Tollywood
-
తత్వం ఏంటి?
పెళ్లి చూపుల కోసం ఓ గ్రామానికి వెళ్లిన ఓ యువకుడు, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఇరుక్కుంటాడు? ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? అతను తెలుసుకున్న తత్వం ఏమిటి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘తత్వం’(Tatvam). దినేష్ తేజ్, దష్విక .కె హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఇది. అర్జున్ కోల దర్శకత్వంలో త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె. ప్రోడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ని దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ మర్డర్ మిస్టరీ మూవీలో స్క్రీన్ప్లే హైలైట్గా ఉంటుంది’’ అని వంశీ సీమకుర్తి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమేరా: భరత్ పట్టి. -
వినోదం.. భావోద్వేగం!
రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెరసాల’(Cherasala). శ్రీజిత్, నిష్కల, రమ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్రాయ్ క్రియేషన్స్ పై కథ్రి అంజమ్మ, షికార నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ– ‘‘రిలేషన్ షిప్లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే అంశాలతో ఈ మూవీ తీశాం. ఇందులో మంచి భావోద్వేగాలతో పాటుగా, చక్కని వినోదం ఉంది ’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంపై దర్శకుడు నాలుగు సంవత్సరాలు దృష్టి పెట్టాడు. ఇలాంటి మంచి సినిమాలు రావాలి’’ అని పేర్కొన్నారు శ్రీజిత్. ‘‘ఓ అమ్మాయి తన భర్త కోసం, మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు పడే తపనే ఈ కథ’’ అని తెలిపారు కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్. -
ఊహలకు అందని ప్రపంచం
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబోలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా మంగళవారం (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ వీడియోతో ఈ మూవీని ప్రకటించారు. అల్లు అర్జున్ కెరీర్లో ఇది 22వ సినిమా కాగా, అట్లీ కెరీర్లో 6వ చిత్రం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించనున్నామని, నటీనటులు– సాంకేతిక నిపుణులు, విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘‘మ్యాజిక్ విత్ మాస్. ఊహలకు అందని ప్రపంచం. సన్ పిక్చర్స్ సపోర్ట్తో అట్లీగారితో సినిమా చేయనుండటం నిజంగా అద్భుతం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అల్లు అర్జున్ . ‘‘అల్లుఅర్జున్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. నా కలను నిజం చేస్తున్న కళానిధిమారన్ సార్కి, సన్ పిక్చర్స్కు థ్యాంక్స్’’ అని అట్లీ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మైథలాజికల్ ఫిల్మ్ రానుంది. అల్లు రామలింగయ్య, మమత సమర్పణలో హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ మూవీ చిత్రీకరణను త్వరలోనేప్రారంభించనున్నట్లు పేర్కొని, అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. -
మా సినిమాలో వైష్ణవిని చాలా బ్యాడ్గా చూపిస్తాం: నిర్మాత నాగవంశీ కామెంట్స్
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జాక్ మూవీలో నటిస్తోన్న హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సినిమాలో చాలా పద్ధతిగా వైష్ణవిని చూస్తారని ఆయన అన్నారు. ఆ తర్వాత మా ప్రాజెక్ట్లో తాను నటించబోతోందని వెల్లడించారు. అయితే మా సినిమాలో మాత్రం చాలా మాస్గా చూపిస్తామని తెలిపారు. చివరిసారిగా వైష్ణవిని ఈ సినిమాలో పద్ధతిగా చూడమని సలహా ఇచ్చారు. మా సినిమాలో అన్ని మోడరన్ బూతులే ఉంటాయని నాగవంశీ వ్యాఖ్యలు చేశారు. -
గోల్డెన్ బ్యూటీ మీనాక్షి.. సమంత షాకింగ్ లుక్!
గోల్డెన్ డ్రస్సులో మీనాక్షి చౌదరి అందాల విందుముఖంలో కళ తప్పినట్లు కనిపిస్తున్న సమంతనవ్వుతూ మత్తెక్కించేస్తున్న హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేబర్త్ డే పార్టీలో ఆర్జీవీ ముద్దు దక్కించుకున్న అశ్వినిగ్లామర్ తో హీట్ పెంచేస్తున్న హీరోయిన్ రుహానీ శర్మగోలీసోడాతో కామెడీ చేస్తున్న అనన్య నాగళ్లచీరలో అందాలన్నీ చూపించేస్తున్న నందిని రాయ్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్లీ వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం మొదలైంది. ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తాను లేని సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి బర్త్ డేకు రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు తన వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.గతంలోనూ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. మంచు విష్ణు, మనోజ్కు మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సైతం వీరి మధ్య గొడవ మొదలైంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది. -
అజిత్ కుమార్ 'ఓజీ సంభవం'.. తెలుగు వర్షన్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ గురువారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ తెలుగు, తమిళంలో ట్రైలర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇప్పటికే ఓజీ సంభవం పేరుతో తమిళంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రంపై అజిత్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. -
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఉపాసన కొణిదెల (Upasana Konidela).. రామ్చరణ్ సతీమణిగా ఇంటిని చక్కదిద్దడమే కాకుండా అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) వైస్ చైర్పర్సన్గానూ బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లయిన కొత్తలోనే రామ్చరణ్, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తను నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తాడు. నేనేదైనా చేయాలనుకుంటే అందుకు సహకరిస్తాడు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా నా వెంటే ఉన్నాడు.మా బంధం బలంగా ఉండటానికి అదే కారణంఅలాగే తను కష్టనష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను తనవైపు నిల్చున్నాను. మా బంధం ధృడంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అలాగే మా ఇరు కుటుంబాలు కూడా మా వెన్నంటే ఉన్నాయి. వైవాహిక బంధంలో.. ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించడం తప్పనిసరి. వారానికి ఒకసారైనా డేట్ నైట్కు వెళ్లమని అమ్మ చెప్తూ ఉండేది. మాకు వీలైనంతవరకు దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. వారంలో ఒకరోజుకాకపోతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ రోజంతా గడుపుతాం. ఆ రోజు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంటాం. మా మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మాట్లాడుకుంటేనే కదా ఏదైనా తెలిసేది, పరిష్కరించుకోగలిగేది. పెళ్లిళ్లు వర్కవుట్ కావాలంటే ఇవన్నీ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు రిలేషన్ను బలపర్చుకుంటూ ఉండాలి. మావల్ల కాదని వదిలేస్తే కష్టం అని పేర్కొంది.ఉపాసన కచ్చితంగా వాళ్ల మధ్యే పెరగాలికుటుంబ విలువల గురించి మాట్లాడుతూ.. మా అమ్మ నా బెస్ట్ఫ్రెండ్. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాను. నా కూతురు కూడా నాలాగే నానమ్మ-తాతయ్యల దగ్గర పెరగాలని కోరుకుంటున్నాను. గ్రాండ్ పేరెంట్స్ చేతుల్లో పెరగడమనేది అందమైన అనుభవం. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. నాకు మాత్రం మా అత్త-మామలతో కలిసి ఉండటమే ఇష్టం. మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండటమే నాకు నచ్చుతుంది.అదే నా ధీమాఅప్పుడే నా కూతురు వారి దగ్గరి నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటుంది. మా అత్త, మామయ్య తనను జాగ్రత్తగా పెంచుతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు తను మంచి చేతుల్లోనే ఉందన్న ధీమా ఉంటుంది. మా అమ్మానాన్న కూడా అంతే ప్రేమ, కేర్ చూపిస్తారు. ఇలా నా కుటుంబసభ్యులందరూ క్లీంకార ఎదుగుదలలో భాగమవుతున్నారు అని ఉపాసన చెప్పుకొచ్చింది.చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్కు భార్య బర్త్డే విషెస్ -
అక్కినేని అఖిల్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా టైటిల్ తెలుసా?
అక్కినేని హీరో అఖిల్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఇవాళ అఖిల్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. అఖిల్- మురళి కిశోర్ అబ్బురు కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ను తాజాగా విడుదల చేశారు.అఖిల్ నటిస్తోన్న ఈ సినిమాకు లెనిన్ అనే క్రేజీ టైటిల్ను ఫిక్స్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో అఖిల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ మూవీ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. This role is going to be remembered for a long time!! 💥Can’t wait for you all to witness @AkhilAkkineni8 in his most stunning avatar 🔥Presenting you all ~ #LENIN ❤️🔥#Akhil6 @sreeleela14 @iamnagarjuna @KishoreAbburu @MusicThaman @NavinNooli @artkolla #NaveenKumarI… pic.twitter.com/IsyooyDViq— Naga Vamsi (@vamsi84) April 8, 2025 -
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/O Vyjayanthi Movie). కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి U/A సర్టిఫికేట్ లభించింది. రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా ఉంది.సెన్సార్ రిపోర్ట్లో ఏముందంటే?చాలాకాలం తర్వాత విజయశాంతి పోలీసాఫీసర్గా నటించిన సినిమా ఇది. ఇందులో విజయశాంతి న్యాయం కోసం పోరాడే పోలీసుగా తన నటనతో మెప్పిస్తుందని సెన్సార్ నివేదికలో పేర్కొన్నారు. తల్లి-కొడుకు మధ్య సంఘర్షణ కథకు ప్రధానంగా ఉండనుందని తెలిపారు. ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, ఇది చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని టాక్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్సే రాలేదంటున్నారు.కుటుంబ బంధాలు, త్యాగాలతో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిధంగా ఉంటుందంటున్నారు. యాక్షన్ సన్నివేశాలకు సైతం చోటు ఉందట. సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయని.. ఈ సినిమా కళ్యాణ్ రామ్కు మరో బ్లాక్బస్టర్గా మారడం ఖాయం అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని బల్లగుద్ది చెప్తున్నారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విషయానికి వస్తే.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు. సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.చదవండి: ఆ సినిమాల్లో చెప్పాపెట్టకుండా తీసేశారు.. గ్యాప్ ఎందుకంటే?: హీరోయిన్ -
తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఓదెల 2'. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఏప్రిల్ 17న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)ట్రైలర్ బట్టి చూస్తే.. ఓదెల అనే ఊరిలో ప్రేతాత్మల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఎక్కడో కాశీలో ఉన్న శివశక్తి (తమన్నా) ఈ ఊరికి వస్తుంది. తర్వాత దెయ్యాల ఆట ఎలా కట్టించింది అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.తమన్నా తప్పితే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేనప్పటికీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రస్తుతం డివోషనల్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. చూస్తుంటే ఓదెల 2.. బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయ్యేలా కనిపిస్తుంది. అశోక్ తేజ దర్శకుడు కాదా.. సంపత్ నంది మిగతా విషయాలన్నీ చూసుకున్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి) -
ఆ సినిమాల్లో చెప్పాపెట్టకుండా తీసేశారు.. గ్యాప్ ఎందుకంటే?: టాక్సీవాలా హీరోయిన్
మెజారిటీ హీరోయిన్లు వరుస సినిమాలతో దూకుడు పెంచుతుంటే ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఈ బ్యూటీ ఇటీవలే వచ్చిన మ్యాడ్ స్క్వేర్లో నటించి అలరించింది. తాజాగా ఈ తెలుగమ్మాయి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. నేను మొదటగా టాక్సీవాలా సినిమాకు సంతకం చేశాను. ఈ సినిమా కోసం యాక్టింగ్ క్లాసులు తీసుకుంటున్న సమయంలో కల వరం ఆయె చిత్రయూనిట్ నన్ను సంప్రదించారు. బడ్జెట్ లేదని పారితోషికం వద్దన్నానువారు అప్పటికే ఓ హీరోయిన్తో షూటింగ్ చేశారట.. కానీ అది నచ్చకపోవడంతో నన్ను సంప్రదించారు. సరే అని చేశాను. అయితే అప్పుడు నాకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి వారి దగ్గర బడ్జెట్ కూడా లేదు. మా దగ్గర రూ.10 వేలు మాత్రమే ఉన్నాయి. బడ్జెట్ లేనప్పుడు ఇవ్వడం దేనికిలే.. అని వద్దన్నాను. నా స్నేహితురాలేమో చేస్తున్న పనికి ఎంతోకొంత తీసుకోవాలి కదా అని వారించింది. దాంతో వాళ్లకు ఫోన్ చేసి ఆ పది వేలు తీసుకుంటానన్నాను. మొదటి పారితోషికం ఎంతంటే?నేను వద్దన్నానని వేరేవాటి కోసం కొంత వాడేశాం.. ఇప్పుడు మా దగ్గర రూ.6 వేలే ఉన్నాయని చెప్పారు. అలా నేను తొలి సినిమాకు రూ.6 వేలు తీసుకున్నాను. తర్వాత ఓ యాడ్ కోసం రూ.10 వేలు తీసుకున్నాను. కథ బాగుంటేనే సినిమాలు చేయాలని నియమం పెట్టుకున్నాను. అందుకే గమనం సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ వచ్చింది. టిల్లు స్క్వేర్లో 15 సెకన్లు మాత్రమే కనిపించే రోల్ చేశాను. తెలుగు, తమిళంలో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో, ఓ తమిళ సినిమాలో నన్ను చివరి నిమిషంలో తీసేశారు అని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చింది. ప్రియాంక.. టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం సినిమాలు చేసింది.చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్కు భార్య బర్త్డే విషెస్ -
ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి
పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ ఆలస్యమవుతూనే ఉన్నాయి. ప్రతిదీ చెప్పిన సమయానికి అస్సలు రిలీజ్ కావట్లేదు. లెక్క ప్రకారం 'రాజాసాబ్' ఈ 10వ తేదీన రిలీజ్ కావాలి. కానీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)చాన్నాళ్ల క్రితం రాజాసాబ్ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తవలేదు. దీంతో ఈ ఏడాది రిలీజ్ అవుతుందా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. తాజాగా డైరెక్టర్ మారుతిని ట్విటర్ లో అదే ప్రశ్న అడిగారు.తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్ని దర్శకుడు మారుతి దర్శించుకున్నాడు. ఆ ఫొటోలు పోస్ట్ చేయగా 'రాజాసాబ్' రిలీజ్ ఎప్పుడని ఫ్యాన్స్ అడిగారు. దీంతో మారుతి సమాధానమివ్వాల్సి వచ్చింది. 'రిలీజ్ అనేది నా ఒక్కడి చేతుల్లో లేదు. ఎలాంటి అప్డేట్ అయినా పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ ఇస్తుంది' అని మారుతి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: సింగపూర్లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)షూటింగ్ అప్డేట్ గురించి మరో అభిమాని అడగ్గా.. 'కొంత టాకీ, పాటల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. చాలా గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇచ్చిన ఔట్ పుట్ బాగుంది. చిత్రీకరణ పూర్తవగానే పాటలు రిలీజ్ చేస్తాం. మా కష్టాన్ని చూపించేందుకు మేం కూడా ఎదురుచూస్తున్నాం' అని డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు.డైరెక్టర్ చెప్పిన దానిబట్టి చూస్తే ఈ ఏడాదిలో రాజాసాబ్ రిలీజ్ కష్టమే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్) -
తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్కు భార్య బర్త్డే విషెస్
విమర్శలు ఎక్కుపెట్టినవారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు.. అతడి ప్రయాణం చూసిన ఎవరైనా ఔరా అనాల్సిందే! ఈసారి పాన్ ఇండియాను కాకుండా పాన్ వరల్డ్ బాక్సాఫీస్కే ఎక్కుపెట్టాడు బన్నీ. అట్లీతో సినిమా.. దీనికి హాలీవుడ్ టెక్నీషియన్స్ వీఎఫ్ఎక్స్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.గడిచిన ఏడాది కష్టంగా..సాదాసీదా హీరో నుంచి ఐకాన్ స్టార్ వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు బన్నీ. అయితే ఆయన సంతోషాన్నే కాకుండా కష్టాన్ని కూడా ఇష్టంగా పంచుకుంది భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy). గడిచిన ఏడాది బన్నీ పుష్ప 2 హిట్తో భారీ విజయం అందుకున్నాడు. కానీ అతడు సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్కు వెళ్లినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందడం.. ఆ కేసు తన మెడకు చుట్టుకోవడంతో ఆ సంతోషమే లేకుండా పోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టయి ఒక రాత్రి జైలులో గడపడం అతడి జీవితంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.43వ బర్త్డేఅతడు జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకోగానే స్నేహ చంటిపిల్లలా అతడిని హత్తుకుంది. ఆ సమయంలో కుటుంబాన్ని తనే జాగ్రత్తగా చూసుకుంది. తాజాగా ఆమె అల్లు అర్జున్కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నా జీవితంలో ప్రేమను పంచిన నీకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో నీతో కలిసి నడుస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఫ్యామిలీ సంతోషంగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్ను పొందుపరిచింది. అలాగే బన్నీతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బన్నీకి మీరే బలం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు: కీర్తి భావోద్వేగం -
'జాట్' థీమ్ సాంగ్ చూశారా..?
