ్విన్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు నవీన్ యెర్నేని, టీజీ విశ్వ ప్రసాద్, మైత్రి శశిధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు మనోజ్ మాట్లాడుతూ–‘‘చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’’ అన్నారు.‘‘సాయికుమార్గారి కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తాను’’ అని ఆది సాయికుమార్ తెలిపారు. ‘‘ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీమ్కి విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’’ అని నటుడు సాయికుమార్ చెప్పారు. ‘‘నా టీమ్ సపోర్ట్ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీశాను’’ అని యుగంధర్ ముని పేర్కొన్నారు. -
ఫుల్ వయొలెంట్గా విజయ్ దేవరకొండ.. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూశారా?
కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పుల్ యాక్షన్ మూవీ రౌడీ జనార్ధన. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీనివ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో ఫుల్ వయొలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ గ్లింప్స్లో ఫైట్ సీన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ కళింగపట్నంలో ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. రౌడీ జానార్ధన' అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్గా కనిపించనున్నారని టాక్. -
జగపతిబాబు ఇంట శుభకార్యం.. ఇలా రివీల్ చేశాడేంటి?
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
ఫారిన్ ట్రిప్లో శ్రీలీల.. 'జైలర్' బ్యూటీ గ్లామర్
విదేశీ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీలబ్లాక్ డ్రస్లో అందంగా రకుల్ ప్రీత్ సింగ్'జైలర్' బ్యూటీ మిర్నా గ్లామరస్ పోజులుఫ్రెండ్ పెళ్లిలో కీర్తి సురేశ్ ఫుల్ హంగామాఅద్దం ముందు ఆషిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్బీచ్లో ఫుల్ చిల్ అయిపోతున్న దీపిక పిల్లి View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) -
శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రిలీజ్
గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేక ఇబ్బంది పడుతున్న తెలుగు హీరో శర్వానంద్.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నారీ నారీ నడుమ మురారి' పేరుతో తీసిన సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మించారు.(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్)టీజర్ చూస్తుంటే కామెడీ బాగానే ఉంది. విజువల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా అనిపించాయి. కాకపోతే సంయుక్త, నరేశ్, సునీల్ డబ్బింగ్ ఏదో తేడాగా అనిపించింది. ఆఫీస్లో ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో, హీరోయిన్తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఇతడి టీమ్ లీడర్గా మరో హీరోయిన్ వస్తుంది. ఈమెకి హీరోకి గతంలో లవ్ స్టోరీ ఉంటుంది. మరి ఇద్దరు హీరోయిన్లలో హీరో ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.సంక్రాంతి బరిలో దీనితో పాటు చాలా సినిమాలు ఉన్నాయి. జనవరి 9న ప్రభాస్ 'రాజాసాబ్' రానుంది. ఇదే రోజున తమిళ డబ్బింగ్ మూవీ 'జననాయగణ్' పోటీలో ఉంది. 10వ తేదీన మరో తమిళ డబ్బింగ్ సినిమా 'పరాశక్తి' విడుదల కానుంది. 12వ తేదీన 'చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి శర్వా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత) -
'మనకొక మగతోడు కావాలి..' బోల్డ్గా బ్యాడ్ గర్ల్స్ ట్రైలర్
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు సిద్దమైంది. ఇటీవల రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా బ్యాడ్ గర్ల్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఎలా మారిపోయారనే అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లోని ఫుల్ కామెడీతో ఎమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. -
ఒక్కోటి ఒక్కో జానర్.. ఈ వారం అయినా అద్భుతం జరిగేనా?
ఈ ఏడాది చివరి వారం టాలీవుడ్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల జాతరే కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు దొరకడంతో పాటు పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో భారీ ఎత్తున చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 25న ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నాలుగు సినిమాల జోనర్స్ వేరు వేరుగా ఉండడం గమనార్హం. ఇయర్ ఎండ్లో యాక్షన్, హారర్, మిస్టరీ,సోషియయో ఫాంటసీ.. ఇల రకరకాల సినిమాలను ఆడియన్స్ని పలకరించబోతున్నాయి. ఇప్పటికే అన్నింటిపైన మంచి అంచనాలే ఏర్పడ్డాయి.శ్రీకాంత్ తనయుడు రోషన్ చాలా గ్యాప్ తర్వాత ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం తెలంగాణలోని బైరాన్ పల్లిలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆది సాయికుమార్.. ఈ సారి మిస్టీరియస్ థ్రిల్లర్ శంబాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆది హిట్ ట్రాక్ ఎక్కుతాడని దర్శకనిర్మాతలు బలంగా చెబుతున్నారు. ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్హిట్ కొట్టిన అఖిల్రాజ్తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు బాగానే భయపెట్టాయి. ఇదే భయంలో థియేటర్స్లో పుట్టిస్తే.. సినిమా హిట్ అవ్వడం ఖాయం.మరో చిన్న చిత్రం ‘దండోరా’ కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. శివాజీ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. వీటితో పాటు మలయాళం డబ్బింగ్ సినిమా వృషభ కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. మోహల్ లాల్ కీలక పాత్ర వహించిన ఈ చిత్రంపై కూడా టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం విజయం అవుతుందో? ఇయర్ ఎండ్లో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. -
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పిటిషన్లు.. హైకోర్ట్ కీలక ఆదేశాలు.!
సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.వీరిద్దరి పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు,మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్,అమెజాన్, ఎక్స్,గూగుల్ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేముందు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని .. లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. వీటికి సంబంధించిన బీఎస్ఐ, ఐపీ అడ్రస్లు, లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. -
పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్
'మహానటి' సహా తెలుగులో చాలా సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. హిందీ, మలయాళ, తమిళంలోనూ హీరోయిన్గా బిజీగా ఉంది. గతేడాది ప్రియుడు ఆంటోనిని పెళ్లి చేసుకున్నప్పటికీ.. కెరీర్ పరంగా ఖాళీగా ఏం లేదు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ఓ పెళ్లిలో డ్యాన్సులేస్తూ ఫుల్ సందడి చేసింది. ఆ వీడియోని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)తన ఫ్రెండ్ పెళ్లికి భర్త ఆంటోనితో పాటు వచ్చిన కీర్తి సురేశ్.. ఈ వేడుకలోనే తన బ్లాక్బస్టర్ సాంగ్ 'చమ్కీలా అంగిలేసి'కి స్టెప్పులేసింది. నాని భార్య అంజన కూడా కీర్తితో కలిసి డ్యాన్స్ చేసింది. వీరిద్దరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.నాని-కీర్తి సురేశ్.. నేను లోకల్, దసరా సినిమాల్లో జంటగా నటించారు. ఈ మూవీస్ చేస్తున్న టైంలోనే నాని కుటుంబంతో కీర్తికి స్నేహం కుదిరింది. తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో నాని ఫ్యామిలీని కలిసింది. ఇప్పుడు ఏకంగా నాని భార్యతో కలిసి స్టెప్పులేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్'లో తమన్నా ఉండాల్సింది.. కానీ రిజెక్ట్ చేశారు)Actress #KeerthySuresh dancing to Chamkeela Angeelesi from #Dasara at her friend’s wedding 💃pic.twitter.com/DheMV7Te2d— Milagro Movies (@MilagroMovies) December 22, 2025 -
బిగ్బాస్ బజ్: కల్యాణ్ పడాల నెక్స్ట్ టార్గెట్ అదే!
ఒక సామాస్యుడు బిగ్బాస్ ట్రోఫీ గెలిచినట్లు చరిత్రలోనే లేదు. కానీ ఆ చరిత్రను తిరగరాశాడు కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ పడాల. సీఆర్పీఎఫ్ జవాన్గా అగ్నిపరీక్షలో అడుగుపెట్టాడు. అక్కడ తన టాలెంట్తో జడ్జిలను మెప్పించి తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టాడు.21 మందిని వెనక్కు నెట్టి..హౌస్లో టైంపాస్ చేసేసరికి ఎక్కువరోజులు ఉండడులే అని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున ఇచ్చిన వార్నింగ్తో కల్యాణ్ అలర్ట్ అయి గేమ్పై ఫోకస్ పెట్టాడు. గేమ్ కోసం ఏదైనా చేసేవాడు. అలా తెలుగు బిగ్బాస్ సీజన్ 9లో పాల్గొన్న 21 మంది వెనక్కు నెట్టి బిగ్బాస్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లిపోయాడు.కేక్ కటింగ్బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే బజ్ ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. తాజాగా బజ్లో శివాజీతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో శివాజీ మాట్లాడుతూ.. తననే తాను చెక్కుకున్న శిల్పి అని పొగిడాడు. తన గేమ్ ఛేంజ్ అవడానికి కారణం దివ్య అని గుర్తు చేశాడు. నీలో స్పిరిట్ రగిలించిందే తను అనడంతో కల్యాణ్ దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశాడు.గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాఎలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నావ్? అన్న శివాజీ ప్రశ్నకు కల్యాణ్ మాట్లాడుతూ.. స్టార్, హీరో అని కాకుండా గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాను. నాలుగు నెలల క్రితం నేనెవరికీ తెలియదు. మా ఊర్లోనే ఎవరికీ తెలీదు. అలాంటిది ఈ అవకాశం ఇచ్చి అగ్నిపరీక్ష నుంచి బిగ్బాస్ వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు. -
‘కాంచన 4'లో కొత్త అందం.. చాన్స్ ఇచ్చిన రాఘవ లారెన్స్
సౌతిండియా నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్. ఆమె తాజాగా నటించిన చిత్రం 'సన్ ఆఫ్' (Son Of )ఇప్పటికే మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు భారీ రెస్పాన్ వస్తోంది. ఈ మూవీలో మీరా చేసిన తన పాత్రకు.. ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఉత్తర భారతీయురాలైనా, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ఫ్యాన్స్ను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో కీలక పాత్రలో నటించబోతోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి లాంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం మీరా రాజ్కు బిగ్ ఛాన్స్గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్పై మీరా రాజ్కు అపారమైన గౌరవం ఉంది.“నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను” అని మీరా భావోద్వేగంగా చెప్పింది.ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. -
బిగ్బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ హోరాహోరీగా జరిగింది. అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరిగింది. ఇద్దరికీ భారీగా ఓట్లు పడ్డాయి. చాలా తక్కువ పర్సంటేజ్తో తనూజ ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. ఓటమి తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది.అందులో ఏం రాసిందంటే..బిగ్బాస్ సీజన్కు 9కి థాంక్స్.. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్బాస్ ఇంటి లోపల నేనెన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కిందపడ్డాను. తిరిగి లేచి నిల్చున్నాను. ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్కు నిజాయితీగా ఆడాను. నాకెదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్ధాన్ని శక్తిగా మార్చింది. అదే అతిపెద్దక్సెస్మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్బాస్ హౌస్ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. గుణపాఠం నేర్చుకున్నా..మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్, నాకోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి.నిజమైన ఫైటర్మీలో ఒకరిగా హౌస్లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకుని బయటకు వచ్చేశాను. బిగ్బాస్ 9కి ముగింపు పలుకుతున్నాను అని తనూజ (Thanuja Puattaswamy) రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు నిజమైన ఫైటర్వి అని కొనియాడుతున్నారు. నీ జర్నీతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేశావు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) -
శ్రీకాంత్ తనయుడి సినిమా.. భారీ ధరకు ఓటీటీ డీల్.!
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ఛాంపియన్. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ ట్రైలర్ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బజ్ మరింత పెరిగింది. రిలీజ్కు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు దాదాపు రూ.16 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ రేంజ్లో డీల్ సెట్ చేశారంటే మూమూలు విషయం కాదు. ఇప్పటికే రోషన్ మరో సినిమాకు రెడీ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. -
దృశ్యం-3 విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్
దృశ్యం-3 సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు పలు భాషలలో సూపర్ హిట్ అయ్యాయి. అయితే, తాజాగా దృశ్యం-3 హిందీ వర్షన్ అప్డేట్ ఇచ్చారు. అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుందని చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇకపోతే ఈ సిరీస్లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయింది. తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. -
బిగ్బాస్: 3 రోజుల్లో రూ.2.5 కోట్లు అందుకున్న ఏకైక నటి!
దేశవ్యాప్తంగా బిగ్ బాస్ ప్రారంభమై దాదాపు పాతికేళ్లు కావస్తోంది. హిందీతో మొదలుకుని ఈ రెండున్నర దశాబ్ధాల గమనంలో ఒకటొకటిగా పలు ప్రాంతీయ భాషలకు ఈ రియాల్టీ షో విస్తరించిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ షో సూపర్ హిట్ అవడం, సీజన్ సీజన్కూ రేటింగ్స్ పెంచుకుంటూ పోతోంది. తాజా తెలుగు బిగ్బాస్ సీజన్ ముగిసి విజేత ఎవరో కూడా తేలిపోయింది. ఈ నేపధ్యంలోనే విజేతతో పాటు పాల్గొనేవారికి అందే పారితోషికాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.ఓ వైపు ఆదరణతో పాటు ఆదాయం కూడా పెంచుకుంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆ మేరకు పారితోషికాలు అందిస్తోంది. అయితే సహజంగానే అత్యధిక వ్యూయర్షిప్ కారణంగా హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నవారికే అత్యధిక ఆదాయాలు అందుతాయి అనే మనం భావిస్తాం కానీ... ఈ విషయంలో తెలుగు బిగ్ బాస్ కూడా థీటుగానే పోటీపడుతోంది. ఇప్పటి దాకా మన దేశం నుంచి బిగ్ బాస్లో పాల్గొని అత్యధిక రెమ్యునరేషన్స్ పొందిన వారిలో ది గ్రేట్ ఖలీ గా పిలవబడే మాజీ రెజ్లర్ దలీప్ సింగ్ రానా ముందున్నారు. (చదవండి: పోరాడి ఓడిన తనూజ.. భారీ పారితోషికమే ముట్టింది!)ఆయన బిగ్బాస్ 4వ సీజన్లో వారానికి దాదాపు రూ.50లక్షలు అందుకున్నారు. అదే విధంగా బిగ్ బాస్ 12వ సీజన్లో పాల్గొన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా దాదాపు అంతే మొత్తాన్ని దక్కించుకున్నారు. కరణ్వీర్ బోహ్రా. తహసీన్ పూనావాలా ఇటీవల గౌరవ్ ఖన్నా తదితర తారలు కూడా దాదాపుగా వారానికి రూ.20లక్షలు దాకా అందుకుని అత్యధిక ఆదాయం పొందిన వారుగా నిలిచారు(చదవండి: బిగ్ బాస్ బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, ముగింపు ముదుర్స్)వీరందరినీ అలా ఉంచితే భారతేశపు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డ్ ఒకే ఒక నటికి దక్కింది. ఆమె కూడా భారతదేశానికి చెందని నటి కావడం విశేషం. అలా బిగ్ బాస్ లో ఎవరికీ దక్కనంత ప్రైజ్ మనీని అందుకున్న ఏకైక కంటెస్టెంట్ పమేలా ఆండర్సన్. ఈ అందాల భామ అమెరికాకు చెందిన హాలీవుడ్ నటి. పాతికేళ్ల క్రితం బే వాచ్ అనే షో ద్వారా విశ్వవ్యాప్తంగా ఆమె గ్లామర్ సెన్సేషన్ సృష్టించింది. మన దేశంలోనూ ఆమెకు ఉన్న పాప్యులారిటీ బిగ్ బాస్ షోలో ఆమెకు రెడ్ కార్పెట్ పరిచింది. ఆమె సీజన్ 4లో కేవలం మూడు రోజుల పాటు కనిపించినందుకు ఏకంగా రూ.2.5 కోట్లు సంపాదించినట్లు సమాచారం, తద్వారా తక్కువ కాలం పాటు పాల్గొని ఎక్కువ ఆదాయం ఆర్జించిన నటిగా ఆమె చెరిగిపోని రికార్డును నెలకొల్పింది. హిందీ బిగ్ బాస్ ఆ సీజన్లో అత్యధిక టిఆర్పీలు కూడా అందుకుంది. -
రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం.. గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. తాజాగా థియేటర్లలో రిలీజైన 'గుర్రం పాపిరెడ్డి' మూవీలో జడ్జి పాత్రలో అలరించారు. ఇప్పుడు ఆయన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. తానే స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)రాష్ట్రపతి ముర్ము గత మూడురోజులుగా హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సేదదీరారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన బ్రహ్మానందం.. ఈమెని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. శాలువాతో బ్రహ్మీని సత్కరించారు. ప్రతిగా బ్రహ్మానందం తన స్వహస్తాలతో లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ముర్ముకు బహుకరించారు.హాస్యనటుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం.. తీరిక సమయాల్లో చాలా బొమ్మలు గీస్తుంటారు. వాటిని పలువురు తెలుగు సెలబ్రిటీలకు బహుమతులుగా ఇచ్చారు. ఇప్పుడు అలానే రాష్ట్రపతికి తను గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?) -
లేడీ సెలబ్రిటీలు తస్మాత్ జాగ్రత్త.. మీ గతి కూడా ఇంతే!
అనుకుంటే అయిపోద్ది సామీ అంటుంటారు. అనుకోవడమే కాదు, గెలుపు కోసం అలుపెరగకుండా కష్టపడినా సరే లేడీ కంటెస్టెంట్లు విన్నర్ కాలేకపోతున్నారు. తెలుగు బిగ్బాస్ మొదటి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు ఇదే తంతు. పోనీ విన్నర్ క్వాలిటీస్ ఉన్న బలమైన కంటెస్టెంట్లు రాలేదా? అంటే అది తప్పుమాటే అవుతుంది.గీతామాధురి, శ్రీముఖి, తనూజ.. వీళ్లంతా బలంగా నిలబడ్డవాళ్లే.. గొంతెత్తి ప్రశ్నించినవాళ్లే! గెలుపు కోసం నిరంతరం శ్రమించినవాళ్లే! కానీ ఏం లాభం? విజయం వాకిటవరకు వచ్చి వెనక్కు వెళ్లిపోతున్నారు, కాదు కాదు ప్రేక్షకులే వాళ్లను కర్కశంగా వెనక్కు పంపించేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే సీజన్స్లో అయినా బిగ్బాస్ ట్రోఫీని ఒక మహిళ గెలుస్తుందా? అన్న సందేహం తలెత్తక మానదు.సింపతీకే ఓటుతెలుగు బిగ్బాస్ మొదటి సీజన్లో కామెడీతో నవ్వించి, టాస్కులతో అదరగొట్టి చలాకీగా, హుషారుగా కనిపించిన హరితేజ సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాతి సీజన్లో గాత్ర మాధుర్యంతో మెప్పించింది గీతామాధురి. అంతేనా.. చాలా మెచ్యూర్డ్గా, బ్యాలెన్స్డ్గా ఆడుతూ కౌశల్కు గట్టి పోటీనిచ్చింది. ప్రేక్షకులు ఆమె మాటతీరుకు మురిసిపోయారు.. కానీ ట్రోఫీ ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడలేదు. సింపతీ, సెంటిమెంట్తో కొట్టిన కౌశల్కు టైటిల్ కట్టబెట్టారు. దీంతో గీతా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.పోరాడినా ఫలితం దక్కలేదుమూడో సీజన్లో యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టగానే విన్నర్ నడిచొస్తుందనుకున్నారు. బిగ్బాస్ కోసం ఆమె చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. బయట ఎంత చలాకీగా ఉందో.. హౌస్లోనూ అంతే చలాకీగా ఉంది. కామెడీ చేస్తూ టాస్కులు ఆడుతూ తనవల్ల అయినంతవరకు పోరాడింది. అయినా జనాలకు ఆమెను గెలిపించబుద్ధి కాలేదు. సింగర్ రాహుల్ ట్రోఫీ గెలవగా శ్రీముఖి రన్నరప్ స్థానానికి పరిమితమైంది.ఇన్నాళ్లకు సరైన కంటెస్టెంట్!ఆ తర్వాత ట్రోఫీని గెలిచేంత బలమైన కంటెస్టెంట్లు ఎవరూ హౌస్కి రాలేదు. దాదాపు ఆరు సీజన్ల తర్వాత మళ్లీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అడుగుపెట్టింది. తనే తనూజ పుట్టస్వామి. అందంతో పాటు తెలివి ఆమె సొంతం. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు ప్రేక్షకులకు గుండెలో గుడి కట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా వీరి వల్లే ఇక్కడున్నానని పదేపదే నొక్కి చెప్పింది. తెలుగు ప్రేక్షకులను తన సెకండ్ ఫ్యామిలీగా భావించింది.ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా..మొదటి రోజు నుంచే మాస్క్ లేకుండా తను తనలాగే ఉంది. కోపం, చిరాకు, అసహనం, బాధ, కన్నీళ్లు, అలక.. అన్నీ చూపించింది. వేటినీ దాచుకోలేదు. బంధాలకు పెద్దపీట వేసింది. అదే సమయంలో అబ్బాయిలకు ఎక్కువ చనువు ఇవ్వకుండా హద్దుల్లో పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా పద్ధతైన సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. ఏ ఆటైనా ఆడతానని ముందుకు వచ్చింది. సీజన్ విజయానికి కారకురాలుఓడినా సరే గెలిచేవరకు శ్రమించింది. డబుల్ ఫేస్ లేకుండా అద్దంలా స్వచ్ఛంగా తనేంటో చూపించింది. మాస్టర్మైండ్తో ఆటను తిప్పింది. తెలుగు బిగ్బాస్ 9 విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. తను లేకపోతే ఈ సీజనే లేదు అన్నంతగా ప్రభావితం చేసింది. అయినా తనను విజయం వరించలేదు. ఇది తనూజ అభిమానులకే కాదు, ఎంతోమంది నెటిజన్లకు సైతం నచ్చలేదు. సీజన్ 9ను తన భుజాలపై మోసిన తనూజకు అన్యాయం జరిగిందంటున్నారు. లేడీ సెలబ్రిటీలు జాగ్రత్తఅమ్మాయిలను విజేతగా చూడటం మన జనాలకు నచ్చదా? ఇంకేం చేస్తే వారిని గెలిపిస్తారు? అసలు ఇంతకంటే ఇంకేం చేయగలరు? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇకముందు రాబోయే లేడీ సెలబ్రిటీలను సైతం హెచ్చరిస్తున్నారు. టీఆర్పీ కోసం మిమ్మల్ని వాడుకుంటారే తప్ప ట్రోఫీ మాత్రం ఇవ్వరని.. అది దృష్టిలో పెట్టుకుని షోకి రావాలా? వద్దా? అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్తున్నారు. బిగ్బాస్ ఓటీటీ సీజన్ (ఓటీటీ సీజన్లో బిందుమాధవి గెలిచింది) మినహా తొమ్మిది సీజన్లలో ఒక్క లేడీ విన్నర్ లేకపోవడం నిజంగా విచారకరమే! -
ఈ ఏడాది టాలీవుడ్ కలెక్షన్స్ ఢమాల్.. సత్తా చూపని తెలుగు సినిమా
కొద్దిరోజుల్లో టాలీవుడ్ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. అయితే, 2025లో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ వాటా రేంజ్ ఎంత అనేది తెలుసుకోవాలని చాలామంది ఆసక్తితో ఉంటారు. గత కొన్నేళ్లుగా హిందీ చిత్రసీమ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, ఈ ఏడాదిలో సత్తా చాటింది. ధురందర్, ఛావా, సైయారా వంటి మూడు సినిమాలే సుమారు రూ. 2,500 కోట్ల కలెక్షన్స్కు దగ్గర్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది టాలీవుడ్ పరిస్థితి చెప్పుకోతగినంత రేంజ్లో లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాల్లో ఓజీ మాత్రమే ఉంది. అదే గతేడాదిలో అయితే పుష్ప2, కల్కి, దేవర, హనుమాన్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు టాప్- 10లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు ఏకంగా రూ. 3600 కోట్లు రాబట్టాయి. దీంతో గతేడాది ఇండియన్ సినిమా మార్కెట్లో తెలుగు పరిశ్రమ వాటానే ఎక్కువగా ఉంది. 2024లో టాలీవుడ్ మొత్తం ప్రపంచవ్యాప్త వసూళ్లు సుమారు రు. 7,924 కోట్ల గ్రాస్ ఉంది.2025లో మరింత ఉత్సాహంతో భారతీయ సినీ పరిశ్రమ అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో మెత్తం భాషలలో కలిపి దేశవ్యాప్తంగా 1546 సినిమాలు విడుదలయ్యాయి. అన్ని సినిమాలు రూ. 12,604 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి. నెట్ పరంగా చూస్తే రూ. 10696 కోట్లుగా ఉంది. అయితే, కేవలం హిందీ పరిశ్రమ నుంచి ఈ ఏడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. తర్వాతి స్థానంలో టాలీవుడ్ ఉంది. తెలుగులో విడుదలైన 274 సినిమాలకు గాను రూ. 2,551 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ రూ. 1,533 కోట్ల గ్రాస్తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి.బాలీవుడ్లో సత్తా చూపని తెలుగు సినిమాఈ ఏడాదిలో తెలుగు సినిమా కలెక్షన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. కనీసం రూ. 500 కోట్లు రాబట్టిన సినిమా ఒక్కటీ లేదు. ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రమే రూ. 300 కోట్ల కలెక్షన్స్తో టాప్లో ఉన్నాయి. తర్వాత మిరాయ్, డాకు మహారాజ్, హిట్, కుబేర వంటి చిత్రాలు మాత్రమే కాస్త మెప్పించాయి. అయితే, ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. రూ. 500 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అనుకుంటే ఆశించినంత రేంజ్లో రీచ్ కాలేదు. ఆపై హరిహర వీరమల్లు, కింగ్డమ్, ఘాటీ, మాస్ జాతర, అఖండ-2 వంటి సినిమాలు కూడా అదే బాటలో నిలిచాయి. ఫైనల్గా 2025 టాలీవుడ్కు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించిన సినిమాలు పడలేదు. -
Bigg Boss: బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, ముగింపు ముదుర్స్
బిగ్ బాస్ దాదాపు 9ఏళ్ళ క్రితం తెలుగులో అడుగుపెట్టిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్ మా ఛానల్ రేటింగ్స్ ను ఆకాశానికి ఎత్తేసింది ఈ కార్యక్రమం. బిగ్ బాస్ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఆ క్రేజ్ ఎలా వచ్చిందంటే దాని చుట్టూ వచ్చే వివాదాలే ముఖ్యకారణం. వివాదం లేని సీజన్ ఇప్పటిదాకా జరగలేదు. తాజాగా ఈ బిగ్ బాస్ 9వ సీజన్ పూర్తి చేసుకుంది. మరి ఈ సీజన్ ఎలా గడిచిందో ఈ బిగ్ రివ్యూ లో చూద్దాం.బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu ) ఆరంభం అదుర్స్ ముగింపు ముదుర్స్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 7 న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో 22మంది కంటెస్టెంట్లతో మూడు నెలలకు పైగా ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ నటులు నాగార్జున ముందు చేసిన 6 సీజన్లతో పాటు ఈ సీజన్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో షోకు ఆయువుపట్టుగా మారారు. ఈసారి హౌస్ లోకి సెలబ్రిటీ స్టేటస్ లేని వాళ్ళను 7 మందిని పంపడం విశేషం. అందులోనూ సెలబ్రిటీ కాని వ్యక్తి అయిన కళ్యాణ్ పడాల ట్రోఫీ కూడా గెలుచుకోవడం మరో విశేషం. మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య మసాలాలు కాస్త మోతాదుకు మించి జరిగాయని చెప్పవచ్చు.అంతేకాదు అభ్యంతరకర పదజాలంతో సీజన్ లోని ఒకటి రెండు ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్లు విపరీత ధోరణి తో మితిమీరి పోయారు. అయితే ఇప్పటి ఓటిటి కాలం ప్రేక్షకులకు ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ల బాండింగులకు కొదవే లేదు. దాదాపుగా కుటుంబంలో ఎన్ని బంధాలైతే ఉంటాయో అంతకన్నా ఎక్కువే హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య భారీగానే నడిచాయి. వాటిలో తనూజ, దివ్య, భరణి మధ్య నడిచిన బంధంతో పాటు డెమోన్ పవన్, రీతూ మధ్య నడిచిన ప్రేమాయణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సీజన్ లో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే ఎప్పూడూ తన గంభీర వదనంతో సుపరిచితుడైన బిగ్ బాస్ ఎన్నడూ లేని విధంగా తన కంటెస్టెంట్ లో ఒకరిని హౌస్ లో ఉండమని వేడుకోవడం.సంజన విషయంలో జరిగిన ఈ ఘటన సీజన్ కే హైలైట్ గా నిలిచింది. ఘనంగా ప్రారంభించిన ఈ సీజన్ పేలవంగా ముగించారు. మామూలుగా ప్రతి సీజన్ ముగింపు దశలో చూపే హడావిడి ఈ సీజన్ లో బాగా తగ్గిందని చెప్పవచ్చు. ప్రతి సీజన్ ఆఖర్లో బయటకు వెళ్ళిన కంటెస్టెంట్లను హౌస్ లోకి ఆఖరున పిలిచి పండుగ కోలాహలంతో నింపేవారు. కాని ఈ సీజన్ లో ఆ ఊసే లేదు. అంతేకాకుండా ఫినాలే కప్పును పెద్ద సెలబ్రిటీతో విన్నర్ కు ప్రెజెంట్ చేసే ఆనవాయితీని కూడా ఈ సారి టీం పక్కన పెట్టేసింది. సెలబ్రిటీలు ఈ సారి దొరకలేదో ఏమో కాని ఫినాలేలో రోబోలతో కూడా ఒక ఎలిమినేషన్ అనౌన్స్ చేయించారు. ఏది ఏమైనప్పటికీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం అదుర్స్ ముగింపు ముదుర్స్.- హరికృష్ణ ఇంటూరు -
పతంగుల పోటీ నేపథ్యంలో సినిమా..అంత ఈజీ కాదు : ప్రణవ్ కౌశిక్
ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ , ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో డి. సురేష్బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి, రమ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ–‘‘పతంగుల పోటీ నేపథ్యంతో సినిమా చేయడం అంత సులభం కాదు. మా ‘పతంగ్’లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం దర్శక–నిర్మాతలు, టెక్నికల్ టీమ్ చాలా కష్టపడ్డారు. ఈ క్రిస్మస్కి మా చిత్రంతో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలు హిట్ కావాలి. ఫైనల్గా సినిమా గెలవాలి’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని వంశీ పూజిత్, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కొత్తింటి, ప్రీతి పగడాల తెలి΄ారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో రోజూ ఓ కొత్త సవాల్ ఎదుర్కొన్నాం’’ అన్నారు రమ్య. ‘‘ఈ ఏడాది విడుదలయ్యే మంచి సినిమాల్లో ‘పతంగ్’ కూడా ఉంటుంది’’ అని పేర్కొన్నారు సంపత్ మకా, నాని బండ్రెడ్డి. -
సీనియర్ హీరోలతో జోడీ.. అది మ్యాటరే కాదంటున్న బ్యూటీ
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. అమిగోస్ మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ వెంటనే నా సామిరంగ మూవీలో నాగార్జునతో జతకట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే హీరో రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్లో భాగంగా చిట్చాట్ నిర్వహించింది.సీనియర్ హీరోలతో జోడీ..ఈ కార్యక్రమంలో ఆషికాకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి సీనియర్ హీరోలతో జతకడుతున్నారు.. మీ వయసుకు తగ్గ పాత్రలు రావట్లేదని ఫీలవుతున్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు ఆషిక మాట్లాడుతూ.. ఒక నటిగా ఎన్ని విభిన్న పాత్రల్లో నటించాలనేదానిపైనే ఫోకస్ పెడతాను. ఏజ్ గ్యాప్పై ఓపెనైన బ్యూటీభర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఈ జనరేషన్కు తగ్గట్లుగా యంగ్, మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా సామిరంగా మూవీలో పరిణతి ఉన్న పాత్రలో నటించాను. భిన్న పాత్రలు చేయాలనే ఆ సినిమా ఒప్పుకున్నాను. సీనియర్ హీరోలతో నటించినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. పాత్ర నచ్చినప్పుడు ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోను. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న విషయాలను నేను లెక్క చేయను. కథలో నా పాత్ర ఎంత బలంగా ఉందనేది మాత్రమే ఆలోచిస్తాను అని ఆషిక చెప్పుకొచ్చింది.చదవండి: శోభిత, సమంతతో నాగచైతన్య -
కల్యాణ్ పడాల విజయంలో 'లేడీ క్వీన్'
బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్ ఫైనల్లో తనూజ, కల్యాణ్లు చరిత్ర తిరగ రాశారు. ఫైనల్ వరకు చేరుకున్న వారిద్దరూ హౌస్లో మంచి బాండింగ్తో ఉంటూనే రేసులో ఉన్నారు. కామనర్గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ విజేతగా నిలవడం గొప్ప విషయమేనని చెప్పాలి. సీజన్-7లో కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్లు కూడా ఇలాంటి బాండింగ్నే కొనసాగించారు. పల్లవి ప్రశాంత్ విజయంలో శివాజీ పాత్ర ఎంత కీలకమో తెలిసిందే.. అయితే, కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా అంతే రేంజ్లో ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదే పాయింట్ను కల్యాణ్ కూడా స్టేజీపైనే ఒప్పుకున్నాడు. తన గెలుపులో ఆత్మవిశ్వాసం నింపిన వారిలో ఫస్ట్ ప్రియ, సెకండ్ శ్రీజ ఉంటారని చెబుతూ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేడీ క్వీన్ తనూజకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడం విశేషం. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ ఇలా చెప్పాడు. ' ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా ఒకానొక సందర్భంలో కల్యాణ్ గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనూజానే.. నేను ఒప్పుకుంటా అది.." అంటూ క్లారిటీ ఇచ్చాడు.బిగ్బాస్ రివ్యూవర్లు కూడా చాలామంది ఇదే మాట చెప్పడం విశేషం. బిగ్బాస్ సీజన్-7లో కూడా ఇలాంటి మ్యాజిక్నే జరిగింది. పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ చాలా బలంగా నిలిచారు. తను 2వ రన్నర్గా నిలిచినప్పటికీ ఎలాంటి బాధను చూపలేదు. హౌస్లో ప్రతిచోట పల్లవి ప్రశాంత్ కోసం స్టాండ్ తీసుకుంటూ తన గెలుపు కోసం రోడ్ క్లియర్ చేశారు. ఫైనల్గా అమర్దీప్కు ట్రోఫీ అందుతుందని అందరూ అనుకుంటే శివాజీ గేమ్ స్ట్రాటజీ వల్ల ప్రశాంత్ సులువుగా విన్నర్ అయిపోయాడు. అయితే, ఈ సీజన్లో కూడా తనూజ వరుసగా పదివారాల పాటు టాప్లో ఉంది. 11వ వారం నుంచి ఒక్కసారిగా కల్యాణ్ రేసులోకి వచ్చేశాడు. అందుకు కారణం తనూజానే అని తను కూడా పలుమార్లు చెప్పాడు. తన గెలుపు కోసం తనూజ ఇచ్చిన సలహాలు చాలా వున్నాయని కల్యాణ్ ఒప్పుకోవడం విశేషం.#KalyanPadala acknowledging his Sisters- Priya SrijaMentor- ThanujaThis is who he isHe never forgets to show gratitude ❤️❣️Thanks Kalyan for proving the Haters that we supported right person#BiggBossTelugu9pic.twitter.com/lMkB9P4qO1— Jeeva S (@JeevaS4853) December 21, 2025 -
శోభిత, సమంతతో నాగచైతన్య.. ఫోటో వైరల్
అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట ఇటీవలే మొదటి పెళ్లిరోజును సింపుల్గా జరుపుకున్నారు. ఫస్ట్ యానివర్సరీ రోజు తమ పెళ్లిరోజు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసున్న ఫోటోలను తరచూ కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈసారి చై-శోభితతో పాటు సమంత కూడా కలిసున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఫ్యామిలీ ఫోటోఅవును, చై, శోభిత, సమంత.. ముగ్గురూ కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. కాకపోతే ఇక్కడ సమంత అంటే హీరోయిన్ సామ్ కాదులెండి. శోభిత సోదరి! ఆమె పేరు కూడా సమంతనే కావడంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. చై మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.చై వైవాహిక జీవితంహీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత.. ఏ మాయ చేసావే మూవీలో తొలిసారి జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. క్యూట్ కపుల్గా కనిపించే ఈ జంట మధ్య తర్వాత తెలియని అగాధం ఏర్పడింది. దీంతో నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ 2021లో విడాకులు తీసుకున్నారు.రెండో పెళ్లితర్వాత చై.. హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2024 డిసెంబర్ 4న వీరి వివాహం జరిగింది. అటు సమంత కూడా కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. 2025 డిసెంబర్ 1న ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో సామ్-రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. #NagaChaitanya seen with his wife #Sobhita and her sister #Samantha pic.twitter.com/FxOsh9ldFS— Milagro Movies (@MilagroMovies) December 21, 2025 -
కావాలనే గ్యాప్ తీసుకున్నా..
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా, ఒక మంచి అనుభూతిని పంచే చిత్రంగా చాంపియన్ చిత్రం నిలుస్తుందని హీరో రోషన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో అనస్వర రాజన్ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఆదివారం రాత్రి బీచ్ రోడ్డులో గ్రాండ్గా మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ నటనలో పరిణతి సాధించేందుకే ‘పెళ్లి సందడి’ తర్వాత కావాలనే విరామం తీసుకున్నానని తెలిపారు. 1948 నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ వార్ డ్రామాలో తాను ఫుట్బాల్ ఆటగాడిగా కనిపిస్తానని, తనను తాను కొత్తగా మలుచుకున్నానని పేర్కొన్నారు. పీటర్ హెయిన్ మాస్టర్ పర్యవేక్షణలో అద్భుతమైన పోరాట ఘట్టాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వివరించారు. కథానాయిక అనస్వర రాజన్ మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సినిమా పక్కా బ్లాక్బస్టర్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ చిత్రంలోని ‘గిర గిరా’ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయిందని, సినిమా కూడా అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నటి ఊహతో పాటు చిత్ర బృందం పాల్గొంది. -
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
బిగ్బాస్ తెలుగు 9 అసలైన విజేత ఇమ్మాన్యుయేల్ అని సోషల్మీడియాలో చాలామంది అంటుంటారు. ఈ సీజన్లో తను చాలామంది అభిమానాన్ని సంపాదించుకున్నాడని కామెంట్ల రూపంలో అర్థం అవుతుంది. ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్లో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది ఇమ్మాన్యుయేల్నే కావడం విశేషం.. కమెడియన్గా అడుగుపెట్టిన తను హీరోగా నిలిచాడని బిగ్బాస్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనకు ట్రోఫీ దక్కలేదు. కానీ, ప్రేక్షకుల గుండెల్లో విజేతగా నిలిచాడు. హౌస్లో ఉన్నంత వరకు తనకు దగ్గరైన వాళ్లు తప్పు చేసినా సరే.. మంచివైపే నిల్చున్నాడు. తనవారు తప్పు చేస్తే అంతే ధీటుగా నిలదీశాడు. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచుతూ ఈ సీజన్ ఎంటర్టైనర్గా నిలవడమే కాకుండా ఆటలో ఒక పోరాట యోధుడిని కూడా చూపించాడు. కానీ, 4వ స్థానంతో సరిపెట్టుకున్న ఇమ్ము అసలైన విజేత అంటూ సోషల్మీడియాలో (Social Media) పోస్టులు పెడుతున్నారు.రెమ్యునరేషన్ ఎంత..?బిగ్బాస్లో ఇమ్మానుయేల్ (Immanuel) 15 వారాల పాటు కొనసాగారు. తన జర్నీ చివరి వరకు కూడా ప్రేక్షకులను నవ్వించాడు. ఏడిపించాడు.. అలరించాడు. గతంలో కమెడియన్స్ చాలామంది బిగ్బాస్లోకి వచ్చారు. కానీ, ఇమ్ము మాత్రం బలమైన మార్క్ చూపాడు. అయితే, ఇమ్ము తన రెమ్యునరేషన్కు మించి కంటెంట్ను ప్రేక్షకులకు ఇచ్చాడు. బిగ్బాస్ నుంచి వారానికి రూ. 2.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే బిగ్బాస్ నుంచి మొత్తంగా రూ. 40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో భరణి, సంజనలు రెమ్యునరేషన్లో టాప్లో ఉన్నారు. ఆ తర్వాత ఇమ్ము ఉన్నాడు. -
నటి సమంతకు చేదు అనుభవం..