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) కొత్త సినిమా 'జాట్'(Jaat) నుంచి థీమ్ సాంగ్ను తాజాగా విడుదల చేశారు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichandh Malineni) తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీని భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే, తెలుగు వర్షన్ సినిమా విడుదలకు ఇంకాస్త టైమ్ పడొచ్చని సమాచారం. టీజర్, ట్రైలర్, ఊర్వశి రౌతేలా ప్రత్యేకమైన సాంగ్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. జాట్ సినిమాలో రణదీప్ హుడా విలన్గా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు. -
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
చాన్నాళ్ల తర్వాత మొన్నీమధ్య 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్ కి హాజరైన ఎన్టీఆర్(Jr Ntr).. ఇప్పుడు తెలుగు దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సింగపూర్లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)తనతో పాటు పనిచేసిన పలువురు దర్శకులతో తారక్ మంచి బాండింగ్ మెంటైన్ చేస్తూ ఉంటాడు. అలా తనకు 'బృందావనం' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంటికి ఎన్టీఆర్ వెళ్లాడు. అతడి భార్య మాలిని పుట్టినరోజు వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నాడు.ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో తారక్ తో పాటు సుకుమార్(Sukumar)-అతడి భార్య, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటోని సుకుమార్ భార్య బబిత తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. మహేశ్ బాబు ప్రస్తుతం రోమ్ టూర్ లో ఉన్నాడు. లేదంటే తన భార్యతో కలిసి ఈ పార్టీలో కనిపించేవాడేమో!(ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్) -
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
చిన్నవయసులోనే ఎన్నో కష్టాలు చూసింది కీర్తి భట్ (Keerthi Bhat). అయినవారిని పోగొట్టుకుంది, ప్రేమించినవాడి చేతిలో మోసపోయింది. పెంచుకున్న పాప దూరమై తల్లడిల్లింది. ఇలా నిత్యం కష్టాలతోనే సావాసం చేసిన కీర్తి సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. నటుడు విజయ్ కార్తీక్ను పెళ్లాడబోతున్న ఆమె అతడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. విజయ్ కంటే ముందు కీర్తి ఓ వ్యక్తిని ప్రేమించగా.. అతడి చేతిలో దారుణంగా మోసపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి.. మాజీ ప్రియుడి అరాచకాల్ని బయటపెట్టింది.నా వెంటపడ్డాడునాపాటికి నేను పని చేసుకుంటూ పోతున్న సమయంలో ఓ వ్యక్తి నా వెనకాల పడ్డాడు. ఒకే సెట్లో ఉండేసరికి అతడి లవ్ ప్రపోజల్కు నేనూ ఓకే చెప్పాను. తన ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాలుగు నెలలకు అతడి అనుమానపు బుద్ధి బయటపడింది. నేను చేస్తున్న సీరియల్ హీరోతో కలిసి ఏదైనా షోకు వెళ్లడానికి ఒప్పుకునేవాడు కాదు. వెళ్తే.. నాకు, అతడికి ఏదో ఎఫైర్ ఉందని అనుమానించేవాడు.బిగ్బాస్కు వెళ్లేముందే..ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అందరితో కలిసి ఉండాలి. హీరో, హీరోయిన్ అన్నాక షోకు వెళ్లాలి, కలిసి డ్యాన్స్ చేయాలి, రీల్స్ చేయాలి. కానీ, నేను ఏదీ చేయకూడదని ఆంక్షలు పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లినా అతడు, అతడి తల్లి డౌట్ పడేవారు. ఇదేంటి? ఇలా నరకంలో పడిపోయాను అనిపించింది. నేను దాచుకున్న డబ్బు అంతా వాళ్లకే ఖర్చు పెట్టాను. దానికి ప్రతిఫలంగా వాళ్లు సైకోలా ప్రవర్తించేవారు. బిగ్బాస్కు వెళ్లేముందు నేను దత్తత తీసుకున్న పాప చనిపోయింది. నా లవ్ బ్రేకప్ అయింది. అయితే పాప నా కూతురే కావొచ్చన్న అనుమానంతో డీఎన్ఏ టెస్ట్ చేయించాలనుకున్నారు. అక్కడే ఆగిపోయాడువాళ్లు డీఎన్ఏ టెస్ట్ అడిగినందుకు నేను భయంతో పాప చనిపోయిందని చెప్పానని నోటికొచ్చింది వాగుతున్నారు. అది విని నాకెంత బాధేసిందో! ఇంకా నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానట.. నన్ను ఇంత చెడ్డదానిగా చిత్రీకరించాలా? ఇంతవరకు ఎన్నడూ అతడి గురించి చెడుగా మాట్లాడలేదు. అలాంటిది నేను ఎంత హర్ట్ అయి ఉంటే ఇప్పుడిదంతా చెప్తున్నాను. నాపై విషం కక్కిన ఆ వ్యక్తి జీవితంలో ఎదగకుండా అక్కడే ఆగిపోయాడు. కానీ నేను ఒక రేంజ్కు వచ్చాను అని కీర్తి భట్ భావోద్వేగానికి లోనైంది. ఇకపోతే కీర్తి భట్ రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కీర్తికి పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చేశారు.చదవండి: నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో -
ఓటీటీలోకి సడెన్గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
యంగ్ ట్యాలెంటెడ్ ప్రవీణ్ రాజ్ కుమార్ ,‘బిగ్బాస్’ ఫేం అషు రెడ్డి(Ashu Reddy) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పద్మ వ్యూహంలో చక్రధారి’(PadmaVyuham Lo Chakradhari). విడుదలైన ఏడాది తర్వాత సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. సంజయ్రెడ్డి బంగారపు దర్శకత్వం వహించిన ఈ వ్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రానికి కె.ఓ.రామరాజు నిర్మాతగా వ్యవహరించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాలో శశికా టిక్కూ మధునందన్, మహేష్ విట్టా, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.'పద్మవ్యూహంలో చక్రధారి' సినిమా గతేడాది జూన్లో థియేటర్స్లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు సడెన్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్కు వచ్చేసింది. అషు రెడ్డి వల్ల సినిమాకు బాగా ప్రమోషన్స్ దొరికినప్పటికీ ఆశించినంతగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగానే ఉన్నప్పటికీ కథ మొత్తం పాత చింతకాయ పచ్చడిలానే చూపించారు. అషురెడ్డి తను గ్లామర్తో కట్టిపడేసిందని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్ శశికా టిక్కూ అద్భుతంగా నటించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో అలరించింది.అసలు కథేంటంటే..రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే కథే పద్మవ్యూహంలో చక్రధారి. ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్ రాజ్కుమార్) సిటీలో ఐటీలో జాబ్ చేసుకుంటూ స్నేహితులతో ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది. విషయం తెలుసుకున్న చక్రీ తన ఉద్యోగానికి లీవ్ పెట్టి తాను కూడా విలేజ్కి వెళ్తాడు. హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు. అతని సాయంతో సత్యను కలవాలని ప్లాన్ చేస్తాడు. అదే విలేజ్లో స్కూల్ టీచర్గా పద్మ(అషురెడ్డి) పనిచేస్తుంది. తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా గతంలో జరిగిన సంఘటనలకు ఆ ఊరి వారంటే ద్వేషం పెంచుకుంటాడు. అతను తాగుబోతుగా మారతాడు. అసలు తన ప్రేమ కోసం వచ్చిన చక్రీ.. సత్యను దక్కించుకున్నాడా ? పద్మ (అషురెడ్డి)తాగుబోతు అయిన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
టాలీవుడ్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఫొటో వైరల్
ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన పాయల్ రాజ్ పుత్(Payal Rajput).. మొన్నీమధ్యే టాలీవుడ్ లో నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు తన కుటుంబంలో జరిగిన బ్యాడ్ న్యూస్ గురించి బయటపెట్టింది.తన తండ్రి ఎసోఫెగల్ కార్సినోమా (క్యాన్సర్) బారిన పడ్డారని, ఇప్పుడు ట్రీట్ మెంట్ మొదలుపెట్టామని, తొలి కీమో థెరపీ సెషన్ లోనూ ఆయన పాల్గొన్నారని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. దీని వల్ల తనకు కాస్త భయంగా ఉందని పేర్కొంది. ఆయన త్వరలో కోలుకుంటారని, దానికి మీ ప్రేమ, సపోర్ట్ కావాలని రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: సింగపూర్లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)ఇంత బాధలోనూ తనని పనిచేసుకోమని, షూటింగ్ కి హాజరవ్వమని చెబుతున్నారని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. ఈ మేరకు తండ్రికి సెలైన్ ఎక్కిస్తున్న ఫొటోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ పాయల్ తండ్రి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.పాయల్ తండ్రికి జీర్ణాశయ క్యాన్సర్ (Cancer) వచ్చింది. పాయల్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తమిళంలో రెండు, తెలుగులో ఓ మూవీ చేస్తోంది.(ఇదీ చదవండి: నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
అటెన్షన్ కోసమే ఇలా.. నేను అస్సలు తగ్గను: కరాటే కల్యాణి
సినీనటి హేమ (Actress Hema) తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కరాటే కల్యాణి (Karate Kalyani), తమన్నా సింహాద్రి సహా పలు యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పంపింది. గతంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిందంటూ కల్యాణిపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేసింది. తాజాగా ఈ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. ఉన్నదే చెప్పా..ఆమె మాట్లాడుతూ.. నేనేమీ పార్టీలకు, పబ్బుకు వెళ్లలేదు. నాకు మద్యం అలవాటు కూడా లేదు. ఏ తప్పూ చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పట్టుబడిందని మీడియాలో వచ్చిన వార్తలు చూసే మాట్లాడాను. గతంలో ఆమె నన్ను కించపరుస్తూ చాలాసార్లు మాట్లాడింది. నన్ను చులకనగా చూసేది. మరి నువ్వేంటక్కా? ఇలా దొరికిపోయావు? అని అప్పుడు ఓ వీడియో చేశాను. మీడియాలో చూసిందే పెట్టాను తప్ప సొంతంగా సృష్టించలేదు కదా! భయమా?అలాంటప్పుడు ఆమె మీడియాపై కేసు వేయాలి కానీ నాపై వేయడం దేనికి? మీడియా అంటే భయమా? మీడియాను ఏం అనలేక నాపై కేసు వేద్దామనుకున్నావా? లేదా ఈ మధ్య ఎవరూ నిన్ను పట్టించుకోవడం లేదని అటెన్షన్ కోసం ఈ పని చేశావా? మీరు లీగల్ నోటీసులు పంపినంత మాత్రాన నేను భయపడను. నేను తగ్గేరకం కాదు. నేను కూడా తనకు నోటీసులు పంపుతాను అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది.చదవండి: సింగపూర్లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు -
'డియర్ ఉమ' టీజర్.. నిర్మాతగా తెలుగమ్మాయి సుమయ రెడ్డి
ఫీల్గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి(Sumaya Reddy) ఈ సినిమాలో హీరోయిన్గా నటించడమే కాకుండా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. బహుముఖ ప్రతిభ కలిగిన సుమయ రెడ్డి, సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్ప్లే, మాటలు రాసి, దర్శకత్వం వహించారు. అనేక విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట సినిమాటోగ్రాఫర్గా, బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రదన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ఇప్పటివరకూ ‘డియర్ ఉమ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. వీటిని బట్టి చూస్తే, ఇది ఒక ఫీల్గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. ఈ ఫీల్గుడ్ లవ్ స్టోరీ అందమైన సందేశంతో పాటు అధిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తయారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. -
AA22 Update: అల్లు అర్జున్- అట్లీ 'AA22' ప్రకటన వచ్చేసింది (వీడియో)
పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా రేంజ్లో గురి పెట్టాడు. అల్లు అర్జున్-అట్లీ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్' అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. నేడు బన్నీ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. 'AA22' పేరుతో చిత్రాన్ని ప్రకటించారు. విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి తమిళ ఇండస్ట్రీలో హ్యాట్రిక్ కొట్టిన అట్లీ.. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్తో జవాన్ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందకున్నాడు. అలా పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటి గుర్తుంపు తెచ్చుకున్న సౌత్ ఇండియా స్టార్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తే రికార్డ్స్ ఏమైనా మిగులుతాయా..? అంటూ అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. -
టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్' తెలుగు ట్రైలర్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible) సిరీస్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టామ్ క్రూజ్ నటించిన ఈ సిరీస్లోని 8వ సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ (Mission Impossible The Final Reckoning) తెరకెక్కింది. తాజాగా తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. టామ్ క్రూజ్ ఇప్పటివరకూ చేయని ప్రమాదకరమైన స్టంట్స్ ఏంటి..? అనేది ఈ సినిమాలో చూడాల్సిందే.. అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సింగపూర్లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ను వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఉన్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. -
అల్లు అర్జున్ బర్త్డే: 'ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే'
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ‘ఆర్య’ సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు.. పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ అని పిలుచుకునే బన్ని మలయాళంలో మల్లు అర్జున్ అయ్యారు. బాలీవుడ్ వాల్లకు పుష్పరాజ్గా స్థిరపడిపోయారు. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో అత్యంత శక్తివంతమైన హీరోగా ఆయన టాప్లో ఉన్నారు. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని రికార్డ్స్ రప్పా రప్పా అంటూ.. కొట్టేయాలని కొన్ని విషయాలు తెలుసుకుందాం.అల్లు అర్జున్లో ఇవన్నీ ప్రత్యేకమే..🎥 దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్🎥 రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్🎥 'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.🎥 టాలీవుడ్లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్నే🎥 అల్లు అర్జున్కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట🎥 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది.🎥 2025 పుష్ప2తో తొలిరోజు రూ. 294 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ తొలి చిత్రంగా రికార్డ్🎥 100 ఏళ్ల హిందీ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో రూ. 1000 కోట్లు సాధించిన ఏకైక చిత్రంగా పుష్ప2 రికార్డ్🎥 అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ జాబితాలో పుష్ప2కు రెండో స్థానం, ఫస్ట్ దంగల్ 🎥 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్కు గుర్తింపు🎥 ప్రముఖ సినిమా మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ కవర్పై అల్లు అర్జున్ ఫోటో 🎥 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ 🎥 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్.. ఆ ప్రాజెక్ట్కు తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు.🎥 బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట🎥 ఇన్స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 28 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం -
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
టైమ్ లూప్ స్టోరీకి హారర్ను మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో 'రాక్షస' (Rakshasa) సినిమాలో చూడొచ్చు. ఈ ఏడాది మార్చి 7న కన్నడలో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు కన్నడ, తెలుగు వర్షన్స్లో ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కన్నడ నటుడు ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా దర్శకుడు లోహిత్ హెచ్ ఈ మూవీని తెరకెక్కించారు. టైమ్లూప్ కాన్సెప్టుతో వచ్చిన తొలి కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. 'రాక్షస' (Rakshasa) సినిమా ‘సన్నెక్ట్స్’ (Sun NXT)లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం కన్నడ, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ఆ సంస్థ సోషల్ మీడియా ద్వరా ప్రకటించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. -
నయనతార@ 9