హైదరాబాద్లో ఓ షాపింగ్మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. కొద్దిరోజుల్లోనే సమంత ఒక కార్యక్రమం కోసం వస్తున్నడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో భద్రతా సిబ్బంది ఆమెను కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సెలబ్రిటీల పట్ల పెరుగుతున్న ఈ వెర్రి అభిమానంపై నెట్టింట తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చదువుకున్న యువతనే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం కోసం పట్టుచీరలో ఎంతో హుందాగా వెళ్లిన సమంత.. ఆ కార్యక్రమం ముగించుకుని కారు వైపు వెళ్తుండగా చాలామంది ఆమెను చుట్టుముట్టారు. దీంతో భద్రతా సిబ్బంది అతికష్టంతో ఆమెను సురక్షితంగా కారు వరకు చేర్చారు. అక్కడికి వచ్చిన వారిని అదుపు చేయడం కూడా వారికి కష్టంగా మారింది. వారి మధ్యలో సమంత నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లులూ మాల్లో నిధి అగర్వాల్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'ది రాజా సాబ్' సినిమా సాంగ్ ఈవెంట్ నుంచి ఆమె తిరిగి వెళ్తుండగా తనకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తనపై చేతులు కూడా వేయడంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిధి కూడా ఇదే ఘటనపై ఈవెంట్ నిర్వాహుకులను తప్పుబట్టింది. వరుసుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ కూడా ఉండదా..? అంటూ భగ్గుమంటున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని విమర్శలు వస్తున్నాయి. Why do some fans in the South still struggle with boundaries, even after the Rajasaab incident? Passion is great, but respect and personal space matter too.#SamanthaRuthPrabhu pic.twitter.com/FgIqH51OCg— Cineholic (@Cineholic_india) December 21, 2025 -
హిట్ దర్శకుడితో ధనుష్ సినిమా.. షూటింగ్ పూర్తి
వరుస విజయాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన నటించిన ద్విభాషా చిత్రం కుబేర మంచి విజయంతోపాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ధనుష్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇడ్లీ కోడై చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇటీవల ఆయన నటించిన హిందీ చిత్రం తేరే ఇష్క్ మే చిత్రం సక్సెస్ అయ్యింది. తాజాగా ధనుష్ నటిస్తున్న చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఇది ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. తమిళ హిట్ మూవీ 'పోర్ తొళిల్'తో గుర్తింపు పొందిన దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై డి.ఐసరిగణేష్ నిర్మిస్తున్నారు. మమితాబైజూ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్.రవికుమార్, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్, జయరాం, సురాజ్ వెంజరముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను చెన్నై, రామనాథపురం, దిండిక్కల్, పరమకుడి ప్రాంతాల్లో పూర్తిచేసినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధనుష్, మమితాబైజూ చిత్ర యూనిట్ శనివారం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది: వంశీ నంది పాటి
అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నంది పాటి రిలీజ్ చేస్తు న్నారు. ఈ సందర్భంగా వంశీ నంది పాటి మాట్లాడుతూ–‘‘మేము ఇటీవల డిస్ట్రిబ్యూట్ చేసిన ‘లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాలు సూపర్హిట్స్ అయ్యాయి. ‘ఈషా’ విషయంలోనూ అదే జరుగుతుందన్న నమ్మకం ఉంది. ‘ఈషా’ కేవలం హారర్ సినిమానే కాదు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. చాలా రియల్లైఫ్ ఇన్సిడెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఆడియన్స్ కు కలుగుతుంది. ‘పోలిమేర 3’ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఏప్రిల్లో స్టార్ట్ కావొచ్చు. ఏషియన్స్ సునీల్గారు, బీవీ వర్క్స్తో కలిసి ఈ సినిమా ఉంటుంది. ఈటీవీ విన్స్ వారితో మా అసోసియేషన్స్ కొనసాగుతుంది. ‘ఇంకా ఏమీ అనుకోలేదు’ అనే టైటిల్తో ఓ సినిమా ప్లాన్స్ చేస్తున్నాం’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ–‘‘ఈషా’ ఫస్ట్ కాపీ చూసిన తర్వాతే సినిమాను తీసుకున్నాం. ఈ చిత్రం ఆడియన్స్ ను నిరాశపరచదు. ఓ స్ట్రాటజీ ప్రకారం నాన్స్ థియేట్రికల్ క్లోజ్ చేసి, ప్రమోషన్స్ చేసి, సినిమాలను విడుదల చేస్తున్నాం. మాదొక కొత్త ట్రెండ్ అనుకోవచ్చు. ఇక బీవీ (బన్నీ వాసు) వర్క్స్పై నేను నిర్మించిన ‘మిత్రమండలి’ సినిమా విఫలమైంది. నా సొంత బ్యానర్లో రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అల్లు అరవింద్గారితో నా అసోసియేషన్స్ కొనసాగుతుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ఓ పెద్ద సినిమా ఉంది. ఎమ్ఎస్ సుబ్బలక్ష్మిగారి జీవితంపై ఓ మ్యూజిక్ డ్రామా ఉంది. రాక్లైన్స్ వెంకటేశ్ ప్రధాన నిర్మాత. బీవీ వర్క్స్ అసోసియేషన్స్ ఉంది. నాగచైతన్య కొత్త సినిమా నిర్మాణంలోనూ అసోసియేట్ అయ్యాను’’ అని చెప్పారు.∙బన్నీ వాసు, వంశీ నంది పాటి -
ఢిల్లీలో పెద్ది
రామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ఫిల్మ్గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో రామ్ చరణ్పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు.ఈ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. చేతిలో సంచితో మాస్ లుక్లో నడుచుకుంటూ వెళుతున్న రామ్ చరణ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి...’పాట 150 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, కెమెరా: ఆర్. రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్. -
ఇలాంటి సినిమాలనే కోరుకుంటున్నారు: నాని
‘‘శంబాల’ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఇలాంటి జానర్ సినిమాలనే కోరుకుంటున్నారు. ఇలాంటి చిత్రాల్ని టెక్నికల్గా, మేకింగ్ పరంగా కరెక్ట్గా తీస్తే ఎలాంటి ఇం పాక్ట్ను క్రియేట్ చేస్తాయో ఇది వరకే చూశాం. ‘శంబాల’తో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అని హీరో నాని తెలి పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది.ఈ మూవీ ట్రైలర్ని నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్లో వచ్చే ఇంగ్లిష్ సాంగ్ చాలా స్టైలిష్గా ఉంది.. అదిరిపోయింది. ఆది చాలా ఏళ్ల నుంచి నాకు తెలుసు. మంచి నటుడు, డ్యాన్సర్. మంచి నటుడికి ఓ మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో చె΄్పాల్సిన పని లేదు. ‘శంబాల’ పెద్ద హిట్ అవ్వాలి.. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అని చె΄్పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, యుగంధర్ ముని, రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఛీ కొట్టినవారితో చప్పట్లు.. కల్యాణ్ విజయానికి కారణాలివే!
తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. బిగ్బాస్ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్నిపరీక్షలో కల్యాణ్ దూకుడు, అతడిలోని కసి చూసి.. ఇలాంటి కంటెస్టెంట్ కదా బిగ్బాస్కు కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్ మెటీరియల్ అని ముందుగానే ఫిక్సయిపోయారు.(Kalyan Padala Bigg Boss Winning Reasons)అంతా తలకిందులుకట్ చేస్తే బిగ్బాస్ 9కి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. పిక్నిక్కు వచ్చినట్లు ఓ మూలన కూర్చునేవాడు. ఏదో కరువులో ఉన్నట్లు అమ్మాయిలను ఓరగా చూస్తూ అదే పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ఇతడు చేసిన పనులకు మూడోవారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయేవాడే! కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాళ్ల చేతులు రాస్తూ కూర్చోవడమేనా? అని నాగ్ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో అలర్ట్ అయ్యాడు.రూటు మార్చాడుఅప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్ అవుతుండటంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఆట, మాట, తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్నిపరీక్షలో కనిపించిన కల్యాణ్ను తిరిగి చూపించాడు. నాలుగోవారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులు వస్తే గెలిచేవరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.జనాలకు కనెక్ట్..తనకు ఇష్టమైనవాళ్లు ఎలిమినేట్ అయినా, బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్లకు ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువ ఏడ్చేవాడు. అలా కల్యాణ్ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కల్యాణ్ పడ్డచోటే లేచి నిల్చున్నాడు. ఛీ కొట్టినవారితోనే శెభాష్ అనిపించేలా చేసుకున్నాడు. తనూజతో పోటీపడేవాళ్లే లేరా? అన్న సమయంలో అందరికీ ఓ ఆశాదీపంలా కనిపించాడు.కలిసొచ్చిన ప్రచారంకల్యాణ్ కోసం సోషల్ మీడియాలో బోలెడంత సింపతీ ప్రచారం జరిగింది. సోల్జర్ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్లో మాత్రం అతడెప్పుడూ ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్బాస్ మాత్రం కుదిరినప్పుడల్లా అతడు జవాన్ అని గుర్తు చేశాడు. 'జై జవాన్' అన్న నినాదం అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది. -
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ముఖం తనూజ పుట్టస్వామి. సీరియల్ నటిగా అందరికీ తను సుపరిచితురాలే! ఆమె హౌస్లో అడుగుపెట్టినప్పుడే విన్నర్ కదిలిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఈమేంట్రా బాబూ ఇలా ఉందని తల పట్టుకున్నారు. రానురానూ అవన్నీ తన ఎమోషన్స్ అని, తను నటించకుండా తనలాగే ఉందని జనాలు పసిగట్టారు. మనింటి అమ్మాయిఇంట్లో అమ్మలా వండిపెట్టడం, అక్కలా ఆజమాయిషీ చేయడం, చెల్లిలా అల్లరి చేయడం, అన్నింట్లో తానే ఆడతానంటూ ముందుకు రావడం, అలగడం.. ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడూ పద్ధతిగానే కనిపించేది. కొన్నిసార్లు మోడ్రన్ దుస్తులు వేసుకున్నా ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. అబ్బాయిలను హద్దుల్లో ఉంచుతుంది.ఫ్రెండ్ కోసం స్టాండ్అతి చనువుకు, లవ్ ట్రాక్కు ఛాన్సివ్వలేదు. అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం చూపించకుండా అందరితో ఇట్టే కలిసిపోయింది. స్నేహితుడిగా భావించిన కల్యాణ్ క్యారెక్టర్ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పూ చేయలేదని అడ్డంగా వాదించింది. ఫ్రెండ్ రీతూని సేవ్ చేసి తనకు అండగా నిల్చుంది. ఇలా తను ఇష్టపడేవారికి తోడుగా ఉంది. తనలో ఉన్న ఓ గొప్ప లక్షణం. ఎంతటి శత్రువునైనా మిత్రువుని చేసుకుంటుంది. శత్రువు కూడా మిత్రువే!వైల్డ్కార్డ్గా వచ్చిన మాధురి, ఆయేషా.. తనూజపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనూజ చేతిలో మాధురి పూర్తిగా బెండ్ అయిపోయింది. ఆయేషా ఫ్రెండ్ అయిపోయింది. భరణి నాన్నతో బంధం, మధ్యలో దివ్య రాక.. గొడవలు, దూరం.. వీటన్నింటివల్ల నలిగిపోయినా తిరిగి నిలదొక్కుకుంది.గెలిచేవరకు పోరాటంఅవసరమైనప్పుడు తనూజ అందరి సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవం. కానీ హౌస్లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతావారి సపోర్ట్ తీసుకున్నారు. అయితే తనూజనే ఎక్కువ హైలైట్ చేశారు.. షో మొదలైనప్పటినుంచి తనూజ చుట్టూనే గేమ్ అంతా సాగిందని బిగ్బాసే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మైండ్ గేమ్ ఆడింది. ఇమ్మాన్యుయేల్తో సమానంగా ఈ సీజన్ను తన భుజాలపై మోసింది. చాలా టాస్కుల్లో చివరి వరకు వచ్చి ఓడిపోయేది. అయినా గెలిచేవరకు పోరాడతా అన్న కసితో ముందడుగు వేసేది. పారితోషికం ఎంత?ఎవరితో గొడవలు జరిగినా సరే.. వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం.. వెనకాల గోతులు తవ్వడమనే పనులు ఏరోజూ చేయలేదు. కానీ తనపై సోషల్ మీడియాలో ఎక్కడలేని నెగెటివిటీ.. ఫలితంగా టాప్ 2లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పోరాడి ఓడినా తలెత్తుకుని సగర్వంగా బయటకు వచ్చింది. తనూజ వారానికి రూ.2.50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 వెనకేసింది.చదవండి: తెలుగు బిగ్బాస్లో చరిత్ర సృష్టించిన కల్యాణ్ -
బిగ్బాస్ 9 విన్నర్గా కల్యాణ్.. రూ.50 లక్షలు సొంతం!
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. నేడు (డిసెంబర్ 21న) జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. తనూజపై కామనర్ పవన్ కల్యాణ్ పడాల గెలిచాడు. బిగ్బాస్ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు. సామాన్యుడు తల్చుకుంటే జరనిదంటూ ఏమీ ఉండదని నిరూపించాడు. అతడి సంకల్ప బలానికి, ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిల్చాడు. సెలబ్రిటీ తనూజను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు.రెమ్యునరేషన్ ఎంత?సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది బిగ్బాస్ టీమ్. అలా అందరిలాగే కల్యాణ్కు సైతం ప్రతి వారానికి రూ.70,000 అందాయి. పదిహేను వారాలకుగానూ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే! కానీ, పవన్ రూ.15 లక్షల సూట్కేస్ తీసుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు తన సొంతం చేసుకున్నాడు. రాఫ్ టైల్స్ వారు మరో రూ.5 లక్షలు గిఫ్టిచ్చారు. అలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్ కారును సైతం తన సొంతం చేసుకున్నాడు. ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది. -
సూట్కేస్ తీసుకున్న పవన్.. మొత్తం ఎంత వెనకేశాడంటే?
బిగ్బాస్ 9 నుంచి డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు, కాదు తనంతట తానే తలెత్తుకుని బయటకు వచ్చాడు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టినప్పుడు అసలు ఇతడికి ఎలా అవకాశమిచ్చారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తన ఎంపిక ఏదో అల్లాటప్పా కాదని పవన్ నిరూపించాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. సూట్కేస్తో బయటకురెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ఏకంగా టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్ను తొక్కేసిన బిగ్బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. మీ విల్ పవర్, ఫిట్నెస్ మాత్రమే కాదు, గెలుపు కోసం చివరివరకూ పోరాడే తత్వం మిమ్మల్ని నిజమైన యోధుడిగా మార్చేశాయి. ముందు తొక్కేసి తర్వాత పొగడ్తలుకామనర్గా అడుగుపెట్టిన పవన్ యోధుడిగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనకున్న డీమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. ఓ దశలో రీతూతో బంధం కారణంగా డీమాన్ ఆటతీరుపై చాలానే విమర్శలు వచ్చాయి. టాస్కుల బాహుబలికానీ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. రీతూ ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోయిన తర్వాత డీమాన్ అసలు గేమ్ బయటపడింది. పంచ్లేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో బాహుబలిలా ఆడటం, గేమ్పై ఫుల్ ఫోకస్ లాంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ స్పీడ్ ముందు నుంచి ఉండుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవాడే అని కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా సెకండ్ రన్నరప్గా బయటకు వచ్చాడు.సంపాదన ఎంతంటే?ఇతడి రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కామనర్స్ అందరికీ ఒకే పారితోషికం ఇచ్చారు. అలా డీమాన్కి కూడా వారానికి రూ.70 వేల పారితోషికం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఓవరాల్గా 15 వారాలకుగానూ రూ.10.50 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.15 లక్షలు తోడవడంతో మొత్తం రూ.25 లక్షలకు పైగా సంపాదించాడు. మొత్తానికి పవన్కు ఈ షోతో డబ్బుకు డబ్బు, పేరుకు తగ్గ గుర్తింపు వచ్చింది. -
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్ను నాగార్జున సీజన్ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్ స్టార్.. ప్రేక్షకుల సపోర్ట్ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్ బిల్డప్ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్ను చివరకు నట్టేట ముంచారు. తప్పెవరిది?విన్నర్ కాదు కదా రన్నర్వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్బాస్ టీమ్దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది. సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తిసంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్ప్లాన్ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు. కెప్టెన్సీ త్యాగంమాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?మొదట నామినేషన్ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్గా మారింది. సింగిల్ సింహంలా ఎన్నో గేమ్స్ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు. మరోసారి రుజువైంది!కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్గానే నిలబెట్టారు. కమెడియన్స్ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు! -
టాప్-5 నుంచి 'సంజన' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్- 5 నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రన్నర్గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్బాస్ హౌస్లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్తో కనెక్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్-5 వరకు చేరుకుంది.సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. బిగ్బాస్లో ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసిందో సంజన జర్నీ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.సంజన రెమ్యునరేషన్సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్బాస్ హౌస్లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు టాక్. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ నగర వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) అధికారికంగా ప్రారంభమైంది. ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ ఆరంభమైంది. ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రో లీగ్కు హానరరీ చైర్మన్గా దిల్రాజు వ్యవరించనున్నారు. క్రికెట్-సినిమా రంగాల కలయికగా ఈ లీగ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా తదితరులు హాజరయ్యారు.ఇక సినిమా రంగం నుంచి హాజరైన పలువురిలో మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అనిల్ రావిపూడి, నాగవంశీ, బన్నీ వాసు, వైవా హర్ష, రాశీఖన్నా తదితరులు ఉన్నారు. * * * -
తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?
'తిన్నమా పడుకున్నామా తెల్లరిందా' ఈ డైలాగ్ చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది సాయాజీ షిండే. 'పోకిరి' మూవీలో పోలీస్ పాత్రలో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో స్టార్డమ్ తెచ్చుకున్న ఇతడు.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, కన్నడ భాషల్లో గత మూడు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాడు. తండ్రి, పోలీస్, విలన్.. ఇలా రకరకాలుగా మనందరికీ పరిచయమే. కానీ సాయాజీలో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా.స్వతహాగా నటుడే అయినప్పటికీ సాయాజీ షిండే.. ప్రకృతిని విపరీతంగా ప్రేమిస్తారు. ఎంతలా అంటే తల్లికి ఇచ్చిన చివరిమాట కోసం లక్షలాది చెట్లు నాటారు. ఇప్పటికీ నాటుతూనే ఉన్నారు. ఓసారి తెలుగు యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ 97 ఏళ్లు బతికింది. ఆమెకు 93 ఏళ్ల వయసున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ పేరుపై ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. త్రాసులో ఓవైపు అమ్మని కూర్చోబెట్టి.. మరోవైపు ఆమె బరువుకు సరితూగినన్నీ విత్తనాలతో ప్రపంచమంతా మొక్కలు నాటాలనుకున్నాను. ఎప్పుడైతే అవి చెట్లుగా మారి పూలు, పళ్లు వస్తే.. అందులో అమ్మని చూసుకోవచ్చని ఈ కార్యక్రమం చేపట్టాను. నాకు కన్నతల్లి, భూమాత ఇద్దరూ ఒకటే. ఎందుకంటే తల్లి మనల్ని నవమాసాలు కనిపెంచుతుంది. చెట్టు మనకు ప్రాణవాయువు ఇచ్చి బ్రతికిస్తుంది. కాబట్టి చెట్లకంటే సెలబ్రిటీలు ఎవరూ ఉండరు అని నేను నమ్ముతా అని అన్నారు.సాయాజీ షిండే.. తల్లి మరణానంతరం ప్రకృతి ప్రేమికుడిగా మారారు. 'సహ్యాద్రి దేవరాయి' అనే సంస్థని 2015లో స్థాపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే 29 ప్రాంతాల్లో ఏకంగా ఆరున్నర లక్షల వరకు విత్తనాలు, చెట్లు నాటినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి నాసిక్లో డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా 1800 చెట్లని కొట్టేందుకు సిద్ధమవగా షిండే విపరీతంగా పోరాడారు. చివరగా ఇందులో విజయం సాధించారు కూడా.అలానే విద్యార్థుల్లోనూ పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా 'ఓ విద్యార్థి ఓ చెట్టు' అనే నినాదంతో పారశాలల్లో పిల్లలకు తన సంస్థ ద్వారా ప్రకృతి, చెట్ల పెంపకంపై షిండే అవగాహన కలిగిస్తున్నారు. ఏదేమైనా నటుడిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. రాబోయే తరాల కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుండటం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి చాలామందికి తెలియదనే చెప్పొచ్చు. -
సమంతలో కొత్త పెళ్లికూతురి కళ.. కల్యాణి గ్లామర్!
సమంత ఫేస్లో కొత్త పెళ్లికూతురి కళగ్రీన్ డ్రస్లో మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్డ్యాన్స్ చేస్తూ మాయ చేస్తున్న 'ఫౌజీ' ఇమాన్వీ'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ వీకెండ్ ట్రిప్జిగేలుమనేలా దడపుట్టించేస్తున్న సంయుక్తబ్యాంకాక్ ట్రిప్లో సీరియల్ బ్యూటీ నవ్వస్వామి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
'ఛాంపియన్' మరో సాంగ్.. ఈ బాలనటిని గుర్తుపట్టారా?
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ వీకెండ్ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్, పాటలతో బజ్ తీసుకొచ్చే కాస్త బజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మూవీలోని ఐ యామ్ ఛాంపియన్ అంటూ సాగే టైటిల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ బాలనటి కనిపించడం విశేషం. మరి ఈమెని గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)ఛాంపియన్ మూవీలో రోషన్తో పాటు ఓ పాటలో కనిపించిన ఈ బాలనటి పేరు అవంతిక వందనపు. తెలుగు మూలాలున్నప్పటికీ అమెరికాలో పుట్టి పెరిగింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైంది. తర్వాత తెలుగులో ప్రేమమ్, ఆక్సిజన్, బాలకృష్ణుడు, మనమంతా, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో బాలనటిగా చేసింది. తర్వాత ఇంగ్లీష్లోనూ పలు సినిమాలు, సిరీస్లు చేసింది. మళ్లీ ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత తెలుగులో 'ఛాంపియన్'లోని స్పెషల్ సాంగ్లో మెరిసింది.వైజయంతీ మూవీస్ నిర్మించిన 'ఛాంపియన్' చిత్రంతో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్.. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వాతంత్ర్య బ్యాక్ డ్రాప్లోని పీరియాడికల్ కాన్సెప్ట్తో ఈ సినిమాని తెరకెక్కించారు. రోషన్ గతంలో 'పెళ్లి సందD'లో హీరోగా నటించాడు. అది అంతంత మాత్రంగానే ఆడింది. ఇదొచ్చిన మూడేళ్లకు ఇప్పుడు 'ఛాంపియన్' అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ) -
బిగ్బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్కు తన్నుకొచ్చిన దుఃఖం
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్కు మరికొద్ది గంటల్లో శుభం కార్డు పడనుంది. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఎంతోమంది గెస్టులు బిగ్బాస్ స్టేజీపైకి రానున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో మంగ్లీ, పాయల్ రాజ్పుత్ వంటి పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్తో అల్లాడించారు. అలాగే ఛాంపియన్, అనగనగా ఓ రాజు సినిమా హీరోహీరోయిన్లు కూడా సందడి చేశారు.బిగ్బాస్ హౌస్లో శ్రీకాంత్హీరో శ్రీకాంత్ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లి ఒకర్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి టీషర్ట్పై అన్సేఫ్ అని రాస్తారో వారు ఎలిమినేట్ అయినట్లు లెక్క! ఇక్కడ అందరికంటే ఎక్కువ కల్యాణ్ భయపడ్డాడు. తాను వెళ్లిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడు. కానీ కొంత షూటింగ్ నిన్ననే అయిపోవడంతో ఫస్ట్ సంజనా ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. రోబో ఎలిమినేట్!తర్వాత రోబోను పంపించగా ఆ రోబో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఓపక్క టెన్షన్, మరోపక్క ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్ దేశంలోనే టాప్ 1లో ఉందన్నారు నాగార్జున. బిగ్బాస్ 9 ట్రోఫీని చూపించేటప్పుడు మగువా మగువా.. పాట బీజీఎమ్ వేశారు. అంటే తనూజ గెలుస్తుందని ఏమైనా హింట్ ఇచ్చారా? అని నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ ప్రోమో మీరూ చూసేయండి..& -
'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ గానీ దక్షిణాదిలోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే రిలీజై రెండున్నర వారాలు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ గురించి అస్సలు సౌండ్ లేదు. ఇంతకీ మన దగ్గర రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు?పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ మూవీస్ ఒరిజినల్ వెర్షన్తో పాటు డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి తక్కువే. కొన్ని సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఫీలవుతుంటారు.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' మూవీ రిలీజైంది. తొలుత హిందీలో తీసుకొచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా సరే తెలుగులో రిలీజ్ చేశారు. తొలి వారం దాటేలోపే ఇది చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత రీచ్ ఉండేదనేది చాలామంది అభిప్రాయం. దీని విషయంలో చేసిన తప్పే ఇప్పుడు 'ధురంధర్' విషయంలోనూ మేకర్స్ చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్'.. బ్లాక్బస్టర్ హిట్ అయింది. చాలామంది తెలుగు మూవీ లవర్స్ దీన్ని ఒరిజనల్ వెర్షన్ చూసేశారు. మిగిలిన వాళ్లలో చాలామంది మాత్రం తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.గత శుక్రవారమే(డిసెంబరు 19) ఇది తెలుగులో రిలీజ్ అయిపోతుందని సోషల్ మీడియాలో చాలా హడావుడి నడిచింది. తీరా చూస్తే అది రూమర్ అని తేలిపోయింది. ఈ వారమూ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఛాంపియన్, దండోరా, శంబాల, వృషభ, పతంగ్, ఈషా, బ్యాడ్ గర్ల్జ్, మార్క్.. ఇలా లైన్లో చాలానే థియేటర్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు వస్తే 'ధురంధర్'కి స్పేస్ దొరకడం కష్టం.మైత్రీ మూవీ మేకర్స్.. 'ధురంధర్' తెలుగు డబ్బింగ్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1వ తేదీని చూస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే మాత్రం తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి వచ్చాక చూసుకోవాల్సిందే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. (ఇదీ చదవండి: టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్) -
ట్రిమ్ చేసిన వెర్షన్కూ స్పందన బాగుంది
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘నిన్న (శుక్రవారం) మ్యాట్నీ షోస్ నుంచే 90 శాతం థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. కొన్ని ల్యాగ్ సీన్స్, సాంగ్స్ ట్రిమ్ చేశాం. ఆ ట్రిమ్ అయిన వెర్షన్కూ రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతూ నవ్వుకుంటున్నారు. చిన్న సినిమాకు నిర్మాణ విలువలు బాగుంటే, ఎంత మంచి క్వాలిటీతో సినిమా స్క్రీన్ మీదకు వస్తుందనే విషయానికి ‘గుర్రం ΄ాపిరెడ్డి’ ఓ ఉదాహరణ’’ అని చెప్పారు. ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం వల్ల మా సినిమా మార్నింగ్ షోస్ కాస్త స్లోగా మొదలయ్యాయి. సాయంత్రానికి 90శాతం ఆక్యుపెన్సీతో మా సినిమా ప్రదర్శితం కావడం హ్యాపీ’’ అని చెప్పారు మురళీ మనోహర్. ‘‘థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఇంకొంత సపోర్ట్ చేసి, మా సినిమాను హిట్ చేయాలి’’ అని కోరారు వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, యాక్టర్స్ జీవన్ కుమార్, రాజ్కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోసిగి, మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడారు. -
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్ ప్యాకేజ్ మీల్లా ఉండేది. బిగ్బాస్ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. అందరికీ నచ్చేది ఒక్కరేఓన్లీ లవ్ ట్రాక్స్ అంటే యూత్కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్ ఉంటుంది. బిగ్బాస్లో కామెడీ అంత ఈజీ కాదు!మరి బిగ్బాస్లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్బాస్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్. నాలుగో స్థానం..కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్ రోహిణి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. నువ్వే రియల్ విన్నర్అతడి విషయంలో బిగ్బాస్ టీమ్, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. బిగ్బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్టైనర్స్కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్బాస్కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది. -
'బిగ్బాస్' తెలుగు విన్నర్ను ప్రకటించిన వికీపీడియా
బిగ్బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్బాస్ విజేత తనూజ అని, రన్నర్గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్బాస్ టీమ్తో ఉండవు.బిగ్బాస్ -9 విజేతగా నిలిచిన కల్యాణ్బిగ్బాస్9 విజేతను అధికారికంగా కల్యాణ్ పడాల అంటూ హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో వికీపీడియాలో వచ్చిన అప్డేట్ పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. దీంతో వికీపీడియా కూడా కొంత సమయం తర్వాత దానిని సవరిస్తూ మరో లిస్ట్ను విడుదల చేసింది. అందులో కల్యాణ్ విజేతగా పేర్కొంది. -
టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్
టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టికెట్ల రేట్ల అంశమే. పెద్ద సినిమాలు రిలీజైన ప్రతిసారి దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. రీసెంట్గా 'అఖండ 2' వచ్చినప్పుడు కూడా రేట్ల పెంపుపై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరే ఈ విషయం వదిలిస్తే ఇప్పుడు టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి.. ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్నారని చెప్పుకొచ్చారు.'ఓటీటీల రాకతో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన కంటెంట్ వాటిలో దొరుకుతోంది. డబ్బున్నవాడు ఓటీటీలో మూవీస్ చూస్తుంటే.. డబ్బులేనివాడు టీవీలో చూస్తున్నాడు. ఒకప్పుడు సినిమా అనేది ఏకైక ఎంటర్టైన్మెంట్ సాధనం. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులోనూ సినిమా.. చాలా ఖరీదైన ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి గారు అప్పట్లో టికెట్ రేట్లు తగ్గిస్తే వీళ్లందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాస్తవానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు.. ఆ రేట్లే బెటర్ సర్, కనీసం జనాలు థియేటర్లకు వచ్చేవారు అని నాతో అన్నారు''ఈ రోజుల్లో సరసమైన ధరలకు తక్కువ రేట్లకు సినిమా చూపిస్తామని చెప్పుకోవడం పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. ఇంకొన్నాళ్లకు 1+1 ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని.. జంటగా వచ్చి సినిమా చూడొచ్చని, గర్ల్ఫ్రెండ్తో కలిసి సినిమా చూడొచ్చని బోర్డులు పెట్టినా పెట్టొచ్చు. మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి వచ్చేసింది' అని బీవీఎస్ రవి తన అభిప్రాయాన్ని చెప్పారు.ఈయన చెప్పినది చూస్తే జరుగుతున్నది, జరగబోయేది ఇదే కదా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో రిలీజైన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు రూ.99 టికెట్ అనే ప్రచారం చాలా ప్లస్ అయింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు టికెట్ రేట్ల విషయంలో పునారాలోచన చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రేక్షకుడు.. థియేటర్కి పూర్తిగా దూరమయ్యే అవకాశముంది. -
అవసరమా ‘అఖండ’ కావరం?
‘ఎవర్ని చూసుకునిరా ఆ పొగరు.. అని అడుగుతుంటారు. కానీ నన్ను చూసుకునే నాకు ఆ పొగరు’’ అన్నారు ఇటీవల సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖండ తాండవం బాక్సాఫీస్ వద్ద తానాశించినట్టుగా తాండవమాడకపోవడం అనే నిజం నుంచి ఆయన ఏం గ్రహిస్తున్నారో తెలీదు కానీ... ఆయన గుర్తించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అంటున్నారుసినీ పండితులు. వాళ్లు చెబుతున్న ప్రకారం...బాలకృష్ణ ఏమీ స్వయంకృషితోనో, ఏ వారసత్వం లేకుండానో ఎదిగిన నటుడు కాదు. ఇప్పటికీ ఆయన ప్రతీ చోటా స్మరించే తండ్రి పేరు... ఎవరి పుణ్యాన తాను హీరోగా నిలబడగలిగాడో చెప్పకనే చెబుతుంది. మరి బాలకృష్ణకు ఎందుకు ఉండాలి పొగరు? తన సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్...వీళ్లెవరికీ లేని ప్రత్యేకత ఆయనలో ఏముందని తనను తాను చూసుకోవాలి? తల పొగరు ఉండాలి? తండ్రి వారసత్వంతో పాటు తెలుగు నాట ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం, అలాగే తమ కులమే అన్ని రంగాల్లో ముందుండాలనే కులోన్మాదం కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశాల్లో ఒకటి. అవే ఆయన తన నటనా ప్రతిభకు మించిన స్థాయిని ఆయనకు కట్టబెట్టాయనేది బహిరంగ రహస్యం. ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నోరు జారినా ఎంతమందిని తూలనాడినా ఆయనపై అదే స్థాయిలో ఎవరూ తిరగబడకపోవడానికి ఆయన నటనా ప్రతిభో లేక తిరుగులేని స్టార్డమ్మో కారణం కాదనీ ఆయన వెనుక ఉన్న సామాజిక వర్గ బలమేననేది తలపండిన ఆ విళ్లేషకుల మాట.దాదాపుగా కొన్ని దశాబ్ధాల పాటు అటు నటనలో గానీ, ఇటు అభిమానధనంలో గానీ చిరంజీవి మెగా స్థాయి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బాలకృష్ణ... ఇటీవల తన వయసు 60 దాటాక కొన్ని చెప్పుకోదగ్గ విజయాలు దక్కించుకోగలిగారు. దానికి ఆయన సంతోషించవచ్చు... ప్రేక్షకుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. అంతే గానీ ఈ స్వల్పకాలపు విజయాలకే తనకెవరూ సాటిలేరన్నట్టు మిడిసిపాటు తగదు. అది ఇతరుల కన్నా ఆయనకే ఎక్కువ చేటు చేస్తుందని ఆయన గ్రహించాలి. తనను తాను గొప్పగా చెప్పుకుని చెప్పుకునే స్వోత్కర్షల్లో ప్రమాదం ఏమిటంటే.. నిజంగానే తాను గొప్ప అనే భ్రమల్లోకి వెళ్లిపోవడం అదే ఆయన అఖండ తాండవానికి చావు దెబ్బ కొట్టింది.సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమా అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాప్ హీరోలు అందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, అదే సమయంలో విడుదలైన అఖండ(Akhanda 2) సినిమా గురించి బాలకృష్ణ మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం... ‘‘నా సినిమాలకు రేట్లు పెంచనవరం లేదు. పెంచకపోయినా నష్టం రాదు’’ అంటూ చెప్పారాయన. అయితే అదే బాలకృష్ణ రెండవ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి తనను తాను బాక్సాఫీస్ కింగ్ లాగో, పాన్ ఇండియా హీరోగానో భ్రమించారనీ. అవసరానికి తన స్థాయికి మించి నిర్మాతల చేత భారీ పెట్టుబడులు పెట్టించారనేది సినీ పండితుల వ్యాఖ్య. దాంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే జనం ఎగబడి చూస్తారని అనవసర అపోహలు ఏర్పరచుకున్నారంటున్నారు. అయితే సీనియర్ తెలుగు హీరోల్లో అంతో ఇంతో నాగార్జునని తప్ప మరెవరినీ ఉత్తరాది ప్రేక్షకులు పట్టించుకోరు అనే నిజం బాలకృష్ణకి తప్ప అందరికీ తెలుసు. ఆ నిజం ఆయనకు కనపడనీయకుండా తల పొగరు కళ్లు మూసేసింది. ఆ ఫలితమే ఉత్తరాదిలో అఖండ తాండవం తాలూకు ఘోర పరాజయం. ఇకనైనా బాలకృష్ణ తన భజనపరుల, కులోన్మాదులను కాక వాస్తవ డిమాండ్ను స్థాయిని గుర్తించి మసలుకుంటే... గతంలో నిర్మాతలకు అందుబాటులో హీరోగా ఆయనకు ఉన్న ఇమేజ్ అయినా కాపడుకుంటారని సినీ మార్కెట్ నిపుణులు అంటున్నారు.. -
వారణాసి బడ్జెట్ అన్ని కోట్లా?.. ప్రియాంక చోప్రా క్రేజీ ఆన్సర్!
దర్శకధీరుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్బాబులో కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ ప్రకటించేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. గ్లోబ్ట్రాటర్ పేరుతో ఈవెంట్ని నిర్వహించి వారణాసి టైటిల్ రివీల్ చేశారు. వీరి కాంబినేషన్లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. అయితే ఈ మూవీ బడ్జెట్పై ఇప్పటికే టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్కు రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాకు అంతకుమించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ మూవీకి దాదాపు 1200 కోట్లకు పైగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించపోయినా వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా.ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్పై ఆసక్తికర సమాధానం చెప్పింది. ది కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంకను ఫన్నీ ప్రశ్న అడిగాడు కపిల్ శర్మ. వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. కానీ మీరు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాక అది కాస్తా డబుల్ అయిందని తెలిసింది. ఇది నిజమేనా?అని ప్రియాంకను అడిగారు. దీనికి హీరోయిన్ స్పందిస్తూ.. అంటే బడ్జెట్లో సగం డబ్బులు నా ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారా? అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Priyanka chopra about #Varanasi on Kapil Sharma show pic.twitter.com/6kgkusKaGf— Sunaina🦋 (@Sunaina_speaks) December 20, 2025 -
Bigg Boss: టైటిల్ గెలిచినా.. స్టార్డమ్ రాలేదు?
‘బిగ్బాస్’ షోతో కెరీర్ పరంగా ఎదగాలి.. కంటెస్టెంట్స్ ఆలోచన ఇది. కంటెస్టెంట్స్ అంతా సెలబ్రిటీలే కాబట్టి వారి ఇమేజ్తో షోని సక్సెస్ చేసుకోవాలి.. ‘బిగ్బాస్’ స్ట్రాటజీ ఇది. ఇందులో ఇప్పటి దాకా బిగ్బాస్ యూనిట్ గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే ఎనిమిది సీజన్స్లో విన్నర్స్ కానీ, కంటెస్టెంట్స్ కానీ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు. వాళ్ల కెరీర్కి షో ప్లస్ అయిందీ లేదు.బిగ్బాస్ 1విన్నర్గా శివ బాలాజీ విజేతగా నిలిచాడు. నిజానికి బిగ్ బాస్లో పాల్గొనే నాటికే శివ బాలాజీ హీరోగా ప్రేక్షకులకు సుపరిచితం. 'అనగనగా ఒక రోజు', 'చందమామ' వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్తో మరింతగా ఆడియన్స్కి దగ్గరైయ్యాడు. ఆ సీజన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. కానీ… ఆ తర్వాత శివ బాలజీ కెరీర్లో పెద్ద మార్పు అయితే రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, కానీ హీరోగా బ్రేక్ రాలేదు. ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నట్లు, షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా, అవకాశాలు పెరగలేదు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్పై ఫోకస్ చేస్తున్నాడు.బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ పరిస్థితి అయితే మరీ దారుణం. షో జరిగినన్ని రోజులు కౌశల్ పేరు మారుమోగింది. కౌశల్ ఆర్మీ పేరుతో యువత హల్చల్ చేశారు. బిగ్బాస్ షోలో ఏ కంటెస్టెంట్కు రాన్నంత ఇమేజ్ కౌశల్కు వచ్చింది. బిగ్బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుస ఆఫర్స్ వస్తాయని ఆశించారు. కానీ, షో తర్వాత అతని పేరు క్రమంగా మరుగున పడింది. టాలీవుడ్లో పెద్ద అవకాశాలు రాలేదు. కొన్ని వెబ్ సిరీస్లు, చిన్న రోల్స్ చేశాడు, కానీ స్టార్డమ్ రాలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినా, కెరీర్ మలుపు తిరగలేదు. నేడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఇండస్ట్రీలో హైలైట్ కాలేదు.సింగర్ రాహుల్ సిప్లిగంజ్కి ఈ షో కాస్త ఉపయోగపడింది. బిగ్బాస్ 3 విన్నర్గా నిలిచిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. బెంజ్ కారు కొనేదాకా ఆయన ఆర్థిక స్థాయి వచ్చింది. కానీ బ్రేక్ వచ్చే స్థాయిలో కెరీర్ పరంగా అద్భుతాలు ఏం జరగలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు ఇంకాస్త పేరు అయితే వచ్చింది. కానీ అటు సింగర్గాను, ఇటు యాక్టర్గానే అంత బిజీ అయితే కాలేదు.బిగ్బాస్ 4 విన్నర్ అభిజిత్ పరిస్థితి కూడా అంతే . హీరోగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో ఫేమస్ అయిన అభిజిత్, షోలో తన ఇంటెలిజెన్స్, స్ట్రాటజీతో విన్నర్ అయ్యాడు. షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా, కెరీర్లో మార్పు రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, కానీ హీరోగా హిట్ రాలేదు. ఫిలిం ఇండస్ట్రీలో అతని పేరు ఇప్పుడు తక్కువగా వినిపిస్తోంది.బిగ్బాస్ 5 విజేతగా వీజే సన్నీకి కూడా ఈ షో పెద్దగా ఉపయోగపడలేదు.సీరియల్ యాక్టర్గా ఫేమస్ అయిన సన్నీ, షోలో తన హ్యూమర్, టాస్క్ పెర్ఫార్మెన్స్తో గెలిచాడు. షో తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు, కానీ అవి వర్కౌట్ కాలేదు. పేరు పెద్దగా వినిపించడం లేదు. సీరియల్స్కు తిరిగి వచ్చాడు.సీజన్ 6 విన్నర్గా సింగర్ రేవంత్ నిలిచాడు. సింగర్గా ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన రేవంత్, షోలో తన వాయిస్, పర్సనాలిటీతో ఆకట్టుకున్నాడు. షో తర్వాత అతని సింగింగ్ కెరీర్ మెరుగుపడింది – 'కల్కి 2898 AD' వంటి సినిమాల్లో సాంగ్స్ పాడాడు. కానీ, పెద్ద స్టార్డమ్ రాలేదు. సింగర్గా కొనసాగుతున్నాడు, షో అతనికి మధ్యస్థంగా ఉపయోగపడింది. బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ పరిస్థితి కూడా అంతే.'రైతు బిడ్డ'గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్, షోలో అనూహ్య ఫాలోయింగ్ సంపాదించాడు. కానీ, షో తర్వాత అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది – కాంట్రవర్సీలు, లీగల్ ఇష్యూస్ వచ్చాయి. సినిమా అవకాశాలు రాలేదు, పేరు నెగెటివ్గా మారింది.బిగ్బాస్ 8 విన్నర్గా నిలిచిన నిఖిల్కి కూడా ఈ షోతో పెద్దగా ఒరిగిందేమి లేదు. షో తర్వాత కూడా ఆయన అదే సీరియల్స్లో కొనసాగుతున్నాడు. కానీ హీరోగా బ్రేక్ రాలేదు. కెరీర్లో పెద్ద మార్పు లేదు.బిగ్ బాస్ తెలుగు విన్నర్ల చరిత్ర చూస్తే, షో అందరికీ పబ్లిసిటీ ఇస్తుంది, కానీ దీర్ఘకాలిక కెరీర్ బూస్ట్ చాలా మందికి రాలేదు. రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ వంటి వారికి కాస్త ఉపయోగపడినా, మిగతా వారు సీరియల్స్ లేదా చిన్న రోల్స్కు పరిమితమయ్యారు. కాంట్రవర్సీలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవారు కూడా ఉన్నారు. మరికొంతమందికి ఈ షో తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మరి సీజన్ 9లో ఎవరు విన్నర్ అవుతారు? వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. -
తెలుగుతెర సోగ్గాడు
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సృష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా – ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్బాబే అనేటంతగా స్పెషల్. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం 1975 డిసెంబర్ 19న కె. బాపయ్య దర్శకత్వంలో సురేష్ప్రోడక్షన్స్పతాకంపై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్ విశేషం ‘సోగ్గాడు’. రిలీజైన ‘సోగ్గాడు’ చిత్రంలోని ఉర్రూతలూపిన పాటలు, బాక్సాఫీస్ను ఊపేసిన వసూళ్ళు ఇవాళ్టికీ ఓ చెరిగిపోని చరిత్రే!గ్రామీణ నేపథ్యంలోని ఓ కథ గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాలలో విజయఢంకా మోగించడం విశేషమే. ‘సోగ్గాడు’చిత్రం స్పెషాలిటీ అది. సరదాగా జీవితం గడుపుతూ, ఊరంతటితో సోగ్గాడు అనిపించుకొనే నిఖార్సయిన, నిష్కల్మషమైన వ్యక్తి – శోభనాద్రి (శోభన్ బాబు). అతనికి ఓ మరదలు (జయసుధ). ఆమెను పెళ్ళి చేసుకోవాల్సిన హీరో... చదువురానివాడికి ఇచ్చి పెళ్ళి చేసేది లేదన్న మామ మీద పంతంతో... చదువుకున్న అమ్మాయి కోసం పట్నం వెళతాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడ ఓ హోటల్ రూమ్లో అతను మరో అమ్మాయి (జయచిత్ర)ని పెళ్ళాడాల్సి వస్తుంది. అనుబంధాలు, ఆస్తి తగాదాలు, అయినవాళ్ళ అన్యాయాలతో ఆ ముగ్గురి మధ్య నడిచే కథ ఇది. నిజానికి, ‘సోగ్గాడు’ చూస్తుంటే సినిమా చూస్తున్నట్టనిపించదు. మన పల్లెటూళ్ళలోని నిజజీవితం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రేక్షక జనానికి అది బాగా పట్టింది. తెర వెనుక మరో రచయిత..ఓ పక్కా తమిళ రచయిత ఇచ్చిన సాదాసీదా కథను తీసుకొని, దాన్ని పక్కా తెలుగు వాతావరణంలో, మన పల్లెటూళ్ళు, అక్కడి పరిస్థితులు ప్రతిబింబించేలా తెరకెక్కించడం ఆషామాషీ కాదు. అది చేసి చూపించి, సెన్సేషనల్ హిట్ సాధించింది ‘సోగ్గాడు’. అప్పటికే తరచూ తనను కలుస్తూ, అనుబంధం పెంచుకున్న రచయిత మోదుకూరి జాన్సన్కు సంభాషణల బాధ్యత అప్పగించారు నిర్మాత రామానాయుడు. అయితే, ఈ సినిమాకు తెరపై పేరు కనబడని మరో కీలక రచయిత అప్పలాచార్య. ‘‘తమిళ సినీ కథా, సంభాషణల రచయిత బాలమురుగన్ ఇచ్చిన ఈ జిలేబీ కథ (నవ్వుతూ...)కు నేను, రచయిత అప్పలాచార్య కలసి పక్కా మన తెలుగుదనం వచ్చేలా, కామెడీ కలగలిసేలా ట్రీట్మెంట్ చేశాం. కథలో భాగంగా బాలమురుగన్ రాసిన తమిళ కీ డైలాగులు కూడా వాడుకున్నాం. జాన్సన్ మంచి డైలాగులు రాశారు. వాటికి అప్పలాచార్య మరింత మెరుగులు దిద్ది, వన్నె తెచ్చారు. కథకు తగ్గట్టు హీరో సహా వివిధ పాత్రల డైలాగులకు పల్లెటూరి భాష, ఆ యాస వాడాం’’ అని దర్శకుడు కె. బాపయ్య ‘సాక్షి’కి వివరించారు.అచ్చ తెలుగుదనానికై... అంతా ఔట్డోర్లో...:వ్యవసాయాధారమైన అప్పటి తెలుగు పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించడం కోసం ‘సోగ్గాడు’ను అత్యధికంగా ఔట్డోర్లో తీశారు. ‘‘వ్యవసాయదారులు తాము తీసుకెళ్ళిన టిఫిన్ క్యారేజీలను చెట్ల కొమ్మలకు కట్టుకొని, చేలల్లో పనికి దిగడం లాంటివి చేసేవారు. పల్లెటూళ్ళలో షూటింగ్తో నేను చిన్నప్పుడు చూసిన ఆ వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చా. అందుకే చిత్రీకరణకై యూనిట్ ఆరేడుసార్లు ఆంధ్రాకు వెళ్ళాం’’ అని బాపయ్య చెప్పారు. 1975 ఏప్రిల్ 26న మద్రాసులోని వాహినీ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఆ తర్వాత బాపయ్య సహా ఎందరో సినీ ప్రముఖులకు స్వస్థలమైన విజయవాడ సమీపంలోని కోలవెన్నులో పెద్ద షెడ్యూల్ ΄్లాన్ చేశారు. రెండు రోజులు చిత్రీకరణ జరిగిందో లేదో... భారీ వర్షాలు రావడంతో షూటింగ్ రద్దయింది. అయితే, తర్వాత మళ్ళీ ఆ ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో మళ్ళీ కోలవెన్ను వెళ్ళారు. గ్రామస్థుల విశేష సహకారం మధ్య అక్కడ ఓ వారం రోజుల పాటు ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 80 మందితో ‘సోగ్గాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము దులుపుతాడు...’ పాట షూటింగ్ చేశారు. అలాగే, కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో చెడుగుడు (కబడ్డీ) పోటీల దృశ్యాలను చిత్రీకరణ జరిపారు. మరికొన్ని అవుట్డోర్ దృశ్యాలను ఎలమలో తీశారు. గోదావరి జిల్లాల్లో మండపేట, అలాగే నది నేపథ్యం కోసం గోదావరి నది పక్కన ఉండే సఖినేటిపల్లికి వెళ్ళి అక్కడ చిత్రీకరణ జరిపారు. నిర్మాత రామానాయుడు తన స్వస్థలమైన కారంచేడులో తొలిసారిగా షూటింగ్ చేసిన చిత్రమూ ఇదే. అలా ఆ ఏడాది జూలై మొదటివారం కారంచేడు కళాకారులకు నివాసమై, వేలాది జనాన్ని ఆకర్షించింది. (తరువాత మళ్ళీ హిందీ రీమేక్ ‘దిల్దార్’లో జితేంద్ర – రేఖలతో ‘సోగ్గాడు లేచాడు...’ పాట హిందీ వెర్షన్ను కోలవెన్నులోనూ, ‘బెన్హర్’ తరహాలో ఎడ్లబండ్ల ఛేజ్ లాంటివి కారంచేడులోనూ చిత్రీకరించడం విశేషం). ఇక, సోగ్గాడు నగరానికి రావడం, తిరగడం లాంటి దృశ్యాలను హైదరాబాద్ అబిడ్స్లో తీశారు. మళ్ళీ సురేష్ప్రోడక్షన్స్పై...1964లో ‘రాముడు – భీముడు’తో ‘సురేష్ప్రోడక్షన్స్’ మొదలైనా, మధ్యలో సురేష్ మూవీస్, నిర్మాత నాగిరెడ్డి గారి పిల్లలను కలుపుకొని ‘విజయా – సురేష్ కంబైన్స్’ లాంటి వివిధ బ్యానర్ల పేర్లతో సినిమాలు తీశారు నిర్మాత రామానాయుడు. మళ్ళీ ‘సోగ్గాడు’ నుంచి మాత్రం మొదట స్థాపించిన ‘సురేష్ప్రోడక్షన్స్’ పేరుతోనే చిత్రనిర్మాణం పునః్రపారంభించారు. నిజానికి ఈ చిత్రాన్ని నాగిరెడ్డి వారసుల ‘విజయా కంబైన్స్ రామానాయుడి ‘సురేశ్’ సంస్థ సంయుక్తంగా ‘విజయా అండ్ సురేష్ కంబైన్స్’ పేరిట సమర్పించినట్టు టైటిల్స్లో ఉంటుంది. పోస్టర్లు, పబ్లిసిటీలో మాత్రం ‘విజయా కంబైన్స్ ’ పేరు కనిపించదు. ఏమైనా, సురేశ్ సంస్థ, నిర్మాత రామానాయుడుల స్థాయి ‘సోగ్గాడు’ కమర్షియల్ హిట్తో మరింత పెరిగింది. ఆ వినాయకుడి విగ్రహం షాటే ఇప్పటికీ...మరో విశేషం ఏమిటంటే, ‘సోగ్గాడు’ కోసం కోలవెన్ను గ్రామం నడిబొడ్డున మండపాల కూడలిలో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు అక్కడే స్థానికుల సహకారంతో వరసిద్ధి వినాయకుడి విగ్రహాన్ని రామానాయుడు ప్రతిష్ఠించారు. అక్కడ వినాయకుడికి ఆయన నమస్కరిస్తుండగా షాట్ తీశారు. అప్పట్నించి ‘సురేష్ప్రోడక్షన్స్’ తాము నిర్మించిన సినిమాల న్నింటికీ టైటిల్స్ ముందు ఆ వినాయకుడి పూజా దృశ్యాన్నే తెరపై చూపడం ఓ సెంటిమెంట్.కోరమీసం, ముఖం మీదకు పడే వంకీల జుట్టు, పంచెకట్టుతో, ఎడ్లబండి నడుపుతూ తెరపై కనిపించారు శోభన్బాబు. ఆ గెటప్కు ఆయనకు ప్రేరణ నిజజీవితంలోని తన బాబాయి. ‘సోగ్గాడు’ పాత్రధారణ కోసం నిజజీవితంలోని ఆ బాబాయి వేషభాషలనే అనుకరించినట్టు శోభన్ స్వయంగా చెప్పారు. ‘తస్సాదియ్యా’ అనే ఊతపదంతో అలరించారు. తెలుగులో ఆమెకు తొలి ఛాన్స్... జయసుధ, జయచిత్రల గ్లామర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కథలో పల్లెటూరి వాతావరణం, బావా మరదళ్ళ సరసం లాంటివన్నీ ఉన్నాయి గనక తెరపై లంగా, ఓణీతో తెలుగుదనం కనిపించేలా యువ హీరోయిన్స్ అయితే బాగుంటుందని దర్శక, నిర్మాతలు భావించారు. అందుకే, అప్పటికే టాప్ రేంజ్లో ఉన్న సీనియర్ హీరోయిన్లను సైతం పక్కనపెట్టి జయచిత్ర, జయసుధలను ఎంచుకున్నారు. తమిళంలో అప్పటికే కథానాయికగా నటిస్తున్న తెలుగమ్మాయి జయచిత్ర మెయిన్ హీరోయిన్. ‘సోగ్గాడు’తోనే తెలుగుతెరకు నాయికగా ఆమె పరిచయమయ్యారు. అంతకు ముందు చిన్నవయసులో ఆమె తెలుగులో నటించారు. ‘‘తమిళంలో నేను హీరోయిన్గా పరిచయమైన ‘΄÷న్నుక్కు తంగ మనసు’ చిత్ర కథారచయితే బాలమురుగన్ గారే ‘సోగ్గాడు’కూ రచయిత కావడం మర్చిపోలేను’’ అని జయచిత్ర చెప్పారు. ‘‘సినిమా అంటే తెలియని చిన్నవయసు నుంచే జయచిత్ర, నేను మంచి ఫ్రెండ్స్. తమిళంలో బాలచందర్ ‘సొల్లత్తాన్ నినైక్కిరేన్’ (1973 – తెలుగులో ‘అమ్మాయిలూ జాగ్రత్త’గా రీమేకైంది), శివాజీగణేశన్ ‘భారత విలాస్’ (1973) సహా అయిదారు సినిమాలు కలసి కూడా పని చేశాం. జయచిత్రది ఓ ప్రత్యేక స్టైల్. ఆమెలా చిలిపి, అల్లరి పాత్రలు పోషించే శైలి వేరెవరికీ రాలేదు’’ అన్నారు జయసుధ. ఫలించిన శోభన్ జోస్యం... ఇక, అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ ఏమో హీరో మరదలిగా ‘సోగ్గాడు’లో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించారు. సురేష్ సంస్థలోనూ జయచిత్ర, జయసుధలకు అదే తొలి సినిమా. తరువాతి కాలంలో గ్లామర్ తారలుగా ఎదగడానికి ‘సోగ్గాడు’ ఘనవిజయం వాళ్ళిద్దరి కెరీర్కూ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ‘సోగ్గాడు’ షూటింగ్ జరుగుతుండగానే జోడీగా చేస్తున్న నటి జయసుధ భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారని ఓ జర్నలిస్టు, హీరో శోభన్బాబును ప్రశ్నించారు. ‘మరో రెండేళ్ళలో జయసుధ ్రపామినెంట్ స్టార్ అవుతుం’దని శోభన్ జోస్యం చెప్పారు. కట్ చేస్తే అక్షరాలా అదే జరిగింది. ఆ వెంటనే క్రాంతికుమార్ నిర్మించిన ‘జ్యోతి’(1976) తో ఆమె నటిగా తానేమిటో నిరూపించారు. ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ (1977)తో గ్లామర్ హీరోయిన్ అయ్యారు. ఇటు అందం, అటు అభినయంతో అనతికాలంలోనే జయసుధ స్టార్ హోదాను అందుకున్నారు. ఏయన్నార్ నుంచి చిరంజీవి దాకా నాటి అగ్రహీరోలందరితో నాయికగా రాణించారు. ∙స్టార్డమ్ తెచ్చిన సూపర్ హిట్...శోభన్బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రంలో కె.వి. మహదేవన్ సంగీతంలో ఆత్రేయ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘సోగ్గాడు’ రిలీజవడానికి సరిగ్గా వారం ముందు... 1975 డిసెంబర్ 12న ఇదే చిత్ర దర్శకుడు కె. బాపయ్య డైరెక్ష¯Œ లోనే పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్పై నిర్మాత అశ్వినీదత్కు అదే తొలి సినిమా. ఎన్టీఆర్ను ఓ కొత్త పంథాలో చూపిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే, సీనియర్ హీరోతో పోటాపోటీగా శోభన్ను నిలిపింది ‘సోగ్గాడు’. అలాగే, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. అంతకు ముందే వచ్చిన ‘జీవనజ్యోతి’ (1975 మే 16) సమయానికే శోభన్బాబు హీరోగా వరుస విజయాలతో తారాపథానికి ఎదిగారు. ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడు నెలలకు వచ్చిన ‘సోగ్గాడు’ కూడా 32 కేంద్రాల్లోనే రిలీజై, 31 కేంద్రాల్లో 50 రోజులు జరుపుకోవడం విశేషం. అయితే, ‘సోగ్గాడు’ 16 కేంద్రాల్లో డైరెక్ట్గా, 3 కేంద్రాల్లో షిఫ్టులతో కలిపి మొత్తం 19 సెంటర్లలో వంద రోజులాడినా, రజతోత్సవ ఘనత దక్కలేదు. శోభన్ కెరీర్లో అత్యధిక కేంద్రాల శతదినోత్సవ చిత్రం ఇదే. సరికొత్త స్టార్ హీరోగా శోభన్బాబు అవతరించడానికి ‘సోగ్గాడు’ తోడ్పడింది. విజయవాడ మునిసిపల్ స్టేడియమ్ గ్రౌండ్స్లో 1976 ఏప్రిల్11న శతదినోత్సవం జరిపారు. ∙బాక్సాఫీస్ హిట్తో... బాపయ్య బిజీ బిజీఈ చిత్రం బాపయ్యను కూడా దర్శకుడిగా మరో మెట్టు పైన పెట్టింది. దర్శకుడు తాపీ చాణక్య దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసిన బాపయ్యకు సురేష్ప్రోడక్షన్స్ ఆవిర్భావం, తొలి చిత్రం ‘రాముడు– భీము డు’(1964) నుంచి ఆ సంస్థతో అనుబంధం ఉంది. ‘‘రామానాయుడు గారు ఆ కంపెనీ రిజిస్ట్రేషన్కు స్టాంప్ పేపర్లు కావాలంటే, వెళ్ళి, కొని తెచ్చింది నేనే. ఆ సంస్థకు 60 ఏళ్ళు దాటడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాపయ్య. ఆయన దర్శకుడిగా పరిచయమైందీ సురేష్ప్రోడక్షన్స్ ‘ద్రోహి’తోనే. అది ఫెయిలైందని అందరూ వారించినా, రామానాయుడు మాత్రం బాపయ్య ప్రతిభపై నమ్మకం ఉంచి ‘సోగ్గాడు’ ఛాన్సిచ్చారు. ఆ అవకాశాన్ని బాపయ్య సద్వినియోగం చేసుకొని, కమర్షియల్ డైరెక్టర్గా నిరూపించుకున్నారు. దాదాపు సమాంతరంగా షూటింగులు జరిగి, వారం రోజుల తేడాలో రిలీజైన ఎన్టీఆర్ ‘ఎదురులేని మనిషి’, శోభన్బాబు ‘సోగ్గాడు’ రెంటినీ హిట్ చేసి, బాక్సాఫీస్ వద్ద డైరెక్టర్గా తన సత్తా చాటుకున్నారు బాపయ్య. తరువాత చిరంజీవితో ‘సంఘర్షణ’, ‘కొదమ సింహం’ లాంటి చిత్రాలు చేసిన ప్రముఖ దర్శకుడు కె. మురళీమోహనరావు అటు ‘ఎదురులేని మనిషి’కి కొద్దిరోజులు, ఇటు ‘సోగ్గాడు’కు పూర్తిగా బాపయ్య వద్ద దర్శకత్వ శాఖలో పనిచేయడం విశేషం. ఈ తెలుగు హిట్ను తర్వాత హిందీలో జితేంద్ర, రేఖ జంటగా ‘దిల్దార్’ (1977 ఏప్రిల్ 13) పేరిట రామానాయుడే నిర్మించారు. తమిళంలో మాత్రం శివకుమార్ (హీరో సూర్య తండ్రి) – శ్రీవిద్య జంటగా వేరే దర్శక, నిర్మాతలు ‘రాధై కేట్ర కణ్ణన్’ (1978) పేరిట రీమేక్ చేశారు. తెలుగుహిట్ బాణీలనే తమిళంలోనూ వాడారు. హిందీ రీమేక్ ‘దిల్దార్’ తెలుగు వెర్షన్ తీసిన బాపయ్య దర్శకత్వంలోనే వచ్చింది. దర్శకుడిగా బాపయ్యకు అదే తొలి పూర్తిస్థాయి హిందీ చిత్రం. అక్కడ నుంచి ఆయన ఇటు నేరు తెలుగు చిత్రాలు, అటు మన తెలుగువాళ్ళు తీస్తున్న హిందీ రీమేక్స్తో ఇరవయ్యేళ్ళు బిజీ బిజీగా గడిపారు. ఎక్కడ విన్నా ఆ పాటలే!ఆ రోజుల్లో తెలుగునాట ఎక్కడ విన్నా... మహదేవన్ బాణీల్లోని ‘సోగ్గాడు’ పాటలే. ‘‘బహుశా ‘అవ్వా బువ్వా కావాలంటే...’ పాటో, మరో పాటో గుర్తు లేదు కానీ, ‘ఎదురులేని మనిషి’కై ఆత్రేయ రాసిన ఓ పాట అందులో ఒదగదనిపించి, విలేజ్ నేపథ్యంలోని ‘సోగ్గాడు’కు వాడాం’’ అని బాపయ్య గుర్తు చేసుకున్నారు. ‘సోగ్గాడు’ కోసం శోభన్బాబు డ్యాన్స్ మాస్టర్ బి. హీరాలాల్ వద్ద శిక్షణ ΄÷ంది, పాటలకు స్టెప్పులేశారు. ‘సోగ్గాడు లేచాడు...’ పాట వస్తూ ఉంటే, మాస్లో ఓ హిస్టీరియా. ఫ్యా¯Œ ్స అయితే, తమ అభిమాన హీరో బాక్సాఫీస్ వద్ద జూలు విదిలించి, రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు. ఈ సినిమాలోని ‘ఏడుకొండలవాడా వెంకటేశా...’ పాట రేడియోలో కొన్నేళ్ళు ఓ అభిమాన జనరంజక గీతం. ‘సోగ్గాడు’ అంతా పూర్తయ్యాక ఫస్ట్కట్ చూసుకున్నాక మరో ప్రణయ గీతం ఉంటే బాగుంటుందనిపించి, శోభన్– జయసుధలపై ‘చలివేస్తోంది చంపేస్తోంది’ పాట ఎ.వి.ఎం. స్టూడియోలో తీసి, కలిపారు. ఆ పాట కుర్రకారుకు కిర్రెక్కించింది. హ్యాట్రిక్ ‘ఫిల్మ్ఫేర్’ల... ఏకైక తెలుగు హీరో! చాలామందికి తెలియనిదేమిటంటే, శోభన్ కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ హిట్ అని అందరూ అనుకొనే ‘సోగ్గాడు’ కన్నా ‘జీవనజ్యోతి’దే వసూళ్ళలో పైచేయి. ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. టికెట్ రేట్లు ఎక్కువుండే ఏసీ, డీలక్స్ థియేటర్లలో ‘సోగ్గాడు’ రిలీజైన కాకినాడ, నెల్లూరు టౌన్లను మినహాయిస్తే, మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ వసూళ్ళు వచ్చింది – ‘జీవనజ్యోతి’కే! అయితే, ఆ రెండు చిత్రాలూ ఆయనను ఉత్తమ నటుడిగా నిలిపి, అవార్డు సాధించిపెట్టాయి. ‘ఖైదీ బాబాయ్’ (1974), ‘జీవనజ్యోతి’ (1975) తరువాత వరుసగా మూడో ఏడాది ఈ ‘సోగ్గాడు’ (1976)తో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఆయనకే దక్కింది. తెలుగులో అలా వరుసగా మూడేళ్ళు ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ఫేర్ అందుకున్న ఏకైక హీరో శోభనే!అది... నటభూషణ నామ సంవత్సరం!శోభన్బాబు కెరీర్లో శిఖరాయమాన సంవత్సరమంటే 1975! ఆ ఏడాది శోభన్ సినిమాలు 8 రిలీజైతే అందులో 5 (‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘జీవనజ్యోతి’, ‘బలిపీఠం’, ‘జేబుదొంగ’, ‘సోగ్గాడు’) హిట్లు . రెండే (‘గుణవంతుడు’, ‘అందరూ మంచివారే’) ఫ్లాపులు. ఒకటి (‘బాబు’) యావరేజ్. అయిదు హిట్లలోనూ ‘జీవనజ్యోతి’ 25 వారాలాడి, సిల్వర్జూబ్లీ చేసుకుంది. ఏయన్నార్కి పర్మినెంట్ నిర్మాతైన రామానాయుడు తీసిన ‘సోగ్గాడు’ రజతోత్సవానికి ఒక వారం ముందే థియేటర్ల నుంచి తొలగించబడింది. అలా ఉద్దేశ పూర్వకంగా హాళ్ళలో తీసేయడం పట్ల ఎన్నో ఊహాగానాలు వినవచ్చాయి. అప్పట్లో అది టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఏమైనా అలా ఒకే ఏడాది అధికశాతం కమర్షియల్ సక్సెస్లతో శోభన్ క్రేజు పెరిగిపోయింది. పరిశ్రమలో ఆయన రేంజే మారిపోయింది. ఎవరు ఆపదలచినా... ఆగని రీతిలో ఆయన ప్రస్థానం సాగిపోయింది తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే అందాల హీరోగా తెలుగుతెరను ఏలారు. అదీ ‘సోగ్గాడు’ చేసిన మ్యాజిక్.ఆయన అప్పుడే చెప్పారు!‘‘మద్రాసులోని ఓ స్టూడియోలో షాట్ గ్యాప్లో నేను ఫ్లోర్ బయట కూర్చొనివుంటే, వేరే షూటింగ్ కోసం మేకప్ రూమ్ నుంచి వెళుతున్న శోభన్బాబు ‘మీరే కదా జయసుధ’ అంటూ నా దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆయన మంచి సక్సెస్లో ఉన్న పేరున్న హీరో. ఆయన నాలో ఏం గమనించారో కానీ, ‘యాక్టర్ సత్యనారాయణ గారు మీ ప్రతిభ గురించి చెప్పారు. మీరు పెద్ద ఆర్టిస్ట్ అవుతారు’ అని అప్పుడే అంచనా వేసేశారు. ‘సోగ్గాడు’కు చాలా ముందెప్పుడో... అలా మా ఇద్దరి తొలి పరిచయం. కట్ చేస్తే ఆ తర్వాత ‘సోగ్గాడు’ లో తొలిసారి ఆయన పక్కనే నటించాను. అంతకు ముందు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ లాంటి స్టార్ల చిత్రాల్లో పాత్రలు పోషించినా, ఒక అగ్ర హీరో సరసన హీరోయిన్గా నేను నటించడం ‘సోగ్గాడు’లోనే! ఆ సినిమా సెన్సేషనల్ హిట్తో హీరోయిన్గా నాకు పెద్ద బ్రేక్ వచ్చింది. అంతే... ఆ తర్వాత మా కాంబినేషన్లో ఎన్నో పెద్ద పెద్ద హిట్లు. కాలగతిలో శోభన్బాబు గారితో అత్యధికంగా 38 చిత్రాల్లో నటించిన హీరోయినయ్యాను. తెరపై సక్సెస్ఫుల్ పెయిర్గానే కాక ప్రేక్షకులకు అమితమైన అభిమానం ΄÷ందిన వెండితెర జంట మాది!’’– హీరోయిన్ జయసుధఅక్కినేనికి ‘దేవదాసు’... శోభన్కు ‘సోగ్గాడు’‘‘మా చిన్నప్పటి ‘సోగ్గాడు’ చిత్ర నిర్మాణం నాకు గుర్తే. మద్రాసులో బీచ్లో పడవల దగ్గర కూర్చొని, రచయిత మోదుకూరి జాన్సన్ డైలాగ్స్ రాయడం లాంటి దృశ్యాలు ఇప్పటికీ జ్ఞాపకమే. మా నాన్న గారి (డి. రామానాయుడు) ద్వారా ఆ సక్సెస్ గురించి ఎన్నో సంగతులు విన్నా. హిందీలోనూ ఆ చిత్రాన్ని జితేంద్ర – రేఖలతో ‘దిల్దార్’ పేరుతో రీమేక్ చేస్తే, అక్కడ కూడా మంచి సక్సెసే! ఏయన్నార్ గారికి ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’ లాంటివి ఎలాగో, శోభన్బాబు గారికి ‘సోగ్గాడు’ అలా! ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆ సినిమాను మా సంస్థ నిర్మించడం మాకు గర్వకారణం.’’ – సురేష్ డక్షన్స్ సారథి డి. సురేశ్బాబుఛార్టర్డ్ ఫ్లైట్లో పంపారు!‘‘ఎన్టీఆర్ గారి సరసన హీరోయిన్గా మా అమ్మ జయశ్రీ నటించిన ‘దైవబలం’ చిత్రంలో శోభన్బాబు చిన్న పాత్ర పోషించారు. నేను అదే శోభన్బాబు పక్కన ‘సోగ్గాడు’తో తొలిసారి తెలుగులో హీరోయిన్గా పరిచయమయ్యా. అప్పటికే ఆయన పెద్ద హీరో. నేను కొత్త. అయినా, మొదటిరోజు వాహినీ స్టూడియోలో ‘ఏడుకొండలవాడా...’ పాటతో షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆయన నన్నెంతో ్రపోత్సహిస్తూ నటింపజేశారు. ‘సోగ్గాడు’ షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు తమ్ముడు పుట్టాడు. పెద్ద సాంగ్ షూటింగ్ మధ్యలో ఉండగా అప్పటికప్పుడు వెళ్ళడానికి నిర్మాత రామానాయుడు గారు ‘హిందూ’ పత్రిక వారి స్పెషల్ ఛార్టర్డ్ విమానంలో పంపిన సంగతి మర్చిపోలేను. అలాగే, ‘సోగ్గాడు’ చిత్రాన్ని తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఆ బృందంలో రామానాయుడు గారు నన్ను తీసుకువెళ్ళారు. అదే నా తొలి విదేశీ పర్యటన. అక్కడ ఇండియన్ డ్యాన్సులు చేయాలంటే, రాజ్కపూర్ తదితరుల ఎదుట పాటలకు నేను డ్యాన్స్ చేశా. అదో మరపురాని అనుభూతి.’’ – హీరోయిన్ జయచిత్ర విజయవాడలో వేలాది జనం... అదే ట్రైన్లో ఎన్టీఆర్...‘‘శోభన్బాబుతో నా కాంబినేషన్లో ‘సోగ్గాడు’ నుంచి కృష్ణ – శోభన్బాబు మల్టీస్టారర్లు ‘ముందడుగు’, ‘మండేగుండెలు’ దాకా ఎన్నో హిట్స్ వచ్చాయి. తొలి రోజుల్లో నామమాత్రపు ΄ారితోషికాలకు చిన్న వేషాలు వేస్తున్నప్పటి నుంచి శోభన్బాబు నాకు తెలుసు. అలాంటివాడు పట్టుదల, క్రమశిక్షణ, ముందుజాగ్రత్తలతో ‘రిచెస్ట్ తెలుగు హీరో ఇన్ మద్రాస్’ అయ్యాడు. మంచి మనిషి, మహా అందగాడు. ఫైట్లు – యాక్షన్ కన్నా, ప్రేమ సీన్లు, ఫ్యామిలీ సీన్లు, అభినయం – డైలాగ్స్ ఎక్కువుండే వాటిని ఆయన ప్రిఫర్ చేసేవారు. ఆ రోజుల్లో ‘సోగ్గాడు’ శతదినోత్సవం విజయవాడలో చేస్తే, వేలల్లో జనం వచ్చారు. వేడుక అద్భుతంగా జరిగాక, మళ్ళీ అదే రోజు అర్ధరాత్రి దాటాక ఉన్న ట్రెయిన్ పట్టుకొని యూనిట్ అంతా మద్రాసుకు తిరుగు పయనమయ్యాం. అనుకోకుండా అదే రైలులో మా వెనకాల సీట్లలోనే అగ్ర హీరో ఎన్టీఆర్ ఉన్నారు. అది తెలిసి, వెళ్ళి పలకరించాం. ఆయన ఆత్మీయంగా అందరినీ అభినందించారు.’’ – దర్శకుడు కె.బాపయ్య – రెంటాల జయదేవ -
కధానాయిక...కదిలేనా ఇక?
కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాలో మహిళా ప్రధాన చిత్రాలకు తగినంత ఆదరణ ఉండేది. అందుకు తగ్గట్టే వారూ వీరని తేడా లేకుండా విజయశాంతి నుంచి అనుష్క వరకు, చాలా మంది కథానాయికలు తమ మహిళా ప్రధాన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్బస్టర్లను సాధించారు. ఓ వైపు గ్లామర్ చిత్రాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలోనూ రమ్యకృష్ణ లాంటి వారు సత్తా చాటారు. అయితే ఉత్తరాది నుంచి దిగుమతయ్యే గ్లామర్ డోస్ పెరగడం మొదలైన దగ్గర నుంచి కధానాయిక ప్రాధాన్యమున్న సినిమాల జోరు తగ్గడం కూడా మొదలైంది. అదే క్రమంలో కధానాయిక ప్రాధాన్య చిత్రాలు తీయడమే అరుదైపోగా అరకొర గా వచ్చినవి కూడా జనాదరణ పొందలేక పోయాయి. మొన్నటి సమంత శాకుంతలం నుంచి నిన్నటి అనుష్క ఘాటి దాకా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలబడ్డాయి. దీంతో హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలను తీసి మెప్పించే సత్తా టాలీవుడ్ కోల్పోయిందా? లేక చూసే ఆసక్తిని ప్రేక్షకులు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.ఈ నేపధ్యంలో ఇటీవల విడుదలైన మహిళా ప్రధాన చిత్రాలైన ’8 వసంతాలు’ ’పరదా’ ది గర్ల్ ఫ్రెండ్ బాక్సాఫీస్ ట్రెండ్లను బట్టి చూస్తే, సమస్య ప్రేక్షకుల దగ్గర లేదని సినిమా రూపకర్తల దగ్గరే ఉందని తేలిపోయింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ’8 వసంతాలు’ చిత్రం జూన్ 20న ’కుబేరా’ చిత్రంతో పాటు విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినప్పటికీ, ఈ చిత్రం విడుదలకి ముందు ప్రేక్షకులలో హైప్ని రేకెత్తించడంలో విఫలమైంది. ఫలితంగా, ఇది బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఆ మరుసటి రోజునే అనుపమ పరమేశ్వరన్ నటించిన ’పరదా’ చిత్రం విడుదలైంది. సినిమా కంటెంట్ సంగతి పక్కన పెడితే, మొదటి రోజు వసూళ్లను బట్టి చూస్తే, ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియనే తెలీదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ’గర్ల్ఫ్రెండ్’ ఒక్కటే మరోసారి కధానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల విజయాలకు ఊపిరి పోసింది. అంటే జనాన్ని థియేటర్లకు రప్పించడంలో ప్రస్తుతం రష్మికకు ఉన్న క్రేజ్ కూడా ఉపకరించిందని ఒప్పుకోవాలి. ఏదేమైనా ఒక మహిళా ప్రధాన చిత్రం మంచి కాన్సెప్ట్తో తగిన సత్తా కలిగిన నటితో వస్తే, ప్రజలు వాటిని ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ఈ సినిమాతో రుజువైంది. మరోవైపు ధియేటర్లకు వెళ్లకున్నా, ఓటీటీ వేదికలపై ’8 వసంతాలు’ ’పరదా’ చిత్రాలు చూసిన వారిలో అత్యధికులు ప్రశంసలు కురిపించారు.కాబట్టి మహిళా ప్రధాన చిత్రాల పట్ల ఆదరణ, ఆసక్తి పూర్తిగా లేదని మనం చెప్పలేం. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో, ప్రేక్షకులు సినిమాల్లో నటీనటులు ఎవరనేది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు, కాకపోతే వారు థియేటర్లకు వెళ్ళడానికి మాత్రం కొన్ని షరతులు కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా అగ్రహీరోలు, పెద్ద బ్యానర్లు, లేదా భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రాలను మాత్రమే థియేటర్ కోసం ఎంచుకుంటున్నారు. లేదంటే నటీనటులు ఎవరైనప్పటికీ, తక్కువ బడ్జెట్తో నిర్మించినప్పటికీ పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను చూడటానికి మాత్రం థియేటర్లకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో పేక్షకులను థియేటర్లకు రప్పించేది ఏదో మహిళా ప్రధాన చిత్రాల్లో లోపిస్తోందనేది నిర్వివాదం. అదేంటో సమీక్షించుకుని సరిచేసుకోగలిగితే మరోసారి మహిళా చిత్రాల విజయ పరంపర మొదలు కావచ్చు. -
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా శంబాల ట్రైలర్
ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'శంబాల'. ఈ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజులు నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు'.. అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఓ గ్రామంలో జరిగిన మిస్టరీ సంఘటనలతో తెరకెక్కించినటలు తెలుస్తోంది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, మధునాదన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాలసంగీతమందించారు. -
‘కల్కి’ కంటే ముందే శంబాల టైటిల్ని ఫిక్స్ చేశాం
‘‘శంబాల’ సినిమాకి ముందు ఆదితో వేరే కథ అనుకున్నాం. ఇంతలో ‘శంబాల’ కథ రావడంతో ఈ కథతోనే సినిమా చేద్దాం అనుకున్నాం. యుగంధర్ ముని చెప్పిన ఈ కథ అంత బాగా నచ్చింది. డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్సిగ్నల్ ఇచ్చి, సినిమా ఆరంభించాం’’ అని నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి తెలిపారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీతో మాకు అనుబంధం ఉంది. పెద్ద సినిమాల వీడియో డీవీడీస్ హక్కులు మా వద్ద ఉండేవి. అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్గా పని చేశాం. నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రం. ఇందులో హారర్తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ ఉంటాయి. ‘కల్కి 2898 ఏడీ’ వచ్చిన తర్వాత ‘శంబాల’ (కల్కిలో శంబాల ప్రపంచం ఉంటుంది) గురించి అందరికీ తెలిసింది. అయితే అంతకు ముందే మేం ఈ టైటిల్ని ఫిక్స్ చేశాం. కథపై నమ్మకంతో బడ్జెట్ ఎక్కువైనా రాజీ పడలేదు. మా పెట్టుబడిలో 80 శాతం వరకు బిజినెస్తో సేఫ్ జోన్లోకి వచ్చాం.. ఆది, అర్చనా అయ్యర్తో పాటు సినిమాలో అన్ని పాత్రలకి ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం మా సినిమాకు పెద్ద ప్లస్. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో హిందీలో విడుదల చేస్తాం. మా తర్వాతి సినిమాల కోసం కొన్ని కథలు వింటున్నాం. డిస్ట్రిబ్యూషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాం’’ అని చెప్పారు. -
ది రాజాసాబ్ మూవీపై రూమర్స్.. నిర్మాత ట్వీట్ వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ను మారుతి డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా.. సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. రెబల్ స్టార్ మూవీ కావడంతో ఫ్యాన్స్తో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.రెబల్ స్టార్ మూవీ కావడంతో టాలీవుడ్లో అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్కు ముందే బిజినెస్ డీల్స్పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఓటీటీ డీల్తో పాటు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలు అందుకోలేకపోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రూమర్స్పై ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారిందిమా అతిపెద్ద సినిమా అయిన ది రాజాసాబ్ అంతర్గత లెక్కల గురించి బయటికి చెప్పలేమని నిర్మాత వెల్లడించారు. మా సినిమాకు థియేటర్లలో రిలీజ్ తర్వాత వచ్చే లెక్కలను అఫీషియల్గా ప్రకటిస్తామని తెలిపారు. సినిమా రంగం అనేది దశలవారీగా మారుతూ ఉంటుందన్నారు. ఈ రోజుల్లో నాన్-థియేట్రికల్ మార్కెట్లో సాధారణంగా సర్దుబాట్లు జరుగుతుంటాయని అన్నారు. థియేటర్లలో మాత్రమే అసలైన నంబర్స్ వస్తాయని వెల్లడించారు. అయినప్పటికీ కూడా మా సినిమా ఈ రోజు అత్యధిక నాన్-థియేట్రికల్ విలువను సాధించిందని విశ్వప్రసాద్ ట్వీట్లో రాసుకొచ్చారు. ది రాజాసాబ్కు పోలికలు అనవసరమని రూమర్స్ను కొట్టిపారేశారు నిర్మాత. కాగా.. ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. There’s a lot of noise around the business of our biggest film.We don’t discuss internal spends or numbers publicly. What truly matters to us and the fans is the theatrical impact. Post release, we will officially share the worldwide box-office figures.Cinema moves in phases.…— Vishwa Prasad (@vishwaprasadtg) December 21, 2025 -
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ఛాంపియన్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్లో అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనస్వర రాజన్ తెలుగు ఇండస్ట్రీని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని తెలిపింది. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశానని వెల్లడించింది. అయితే అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువ చూసేదాన్ని అనస్వర రాజన్ తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్ తెలుగు హీరో అని నాకు తెలియదు.. ఆయనను మలయాళ హీరోనే అనుకున్నానని పంచుకుంది. రామ్ చరణ్ మగధీర సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, యాక్టర్స్ గురించి తెలిసిందని కామెంట్స్ చేసింది. అప్పటి వరకు నేను తెలుగు సినిమాలను చూస్తున్నానని నాకే తెలియదని అనస్వర చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అలరించనుంది.కాగా.. అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఇట్లు మీ అర్జున అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఛాంపియన్ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇదేనని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. -
పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే?