చిత్రపరిశ్రమలో క్రేజ్ ఉన్నంత వరకూ వయసు ఓ సమస్యే కాదు. నటి నయనతార విషయంలో ఇదే జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఈమె ఇటీవల నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. కాగా తాజాగా మాధవన్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈమె నటించిన తాజా చిత్రం టెస్ట్ చిత్రం ఇటీవలే నేరుగా ఓటీటీలో విడుదలైంది. అంతకు ముందు నయనతార టైటిల్ పాత్రను పోషించిన అన్నపూరిణి చిత్రం నిరాశపరచింది. అయితే ఈ సంచలన నటి జయాపజయాలను ఎప్పుడో దాటేశారు. అందుకు ఉదాహరణ ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్న చిత్రాలే. పెళ్లి అయ్యింది. ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయ్యారు. అయినా కథానాయకిగా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 9 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. నటుడు యోగిబాబు ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండావది డియర్ స్టూడింట్స్.. ఇది మలయాళ చిత్రం. సతీష్కుమార్,జార్జ్ ఫిలిప్ రేల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.నటుడు నవీన్ బాలి కథానాయకుడిగా నటిస్తున్నారు. మూడో చిత్రం టాక్సిక్.. ఇది కన్నడ చిత్రం. నటుడు యష్ నాయకుడిగా నటిస్తున్నారు. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగో చిత్రం రాకాయి. ఇది నయనతార నటిస్తున్న ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం.సెంథిల్ నలసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఐదో చిత్రం మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మెరు2). దీనికి సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని ఐసరి గణేశన్కు చెందిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి నటి కుష్భూకు చెందిన అవ్నీ మూవీ మాక్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆరో చిత్రాన్ని దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది నయనతార నటించే 81వ చిత్రం. ఏడో చిత్రం మలమాళ చిత్రం. నటుడు మోహన్లాల్, మమ్ముట్టిలతో కలసి నటిస్తున్నారు. దీనికి మహేశ్ నారాయణన్ దర్శకుడు. ఎనిమిదో చిత్రాన్ని నటుడు రవిమోహన్కు జంటగా నటిస్తున్నారు. మోహన్రాజా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తనీఒరువన్కు సీక్వెల్. ఇక తొమ్మిదో చిత్రం హాయ్. ఇందులో యువ నటుడు కవిన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి విష్ణు ఎడ్వన్ దర్శకుడు. ఇలా ఏక కాలంలో తమిళం, కన్నడం,మలయాళం భాషల్లో 9 చిత్రాల్లో నటిస్తున్న ఏకైక కథానాయకి నయనతార మాత్రమే అని చెప్పవచ్పు. అదే విధంగా ఈ సంచలన నటి త్వరలోనే సెంచరీ కొట్టడానికి సిద్ధం అవుతోందన్నమాట. -
వచ్చాడు గౌతమ్
స్టెతస్కోప్ పట్టుకున్న చేతి నిండా రుధిరం, కళ్లల్లో రౌద్రం చూస్తుంటే ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ హత్య చేశాడా? అనేలా ఉంది ‘వచ్చిన వాడు గౌతమ్’(Vachina Vaadu Gautam) పోస్టర్. అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వంలో టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. వచ్చాడు గౌతమ్ అంటూ ఈ చిత్రంలో అశ్విన్ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు.‘‘అరుణశ్రీ ఎంటర్ టైన్మెంట్స్పై గణపతి రెడ్డి నిర్మిస్తున్న మూడో చిత్రం ఇది. గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో సాయి రోనక్ అతిథి పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమేరా: ఎం.ఎన్. బాల్ రెడ్డి. -
బుల్లితెరపై పుష్పరాజ్.. ఏ ఛానెల్.. ఎన్ని గంటలకో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప- 2' మూవీతో బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టించాడు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డులన్నీ రప్పా రప్పా అంటూ తుడిచి పెట్టేశాడు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో సౌత్ భాషల్లోనూ అందుబాటులో ఉంది.తాజాగా ఈ మూవీ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ విషయాన్ని హక్కులు దక్కించుకున్న ఛానెల్ రివీల్ చేసింది. స్టార్ మాలో ఏప్రిల్ 13న ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రసారం కానుందని ఆ ఛానెల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో బుల్లితెరపై కూడా పుష్పరాజ్ సందడి చూసే అవకాశం రానుంది. కాగా..ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. Pushpa Raj is back to rule the game 🔥 #PushpagadiRuleuu #Pushpa2OnStarMaa pic.twitter.com/JQIMwCJgw6— Starmaa (@StarMaa) April 7, 2025 -
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
కొన్నిసార్లు అనుకోకుండా సినిమాలు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాయి. అలా ఓ స్టెప్పు కారణంగా కాంట్రవర్సీల్లో నిలిచిన 'రాబిన్ హుడ్' మూవీ.. మార్చి 28న థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ కారణంగా అడ్డంగా బోల్తా కొట్టింది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)వివాదానికి కారణమైన 'అదిదా సర్ ప్రైజ్' పాటని థియేటర్లలో చూసిన ప్రేక్షకులు షాకయ్యారు. ఎందుకంటే సదరు స్టెప్పు తీసేశారు. తాజాగా యూట్యూబ్ లో ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇందులో ఆ స్టెప్ కనిపించకుండా మతలబు చేశారు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం) -
సిల్క్ డ్రస్సులో శ్రుతి హాసన్.. ట్రిప్ వేసిన సితార!
రోమ్ లో చక్కర్లు కొట్టేస్తున్న నమ్రత-సితారపెళ్లి కూతురిలా ముస్తాబైన నటి వరలక్ష్మీ శరత్ కుమార్అందంగా కనిపిస్తూ కాక రేపుతున్న శ్రుతిహాసన్దుబాయిలో షికారు చేస్తున్న దేవుళ్లు పాప నిత్యాశెట్టిచీరలో అప్సరసలా మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీయోగా నేర్పించేస్తున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టిమెట్లపై కూర్చుని సుందరాంగిలా రీతూ పోజులు View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) -
జాక్ ట్రైలర్లో బూతులు.. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా జాక్ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే ట్రైలర్లో ఎక్కువగా బూతులు వినియోగించడంతో సెన్సార్ విషయంలో ఇబ్బందులు రావొచ్చని ఊహించారు. కానీ ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ పూర్తియినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. The equation is set 😎The chaos is calculated 🤟🏻#JACK certified 𝐔/𝐀 Rounding off the entertainment in the most explosive way ❤️🔥Bookings are now open 🎟️ https://t.co/6uRbOx5ekl#JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/9DbOmDuqb3— SVCC (@SVCCofficial) April 7, 2025 -
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు చాలా తక్కువ. ఉన్నవాళ్లలో కూడా రెగ్యులర్ సినిమాలు చేసేవాళ్లు ఇంకా తక్కువని చెప్పొచ్చు. రీసెంట్ గా 'మ్యాడ్ స్క్వేర్'లో (Mad Square) లైలా పాత్రలో కనిపించిన అలరించిన ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) తెలుగు బ్యూటీనే. అనంతపురంలో పెరిగిన ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో అనుభవాల్ని పంచుకుంది.'నేను సినిమాల్లో ప్రయత్నిస్తున్నానని మా ఇంట్లో తెలుసు. అలా నాకు విజయ్ దేవరకొండ 'ట్యాక్సీవాలా'చిత్రంతో (Taxiwala Movie) అవకాశమొచ్చింది. అయితే వారం రోజుల షూటింగ్ అయ్యేంత వరకు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో నా మొదటి సినిమా. అసలు ఉంటానో మధ్యలోనే తీసేస్తారో అని భయంగా ఉండేది.' (ఇదీ చదవండి: తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్)'అందుకే షూటింగ్ మొదలైన వారం వరకు ఈ సినిమాలో నేనే హీరోయిన్ ఎవరికీ చెప్పలేకపోయా. కాస్త నమ్మకం రాగానే ఇంట్లో చెప్పాను. అప్పుడు వాళ్లు కూడా సంతోషపడ్డారు. తర్వాత అందరికీ చెప్పుకొన్నాను' అని ప్రియాంక చెప్పుకొచ్చింది.షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ప్రియాంక.. 2017లో 'కలవరమాయే' మూవీతో హీరోయిన్ అయింది. కానీ ట్యాక్సీవాలా చిత్రంతో గుర్తింపు వచ్చింది. తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం, తిమ్మరసు, టిల్లు స్క్వేర్ తదితర చిత్రాలు చేసింది. కాకపోతే ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా) -
విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...
యువ నటి శ్రీలీల(sreeleela) నిస్సందేహంగా భారతీయ సినీరంగంలో తదుపరి పెద్ద స్టార్ కానుంది అంటున్నాయి సినీజోస్యాలు. తన అందం, ఆకర్షణ, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అసాధారణమైన ఇతర నైపుణ్యాలతో, ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. పుష్ప2లోని కిస్సిక్ పాటతో ఆమె ఉత్తరాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపారు. నిజానికి పుష్ప తొలి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ అయినా కూడా సమంతకు రానంత పాప్యురారిటీ శ్రీలీలకు వచ్చింది. ఆ పాట ఆమె హిందీ చిత్రసీమలోకి రెడ్కార్పెట్ వేసింది. దాంతో సౌత్లోనూ ఆమె క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది, ఇక ఆమె బాలీవుడ్లో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే...శ్రీలీల తాజా హిందీ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇటీవల, ఈ చిత్రం సెట్ నుంచి అనేక వీడియోలు ఫొటోలు ఆనలైన్ లో ప్రత్యక్షమయ్యాయి. మరుసటి తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎరుపు రంగులో వదులుగా ఉండే దుస్తులు ధరించిన శ్రీలీల లుక్ ని, ఆమె రూపాన్ని మెచ్చుకుంటూ ఆమె పాత్ర గురించి ఊహాగానాలు చేస్తూ, అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు. ఓ రకంగా ఈ చిత్రానికి దక్షిణాదిలో విపరీతమైన టాక్ రావడానికి కారణం శ్రీలీలే అని చెప్పాలి. అందం, ప్రతిభ ఆత్మవిశ్వాసాల కలయికగా శ్రీలీల బాలీవుడ్లో రంగప్రవేశం చేస్తోంది. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు భారతీయ సినీరంగాన్ని ఊపే సత్తా ఆమెకు ఉందని బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీలను ఈ స్థాయిలో నిలబెట్టిన కొన్ని ముఖ్యమైను అంశాలను పరిశీలించాలి..కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది, ఆమె సహజమైన సౌందర్యం, ప్రకాశవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం ఆమెకు కొత్త అవార్డులను సంపాదించిపెట్టింది, ఇది భారతీయ చలనచిత్రంలో ఆమె మంచి జర్నీకి నాంది పలికింది.రెండో విషయంగా చెప్పాల్సి వస్తే ఆమె నృత్య,నటనా ప్రతిభ గురించే చెప్పాలి. ధమాకా (2022)లో, జింతాక్ పాటలో చురుకైన రిథమ్, గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ లతో శ్రీలీల తెలుగు సినిమాకి డాన్స్ డార్లింగ్గా మారింది.పెళ్లి సందడి (2021)లో సాంప్రదాయంగా కనపడి, భగవంత్ కేసరి (2023)లో యాక్షన్ సీన్స్ వరకు శ్రీలీల తనలోని షేడ్స్ స్కిల్స్ బాగా పండించింది. స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో తన స్కిల్స్కు సానబట్టింది.భాషపై పట్టు కూడా శ్రీలలకు అచ్చొచ్చిన మరో అంశం. కన్నడ, తెలుగు, తమిళం ఇంగ్లీషు భాషలపై ఆమెకున్న పట్టు ఆమెని విభిన్న భాషా చిత్రాల్లో, భిన్న పరిశ్రమల్లో బలంగా నిలబెట్టింది. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన అభిమానులతో ఆమె సులభంగా మమేకం కాగలుగుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్ను ఒడిసిపట్టగల శ్రీలీల ఫ్యాషన్ ఐకాన్గా కూడా ఆకట్టుకోగలుగుతోంది. ఆమె వార్డ్రోబ్ ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ గా పేరొందింది.అధిక ఫ్యాషన్తో యువత కు మరింత దగ్గర కాగలుగుతోంది. ఆమె ఫ్యాషన్ లుక్స్ ఆమెను మ్యాగజైన్లపై, వెబ్సైట్స్లో తళుక్కుమనేలా చేస్తున్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023) వంటి చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు, శ్రీలీల తన వైద్య విద్య పరిజ్ఞానం గురించి ఆమె స్వచ్ఛంద సేవల గురించి బాగా వెలుగులోకి వచ్చింది. ఆమె సహకారం అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు మహిళల విద్యకు మద్దతు అందించడం వంటివి ఆమెను నటిగా మాత్రమే కాక అంతకు మించి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్ మోడల్గా అవతరించేందుకు అవకాశం అందిస్తున్నాయి. -
తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్
పుష్ప 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సుకుమార్(Sukumar).. ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాడు. 'పెద్ది' (Peddi Movie) షూటింగ్ పూర్తయిన తర్వాత చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది. అప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసుకోవచ్చు. మరోవైపు తారక్ కూడా వార్ 2 చేస్తున్నాడు. త్వరలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ కలిశారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)మరి సందర్భం ఏంటో తెలీదు గానీ సుకుమార్ ఇంటికి ఎన్టీఆర్ (Jr Ntr) వెళ్లాడు. ఈ విషయాన్ని సుక్కు భార్య తబిత ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 'తారక్ కి ప్రేమతో' అని సుకుమార్ భుజంపై తారక్ వాలి ఉన్న ఫొటోని పోస్ట్ చేశారు. దీన్ని తారక్ రీ పోస్ట్ చేయగా.. మళ్లీ దీన్ని సుకుమార్ రీ పోస్ట్ చేసి.. 'మై అభిరామ్' అని రాసుకొచ్చాడు.గతంలో సుకుమార్.. ఎన్టీఆర్ తో 'నాన్నకు ప్రేమతో' సినిమా తీశాడు. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం హిట్ అయింది. మళ్లీ వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసి పనిచేస్తారా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో వీళ్లు కలవడం కొత్త ప్రాజెక్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు రేకెత్తిస్తోంది.(ఇదీ చదవండి: 'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్) -
'పెద్ది' సిక్సర్తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
మెగా హీరో రామ్ చరణ్ కొట్టిన సిక్సర్తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్కు షోషల్మీడియా షేక్ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. ఫస్ట్ షాట్తోనే సినీ అభిమానులను రామ్చరణ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్కు వచ్చిన వ్యూస్ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ ఆ రికార్డ్ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్ రికార్డ్స్ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్ కొడుతున్నామని వారు పోస్ట్లు షేర్ చేస్తున్నారు. టాలీవుడ్లో పెద్ది గ్లింప్స్ టాప్-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్ (36 మిలియన్లు)తో టాప్-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్ విడుదల.. డబ్బింగ్ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. హందీ వర్షన్లో తన పాత్రకు డబ్బింగ్ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ సోషల్మీడియాలో వైరల్ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్ టాప్ (గ్లింప్స్) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్ (17.12 మిలియన్లు) -
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తెలుగు ట్రైలర్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష నటించారు. ఇప్పటికే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ తమిళ్ వర్షన్ ట్రైలర్ విడుదలైంది. ఏకంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్లో ఉంది. ఫ్యాన్స్కు నచ్చే భారీ యాక్షన్ సీన్లు ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్, ఓటీటీలలో పెద్దగా సినిమాల సందడి కనిపించలేదు. మార్చి చివరన వచ్చిన సినిమాలతోనే అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే, ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి వాతావరణం కనిపించనుంది. రేసులో సిద్ధు నటించిన జాక్, అజిత్, త్రిష నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో పాటు సన్నీ డియోల్- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా 'జాట్' ఉంది. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా కాస్త పర్వాలేదనే సినిమాలే ఉన్నాయి.థియేటర్స్లోకి వచ్చే సినిమాలు🎥 జాక్- ఏప్రిల్ 10🎥 గుడ్ బ్యాడ్ అగ్లీ -ఏప్రిల్ 10🎥 జాట్- ఏప్రిల్ 10🎥 బజూక- ఏప్రిల్ 10🎥 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి- ఏప్రిల్ 11🎥 కౌసల్య తనయ రాఘవ- ఏప్రిల్ 11ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/ వెబ్సిరీస్లునెట్ఫ్లిక్స్🎥 కోర్టు- ఏప్రిల్ 11🎥 పెరుసు (తెలుగు/ తమిళ్)- ఏప్రిల్ 11🎥 బ్లాక్ మిర్రర్ 7 (వెబ్సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 10 🎥 కిల్ టోనీ (వెబ్సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 7అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 ఛోరీ 2 (హిందీ)- ఏప్రిల్ 11🎥 ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ ( ఇంగ్లీష్) - ఏప్రిల్ 8 🎥 జీ20 (ఇంగ్లీష్)- ఏప్రిల్ 10జియో హాట్స్టార్🎥 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (యానిమేషన్ సిరీస్/హిందీ)- ఏప్రిల్ 11🎥 ది లాస్ట్ ఆఫ్ అజ్ (హిందీ/ తెలుగు/ ఇంగ్లీష్)- ఏసోనీలివ్🎥 ప్రావింకూడు షాపు (తెలుగు/ మలయాళం)- ఏప్రిల్ 11 జీ5🎥 కింగ్స్స్టన్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 13 -