నాని హీరోగా వస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేశ్ బాబు బిర్యానీ పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత సుధాకర్ చెరుకూరి రిలీజ్ డేట్పై అడిగిన ప్రశ్నకు స్పందించారు.ఇప్పటికే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 26న పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. అయితే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ కూడా మార్చి 27 రోజున రిలీజవుతోంది. ఒక్క వ్యవధిలోనే రెండు పెద్ద సినిమాలు రానుండడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పేలే లేదు. దీంతో ది ప్యారడైజ్కు రామ్ చరణ్ పెద్ది మూవీతో క్లాష్ తప్పదా? లేదా లాస్ట్లో విడుదల తేదీని మారుస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. మేము సాధ్యమైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నామని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయితే తప్పకుండా మార్చి 26నే ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుందన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని వర్సెస్ రామ్ చరణ్ తప్పలా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే అప్పటికల్లా ఏదో ఒక మూవీ పోస్ట్పోస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రిపోర్టర్: #Peddi తో #Paradise క్లాష్ తప్పదా? లేదా లాస్ట్లో మారుస్తారా?ప్రొడ్యూసర్ #SudhakarCherukuri: మార్చి 26న రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాం. అంతా పూర్తి అయితే మార్చి 26నే వస్తాం. pic.twitter.com/23VOD188Ao— greatandhra (@greatandhranews) December 20, 2025 -
మూడేళ్లలో చాలా నేర్చుకున్నాను: రోషన్
‘‘నా సినిమాల కథలను ముందు నేనే వింటాను. నాకు నచ్చిన స్క్రిప్ట్స్ గురించి నాన్నతో (నటుడు శ్రీకాంత్) చర్చిస్తాను. నాన్న పూర్తి కథ వినరు కానీ స్టోరీ లైన్ వింటారు. అయినప్పటికీ కథ, సినిమాల ఎంపికలో తుది నిర్ణయాన్ని నాకే వదిలేస్తారు. ‘చాంపియన్’ సినిమా కథ కూడా ఒక లైన్లా విన్నారు’’ అని రోషన్ చెప్పారు. ఆయన హీరోగా, అనస్వరా రాజన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘చాంపి యన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రోషన్ పంచుకున్న విశేషాలు. ⇒ నిజానికి హీరోలందరూ 25 ఏళ్లు ఏజ్లోనే ఇండస్ట్రీకి వస్తారు. నేను 21 ఏళ్లకే వచ్చేశాను. ‘పెళ్లి సందడి’ (2021) సినిమా తర్వాత నేను బ్రేక్ తీసుకున్నట్లు అనిపిస్తుంది కానీ, కమ్ బ్యాక్ ఇవ్వడానికి ఇదే సరైన వయసు. ఈ విరామం తీసుకోవడం కూడా పూర్తిగా నా నిర్ణయమే. యాక్టింగ్ అంటే హ్యూమన్ ఎమోషన్స్ తెలియాలి... దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్ చేశాను... ఆ విధంగా చాలా నేర్చుకున్నాను. ⇒ 1948లో జరిగే కథ ‘చాంపియన్’. చరిత్రలో బైరాన్ పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ‘చాంపియన్’ కథని చూపించడం జరిగింది. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్కి స్వాతంత్య్రం రాని రోజుల్లో జరిగిన కథ ‘చాంపియన్’. నాపాత్ర ప్రాపర్ హైదరాబాదీ... అందుకోసం ఆ యాస స్పష్టంగా నేర్చుకున్నాను. ఈ మూవీ కోసం ప్రదీప్గారు, స్వప్నగారు, ఆర్ట్ డైరెక్టర్ తోటగారు ప్రతిదీ పరిశోధించారు. పీటర్ హెయిన్స్గారు అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. ⇒ మా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్చరణ్ అన్న నా గురించి, మా టీమ్, సినిమా గురించి అంత బాగా మాట్లాడటం హ్యాపీ అనిపించింది. అఖిల్ అన్న కూడా నాకు మంచి ఫ్రెండ్. అలాగే తమన్ అన్న... మేమందరం కలిసి క్రికెట్ ఆడతాం. బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీ పడకుండా ‘చాంపియన్’ నిర్మించారు. నేను చాలా మొహమాటంగా ఉంటాను. ‘కొంచెం ఓపెన్గా ఉండు, మాట్లాడు’ అని నాగ్ అశ్విన్గారు చె΄్పారు. ⇒ నేను క్రికెటర్, మా చెల్లి డాక్టర్, మా తమ్ముడు ఐఏఎస్ కావాలనుకున్నారు నాన్న. నాకు కూడా క్రికెటర్ కావాలనే ఉండేది. అయితే నటుడయ్యాను. నా కొత్త సినిమాల ప్రకటన తర్వలోనే ఉంటుంది. ఇకపై రెండు సంవత్సరాలకి కనీసం మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. -
రవితేజ మార్క్ ఫన్ మిస్ కాకుండా...
‘‘రవితేజగారితో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయాలనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ రాశాను. చక్కని వినోదంతోపాటు అద్భుతమైన సంగీతంతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మన జీవితం తెరపై చూసుకున్నట్టుగా ఈ సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్ కిశోర్ తిరుమల తెలిపారు. రవితేజ హీరోగా, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘రవితేజగారి మార్క్ ఫన్ మిస్ అవ్వకుండా నా శైలిలో ఈ సినిమాని చాలా వినోదాత్మకంగా చేశాను. ఈ చిత్రంలో ఆయన పోషించిన రామ సత్యనారాయణపాత్ర ఫ్రెష్గా ఉంటుంది’’ అన్నారు. సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది.ఈ సంక్రాంతికి మాతోపాటు వస్తున్న ఇతర చిత్రాలు కూడా బాగా ఆడాలి... కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి... అలాగే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు. ‘‘ఈ చిత్రంలో నాపాత్ర పేరు బాలామణి. ఇది నా ఫస్ట్ సంక్రాంతి సినిమా కాబట్టి చాలా ప్రత్యేకం’’ అన్నారు డింపుల్ హయతి. ‘‘ఈ మూవీలో మోడ్రన్, కాన్ఫిడెంట్, బోల్డ్గా ఉండే మానసా శెట్టిపాత్రలో కనిపిస్తాను’’ అని ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు. -
మా వందే ప్రారంభం
భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ‘మావందే’ టైటిల్తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్లో మోదీగా ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. రవీనా టాండన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సీహెచ్ క్రాంతికుమార్ దర్శకత్వంలో వీర్ రెడ్డి .ఎం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ‘‘మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలను సహజంగా ‘మా వందే’లో చూపించనున్నాం.ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ మోదీగారి జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సాంకేతిక, వీఎఫ్ఎక్స్ నిపుణులతో ఈ బయోపిక్ను రూపొం దిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: గంగాధర్, వాణిశ్రీ, లైన్ ప్రోడ్యూసర్: రాజేశ్. -
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'బొమ్మ హిట్'
బాలనటుడిగా పలు సినిమాలు చేసిన అభినవ్ మణికంఠ హీరోగా చేస్తున్న కొత్త మూవీ 'బొమ్మ హిట్'. గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్. ఈ చిత్రం నేడు(డిసెంబరు 20) పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ప్రారంభమైంది.హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్తో సిచ్యుయేషనల్ కామెడీతో వినోదాన్ని ఇస్తుంది. ఈ మధ్య కామెడీ చిత్రాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా బొమ్మ హిట్ సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా అని అన్నాడు. రాబోయే వేసవికి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నామని దర్శకుడు రాజేష్ చెప్పుకొచ్చారు. -
'భర్త మహాశయుల..' కోసం రవితేజ భారీ త్యాగాలు
హీరో రవితేజ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు మాత్రం ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే అనేలా పరిస్థితి తయారైంది. గత మూడు నాలుగేళ్లలో 'క్రాక్', 'ధమాకా' లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ ఫ్లాప్ అవడంతో పాటు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ చేతిలో ఉంది. దీనికోసం రవితేజ భారీ త్యాగాలే చేశాడు. తాజాగా ఆ విషయాల్ని దర్శకనిర్మాత బయటపెట్టారు.దర్శకుడు కిశోర్ తిరుమల తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్.. ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపించేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమాలో నటించడంతో పాటు కెరీర్లో ఇప్పటివరకు చేయనటువంటి త్యాగాలని రవితేజ చేశాడు. ఈ మూవీ కోసం అడ్వాన్స్ గానీ రెమ్యునరేషన్ గానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాత సుధాకర్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో బయటపెట్టారు. ఇదే చిత్రం కోసం రవితేజ.. తన 'మాస్ మహారాజా' ట్యాగ్ కూడా పక్కనబెట్టేశారని దర్శకుడు చెప్పాడు.ఇదంతా చూస్తుంటే రవితేజకు కూడా తన పరిస్థితి అర్థమైనట్లు కనిపిస్తుంది. అందుకే ఇలా త్యాగాలు చేస్తున్నాడా అని సందేహం వస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇవన్నీ సినిమాని హిట్ చేస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా ప్రేక్షకుడు, కంటెంట్ చూసే థియేటర్కి వెళ్తున్నాడు. చిన్న సినిమానా పెద్ద సినిమానా.. చిన్న హీరోనా పెద్ద హీరోనా అని అస్సలు ఆలోచించట్లేదు. వరస ఫ్లాప్స్ వల్ల రవితేజ మార్కెట్ ఇప్పటికే బాగా దెబ్బతింది. అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండా సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేయమని నిర్మాతని కోరాడు. అందుకు తగ్గట్లే జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈసారి హిట్ పడితేనే రవితేజకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. -
జలకన్యలా జవాల్కర్.. గ్లామరస్ కృతి సనన్
జలకన్యలా మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్అందమైన చందమామలా హీరోయిన్ కృతి సనన్చీరలో మాయ చేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్అడవిలో మూవీ షూటింగ్.. రాశీఖన్నా పోజులుపెట్ డాగ్తో ఫుల్ సంతోషంగా హీరోయిన్ అంజలిరంగురంగుల డ్రస్లో మెరిసిపోతున్న భాగ్యశ్రీ View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Priyanka Jawalkar ★ (@jawalkar) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sri Divya (@sd_sridivya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) -
లాభాల బాటలో రోషన్ కనకాల 'మోగ్లీ'
యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మోగ్లీ'. గత శనివారం థియేటర్లలో రిలీజైంది. తొలివారం గడిచిలోపే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాటలోకి వచ్చింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ వసూళ్లన్నీ కలుపుకొని దాదాపు పది కోట్ల రూపాయలు సాధించిన 'మోగ్లీ'.. నిర్మాతలకు మంచి లాభాలని తెచ్చిపెట్టింది.చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయం సాధించగలవని 'మోగ్లీ' మరోసారి నిరూపించింది. ఈ మూవీలో రోషన్ నటన ఆకట్టుకుంది. విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. డైరెక్టర్ సందీప్ రాజ్ అనుకున్న బడ్జెట్లో సినిమా తీశాడు. రూ.8 కోట్లలో సినిమాని టాప్ క్యాలిటీతో పూర్తి చేశారు. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలుపుకొని రూ.10 కోట్లు వచ్చింది. -
'శంబాల' నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
ఆది సాయి కుమార్ హీరోగా చేసిన సినిమా 'శంబాల'. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం.. రాబోయే శుక్రవారం (డిసెంబరు 25) థియేటర్లలోకి రానుంది. యగంధర్ ముని దర్శకత్వం వహించగా.. అర్చన అయ్యర్, స్వసిక తదితరులు కీలక పాత్రలు చేశారు. ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఓ ఎమోషనల్ పాటని విడుదల చేశారు.'శంబాల' స్టోరీని కాస్త రివీల్ చేసేలా హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం వివరించేలా ఇది సాగుతోంది. ఇది ఇప్పుడు యూట్యూబ్లో అందరినీ అలరిస్తోంది. ఇప్పటికే 'శంబాల' మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్గా మారింది. అన్ని రకాల హక్కుల్ని అమ్మేశారు కూడా. -
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్దే గెలుపు!
బిగ్బాస్ షో.. వంద రోజుల యుద్ధానికి తెర దించే సమయం ఆసన్నమైంది. ఫైనల్ ఓటింగ్స్ నిన్నటితో ముగిశాయి. ఈసారి కామనర్ గెలుస్తాడా? లేదా తనూజ గెలిచి లేడీ విన్నర్గా చరిత్ర సృష్టించనుందా? ఆన్లైన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఓటింగ్ ట్రెండ్ ఎటువైపు బలంగా ఉంది ఓసారి చూసేద్దాం..టాప్ 5 ఫైనలిస్టులుతెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ మొదలైనప్పుడు విన్నర్ మెటీరియల్లా ఒక్కరూ కనిపించడం లేదని జనాలే అనుకున్నారు. అలాంటి సమయంలో తనూజ తన రియల్ ఎమోషన్స్ చూపిస్తూ.. కసిగా గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ముందుకొచ్చింది. కమెడియన్గా నవ్విస్తూనే, టాస్కుల్లో దులిపేస్తూ నేనున్నానంటూ ముందుకు దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. కామనర్గా వచ్చిన కల్యాణ్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అది సరిపోదుమొన్నటిదాకా రీతూతో గొడవ వల్ల కనిపించకుండా పోయిన డిమాన్ పవన్ ఫైనల్ వీక్లో మాత్రం తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. కానీ కప్పు గెలిచేందుకు ఇది సరిపోదు. గేమ్స్ అందరూ ఆడతారు.. కానీ ఆడించడం తెలిసుండాలి... స్కోప్ లేని దగ్గర కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది సంజనా. అలా ఫైనల్స్లో చోటు దక్కించుకున్న ఆమె టాప్ 5లో చివరి స్థానంతోనే సరిపెట్టుకోనుంది.ఓట్లు గుద్దిపడేసిన అభిమానులుటాప్ 5లో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా హౌస్లో కష్టపడ్డారు. వారికోసం బయట అభిమానులు కూడా బీభత్సంగానే కష్టపడ్డారు. మిస్డ్ కాల్స్, హాట్స్టార్లో ఓటింగ్తో దుమ్ము లేపారు. గత సీజన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారం ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా సంజనా చివరి స్థానంలోనే ఉంది. పవన్కు పెరిగిన ఓటింగ్మూడు, నాలుగు స్థానాలు మాత్రం మారుతూ వచ్చాయి. పవన్లో హుషారు చూసి అతడికి ఓట్లు గుద్దిపడేశారు. దీంతో అప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న ఇమ్మూ సడన్గా నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి ఇమ్మూ మళ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకినట్లు వినికిడి. అసలు సిసలైన విన్నర్ పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరుగుతోంది. వీళ్లిద్దరికీ హోరాహోరీగా ఓట్లు నమోదయ్యాయి.ఈ ఇద్దరి మధ్యే పోటీఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తనూజకు భారీగా ఓట్లు పడగా.. తర్వాత కల్యాణ్కు సడన్గా ఓటింగ్ రేంజ్ పెరిగిందంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్, మరొకరు రన్నర్గా నిలవనున్నారు. ప్రతి సీజన్లో విన్నర్, రన్నర్ మధ్య గొడవలు జరిగాయి. కానీ, ఈ సీజన్లో మాత్రమే ఇద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉన్నారు. వైరం పెట్టుకోకుండా ముందుకు సాగారు.తనూజపై అక్కసువాళ్లిద్దరూ బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇక ఆడవారికి ఆడవాళ్లే శత్రువు అన్నట్లు తనూజపై చివరి వారంలో కొందరు సెలబ్రిటీలు విషం కక్కారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పోల్స్లో కల్యాణ్ గెలిచే ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని పోల్స్ మాత్రమే తనూజ గెలుపు తథ్యమని చెప్తున్నాయి. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు!ఓటింగ్లో కూడా కల్యాణ్ బుల్లెట్ స్పీడ్లో దూసుకెళ్లాడని టాక్! మరి ఇదే నిజమై కల్యాణ్ కప్పు గెలుస్తాడా? లేదా తనూజ కోరుకున్నట్లుగా టైటిల్ ఆమె వశమవుతుందా? అనేది రేపటి గ్రాండ్ ఫినాలేలో చూడాలి! ఇది బిగ్బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు లెక్కలు తారుమారు కూడా అవొచ్చు! -
కల్యాణ్ పడాల తలకు కట్టు... అతడికేమైంది?
బిగ్బాస్ హౌస్లో ఫైనలిస్టులు ఐదుగురు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు వారిని పలకరించేందుకు దాదాపు ఐదారుగురు సెలబ్రిటీలు హౌస్లో అడుగుపెట్టనున్నారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రమోషన్స్లో భాగంగా శివాజీ, లయ, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ మొదటగా వచ్చారు. బుల్లితెర యాంకర్స్తర్వాత రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు, క్వీన్ శ్రీముఖి అడుగుపెట్టారు. ఈ మేరకు వరుస ప్రోమోలు వదులుతున్నాడు బిగ్బాస్. బీబీ జోడీ రెండో సీజన్ మొదలు కాబోతోంది.. ఈ సీజన్ నుంచి కూడా జంటలు రావాలని కోరుకుంటున్నా అని ప్రదీప్ అనగానే కల్యాణ్.. వస్తాం అన్నా అంటూ సంతోషంగా ఆన్సరిచ్చాడు. ఎలాగో ఈ షోలో పవన్-రీతూ జంటగా కనిపించడం ఫిక్స్! కల్యాణ్ తలకు కట్టుమరి తనూజ- కల్యాణ్ కూడా జోడీగా వస్తారా? లేదా? అనేది చూడాలి! ఇక శ్రీముఖి వచ్చినప్పుడు ఇమ్మూ చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. పుష్ప స్కిట్లో భాగంగా కల్యాణ్.. తనూజను గిల్లేశాడు. ఈ ప్రోమోలో కల్యాణ్ తలకు కట్టుతో కనిపించాడు. అయితే అతడికి పెద్ద గాయం ఏమీ అవలేదు. నిధి వచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించింది. అప్పుడు కల్యాణ్ తలకు చిన్న దెబ్బ తగలడంతో కట్టు కట్టారు. కాబట్టి అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు. -
'బ్లాక్ అండ్ వైట్ బోర్'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్ బర్డ్స్
బిగ్బాస్ 7 ఫేమ్ శుభ శ్రీ రాయగురు కాబోయే భర్తతో కలిసి షికార్లు తిరుగుతోంది. ఈ ఏడాది జూన్లో మనోభావాలు పాప.. నిర్మాత, నటుడు అజయ్ మైసూర్ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. వీరిద్దరూ మేజెస్టీ సాంగ్లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు.లగ్జరీ కారు కొనుగోలుఅయితే కొన్ని వారాల క్రితమే ప్రియుడి కోసం ఆస్ట్రేలియా చెక్కేసిందీ బ్యూటీ. అక్కడ కాబోయే భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ కొత్త కారు కొన్నారు. ఇప్పటికే అజయ్ దగ్గర 20కి పైగా కార్లున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా మరో లగ్జరీ కారు చేరింది. అదే మెర్సిడిస్ బెంజ్ AMG45S స్పెషల్ ఎడిషన్. ఇకనైనా మారండిఈ మోడల్ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్ కొట్టే బ్లాక్ అండ్ వైట్ కార్లకు స్వస్తి పలికి కలర్ఫుల్ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్ కలర్లో ఉంది. దీని ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్ డైరీస్, హ్యాంగ్మ్యాన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్ సాంగ్స్, పలు షార్ట్ ఫిలింస్లో నటించాడు. View this post on Instagram A post shared by Ajay Mysore (@ajay_mysore__) -
ఓటీటీలో 'ఆంధ్రకింగ్ తాలుకా'.. ప్రకటన వచ్చేసింది
రామ్ పోతినేని, ఉపేంద్ర కలిసి నటించిన మూవీ 'ఆంధ్రకింగ్ తాలుకా'.. నవంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వరుస పరాజయాల తర్వాత రామ్ భారీ అంచనాలతో ఈ మూవీని చేశారు. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు పి.మహేశ్బాబు తెరకెక్కించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే, రావు రమేశ్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు నటించారు‘ఆంధ్రకింగ్ తాలుకా’ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 25న స్ట్రీమింగ్కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ,మలయాళం, తమిళ్లో విడుదల అవుతుందని ఒక పోస్టర్ను షేర్ చేశారు. ఈ మూవీ కోసం సుమారు రూ. 60 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. అయితే, ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000-2003 మధ్యకాలంలో సాగుతుంది. సూర్య(ఉపేంద్ర) ఓ స్టార్ హీరో. ప్లాప్ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ తెప్పించే అభిమానులు ఉన్నారు. అయితే వరుసగా తొమ్మిది సినిమాలు డిజాస్టర్ కావడంతో.. తన కెరీర్లో 100వ మూవీతో ఎలాగైన భారీ హిట్ కొట్టాలనే కసితో ఉంటాడు. అయితే 100వ సినిమా షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే ఆగిపోతుంది. ఇక సినిమా చేయలేనంటూ నిర్మాత చేతులెత్తేస్తాడు. ఆ సినిమా పూర్తి చేయాలంటే మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ డబ్బు కోసం మరో నిర్మాతకు ఫోన్ చేస్తే.. తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా..తర్వాత ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటాడు.ఈ విషయం నిర్మాతకు చెప్పేలోపే.. సూర్య అకౌంట్లో రూ. 3 కోట్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బు ఎవరేశారని ఆరా తీయగా..తన వీరాభిమాని సాగర్(రామ్ పోతినేని) గురించి తెలుస్తుంది. రాజమండ్రి సమీపంలోని గోడపల్లిలంక అనే ఒక చిన్న పల్లెటూరికి చెందిన సాగర్కు అంత డబ్బు ఎలా వచ్చింది? అసలు సాగర్కి హీరో సూర్య అంటే ఎందుకు అంత పిచ్చి? ప్రియురాలు మహాలక్ష్మీ(భాగ్యశ్రీ బోర్సె)ని దక్కించుకోవడం సాగర్ చేసిన చాలెంజ్ ఏంటి? ఆ చాలెంజ్లో సాగర్ గెలిచాలడా ఓడాడా? హీరోపై ఉన్న అభిమానం..సాగర్ని, తన ఊరిని ఎలా మార్చేసింది? అభిమానిని వెతుక్కుంటూ వచ్చిన హీరో సూర్యకి.. తెలిసొచ్చిన విషయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. -
బిగ్బాస్ 9కి ప్రాణం పోసింది.. సంజనా రియల్ గేమర్!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్పై ఎటువంటి బజ్ లేనప్పుడు షోకి ప్రాణం పోసింది సంజన గల్రానీ. గప్చుప్గా గుడ్డు దొంగతనం చేసి అందదరూ గొడవపడేలా చేసింది. ఒక్కక్కరి నిజస్వరూపాలు బయటపడేలా చేసింది. తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఫినాలేలో అడుగుపెట్టింది. అన్నింటికీ ధైర్యంగా నిలబడే సంజనా.. గార్డెన్ ఏరియాలో కొడుకు ఫోటోను చూడగానే ఏడ్చేసింది. కన్నీళ్లు పెట్టుకున్న సంజనాఅరగంటలో వస్తానని అబద్ధం చెప్పి బిగ్బాస్ హౌస్లో 100 రోజులు ఉన్నానని సారీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు మరో జీవితాన్నిచ్చిన బిగ్బాస్ను గాడ్ ఫాదర్గా అభివర్ణించింది. తర్వాత బిగ్బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. దాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మీ ధైర్యమే..సీజన్ 9 మొదటి కెప్టెన్గా నిలిచి ఆరంభం నుంచి ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి అనేలా ఆడారు. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు(ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. ఇంట్లో అందరికీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. మీ ప్రతి ఎమోషన్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలన్న మీ నిర్ణయం, ధైర్యం వారిని మీకు మరింత చేరువ చేసింది. ఎవరికీ అర్థం కాని గేమర్అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరి గుర్తింపు వారి చేతుల్లోనే ఉందని బలంగా నమ్మారు. టాస్కులో పోటీపడ్డా, సంచాలక్గా ఉన్నా, వంటగదిలో ఉన్నా, బెడ్ రూమ్లో కబుర్లు చెప్తున్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. సంజనా సైలైన్సర్గా, సంజూ బాబాగా, మమ్మీగా ఎవరికీ అర్థం కాని గేమర్గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించారు. మొండిధైర్యం మీ సొంతంఆటలో మిగతావారు మీకన్నా బలంగా ఉన్నా, వారికి మిగతావారి మద్దతు ఉన్నా మీరెప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీద ఆధారపడి ఆడటానికి ఈ ఇంట్లోకి రాలేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్నిక్కడి వరకు తీసుకొచ్చింది. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. అదే మీ కన్నీళ్లకు కారణంమీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకు దగ్గరైనవారితో అభిప్రాయభేదాలు వచ్చాయి. అది మీ మనసును ఎంతో బాధపెట్టింది. మీ కన్నీటికి కారణమైంది. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒకరోజు మీ బాబు, ఐదు నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు అని పొగిడాడు. తర్వాత జర్నీ వీడియో చూపించగా సంజనా ఉప్పొంగిపోయింది. అందులో తన అల్లరి, ప్రాంక్స్.. సీక్రెట్ రూమ్కు వెళ్లిరావడం.. గొడవలు.. ఇలా అన్నీ చూపించారు. -
హైదరాబాద్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం..
హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (TSFDC), తెలంగాణ ప్రభుత్వ సంస్కృతి, యువజన, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల అంతర్జాతీయ ఉత్సవం నిర్వహించబడుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు. గౌరవ అతిథిగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ వేడుక హైదరాబాద్కు మాత్రమే కాకుండా తెలంగాణతో పాటు భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.యూరప్, అమెరికా వంటి దేశాలతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 700కు పైగా లఘు చిత్రాలు ఈ ఫెస్టివల్కు వచ్చాయి. హైదరాబాద్లోని ప్రసాద్స్ ఐమాక్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి TSFDC చైర్మన్ దిల్ రాజు అధ్యక్షత వహించారు. I&PR స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రముఖ చిత్రనిర్మాతలు, విమర్శకులు, స్క్రీన్ రైటర్లు జూడీ గ్లాడ్స్టోన్, మైథిలి రావు, నగేష్ కుకునూర్, లిమా దాస్ కూడా హాజరయ్యారు.బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించిన జహాన్ అనే లఘుచిత్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ రేసులో ఉంది. ఈ మూవీ ఇటీవల ముంబైలో జరిగిన లేక్సిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. -
ప్రముఖ నటుడు మృతి.. పృథ్వీరాజ్ సంతాపం
మలయాళ చిత్రసీమలో నటుడిగా, రచయితగా, చిత్రనిర్మాతగా మహోన్నత ఉనికిని చాటుకున్న శ్రీనివాసన్(69) శనివారం కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలుగా మలయాళ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారు. డయాలసిస్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఉదయం 8.30 గంటలకు ఆయన మరణించారు. శ్రీనివాసన్ నటుడు మాత్రమే కాదు రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత కూడా..! దాదాపు 225 పైచిలుకు సినిమాల్లో నటించారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డులతో పాటు పలు పురస్కారాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన కుమారుడు వినీత్ శ్రీనివాసన్ కూడా సినీ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. 'ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ' అనే చిత్రంతో తెలుగువారికి దగ్గరయ్యాడు.శ్రీనివాసన్ మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందించారు. మలయాళ పరిశ్రమ గొప్ప రచయిత,దర్శకుడు,నటుడిని కోల్పోయింది. ఆయనకు వీడ్కోలు చెప్పడం కష్టంగా ఉంది. కానీ, వెండితెరపై మీరు పంచిన నవ్వులు ఎప్పటికీ ఉంటాయి. పరిశ్రమ కోసం మీరు చేసిన పనులకు ధన్యవాదాలు. అంటూ పేర్కొన్నారు. -
సల్మాన్ ఒక్క ఎపిసోడ్కు అందుకునేది.. నాగ్కు మొత్తం సీజన్కు అందుతుంది..
నాటకీయ నామినేషన్ల నుంచి ఊహించని ఎలిమినేషన్ల వరకు, బిగ్ బాస్ అనే రియాల్టీ షో వీక్షకుల్లో ఎల్లప్పుడూ కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఆదరణను కాపాడుకుంటూ వస్తోంది. ఈ షో విజయానికి దాని కాన్సెప్ట్తో పాటు దాని హోస్ట్లు కూడా ప్రధాన కారణమే అనేది నిస్సందేహం. ఆధిపత్యం చెలాయించే ప్రవర్తనతో సల్మాన్ ఖాన్ కావచ్చు, సహజసిద్ధమైన కూల్ అట్రాక్షన్తో నాగార్జున కావచ్చు, పెద్దరికపు ఆప్యాయత కనబరిచే మోహన్లాల్ కావచ్చు...దేశంలో పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోకు తమదైన ప్రత్యేకతను తీసుకువచ్చారనేది వాస్తవం. అయితే ఆ పెద్ద ఇల్లును అంత బాధ్యతగా నిర్వహిస్తున్న, ఈ సెలబ్రిటీ హోస్ట్ లు తాజా సీజన్లో అందుకున్న పారితోషికం వివరాలు చూద్దామా?సహజంగానే అత్యంత భారీ స్థాయిలో వీక్షకులు ఉంటారు కాబట్టి బిగ్ బాస్ హిందీ వెర్షన్ హోస్ట్గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అందరిలోనూ ముందున్నారు. సుమారు 15 వారాంతాల్లో హోస్ట్గా ఆయన వ్యవహరిస్తారు. మొత్తం 13 సీజన్ల పైగా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్ ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేశారని వార్తలు వచ్చినప్పటికీ సల్మాన్ దాన్ని కొట్టిపారేశారు. అందుతున్న నివేదికల ప్రకారం, సల్మాన్ ప్రారంభంలో వారానికి సుమారు రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నారు, ఆ తర్వాత దానిని ఎపిసోడ్కు రూ. 25 కోట్లకు పెంచారు. తాజా సీజన్ బిగ్ బాస్ 16 కోసం ప్రతి ఎపిసోడ్కు రూ. 43 కోట్లకు చేరినట్లు సమాచారం. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తమిళ బిగ్బాస్ రియాలిటీ టీవీ షో 7వ సీజన్కు తీసుకున్న పారితోషికం రూ. 130 కోట్లు అని సమాచారం. అయితే, గత రెండు సీజన్లకు హోస్ట్గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నారు. తను కూడా సుమారుగా రూ. 50 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.హిందీ వెర్షన్ విజయం తర్వాత, బిగ్ బాస్ కన్నడ వెర్షన్ 2013లో ప్రారంభమైంది. కన్నడ షో మొత్తం 11 సీజన్లకు కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ సంజీవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత 2015లో కలర్స్ ఛానెల్తో అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఐదేళ్లకు గాను ప్రారంభంలో రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అభిమానులు అతని పారితోషికాన్ని సల్మాన్తో పోల్చడం ప్రారంభించారు. ఇటీవలి సీజన్కు అతని పారితోషికం బాగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.దక్షిణాన కేరళలో, మోహన్లాల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ... దాని నాటకీయ ఎలిమినేషన్లు షాకింగ్ ట్విస్ట్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీని విజయంలో మోహన్లాల్ హోస్టింగ్ నైపుణ్యం ప్రధాన ఆకర్షణగా ఉంది, ఈ మలయాళ వెర్షన్ 2018లో ప్రారంభమై వేగంగా ప్రజాదరణ పొందింది. సీనియర్ నటుడు మోహన్లాల్ మొదటి సీజన్కు రూ. 12 కోట్లు, ఆయన తాజా సీజన్కు సుమారు రూ. 24 కోట్లు అందుకున్నారని అంచనా.తెలుగు వారి అభిమాన హీరో అక్కినేని నాగార్జున వరుసగా బిగ్బాస్ ఆరవ సీజన్కు హోస్ట్గా వ్యవహరించారు. నివేదికల ప్రకారం, ఆయన తొలిదశలోప్రతి ఎపిసోడ్కు రూ. 12 లక్షలు చొప్పున మొత్తం సీజన్కు రూ. 12 కోట్లను అందుకున్నారు.అయితే తాజా సీజన్కు ముందు ఆయనకు రూ. 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, తాజా సీజన్ కోసం ఆయన తన ఫీజును అమాంతం 30 కోట్ల రూపాయలకు పెంచినట్లు సమాచారం. ఫరెవర్ కూల్గా, అదే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ హౌస్లోని వారిని సమన్వయం చేయడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ నాగ్ విజయవంతం అవడంతో... ఈ షో పాప్యులారిటీకి ఆయన కీలకంగా మారారు. -
విన్నర్ రేంజ్ ఎలివేషన్...మీసం మెలేసిన కల్యాణ్
బిగ్బాస్ షోలో హౌస్మేట్స్ ఫైనల్ వీక్ను సరదాగా గడిపేస్తున్నారు. కాఫీ పంపిస్తే డిమాన్ పవన్కు చీర కట్టి అందంగా రెడీ చేసి డ్యాన్స్ వేయిస్తాం అన్నారు. అన్నట్లుగానే పవన్ను అమ్మాయిగా ముస్తాబు చేసి ఓ ఆటాడుకున్నారు. తర్వాత కల్యాణ్ జర్నీ వీడియో ప్లే చేశారు. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేయండి..ఆడవేషం కట్టిన పవన్ఆడవేషంలో ఉన్న పవన్ డ్యాన్స్తో ఎపిసోడ్ ఉత్సాహంగా మొదలైంది. వీళ్ల జోష్ చూసిన బిగ్బాస్ కాఫీ పౌడర్తో పాటు ఏకంగా మటన్ పంపించాడు. తర్వాత కల్యాణ్ గార్డెన్ ఏరియాలో తన కటౌట్ చూసుకుని మురిసిపోయాడు. బిగ్బాస్ మాట్లాడుతూ.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ.. కానీ, జీరోగా ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్నిపరీక్షను దాటి సొంతం చేసుకున్నారు.ఓనర్గా మొదలై...ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్నిచ్చారు. ఓనర్గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం.. మొదట్లో సులువుగా అనిపించినా పోనుపోను ఎన్నో కఠినమైన పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితేకానీ, మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే కానీ.. ముందుకు కదల్లేని పరిస్థితిలో ఒకరి స్నేహం మీకు బాసటగా నిలిచింది.కుంగదీసినా తేరుకున్నారుమీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. ధైర్యాన్ని నింపింది. వారికోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ప్రయాణం మొదలుపెట్టినవారందరూ ఒక్కొక్కరిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. తప్పులను సరిచేసుకున్నారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. గుండె బలంతో..బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించినది గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలోని యోధుడిని నిద్ర లేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ చివరి కెప్టెన్గా నిలిచారు.ఎంతోమందికి దిక్సూచిలా..అంతేక కాక ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్ తల్చుకుంటే ఏం చేయగలడో ప్రపంచానికి తెలిసేలా చేశారు. లక్ష్మణ్ రావు- లక్ష్మీల కొడుకు కల్యాణ్ అనే మాట ఇప్పటివరకు! కానీ వీళ్లు కల్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్ ఎగరేసే గర్వాన్ని అందించారు. గొప్ప కలలు కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్కు దిక్సూచిలా నిలిచి, స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో చూపించాడు. అది చూసిన కల్యాణ్ ఆనందంతో మీసం మెలేశాడు. అయితే తనూజ జర్నీ వీడియోలో హైప్ ఇచ్చే మూమెంట్ ఒక్కటి కూడా లేదు.. కానీ కల్యాణ్ వీడియో మొత్తం హైప్తో నిండిపోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
నా కూతురిని హీరోయిన్ చేస్తా: దేవయాని
తమిళ చిత్ర పరిశ్రమలో మరో వారసురాలు కథానాయకిగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవుతున్నారా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. కోలీవుడ్ సక్సెస్ఫుల్ దంపతులుగా రాణిస్తున్న అతి కొద్ది జంటల్లో దర్శకుడు రాజకుమార్, దేవయాని. నటి దేవయాని గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం ఉండదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ కథానాయకిగా రాణించారు. ఈమె దర్శకుడు రాజకుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. కాగా దర్శకుడు రాజకుమార్ అజిత్, పార్తీపన్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన నీ వరువాయా ఎన్నా అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆపై దర్శకుడిగా చిత్రాలు చేయకపోయినా నటిస్తున్నారు. ఈయన తన పెద్ద కూతురు ఇనియను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ తన పెద్ద కూతురు ఇనియను హీరోయిన్గా పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే అందులో నటుడు విజయ్ వారసుడు జెసన్ సంజయ్ను హీరోగా నటింపజేస్తానని చెప్పారు. నటుడు విజయ్తో చిత్రం చేసే అవకాశం రాలేదు అనీ, ఆయన వారసుడితోనైనా చిత్రం చేస్తానని చెప్పారు. జెసన్ సంజయ్, ఇనియ జంటగా నటించే చిత్రం కథను రెడీ చేసినట్లు చెప్పారు. అది నీరులా ఎన్పా చిత్రానికి సీక్వెల్ అని రాజకుమార్ చెప్పారు. జెసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. మరి రాజకుమార్ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. -
బతుకులు మారాలంటే..!