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), రాజీవ్ కనకాల(Rajeev Kanakala ) మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడంటే ఎన్టీఆర్ షూటింగ్స్, ఫ్యామిలీతో బిజీ అయ్యాడు కాబట్టి స్నేహితలతో కలవలేకపోతున్నాడు. కానీ ఒకప్పుడు మాత్రం ఖాలీ సమయం దొరికితే చాలు రాజీవ్తో పాటు ఒకరిద్దరు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడిపేవాడు. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దవాడైన రాజీవ్తో ఎన్టీఆర్ స్నేహం చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. రాజీవ్ కూడా ఎన్టీఆర్ తనతో స్నేహం చేస్తాడని ఊహించలేదట. అనుకోకుండా వీరిద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్. ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మొదట్లో సార్ సార్ అంటూ మాట్లాడేవాడు. ఓ సారి నేనే ‘సార్ వద్దులే రాజీవ్ అని పిలువు చాలు’ అని చెప్పా. మరుసటి రోజు షూటింగ్కి రాగానే ‘రాజీవ్’ అని పిలిచాడు. నేను ఏదో అలా పిలవమని చెప్పానే అనుకో ఎన్టీఆర్ అలా పిలిచేస్తాడా(నవ్వుతూ..). సరే హరికృష్ణ గారి అబ్బాయి కదా అనుకొని లైట్ తీసుకున్నా. మరుసటి రోజు ‘రాజీవ్ గారు..’ అన్నారు. ‘పోనీలే కనీసం ‘గారు’ చేర్చాడు కదా సంతోషం అన్నుకున్నా. ఆ తర్వాత రోజు ఇంటర్వెల్ సీన్ షూటింగ్ జరుగుతోంది. నేను ఇలా నడుచుకుంటూ వస్తున్నా.. బిల్డింగ్ పైన ఉన్న ఎన్టీఆర్.. ‘ఒరేయ్ రాజా..’ అన్నారు. రాజీవ్గారు నుంచి రారానా? అని షాకయ్యాను. ఏంటి ‘రా’ అంటున్నావ్ అని అడిగా. మరి ఫ్రెండంటే అనరా? ఎన్టీఆర్ అన్నాడు. ఆ తర్వాత ఓ సారి మేమిద్దరమే ఉన్నప్పుడు ఓ విషయం షేర్ చేసుకొని ఎమోషనల్ అయ్యాం. ఆ తర్వాత మరింత క్లోజ్ అయ్యా.. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది’ అని రాజీవ్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ని మొదటి సారి సెట్లో చూసినప్పుడు ఇతనితో పని చేయడమే కష్టం అనుకున్నాడట రాజీవ్. అలాంటింది ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
పెద్ద హీరోల సినిమా విడుదలైతే చాలు ఫ్యాన్స్లో సందడి మామూలుగా ఉండదు. ట్రైలర్ విడుదలైతే వ్యూస్ లెక్కలేసుకుంటారు. సినిమా వచ్చాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో పోటీ పడుతారు. చివరకు తమ హీరోల భారీ కటౌట్స్ ఏర్పాటు విషయంలో కూడా అభిమానులు పోటీ పడుతున్నారు. తమదే రికార్డుగా మిగిలిపోవాలనే తాపత్రయం ఇప్పుడున్న ఫ్యాన్స్లలో క్లియర్గా కనిపిస్తోంది. ఇటీవల్ విజయవాడలో గేమ్ఛేంజర్ సినిమా విడుదల సమయంలో రామ్చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. రామ్చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత భారీ కటౌట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానిని కోలీవుడ్లో అజిత్ ఫ్యాన్స్ బీట్ చేయాలనుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు.కోలీవుడ్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. అతిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడులోని తెంకాశి పట్టణంలో ఉన్న ఒక థియేటర్ వద్ద 285 అడుగుల అత్యంత భారీ అజిత్ కటౌట్ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఇనుముతో తయారు చేసిన ఫెన్సింగ్ గ్రిల్స్ ఏర్పాటు చేసి ఒక్కో భాగాన్ని పెడుతూ వెళ్లారు. అజిత్ తల భాగం ఉంచిన కొద్ది సేపటికే అది కూలిపోయింది. దీనిని గమనించిన జనం వెంటనే అప్రమత్తం అయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.తనకు ఫ్యాన్స్ అసోషియన్స్ వద్దని అజిత్ పలుమార్లు వారించాడు. అయినా అభిమానుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 2019 విశ్వాసం సినిమా విడుదల సమయంలో అజిత్ కటౌట్కు పాలాభిషేకం చేస్తున్న క్రమంలో ఐదుగురు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అజిత్ తీవ్రంగా ఆగ్రహాం చెందారు. వారికి చికిత్స చేయించి ఇలాంటి పనులు మరోసారి చేయకండి అంటూ చెప్పారు. తనకు ఎలాంటి బిరుదులు వద్దు.. సినిమా నచ్చితే చూడండి. కానీ, ఇలాంటి పనులు చేస్తే తాను ఏంతమాత్రం సహించను అని చెప్పాడు. అయితే, ఈ ప్రమాదం గురించి అజిత్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.ఇండియాలోనే అత్యంత భారీ కటౌట్ రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్) 256 అడుగులతో టాప్లో ఉంది. తర్వాత సలార్ (236), కెజిఎఫ్ 2 (216) విశ్వాసం (185) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ రామ్ చరణ్ పేరుతో ఉన్న రికార్డ్ను దాటేద్దాం అనుకున్నారేమో.. అందుకే వారు 285 అడుగుల ఏత్తులో ఉండేలా కటౌట్ను ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఇలా కూలిపోవడంతో అభిమానుల్లో నిరాశ కనిపించింది. Namaku yethuku intha vela!!🤦♂️pic.twitter.com/jzVcKO1n1P— Christopher Kanagaraj (@Chrissuccess) April 6, 2025 -
ఇన్స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
ఐకాన్స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి (Allu Sneha Reddy)కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. సినిమాల్లో నటించకపోయినా ఓ స్టార్ హీరోయిన్కు ఉన్నంత ఫాలోవర్స్లో ఆమెకు ఉన్నారు. తరచు అల్లు అయాన్, అర్హ ఫోటోలను షేర్ చేయడంతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ కూడా ఇస్తుంటారు. అందుకే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను పెద్ద ఎత్తున ఫాలో అవుతుంటారు.తాజాగా స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఓ అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నట్లుగా ఓ ఫోటో షేర్ చేశారు. ‘నాకు ప్రస్తుతం ఏం కావాలంటే’ అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ బ్లడ్ ప్యాకెట్పై ట్రావెల్ అని రాసుంది. దీనిని చూసిన అల్లు అభిమానులు అల్లు కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయ్యిందా అని ఆందోళన చెందుతున్నారు. ఆమెకే హెల్త్ బాగోలేక ఆస్పత్రిలో చేరిందని, ఈ విషయాన్ని చెప్పడానికే ఆ ఫోటోని షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అల్లు స్నేహ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.కాగా,అల్లు అర్జున్-స్నేహల వివాహం 2011 మార్చి 6న జరిగింది. ఈ జంటకి 2014లో అయాన్ జన్మించగా.. 2016లో అర్హ పుట్టింది. అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉంటే..స్నేహ ఫ్యామిలీని చూసుకుంటూ భర్తకు తోడుగా ఉంటుంది. -
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు). నటి రీమాసేన్, ఆండ్రియా కథానాయకిలుగా నటించిన ఇందులో పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషించారు. సెల్వ రాఘవన్( Selvaraghavan) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో విడుదలై అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సెల్వరాఘవన్ అప్పుడే ప్రకటించారు. అయితే, అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కాగా 2021లో ధనుష్ కథానాయకుడిగా యుగానికి ఒక్కడు చిత్రానికి సీక్వెల్ చేస్తానని దర్శకుడు పేర్కొన్నారు. అది జరగలేదు. తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ.. యుగానికి ఒక్కడు సీక్వెల్ చేయాలని తనకు బలంగా ఉందని మరోసారి అన్నారు. అయితే ఆ చిత్రాన్ని చేయాలంటే భారీగా బడ్జెట్ అవసరం ఉందన్నారు. పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వస్తేనే సాధ్యం అవుతుందని తెలిపారు. అలా రూపొందే చిత్రంలో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రను పోషిస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ, మీరో కార్తీ(Karthi) లేకుండా మాత్రం ఈ సినిమా ఊహించుకోలేమన్నారు. ఆయన ఉంటేనే ఈ చిత్రానికి రెండవ భాగం రూపొందుతుందని సెల్వరాఘవన్ పేర్కొన్నారు. ఈ ఇద్దరు హీరోలు ఏడాది పాటు ఈ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం కార్తీ, ధనుష్ ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనే అనుమానం ప్రేక్షకులకు కచ్చితంగా కలుగుతుంది.7/జీ బృందావన కాలని సీక్వెల్పై కామెంట్స్కాగా ప్రస్తుతం దర్శకుడు సెల్వరాఘవన్ తాను ఇంతకుముందు తెరకెక్కించిన 7/జీ బృందావన కాలని 2 చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికీ 50 శాతం పూర్తి చేసుకుందని సమాచారం. 'రవికృష్ణ హీరోగా పార్ట్ 1 క్లైమాక్స్లో కదీర్ (హీరో పాత్ర పేరు)కు జాబ్ రావడం ఆపై అతను ఒంటరిగా మిగిలిపోవడం వరకు మాత్రమే చూపించాం. ఆ తర్వాత పదేళ్లలో అతని జీవితం ఎలా సాగిందనే అంశాలతో సీక్వెల్ ఉంటుంది. సీక్వెల్ కథ ఎలా ఉంటుందో పార్ట్ 1లో క్లూ ఇచ్చాం. అఇయతే, ప్రస్తుత రోజుల్లో దీనిని చిన్న చిత్రంగా విడుదల చేయలేం' అని అన్నారు. -
ఓటీటీలో కోర్ట్ సినిమా.. అఫీషియల్ ప్రకటన
హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని విమర్శకులు సైతం కామెంట్ చేయడం విశేషం. సెన్సిటివ్ పోలీస్ కేసు విషయంలో మన చట్టాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం చెబుతుందని వారు తెలిపారు.'కోర్టు' సినిమా 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని 'నెట్ఫ్లిక్స్'(Netflix) అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ ఓటీటీ కమింగ్సూన్ బ్లాక్లో ఈ సినిమాను చేర్చారు. అందులోనే స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించారు. తెలుగతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుందని నెట్ఫ్లిక్స్ పేర్కొంది. కేవలం రూ. 10 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్కు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సుమారు రూ. 8 కోట్లకు నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో హీరో నానికి మంచిపేరు రావడమే కాకుండా భారీ లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది.ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే. -
ఆర్కియాలజీ నేపథ్యంలో...
సురేష్ రవి, ఆశా వెంకటేశ్ జంటగా జీవీ పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చంద్రేశ్వర’(Chandreswara). బేబీ అఖిల సమర్పణలో డా. రవీంద్ర చారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ‘‘మంచి కాన్సెప్ట్తో రూపొందించిన ఈ క్రైమ్ కామెడీ సస్పెన్స్ ఎంటర్టైనర్ మూవీని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని కోప్రొడ్యూసర్స్ పి. సరిత, వి. బాలకృష్ణ పేర్కొన్నారు.‘‘ఆర్కియాలజీ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీవన విధానం ఎలా ఉండేది? అనే అంశంతో ఈ చిత్రాన్ని డివోషనల్ టచ్తో పాటు వినోద ప్రధానంగా రూపొందించాం’’ అని డా. రవీంద్ర చారి తెలిపారు. -
రామంకు శ్రీకారం
శ్రీరామ నవమి సందర్భంగా ‘రామం’(Ramam) అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి(Venu Donepudi). ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. లోకమాన్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రనిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘ధర్మ సంస్థాపనకు యుద్ధం చేసిన రాముడి అడుగు జాడల్లో నడుస్తూ... ఆయన చూపిన బాట ప్రపంచానికి ఆదర్శం అని చాటి చెప్పే ఓ గొప్ప యోధుడికి సంబంధించిన కథాంశంతో ఈ మూవీని రూపొందించనున్నాం. నేటి కాలానికి అలనాటి రామరాజ్యాన్ని కనెక్ట్ చేస్తూ, ఇప్పటివరకు రానటువంటి వైవిధ్యమైన కథతో ‘రామం’ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఓ యువ తెలుగు నటుడు హీరోగా నటిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం. దేశవ్యాప్త నటీనటులు, సాంకేతిక నిపుణులు, అంతర్జాతీయ సాంకేతిక విలువలతో, అత్యుత్తమ నిర్మాణ ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం’’ అని తెలిపారు. -
తల్లీకొడుకు... యాక్షన్
నందమూరి కల్యాణ్రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా, విజయశాంతి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun Son of Vyjayanthi). సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.ఈ సినిమాలో తల్లీకొడుకు పాత్రల్లో విజయశాంతి, కల్యాణ్రామ్ నటించారు. అర్జున్ పాత్రలో కల్యాణ్రామ్, ఐపీఎస్ పోలీసాఫీసర్ వైజయంతి పాత్రలో విజయశాంతి నటించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్స్ను రిలీజ్ చేశారు. తల్లీకొడుకు యాక్షన్కి సై అన్నట్లుగా ఓ స్టిల్ ఉంది. ‘‘మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో ఈ మూవీ ఆడియన్స్ను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాథ్. -
తెలుగమ్మాయి క్రేజ్.. బాలీవుడ్లో అడుగుపెడుతున్న అనన్య నాగళ్ల!
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు. ముఖ్యంగా తెలుగమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కొంతమంది తెలుగమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ల ముందు వరుసలో ఉంటారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినా అనన్య.. కెరీర్ ప్రారంభంలో 'షాదీ' వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత 'మల్లేశం' మూవీతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. వెంటనే 'ప్లే బ్యాక్' అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. అనంతరం 'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ'(వెబ్ సిరీస్) ' శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనన్య స్మాల్ స్కేల్ వుమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. 'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ' 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్లో టాప్ -2 లో ట్రెండ్ అవుతుండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్- 5లో ట్రెండింగ్లో ఉంది. ఇకపై దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ల బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. తెలుగమ్మాయి అనన్య ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. ఆమె మెయిన్ రోల్లో ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది. -
అంతర్జాతీయ బాలల నాటకోత్సవం.. ముఖ్య అతిథిగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా
నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం నిర్వహిస్తున్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రముఖ నటనా శిక్షణ సంస్థ "నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా" హైదరాబాద్లో మొదటిసారిగా ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, నటుడు అనీష్ కురువిల్ల, డైరెక్టర్లు వినయ్ వర్మ, వెంకట్ గౌడ, రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా, భోపాల్, కేరళ ప్రాంతాలతో పాటు నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొంటున్నాయి.ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికగా ఈ నాటక ఉత్సవం నిలవనుంది. కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. -
మారుతీనగర్ సుబ్రమణ్యం హీరో లేటేస్ట్ మూవీ.. సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తోన్న తాజా చిత్రం బ్యూటీ. ఈ సినిమాకు భలే ఉన్నాడే ఫేమ్ జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్, వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి కన్నమ్మ అనే బ్యూటీఫుల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. ఇక విజయ్ బుల్గానిన్ సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. -
చీరలో ఆహా అనిపించేలా అనన్య!