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు.‘‘చావు నుంచైనా తప్పించుకోవచ్చునేమో కానీ కులం నుంచి తప్పించుకోలేము రా, మన బతుకులు మారాలంటే మనకు కావాల్సింది ఒక్కటే... చదువు... చదువు... చదువు, ఒకటి పెళ్లి దగ్గర... లేకపోతే చావు దగ్గర.. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె.రాబిన్ . -
ఇది రెగ్యులర్ సినిమా కాదు: వినోద్ కుమార్
సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. వినోద్కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు బత్తల సతీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో వినోద్కుమార్ మాట్లాడుతూ– ‘‘సన్ ఆఫ్’ రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. స్క్రీన్ప్లే బేస్డ్ మూవీ. తండ్రీకొడుకుల మధ్య సాగే మంచి కథ. ఎక్కడో పర్లాకిమిడిలో చదివి, ఆ తర్వత అమెరికా వెళ్లి, తిరిగి అక్కడ్నుంచి వచ్చి, సాయి సింహాద్రి ఈ సినిమాను నిర్మించడం గ్రేట్ అచీవ్మెంట్. నటుడిగా నాకున్న అనుభవంతో చెబుతున్నాను... ఈ చిత్రదర్శకుడు మంచి ప్రతిభాశాలి.ఎంతో కమిట్మెంట్తో ఈ సినిమా చేశాడు. ప్రస్తుతం నేను గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమాలో, ‘మారెమ్మ’ చిత్రాల్లో నటిస్తున్నాను. అలాగే సుహాసినితో కలిసి ఓ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ కథ రియల్ లైఫ్లో నాకు, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది. ప్రతి కొడుకు తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. నేను చిరంజీవిగారికి అభిమానిని. ఆయనకు ఈ సినిమా చూపించాలని ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కొడుకు తన తండ్రిపై ఎందుకు కేసు వేశాడు? అన్న పాయింట్ని స్ట్రాంగ్గా చూపించాం. వినోద్కుమార్గారి కెరీర్లో ‘మామగారు’ సినిమాలా ఈ ‘సన్ ఆఫ్’ చిత్రం కూడా నిలిచిపోతుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సతీష్. ఈ కార్యక్రమంలో ‘చిత్రం’ శ్రీను, రిషి తదితరులు పాల్గొన్నారు. -
హార్డ్వర్క్ మాత్రమే మాట్లాడుతుంది: సాయిదుర్గా తేజ్
రోషన్ కనకాల, సాక్షీ మడోల్కర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో సాయిదుర్గా తేజ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పట్నుంచి మోగ్లీ క్యారెక్టర్ను చూస్తూ పెరిగాను. ఈ రోజు ఆ టైటిల్తో సినిమా రావడం అనేది చాలా ఆనందాన్నిచ్చింది. ఇండస్ట్రీలో హార్డ్వర్క్ మాత్రమే మాట్లాడుతుంది.రోషన్ అద్భుతంగా నటించాడు. రోషన్ మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. బండి సరోజ్గారు బాగా యాక్ట్ చేశారు. సందీప్గారు ఈ సినిమాను అద్భుతంగా తీశారు’’ అని అన్నారు. ‘‘నాకు సినిమా అంటే ప్రాణం... పిచ్చి. సుమారాజీవ్ల కొడుకు కదా... తనకు అంతా ఈజీగా జరిగిపోతుంది అనే మాటలు విన్నాను. నిజానికి అందరు హీరోలూ, వారి అభిమానులు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అయితే దీనికి మించి తలరాత ఉంటుంది. ఎవరి తలరాత వాళ్ల చేతుల్లోనే ఉంటుంది.దానిని నిర్వచించేది హార్డ్వర్క్, టాలెంట్, డిసిప్లెయిన్. ఈ మూడు మాత్రమే విజయాన్ని నిర్ణయిస్తాయి. నా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ నేను పెట్టాను. ప్రాణం పెట్టి పని చేశాను. ‘మోగ్లీ 2025’ సినిమాను గెలిపించిన అందరికీ థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘మేం చిన్న సినిమా తీశాం. కానీ ఆడియన్స్ పెద్ద సక్సెస్ ఇచ్చారు’’ అని చెప్పారు టీజీ విశ్వప్రసాద్. హీరోయిన్ సాక్షి, దర్శకుడు హేమంత్ మధుకర్ మాట్లాడారు. -
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్బాబు మనవడు డా. సురక్షిత్
‘‘అందరికీ మా తాతగారు ‘సోగ్గాడు’గా తెలుసు. కానీ నాకు అంతకన్నా ఎక్కువ. ఆయన ఎంత సక్సెస్ అయినా ఫ్యామిలీకి, ఫ్యాన్స్కి టైమ్ కేటాయించారు’’ అని ప్రముఖ నటుడు శోభన్బాబు మనవడు డా. సురక్షిత్ పేర్కొన్నారు. శోభన్బాబు హీరోగా నటించిన ‘సోగ్గాడు’ సినిమా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రనిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ డి. సురేష్బాబు, అభిల భారత శోభన్బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్వర్ణోత్సవం’ జరిగింది. ఈ వేదికపై డా. సురక్షిత్ ఇంకా మాట్లాడుతూ – ‘‘సోగ్గాడు’ తీసినందుకు సురేష్బాబుగారికి, ఆయన ఫ్యామిలీకి అభినందనలు.యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్నిబట్టి ‘లెజెండ్స్ మన మనసులను ఎప్పుడూ వదిలి వెళ్లరు’ అని అర్థమవుతోంది. వాళ్లపట్ల మనం చూపించే ప్రేమే ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ‘నేనింత కష్టపడ్డాను...అంత కష్టపడ్డాను’ అని మా తాతగారు ఎప్పుడూ చెప్పలేదు. కానీ మనందరికీ తెలుసు ఎంత కష్టపడ్డారో. చెన్నైలో మండుటెండల్లో సైకిలు మీద ఇంటి నుంచి స్టూడియోలకు వెళ్లడం అలా కష్టపడ్డారు. కానీ ఆ కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. అయితే ఫ్యామిలీలో ఎవర్నీ సినిమాల్లోకి వెళ్లమని ఫోర్స్ చేయలేదు. ఎవరికి నచ్చింది వారిని చెయ్యమన్నారు. అందుకే నేను మెడిసిన్ చేశాను. ఇవాళ తాతగారిని చాలా మిస్సవుతున్నాను.ఎందుకంటే నేను సాధించినవి ఆయన చూడలేదని, ఈ యాభై ఏళ్ల సంబరాలను చూడ్డానికి లేరనే వెలితి ఉంది. ఆయన లెగసీని జ్ఞాపకాల్లో ఉంచుకోవడం మాత్రమే కాదు... నా సేవల ద్వారా కాపాడుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. డి. సురేష్బాబు మాట్లాడుతూ– ‘‘మాకు ఎంతో ముఖ్యమైన ‘సోగ్గాడు’ చిత్రంలో భాగమైన శోభన్బాబు, రైటర్ బాలమురుగన్, విన్సెంట్గార్లు... ఇలా కొంతమంది ఇప్పుడు లేరు. సురేష్ప్రోడక్షన్స్ సంస్థ రీ స్టార్ట్ చేసిన సినిమా ఇది. 1975లో నాన్నగారు సురేష్ప్రోడక్షన్స్ సంస్థ పెట్టి, ఈ సినిమా తీశారు. ఆ రోజుల్లో ‘సోగ్గాడు’ ఇండస్ట్రీ రికార్డ్స్ను ఈజీగా కొట్టిందనుకుంటున్నాను. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల చూశాను.జయచిత్ర, జయసుధగార్లు బాగా నటించారు. సోగ్గాడు పాత్రని శోభన్బాబుగారు నిజాయితీగా చేయడంవల్లే ఆయన కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ వేడుకలో సుమలత, బేబీ రాణి, రోజా రమణి, వై. విజయగార్లు... ఇలా అందర్నీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇందాక పి. సుశీలగారు పాడుతున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడూ ఆమె పాటలు పాడుతున్నారు. కళ, పాటల విలువ మరోసారి తెలుస్తోంది’’ అని చెప్పారు. పి. సుశీల మాట్లాడుతూ– ‘‘యాభై ఏళ్ల పండగ ఇది. సురేష్ప్రోడక్షన్స్ సంస్థ ఎంత పెద్ద పేరు సంపాదించిందో అందరికీ తెలుసు’’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా, జోరు మీద ఉన్నావు తుమ్మెదా, రాజువయ్యా...’ తదితర పాటలను హమ్ చేశారు. అట్లూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ– ‘‘శోభన్బాబుతో తొమ్మిది సినిమాలు నిర్మించా. ఆయన నటుడు, హీరో కన్నా సినీ ఇండస్ట్రీకి ఆర్థిక మంత్రి అనిపించుకున్న వ్యక్తి. ఇంత వస్తే అంత అని లెక్కలు వేసుకునేవారు. రాజకీయాల్లోకి వెళ్లి, ఆర్థికమంత్రి అయ్యింటే బాగుండేదని ఆయనతో అనేవాడిని’’ అని తెలిపారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘శోభన్బాబుగారితో నేను 38 సినిమాలు చేశాను. ఆయనతో నా జర్నీని ఓ పుస్తకంగా రాయవచ్చు’’ అని అన్నారు. ఈ వేడుకలో పి. సుశీల తదితరులను సత్కరించారు. రచయిత, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేశ్బాబు, దర్శక–నిర్మాతలు రేలంగి నరసింహారావు, కేఎస్ రామారావు, కేవీ సత్యనారాయణ, అశోక్కుమార్, రాజు, రామసత్యనారాయణ, నటుడు రఘుబాబు, అఖిల భారత శోభన్బాబు సేవా సమితి గౌరవ అధ్యక్షుడు నరసింహారావు, చైర్మన్ సుధాకర్, కన్వీనర్ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం, భట్టి్రపోలు శ్రీనివాస్, వీరప్రసాద్, విజయ్ కుర్రా రాంబాబు, తెలంగాణ శోభన్బాబు ఫ్యాన్స్ పాల్గొన్నారు. -
'కల్లు మత్తు కాదు కదా సార్.. తాగింది దిగడానికి..' ఆసక్తిగా దండోరా ట్రైలర్
బిందుమాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దండోరా. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సమాజంలో ప్రజల మధ్య అసమానతలను తెలియజేసే కాన్సెప్ట్తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లకు రానుంది.మూవీ రిలీజ్ దగ్గర పడడంతో దండోరా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దండోరా టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు చైతూ. ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వివక్షను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో 'కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది దిగడానికి.. కులం మత్తు.. అందుకే టైమ్ పట్టింది' అనే డైలాగ్ వింటే కథేంటో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీ, నందు, రవికృష్ణ, మణిక, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to be launching the trailer of #Dhandoraahttps://t.co/sOuUJAUZlqRooted, raw and powerful this looks very promising Wishing the entire team a huge success , looking forward to watching it .In Cinemas from 25-12-25#DhandoraaOnDec25th@Afilmby_Murali… pic.twitter.com/7zL0X3WBpG— chaitanya akkineni (@chay_akkineni) December 19, 2025 -
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: గుర్రం పాపిరెడ్డిదర్శకత్వం: మురళీ మనోహర్నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదితరులువిడుదల తేదీ: డిసెంబర్ 19, 2025హాలీవుడ్ నుంచి జేమ్స్ కామెరూన్ అవతార్-3 రిలీజవ్వగా.. ఈ వారం టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు అలరించేందుకు వచ్చేశాయి. జిన్, గుర్రం పాపిరెడ్డి లాంటి థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి లాంటి డార్క్ కామెడీ థ్రిల్లర్పైనే కాస్తా బజ్ నెలకొంది. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.ఎలా ఉందంటే..డార్క్ కామెడీ థ్రిల్లర్ స్టోరీలు మన టాలీవుడ్లో కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్తో చాలా సినిమాలొచ్చాయి. కానీ కాస్తా గుర్రం పాపిరెడ్డిలో రోటీన్కు భిన్నంగా కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ కథలో డార్క్ కామెడీ కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఆసక్తికరంగా కథను మొదలెట్టిన డైరెక్టర్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. శవాల దొంగతనం.. వాటిని మార్చడం.. వాటి కోసం హీరో పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని పండించాయి. ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ సీన్స్తోనే అలరించాడు.ఫస్ హాఫ్ కథనం మొత్తం శవాల చుట్టే తిరుగుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్తో సెకండాఫ్పై ఆసక్తి పెంచేశాడు.సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడంతో ఆడియన్స్కు కొంత విసుగు తెప్పిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ మరింత ఫోకస్ చేయాల్సింది. అయితే బ్రహ్మానందం రోల్ ఆడియన్స్కు కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు స్క్రీన్పై అలరించిన తీరు ఆకట్టుకుంది. కథలో కామెడీ పండినా.. కొన్ని సీన్స్లో అనవసరంగా పెట్టారేమో అనిపించేలా ఉంటాయి. కామెడీకి అవకాశమున్నా చోట ప్రేక్షకులను నవ్వించేశాడు.సింపుల్ కథను స్వాతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలతో ముడిపెట్టి నడిపించిన తీరు ఆడియన్స్కు కనెక్ట్ అయింది. కోర్టు రూమ్ డ్రామా మొదయ్యాక కథలో సీరియస్నెస్ కనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చివరగా రెండో భాగానికి లీడ్ ఇస్తూ కథను అలా ముగించేశాడు డైరెక్టర్.ఎవరెలా చేశారంటే.లీడ్ రోల్లో నరేశ్ అగస్త్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిరియా అబ్దుల్లా సౌదామినిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మిలటరీగా రాజ్కుమార్.. చిలిపిగా వంశీధర్గౌడ్, గొయ్యి పాత్రలో జీవన్ తమ పాత్రల పరిధిలో అలరించారు. బ్రహ్మానందం తన పాత్రతో అభిమానులను మెప్పించారు. అయితే యోగిబాబు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం ఫర్వాలేదనిపించింది. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్లో ఇంకాస్తా కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్: 2.75/5 -
సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’ మూవీ రివ్యూ
రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయ్ వల్లందాస్ నిర్మాతగా వ్యవహరించాడు. నేడు(డిసెంబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కొండాపూర్ ఎస్సై రాంఖీ అలియాస్ రామ్ కుమార్(అబిద్ భూషన్) మిస్ అవుతాడు. 15 రోజులు అయినా అతని ఆచూకీ లభించదు. దీంతో రాంఖీ మిస్సింగ్ కేసును చేధించడానికి ఏసీపీ ఆనంద్ సాయి(బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్చర్ విరాట్(రోహిత్ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్పుత్)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్కి వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? విరాట్ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను ఇల్లీగల్గా ఓ గన్ని ఎందుకు కొన్నాడు? ఇంతకీ రాంఖీ బతికే ఉన్నాడా? చనిపోయాడా? ఈ కేసును ఏసీపీ ఆనంద్ ఎలా సాల్వ్ చేశాడు? ఈ కథలో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఓ వ్యక్తి మిస్ అవ్వడం.. ఆ కేసును చేధించే క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వడం.. చివరిలో అసలు హంతకులను పట్టుకోవడం.. ఈ సినిమా కథనం కూడా అలానే సాగుతుంది. అయితే పోలీసు మిస్ అవ్వడం అనేది కొత్తగా అనిపిస్తుంది. అయితే సినిమా చూస్తున్నంత సేపు… మనం గతంలో వచ్చిన కొన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు మనకు గుర్తొస్తాయి. ట్రయాంగ్ లవ్స్టోరీకి కొన్ని ట్విస్ట్లు ఆధ్యాంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఇటు కథను రన్ చేస్తూనే.. పాత్రలను పరిచయం చేస్తూ.. వెను వెంటనే ట్విస్ట్లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాను చూసే ఆడియన్కు అసలు కిల్లర్ ఎవరూ అనే క్వశ్చన్ మార్క్ క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. అలా ఆడియన్ను కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొంత వరకు సక్సెస్ అయినట్టే. ఇంటర్వెల్ వరకు పెద్దగా ట్విస్టులు ఉండవు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది. ఒక్కొక్కటి ట్విస్ట్ రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు. హర్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఇంటెన్స్ క్రియేట్ అయ్యాలా చేసింది. ఇక క్లైమాక్స్లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్… సినిమాను మలుపుతిప్పుతుంది. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ రెగ్యులర్గా చూసేవాళ్లు ఈ ట్విస్ట్ని ఊహించొచ్చు. ఫస్టాఫ్ని కాస్త బలంగా రాసుకొని..సాగదీత లేకుండా జాగ్రత్త పడితే కథనం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..మెయిన్ లీడ్లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్పుత్, అబిద్ భూషణ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సీనియర్ పోలీస్గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. అలాగే జబర్దస్త్ ఫేం రాజమౌళికి మంచి పాత్ర వచ్చింది. బాగా నటించాడు కూడా ఆయన. అలాగే మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ గడ్డం నవీన్ చిన్న పాత్ర చేసినా.. తన పరిధిలో బానే చేశాడు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ML రాజా నేపథ్య సంగీతం, పరవస్తు దేవేంద్ర సూరి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు బాగా కుదిరాయి. -
పెద్ది మూవీపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఫైర్..!
సినిమా ఇండస్ట్రీలో కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కడికీ అదో ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే మూవీలపై రివ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామేదో మేధావుల్లా ఫీలయి సినిమాలపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమా గురించి ఓనమాలు తెలియనివాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు. టాలీవుడ్ చిత్రాలపై ఎలా పడితే అలా కామెంట్స్ చేసి చాలామంది తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి యూట్యూబ్ రివ్యూవర్స్పై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఫైరయ్యారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీని ఉద్దేశించి కొందరు చేసిన కామెంట్స్పై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. ఇండస్ట్రీని ప్రయోజనం పొందుతూ కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను పరాన్నజీవి అని పిలవడం సమంజసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ ద్వారా తనతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఒక సినిమా రిలీజ్ కాకముందే నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే తాను తినే పళ్లెంలోనే ఉమ్మేసినట్లు ఉందని విశ్వక్ సేన్ ఫైరయ్యారు.ఈ వీడియో ఓ వ్యక్తి రామ్ చరణ్ పెద్ది సినిమాను ఉద్దేశించి అవహేళన చేస్తూ మాట్లాడారు. పెద్ది మూవీ స్టోరీ మీకు తెలుసా? నాకు తెలుసంటూ దర్శకుడిని కించపరిచేలా కామెంట్స్ చేశారు. ఇలాంటి స్టోరీ సినిమాకు చికిరి చికిరీలు అవసరమా? అంటూ ఎగతాళి చేశాడు. ఇది చూసిన విశ్వక్ సేన్ తనదైన స్టైల్లో వీరికి ఇచ్చిపడేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.Isn’t it fair to call someone like him a parasite to cinema? He benefits from the industry, feeds himself and his family through it, yet tries to destroy a film even before it’s released. It’s like spitting on the very plate he eats from. pic.twitter.com/WcLPOGA69k— VishwakSen (@VishwakSenActor) December 19, 2025 -
మెరిసిపోతున్న నిధి అగర్వాల్.. బార్బీ డాల్లా రుక్మిణి
అందాల అపరంజిలా హీరోయిన్ నిధి అగర్వాల్బ్లాక్-వైట్ బార్బీ బొమ్మలా రుక్మిణి వసంత్హీరోయిన్ కృతి సనన్ చెల్లి బర్త్ డే సెలబ్రేషన్చీరలో వయ్యారాలు పోతున్న దీపిక పిల్లివింటేజ్ హాలీవుడ్ బ్యూటీలా దిశా పటానీ View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by ELLE India (@elleindia) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12)మూడ్ ఇదే.. క్యూట్ అండ్ స్వీట్ సంయుక్త -
'ప్యారడైజ్'లో తెలుగు కమెడియన్.. అస్సలు ఊహించలే
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేయడమే టార్గెట్గా షూటింగ్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు సడన్గా మూవీలో మరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి చిన్నపాటి షాకిచ్చారు.'ద ప్యారడైజ్' మూవీలో నానితో పాటు మోహన్ బాబు నటిస్తున్నారు. హిందీ నటుడు రాఘవ్ జూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇది తప్పితే మిగతా నటీనటుల గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడు ఈ మూవీలో తెలుగు కమెడియన్ సంపూర్ణేశ్ బాబు కూడా ఉన్నట్లు బయటపెట్టారు. బిర్యానీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.సంపూ ఇప్పటివరకు కామెడీ సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా చేశాడు. మధ్యలో ఓసారి బిగ్బాస్ షోలో పాల్గొన్నాడు. గత కొన్నాళ్ల నుంచి అయితే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేదు. అలాంటిది ఇప్పుడు 'ప్యారడైజ్'లో మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. పోస్టర్లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే అసలు ఇది సంపూర్ణేశ్ బాబుయేనా అని సందేహం రాకమానదు.Meet @sampoornesh as 'BIRYANI' from #TheParadise ❤🔥Jadal's closest friend and the epitome of loyalty 💥💥Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥An @anirudhofficial… pic.twitter.com/psohGvSkRm— SLV Cinemas (@SLVCinemasOffl) December 19, 2025 -
‘ఓహ్!’ మూవీ రివ్యూ
రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ నటించిన తాజా చిత్రం ‘ఓహ్!’. జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా కృష్ణ, రాజు, కావ్య, దృశ్య నలుగురు ఫ్రెండ్స్ మధ్య కథ సాగుతుంది. కృష్ణ (రఘురామ్)కి క్రోమోఫోబియో అనే వింత వ్యాధి ఉంది. దాని వల్ల దృశ్య(నైనా) అనే అమ్మాయితో ఉన్న సంబంధం గుర్తించుకోలేకపోతాడు. అంతేకాదు కొత్తగా కావ్య(శృతి శెట్టి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒకవైపు జ్ఞాపకాలు లేని గతం, మరోవైపు ప్రాణప్రదమైన ప్రస్తుత ప్రేమ - ఈ రెండింటి మధ్య కృష్ణ పడే సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. మన భారతీయ గ్రంథాలలోని అంశాలను ఉపయోగించి అతను ఈ సమస్యను ఎలా అధిగమించాడు అనేది సినిమాలో ఆసక్తికరమైన అంశం.ఎలా ఉందంటే.. ఇదొక డిఫరెంట్ లవ్స్టోరీ. పురాతన శాస్త్రాలకు, ఆధునిక ప్రేమకు మధ్య ఒక అద్భుత ప్రయాణంలా ఈ సినిమా కథనం సాగుతుంది. చక్కటి ప్రేమకథతో పాటు భారతీయ గ్రంథాలలోని గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. క్రోమోఫోబియా వంటి కొత్త పాయింట్ కూడా టచ్ చేశారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. పొంతనలేని సన్నివేశాలు వచ్చి వెల్లడంతో ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినట్లుగా అనిపిస్తుంది. పైగా అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ద్వితియార్థంలోనే మెయిన్ స్టోరీ ఉంటుంది. ప్రేమ, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ సన్నివేశాలను రాసుకున్నాడు.మనదేశ సంస్కృతిని చిత్రంలో గొప్పగా చూపించారు. సైన్స్ను - మన ప్రాచీన విజ్ఞానాన్ని మేళవించి కథను నడిపించిన తీరు బాగుంది. కథ బ్యాక్ గ్రౌండ్ మనాలిలో జరగడం సినిమాకు మారింతా అందాన్ని తెచ్చింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులు, దట్టమైన అడవుల దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఎవరెలా చేశారంటే..కృష్ణ పాత్రలో రఘు రామ్ బాగా నటించాడు. గందరగోళానికి గురయ్యే యువకుడిగా, ప్రేమికుడిగా తన నటనతో మెప్పించాడు.శృతి శెట్టి & నైనా పాఠక్ ఇద్దరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ముఖ్యంగా సెంటిమెంట్, రొమాంటిక్ సన్నివేశాల్లో వీరి నటన ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నవనీత్ చారి అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తాజ్ మహల్ నేపథ్యంలో వచ్చే సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ కామెడీగా టీజర్
మాస్ జాతర తర్వాత రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ రిలీజ్కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీతో పాటు భార్య, భర్తల మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్కు నవ్వులు తెప్పిస్తున్నాయి. టీజర్ చివర్లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అనే రవితేజ కామెడీ పంచ్ డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా భార్య 4 రోజులు తినకుండా ఏడ్చింది: సుమన్
బిగ్బాస్ హౌస్లో సుమన్ను ఇష్టపడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల దగ్గర నుంచి హౌస్మేట్స్ వరకు అందరికీ అతడంటే ఇష్టమే! తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నవ్విస్తాడు. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే అతడి వైఖరికి అందరూ ఫిదా అవుతారు. కాకపోతే ఆటలో పెద్దగా సత్తా చూపించకపోయేసరికి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఫ్యామిలీ వీక్లో సుమన్ కోసం అతడి భార్య ఇంట్లోకి వచ్చింది. వచ్చీరావడమే తనూజకు దూరంగా ఉండమని చెప్పింది. మాట మార్చేసిన సుమన్ఇది ఎపిసోడ్లోనూ టెలికాస్ట్ అయింది. కానీ, ఇప్పుడేమో తన భార్య అలా అనలేదని మాట మార్చేశాడు సుమన్. తనూజకు దూరంగా ఉండమని మీ భార్య ఎందుకు చెప్పింది? అని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు సుమన్ స్పందిస్తూ.. దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజవాళ్లు బాగా ఆడుతున్నారు. మీరింకా బాగా ఆడండి అని చెప్పిందంతే! అంతే తప్ప జాగ్రత్త అని చెప్పలేదు. 4 రోజులు ఏడుస్తూనే..మీరు బాగా ఆడుతున్నారు, ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి వాళ్లలా ఆడమని నా భార్య సలహా ఇచ్చింది. అది బయటకు తప్పుగా వెళ్లింది. దానివల్ల ఆమె నాలుగురోజులపాటు తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నేను తప్పుగా ఏం చెప్పాను? అని చాలా బాధపడింది అన్నాడు. ఈ కామెంట్స్ విన్న జనాలు.. ఎపిసోడ్లో అందరం చూశాం.. ఎందుకు కవర్ చేయాలని చూస్తున్నావ్? ఆమెది ఏ తప్పూ లేకపోతే ఎందుకు ఏడవడం? అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: పిల్లాడికి అబద్ధం చెప్పి బిగ్బాస్కు.. ఏడ్చేసిన సంజనా -
గేమ్ నీ చేతుల్లోకి తీసుకున్నావ్.. డ్రామా క్వీన్!
పెళ్లి చేసుకునే వయసొచ్చినా సరే అమ్మానాన్నను వదిలేసి ఉండాలంటేనే ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. కానీ సంజనా మాత్రం గుండె రాయి చేసుకుని పిల్లాడిని, చంటిబిడ్డను వదిలేసి వచ్చింది. తన గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందే! ఏ రోజు కూడా పిల్లల పేర్లు ఎత్తి సింపతీ కోసం ప్రయత్నించలేదు. ఈ విషయంలో ఆమెను కచ్చితంగా ప్రశంసించాల్సిందే! నేడు ఆమె జర్నీ వీడియో చూపించనున్నాడు బిగ్బాస్. అరగంటలో వస్తానని..ఈ మేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో సంజనా.. తన కొడుకు ఫోటో చూసి ఏడ్చేసింది. మమ్మీ ఇంట్లో లేనందుకు సారీ.. అరగంటలో వస్తానని చెప్పి 100 రోజులైనా ఇంటికి రాలేదు.. సారీ అని కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన ప్రయాణంలో.. మీలో ఉన్నంత డ్రామా ఉంది. సీజన్ 9 మొదటి కెప్టెన్గా గెలిచి ప్రారంభం నుంచే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు.తనకంటూ ఓ మార్క్ఇంట్లో ఏది జరిగినా అది మీవల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు (ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? టాస్కుల్లో మీరు పోటీపడినా.. సంచాలకులుగా ఉన్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు.మొండిధైర్యంఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని చూసి ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు అని చెప్పాడు. సీజన్పై ఆసక్తి క్రియేట్ చేసిందే సంజనా మరి! తనకు ఆ మాత్రం ఎలివేషన్ ఇవ్వాల్సిందే! -
వారణాసి ఆలయంలో అఖండ-2 టీమ్.. నీ టైమ్ బాగుంది బ్రో!
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీ అఖండ-2. డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఒక వారం ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకోలేకపోయింది. గతంలో విడుదలై హిట్గా నిలిచిన అఖండకు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా బాలయ్య, బోయపాటి ప్రముఖ ఆలయం వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అఖండ-2 రిలీజ్ తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో బోయపాటి, బాలయ్య కనిపించడంతో భక్తులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అదే సమయంలో బాలయ్య భుజంపై ఉన్న కండువా కింద పడిపోయింది. కానీ ఫ్యాన్స్పై ఆగ్రహంతో రెచ్చిపోయే సైలెంట్గా కండువా తీసుకుని ముందుకు కదిలారు. ఇది చూసిన నెటిజన్స్ అదేంటి బాలయ్య ఇంతలా మారిపోయారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదృష్టం కొద్ది అతను బతికిపోయాడని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో చాలాసార్లు అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న సంఘటనల గురించి మనందరికీ తెలిసిందే. God of Masses #NandamuriBalakrishna garu and blockbuster director #BoyapatiSreenu garu visited the sacred city of Varanasi, took divine blessings after the Blockbuster success of #Akhanda2 🔱🔥Har Har Mahadev 🔱Book your tickets now!🎟️ https://t.co/8l5WolzzT6… pic.twitter.com/rOMNIQQ7sN— 14 Reels Plus (@14ReelsPlus) December 19, 2025 God Of Masses Nandamuri Balakrishna, Sensational Director Boyapati Sreenu Visited Varanasi Temple on the occasion of of #Akhanda2 Success pic.twitter.com/TfkCM6GqKG— idlebrain jeevi (@idlebrainjeevi) December 19, 2025 -
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నటీనటులు అత్యంత విలాసవంతమైన జీవనశైలిని గడుపుతూ ఉంటారని తెలిసిదే.. వారు "రాజులా జీవించడం" అనే పదబంధానికి నిజంగా ప్రాణం పోసుకుంటారు. వారికి సంబంధించిన ఖరీదైన ఆస్తులు తరచుగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కనీసం ఒక్కసారైనా సరే విమానంలో ప్రయాణించాలనే కోరిక ప్రతి సామాన్యుడిలో ఉంటుంది. కానీ, సినిమా నటీనటులకు సొంతంగానే కోట్ల విలువైన ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, నయనతార వంటి వారికి లగ్జరీ జెట్లు ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వీరందరూ ఒక్కోసారి పబ్లిక్ విమానంలోనే ప్రయాణం చేస్తుంటారు. కానీ, ప్రభాస్ మాత్రం ఎప్పుడు కూడా ప్రైవేట్ జెట్లలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అందుకు సంబంధించి కారణాలు కూడా ఉన్నాయి.ప్రభాస్ వాణిజ్య విమానాల్లో కాకుండా ప్రైవేట్ జెట్లలో మాత్రమే ప్రయాణించడానికి ఇష్టపడతారని సోషల్మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంలో కొందరు తనని తప్పుగా కూడా అనుకుంటూ ఉంటారు. ఇటీవల, ఒక నిర్మాతను ప్రభాస్ తన టీమ్ కోసం USAకి ప్రైవేట్ జెట్ బుక్ చేయమని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అనేక కారణాలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, మరికొందరు కొన్ని ప్రధాన అంశాలను తెలిపారు. ప్రభాస్ ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ఏదీ ఆశించరు. తన వ్యక్తిగత ప్రయాణాలు ఉంటే అందుకు కావాల్సిన డబ్బు తనే సమకూర్చుకుంటారు. సినిమాకు సంబంధించి ఏదైనా షెడ్యూల్ ఉంటే ఆయా నిర్మాతలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకానీ నిర్మాతల చేత అవసరం లేని ఖర్చులు పెట్టించరు అనే మంచి పేరు తనకు ఉంది.ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, రాజాసాబ్, సలార్2, కల్కి2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే, ఒక్కో చిత్రంలో ఒక్కో గెటప్లో ఆయన కనిపించనున్నారు. ఈ కారణం వల్లే తన లుక్ను బహిరంగంగా వెల్లడించకూడదని మేకర్స్ సూచిస్తారు. యాదృచ్ఛికంగా పబ్లిక్లో ఆయన కనిపిస్తే అతని లుక్ను లీక్ చేసి వైరల్ చేస్తారు. గతంలో ఆది పురుష్ విడుదలకు ముందు ప్రభాస్ బహిరంగ ప్రదేశంలో కనిపించగానే కొందరు ఫోటోలు తీసి వైరల్ చేశారు. దీంతో జాతీయ స్థాయి ట్రోలింగ్కు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి, వాణిజ్య విమానాల్లో ప్రయాణం చేసేందుకు ఆయన ఇష్టపడరని సమాచారం. వాస్తవంగా ప్రభాస్ జీవనశైలి ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది. ఉదార స్వభావంతో పలు సందర్భాల్లో భారీగా విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాంటి విషయంలోనైనా సరే పూర్తిగా రాజీ పడకుండా జీవిస్తారు. స్నేహితులతో కలిసి ప్రైవేట్ జెట్లలో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. సినిమా సెట్స్లో అందరికీ భోజనాలు తెప్పించి వారితో కలిసి సంతోషంగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు. ఎప్పుడు కూడా ఒక రాజులాగే ఉండాలని తన జీవనశైలిని ఆస్వాదిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన పేరులోనే రాజు ఉంది.. ప్రభాస్ జీవితం కూడా రాజులాగే ఉంటుందని తన సన్నిహితులు కూడా చెబుతుంటారు. -
'జిన్' సినిమా రివ్యూ
అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్ తదితరులు నటించిన సినిమా 'జిన్'. చిన్మయ్ రామ్ దర్శకుడు. నిఖిల్ ఎం. గౌడ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూవీ తాజాగా (డిసెంబరు 19) థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ కాలేజీలోని లైబ్రరీలో ఓ కుర్రాడికి వింత అనుభవం ఎదురవుతుంది. రాత్రి ఒక్కడే ఉండటంతో అతనికి వింత శబ్దాలు, వింత ఘటనలు తారసపడతాయి. ఓ నలుగురు కుర్రాళ్లు ఎగ్జామ్ రాసేందుకు భూతనాల చెరువు దాటి జ్ఞాన వికాస్ కాలేజీకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎదురైన సంఘటనలేంటి? ఆ బిల్డింగ్లో వీళ్లు ఎలా చిక్కుకున్నారు? చివరకు బయటపడ్డారా? ఇంతకీ 'జిన్' సంగతేంటనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఫస్ట్ హాఫ్ అంతా కూడా నలుగురు కుర్రాళ్లు, వారి అల్లరి, కాలేజీ సీన్లతో టైమ్ పాస్ అయిపోతుంది. కాసేపటికి తమకు ఏర్పడిన ప్రమాదం గురించి తెలుస్తుంది. చిన్న ట్విస్ట్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ద్వితీయార్దంలో జిన్ ఎంట్రీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, కాలేజీ బిల్డింగ్లో ఉన్న ఆత్మల గురించి రివీల్ చేస్తూ వెళ్లారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ని బాగా ముగించారు.అమిత్ రావ్ ఆకట్టుకున్నాడు. పర్వేజ్ సింబా బాగా చేశాడు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, పోలీస్ ఆఫీసర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో పర్లేదనిపించారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది. సునీల్ కెమెరా పనితనం, అలెక్స్ ఆర్ఆర్ మంచి అనుభూతి ఇచ్చింది. నవ్విస్తూనే భయపెట్టడంలో టీమ్ సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.- రేటింగ్: 2.5/5 -
ఒక కామనర్ తలుచుకుంటే.. కల్యాణ్పై 'బిగ్బాస్' ప్రశంసలు
బిగ్బాస్ తెలుగు 9 విజేత ఎవరనేది ఈ ఆదివారం ఎపిసోడ్తో తేలనుంది. అయితే, టాప్-5 కంటెస్టెంట్స్కు సంబంధించిన జర్నీ వీడియోలను బిగ్బాస్ చూపుతున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, పవన్ల బిగ్బాస్ ప్రయాణాన్ని చూపించారు. అయితే, శుక్రవారం ఎపిసోడ్స్లో కల్యాణ్ పడాల, సంజనల జర్నీ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్యాణ్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.బిగ్బాస్లో ఒక సామాన్యుడిలా కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే పాయింట్తో బిగ్బాస్ ఎలివేషన్ ఇచ్చారు. ఆటలో తనకు ఎదురైన కష్టాలను మరోసారి గుర్తుచేశాడు. గెలవాలనే కసితో ఒక్కోవారం పోరాడుతూ కెప్టెన్గా రెండుసార్లు నిలిచాడు.. ఆపై ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. తన బుద్ధి బలానికి కండ బలం తోడు కావడంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గెలుపు వైపు అడుగులు వేశాడు. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో బిగ్బాస్ షోతో కల్యాణ్ ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడంటూ.. బిగ్బాస్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. -
'పోతారు.. మొత్తం పోతారు' ఇక పవన్ను ఆపడం కష్టమే!