ప్రెగ్నెన్సీ అందంతో మెరిసిపోతున్న కియారా అడ్వాణీచీరలో అందాల కుందనపు బొమ్మలా అనన్య నాగళ్లప్రాగ్ దేశంలో చిల్ అవుతున్న ఆషికా రంగనాథ్వైరల్ డ్యాన్స్ తో అదరగొట్టేసిన తమిళ బ్యూటీ శ్వాసికగాజు కళ్లతో మాయ చేస్తున్న హీరోయిన్ అవికా గోర్చీరలో అందాలన్నీ చూపించేస్తున్న సిమ్రన్ చౌదరిఅద్దం ముందు అల్లాడించేస్తున్న పాయల్ రాజ్ పుత్ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Swaswika (@swasikavj) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
'ముందు కెరీర్పై ఫోకస్ పెట్టు..' ఏంటి బ్రో ఇలా వాడేస్తున్నారు!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. గతంలో మన చాలామందిని చూశాం. కేవలం సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్లో స్టార్స్ అయిపోయిన వాళ్లున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వివాదం మరింత వైరల్ కావడంతో కొందరైతే ఏకంగా రీల్స్ కూడా చేసేస్తున్నారు.అయితే తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని ఏకంగా సినిమా ప్రమోషన్స్లోనూ వాడేస్తున్నారు. టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. హీరోయిన్ రూప కొడువాయూర్తో కలిసి ప్రియదర్శి ప్రమోషన్స్ చేశారు.అయితే ఇద్దరు కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం తరహాలో సారంగపాణి జాతకం ప్రమోషన్ చేశారు. ఇందులో హీరోయిన్ ఓ డ్రెస్ చూపిస్తూ చాలా బాగుంది కదా.. అంటూ ప్రియదర్శిని అడుగుతుంది. అది చూసిన హీరో వావ్ సూపర్.. రేటు చూసి రూ.14999 నా అంటూ నోరెళ్లబెడతాడు. ఆ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ స్టైల్లో హీరోకు ఇచ్చి పడేస్తుంది. ముందు కెరీర్పై ఫోకస్ చేయ్.. డ్రెస్సె కొనలేనివాడిని.. ప్రేమ, పెళ్లి జోలికి పోవద్దు.. అంటూ ప్రమోషన్స్లో భాగంగా హీరో ప్రియదర్శితో మాట్లాడుతుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ను ఇలా కూడా వాడేస్తున్నారా? అంటూ పోస్టులు పెడుతున్నారు.#alekhyachittipickles ni ila KudaVaaduthunnara😭😂#SarangapaniJathakam pic.twitter.com/KfgAzzS6PH— Urstruly Vinodh (@UrsVinodhDHFM) April 5, 2025 -
సినీ నటి హేమ సీరియస్.. కరాటే కల్యాణి, తమన్నాకు నోటీసులు!
టాలీవుడ్ సినీ నటి హేమ చర్యలకు దిగింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్కి లీగల్ నోటీసులు పంపించింది. కరాటే కల్యాణి , తమన్నా సింహాద్రితో పాటు మరి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులిచ్చింది. ఈ నిర్ణయంతో తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది హేమ. గతంలో తన పరువు, పతిష్టకు భంగం కలిగేలా వీరు కామెంట్స్ చేశారంటూ... అంతేకాకుండా తనను కించపరిచేలా మాట్లాడారని హేమ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి నోటీసులు జారీ చేసింది. కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత బెయిల్పై ఆమె విడుదలయ్యారు. ఆ తర్వాత తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.మా సస్పెన్షన్ ఎత్తివేత..బెంగళూరు రేవ్ పార్టీ కేసు తర్వాత మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించారు. ఆ తర్వాత అయితే హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాకుండా కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో హేమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రకటించింది. -
గాయపడ్డ 'బిగ్ బాస్' ఆదర్శ్.. కాలికి సర్జరీ
తెలుగులో పలు సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ. అలానే బిగ్ బాస్ తొలి సీజన్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. చాన్నాళ్లు తెరపై కనిపించిన ఇతడు.. తాజాగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని చెబుతూ తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు)ఆదర్శ్ పోస్ట్ చేసిన వీడియో బట్టి చూస్తే.. మోకాలి మజ్జ దగ్గర గాయమైంది. దీంతో సర్జరీ చేశారు. తర్వాత ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ లాంటివి కూడా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి, త్వరలో కమ్ బ్యాక్ ఇస్తానని రాసుకొచ్చాడు.2005 నుంచి ఆదర్శ్.. ఇండస్ట్రీలో ఉన్నాడు. హ్యాపీడేస్, గోవిందుడు అందరివాడేలే, సరైనోడు, గరుడ వేగ, కలర్ ఫోటో, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటించాడు. మరి ఈ మధ్య ఏమైందో ఏమో తెలీదు గానీ కాలికి సర్జరీ చేయించుకున్నాడు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు) View this post on Instagram A post shared by aadarsh balakrishna (@aadarshbalakrishna) -
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
నేడు (ఏప్రిల్ 06) శ్రీరామనవమి. ఈ పండగను పురస్కరించుకుని బుల్లితెర సెలబ్రిటీలు, వెండితెర నటీనటులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబయ్యారు. ట్రెడిషనల్ లుక్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. యాంకర్ లాస్య అయితే కుటుంబంతో కలిసి అయోధ్య రాములవారిని దర్శించుకుంది. తారల పోస్టులు మీరు చూసేయండి.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Shobha Shetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్రాజ్ పోస్ట్ వైరల్!
శ్రీరామనవమి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా అదొక్కటే. అదే సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించిన లవకుశ. ప్రతిష్టాత్మకమైన ఈ ఫెస్టివల్ వచ్చిందంటే టీవీల్లో లవకుశ సినిమా చూసేయాల్సిందే. ఈ చిత్రంలో ముఖ్యంగా రామకథను వినరయ్యా అంటూ లవకుశలు పాడే పాట హైలెట్. ఈ పాటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తుంది. ఇంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ పాటను పాడిందెవరో తెలుసా? అలనాటి సింగర్స్ సుశీల, లీల.అయితే ఇవాళ శ్రీరామనవమి కావడంతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే టాలీవుడ్ నటుడు ధన్రాజ్ పండుగ వేళ ఈ పాటకు వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చిన లవకుశ చిత్రంలోని పాటను పాడింది వీరిద్దరు అక్కా చెల్లెళ్లు అంటూ సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్స్ పాట పాడింది వీరు కాదంటూ కామెంట్స్ చేశారు.ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న ధన్రాజ్.. తాను పెట్టిన పోస్ట్కు క్షమాపణలు చెప్పాడు. ఈ పాట పాడింది వీరిద్దరు కాదు.. పి సుశీల, పి. లీల గార్లు.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సారీ అంటూ మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే ధనరాజ్ ఇటీవలే రామం రాఘవం చిత్రంతో అభిమానుల ముందుకొచ్చారు. హీరోగా నటిస్తూ.. తానే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు.లవకుశ సినిమలో పాడింది p. సుశీలమ్మ,, లీల గార్లు sorry for wrong information 🙏🏿— Dhanraj koranani (@DhanrajOffl) April 6, 2025 -
పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు
లెక్క ప్రకారం రామ్ చరణ్ పుట్టినరోజు నాడే 'పెద్ది' సినిమా (Peddi Movie) గ్లింప్స్ రిలీజ్ కావాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా తాజాగా శ్రీరామనవమి కానుకగా విడుదల చేశారు. వీడియో బాగుంది. చివరి షాట్ కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ దగ్గరే అసలు సమస్య వచ్చినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)ఎందుకంటే వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి 27న థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్నిరోజుల క్రితం నాని 'ద ప్యారడైజ్' (The Paradise Movie) చిత్రాన్ని వచ్చే మార్చి 26న విడుదల చేస్తామని పేర్కొన్నాడు. అంటే ఈ రెండు చిత్రాల మధ్య పోటీ కన్ఫర్మ్ అయింది.ఇక్కడ చరణ్, నాని మధ్య పోటీ కాదు. మరో ఇద్దరి మధ్య కూడా ఉందని చెప్పొచ్చు. చరణ్ (Ram Charan) ఇదివరకే తండ్రి చిరంజీవితో సినిమా నిర్మించారు. నాని కూడా త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాబట్టి పెద్ది మూవీతో పోటీ పడతాడా అంటే సందేహమే అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)ప్యారడైజ్ తీస్తుంది శ్రీకాంత్ ఓదెల కాగా.. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు. వీళ్లిద్దరూ కూడా సుకుమార్ శిష్యులే. ఒకవేళ పోటీ కచ్చితం అయితే మాత్రం సుక్క శిష్యుల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. మరోవైపు ప్యారడైజ్ కి అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా.. పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పోటీనే అనుకోవచ్చు. ఇలా ఒక్కరు కాదు ఈ రెండు చిత్రాల వల్ల ఏకంగా తలో ముగ్గురు మధ్య పోటీ అనుకోవచ్చేమో. మరి ఈ రెండింటిలో ఏది చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారనేది కూడా చూడాలి.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్) -
లైఫ్ మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్
ఈ వీకెండ్ లో థియేటర్లలో రిలీజైన లవ్ యూవర్ ఫాదర్ సినిమా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చిత్రీకరించారు. ఎస్పీ చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)ఈ సినిమా సక్సెస్ కావడంతో మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిత్రాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. చాలామంది ఫోన్లు చేసి ఈ సినిమా చూసిన తర్వాత తండ్రి గుర్తొస్తున్నారని చెబుతున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. నిజంగా ఈ సినిమాకి ఇంతలా కనెక్ట్ అయినందుకు హ్యాపీగా ఉందని చెప్పారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా) -
కాబోయే భార్యతో అక్కినేని అఖిల్.. పెళ్లి కళ వచ్చేసిందా?
టాలీవుడ్లో అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ కూడా ఆలస్యమైంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. అఖిల్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు. అయితే త్వరలోనే అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ ఇప్పటికే ట్విటర్ ద్వారా హింట్ ఇచ్చాడు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. అఖిల్ త్వరలోనే వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన ప్రియురాలు జైనాబ్ రావ్జీతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి పీటలెక్కుతారని టాక్ వినిపించింది. కానీ అలా జరగలేదు. దీంతో మరోసారి టాలీవుడ్లో అఖిల్ పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది.ోఈ నేపథ్యంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోయే అఖిల్, జైనాబ్ జంటగా కనిపించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని సందడి చేశారు. ఇది చూసిన నెటిజన్స్.. చూడ ముచ్చటగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వీరి పెళ్లి పనులతో బిజీగా ఉన్నారేమో అంటూ పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరు జంటగా వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి అఖిల్ పెళ్లిపై చర్చ మొదలైంది. అయితే ఈనెల 8న అఖిల్ పుట్టినరోజు కావడంతో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లారా? అని మరికొందరు చర్చించుకుంటున్నారు. #TFNExclusive: Hero @AkhilAkkineni8 and #ZainabRavdjee get papped walking hand in hand at the Hyderabad airport!!❤️📸#AkhilAkkineni #Akhil6 #TeluguFilmNagar pic.twitter.com/oDD6SU2sMq— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2025 -
రోజుకి రూ.లక్ష..అయినా ఊటీలో సినిమా షూటింగ్స్ బంద్...ఎందుకంటే?