డిమాన్ పవన్ను అగ్నిపరీక్షలో చూసినవారంతా ఇతడు బిగ్బాస్కు సెలక్ట్ కాకపోయినా ఏం పర్లేదనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తెలుగు బిగ్బాస్ తొమ్మిదవ సీజన్లో అడుగుపెట్టాడు. అసలు ఇతడేం చేస్తాడనుకునేవారికి తన కండబలం, బుద్ధిబలం కలగలిపిన వీరుడినని నిరూపించాడు. వరుసగా రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. అయితే రీతూతో లవ్ ట్రాక్ వల్ల కాస్త నెగెటివ్ అయ్యాడు. ఓటింగ్లో దుమ్ము రేపుతున్న పవన్ఎప్పుడూ గొడవపడటం, కలిసిపోవడం.. ఇదంతా చూసేవారికి చాలా చిరాకు పుట్టించింది. కానీ రీతూ ఎలిమినేట్ అయిన వెంటనే తనలో మరో యాంగిల్ చూపించాడు. పంచ్లు వేస్తూ కామెడీ చేస్తున్నాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడుతున్నాడు. ఫైనల్లో నాలుగో స్థానంలో ఉంటాడనుకున్న పవన్ ఇప్పుడేకంగా ఓటింగ్లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ ఫైర్ ముందు నుంచి ఉండుంటే ఏకంగా విన్నర్ అయ్యేవాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బిగ్బాస్ అతడి గురించి ఏమన్నాడో చూద్దాం..నిజమైన యోధుడివి"మీ విల్పవర్, ఫిట్నెస్.. మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో.. అలాగే ఒక బలమైన పోరాటానికి ఎంత అవసరమనేది మీ ప్రయాణామే నిరూపిస్తోంది. ఎవరితో తలపడ్డా, ఏ పోటీలో నిలబడ్డా.. గెలుపు గురించి మాత్రమే తపించే తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. కామనర్గా అడుగుపెట్టిన ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు వెనక ఉన్న డిమాన్ చేసే విధ్వంసం ఏంటో వాళ్లు దగ్గరుండి చూశారు. నామినేషన్లో మీపై ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిల్చున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు. చెమటోడ్చి గెలిచారుఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్నవాడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మీకు తెలుసు. పవన్ మీరెవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. మాటల కన్నా చేతలు బలమైనవని నమ్మిన మీరు మీ చేతుల్లోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయం వైపు నడవడానికే ఉపయోగించి సఫలమయ్యారు. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. ప్రతి ఒక్కటి మీరు మీ చెమటోడ్చి చివరి వరకు పోరాడి గెలిచినదే! మనసు మాత్రం..మీకోసం ఎవరూ నిలబడకపోయినా మీకోసం మీరు వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడ్డారు. అయితే మీ మనసు మాత్రం మీకోసం తపించే మరొకరి (రీతూ) వెంట చక్కర్లు కొట్టింది. ఈ ఇంట్లో మీ గెలుపును పంచుకోవడానికి, ఓటమి నుంచి బయటకు రావడానికి ఆ బంధం తోడ్పడింది. మీలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకే గాక, మీక్కూడా పరిచయం చేసింది. కానీ, టాస్కుల్లో అయినా, తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది. మిమ్మల్ని అమాంతం మోకాళ్లపై కూర్చోబెట్టింది.పట్టువదలని పవన్ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాక్కూడా తెలుసు. కానీ, తన కోరిక కూడా మీ గెలుపే అనే విషయం మీలోని యోధుడిని తట్టిలేపింది. కర్తవ్యం వైపు నడిపించింది. సంచాలకుల తప్పు వల్ల కెప్టెన్సీ కోల్పోయినా రెట్టింపు ఉత్సాహంతో దాన్ని తిరిగి సంపాదించిన పట్టువదలని పవన్ సత్తాను మరోసారి అందరికీ గుర్తు చేశారు. పోతారు.. మొత్తం పోతారుస్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ కామనర్గా మదలై టఫెస్ట్ కాంపిటీటర్గా తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోదుడిగా టాప్ 5లో ఒకరిగా నిలిచారు" అని చెప్పాడు. అయితే మీ మనసంతా రీతూనే అని చెప్తుంటే పవన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. జర్నీ వీడియో అంతా కూడా రీతూతో కలిసున్న క్షణాలే ఉన్నాయి. తను ఎదుర్కొన్న అవమానాలు, ఆడిన ఆటలు, అమ్మ వచ్చిన జ్ఞాపకాలను చూసి ఎమోషనలయ్యాడు. చివర్లో 'పోతారు.. మొత్తం పోతారు' అనే నాని డైలాగ్తో పవన్ రేంజ్ పెంచేశాడు బిగ్బాస్.చదవండి: సీజన్ అంతా మీ చుట్టూనే.. తనూజపై బిగ్బాస్ ప్రశంసలు -
నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్పై స్పందించిన నటుడు
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, ఈ మూవీలో తండ్రీ కూతుర్లుగా నటించిన నటి సారా అర్జున్, సీనియర్ నటుడు రాకేశ్ బేడీ దురందర్ ఈవెంట్కు సంబంధించిన వేడుకలో కలుసుకున్నారు. అయితే, తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడం నెట్టింట పెద్ద దుమారం రేగింది. దీంతో భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో రాకేశ్ బేడీ స్పందించారు.‘ధురంధర్’ సినిమాలో రాకేశ్, సారా కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది . ఈ క్రమంలోనే జరిగిన ఆ మూవీ వేడుకలో వారిద్దరూ కలిశారు. సారా వేదిక పైకి రాగానే రాకేశ్ ఆమెకు ఎదురెళ్లి పలకరించే క్రమంలో ఆమె భుజంపై ముద్దు పెట్టారు. ఈ ఘటన గురించి ట్రోల్స్ రావడం చాలా బాధాకరం అంటూ రాకేశ్ బేడీ రియాక్ట్ అయ్యారు. దీనిని తప్పుగా అర్ధం చేసుకోవడం తెలివితక్కువ పని అంటూ ఫైర్ అయ్యారు. సారా తనకంటే వయసులో చాలా చిన్నదని వివరణ ఇచ్చారు. మూవీ సెట్స్లో కూడా తామిద్దరం ఒకే కుటుంబంలానే ఉన్నామన్నారు. ఈ కారణంగానే ఆమె వేదికపై కనిపించగానే దగ్గరకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఎక్కువమంది చెండాలంగా కథనాలు రాశారు. 20ఏళ్ల యువతిపై ముసలోడి ప్రేమ అంటూ రాశారు. కనీసం ఒక్కరు కూడా కుమార్తెపై ఉన్న ప్రేమ అనేలా రాయలేదని ఆవేదన చెందారు. సారా తనకు కూడా కూతురు లాంటిదేనని రాకేశ్ పేర్కొన్నారు. -
టాప్ ఓటీటీలో AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ స్ట్రీమింగ్
నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయిన పదం ఏ.ఐ.ఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్).. ఇదే టైటిల్తో ఒక వెబ్ సిరీస్ను దర్శకుడు జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించాడు. ఇందులో ‘కోర్ట్’ మూవీ ఫేం హర్ష్ రోషన్, సునీల్, వైవా హర్ష, సందీప్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేసింది.AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్కు సోషల్మీడియాలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. అందుకోసం తమకు స్థోమత లేకపోయినప్పటికీ మంచి కాలేజీలో చేర్పిస్తారు. వారి చదువుల కోసం అప్పులు చేసేందుకు కూడా వెనకాడరు. పిల్లల చదువల కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే చాలామంది తల్లిదండ్రులు ఆలోచించేది వారి ర్యాంకుల గురించే.. ఈ కాన్సెప్ట్తోనే ఈ సిరీస్ను తెరకెక్కించారు. -
సీజన్ అంతా తనూజ చుట్టూనే.. బిగ్బాసే ఒప్పుకున్నాడు!
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. టాప్ 5లో చోటు కోసం అలుపెరగని పోరాటం చేసిన హౌస్మేట్స్ దిల్ ఖుష్ చేసేందుకు జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఏవీ అయిపోయింది. తనూజ, పవన్ జర్నీ వీడియోలను ప్లే చేస్తూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్బాస్. ఆ విశేషాలను గురువారం (డిసెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం...నటనపై ప్రశంసలుముందుగా తనూజ టాలెంట్ను వర్ణించాడు బిగ్బాస్. తెరపై మీ నటన, మీరు పలికించిన భావాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని వారింట్లో కూతురిగా మార్చారు. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ, బిగ్బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు.. మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ 5లో నిల్చుని మీరెంత చిచ్చరపిడుగో నిరూపించారు.గేమ్ అంతా మీ చుట్టూనే..నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం.. అందరితో కలిసి అల్లరిచేసే విధానం మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయినవారు లేదా కలబడ్డవారు. భావోద్వేగాల గని మీరు. మనుషుల్ని మీవైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. నిందలతో నొచ్చుకున్న మనసుఈ రణరంగంలో ఎంతమంది బలమైన, తెలివైన యోధులున్నా ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. వంటగది నుంచే ఇంటిని గెలిచినతీరు ఆటలో ఎంత బలమైనవారో స్పష్టం చేస్తుంది. రీల్, రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. కేవలం బంధాల పునాదులపై ఆటాడుతారని, అందరి మద్దతు కోసం పాకులాడతారని నిందించినప్పుడు మీ మనసెంతగానో నొచ్చుకుంది. అది మీ వ్యక్తిత్వంబంధాలకు అతీతులెవరూ లేరని మీకనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకుని అవసరమైనప్పుడు అది పక్కనపెట్టి ఆట ముందుకు తీసుకెళ్లారు. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం.. కదనరంగంలో విరుచుకుపడే శివంగిలాంటి ధీరత్వం.. కత్తికి రెండువైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. జర్నీ వీడియోమిగతా వారి ఆట టాస్కులో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో, ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబసభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనూజను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణం ఓసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో ప్లే చేశారు.షాకైన తనూజఅందులో భరణితో నాన్న బంధాన్ని చూపించారు. అలాగే కల్యాణ్తో స్నేహాన్ని లవ్ట్రాక్ అన్న లెవల్లో చూపించారు. ఇదంతా చూశాక తనూజ సంతోషం పట్టలేకపోయింది. ఇదంతా ఒక కలలా ఉంది. ఎక్కడో పుట్టిపెరిగిన నన్ను ఇక్కడ నిలబడేలా చేసిన నా ఆడియన్స్కు థాంక్యూ అంటూ స్టేజీని ముద్దాడింది. కల్యాణ్తో.. వీడియో మొత్తం మనిద్దరిదే ఉందిరా, షాకైపోయానంది. అది తాను ముందే ఊహించానన్నాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత పవన్ జర్నీ వీడియో ప్లే చేశారు. -
మగధీరలా చాంపియన్ పెద్ద హిట్ కావాలి: రామ్ చరణ్
‘‘చాంపియన్’ సినిమా కోసం మూడున్నరేళ్లు పట్టిందని రోషన్ చెప్పాడు. మేము కూడా కొన్ని సినిమాలకు మూడు, నాలుగైదేళ్లు ఉన్నాం. అయితే ఎన్ని రోజులు తీశాం అన్నది కాదు. ‘చాంపియన్’ ట్రైలర్ చూస్తుంటే సినిమా అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. నా సెకండ్ ఫిల్మ్ ‘మగధీర’ ఎంత పెద్ద హిట్ అయిందో... రోషన్కి ‘చాంపియన్’ అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రామ్చరణ్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్పై ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ‘చాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘ఎన్టీఆర్కి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’, అల్లు అర్జున్కి తొలి చిత్రం ‘గంగోత్రి’, మహేశ్బాబుకి ‘రాజకుమారుడు’, నాకు ‘చిరుత’... ఇలా మాకు ముఖ్యమైన వ్యక్తి అశ్వినీదత్గారు. మేం కెరీర్ మొదలు పెట్టినప్పుడు అందరి నిర్మాతలకంటే ముందు ధైర్యంగా వచ్చి... అఫ్కోర్స్... మా వెనక ఫ్యామిలీ ఉండొచ్చు కానీ, మేం ఎలా యాక్ట్ చేస్తామో తెలీదు, మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియని టైమ్లో వచ్చి, నటుడిగా పరిచయం చేసి మరచిపోలేని జర్నీ ఇచ్చిన దత్గారికి, ఆయన ఫ్యామిలీకి థ్యాంక్స్. ఇప్పుడు రోషన్ కూడా ‘చాంపియన్’తో వస్తున్నాడు. తను హాలీవుడ్ హీరోలా, యూరోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడు... అందంగా ఉన్నాడు. ‘చాంపియన్’ చిత్ర నిర్మాతలు స్వప్న, ప్రియాంక ఇంత ప్యాషనేట్గా, హార్డ్ వర్క్తో పని చేస్తుండటం ఆశ్చర్యంగా లేదు. ఎందుకంటే దత్గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి. నాగ్ అశ్విన్గారితో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ (‘కల్కి 2898 ఏడీ’) మూవీ ఇచ్చారు. అవకాశం ఉంటే స్వప్న సినిమాస్లో ఓ సినిమా చేద్దామనుకుంటున్నాను. ఇంత ప్యాషనేట్ పీపుల్స్తో పని చేస్తే సరదాగా షూటింగ్కి వెళ్లి వచ్చేయొచ్చు. ఇక ‘చాంపియన్’కి ప్రదీప్ అద్వైతంగారి కష్టం కనిపిస్తోంది. రోషన్ పరిణతి ఉన్న నటుడిలా నటించాడంటే తనని పాత్ర కోసం చాలా బాగా తీర్చిదిద్దారు. అనస్వర మలయాళీ అయినా తెలుగు నేర్చుకుని, డబ్బింగ్ చెప్పడం చూసి ఇంప్రెస్ అయ్యాను. అన్ని విభాగాల వాళ్లు ఎంతో కష్టపడి పని చేశారు. ఈ సినిమాని ఈ నెల 25న చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు. -
ఐబొమ్మ రవి వెనుక 'ప్రహ్లాద్'.. వెలుగులోకి కొత్త విషయం
పైరసీ సినిమాల కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని మూడోసారి సైబర్క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. 12రోజుల పాటు అతన్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవితో పాటు టచ్లో ఉన్న మరికొందరి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్డీ సినిమాల్ని ఎలా పైరసీ చేస్తారనే విషయంపై పూర్తి సమాచారాన్ని ఇచ్చేశాడట.తాజాగా జరిగిన విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు రవి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారు కూడా కీలకంగా ఉన్నారని తేలింది. వీరిలో ప్రసాద్ మాత్రం రవికి పదో తరగతి స్నేహితుడని చెప్పాడట. అయితే, ప్రహ్లాద్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. అయితే, ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సును రవి తీసుకున్నాడు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉంది. చివరకు ఐబొమ్మ వెబ్సైట్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. కానీ, అతని గురించి మాత్రం ఎలాంటి వివరాలు రవి చెప్పడం లేదట. -
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
సినిమా అనే ప్రపంచంలో ఎప్పుడూ రేసు కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎలాంటి కథలతో చిత్రాలు చేసినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే. తద్వారా ఆర్థికపరమైన లాభాలు ప్రధానాంశంగా మారతాయి. సినిమా శతాబ్ది వేడుకను జరుపుకున్నా ఇప్పటికీ ఈ ఫార్ములాలో ఎలాంటి మార్పులేదు. ఉండదు కూడా. వైవిధ్యం అనేది దర్శకుడి సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు మోనాటమిని అసలు ఇష్టపడడం లేదు. అది ఏ సూపర్స్టార్ హీరోగా నటించినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు గడ్డుకాలం ఏర్పడింది.ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయన్, కూలీ మూవీతో పాటు కమలహాసన్ నటించిన థగ్ లైఫ్, విజయ్ నటించిన లియో, గోట్, అజిత్ నటించిన విడాముయర్చి , సూర్య నటించిన రెట్రో, కంగువ వంటి చిత్రాలే. అదేవిధంగా జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవన్నది జగమెరిగిన సత్యం. సినిమా, జయాపజయాలు అన్నవి నిరంత ప్రక్రియ. అయితే, ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్లు చతికిలపడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోలు, కొత్త దర్శకులు దూకుడు చూపుతున్నారు. వారు చేసిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఆదరణ లభిస్తుంది. పెద్ద హీరోల సినిమాలకు ప్రచారం ఎక్కువ. కానీ, కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉండటం లేదు.సినియర్ నటి సిమ్రాన్ కుడా ప్రస్తుతం సినిమాల విషయంలో జరుగుతున్న ఫాల్స్ ప్రచారాన్ని ఎండగట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్, 3బీహెచ్కే వంటి చిత్రాలు మంచి ప్రశంసలు అందుకొవడంతో పాటు , రెండు వారాలు దాటిన తరువాత కూడా థియేటర్లకు వెళ్లినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలే పలు కోట్ల రూపాయలు వసూళ్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మోత మోగుతోందన్నారు. అయితే అలాంటి చిత్రాలు విడుదలైన వారం తరువాత వెళితే థియేటర్లలో ప్రేక్షకులే ఉండడం లేదన్నారు. అయినప్పటికీ అంత వసూలు, ఇంత వసూలు అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సిమ్రాన్ పేర్కొన్నారు. -
కాపీ కొట్టను: శ్రీ చరణ్ పాకాల
‘‘శంబాల’లో చాలా థీమ్స్ ఉంటాయి. డైరెక్టర్ యుగంధర్కి సౌండింగ్ మీద మంచి పరిజ్ఞానం ఉంది. నేను ఎన్నో థ్రిల్లర్ సినిమాలకు పని చేశాను. కానీ ‘శంబాల’ లాంటి సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్కు పని చేయడం కొత్తగా ఉంది’’ అని సంగీత దర్శకుడు శ్రీ చరణ్పాకాల చెప్పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.ఈ సినిమాకి సంగీతం అందించిన శ్రీ చరణ్పాకాల మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పటి నుంచి మన మైథలాజికల్ స్టోరీస్ వింటూ పెరిగాను. ఆ జానర్లో రూపొందిన ‘శంబాల’కి మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ కథలో భాగంగా వచ్చే నాలుగుపాటలు అద్భుతంగా ఉంటాయి. నేను ప్రతీ సినిమాకు ఒకేలా కష్టపడతాను. ఎంత టైమ్ అయినా తీసుకుంటాను కానీ, కాపీ మాత్రం కొట్టను. ఒకవేళ స్ఫూర్తిగా తీసుకున్నా అందులో నా శైలి ఉండేలా చూసుకుంటాను’’ అని చెప్పారు. -
ఈ సినిమా ఓ కాలేజీ: సంగీత దర్శకుడు తమన్.ఎస్
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ చిత్ర సంగీతదర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘అఖండ 2: తాండవం’ కథ విన్నప్పుడే కథలో హై మూమెంట్స్ ఉన్నాయనుకున్నాం. కమర్షియల్ పంథాలో సనాతన ధర్మాన్ని కరెక్ట్గా ఆడియన్స్కు చూపించడం, అదీ బాలకృష్ణగారిలాంటి స్టార్తో చేయడం చిన్న విషయం కాదు. ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం సవాలుగా అనిపించింది.ఆడియన్స్ను ఎలా ‘అఖండ 2’ ట్రాన్స్లోకి తీసుకువెళ్లాలని ఆలోచించి, చాలా హార్డ్వర్క్ చేసి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి 73 రోజులు పట్టింది. శివుని, హనుమంతుని మంత్రాలను ఎలా చేయాలని ఆలోచిస్తూ, 20 రోజులు కసరత్తు చేశాం. కల్యాణ్ చక్రవర్తి, కాసర్ల శ్యామ్, శర్మగార్లు... ఇలా లిరిక్ రైటర్లు కూడా సంస్కృతంలో చాలా ఉన్నతమైన లిరిక్స్ రాశారు.‘అఖండ’ సినిమాకు సంగీతం ఇవ్వడం స్కూల్కి వెళ్లినట్లు ఉంటే, ‘అఖండ 2: తాండవం’ చిత్రానికి కాలేజీకి వెళ్లడం అనే ఫీలింగ్ కలిగింది. ‘గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అఖండ, ఓజీ’... ఇలా ఈ ఏడాది గ్రాండ్గా ముగిస్తున్నాను. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ‘ది రాజాసాబ్’ ఉంది. ఇక బాలకృష్ణగారి 111వ సినిమాకూ నేనే మ్యూజిక్ అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
కథలు రాస్తున్నాను: ఫరియా అబ్దుల్లా
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రంపాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను సౌధామిని అనే నర్సుపాత్ర చేశాను. డాక్టర్ కావాలనుకుంటున్న సౌదామిని జీవితంలోకి గుర్రంపాపిరెడ్డి (నరేశ్ అగస్త్య రోల్) వచ్చి, ఆమె జీవితాన్నే మార్చేస్తాడు. దీంతో ‘గుర్రంపాపిరెడ్డి’ గ్యాంగ్తో కలిసి సౌదామిని ఓ దొంగతనంలోపాల్గొనాల్సి వస్తుంది.ఆ తర్వాత ఏం జరుగుతుందనేది? సినిమాలో చూడాలి. ఈ చిత్రంలో నేను డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాను. ఈ చిత్రం కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేశాను. ఈపాటకు నేనే కొరియోగ్రఫీ చేశాను. యాక్షన్ సైకో కిల్లర్, సీరియల్ కిల్లర్ తరహా రోల్స్ చేయాలని ఉంది. ‘భగవంతుడు’ సినిమాలో విలేజ్ గాళ్గా చేస్తున్నాను. ‘మత్తు వదలరా 3’ ఉంది. సందీప్ కిషన్ మూవీలో ఓ రోల్ చేస్తున్నాను. ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఉంది. కొన్ని కథలు రాస్తున్నాను’’ అన్నారు. -
'బైరాన్పల్లి గడ్డమీదే సమాధి కావాలి'.. ఆసక్తిగా ఛాంపియన్ ట్రైలర్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే స్వాతంత్ర్యం కంటే ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బైరాన్పల్లి సంఘటన కూడా ఈ ట్రైలర్ చూపించారు. బ్రిటీష్ వారితో పోరాట సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. 'బైరాన్పల్లిలో మొదలైన తిరుగుబాటు ఆ గడ్డమీదే సమాధి కావాలి' అనే డైలాగ్ వింటే ఈ స్టోరీ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. From the pages of the history comes a revolutionary saga.The epic unfolds now.Presenting #ChampionTrailer to you all!▶️ https://t.co/dr9tYJMNMV#Champion in cinemas worldwide from DECEMBER 25th, 2025. #Roshan @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1… pic.twitter.com/rN2dxLp20z— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 18, 2025 -
'యాక్టింగ్ తెలియకపోయినా మాకు ఛాన్స్ ఇచ్చారు'.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..!
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామ్చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైజయంతీ మూవీస్ సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా దత్తు గారికి, వైజయంతి మూవీస్కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మమ్మల్ని బలంగా నమ్మి.. మాకు నటన వస్తుందో రాదో తెలియకపోయినా సినిమాలు ప్రొడ్యూస్ చేశారని అన్నారు. ఎన్టీఆర్కు స్టూడెంట్ నంబర్1, అల్లు అర్జున్కు గంగోత్రి, మహేశ్ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. ఇలా మా అందరికీ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్ దత్తుగారేనని తెలిపారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నా.. మాకు యాక్టింగ్ తెలియని టైమ్లో మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారని రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'గంగోత్రితో అల్లు అర్జున్ను, రాజకుమారుడుతో మహేశ్బాబును, చిరుతతో నన్ను హీరోగా పరిచయం చేశారు అశ్వనీదత్. ఆయనకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మాది సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ కావొచ్చు. మేం యాక్టింగ్ చేస్తామో తెలియకపోయినా మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. వైజయంతి మూవీస్ వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కొనసాగిస్తున్నారు. అంకిత భావంతో పని చేసే ఇలాంటి నిర్మాతలతో సినిమాలు చేయడం అదృష్టం. రోషన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ మూవీ పోస్టర్లలో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. నా రెండో సినిమా మగధీరలా.. రోషన్ రెండో చిత్రం ఛాంపియన్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ ఈవెంట్లో శ్రీకాంత్, దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు. -
ప్రభాస్ హీరోయిన్కు చేదు అనుభవం.. పోలీసుల యాక్షన్..!
ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఈవెంట్ వివాదానికి దారితీసింది. ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ ఒక్కసారిగా హీరోయిన్ను చుట్టుముట్టడంతో తీవ్ర అసౌకర్యానికి గురైంది. కొందరు ఏకంగా ఆమె తాకేందుకు యత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్లో హీరోయిన్కు భద్రత కల్పించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను సమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈవెంట్కు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.అసలేం జరిగిందంటే..ప్రభాస్- మారుతిల సినిమా ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్ను విడుదల చేశారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని లులూ మాల్కు హీరోయిన్ నిధి అగర్వాల్ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
ఫ్రైడే మూవీ లవర్స్కు పండగే.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం అనగానే థియేటర్ల వైపు చూస్తాం. ఏ సినిమా వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. అయితే ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు జేమ్స్ కామెరూన్ అవతార్-3 థియేటర్లకు వస్తోంది. దీంతో పాటు టాలీవుడ్ నుంచి సకుంటుబానాం, గుర్రం పాపిరెడ్డి, జిన్ లాంటి సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే అవతార్-3పైనే ఆడియన్స్లో ఎక్కువగా బజ్ ఉంది.అయితే ఫ్రైడే రోజు అనగానే ఓటీటీ ప్రియులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేవారి కోసం ఓటీటీ మూవీస్ కూడా రెడీ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి ప్రియదర్శి ప్రేమంటే, చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తూ ఆడియన్స్లో ఆసక్తి పెంచేలా ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్లు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ప్రేమంటే (తెలుగు సినిమా) - డిసెంబరు 19 రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) - డిసెంబరు 19 ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) - డిసెంబరు 19 ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) - డిసెంబరు 20అమెజాన్ ప్రైమ్ వీడియో ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - డిసెంబరు 19 హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 19 సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19 జియో హాట్స్టార్ మిసెస్ దేశ్పాండే (హిందీ సిరీస్) - డిసెంబరు 19 ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 19 సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19జీ5 నయనం (తెలుగు సిరీస్) - డిసెంబరు 19 డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) - డిసెంబరు 19సన్ నెక్స్ట్ దివ్యదృష్టి (తెలుగు సినిమా) - డిసెంబరు 19 ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) - డిసెంబరు 19ఆపిల్ టీవీ ప్లస్ బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 19లయన్స్ గేట్ ప్లే రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19 -
మీలో డ్యాన్స్ టాలెంట్ ఉందా.. అయితే ఈ అవకాశం మీ కోసమే..!
టాలీవుడ్లో డ్యాన్స్ షోలకు ఫుల్ క్రేజ్ ఉంటోంది. అందులో భాగంగానే పలు ఛానెల్స్లో డ్యాన్స్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఆట పేరుతో జీ తెలుగులో వచ్చిన డ్యాన్స్ రియాలిటీ షో ఆట. ఈ షోకు అభిమానుల నుంచి అత్యంత ఆదరణ వచ్చింది. దీంతో మేకర్స్ సరికొత్త సీజన్తో మీ ముందుకు రానున్నారు.ఇందులో భాగంగానే ఆట 2.0 పేరుతో జీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ షోలో పాల్గొగనాలనుకునే వారికోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈనెల 21 అంటే ఆదివారం హైదరాబాద్ అమీర్పేట్లోని సారథి స్టూడియోస్లో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్స్లో 18 నుంచి 60 ఏళ్ల వరకు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా 70322 23913 నంబర్కు వివరాలు పంపవచ్చని తెలిపింది. అంతేకాకుండా https://aata.zee5.com వెబ్సైట్లో వీడియో అప్లోడ్ చేసి ఆడిషన్స్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. The stage is set to let your dreams take off..Don't miss this opportunity 🕺💃Aata 2.0 auditions open now Message ‘Hi’ to 7032223913 or visit https://t.co/e5EBx9syAw and upload your 2-minute dance video to start your auditions 💥🕺💃#Aata #Aata2PointO #AataAuditions… pic.twitter.com/EY7L4lT6YJ— ZEE TELUGU (@ZeeTVTelugu) November 18, 2025 -
నటి బ్లౌజుపై వెకిలి కామెంట్.. హీరోలనూ వదల్లేదు!
ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.సినిమా ఈవెంట్స్లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...ఛీ కొట్టే ప్రశ్న'తెలుసు కదా' ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!హీరో మెటీరియల్ కాదా?దీనికంటే ముందు డ్యూడ్ సినిమా ప్రమోషన్స్లో కూడా.. ప్రదీప్ రంగనాథన్ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ అంటే అది హార్డ్ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్ కుమార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.బుద్ధి చెప్పిన మంచు లక్ష్మిహీరో మెటీరియల్ కాదని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్కు లింక్ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.స్లీవ్లెస్ బ్లౌజ్ గురించి వెకిలి కామెంట్ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.మీ బరువెంత?గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్ ఈవెంట్లో హీరోయిన్ గౌరీ కిషన్ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్మీట్లో ఓ విలేకరి.. హీరోయిన్కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే! మరి వీళ్లంతా వైరల్ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో! -
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
హైదరాబాద్ నగరంలో మరో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు వేదిక కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎంట్రీలు ఆహ్వానించగా.. అతికొద్ది సమయంలోనే 704 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో నుంచి పలువురు నిష్ణాతులైన జ్యూరీ సభ్యులు 60 లఘు చిత్రాలను, మరో 11 ఈశాన్య లఘు చిత్రాలను కలిపి మొత్తం 71 చిత్రాలను, వీటితోపాటు ప్రేక్షకులను అలరించడానికి ఐదు క్లాసిక్ సినిమాలను ఎంపిక చేశారు.వీటిలో ఈజిప్ట్, స్పెయిన్, యూఎస్ఏ, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యూకే, శ్రీలంక, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, రష్యా, యూఏఈ దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు ఖైరతాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లోని స్కీన్ నెంబర్ 4, 5లో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వహణ కమిటీ ప్యాట్రన్, అంకురం సినిమా (Ankuram movie) దర్శకులు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు జ్యూరీ కమిటీ సభ్యులు ఉమామహేవ్వరరావు వివరాలను వెల్లడించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో, దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భావి చలనచిత్ర నిర్మాతలకు, చలనచిత్ర రంగంలోకి రావాలనుకునే వారికి ఈ ఫెస్టివల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.చదవండి: ఆలోచింపచేసే.. అంగమ్మాల్ సినిమా 19న సాయంత్రం 5:30 గంటలకు ప్రసాద్స్ ఐమాక్స్లో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభిస్తారని, ఉత్తమ చిత్రాలకు 21న సాయంత్రం ఆరు గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసేందుకు నాగేష్ కుమార్, నాజర్, మైథిలిరావు, లీమాదాస్, అలెగ్జాండర్ లియోపో, డాల్టన్, శశి కుమార్ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కెమెరామెన్ మధు మహంకాళి, జర్నలిస్టు వీరయ్య పాల్గొన్నారు. -
'మనశంకర వరప్రసాద్ గారు'.. మేకింగ్ వీడియో చూశారా?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'మనశంకరవరప్రసాద్ గారు'. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాద సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. కేథరిన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.మూవీ రిలీజ్కు ఇంకా కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే మనశంకరవరప్రసాద్ గారు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్స్లో అంతా నవ్వుల సందడే కనిపిస్తోంది. ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చిరంజీవి హవాభావాలు, నయనతార నవ్వులు ఫ్యాన్స్ను అలరించేలా ఉన్నాయి.ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో సూపర్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. -
#Demonpavan: పోరాడి గెల్చావ్.. అసలైన యోధుడివి
బిగ్బాస్ ఫైనల్ వీక్ అంతా పిక్నిక్ హాలీడేలా సాగిపోతుంది. ఫైనలిస్టుల జర్నీ వీడియోలతో కాస్త ఎమోషనల్గానూ ఉంటుంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్లో ఇమ్మాన్యుయేల్ జర్నీ చూపించారు. నేడు తనూజ, పవన్ జర్నీ చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా పవన్ కోసం ఓ ప్రోమో వదిలారు.యోధుడిగా నిలబడ్డావ్'మీరు ఎవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం.. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. చెమటోడ్చి, చివరి వరకు పోరాడి గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా టాప్ 5లో నిలబడ్డారు' అని పొగిడాడు. సీజన్ అంతా తిట్టు పడ్డ పవన్.. ఎట్టకేలకు బిగ్బాస్ నోటితో పొగడ్తలు అందుకుని శెభాష్ అనిపించాడు. అతడి ఫుల్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
హీరోగా పెద రాయుడు బాలనటుడు ఎంట్రీ.. ఆసక్తిగా టీజర్
మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. -
నన్ను చదివించే స్థోమత లేదు, ఇప్పుడు పట్టాతో నిల్చున్నా!
మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఎస్తర్... "దృశ్యం" సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. రెండు తెలుగు భాగాల్లోనూ తనే నటించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.జోక్ అనుకున్నా..కొన్నేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తుండగా నాన్న ఫోన్ చేశాడు. నేనో వ్యక్తిని కలిశాను.. అతడి కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో చదువుతోందట. నువ్వు ఓసారి ఆమెతో మాట్లాడకూడదూ.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఆ ఇన్స్టిట్యూట్కు వెళ్తావేమో అన్నాడు. ఏంటి నాన్న జోక్ చేస్తున్నావా? అన్నాను. కలలో కూడా అనుకోలేదుఎందుకంటే అక్కడ చదువుకోవడమనేది మామూలు విషయం కాదు. అసలు అక్కడికి వెళ్లి చదవాలని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న పిచ్చివాడు.. ఏవేవో అనవసరమైన కలలు కంటున్నాడు అని మనసులోని నవ్వుకున్నాను. కట్ చేస్తే.. ఆయన కూతురిగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎదుట గ్రాడ్యుయేషన్ పట్టాతో నిల్చున్నాను. నిజంగా జీవితం ఎంత విచిత్రమైనదో కదా!అంత స్థోమత ఎక్కడిది?నాకు లండన్లో సీటు వచ్చిందన్న విషయాన్ని మొదట వాళ్లకు చెప్పనేలేదు. ఎందుకంటే అక్కడ చదివించేంత స్థోమత మా వాళ్లకు లేదు. అప్పటికే నా ఇద్దరు సోదరుల కోసం స్టూడెంట్ లోన్స్ తీశారు. నా దగ్గర ఎలాగో అంత డబ్బు లేదు. ఎలాంటి గ్రాంట్లు, సహాయం లభించినా.. అది సరిపోదు. అందుకే అక్కడ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన విషయమే అనిపించింది.పేరెంట్స్ అండగాకానీ ఇంట్లో వాళ్లు నాకిదెంత ముఖ్యం అనేది మాత్రమే ఆలోచించారు. డబ్బు ఎలాగోలా సమకూరుస్తాం.. నువ్వెళ్లి చదువు పూర్తి చేయు అని చెప్పి పంపారు. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు చేసే పనికి వారిపై కోప్పడతాను. కానీ వాళ్లు మాత్రం పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు అది నాకు భయంగా ఉంటుంది. అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా మన తల్లిదండ్రులు పక్కనే నిలబడ్డందుకు సంతోషంగానూ ఉంటుంది.అదే అసలు కష్టంనేను కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు దోహదపడ్డ అమ్మానాన్నకు కృతజ్ఞతలు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ సో మచ్. గతవారం ఓ ఇంటర్వ్యూలో నేనేమన్నానంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చేరడం ఒక పెద్ద ఫెయిల్యూర్ అన్నాను. కానీ అది నిజం కాదు. అసలు అందులో ప్రవేశం పొందడం కష్టమైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులతో పోటీపడటం.. ముఖ్యంగా మనతో మనం పోటీపడటమే ఎక్కువ కష్టమైన పని. చాలా నేర్చుకున్నా..దీన్ని నేను అధిగమించాను, సాదించాను. అందుకు సంతోషంగా ఉంది. LSE నన్నెంతగానో మార్చేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, విషయాలను లోతుగా ఆలోచించడం.. ప్రతిదాన్ని భిన్న కోణాల్లో చూడటం.. ఇలా చాలా నేర్చుకున్నాను అని ఎస్తర్ (Esther Anil) రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కింద పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Esther (@_estheranil) చదవండి: తొలి మూవీకే చేదు అనుభవం.. డబ్బులివ్వకుండా..: నటి -
‘శంబాల’ చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది
టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’.. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ మూవీ షూటింగ్లో కొన్ని సంఘటనలలో హీరో ఆది గాయపడ్డారని చిత్ర యూనిట్ పేర్కొంది.శంబాల మూవీని విజువల్ వండర్గా తీర్చి దిద్దే క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్లతో మేకర్లు ఆడియెన్స్ని అబ్బుర పరుస్తున్నారు. హీరోలు సైతం ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్ల్ని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటాయి. ఇక ‘శంబాల’ చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.‘శంబాల’ ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజ్కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. అన్ని రకాల బిజినెస్లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్లో ఉషా పిక్చర్స్ వంటి భారీ సంస్థలు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. -
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం
గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. అయితే, ముఖ్యంగా గోదారి గట్టున ఉన్న నిద్ర గన్నెరు చెట్టు చాలామందికి సెంటిమెంట్గా ఉండేది. అయితే, గతేడాది వర్షాలకు అది కూలిపోయింది.300 సినిమాలుకొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి.కూలిపోయిన చెట్టు.. దర్శకుడు వంశీ భావోద్వేగంసితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి–గోపిక–గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చెట్టు కూలిపోయిందని తెలియగానే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వెళ్లారు. కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు. చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్లు రాలేదన్నారు.చిగురించిన చెట్టుచెట్టు కూలిపోవడంతో చాలామంది బాధపడ్డారు. ఇక ఆ చెట్టు మళ్లీ చిగురించదని అందరూ భావించారు. అయితే, అక్కడి యువకులు మాత్రం ఆ చెట్టును ఎలాగైనా బతికించాలని అనుకున్నారు. అందుకోసం వారికి తోచిన పద్ధతులను అనుసరించారు. ఎట్టకేలకు ఎవరూ ఊహించలేని విధంగా ఆ చెట్టు మళ్లీ చిగురించింది. ప్రస్తుతం గోదారి గట్టుపై ఉన్న నిద్రగన్నేరు చెట్టు పూర్తిగా ఆకులతో కళకళలాడుతూ కనిపించడంతో స్థానికులు ఫోటోలు తీసి సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. -
శ్రీలీల చేతులు జోడించింది.. ఇకనైనా మారండ్రా బాబూ!