దక్షిణాది ఉత్తరాది తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాల షూటింగ్ లకు స్వర్గధామం లాంటిది తమిళనాడులోని ఉదకమండలం...అదే ఊటీ(Ooty) . మన రోజా, గీతాంజలి తదితర దక్షిణాది చిత్రాలతో పాటు నాటి ‘ఖయామత్ సే ఖయామత్ తక్ నుంచి నిన్నా మొన్నటి బర్ఫీ దాకా ఊటీ అంటే సినిమా షూటింగ్లకు అచ్చొచ్చిన బ్యూటీగా నిలిచింది. ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ,‘ ‘అందాజ్ అప్నా అప్నా,‘ ‘బర్ఫీ,‘ ‘దిల్ సే,‘ ‘జో జీతా వోహీ సికందర్,‘ ‘రాజా హిందుస్తానీ,‘ వంటి బాలీవుడ్ సినిమాలు ఊటీ అందాలకు అద్దం పట్టాయి.ఏళ్లు గడుస్తున్నా, అనేక రకాల షూటింగ్ స్పాట్స్ అందుబాటులోకి వస్తున్నా ఊటీకి మాత్రం షూటింగ్స్ తాకిడి తగ్గడం లేదు. ఇటీవల ‘రివర్డేల్‘ అనే కాల్పనిక పట్టణానికి నేపథ్యంగా నెట్ఫ్లిక్స్ చిత్రం ‘ది ఆర్చీస్‘ కూడా ఊటీలో చిత్రీకరించారు. అలాగే ది లారెన్స్ స్కూల్, లవ్డేల్తో సహా ‘రాజ్‘ చిత్రం కూడా ఊటీలో తీసినవే. ఏటా వందలాదిగా షూటింగ్స్ కు ఊటీ కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, టాయ్ ట్రైన్ తదితర ప్రాంతాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న తేయాకు తోటలు కూడా సినిమా కెమెరాలకు పని చెబుతూనే ఉంటాయి.ఈ నేపధ్యంలో ప్రస్తుతం పర్యాటకుల తాకిడితో ఊటి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా గత ఏడాది కనీ విని ఎరుగని స్థాయిలో భారీ సంఖ్యలో పర్యాటకులు ఊటీకి వెల్లువెత్తారు. ఊటీకి వెళ్లేదారిలో భారీగా ట్రాఫిక్ జామ్స్ సైతం ఏర్పడ్డాయి. ఇక గత వేసవిలో ఊటీలో కాలుష్యం ఎన్నడూ లేనంత స్థాయిలో నమోదైంది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇ పాస్ వంటి నిబంధనలతో పర్యాటకుల రాకను నియంత్రించింది. రాకపోకలను కట్టుదిట్టం చేసింది. అయితే గత ఏడాది అనుభవాలతో ఈ సారి ప్రభుత్వం మరింత ముందుగా మేల్కొంది. ముందస్తుగానే అంటే ఏప్రిల్ నెల రాకుండానే ఇ పాస్ నిబంధన విధించడంతో పాటు ఊటీలోకి 6వేల వాహనాలకు మాత్రమే ఎంట్రీ వంటి పలు ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమంలో సినిమా షూటింగ్స్ పైనా నిషేధం విధించింది. ఈ ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ప్రభుత్వ బొటానికల్ గార్డెన్, గవర్నమెంట్ రోజ్ గార్డెన్ సహా ఎనిమిది పార్కులలో సినిమా షూటింగ్లను అక్కడి ఉద్యానవన శాఖ తాత్కాలికంగా నిషేధించింది. వందల, వేల సంఖ్యలో పర్యాటకులు తమ సెలవులను ఆస్వాదించేందుకు ఈ పార్కులను సందర్శిస్తుండటంతో వారికి ఇబ్బందులు ఎదురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యానవన శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘‘మేము చెన్నైలోని మా ఉద్యానవన శాఖ డైరెక్టర్ నుంచి సరైన అనుమతి పొందిన తర్వాత మాత్రమే చిత్ర యూనిట్లను అనుమతిస్తున్నాం. సినిమా నిర్మాతలు ఒక రోజు షూటింగ్ కోసం కనీసం 25,000 నుంచి గరిష్టంగా 1 లక్ష వరకు చెల్లించాలి. అయితే, వేసవి సెలవుల కారణంగా ఈ ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊటీలోని పలు పార్కులలో అన్ని సినిమా షూటింగ్లను తాత్కాలికంగా నిషేధించాం’’ అని చెప్పారు. -
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ (Ntr) ఓ సినిమా ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన మ్యాడ్ స్క్వేర్ (Mad Square) సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. చాలా హుషారుగా కనిపించాడు. తన కొత్త సినిమా సంగతుల్ని కూడా బయటపెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ బక్కగా మారిపోవడం మాత్రం అభిమానులకు షాకిచ్చింది. ఇంతకీ ఏంటీ కారణం?'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్న తారక్.. 'దేవర'తో (Devara Movie) బ్లాక్ బస్టర్ కొట్టాలనుకున్నాడు. కానీ ఓ మాదిరి వసూళ్లే వచ్చాయి. మొన్నీమధ్య జపాన్ లోనూ ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)ఈ మూవీ షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా జాయిన్ కాలేదు. త్వరలో సెట్ లోకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాలో పావుగంట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని, దీనికోసమే సన్నగా మారిపోయాడని తెలుస్తోంది. దాని షూటింగ్ పూర్తయిన తర్వాత యధావిధిగా తన పాత లుక్ లోకి వచ్చేస్తాడని అంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. తారక్ సినిమాతో ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అనుకుంటున్నారు. మరి చెప్పిన టైంకి రిలీజ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇది పూర్తయిన తర్వాత తారక్.. దేవర 2 చేస్తాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్) -
'65 ఏళ్ల ముసలాడికి 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమ'.. కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ (Mohanlal) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హృదయపూర్వం. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో మాళవికా మోహనన్ (Malavika Mohanan) కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఆమె సెట్లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మోహన్లాల్తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో కూడా ఉంది. హృదయపూర్వం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.కుటుంబంలా..ఒక సినిమా కంప్లీట్ చేసుకుని మరో సినిమా చేస్తున్నప్పుడు కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు. లేదంటే మంచి సహనటుల్లా ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రమే అంతా ఒకే కుటుంబంలా అనిపిస్తుంది. ఈ సినిమా సెట్లో నాకు అలాగే అనిపించింది. నాకెంత సంతోషంగా ఉందో! మోహన్లాల్ సర్, సత్యన్ సర్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇలాంటి గొప్పవారితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన ఓ వ్యక్తి వీరిని తప్పుపడుతూ కామెంట్ చేశాడు. వయసుతో పని లేదా? ఇదేంటి?65 ఏళ్ల ముసలాయన.. 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమాయణం.. ఈ ముసలి హీరోలు వారి వయసుకు సంబంధం లేని పాత్రల్ని పోషించేందుకు ఎందుకంత ఆసక్తి చూపిస్తారో అర్థం కాదు అని రాసుకొచ్చాడు. దీనికి మాళవిక స్పందిస్తూ.. సినిమాలో అతడు నన్ను ప్రేమిస్తాడని నీకెవరు చెప్పారు? నీకు నువ్వే కథలు అల్లేసుకుని ఏది పడితే అది మాట్లాడకు. నువ్వేదో ఊహించుకుని అవతలివారిని నిందించకు అని ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఈ కామెంట్స్ను తర్వాత డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాహృదయపూర్వం సినిమా విషయానికి వస్తే.. సత్యన్ అంతికాండ్ దర్శకత్వం వహించగా ఆంటోని పెరుంబవుర్ నిర్మిస్తున్నారు. గతేడాది తంగలాన్, యుద్ర సినిమాలతో అలరించిన మాళవిక ప్రస్తుతం ద రాజా సాబ్, సర్దార్ 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: బాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత -
బీజేపీ సపోర్ట్.. అయినా నో రిలీజ్.. ‘అరి’కష్టాలు
సినిమా పరిశ్రమ అనేది ఒక వింతైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని సినిమాలు ఇలా షూటింగ్ని ప్రారంభించి..అలా థియేటర్స్లోకి వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం ఏళ్ల తరబడి ల్యాబ్కే పరిమితం అవుతుంటాయి. అయితే వీటిల్లో కొన్ని చిత్రాలు సరైన కంటెంట్ లేక ఆగిపోతే..మరికొన్ని మాత్రం డిఫరెంట్ కంటెంట్, ఎవరూ టచ్ చేయలేని, ట్రెండింగ్ పాయింట్ ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఈ కోవలోకి చెందిన చిత్రమే ‘అరి’ (Ari Movie). ‘పేపర్ బాయ్’తో సూపర్ హిట్ అందుకున్న జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయి దాదాపు రెండేళ్లు కావోస్తోంది. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందు గీతా ఆర్ట్స్లో జయశంకర్ ఓ సినిమా చేయాల్సింది. స్క్రిప్ట్తో పాటు ప్రీప్రొడక్షన్ పనులు కూడా షూరు అయ్యాయి. కానీ లాక్డౌన్ కారణంగా ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని కొత్త నిర్మాతలతో కలిసి ‘అరి’ సినిమాను తెరకెక్కించాడు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలపై స్టోరీ రాసుకున్నాడు. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి అగ్ర తారాగణంతో సినిమాను రిచ్గా తెరకెక్కించాడు.గతేడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. టీజర్, ట్రైలర్తో పాటు మంగ్లీ ఆలపించిన కృష్ణుడి సాంగ్ని కూడా రిలీజ్ చేశారు. ప్రచార చిత్రాలన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంతి కిషన్రెడ్డి సైతం ఈ సినిమాకు సపోర్ట్గా నిలిచారు.వెంకయ్య నాయుడు,‘ఇస్కాన్’ ప్రముఖులు, చిన్న జీయర్ స్వామితో పాటు పలు హిందు సంఘాలు ఈ సినిమా చూసి చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఇదంతా ఏడాది క్రితం జరిగిన విషయం. అదే సమయంలో సినిమా రిలీజ్ చేసి ఉంటే.. సినిమాకు వచ్చిన బజ్ ఎంతో కొంత ఉపయోగపడేది. కారణం ఏంటో కానీ అప్పుడు సినిమా రిలీజ్ కాలేదు.ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ని మళ్లీ స్టార్ట్ చేశారు. నిన్న ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్తో ఈ సినిమా థీమ్ సాంగ్ని రిలీజ్ చేయించారు. 'భగ భగ..' అంటూ సాగే ఈ పాటకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సారి కూడా రిలీజ్ డేట్ని ప్రకటించలేదు మేకర్స్. ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో పాటు బీజేపీ అగ్రనాయకుల సపోర్ట్ ఉన్నప్పటికీ సినిమా ఎందుకు విడుదల కావడంలేదో తెలియదు. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను త్వరగా రిలీజ్ చేసుకుంటేనే మంచిది. ఆలస్యం అయ్యేకొద్ది కంటెంట్ పాతదై రొటీన్ చిత్రంగా మారే అవకాశం ఉంటుంది. కొత్త నిర్మాతలకు ఈ విషయం తెలియాదా? లేదా తెలిసినా విడుదల విషయాన్ని లైట్ తీసుకుంటున్నారా? ఏదేమైనా ఆలస్యం అమృతం విషం. -
హీరోయిన్గా అవకాశాలు రాక ఐటం సాంగ్? కేతిక ఏమందంటే?
‘అది దా సర్ ప్రైజ్’ అనే పాటలోని హుక్ స్టెప్తో ఎంతోమందికి నచ్చిన కేతికా శర్మ (Ketika Sharma), అంతే ఎక్కువగా ట్రోలింగ్ను కూడా ఎదుర్కొంది. ఎన్ని తిట్టినా, ఎంత పొగిడినా తన పని తాను చూసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న కేతికా చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మూవ్మెంట్స్ చెప్పినప్పుడు లోతుగా ఆలోచించను. వాళ్ళు చెప్పినవి చెప్పినట్టుగా సమయానికి ఎలా చేయగలను అనే దాని మీదే నా దృష్టి ఉంటుంది. హీరోయిన్గా అవకాశాలు రాక ఐటమ్ సాంగ్ చేయలేదు. ఈ మధ్య కాలంలో ఒక్క ఐటమ్ సాంగ్ దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చిపెడుతోంది.లక్నోలో స్కూలింగ్ చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ వరకు చదివాను. పదహారేళ్ల వయసులోనే మోడలింగ్లోకి వచ్చాను. ‘థగ్స్’ అనే మ్యూజిక్ ఆల్బమ్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లు. మోడలింగ్కి అభ్యంతరం చెప్పలేదు. కానీ, హీరోయిన్ అవుతానంటే మాత్రం ఒకటికి వందసార్లు ఆలోచించారు. ఏడాది టైమ్ ఇచ్చారు. అదృష్టం కొద్దీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో వాళ్లు మరో మాట మాట్లాడలేదు.సోషల్ మీడియాలో ఎన్ని డబ్ స్మాష్ వీడియోలు చేశానో లెక్కే లేదు. ఆ వీడియోలు చూసే దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘రొమాంటిక్’ సినిమాలో హీరోయిన్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతానని అనుకోలేదు. కాని, సినిమా ఫ్లాప్ అవుతుందని ఊహించలేదు. కొన్ని రోజులు మూడౌట్ అయ్యాను.జీవితంలో మరిచిపోలేని సందర్భం అంటే, ‘రొమాంటిక్’ సినిమా లాస్ట్ డే షూటింగ్. అదే రోజు నాగశౌర్య హీరోగా ‘లక్ష్య’ సినిమా ఆఫర్ వచ్చింది. మొదటి సినిమా విడుదల కాకుండానే, రెండో సినిమా అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది.ఇద్దరు స్టార్ బ్రదర్స్తో కలిసి నటించడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్. ‘బ్రో’లో సాయి ధరమ్ తేజతో, ‘రంగ రంగ వైభవంగా’లో అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్తో కలిసి నటించినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, థ్రిల్గానూ ఫీలయ్యాను.చదవండి: అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..? -
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
'పెద్ది' సినిమాతో దుమ్మురేపేందుకు రామ్చరణ్ రెడీ అయిపోయాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన రామ్చరణ్ ఫస్ట్ లుక్కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షాట్ పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామ నవమి (ఏప్రిల్ 6) సందర్భంగా విడుదలైన తొలి షాట్ అదిరిపోయింది. ఫస్ట్ బాల్కే చరణ్ సిక్సర్ కొట్టేశాడని చెప్పవచ్చు. తన జట్టును గెలిపించేందుకు మాస్ లుక్లో బరిలోకి దిగాడు చరణ్. సినీ అభిమానులను మెప్పించేలా పెద్ది గ్లింప్స్ ఉంది. గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఈ సినిమా బయటపడేస్తుందని ఆయన ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్లో తెలిపారు.జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించగా కెమేరామెన్గా ఆర్. రత్నవేలు ఉన్నారు. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం ఉంటుందని రామ్చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. -
మోహన్లాల్ కారు డ్రైవర్కు ఐటీ నోటీసులు..
మలయాళ చిత్రపరిశ్రమలో 'L2 ఎంపురాన్' చిత్రం చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పలువురికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు పంపింది. ఈ సినిమా నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ చిత్ర దర్శకుడు, నటుడు పృథ్విరాజ్ సుకుమారన్కు కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా లూసిఫర్-1 నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్కు కూడా ఐటీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 2019లో విడుదలైన సినిమాకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు.లూసిఫర్-1 నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్కు నోటీసులు ఇవ్వడం వెనుక 'L2 ఎంపురాన్' కారణం కాదని ఐటీ శాఖ పేర్కొంది. 'మరక్కార్: అరేబియా సముద్ర సింహం, లూసిఫర్' సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై స్పష్టత ఇవ్వాలని నోటీసులో తెలిపింది. ఈ నెలాఖరులోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆంథోనీ పెరుంబవూరును ఐటీ శాఖ కోరింది. 2022లో మొత్తం సినిమా పరిశ్రమలో ఐటీ దాడులు చేసిందని, దానికి కొనసాగింపుగానే ఈ చర్య తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. సినిమాకు సంబంధించి ఓవర్సీస్ హక్కులు, నటీనటులకు చెల్లించే రెమ్యూనరేషన్ వంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వాలని ఆంథోనీ పెరుంబవూరును అధికారులు ప్రధానంగా ప్రశ్నించారు.మోహన్లాల్ కారు డ్రైవర్ 'ఆంటోనీ పెరుంబవూర్'మోహన్లాల్కు వీరాభిమాని 'ఆంటోనీ పెరుంబవూర్'.. సుమారు 20 ఏళ్ల క్రితం ఆంటోనీ సొంతూరులో మోహన్లాల్ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ కోసం కొన్ని కార్లు అవసరం రావడంతో అక్కడే ఉన్న ఒక కాంట్రాక్టర్తో ఆ చిత్ర నిర్మాత ఒప్పందం చేసుకున్నాడు. అలా తొలిసారి మోహన్లాల్ వద్దకు తాత్కాలిక డ్రైవర్గా ఆంటోనీ వెళ్లాడు. ఆ సినిమా పూర్తి అయిన కొద్దిరోజులకు మోహన్లాల్కు పర్సనల్ డ్రైవర్ కావాలని అనుకున్నాడు. అప్పుడు ఆయనకు వెంటనే గుర్తొచ్చిన పేరు ఆంటోనీ.. వెంటనే అతన్ని పిలిచి తన వద్ద పనిచేస్తావా..? అని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆయన కూడా వెంటనే ఒప్పుకొని పనిలో సెట్ అయ్యాడు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అప్పటికే స్టార్ హీరోగా ఉన్న మోహన్లాల్ చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టాలనుకున్నాడు. దీంతో తనే ఫైనాన్షియర్గా ఉంటూ ఆంటోనీని నిర్మాతను చేశాడు. అలా ఆయన చాలా సినిమాలకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా విడుదల చేశాడు. L2 ఎంపురాన్ ప్రాజెక్ట్లో కూడా అంటోనీ నిర్మాతగా ఉన్నారు. -