ఆంధ్రప్రదేశ్లో గతేడాది తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఉదంతం ఎవ్వరూ మరిచిపోలేరు. తన కుటుంబానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన సాయం గురించి బహిరంగంగా చెప్పుకోవడమే ఆమె చేసుకున్న పాపమైంది. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా మారిన కొందరు మార్ఫింగ్ ఫోటోలతో.. నీచమైన పోస్టులు పెట్టడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరో ఉదంతంలో.. జగన్ టైంలో కాకినాడ జిల్లా బెండపూడి స్టూడెంట్ మేఘన అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓర్చుకోలేకపోయారు. అక్కడ మేఘన తల్లిదండ్రులు గట్టిగా నిలబడడంతో.. ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు.. తాజాగా నటి శ్రీలీల చేసిన ఓ పోస్ట్కి.. పై రెండు ఉదంతాలకూ ఓ కనెక్షన్ ఉందనే విషయం మీకు తెలుసా?.. శ్రీలీల ఏం చెప్పిందంటే.. సోషల్ మీడియా వినియోగదారులు అసభ్యతతో కూడిన ఏఐ జనరేటెడ్ వీడియోలను ప్రోత్సహంచవద్దని ఆమె కోరింది. గీతాంజలి లాంటి ఘటనలు జరగకూడదనే చేతులు జోడించి శ్రీలీల కోరింది. చేతిలో ఫోన్ ఉంది కదా అని మీరు పెట్టే ఒక చెత్త కామెంట్కు ఎంతమంది నలిగిపోతుంటారు. ఇలాంటి ఉదంతాలు చూసైనా సరే కాస్త మారండి రా బాబు అనేలా శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ ఉంది. సోషల్మీడియాలో ట్రోల్స్కు దిగుతున్న వారిని చేతులు జోడించి ఆమె అభ్యర్థించింది. టెక్నాలజీని మంచి కోసం మాత్రమే వాడాలని శ్రీలీల కోరింది. అసభ్యత కోసం వాడి ట్రోలింగ్కు దిగకండి అని పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగి అయి ఉంటారని గుర్తుచేసింది. ఆన్లైన్లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకండి అంటూ శ్రీలీల పేర్కొంది.మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది టార్గెట్ చేస్తుంది మహిళలనే.. వీటికిసంబంధించిన కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, సినీ నటి అనసూయ, జర్నలిస్టు తులసీచందు, సింగర్ చిన్మయి, హీరోయిన్ రష్మిక, నివేధా, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే నెట్టింట ట్రోలింగ్కు గురైన మహిళల జాబితా చాలా పెద్దగానే ఉంది. నేటి సమాజంలో ప్రతి మహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ.. ఎవరూ చదవలేని రీతిలో కామెంట్లు చేస్తున్నారు.ట్రోల్స్ వెనుక ఎవరు..?.. ఫోటో మార్ఫింగ్ల బారిన పడుతుంది హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, విద్యార్థిణులు యాంకర్స్, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇలా ఒక వర్గం అని చెప్పేందుకు లేదు. చివరకు గృహిణులు కూడా ట్రోలింగ్తో పాటు ఏఐ మార్ఫింగ్ ఫోటోల దాడిలో నలిగిపోతున్నారు. అందుకే శ్రీలీల కూడా ఈ అంశం గురించి పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగిగా ఉంటారనే అంశాన్ని ట్రోలర్స్ మరిచిపోతున్నారని ఆమె పేర్కొంది. ఏఐ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి ట్రోల్స్ వెనుక దాగివున్నది ఎవరినేది చెప్పడం చాలా కష్టం వీరిపై కేసులు పెట్టినా సరే పట్టుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వారందరూ ఎక్కువగా ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025 -
'కన్నెపిట్టరో..' సాంగ్తో డెకాయిట్ టీజర్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారి సినిమాలకు కెమెరామెన్గా పని చేసిన షానిల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.టీజర్ రిలీజ్నాగార్జున నటించిన 'హలో బ్రదర్' మూవీలోని కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో పాటతోనే టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో ఓ చిన్నారి డాక్టర్వా..? అని హీరోను అడిగితే అందుకతడు దొంగ అని బదులిస్తాడు. మొత్తానికి టీజర్ అయితే అదిరిపోయింది. టీజర్ డిఫరెంట్గా బాగుందంటున్నారు అభిమానులు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. డెకాయిట్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదల అవుతోంది. -
భార్యకు విడాకులిచ్చిన 'దేవి' నటుడు
మలయాళ నటుడు, 'దేవి' సినిమా ఫేమ్ షిజు ఏఆర్ విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'ప్రీతి ప్రేమ్-నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. దయచేసి ఎటువంటి పుకార్లు సృష్టించకండి. ఇకపై మేము విడివిడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాం' అని ఇన్స్టాగ్రామ్లో ఓ లేఖ విడుదల చేశాడు.లవ్ స్టోరీషిజు మలయాళంలో హీరోగా నటించిన తొలి చిత్రం 'ఇష్టమను నూరు వట్టం'. కువైట్లో 12వ తరగతి చదువుతున్న సమయంలో ప్రీతి ఈ సినిమా చూసింది. ఇందులోని హీరో షిజు ఆమెకు తెగ నచ్చేశాడు. కట్ చేస్తే కొన్నేళ్లకు ఎయిర్హోస్టెస్గా డ్యూటీ ఎక్కింది ప్రీతి. అలా ఓసారి చెన్నై ఎయిర్పోర్టులో షిజును కలిసింది. అప్పుడే ఇద్దరూ మాట్లాడుకోవడం.. నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగాయి. ఫ్రెండ్స్గా బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవారు.ఓరోజు షిజు.. ప్రీతికి ఫోన్ చేసి నువ్వంటే నాకిష్టం అన్నాడు. టీనేజీ నుంచి ఇష్టపడుతున్న హీరో తనను ఇష్టపడేసరికి ప్రీతికి నోటమాట రాలేదు. వారం రోజుల్లో షిజు ఆమెకు మరోసారి ప్రపోజ్ చేశాడు. అప్పుడు కానీ ప్రీతికి ఓ విషయం గుర్తురాలేదు. అతడు ముస్లిం, తాను క్రిస్టియన్ అని! కొంత సమయం కావాలని అడిగింది. ఇంట్లో అడిగితేనేమో ఇద్దరి మతాలు వేరని వ్యతిరేకించారు.మతం కన్నా మనిషి వ్యక్తిత్వమే ముఖ్యమని భావించిన ప్రీతి ఎక్కువ ఆలస్యం చేయదల్చుకోలేదు. మూడు రోజుల్లోనే పెళ్లి చేసుకుందామంది. అలా 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టింది. తర్వాత కూతురి సమక్షంలో మరోసారి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ విడిపోయారు.సినిమామలయాళంలో అనేక సినిమాలు చేసిన షిజు (Shiju Abdul Rasheed) 'దేవి' మూవీతో తెలుగువారికి పరిచయమయ్యాడు. సింహరాశి, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, గౌతమ్ ఎస్ఎస్సీ, శివరామరాజు, శతమానం భవతి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగులో చివరగా రాబిన్హుడ్ మూవీలో కనిపించాడు. మలయాళ బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొనడమే కాకుండా టాప్ 5లో ఒకరిగా నిలిచాడు. ప్రీతి.. ప్రస్తుతం ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్గా రాణిస్తోంది. అలాగే ఈమె లాయర్ కూడా! View this post on Instagram A post shared by Shiju Abdul Rasheed (@shijuar) -
చిచ్చర పిడుగు తనూజ.. భారీ ఎలివేషన్ ఇచ్చిన బిగ్బాస్
బిగ్బాస్ తెలుగు 9 సోషల్మీడియాలో ట్రెండిగ్ టాపిక్.. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యుయేల్, పవన్, సంజనలు ఉన్నారు. ఈ క్రమంలో వారి జర్నీ వీడియోలను బిగ్బాస్ చూపిస్తున్నారు. ముందుగా ఇమ్మన్యుయేల్ ప్రయాణాన్ని చూపించిన బిగ్బాస్.. గురువారం ఎపిసోడ్లో తనూజ గురించి జర్నీ ఉంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ప్రోమోను బిగ్బాస్ టీమ్ వదిలింది.బిగ్బాస్లో తన జర్నీ చూసుకున్న తనూజ చాలా ఎమోషనల్ అయిపోయింది. బిగ్బాస్ హౌస్లో తనూజ కన్నీళ్లు పెట్టుకున్నా, నవ్వినా సరే నటిస్తుంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే, అలాంటి విమర్శలు చేసినవారికి సమాధానంగా బిగ్బాస్ ప్రోమో ఉంది. బిగ్బాస్ ఇల్లు నటనకు ఎలాంటి ఆస్కారం లేని చోటు అంటూ క్లారిటీ ఇచ్చారు. కత్తికి రెండువైపులా పదునైన వ్యక్తిత్వంతో హౌస్లో కొనసాగారంటూ పేర్కొన్నారు.. క్లిష్టపరిస్థితిలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని చిచ్చరపిడుగులా టాప్-5లో చేరారని భారీ ఎలివేషన్ ఇచ్చారు. -
నిధి అగర్వాల్పై చేతులు.. వీళ్లు మగాళ్లు కాదంటూ చిన్మయి ఫైర్
ప్రభాస్- మారుతిల సినిమా ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్ను విడుదల చేశారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని లులూ మాల్కు హీరోయిన్ నిధి అగర్వాల్ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నిధి అగర్వాల్ కనీసం తన కారు వద్దకు కూడా చేరుకోవడం కష్టమైంది. అయితే, అక్కడ ఉన్న బౌన్సర్లు అక్కడున్నవారిని వెనక్కి నెట్టి చివరకు నిధి అగర్వాల్ను కారు ఎక్కించారు. దీంతో నిధి ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తే.. సింగర్ చిన్మయి ఘాటుగానే స్పందిచారు. నిధి అగర్వాల్కు ఎదురైన సంఘటన చాలా దారుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులంటూ సోషల్మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. జంతువుల కంటే హీనంగా ఉన్నారంటూ చిన్మయి భగ్గుమంది. ఇలాంటి మానవ మృగాలను భూమిపై ఉంచకుండా మరో గ్రహానికి పంపించాలని కోరింది. Pack of men behaving worse than hyenas.Actually why insult hyenas. Put ‘likeminded’ men together in a mob, they will harass a woman like this. Why doesnt some God take them all away and put them in a different planet? https://t.co/VatadcI7oQ— Chinmayi Sripaada (@Chinmayi) December 17, 2025Vultures Disguised As Fans; Prabhas Starrer "The Raja Saab" Actress Nidhhi Agerwal, was literally gets Mobbed and Crushed by Fans at a Song Launch event in Hyderabad on Wednesday.#NidhhiAgerwal #Prabhas #Hyderabad #TheRajaSaab #SahanaSahana pic.twitter.com/omOzynRQcj— Surya Reddy (@jsuryareddy) December 17, 2025 -
ఇమ్మూని ఆకాశానికెత్తిన బిగ్బాస్.. ఇది కదా జర్నీ అంటే!
కొన్ని ఫుడ్ ట్రీట్స్, ఇంటినుంచి సర్ప్రైజ్లు అందుకునేందుకు బిగ్బాస్ సరదా గేమ్స్ పెడుతూ వస్తున్నాడు. ఇందులో గెలిచిన పవన్కు ఇంటినుంచి వీడియో సందేశం రాగా తనూజకు ఫ్యామిలీ ఫోటో అందింది. మరి ఈసారి ఆ సర్ప్రైజ్ ఎవరు గెల్చుకున్నారో బుధవారం (డిసెంబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..సంజనాకు వీడియో మెసేజ్బాల్స్ విసిరే గేమ్లో కల్యాణ్ గెలిచి ఒక స్టార్తోపాటు స్వీట్ పొందాడు. ప్లేయర్ ఆఫ్ దిడేగా సంజనాను ఎంపిక చేయడంతో తన చెల్లెలు, హీరోయిన్ నిక్కీ గల్రానీ వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఇక ఇమ్మాన్యుయ్యేల్ జ్యోతిష్యుడిగా మారి హౌస్మేట్స్ జాతకాలు చెప్పడంతో అందరూ పడీపడీ నవ్వారు. తర్వాత ఫైనలిస్టుల కోసం గ్రాండ్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశారు. ముందుగా ఇమ్మాన్యుయేల్ వంతు వచ్చింది. గార్డెన్ ఏరియాలో తను ఆడిన టాస్కులు, వాటి ఫోటోలు చూసి ఎమోషనలయ్యాడు. అసలైన ఎంటర్టైనర్ఇక బిగ్బాస్ మాట్లాడుతూ.. బాధ, నిరాశ, ఓటమి.. ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ, అది సాధ్యం కాదు. వాటి నుంచి తేరుకునేందుకు మనుషులు కోరుకునేది ఆనందం. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. చిన్నప్పటినుంచి కష్టాలను అనుభవించినవారికే చిరునవ్వు బలమేంటో బాగా తెలుసు. అదే బలంగా మీరు ముందుకు సాగారు. నీ ఆటతో మిగతావారి ఆటస్థాయి పెంచారు. ఇమ్మూపై బిగ్బాస్ ప్రశంసలుఇంటిసభ్యులు మీకు దగ్గరైనవారి మీద మాటలదాడికి దిగినప్పుడు మీరు మాటమార్చలేదు, అలా అని వారి తోడు వీడలేదు. మీ ఆటలో, భావాల్లో నిజాయితీగా ఉన్నారు. మంచివైపే నిల్చున్నారు. మీకు దగ్గరైనవాళ్లు చేసింది తప్పనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఇంట్లో ఎన్ని జరిగినా ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనేది ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు.అమ్మ కల నెరవేరిందిప్రేక్షకుల మనసు గెలిచేందుకు, గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు, గొప్ప చదువులూ, ఆడంబరాలు అక్కర్లేదు. వ్యక్తిత్వం ఒక్కటే అవసరం. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలన్న మీ అమ్మ కల నిజమైంది అని బిగ్బాస్ చెప్పడంతో ఆనందభాష్పాలు కార్చాడు. తర్వాత తన జర్నీ చూసుకుని ఓపక్క సంతోషిస్తూనే.. మరోపక్క గుక్క పెట్టి ఏడ్చాడు. కట్టకాలే వరకు అందర్నీ నవ్విస్తూనే ఉంటానని మాటిచ్చాడు. -
సినిమా వైఫల్యంతో నటన మానేయాలనుకున్నా: నవదీప్
టాలీవుడ్ నటుడు నవదీప్ కథానాయకుడిగా భారీ అంచనాలతో నటించిన చిత్రం లవ్ మౌళి.. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గ నిలిచింది. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్గా నటించింది. సుమారు ఏడాది తర్వాత ఈ మూవీ ఫలితం గురించి నవదీప్ రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రం రిజల్ట్ తనను భావోద్వేగ స్థాయిలో తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆయన అన్నారు.లవ్ మౌళి సినిమా వైఫల్యాన్ని గుర్తుచేసుకుంటూ.. నవదీప్ ఇలా అన్నారు. 'ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో నన్ను బాగా కుంగతీసింది. చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాం. నాపై ఈ మూవీ ఫలితం తీవ్రంగా ప్రభావితం చేసింది. చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది కూడా.. విడుదల తర్వాత వచ్చిన టాక్తో నిరాశ చెందాను. దానిని తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా జీవితంలో చాలా బాధాకరమైన అనుభవంగా అది మిగిలిపోతుంది. ఈ సినిమా విడుదల తర్వాత కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉన్నాను. పెర్త్లోని నా సోదరి ఇంట్లో దాదాపు మూడు నెలలు ఉన్నాను. ఇక నటనను పూర్తిగా మానేయాలని కూడా భావించాను. అయితే, సమయం అన్నీ మార్చేస్తుంది. కొంత కాలం తర్వాత తిరిగి ప్రయత్నాం చేయాలనిపించింది. అలా ధండోరా మూవీతో ప్రేక్షకుల వద్దకు మళ్లీ వస్తున్నాను.' అని నవదీప్ గుర్తుచేసుకున్నారు. -
ఆస్కార్ అవార్డ్స్.. 50ఏళ్ల బంధానికి బ్రేక్ వేసిన యూట్యూబ్
ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకను చూడాలని కోట్ల మంది ప్రేక్షకులు ఎదురుచూస్తారు. 1976 నుండి ఆస్కార్ అవార్డుల ప్రసార హక్కులు అమెరికాకు చెందిన ABC నెట్వర్క్ వద్ద ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా ఇదే ఛానల్లో ఆస్కార్కు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, ఇప్పుడు వారి బంధానికి యూట్యూబ్ బ్రేక్ వేసింది.ఆస్కార్ అవార్డుల వేడుకును ప్రపంచవ్యాప్తంగా లైవ్లో చూసే ఛాన్స్ను యూట్యూబ్ కల్పిస్తుంది. 2029 నుండి 2033 వరకు ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను యూట్యూబ్కి మంజూరు చేస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ABCతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ముగిసింది. అయితే, 2028లో 100వ ఆస్కార్ అవార్డులు జరగనున్నాయి. ఈ ఈవెంట్ వరకు ABC ప్రసారం చేస్తుంది. ఈ పెను మార్పు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా చూడొచ్చు అనే ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రెడ్ కార్పెట్ కవరేజ్ మరియు తెరవెనుక కంటెంట్ కూడా ఉంటుంది. -
8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ
తమిళసినిమా: ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదు. అందుకు పలు కారణాలు ఉంటాయి. ఇది చిత్రాలకు అతీతం కాదు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్నా, కొన్ని చిత్రాల విడుదలకు ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు మదగజరాజానే తీసుకుంటే నిర్మాణం పూర్తి చేసుకుని పలు అవరోధాలను ఎదురొడ్డి 12 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకుడు అయినప్పుటికీ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాంటి మ్యాజిక్ పార్టీ చిత్రానికి వర్కౌట్ అవుతుందా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. వెంకట్ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం పార్టీ.. మిర్చి శివ, జయ్, రెజీనా, రమ్యకృష్ణ, నివేదాపేతురాజ్, జయరామ్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి ప్రేమ్జీ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 8 ఏళ్ల క్రితం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇప్పటికీ తెరపైకి రాలేదు. మధ్యలో చిత్ర వర్గాలు చాలా ప్రయత్నాలు చేశారు. తాజాగా పార్టీ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పార్టీ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వెంకట్ప్రభు చిత్రాలకు కాలంతో పనిఉండదు. ఎంటర్టెయిన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పార్టీ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని భావిద్దాం. -
ప్రేక్షకులకు థ్రిల్
‘‘జిన్’ సినిమాను థియేటర్లో చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఇందులో కొత్త ప్రపంచాన్ని చూపించాం’’ అన్నారు నిర్మాత నిఖిల్ ఎం. గౌడ. అమిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్, రవి భట్, సంగీత ముఖ్య తారలుగా చిన్మయ్ రామ్ దర్శకత్వంలో నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ కానుంది. నిఖిల్ గౌడ మాట్లాడుతూ– ‘‘చిన్మయ్ రావ్ చెప్పిన ‘జిన్’ కథ కొత్తగా అనిపించి, నిర్మించాను. థ్రిల్కి గురి చేయడంతో పాటు భయపెట్టేలా ఉంటుంది. న్యూ కాన్సెప్ట్తో తెరకెక్కించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక నుంచి కన్నడ, తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. -
ఇంటర్వెల్ చూసి షాక్ అవుతారు
‘‘మా డైరెక్టర్ మురళీ మనోహర్ చెప్పిన ‘గుర్రం పాపిరెడ్డి’ కథ బాగా నచ్చింది. నేను గతంలో నటించిన చిత్రాల్లో నా క్యారెక్టర్స్ సెటిల్డ్గా ఉంటాయి. అయితే ‘గుర్రం పాపిరెడ్డి’లో నా పాత్ర కొంచెం ఎనర్జిటిక్గా నేనే లీడ్ తీసుకునేలా ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఇలాంటి మూవీ చేయలేదు. మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నరేశ్ అగస్త్య తెలిపారు. ఆయన హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. బ్రహ్మానందం, యోగిబాబు ఇతర పాత్రలు పోషించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నరేశ్ అగస్త్య విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఎదుటివాళ్లకు నవ్వొస్తుంది. అదే డార్క్ కామెడీ. ‘గుర్రం పాపిరెడ్డి’ లోని పాత్రలు ఇబ్బంది పడుతుంటే ప్రేక్షకులు నవ్వుకునేలా ఉంటాయి. సన్నివేశాలు వినోదంతో వెళుతున్నా బలమైన కథ ఉంటుంది. ఇంటర్వెల్ చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. ఈ చిత్రంలో నేనొక పని కోసం వస్తాను. ఆ పని చేసేందుకు నాకు తెలిసిన వాళ్లలో కొందరు తెలివిలేని వాళ్లను సెలెక్ట్ చేసుకుంటాను. తెలివైనవాడు తెలివితక్కువ పని చేస్తే, తెలివి లేని వాళ్లు తెలివైన పని చేస్తే వాళ్ల జీవితాల్లో వచ్చిన పరిణామాలు ఏంటి? అనేది కథ. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఫ్రీ డైవింగ్ చేస్తుంటా. అంటే ఒక్కసారి ఊపిరి పీల్చి సముద్రంలో ఎంత లోతు వెళ్లగలమో అంత లోతు వెళ్లాలి. ఇప్పటివరకు సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్లో 80 అడుగుల లోతుకు వెళ్లాను. ఇక నేను హీరోగా నటిస్తున్న ఓ తెలుగు సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి అయింది. తమిళంలో హీరోగా ఓ చిత్రం ఒప్పుకున్నాను’’ అని చె΄్పారు. -
చంద్రకళ మనసుల్లో నిలిచిపోతుంది
‘‘చాంపియన్’ కథ విన్నప్పుడు ఎమోషనల్గా అనిపించింది. సినిమాలో నేను చేసిన చంద్రకళ పాత్ర చాలా బాగుంటుంది. డైరెక్టర్ ప్రదీప్గారి సపోర్ట్తో నా క్యారెక్టర్కి ఏం కావాలో అన్నీ పర్ఫెక్ట్గా చేశాను. నా పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది’’ అని మలయాళ భామ అనస్వరా రాజన్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనస్వరా రాజన్ మాట్లాడుతూ – ‘‘వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్లాంటి సంస్థలు నిర్మించిన సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి, ఎన్నో అద్భుతమైన మెసేజ్లు పంపారు. తెలుగులో నా తొలి సినిమాని కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగు సినిమా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్,ప్రొడ్యూసర్స్ సపోర్టివ్గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పని చేస్తే మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ‘ఇట్లు మీ అర్జున’ సినిమా చేస్తున్నాను. ‘చాంపియన్’ మూవీ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. -
ఓటీటీకి సంతాన ప్రాప్తిరస్తు.. ఓకేసారి రెండింటిలో రిలీజ్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా ఓకేసారి రెండు ఓటీటీల్లో రిలీజ్ కావడం విశేషం. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ వేదికగా సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు.కథేంటంటే.. చైతన్య(విక్రాంత్) హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన స్నేహితుడి సుబ్బు(అభినవ్ గోమఠం)ని ఎంగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేయడానికి వెళ్లగా.. అక్కడ కల్యాణి(చాందిని చౌదరి) చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెది వరంగల్ అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు(మురళీధర్ గౌడ్)కు ఈ విషయం తెలిసి.. ఆమెను కలవకుండా చేసి చైతన్యను తిరిగి పంపిస్తాడు. ఓ సంఘటనతో చైతన్య, కల్యాణి మళ్లీ కలుస్తారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి..అది కాస్త ప్రేమగా మారుతుంది. ఈశ్వరరావు ఒప్పుకోడని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. బిడ్డ పుడితే ఆయనే దగ్గరకు వస్తాడని జాక్ (తరుణ్ భాస్కర్) ఇచ్చిన సలహాతో కాపురాన్ని ప్రారంభిస్తారు.కొన్నాళ్ల తర్వాత చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే.. చైతన్యకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని..బిడ్డలు పుట్టే అవకాశం లేదని చెబుతారు. ఈ విషయం భార్యకు తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు చైతన్య. అదే సమయంలో ఈశ్వరరావు వీరింటికి వస్తాడు. కూతురుతో ప్రేమగా మాట్లాడుతూనే..‘ఎలాగైన మీ ఇద్దరి విడగొట్టి నా కూతురిని తీసుకొని వెళ్తానని’ అల్లుడికి వార్నింగ్ ఇస్తాడు. ఒకవైపు పిల్లలు పుట్టరేమోననే బాధ..మరోవైపు మామ వార్నింగ్తో చైతన్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్యాణిని దక్కించుకునేందుకు ఆయన పడిన కష్టాలు ఏంటి? కూతురిని చైతన్యకు దూరం చేయడానికి ఈశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఏంటి? అవి ఫలించాయా లేదా? ఒకవైపు నాన్న..మరోవైపు భర్త చూపించిన అతిప్రేమ కల్యాణిని ఎలా ఇబ్బందికి గురి చేసింది? చైతన్యకు స్పెర్మ్కౌంట్ తక్కువ ఉందనే విషయం కల్యాణికి తెలిసిన తర్వాత ఎం జరిగింది? చివరకు చైతన్య-కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. One film.Two major OTT platforms.An interesting OTT release 📺#SanthanaPrapthirasthu streaming on both #AmazonPrime & #JioHotstar from Dec 19 🎥 pic.twitter.com/G6m0l9NL8l— Suresh PRO (@SureshPRO_) December 17, 2025 -
లిటిల్ హార్ట్స్ బ్యూటీ గ్లామరస్ లుక్.. సెల్ఫీ పోజులతో ఉప్పెన భామ కృతి శెట్టి!
మరింత హాట్హాట్గా లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని..బ్లాక్ డ్రెస్లో మెరిసిన భూమిక చావ్లా..సెల్ఫీ మూడ్లో నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్..క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సెల్ఫీ లుక్స్.. View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
డేవిడ్ రెడ్డి గ్లింప్స్.. అదంతా కల్కి బుజ్జి టీమ్ వాళ్లే: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న పీరియాడికల్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన మరియా హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన మంచు మనోజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ గ్లింప్స్లో కనిపించిన వార్ డాగ్ బైక్ గురించి మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ బైక్ను కల్కి టీమ్కు పనిచేసేవారే డిజైన్ చేశారని వెల్లడించారు. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొని తయారు చేశారని తెలిపారు. కల్కిలోని బుజ్జిని తయారు చేసిన టీమ్ ఈ వార్ డాగ్ క్రియేట్ చేశారని పంచుకున్నారు. దీని బరువు దాదాపు 700 కేజీల వరకు ఉందని మంచు మనోజ్ అన్నారు. కాగా.. ఈ బైక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అతిథి పాత్ర పోషించనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై కూడా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో అతిథి పాత్రలకు మంచి స్కోప్ ఉంది..కానీ మేము ఎవరినీ సంప్రదించలేదని అన్నారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు మంచు మనోజ్. War Dog… Ready to Roar 🔥🔥🔥Speed of #DavidReddy. A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy, something all of us will be proud of ❤️❤️ 🏍️ pic.twitter.com/Q9nGga1lSn— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇవాళ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్ ఇచ్చారు. ది రాజాసాబ్ ప్రీమియర్స్ షోలు వేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. జనవరి 8న ప్రీమియర్స్ ఉంటాయని సాంగ్ లాంఛ్ ఈవెంట్లో వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహిస్తామని తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. JAN 8th - PremieresPre Release Event in Hyderabad #TheRajaSaab— The RajaSaab (@rajasaabmovie) December 17, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సహనా సహనా అంటూ సాంగే రొమాంటిక్ లవ్ సాంగ్ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన ఈ పాట ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజనీ ఆలపించారు. ఈ పాటను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు. -
'ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై..' మంచు మనోజ్ ఫ్యాన్స్కు గూస్బంప్సే..!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మంచు మనోజ్ లుక్, వార్ డాగ్ బైక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నెేల కరిగింది' ..' ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై.. ఏ డేవిడ్ రెడ్డికా ఇండియా హై' అనే డైలాగ్స్ మంచు మనోజ్ ఫ్యాన్స్లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.ఇవాళ విడుదలైన డేవిడ్ రెడ్డి టీజర్ గ్లింప్స్ చూస్తుంటే జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్లో విజువల్స్, డైలాగ్స్, డేవిడ్ రెడ్డి బైక్ ఈ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. గ్లింప్స్ చూడగానే పీరియాడికల్ మూవీ అని చెప్పేయొచ్చు. తాజా గ్లింప్స్ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ చిత్రం కోసం మంచు మనోజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.War Dog… Ready to Roar 🔥🔥🔥Speed of #DavidReddy. A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy, something all of us will be proud of ❤️❤️ 🏍️ pic.twitter.com/Q9nGga1lSn— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025 -
టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు.. గత పదేళ్లలో ఏ సినిమాలంటే?
మరో కొద్ది రోజుల్లోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసి పోనుంది. కొత్త ఏడాది కోసం ఎన్నో కొత్త ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏటా ఏదో ఒకటి సాధించాలని గట్టిగా సంకల్పంతో నిర్ణయించుకుంటారు. అలా సినిమా ఇండస్ట్రీలోనూ ఈ ఏడాది మన సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా ఈ ఏడాదిలోనైనా విజయాలు దక్కాలని టాలీవుడ్లో దర్శక, నిర్మాతలు కోరుకుంటారు. అనుకున్నవన్నీ జరగకపోయినా.. మనకంటూ ఒక రోజు ఉంటుందని ముందడుగు వేస్తూనే ఉంటాం.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ ఏడాది మన టాలీవుడ్కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ చిత్రాలు మినహాయిస్తే ఏ ఒక్కటి కూడా రూ.500 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో రూ.500 కోట్లు అనేది కష్టసాధ్యమైన పనేమి కాదు. గత పదేళ్లలో ప్రతి ఏటా ఏదో ఒక బ్లాక్బస్టర్ హిట్ కొడుతున్న టాలీవుడ్.. ఈసారి ఎందుకో వెనకంజలో ఉంది. గతేడాది పుష్ప-2 ప్రభంజనంతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దంగల్ తర్వాత ఆల్టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.బాహుబలి-2 ప్రభంజనం.. గత పదేళ్లుగా పరిశీలిస్తే టాలీవుడ్ పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. 2016లో వచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ మూవీగా అవతరించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన బాహుబలి-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత 2018లో విడుదలైన రామ్ చరణ్ రంగస్థలం ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్బస్టర్గా నిలిచింది.బాహుబలి-2 తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీ సాహో. ఈ చిత్రం 2019లో రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ సత్తా చాటింది. ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 2020లో వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే.ఆ తర్వాత ఏడాది 2021లో రిలీజైన బన్నీ- సుకుమార్ మూవీ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.390 కోట్ల వసూళ్లతో టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. 2022లో దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇక 2023లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.701 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.పుష్ప-2 రికార్డ్..గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా అవతరించింది. ఇక 2025లో వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ.303 కోట్లతో టాలీవుడ్ నుంచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్ ఇండియా వైడ్ చూస్తే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 మొదటి ప్లేస్లో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ దురంధర్ ఈ రికార్డ్ బ్రేక్ అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
శ్రీలంకలో రష్మిక బ్యాచిలర్ పార్టీ.. తోడుగా ఆ హీరోయిన్
పాన్ ఇండియా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ఈమె నుంచి ఐదు సినిమాలు వచ్చాయి. వీటి కంటే ఈమెకు గత నెలలో హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమని ఇప్పటివరకు అటు రష్మిక గానీ ఇటు విజయ్ గానీ బయటపెట్టలేదు. కానీ ఈమె చేతికి ఉన్న రింగ్ మాత్రం ఇదంతా నిజమని చెప్పకనే చెబుతోంది.(ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు రష్మిక.. తన గర్ల్స్ గ్యాంగ్తో కలిసి శ్రీలంక ట్రిప్ వేసింది. బీచ్, రిసార్ట్స్లో ఫుల్ చిల్ అవుతూ కనిపించింది. ఈమెతో పాటు హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ కనిపించారు. మిగిలిన స్నేహితులు ఎవరనేది పెద్దగా తెలియదు.'నాకు ఈ మధ్యే రెండు రోజుల బ్రేక్ దొరికింది. నా గర్ల్స్తో పాటు చిల్ అయ్యే ఛాన్స్ దొరికింది. మేం శ్రీలంకలోని ఈ అందమైన ప్రదేశానికి వెళ్లాం. గర్ల్స్ ట్రిప్స్.. ఎంత చిన్నవి అనేది సమస్య కాదు. నా గర్ల్స్ బెస్ట్' అని రష్మిక.. తన శ్రీలంక ట్రిప్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసింది. అయితే ఇది ఈమె బ్యాచిలరేట్ పార్టీ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది కూడా. రష్మిక చేతిలో ఇప్పుడు మైసా, రెయిన్ బో అనే చిత్రాలున్నాయి.(ఇదీ చదవండి: శ్రీలీల కూడా బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ పలు రకాలుగా వినియోగంలోకి వచ్చేసింది. మిగతా విషయాల్లో ఏమో గానీ సినిమా వాళ్లకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. దీని బారిన పడగా ఇప్పుడు శ్రీలీల కూడా తనకెదురైన అనుభవాన్ని బయటపెట్టింది. కొన్నింటిని చూసి చాలా డిస్ట్రబ్ అయిపోయానని చెప్పింది.'ఏఐ నాన్సెన్స్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా. టెక్నాలజీ వినియోగానికి ఓ పద్ధతి అంటూ ఉంది. ఇది మన జీవితాల్ని సులభతరం చేయడానికి. సంక్లిష్టం చేసుకోవడానికి కాదు. నా బిజీ షెడ్యూల్స్ వల్ల బయట జరిగే చాలా విషయాలు నాకు తెలియవు. అయితే ఓ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. చాలావాటిని నేను లైట్ తీసుకుంటాను. కానీ ఇది మాత్రం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటీ నటీనటులు కూడా ఇలాంటి వాటిని అనుభవించారు. కాబట్టి మాకు అండగా నిలబడాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇకపై సంబంధిత అధికారులు ఈ విషయాన్ని చూసుకుంటారు' అని శ్రీలీల చెప్పుకొచ్చింది.అయితే రీసెంట్ టైంలో శ్రీలీల ఫొటోలని కొన్నింటిని ఏఐ టెక్నాలజీతో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు.. ఇవి నిజమే అని భ్రమపడుతున్నారు. షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఈ హీరోయిన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి అనే సినిమాల్లో నటిస్తోంది.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025 -
'కేడీ' దర్శకుడు కన్నుమూత
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) బుధవారం (డిసెంబర్ 17న) ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన దర్శకత్వం వహించిన కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ రిలీజ్కు రెడీ అవుతున్న సమయంలో దర్శకుడు మరణించడంతో చిత్రయూనిట్, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'కేడీ' సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది. దీనికంటే ముందు పలు సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. కిరణ్ కుమార్ను అందరూ ఆప్యాయంగా కేకే అని పిలుచుకుంటారు. కేకే దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు స్టార్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు.చదవండి: తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగ్ ఆన్సరిదే -
'వారణాసి' సెట్కి వస్తా కెమెరా పట్టుకుని సీన్స్ తీస్తా: 'అవతార్' డైరెక్టర్
గత నెలలో రాజమౌళి-మహేశ్ బాబు సినిమా లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. 'వారణాసి' అని టైటిల్ ప్రకటించారు. మూడున్నర నిమిషాల ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే దీన్ని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆవిష్కరిస్తారని అప్పుడు రూమర్స్ వచ్చాయి కానీ అదేం జరగలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి-జేమ్స్ కామెరూన్ మధ్య 'వారణాసి' గురించి డిస్కషన్ నడిచింది. సెట్కి వచ్చి కెమెరా పట్టుకుని సీన్స్ తీస్తానని కామెరూన్ చెప్పడం విశేషం.(ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)జేమ్స్ కామెరూన్ తీసిన లేటెస్ట్ సినిమా 'అవతార్ 3'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ 20th సెంచరీ ఫాక్స్ స్టూడియో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. రాజమౌళి ఇక్కడే ఉండగా.. వీడియో కాల్ ద్వారా కామెరూన్ జక్కన్నతో మాట్లాడారు. మిగతా విషయాలు ఏమో గానీ 'వారణాసి' గురించి చేసుకున్న డిస్కషన్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.'వారణాసి' సినిమా సంగతేంటి అని కామెరూన్ అడగ్గా.. ఏడాది నుంచి షూటింగ్ చేస్తున్నామని, మరో ఏడెనిమిది నెలల్లో పూర్తవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. 'వారణాసి' షూటింగ్, సెట్స్ చూడాలని ఉందని చెప్పిన కామెరూన్.. కెమెరా పట్టుకుని తాను కూడా కొన్ని సీన్స్ తీస్తానని అన్నారు. అలానే 'పులులతో ఏదైనా షూట్ ప్లాన్ చేస్తుంటే చెప్పు' అని కామెరూన్ సరదాగా అన్నారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. రాజమౌళి చెప్పిన దానిబట్టి చూస్తుంటే వచ్చే ఏడాది ద్వితియార్ధానికి షూటింగ్ అయిపోతుందనమాట. అంటే చెప్పినట్లు 2027 వేసవిలో రిలీజ్ చేస్తారనమాట.(ఇదీ చదవండి: ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు విరాళం) -
పేరెంట్స్గా ప్రమోషన్.. లావణ్య నుంచి సోనియా ఆకుల వరకు!
ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు. కానీ తరాలు మారుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసి చూడు, పిల్లల్ని కని చూడు అంటున్నారు. ఆ రేంజ్లో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఎంత బిజీగా ఉన్నా సరే చిన్నపాపాయి నవ్వు చూస్తే ఆ ఒత్తిడి అంతా మటాష్ అయిపోతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు కెరీర్లో సెటిల్ అవగానే పేరెంట్హుడ్ గురించి ఆలోచిస్తున్నారు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందరు. ఆ జాబితాను చూసేద్దాం....వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠికొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నవీరిద్దరు.. 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 10న బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. వీళ్లిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జంటగా నటించారు..వశిష్ట సింహ- హరిప్రియవశిష్ట సింహ- హరిప్రియ 20203 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు ఈ జంటకు మగబిడ పుట్టింది. పెళ్లిరోజునే బాబు పుట్టడం మరో విశేషం!విక్కీ కౌశల్- కత్రినా కైఫ్హీరో విక్కీ కౌశల్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఓపక్క ఛావా విజయం, మరోపక్క పుత్ర సంతానంతో గాల్లో తేలుతున్నాడు. విక్కీ- కత్రినా దంపతులలకు నవంబర్ 7న బాబు పుట్టాడు.సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీసిద్- కియారా చాలాకాలం ప్రేమలో మునిగి తేలారు. 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్లోని జైసల్మీర్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు జూలై 15న తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వచ్చినట్లు ప్రకటించారు. పాపకు సరాయా అని నామకరణం చేశారు.పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దాహీరోయిన్ పరిణీతి చోప్రా- నాయకుడు రాఘవ్ చద్దా 2023లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అక్టోబర్ 19న పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ చిన్నోడికి నీర్ అని పేరు పెట్టారు.అర్బాజ్ ఖాన్- షురా ఖాన్బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు ఈ ఏడాది అక్టోబర్5న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ కూతురికి సిపారా ఖాన్ అని నామకరణం చేశారు.రాజ్కుమార్ రావు- పాత్రలేఖసినిమాలతో బిజీ ఉండే రాజ్కుమార్- పాత్రలేఖ.. ఇద్దరూ పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది తల్లిదండ్రులుగా ఒక స్టెప్ ముందుకు వేశారు. నవంబర్ 15న తమ మూడో పెళ్లి రోజునాడే పాప పుట్టిందని ప్రకటించారు.కేఎల్ రాహుల్- అతియా శెట్టిక్రికెట్ క్రీడాకారుడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి ఈ ఏడాది మార్చిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు ఎవారా అని నామకరణం చేశారు. దీనర్థం దేవుడు పంపిన బహుమతి.వీళ్లే కాకుండా బుల్లితెర నటులు సాయికిరణ్- స్రవంతి, మహాతల్లి జాహ్నవి జంట, బిగ్బాస్ సెలబ్రిటీలు సుదీప్, సోనియా ఆకుల కూడా తొలిసారి పేరెంట్హుడ్కు స్వాగతం పలికారు. బాలీవుడ్లో జైద్ దర్బార్- గౌహర్ ఖాన్, మాళవిక రాజ్- ప్రణవ్ బగ్గ, షీనా బజాజ్ - రోహిత్ పురోహిత్, షీనా బజాజ్ రోహిత్ పురోహిత్, జహీర్ ఖాన్- సాగరిక, నవరాజ్ హన్స్- అజిత్ కౌర్.. ఇలా పలు జంటల ఇళ్లలో చంటిబిడ్డల నవ్వులు వినిపించాయి. -
'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ
'అవతార్' సినిమాలో మీకు నచ్చిన విషయం ఏంటంటే చాలామంది చెప్పే మాట గ్రాఫిక్స్(వీఎఫ్ఎక్స్). నీలం రంగు మనుషులు, వాళ్లు ఉండే ప్రదేశం, వింత వింత ఆకారాలు.. ఇలా ఒకటేమిటి మూవీలోని ప్రతిదీ కూడా ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనదే. వీటన్నింటిని వందలాది మంది ఏళ్లకు ఏళ్లు కష్టపడి సృష్టించారు. అయితే పండోరా ప్రపంచాన్ని సృష్టించడంలో, వీఎఫ్ఎక్స్ విభాగాన్ని దగ్గరుండి నడిపించడంలో ఓ భారతీయ మహిళ కీలక పాత్ర పోషించిందని మీలో ఎంతమందికి తెలుసు?ప్రపంచంలో ఏ రంగంలో చూసినా భారతీయుల ఆధిపత్యం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకెళ్తున్నారు. తాజాగా బయటపడిన ఓ సంగతి.. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రపంచ సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాల్లో 'అవతార్' ఒకటి. ఇప్పటికే రెండు భాగాలు రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం మూడో పార్ట్ థియేటర్లలోకి రానుంది.జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తీసిన ఈ అద్భుతమైన సినిమాల్లో వీఎఫ్ఎక్స్ టాప్ నాచ్లో ఏ మాత్రం వంకపెట్టడానికి వీల్లేని విధంగా ఉంటాయని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వెటా ఎఫ్ఎక్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. ఇందులో పావనీ రావు బొడ్డపాటి అనే భారతీయ మహిళ.. వీఎఫ్ఎక్స్ టీమ్ని లీడ్ చేస్తోంది. తాజాగా ఈమె.. తన గురించి, ఈ మూవీస్ కోసం తాము ఎంతలా కష్టపడ్డామనే విషయాన్ని చెప్పుకొచ్చింది.ఢిల్లీలో పుట్టి పావని రావు.. తల్లిదండ్రులు, నానమ్మ-తాతయ్యతో కలిసి పెరిగింది. తన నానమ్మ స్వతహాగా ఆర్టిస్ట్ అని, కనిపించిన ప్రతి పేపర్పైన ఏదో ఒక బొమ్మ వేస్తూనే ఉండేవారని.. ఆమె ద్వారా ఇటువైపు ఆసక్తి పెరిగిందని.. అలా తొలిసారి 2009లో 'అవతార్' కోసం లైటింగ్ టీడీగా పనిచేశానని.. అప్పటినుంచి పండోరా ప్రపంచంలో ఓ భాగమైపోయానని ఈమె చెప్పింది.పావని రావు విషయానికొస్తే.. ఢిల్లీలో పెరిగిన ఈమె.. ఇక్కడే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్లో బీఆర్క్ పట్టా పొందింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంఎఫ్ఏ, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో భర్తతో కలిసి నివసిస్తోంది. 2009లో తొలిసారి 'అవతార్' కోసం పనిచేసిన ఈమె.. ఇప్పుడు రాబోతున్న మూడో భాగానికి కూడా పనిచేసింది.తొలి భాగంలో ఈమె పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ.. 2022లో రిలీజైన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కోసం దాదాపు 3000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్, అవి కూడా ఎక్కువ భాగం నీటి అడుగున ఉన్నవి పావన్ టీమ్ సృష్టించారు. ఇప్పుడు అవతార్ 3( 'ఫైర్ అండ్ యాష్') కోసం అగ్ని, బూడిద తదితర వీఎఫ్ఎక్స్ షాట్స్ రూపొందించారు. మరి ఇవి ఎలా ఉండబోతున్నాయనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనా 'అవతార్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్లో వీఎఫ్ఎక్స్ లాంటి కీలకమైన విభాగాన్ని భారతీయ మహిళ దగ్గరుండి నడిపించడం అంటే చాలా విశేషం. -
ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు విరాళం
ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో హీరో నాగార్జున సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నారు. కాలేజీ కోసం రూ.2 కోట్లని విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద కళాశాల విద్యార్థులకు రూ.2 కోట్ల స్కాలర్షిప్ని నాగార్జున ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. నాన్నగారు స్థాపించిన ఏ సంస్థ అయిన నాకు ఎంతో ప్రత్యేకం. గుడివాడ రావడం భావోద్వేగంగా ఉంది. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగానూ ఉంది. మనుషులు శాశ్వతం కాదు వారు చేసే పనులే శాశ్వతం. తాను చదువుకో లేకపోయినా వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం నాగేశ్వరరావు కళాశాల స్థాపించారు.రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు చదువు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సినిమాకు రూ. 5 వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో లక్ష రూపాయలని కళాశాలకు విరాళంగా ఇచ్చారు. ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున ప్రతియేటా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాను. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అని నాగార్జున చెప్పుకొచ్చారు.అక్కినేని నాగేశ్వరరావు విషయానికొస్తే.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు 255కు పైగా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 'ధర్మపత్ని' (1941)తో ప్రారంభించి 'సీతారామ జననం' (1944)లో తొలి హీరోగా మారి, 'దేవదాసు' (1953)తో స్టార్డమ్ అందుకున్నారు, పౌరాణిక, జానపద, సామాజిక పాత్రలతో పాటు 'నవరాత్రి'లో తొమ్మిది పాత్రలు పోషించారు, 'అన్నపూర్ణ స్టూడియోస్' స్థాపించి, 'మనం' (2014) చిత్రంలో చివరగా నటించారు. తెలుగు సినిమాను మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.ఏఎన్నార్ తర్వాత నాగార్జున హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం నాగ్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది 'కుబేర', 'కూలీ' చిత్రాల్లో నాగ్ వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. -
తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగార్జున ఆన్సరిదే!