జాట్: ఓరామ శ్రీరామ సాంగ్ రిలీజ్
బాలీవుడ్ హీరో సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాట్. ఈ చిత్రంతో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. నేడు (ఏప్రిల్ 6) శ్రీరామనవమి కావడంతో జాట్ మూవీ నుంచి ఓ రామ శ్రీరామ పాట రిలీజ్ చేశారు. పవర్ఫుల్ మ్యూజిక్తో ఆకట్టుకుంటున్న ఈ పాటకు థమన్ సంగీతం అందించాడు. అద్వితీయ వొజ్జల, శృతి రంజని సాహిత్యం అందించగా ధనుంజయ్ సీపన, సాకేత్ కొమ్మజోస్యుల, సుమానస్ కసుల, సాత్విక్, వాగ్దేవి కుమార ఆలపించారు. చదవండి: 'జాట్' తెలుగు వర్షన్కు ఇబ్బంది ఏంటి..? -
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఆలసించిన ఆశాభంగమే! పురజనుల వేడుకోలు వలన కొద్ది రోజులు మాత్రమే హెచ్చింపబడినది. తెనుగు టాకీల కనులారా వీక్షించి జన్మము సార్థకము చేసికొనుడు. అనేకులకు టిక్కెట్లు దొరకక వెనుకకు మరలిపోవలసి వచ్చుచున్నది. – దుర్గా కళా మందిరం, బెజవాడ. (93 ఏళ్ల క్రితం, ఆనాటి పత్రికల్లో వచ్చిన ఒక సినిమా ప్రకటన ఇది).∙∙ ఈ మాటాడు చిత్రమును చూడని వారి జన్మ నిరర్థకము. ఒకవేళ మీకు తెలుగు భాషయందు ప్రవేశము లేకున్నను, ఒక దఫా వచ్చి కనులార గాంచవలసిందే. – సెలక్టు పిక్చర్సు సర్క్యూట్స్, బెంగుళూరు. (ఇది కూడా అదే సినిమాకు సంబంధించిన వాల్ పోస్టర్ ప్రకటన). ఆ సినిమా : శ్రీరామ పాదుకా పట్టాభిషేకము! శ్రీరాముడి పాత్ర ఉన్న తొలి తెలుగు టాకీ చిత్రం. సినిమాల్లో ఇప్పటికీ శ్రీరాముడంటే శ్రీ నందమూరి తారక రామారావు అన్నట్లుగానే ఉంటుంది. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తే– ఆయన ఆ పాత్రలో కాక, ఏకంగా శ్రీరాముడిలోనే ఒదిగిపోయారా అన్నట్లుగా ఉంటుందని ఆయన అభిమానులు అంటారు. శ్రీ రాముడిగా ఎన్టీఆర్ తొలి సినిమా ‘సంపూర్ణ రామాయణం’ (1958). రెండోది లవకుశ (1963), మూడు రామదాసు (1964), నాలుగు శ్రీరామాంజనేయ యుద్ధం (1975), ఐదు శ్రీరామ పట్టాభిషేకం (1978). ఎన్టీఆర్ కంటే ముందు అక్కినేని నాగేశ్వరరావు; ఎన్టీఆర్ తర్వాత హరనాథ్, శోభన్బాబు, కాంతారావు, రవికుమార్, శ్రీకాంత్, సుమన్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ శ్రీరాముడి పాత్రల్లో కనిపించారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు, ఏఎన్నార్ కంటే కూడా ముందు... తొలిసారి తెలుగు తెర మీద ప్రత్యక్షమైన రాముడొకరు ఉన్నారు. ఆయనే యడవల్లి సూర్యనారాయణ!∙∙ ‘జననానికి’ ముందే ‘పట్టాభిషేకం’తెలుగులో తొలి మాటల చిత్రం (టాకీ) ‘భక్త ప్రహ్లాద’ అయితే రెండో టాకీ చిత్రం ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. రెండూ ఒకే ఏడాది పూర్తయ్యాయి. భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరిలో, శ్రీరామ పాదుకా పట్టాభిషేకం 1932 డిసెంబరులో విడుదలయ్యాయి. ఈ రెండో చిత్రంలోనే రాముడిగా నటించారు యడవల్లి సూర్యానారాయణ. అంటే, ఏఎన్నార్ రాముడిగా నటించిన ‘సీతారామ జననం’ (1944) చిత్రానికి పన్నెండేళ్లకు ముందు, ఎన్టీయార్ తొలిసారి రాముడిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి 26 ఏళ్లకు ముందే ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’లో రాముడి పాత్రను పోషించి, తెలుగు టాకీ తొలి రాముడిగా ప్రఖ్యాతిగాంచారు యడవల్లి. ∙∙ యువ దర్శకుడి చేతిలో తొలి రాముడు‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రాన్ని బాదామి సర్వోత్తమ్ దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ వారు నిర్మించారు. సీతగా సురభి కమలాబాయి నటించారు. రాముడు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చేవరకు, సింహాసనంపై రాముడి పాదుకలను (పాదరక్షలను) ఉంచి భరతుడు రాజ్యపాలన చేయటమే ఈ చిత్ర కథాంశం. బాదామి సర్వోత్తమ్ (1910–2005) ఇరవై ఏళ్ల వయసులో ముంబైలోని ‘సాగర్ మూవీ టోన్’ కంపెనీలో పని చేస్తూ ఆ స్టూడియో వాళ్లు నిర్మించిన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ సినిమాలలో తొలి టాకీ చిత్రాలకు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహిస్తే, రెండు భాషల్లోనూ తర్వాతి చిత్రాలకు బాదామి సర్వోత్తమ్ దర్శకత్వం వహించారు. ఇరవై రెండేళ్ల వయసుకే ఆయనకు ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. సీతమ్మగా ‘కమలమ్మ’‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రంలో సీతగా నటించే నాటికి సురభి కమలాబాయి వయసు 25 ఏళ్లు. తొలి తెలుగు సినిమా నటి. గాయని. 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’లో లీలావతి పాత్రను ధరించారు. రంగస్థల కుటుంబంలో జన్మించిన కమలాబాయి బాల్యంలో కృష్ణుడిగా, ప్రహ్లాదుడిగా నటించారు. కౌమార దశ దాటాక మగ పాత్రలు వేయటం మాని, మహిళల పాత్రలలోకి వచ్చేశారు. కమలాబాయి నటనా ప్రతిభ గురించి విని సాగర్ స్టూడియోస్ వాళ్లే ఆమెను సగౌరవంగా బొంబాయి ఆహ్వానించారు. ఆ స్టూడియో ఆర్టిస్ట్గా కమలాబాయి పదేళ్ల పాటు అక్కడే ఉండి, వారు నిర్మించిన అనేక సినిమాలలో నటించారు. ∙∙ రాముడి పాత్ర ‘సాగర్’ ఇచ్చిందేతొలి తెలుగు సినీ రాముడు యడవల్లి సూర్యనారాయణ (1888–1939) కూడా రంగస్థలం నుంచి వచ్చినవారే. సినిమాల్లోకి రాకముందు రంగస్థలంలో ఆయన సూపర్ స్టార్. వివిధ నాటక సమాజాలతో ఉన్న సత్సంబంధాలున్న వారి ప్రోత్సాహంతో ఆయన కూడా సాగర్ మూవీటోన్ గ్రూప్ వారి ప్రతిష్ఠాత్మక యాక్టర్ అయిపోయారు. ‘పాదుకా పట్టాభిషేకంలో’ శ్రీరాముడి పాత్రకు ఎంపికయ్యారు. సినిమాల్లోకి వచ్చేసరికి యడవల్లి వయసు 46 ఏళ్లు. అప్పట్నుంచి మూడేళ్లు సినిమాల్లో ఉండి, తిరిగి నాటక రంగంవైపు వచ్చారు. -
అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..?
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారు పెళ్లి ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నారట. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళ్లోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇక్కడ 'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్లో ఆమె బోల్డ్గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి.అభినయ, సన్నీ వర్మల వివాహాం ఏప్రిల్ 16న జరగనున్నట్లు తెలుస్తోంది. ఆమె సన్నిహితులకు ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారట. హైదరాబాద్లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. అభినయ పుట్టుకతోనే మాటలు రావు, వినిపించవని తెలిసిందే. అయినప్పటికీ తన టాలెంట్తో సినిమాల్లో రాణించింది. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు సన్నీ వర్మతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది. అతనికి కూడా పుట్టుకతోనే మాటలు రావని ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు. అయితే, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.ఆమె ఇటీవలే నిశ్చితార్థం సమయంలో తీసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో అభినయ పంచుకుంది. తనకు కాబోయే భర్తను ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబం కూడా వ్యాపార రంగంలో ఉందని సమాచారం. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
'జాట్' తెలుగు వర్షన్కు ఇబ్బంది ఏంటి..?
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా 'జాట్'. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారీ మాస్ యాక్షన్ సీన్స్ కనిపించడంతో వారికి కొత్తగా జాట్ సినిమా కనిపిస్తోంది. తమన్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. రీసెంట్గా ఊర్వశి రౌతేలా స్టెప్పులేసిన ఒక స్పెషల్ సాంగ్ను విడుదల చేసి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా తెలుగులో విడుదల కావడం మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో హిందీతో పాటుగా టాలీవుడ్లో ఈ మూవీ విడుదల కాకపోవచ్చని సమాచారం. అయితే, పాన్ ఇండియా రేంజ్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఏప్రిల్ 10లోపు పనులు పూర్తి కాకుంటే తెలుగు వర్షన్ మరో వారం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.టాలీవుడ్కు సన్నీ డియోల్ ఫిదాజాట్ సినిమాలో రణదీప్ హుడా విలన్గా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాని లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కించారు. జాట్ సినిమాకు దర్శకుడు, నిర్మాత తెలుగు వారే కావడం విశేషం. అయితే, బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ వాళ్లని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సన్నీ డియోల్ తాజాగా అన్నారు. టాలీవుడ్ వాళ్లతో కలిసి వర్క్ చేయడం తనకు నచ్చిందని ఆయన ప్రశంసించారు. సౌత్ వాళ్లతో మరో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆయన ఆశించారు. భవిష్యత్లో సౌత్ పరిశ్రమలో స్థిరపడాలని ఉంది అని సన్నీ డియోల్ అన్నారు. -
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
అక్కినేని వారి ఇంటికి కోడలు అనే కేరాఫ్ శోభితా ధూళిపాలా (Sobhita Dhulipala)ను ఇటీవలే వరించి ఉండొచ్చు గానీ... ఆమె పేరుకు ముందు అత్యంత ప్రాచుర్యం కలిగిన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ చేరడం మాత్రం చాలా రోజుల నుంచే ఉంది. అందాల సుందరి కిరీటం దక్కించుకోవడం దగ్గర నుంచి మొదలుపెడితే... ఒకటొకటిగా ఈ తెలుగమ్మాయి దక్కించుకున్న విజయాలు అంత చిన్నవేమీ కావు. బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాల నుంచి మంకీ మ్యాన్ వంటి గ్లోబల్ ప్రాజెక్ట్లకు కూడా విస్తరించింది ఓ వైపు సినిమాలు, వెబ్సిరీస్లలో రాణిస్తూనే మరోవైపు కమర్షియల్ బ్రాండ్స్ రూపొందించే ప్రకటనల యాడ్ వరల్డ్ కి కూడా హాట్ ఫేవరెట్గా మారింది శోభిత. ఆమె భీమా జ్యువెల్స్కు బ్రాండ్ అంబాసిడర్, అలాగే జాక్వార్ ఇండియా హర్ స్టోరీ ప్రచారాలలో కూడా తళుక్కుమన్నారు.యాడ్ గల్లీ డాట్ కామ్ ప్రకారం...ఆమె ఇండో–ఫ్యూజన్ ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ అయిన క్యుబిక్ ప్రచారాలలో కూడా కనిపించింది. అంతేకాక ఆమె దాసోస్ క్యాబినెట్ల ప్రచారాలలో కూడా పాల్గొన్నారు. ఐశ్వర్య, సుష్మితాసేన్, ప్రియాంకచోప్రాలను మినహాయిస్తే.. అందాల సుందరి కిరీటం దక్కించుకున్నవారిలో శోభిత స్థాయి విజయాలు మరెవరూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ప్రకటనల్లో , యాడ్ వరల్డ్ అయితే ఆమెకి తిరుగేలేదు. నటిగా సరే, ప్రకనటల్లోనూ యాడ్ క్వీన్గా ఆమె రాణించడానికి ఏయే అంశాలు దోహదం చేశాయి? దీని గురించి మోడలింగ్, యాడ్ రూపకల్పన నిపుణులు ఏమంటున్నారంటే... అందం...విలక్షణం... ఆమె అందం కళాత్మక సున్నితత్వంల విలక్షణ సమ్మేళనం, అందుకే శోభితా ధూళిపాళ క్లాస్, మాస్లకు ఇష్టమైన సెలబ్రిటీగా ఉద్భవించింది, ఒక ప్రత్యేకమైన అద్భుతమైన అందం ఆమె స్వంతం.డస్కీ కలర్ క్లాసిక్ ఛార్మ్ సాంప్రదాయ మోడల్స్, సెలబ్రిటీల నుంచి శోభితను ప్రత్యేకంగా నిలబెడుతోంది. లగ్జరీ బ్రాండ్లు ఆమె విలక్షణమైన రూపాన్ని ఇష్టపడతాయి, ఆమె హై–ఎండ్ ఫ్యాషన్, అందం ఆభరణాల బ్రాండ్లకు అనువైన ఎంపికగా మారింది. భారతీయతను ప్రతిబింబిస్తూనే.. ఆమె గ్లోబల్ అప్పీల్ ఆమెను వేర్వేరు ప్రాంతాలలోని వైవిధ్యభరిత అభిరుచులు కలిగిన విభిన్న రకాల వినియోగదారులతో కనెక్ట్ కావాలనుకునే బ్రాండ్లకు అనువైన, విలువైన అంబాసిడర్గా మార్చింది. ఫ్యాషన్...ఓ స్టోరీ టెల్లింగ్... వ్యక్తిగతంగా ఆమె పాతకాలపు చీరలు, టైలర్డ్ సూట్లు లేదా మినిమలిస్టిక్ సిల్హౌట్లు లాంటి కాండిడ్ ఫ్యాషన్ సె¯Œ ్సకు ప్రసిద్ధి చెందింది.ఆమె ఫ్యాషన్ను కేవలం ధరించదు దాని ద్వారా ఓ చక్కని కథ చెబుతుంది ఆమె రెడ్ కార్పెట్ ఎడిటోరియల్ లుక్స్ జాగ్రత్తగా క్యూరేట్ చేయబడినట్లు అనిపిస్తుంది, తద్వారా హస్తకళను ప్రదర్శించే హెరిటేజ్ బ్రాండ్లకు ఆమె సరైన ప్రతినిధిగా మారింది. ఆమెకు ఇంటెలక్చ్యువల్ లుక్స్ ఓ వరం. ఆమె తరచుగా సాహిత్యం, కళ చరిత్ర గురించి అనర్గళంగా మాట్లాడుతుంది, ఇవి ఆమెను కేవలం ఒక గ్లామర్ క్వీన్గా మాత్రమే కాకుండా ఆలోచనా పటిమ కలిగిన శక్తివంతమైన మహిళగా చూపిస్తోంది. ఈ మేధోపరమైన ఆకర్షణ ఆమెను సంస్కారవంతమైన, వివేకం గల వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్లు ఎంచుకోవడానికి కారణమవుతోంది. శోభితా ధూళిపాలా ఆధునిక అందపు స్టైలిష్ లుక్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతుందని నిరూపితం కావడమే ఆమె మరిన్ని బ్రాండ్స్తో పనిచేసేందుకు ఉపకరిస్తోంది. -
మేలో థ్రిల్
నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘హ్యాష్ట్యాగ్ లెవెన్’. డైరెక్టర్ సుందర్ సి. వద్ద ‘కలకలప్పు 2, వందా రాజావా దాన్ వరువేన్, యాక్షన్’ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా చేసిన లోకేశ్ అజ్లస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అభిరామి, రవి వర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రలు పోషించారు.ఏఆర్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ సినిమాను మే 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించి, నవీన్ చంద్ర పోస్టర్ విడుదల చేశారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘హ్యాష్ట్యాగ్ లెవెన్’. ఈ మూవీ ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమేరా: కార్తీక్ అశోకన్. -
ఇడ్లీ కొట్టు వాయిదా
ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఇడ్లీ కడై’(Idli Kadai) (ఇడ్లీ కొట్టు) సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు మేకర్స్. ఈ చిత్రంలో ధనుష్కి జోడీగా నిత్యా మీనన్ నటించారు. ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తూ, ధనుష్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘తిరు’ (2022) సినిమా తర్వాత ధనుష్–నిత్యా మీనన్ నటించిన రెండో చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ సినిమాలో అరుణ్ విజయ్, ప్రకాశ్రాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీ పోస్ట్ప్రోడక్షన్ పనులు పూర్తి కానందునే వాయిదా వేశారని కోలీవుడ్ టాక్. -
అందరి చూపు... టాలీవుడ్ వైపు...