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాత కాబోతున్నాడంటూ గత కొన్నినెలలుగా ప్రచారం ఊపందుకుంది. మొదట్లో నాగచైతన్య- శోభిత పేరెంట్స్ కాబోతున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ, అదంతా ఉట్టిదేనని శోభిత టీమ్ కొట్టిపారేసింది. కొన్నిరోజులుగా అఖిల్-జైనబ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఖిల్ కానీ, అతడి ఫ్యామిలీ కానీ స్పందించలేదు.టైం వచ్చినప్పుడు చెప్తా..ఈ క్రమంలో ఓ హెల్త్ ఈవెంట్కు వచ్చిన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవుతున్నారని కథనాలు వస్తున్నాయి.. నిజమేనా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకాయన చిరునవ్వుతో.. సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని పేర్కొన్నాడు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.15 ఏళ్లుగా సమస్యఇకపోతే ఇదే ఈవెంట్ అనంతరం నాగార్జున తన మోకాలి నొప్పి గురించి మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా మోకాలినొప్పితో బాధపడుతున్నాను. సర్జరీ చేయించుకోవాలనుకోలేదు. కాకపోతే మోకాలు బెటర్ అయ్యేందుకు లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ వాడాను. వైద్యులు పీఆర్పీ (ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా) చేశారు. ఒక్కోసారి నాకు నొప్పి లేకపోయినా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు ఉదయం మోకాలి కోసం ప్రత్యేకంగా వ్యాయామం చేశాను. దాన్ని అసలు వదిలేయలేదు. అలా మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. -
నవ్వులపాలైన చోటే పవన్కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్బాస్. అయితే బిగ్బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది. ఏ గేమ్ ఇచ్చినా ఈజీగా గెలిచేస్తున్నాడు.. అందరితో సరదాగా కలిసిపోయి జోకులేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్లోనూ అదే జరిగింది. ఆ విశేషాలు ఓసారి చూసేద్దాం..అదరగొట్టేసిన పవన్బిగ్బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పవన్ను పక్కకు తప్పించి మిగతా అందరూ గేమ్ ఆడారు. ఈ ఆటలో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఎక్కువ గేమ్స్ గెలిచిన పవన్ను హౌస్మేట్స్ ప్లేయర్ ఆఫ్ ది డేగా ప్రకటించారు. దీంతో అతడి అన్న వీడియో మెసేజ్ వచ్చింది. అగ్నిపరీక్షలో నిన్ను చూసి ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని పవన్ ఉప్పొంగిపోయాడు.తనూజ గెలుపుమరుసటి రోజు పిక్ ద బోన్ అనే గేమ్ ఇచ్చాడు. ఇందులోనూ మళ్లీ పవనే గెలిచాడు. దీంతో అతడికి మళ్లీ ఓ స్టార్ వచ్చింది. అంతేకాకుండా.. మటన్ ఫ్రాంకీ పంపడంతో పవన్ ఆవురావురుమని ఆరగించాడు. అనంతరం బిగ్బాస్ టవర్ గేమ్ పెట్టాడు. ఈ ఆటలో ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరిలో తనూజ గెలిచి ఓ స్టార్ అందుకుంది. అలాగే తనకోసం బిగ్బాస్ పంపిన డ్రైఫ్రూట్ రబిడీని ఆరగించింది.తనూజకు చెల్లి పెళ్లి ఫోటోఅనంతరం ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. గతంలో ఈ టాస్క్లోనే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా కింద పడిపోయాడు పవన్. అప్పుడందరూ పగలబడి నవ్వారు. కానీ, ఈసారి మాత్రం అందరికంటే ఎక్కువ హైట్లో (ఏడున్నర అడుగులు) తన చెప్పును కాలితో అతికించి శెభాష్ అనిపించుకున్నాడు. ఒక స్టార్, తందూరీ చికెన్ గెలుపొందాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డేగా తనూజను ప్రకటించారు. దీంతో ఆమెకు ఇంటినుంచి చెల్లి పెళ్లి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో తనూజను కూడా ఎడిట్ చేసి పెట్టారు. అది చూడగానే తనూజ కుటుంబాన్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. -
ఎదురులేని ప్రస్థానం
పట్టుమని పాతికేళ్ళున్న ఓ యువ నిర్మాత, మూడున్నర పదులు దాటి సినీ రంగంలో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న ఓ నవ దర్శకుడు కలసి చేసిన వెండితెర మ్యాజిక్ అది. గత చిత్రాల్లోని ఎన్టీఆర్ను పూర్తిగా మార్చేసి, విగ్, కాస్ట్యూమ్స్, పాటలు సహా అంతా కొత్త రకం స్టైల్లో చూపించి, అభిమానులతో కేరింతలు కొట్టించిన శతదినోత్సవ చిత్రమది.ఇవాళ అగ్రనిర్మాతగా నిలిచిన సి.అశ్వినీదత్ సారథ్యంలోని ‘వైజయంతీ మూవీస్’ వేసిన ఆ తొలి అడుగే... కె. బాపయ్య దర్శకత్వంలో 1975 డిసెంబర్ 12న విడుదలైన ‘ఎదురులేని మనిషి’. ఇక అక్కడ నుంచి మాస్ హీరోగా ఎన్టీఆర్, నిర్మాణ సంస్థగా వైజయంతీ మూవీస్, దర్శకుడిగా బాపయ్య... అందరిదీ ఎదురులేని ప్రస్థానమే. ఎన్టీఆర్ ఇమేజ్ను మార్చేసిన కెరీర్లోని ఆ కీలక ఘట్టానికీ, దానికి వేదికైన ‘వైజయంతీ మూవీస్’కూ ఇది 50 వసంతాలు నిండిన స్వర్ణోత్సవ సందర్భం.అది 1970ల ప్రథమార్ధం. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాంతి తగ్గి, రంగుల చిత్రాల ప్రకాశం పెరుగుతున్న సమయం. సమాజంలోనూ, జీవితంలోనూ పెనుమార్పులు చోటుచేసుకుంటున్న కాలం. మారుతున్న జనం అభిరుచులు, ఆకాంక్షలకు తగ్గట్టుగా హీరోలు తమను తాము పునర్నిర్వచించుకోవాల్సి వచ్చిన సందర్భం. కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు లాంటి కొత్త తరం హీరోలు తెరపై మెరుస్తున్న తరుణం. అప్పటికే అగ్రనటులుగా ఉన్న ఎన్టీఆర్, ఏయన్నార్లు సైతం కాలానుగుణంగా చేసే సినిమాలను మలుచుకుంటున్న వాతావరణం. ‘బడిపంతులు’, ‘తాతమ్మకల’ లాంటి చిత్రాల్లో పెద్ద వయసు పాత్రలతో కళాకారుడిగా ఎన్టీఆర్కు ఆత్మతృప్తి కలుగుతున్నా, కొత్త తరం అభిమానులకు తెలియని ఓ అసంతృప్తి. ‘నిప్పులాంటి మనిషి’, ‘అన్నదమ్ముల అనుబంధం’ లాంటి చిత్రాలు అదే సమయంలో వచ్చినా... ఒక్కసారిగా ‘కసిగా ఉంది... కసి కసిగా ఉంది’ లాంటి పాటలతో ఎన్టీఆర్ ఏజ్ను మరిపించి, ఇమేజ్ను మార్చేసిన మాస్ మసాలా సినిమాలకు పునాది – ‘ఎదురులేని మనిషి’.నిర్మాత మారారు... ప్రాజెక్టూ మారింది...‘‘ఎన్టీఆర్ను వెండితెరపై యంగ్గా చూపించి, సక్సెస్ చేయాలని నా మనసులో ఉండేది. దాని ఫలితమే ఈ చిత్రం’’ అని చెప్పారు దర్శకుడు బాపయ్య. నిజానికి, ఈ ప్రాజెక్ట్కు మొదట నిర్మాత అశ్వినీదత్ కాదట. ‘‘పేరు ఇప్పుడు జ్ఞాపకం లేదు కానీ, జయదేవ్, జగదీశ్ లాంటి పేరున్న ఒకరు నా దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలంటే, వెళ్ళి కలిశాం. ఎన్టీఆర్ చిత్రాలకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లయిన ‘విజయా పిక్చర్స్’ కాకుండా, ఫలానా శివరామకృష్ణ వ్యవహారాలు మేనేజ్ చేస్తున్న ‘లక్ష్మీ ఫిలిమ్స్’ ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేసే డిస్ట్రిబ్యూటర్లంటే, ఎన్టీఆర్ మొదట తటపటాయించారు. చివరకు సరే అన్నారు. ఈ సంగతి తెలిసి అశ్వినీదత్ నన్ను కలసి, తాను ఆ ప్రాజెక్ట్ చేస్తానంటూ ముందుకొచ్చారు. ముందుగా ప్రాజెక్ట్ అనుకున్న నిర్మాతతో కలసి మాట్లాడమన్నాను. చివరకు వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. పరస్పర అంగీకారంతో, కొత్త కంపెనీ పెట్టి దత్ తానే స్వయంగా పూర్తి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు’’ అని అని బాపయ్య ‘సాక్షి’తో గుర్తు చేసుకున్నారు. అలా ‘ఎదురులేని మనిషి’తో ఎన్టీఆర్తో ‘లక్ష్మీ ఫిలిమ్స్’ అనుబంధం కూడా ప్రారంభమైంది. 1968లో మొదలైన ఆ పంపిణీ సంస్థ ఏడేళ్ళ తర్వాత అలా తొలిసారిగా ఎన్టీఆర్ సినిమా చేసింది. ఆ తర్వాత ‘అడవి రాముడు’ నుంచి ఆ బంధం మరింత బలపడి, పలు చిత్రా లతో బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయడం వేరే కథ. అలాగే, ఈ ప్రాజెక్ట్కు ముందనుకున్న కథ కూడా ఇది కాదట. ‘‘అప్పట్లో శివాజీగణేశన్ ‘తంగపతకం’ (1974) రిలీజై బాగా ఆడుతోంది. ఆ సినిమా తెలుగులో చేద్దామని సినిమా కూడా చూశాం. అయితే, రీమేక్ రైట్ల రేటు ఎక్కువ చెప్పారు. ఆ సంగతి ఎంతకూ తెగలేదు. అదే సమయంలో అల్లు అరవింద్ దాన్ని డబ్బింగ్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు శివాజీ గణేశన్ సోదరుడు షణ్ముగం నాకు చెప్పారు. దాంతో, ఈ కొత్త కథతో ‘ఎదురులేని మనిషి’ ప్రాజెక్ట్ సిద్ధమైంది’’ అని బాపయ్య చెప్పారు.ఎన్టీఆర్ పెట్టిన పేరు... గీసిన బొమ్మ... చిత్ర నిర్మాణ సంస్థకు పేరు పెట్టమని దత్ కోరడంతో విజయానికి చిహ్నమైన శ్రీకృష్ణుడి మెడలోని వైజయంతి మాల పేరిట ‘వైజయంతీ మూవీస్’ అని నామకరణం చేశారు ఎన్టీఆర్. కృష్ణుడి మెడలో వైజయంతి మాల వేస్తున్న రాధ బొమ్మతో ఎంబ్లమ్ లోగో ఎలా ఉండాలో స్వయంగా గీసి కూడా చూపించారు. చిత్రమేమంటే, అంతకు ముందు సురేశ్ ప్రోడక్షన్స్ వారి ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ తులాభారం’కి అసిస్టెంట్గా చేశారు బాపయ్య.ఇక, ఎన్టీఆర్పై కృతజ్ఞతతో ఆయన మరణానంతరం తమ బ్యానర్పై తీస్తున్న తొలి చిత్రం చిరంజీవి ‘చూడాలని ఉంది’ (1998) నుంచి దత్ తమ బ్యానర్ ఎంబ్లవ్ులోనే ఎన్టీఆర్ను పెట్టారు. ‘శ్రీకృష్ణావ తారం’ (1967)లో వైజయంతి మాల ధరించి, పాంచ జన్య శంఖం పూరిస్తూ, విజయధ్వానం చేస్తున్నట్టున్న శ్రీకృష్ణ పాత్ర ధారి ఎన్టీఆర్ స్టిల్నే ఆ ఎంబ్లవ్ుగా ఎంచుకోవడం విశేషం.హిందీ హిట్ పాయింట్... తెలుగు వంటకం... నిజానికి, ‘ఎదురులేని మనిషి’ చిత్రం దేవానంద్ – హేమమాలిని నటించిన ‘జానీ మేరా నామ్’ (1970)కి యథాతథమైన రీమేక్ కాదు. ఆ హిందీ హిట్ అప్పటికే తమిళంలో శివాజీ గణేశన్తో ‘రాజా’ (1972)గా వచ్చింది. ఆ తర్వాత చాలాకాలానికి కన్నడంలో రాజ్కుమార్తో ‘అపూర్వ సంగమ’ (1984)గా రీమేకైంది. కాకపోతే, ‘‘ఎన్టీఆర్ ‘ఎదురులేని మనిషి’ లో మాత్రం చిన్నప్పుడే తమ తండ్రిని ఒక స్మగ్లర్ చంపినప్పుడు అనుకోకుండా విడిపోయిన అన్నదమ్ములు ఇద్దరు చివరకు ఎలా కలుసుకున్నారనే ప్రధానమైన ఇతివృత్తం వరకే రచయిత భమిడిపాటి రాధాకృష్ణ హిందీ నుంచి అనుసరించారు.మిగతా కథనంతా మన వాతావరణానికి తగ్గట్టు కొత్తగా అల్లుకొని, తెలుగులో ఒక సరికొత్త వంట సిద్ధం చేశారు. ‘‘అప్పట్లో ‘ఊర్వశి’ చిత్రం షూటింగ్కై మైసూర్లో ఉన్నా. అక్కడ ‘లైఫ్’ మ్యాగజైన్లో ఓ జరిగిన కథ చదివా. దాన్ని ఇండియనైజ్ చేసి, డెవలప్ చేశాం. ఎన్టీఆర్ ప్రోసీడన్నారు. మెయిన్ పాయింట్, కీలక ఘట్టాలు, సాంగ్ సిచ్యుయేషన్స్ హిందీ నుంచి తీసుకున్నాం’’ అని వివరించారు బాపయ్య.క్లాష్ వస్తే... కాపాడిన ‘డాడీ’ అప్పట్లో హీరోయిన్గా మంచి ఫామ్లో ఉన్న కళాభినేత్రి వాణిశ్రీ కథానాయికగా చలాకీతనం చూపారు. చిన్నప్పుడు అన్న (ఎన్టీఆర్) నుంచి విడిపోయిన తమ్ముడి పాత్రలో జగ్గయ్య పోలీస్ ఇన్స్పెక్టర్గా కనిపించారు. స్మగ్లర్లుగా దుష్టపాత్రల్లో ప్రభాకరరెడ్డి, కాంతారావు, సినిమాలో వినోదం కోసం ఎన్టీఆర్ పక్కన రాజబాబు నటించారు. అప్పటి పాపులర్ రేడియో కళాకారులు నండూరి సుబ్బారావు, ఎ.బి. ఆనంద్లు చిరుపాత్రల్లో తెరపై తళుక్కున మెరవడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే బాపయ్య మరోపక్క శోభన్బాబుతో సురేశ్ ప్రోడక్షన్స్ వారి ‘సోగ్గాడు’కూ దర్శకత్వం వహిస్తున్నారు.ఆ సమయంలో ఒకసారి రెండు సినిమాల షూటింగ్ డేట్స్కూ క్లాష్ వచ్చింది. ‘‘అప్పుడు నన్ను పెంచిన మా ‘డాడీ’ – ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు గారు వచ్చి, ‘ఎదురులేని మనిషి’లో కొన్ని సీన్లు తీశారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు ఏయన్నార్ – కృష్ణలతో అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘గురుశిష్యులు’ (1981) చేస్తున్నప్పుడూ అలాగే జరిగింది. నా హిందీ చిత్రాలతో క్లాష్ వస్తే, అప్పుడూ ప్రకాశరావు గారే వచ్చి నా బదులు షూటింగ్ చేశారు’’ అని బాపయ్య స్మరించుకున్నారు. కత్తెర తప్పించు కున్న కసిపాటలు!మ్యూజికల్గా పాపులరైన ‘ఎదురులేని మనిషి’ పాటల గురించి ఒక సంగతి ప్రచారంలో ఉంది. ఆ చిత్రంలో ‘‘అబ్బా... దెబ్బ తగిలిందా...’’ అనే పాటలో ‘తగలరాని తావులో తగిలింది’ అని ఓ లైను ఉంది. ఆ లైనుకు సెన్సార్ అభ్యంతరం చెప్పింది. ‘మీరంత బాహాటంగా, ఉద్దేశపూర్వకంగా శృంగారం గురించి రాస్తే ఎట్లా? దీన్ని మీరెలా సమర్థిస్తారు?’ అని సెన్సార్వారు అడిగారట. దర్శక – నిర్మాతలకు ఏం చేయాలో తోచక, పాట రాసిన ఆత్రేయనే సెన్సార్ బోర్డ్లో తమ పక్షాన వాదన వినిపించేందుకు పంపారు.ఆత్రేయ చాలా తాపీగా, సెన్సార్ అభ్యంతరం విని, ‘తగలరాని చోటులో తగిలిందని రాసినందుకు మీరు అభ్యంతరం చెప్పారు. సరే... అసలు తగలవలసిన చోటులెక్కడో మీరు చెబితే, అసలు నేను రాసిన తగలరాని చోటేదే చెబుతాను’ అన్నారట. ఆ మాటలతో తెల్లబోవడం సెన్సార్ వంతు అయింది. అయితే, చివరకు సినిమాలో మాత్రం ఆ లైనును ‘తగలరాని హృదయంలో తగిలింది’ అని హీరోయిన్ అన్నట్టుగా చిరుమార్పు చేశారు. అలాగే, ‘కసిగా ఉంది కసి కసిగా ఉంది...’, ‘హే కృష్ణా ముకుందా మురారీ...’ లాంటి పాటలు సైతం పామర జనానికి బాగా పట్టేశాయి. అలాగే పి. సుశీల పాడగా జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన ‘కంగారూ ఒకటే కంగారూ... కళ్ళు కలిస్తే కంగారు... ఒళ్ళు తగిలితే కంగారు... కౌగిలిస్తే ఏమవుతారు దొర గారూ...’ పాట అప్పట్లో తరచూ రేడియోలోనూ మోగే పాపులర్ శృంగార గీతమైంది. మొత్తం మీద కె.వి. మహదేవన్ సంగీతం, ఆత్రేయ సాహిత్యం, హీరాలాల్ మాస్టర్ బావమరిది అయిన శీను మాస్టర్ నాయికా నాయకులకు కంపోజ్ చేసిన స్టెప్పులు... అన్నీ కలసి ప్రేక్షకులను హుషారెత్తించాయి.తిరుగులేని ఓపెనింగ్స్... ఎన్టీఆర్తో చిత్రాలన్నీ బ్లాక్ అండ్ వైట్లో ఆరేడు లక్షలు, కలర్లో దాదాపు పది లక్షల్లో తయారవుతున్న రోజులవి. నిర్మాత అశ్వినీదత్ సుమారు రూ. 11 లక్షల బడ్జెట్తో ఈ ఈస్ట్మన్ కలర్ చిత్రాన్ని నిర్మించారు. చిత్రమేమిటంటే, రిలీజవుతూనే ‘ఎదురులేని మనిషి’ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఓపెనింగ్స్ సాధించి, అంతకు అంత సంపాదించింది. కొత్త తరహా స్టైల్లో, కిర్రెక్కించే పాటలతో, యువతరం గెటప్లో ఎన్టీఆర్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వెరసి, ‘‘మొదటివారంలోనే రూ.17 లక్షలకు పైగా వసూలు చేసిన’’ట్టు నిర్మాతలు, పంపిణీదారులే స్వయంగా పత్రికా ప్రకటనల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రెండు వారాల్లో దాదాపు పాతిక లక్షల పైగా వచ్చినట్టు ప్రకటించారు. అలాగే, అప్పట్లో నెల్లూరులో అనిత థియేటర్ ఈ సినిమాతోనే డిసెంబర్ 13న ప్రారంభమైంది. ఆ థియేటర్లో తొలి వారం రోజులకే ఈ చిత్రం రూ. 39,102 వసూలు చేసి, నెల్లూరు సినిమా కలెక్షన్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. మంచి రెవెన్యూ తెచ్చి, హిట్ చిత్రంగా నిలిచి, 5 కేంద్రాల్లో (డైరెక్ట్గా నెల్లూరులో, సింగిల్ షిఫ్టులతో విజయవాడ, గుంటూరు, కాకినాడ, హైదరాబాదుల్లో) శతదినోత్సవం జరుపుకొంది. 1976 మార్చి 25న మద్రాస్లోని చోళా హోటల్లో వందరోజుల వేడుక జరిగింది. ప్రముఖ గేయ రచయిత దాశరథి సభా కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ ప్రసంగిస్తూ, చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ఆయన సోదరుడు – ఎన్.ఏ.టి. సంస్థ అధినేత త్రివిక్రమరావు అందరికీ జ్ఞాపికలు అందజేశారు.బాపయ్య కెరీర్కు బాక్సాఫీస్ పునాది ‘ఎదురులేని మనిషి’ హిట్, ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకే (1975 డిసెంబర్ 19న) వచ్చిన శోభన్బాబు ‘సోగ్గాడు’ బ్లాక్బస్టర్ కావడంతో దర్శకుడిగా బాపయ్య కెరీర్కు ఇక తిరుగులేకుండా పోయింది. వరుసగా కమర్షియల్ చిత్రాలు, ‘సోగ్గాడు’ హిందీ వెర్షన్ మొదలు అక్కడి అవకాశాలు... ఆయనను రెండు దశాబ్దాల పాటు ఊపిరి సలపని బిజీ డైరెక్టర్ను చేశాయి. ఆ తరువాత ఎన్టీఆర్తోనే వైజయంతీ మూవీస్ ‘యుగపురుషుడు’ (1978) సహా మరో 5 చిత్రాలు డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళే ముందు చివరగా చేసిన ‘నా దేశం’ (1982) చిత్రం కూడా బాపయ్య దర్శకత్వంలో వచ్చినదే!ఆ ‘స్వర్ణోత్సవ’ సంస్థల తొలి హీరో ఆయనే! సంకల్పం మంచిదైతే, సాధించాలనే పట్టుదల తోడైతే, సాధన చేయడం మానకపోతే... సక్సెస్ రావడం తథ్యం. యాభై ఏళ్ళ క్రితం ‘ఎదురులేని మనిషి’తో సొంతంగా సినీ రంగంలో తొలి అడుగులు వేసి, ఇప్పటికీ ‘మహానటి’, ప్రభాస్ ‘కల్కి’ లాంటి చిత్రాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణసంస్థ ‘వైజయంతీ మూవీస్’, దాని అధినేత అశ్వినీదత్ ప్రయాణం అక్షరాలా అలాంటిదే! సినీచరిత్రలో ఇలా 50 వసంతాలు ఆగకుండా ఒక చిత్రనిర్మాణ సంస్థ తెలుగు సినిమాలు తీయడం, దానికి ఒకే కుటుంబ సభ్యులు నిర్మాతలుగా, సారథ్యం వహించడం అతి కొద్ది సందర్భాల్లోనే జరిగింది.‘రాముడు – భీముడు’ (1964)తో అ్రగ నిర్మాత డి. రామా నాయుడు ఆరంభించిన ‘సురేశ్ ప్రోడక్షన్స్’ గతంలో ఆ ఘనత సాధించింది. ‘ఎదురులేని మనిషి’ (1975)తో అశ్వినీదత్ స్థాపించిన ‘వైజయంతీ మూవీస్’ ఇప్పుడు ఆ అరుదైన జాబితాకెక్కింది. విశేషమేమిటంటే, ఆ రెండు బ్యానర్ల తొలి సినిమాలకూ మెడలో విజయానికి చిహ్నమైన వైజయంతి మాలతో వెండితెరపై అపర శ్రీకృష్ణావతారమైన అలనాటి అగ్రనటుడు ఎన్టీఆరే తొలి హీరో!చరిత్రలో చెరగని ‘వైజయంతి’ అరుదైన కాంబినేషన్లతో తెలుగు నుంచి హిందీ దాకా వివిధ భాషల్లో భారీ చిత్రాలకూ, బాక్సాఫీస్ హిట్లకూ వైజయంతి సంస్థ, అశ్వినీదత్ చిరునామాగా నిలిచారు. ఎన్టీఆర్ మొదలు ఏయన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మీదుగా ఇవాళ్టి మహేశ్బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాని దాకా అ్రగ హీరోలందరితో తెలుగులో సినిమాలు తీసిన అరుదైన సంస్థ కావడం చరిత్రలో చెరిగిపోని విషయం. అక్కడి అమితాబ్ నుంచి ఇక్కడి రజనీకాంత్, కమలహాసన్ల దాకా అందరూ గౌరవించే నిర్మాతగా నిలవడం అశ్వినీదత్ సమర్థతకూ, సినీ నిర్మాణ చాకచక్యానికీ నిదర్శనం.ఇక, తరాలు మారినా తరగని వన్నెతో... ఆయన కుమార్తెలు స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, అల్లుడు నాగ్ అశ్విన్లతో కలసి కొత్త అభిరుచులకు తగ్గట్టు వైజయంతీ మూవీస్ విజయవంతంగా సాగడం చెప్పుకొని తీరాల్సిన అంశం. తల్లితండ్రుల సినీ వారసత్వాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళుతూ, ఓ సినీ నిర్మాణ సంస్థను ఇంత సమర్థంగా కుమార్తెలు నడిపిన ఉదంతాలు సినీ చరిత్రలో అత్యంత అరుదు. అందుకే, అక్షరాలా ఇది ఎదురులేని ప్రస్థానం! భారతీయ సినిమా ఊహించని రీతిలో ఊపందుకొన్న సరికొత్త 1970వ దశకం అది. అన్ని తరగతుల ప్రేక్షకులనూ ఆకట్టుకోవాలనే ఆలోచన పెరిగి, వివిధ రకాల సినిమాలు ఏకకాలంలో రావడం మొదలైన కాలమది. ఒక పక్కన ప్రేమకథల ప్రాధాన్యం తగ్గకపోయినా, క్రైమ్ థ్రిల్లర్లు, ఆఫ్బీట్ కథలు హిందీ సినీ ప్రపంచాన్ని ఏలడం మొదలుపెట్టాయి. అలా అప్పుడు వచ్చినవే... దేవానంద్ ‘జానీ మేరా నామ్’ (1970), అమితాబ్ ‘జంజీర్’ (1973 – తెలుగులో ‘నిప్పులాంటి మనిషి’), ధర్మేంద్ర ‘యాదోంకీ బారాత్’ (1973 – తెలుగులో ‘అన్నదమ్ముల అనుబంధం’), రాజేశ్ఖన్నా ‘రోటీ’ (1974 – తెలుగులో ‘నేరం నాది కాదు ఆకలిది’), అమితాబ్ బచ్చన్ ‘దీవార్’ (1975 – తెలుగులో ‘మగాడు’). మారిన కాలం, మారుతున్న ప్రేక్షకాభిరుచికి తగ్గట్టుగా ఆ తర్వాత కాలంలో అవన్నీ తెలుగులోకి ఎన్టీఆర్ హీరోగా వచ్చాయి.‘అడవి రాముడు’కు అనుకోని బీజం 1970ల మధ్యభాగంలో ఎన్టీఆర్ కెరీర్ మరో కొత్త మలుపు తిరగడానికి కారణమైన సినిమా... ‘ఎదురు లేని మనిషి’. ఆయన విగ్గు, కాస్ట్యూమ్ల దగ్గర నుంచి తెరపై ఆయన చూపు, పాటల్లో కిర్రెక్కించే ఆయన ఊపు అన్నీ మారాయి. కమర్షియల్ చిత్రం చేయడం అదే తొలిసారి అయినా దర్శకుడు బాపయ్య తెగ విజృంభించారు. పూర్తి సొంతంగా సినిమా తీయడం అదే ప్రథమం అయినా, ‘పెద్ద వయసు ఎన్టీఆర్తో ఈ కుర్ర చేష్టలేమిటి’ అంటూ చిత్రనిర్మాణ సమయంలోనే పరిశ్రమలో నెగటివ్ ప్రచారం సాగినా, విమర్శల్ని లెక్క చేయకుండా నిర్మాత దత్ నిబ్బరంగా నిలిచారు. మంచి ఫామ్లో ఉన్న అందాల నటి వాణిశ్రీ, మాస్ మెచ్చే పాటలు, స్టెప్పులు, సంగీతం, యాక్షన్... అన్నీ కలసి ‘ఎదురులేని మనిషి’ని తిరుగులేని సక్సెస్ చేశాయి. ఈలలు, చప్పట్లతో అభిమానులను కేరింతలు కొట్టేలా చేశాయి. యాభై రెండేళ్ళ వయసులో ఎన్టీఆర్ను కుర్రకారుకు చేరువ చేశాయి. అంతే... ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను...’ అంటూ హీరోయిన్లతో చిందులేశారు. మళ్ళీ కుర్రపాత్రలు, వాటికి తగ్గట్టు బెల్ బాటమ్ ΄్యాంట్లు, పై గుండీలు తీసేసి ఛాతీ చూపించే షర్టులతో మాస్ హీరోగా వెండితెరపై చెలరేగిపోయారు. ఆయన దుస్తులూ అప్పట్లో ఓ ట్రెండ్. ఒక రకంగా ఈ ‘ఎదురులేని...’ చిత్రమే బాపయ్య పెదనాన్న గారి కుమారుడైన కె. రాఘవేంద్రరావు ఆ తర్వాత కాలంలో ‘అడవి రాముడు’ (1977) తీయడానికి ప్రేరణైంది. అక్కడ నుంచి మహావృక్షం స్థాయికి విజృంభించిన ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కు అలా ఈ చిత్రమే కనిపించని విత్తనమైంది.కుర్రాళ్ళ మాటకే ఎన్టీఆర్ ఓటు!ఎన్టీఆర్కు సైతం అయిదు పదులు నిండిన ఆ వయసులో ఇలాంటి గెటప్లు, పాటలు, డ్యాన్సులు చేయడం కొత్తే. కాకపోతే, యువ ప్రేక్షకుల కోసమంటూ దర్శక, నిర్మాతలు పట్టుబట్టడంతో ఓకే అనేశారు. ‘ఎదురులేని మనిషి’ కోసం బొంబాయి నుంచి ప్రత్యేకంగా డ్రెస్లు, మేకప్, విగ్ అన్నీ తెప్పించారు. పాటల చిత్రీకరణతోనే పబ్లిసిటీ మొదలుపెట్టారు. పరిశ్రమలో ఎవరెంత నెగటివ్ ప్రచారం చేసినా, నిర్మాత దత్ ధైర్యంగా ముందుకు సాగారు. చివరకు ఒకసారి ఎన్టీఆర్ షూటింగయ్యాక ఆ గెటప్లో ఇంటికి వెళితే, వారి ఇంట్లో శ్రీమతి సహా అందరూ నివ్వెరపోయి, ఇదేమిటన్నారట! ‘యువ దర్శక, నిర్మాతలు సినిమా చేస్తున్నారు. వారి మాట విందాం. చేయనిద్దాం’ అన్నారట ఎన్టీఆర్. అప్పట్లో ఈ సినిమాపై వివాదాలకూ తక్కువ లేదు. అప్పటికే తెలుగు సినీసీమలో ‘బూత్రేయ’ అంటూ ఒకింత చెడ్డపేరు తెచ్చుకున్న ఆత్రేయ మాత్రం అవేవీ పట్టించుకోకుండా, దర్శక, నిర్మాతలు తనను కోరిన విధంగా మాస్ పాటలు రాసేశారు. సాహిత్యంలోనూ, పాటల చిత్రీకరణలోనూ సరసం పాలు హెచ్చి శృంగారపుటంచులు తాకిందనే విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సార్ సమయంలోనూ చిక్కులు తప్పలేదు. ‘‘అప్పట్లో ఆ పాటలు సెన్సార్ బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకొని, నానాపాట్లు పడ్డాం’’ అని బాపయ్య నవ్వేశారు.– రెంటాల జయదేవ -
నేను పెళ్లి చేసుకోలేదు: మెహరీన్
‘‘నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు’’ అంటూ హీరోయిన్ మెహరీన్ స్పష్టం చేశారు. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’(2016) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు మెహరీన్. ఆ తర్వాత ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నారు మెహరీన్. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనుకున్నారంతా.ఆ తర్వాత ఆ నిశ్చితార్థం రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మెహరీన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ న్యూస్పై మోహరీన్ స్పందించి, సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నానంటూ కొన్ని ఆంగ్ల వెబ్సైట్స్లో ఆర్టికల్స్ వచ్చాయి. అందులోనూ నాకు తెలియని, ఎప్పుడూ కలవని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని రాశారు.నా వికీపీడియా పేజీని ఎవరో హ్యాక్ చేసి, ‘రెండు నిమిషాల పాపులారిటీ’ కోసం ప్రయత్నించిన ఒక నీచుడి పని ఇది. నా వివాహం విషయంలో రెండేళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ, ఈసారి వేధింపులు హద్దులు దాటడంతో నిజం చెప్పక తప్పలేదనిపించింది. నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు.. నన్ను నమ్మండి. భవిష్యత్తులో పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెబుతాను.. ప్రామిస్’’ అంటూ పేర్కొన్నారు మెహరీన్. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
అది చాలా గొప్ప అనుభూతి: బోయపాటి శ్రీను
‘‘అఖండ 2 తాండవం’ని పవర్ఫుల్గా అన్ని వాణిజ్య అంశాలతో తీశాం. థియేటర్స్లో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ చాలా ఆనందాన్నిచ్చింది... గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అఖండ 2’ భారత దేశం ఆత్మ లాంటిది.అందరికీ చేరాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది... డబ్బు కోసం తీయలేదు. మా సినిమా విడుదల వాయిదా పడినప్పుడు బాలకృష్ణగారి ఫ్యాన్స్ ఎలా అర్థం చేసుకుంటారా? అనిపించింది. అంతేకానీ రిలీజ్ పోస్ట్పోన్ కావడం గురించి మేం భయపడలేదు. మా సినిమా ఆడుతున్న థియేటర్స్కి వెళ్లినప్పుడు ప్రేక్షకులు నిలబడి విజిల్స్, క్లాప్స్ కొట్టడం, చేతులెత్తి దండం పెట్టడం చూశాను. మాకిది చాలా గొప్ప అనుభూతి. ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి మా సినిమాలో చెప్పాం. ‘అవెంజర్స్, సూపర్ మాన్, బ్యాట్ మాన్’... ఇవన్నీ సృష్టించిన పాత్రలు.కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది. మనకంత ఘనమైన చరిత్ర ఉంది. మా సినిమా కర్ణాటక, చెన్నై, హిందీలోనూ ఉర్రూతలూగిస్తోంది. మా మూవీ రెవెన్యూ స్ట్రాంగ్గా ఉంది. అయితే హిందీలో థియేటర్ల కొరత ఉంది. మా సినిమాని సెప్టెంబరు 25న రిలీజ్ అన్నాం. అయితే అప్పుడు ‘ఓజీ’ సినిమా ఉండటంతో డిసెంబరులో రిలీజ్ చేశాం. ‘అఖండ 2’ త్రీడీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు ఒక్కసారి చూపిస్తే మరోసారి వెళ్దామంటారు’’ అని చెప్పారు. -
ప్రేమ... పగ
నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్కుమార్ లీడ్ రోల్స్లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా పోలీస్ కంప్లైంట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ (తెలుగు, కన్నడ భాషల్లో..) ఈవెంట్లో వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో యాక్షన్తో పాటు ఫుల్ కామెడీ కూడా చేశాను. సినిమా బాగా వచ్చింది’’ అని చెప్పారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా షూటింగ్ను 45 రోజుల్లోనే పూర్తి చేశాం. ప్రేమ–పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడుల మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా ఈ సినిమా సాగుతుంది.తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది చేసిన రోల్ థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, కృష్ణసాయి, అడివి సాయికిరణ్, రావుల వెంకటేశ్వర రావు తదితరులు అతిథులుగా పాల్గొని, సినిమా యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వీ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆరోహణ సుధీంద్ర – సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో సంగీతం అందించారు. -
చికిరి రికార్డ్
‘చికిరి చికిరి...’ అంటూ ‘పెద్ది’ సినిమా లో రామ్చరణ్ వేసిన స్టెప్పులకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలైన నెలలోనే తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ దాటిందని, అలాగే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం ఓ రికార్డ్ అని చిత్రబృందం పేర్కొంది. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోను నవంబరులో విడుదల చేశారు. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.చాంపియన్కి అతిథిగా... రోషన్, అనస్వర రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నెల 18న జరగనున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని యూనిట్ ప్రకటించింది. -
బ్యాడ్ గాళ్స్.. ఫుల్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. లేలో అంటూ సాంగే ఫుల్ రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా.. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్ అని దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి అన్నారు.