తెలుగు సినిమాల సౌండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప’ వంటి సినిమాల కారణంగా అంతర్జాతీయంగా కూడా తెలుగు సినిమాకు ఆదరణ లభిస్తోంది. దీంతో దేశంలోని అన్ని ఇండస్ట్రీల చూపు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమవైపే. అందుకే తెలుగు పరిశ్రమ నుంచి అవకాశం వస్తే చాలు, సినిమాకు సై అంటున్నారు కొందరు పరభాషల హీరోలు. ఇటు తెలుగు నిర్మాతలు కూడా పరభాషల హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తెలుగు దర్శక–నిర్మాతలతో సినిమాలు చేస్తున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.ముందుగా కోలీవుడ్లోకి తొంగి చూస్తే...గుడ్ బ్యాడ్ అగ్లీకోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మాస్ యాక్షన్ ఫిల్మ్కు ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.త్రిష హీరోయిన్గా, సునీల్, ప్రసన్న, ప్రభు, యోగిబాబు, జాకీ ష్రాఫ్... ఇలా మరికొందరు ప్రముఖ ఆర్టిస్టులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ నెల 10న విడుదల కానుంది. అజిత్ సినిమాలను తెలుగు ఆడియన్స్ చాలా దగ్గరగా ఫాలో అవుతుంటారు. ఇటీవల వచ్చిన అజిత్ మూవీ ‘విడాముయర్చి’ (‘పట్టుదల’) ఆడియన్స్ను నిరాశపరిచింది. దీంతో అజిత్ నుంచి రానున్న తాజా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఎలా ఉంటుందనే విషయంపై ఆడియన్స్లో ఆసక్తి నెలకొని ఉంది.డబుల్ ధమాకా సూర్య అంటే చాలు... మన తెలుగు హీరోయే అన్నట్లుగా ఉంటుంది. అందుకేనేమో... ఈసారి రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని సూర్య నిర్ణయించుకున్నట్లున్నారు. సూర్య స్ట్రయిట్ తెలుగు మూవీ చేసి కూడా చాలా కాలం అయ్యింది. దీంతో సూర్య తెలుగులో చేసే డైరెక్ట్ మూవీపై ఆడియన్స్లో ఆసక్తి ఉండటం సహజం. కాగా ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల సూర్యకు ఓ కథను వినిపించగా, ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఈ మూవీలోని హీరోయిన్ పాత్రకు భాగ్యశ్రీ భోర్సే, మమితా బైజు వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుందని, ఇదొక పీరియాడికల్ డ్రామా అని ఫిల్మ్నగర్ సమాచారం. వెంకీ అట్లూరి డైరెక్షన్లోని ‘సార్, లక్కీ భాస్కర్’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థయే (నాగవంశీ, సాయి సౌజన్య), సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్లోని సినిమానూ నిర్మించనుందని తెలిసింది.ఇంకా ‘కార్తికేయ, కార్తికేయ 2’, ఇటీవల ‘తండేల్’తో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు చందు మొండేటి ఆ మధ్య సూర్యకు ఓ కథ వినిపించారు. ఈ కథ సూర్యకు నచ్చిందని, భవిష్యత్లో సూర్యతో తాను సినిమా చేస్తానని ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్లో చందు మొండేటి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చందు మొండేటి ప్రస్తుతం నిఖిల్తో చేయాల్సిన ‘కార్తికేయ 3’ స్క్రిప్ట్ వర్క్స్పై బిజీగా ఉన్నారట. సో... సూర్య తెలుగు మూవీ ముందుగా వెంకీ అట్లూరితోనే మొదలు కానుందని తెలిసింది. ఈ మూవీ ఈ ఏడాదేప్రా రంభం అవుతుంది. ఇలా సూర్య తెలుగు ఆడియన్స్కు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు.కుబేర కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చేసిన సినిమా ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’). సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఆ తర్వాత వెంటనే తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో మూవీ చేసేందుకు ధనుష్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘కుబేర’ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీలో నాగార్జున మరో లీడ్ రోల్లో నటిస్తుండగా, రష్మికా మందన్నా హీరోయిన్గా చేస్తున్నారు.ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బాహు భాషా చిత్రం జూన్ 20న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై పుస్కూర్ రామ్మోహన్రావు, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కుబేర’ తర్వాత మరో తెలుగు సినిమా చేసేందుకు కూడా తెలుగు దర్శక–నిర్మాతల నుంచి ధనుష్కు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని సమాచారం.కార్తీ హిట్ 4 తెలుగు ఆడియన్స్లో కార్తీకి మంచి క్రేజ్ ఉంది. కార్తీ తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై, తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కలెక్ట్ చేస్తుంటాయి. కాగా 2016లో నాగార్జునతో కలిసి కార్తీ ‘ఊపిరి’ అనే ద్విభాషా (తెలుగు, తమిళం) సినిమా చేశారు. ఆ తర్వాత ఎందుకో కానీ స్ట్రయిట్ తెలుగు మూవీ మళ్లీ చేయలేదు. రెండు మూడేళ్ల క్రితం కార్తీకి ఓ కథ వినిపించారట తెలుగు దర్శకుడు పరశురామ్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా అనుకున్నారనే ప్రచారం సాగింది. ఎందుకో కానీ ఈ మూవీ సెట్స్కు వెళ్లలేదు. కానీ ఇప్పుడు కార్తీ తెలుగు స్ట్రయిట్ మూవీకి సమయం వచ్చింది. తెలుగు హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ సిరీస్లో భాగం కానున్నారు కార్తీ. శైలేష్ కొలను దర్శకత్వంలో కార్తీ హీరోగా ‘హిట్ 4’ రూపొందనుందని, ఈ మూవీని నాని నిర్మిస్తారని సమాచారం. ఇక నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలోని ‘హిట్ 3’ మే 1న విడుదల కానుంది. ఈ ‘హిట్ 3’ క్లైమాక్స్లో ‘హిట్ 4’ సినిమాలో కార్తీ నటించనున్నారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట మేకర్స్. ఇంకా ఓ తెలుగు హారర్ ఫ్రాంచైజీ మూవీలోని కీలక పాత్రకు కార్తీని సంప్రదించగా, ఆయన అంగీకారం తెలిపారని తెలిసింది.హ్యాట్రిక్ హిట్ తమిళ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ మూవీ ఇటీవల విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు ముందు ప్రదీప్ చేసిన మూవీ ‘లవ్ టుడే’. ఈ చిత్రం కూడా బ్లాక్బస్టర్. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’)... ఈ రెండు చిత్రాలూ తెలుగులో అనువాదమై, ఇక్కడి యూత్ ఆడియన్స్ను అలరించాయి. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ తెలుగు మూవీతో వస్తున్నారు ప్రదీప్.‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాను తెలుగులో విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రంతో కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ న్యూజ్ స్టోరీ ఈ ఏడాదే స్క్రీన్పైకి రానుంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే, ప్రదీప్ నటుడిగా హాట్రిక్ హిట్ సాధించినట్లే... ఇలా తెలుగు దర్శక–నిర్మాతలో సినిమాలు చేయడానికి సిద్ధమైన, ప్రయత్నాలు చేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరోలు మరి కొంతమంది ఉన్నారు.⇒ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ మూవీస్లో ‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు ఉండటమే ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీంతో బాలీవుడ్ దృష్టి కూడా టాలీవుడ్పై ఉంది. బాలీవుడ్ హీరోలు తెలుగు దర్శక–నిర్మాతల అవకాశాలకు నో చెప్పలేకపోతున్నారు. ‘గద్దర్ 2’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తర్వాత సన్నీ డియోల్ తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లోని ‘జాట్’ సినిమాలో హీరోగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇంకా ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో అమితాబ్ బచ్చన్ ఓ లీడ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లోని ఈ మూవీని సి. అశ్వనీదత్ నిర్మించారు.కాగా ‘కల్కి 2’ కూడా ఉందని ఇటీవల స్పష్టం చేశారు నాగ్ అశ్విన్. సో... ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ మంచి ప్రియారిటీతో కొనసాగవచ్చని ఊహించవచ్చు. ఇంకా సల్మాన్ ఖాన్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ రానుందనే టాక్ ఇటీవల వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే తెలుగులో సినిమా చేసేందుకు ఆమిర్ ఖాన్ సైతం ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ఆమిర్ ఖాన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో ఓ మూవీ రానుందని, మైత్రీ మేకర్స్ నిర్మించనుందని గతంలో వార్తలొచ్చాయి. ఇంకా దర్శకుడు వంశీ పైడిపల్లి కథతో అమిర్ ఖాన్తో ఓ మూవీ చేసేందుకు ‘దిల్’ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అంతేనా... ‘గజినీ’కి సీక్వెల్గా ‘గజినీ 2’ను ఆమిర్ ఖాన్తో తీసే ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నారన్న ప్రచారం ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం రావాలి. ఇలా హిందీలో హీరోగా చేస్తూ, తెలుగు సినిమాల్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న హిందీ నటుల సంఖ్య ఈ ఏడాది ఎక్కువగానే ఉంది.⇒ ‘కాంతార’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ‘కాంతార’ ప్రీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా బ్లాక్బస్టర్ మూవీ ‘హను–మాన్’కు సీక్వెల్గా ‘జై హనుమాన్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ‘జై హనుమాన్’ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ అయిన హనుమాన్గా చేస్తున్నారు.భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 2027 సంక్రాంతికి ‘జై హనుమాన్’ మూవీ రిలీజ్ ఉండొచ్చు. అలాగే కన్నడ స్టార్ హీరో గణేశ్ తెలుగులో ‘పినాక’ అనే హారర్ ఫిల్మ్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొరియోగ్రాఫర్ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.అలాగే కన్నడ యువ నటుడు శ్రీమురళి హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమాను నిర్మించనుంది. గత ఏడాది శ్రీమురళి బర్త్ డే (డిసెంబరు 17) సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. కన్నడ హీరో ధనంజయ ‘పుష్ప’లో ఓ లీడ్ రోల్ చేశారు. అలాగే ఇతను హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘జీబ్రా’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ ‘పెద్ది’ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రామ్చరణ్ హీరోగా చేస్తున్న ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా తెలుగులో సినిమాలు చేస్తున్న కన్నడ నటుల జాబితా ఇంకా ఉంది.⇒ ‘మహానటి (కీర్తీ సురేష్ మెయిన్ లీడ్ రోల్), సీతారామం’ ఇటీవల ‘లక్కీ భాస్కర్’... ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు దుల్కర్ సల్మాన్. ఈ సినిమాల వరుస విజయాలు చాలు... దుల్కర్ను తెలుగు ఆడియన్స్ ఎంత ఓన్ చేసుకున్నారో చెప్పడానికి. ఇప్పుడు దుల్కర్ రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలోని ఈ మూవీని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్బాక్స్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ రైతుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోదావరి జిల్లాల పరిసరప్రాంతాల్లో జరుగుతోంది.అలాగే దుల్కర్ హీరోగా నటించిన మరో మూవీ ‘కాంత’. 1950 టైమ్లో మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ మూవీకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా ఈ సినిమాకు ఓ నిర్మాతగా ఉన్నారు. భాగ్యశ్రీ బోర్సే ఓ కథనాయికగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ పీరియాడికల్ ఫిల్మ్ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో తెలుగుకి వచ్చారు ఫాహద్ ఫాజిల్. మలయాళంలో హీరోగా చేస్తున్న ఫాహద్ తెలుగులోనూ ‘ఆక్సిజన్, డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ‘ఆక్సిజన్’ సినిమాకు ఎన్. సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తుండగా, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’కి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను ఆర్కా మీడియాపై రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇంకా మలయాళ ప్రముఖ దర్శక–నిర్మాత–నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం మహేశ్బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లోని మూవీలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే మలయాళ యంగ్ హీరో టొవినో థామస్ కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోని ‘డ్రాగన్’ మూవీలో ఓ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో టొవినో విలన్గా నటిస్తారని తెలిసింది. ఈ విధంగా మలయాళంలో హీరోగా చేస్తూ, తెలుగులోనూ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న మలయాళ హీరోల లిస్ట్ ఇంకా ఉంది.-ముసిమి శివాంజనేయులు -
రామయ్య వస్తున్నాడయ్యా
తండ్రి మాటను జవదాటని తనయుడు... సోదరులను అభిమానించే అన్న... భార్య దూరమైనా ఆమె కోసమే జీవించిన ఏక పత్నీవ్రతుడు... ప్రజల క్షేమం కోరిన రాజు... ధర్మం తప్పని మహనీయుడు... ఇలా అన్నీ సుగుణాలున్నాయి కాబట్టే రాముడు ఆదర్శ్రపాయుడు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...రామాయణాన్ని ఒక్క సినిమాగా చెప్పడం కష్టం అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి. అందుకే రెండు భాగాలుగా ఆయన ‘రామాయణ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుగుణాల సుందరాంగుడు రాముడి పాత్రకు హ్యాండ్సమ్ హీరో రణ్బీర్ కపూర్ని ఎంపిక చేసుకున్నారు. సుగుణవతి, సౌందర్యవతి సీతమ్మ పాత్రకు సాయి పల్లవిని తీసుకున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తున్నారు. దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్ కూడా ఓ నిర్మాత. రాముడి పాత్ర నాకో కల: రణ్బీర్ కపూర్ ‘‘ఇలాంటి అద్భుత చిత్రంలో భాగం కావడం గౌరవంలా భావిస్తున్నాను. ఈ చిత్రం తొలి భాగం షూటింగ్ పూర్తి చేశాను. త్వరలో రెండో భాగం చిత్రీకరణ ఆరంభిస్తాం. రాముడి పాత్రను ఎంతో వినయ విధేయతలతో చేస్తున్నాను. ఈ పాత్ర నాకో కలలాంటిది. ఈ సినిమాలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి గురించి చెప్పే సినిమా. అలాగే కుటుంబం, భార్యా–భర్తల అనుబంధాన్ని తెలియజేసే చిత్రం’’ అని రణ్బీర్ కపూర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.ఇక నితీష్ తివారీ అయితే ‘‘ఈ అద్భుత ఇతిహాసాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి పదేళ్ల క్రితమే అన్వేషణ మొదలుపెట్టాను. మన పవిత్రమైన చరిత్రకు దృశ్యరూపం ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. షూటింగ్ స్పాట్లో రణ్బీర్–సాయి పల్లవిల ఫొటోలు లీక్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, మలి భాగం 2027 దీపావళికి విడుదలవుతాయి.ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ రాముడికి పరమ భక్తుడు ఆంజనేయుడు. తన జీవితం మొత్తం రాముడి సేవకే అంకితం చేశాడు. శ్రీరాముడు అంటే ఆంజనేయుడికి ఎంత భక్తి అంటే... తన ఛాతీ చీల్చితే అందులో సీతారాములే ఉంటారనేంతగా... రాముడి జీవితంలో ఎంతో కీలకమైన ఆంజనేయుడి పాత్ర కీలకంగాప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జై హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘హను–మాన్’కి ఇది సీక్వెల్. గతేడాది జనవరిలో అయోధ్యలో శ్రీరాముడి ప్రా ణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఏప్రిల్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ఆ శ్రీరాముడి ఆశీస్సులతో మాటిస్తున్నా... మీరందరూ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ‘జై హనుమాన్’తో అద్భుతమైన అనుభూతిని అందిస్తా’’ అని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ.శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి? అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్’ని రూపొందిస్తున్నారని తెలిసింది. ఇక హనుమంతుడి పాత్రను ప్రముఖ కన్నడ స్టార్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి పోషిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఆయన హనుమంతుడి లుక్కి మంచి స్పందన లభించింది. తొలి భాగంలో కనిపించిన తేజ సజ్జా ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య రానా, రిషబ్తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘జై జై హనుమాన్’ అని పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. దాంతో ఈ చిత్రంలో రానా నటిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ‘హను–మాన్’ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ‘జై హనుమాన్’ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.శ్రీరామ్ జై హనుమాన్ ‘శ్రీరామ్ జై హనుమాన్’ పేరిట రామాయణం నేపథ్యంలో ఓ కన్నడ చిత్రం రూపొందుతోంది. ‘‘ఇప్పటి వరకూ రామాయణం ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల్లో చెప్పని కొత్త విషయాలను ఈ చిత్రంలో చెప్పనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘రామాయణం గురించి ఎవరికీ తెలియని అంశం’ అని అర్థం వచ్చే ట్యాగ్లైన్ ఈ చిత్రం పోస్టర్ మీద ఉంది. కాగా అయోధ్యలో శ్రీరాముడిప్రా ణ ప్రతిష్ఠ జరిగిన ముహూర్తానికి ఈ చిత్రం పోస్టర్ను రిలీజ్ చేశారు.అయితే నటీనటుల గురించి, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అవధూత్ దర్శకత్వంలో కేఏ సురేష్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు... ఇంకా తెలుగులో ‘జర్నీ టు అయోధ్య’ అనే చిత్రం ప్రకటన వెలువడింది. ఇంకా రామాయణం నేపథ్యంలో మరికొన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. – డి.జి. భవాని -
రామాపురంలో సీతారాముల కథ
రాజేశ్ కొంచాడ, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన వింటేజ్ విలేజ్ ఎమోషనల్ లవ్ డ్రామా ‘కౌసల్య తనయ రాఘవ’(Kausalya Thanaya Raghava). స్వామి పట్నాయక్ దర్శకత్వంలో ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై అడపా రత్నాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు.‘‘ఈ నాటి ప్రసారంలో... రామాపురంలో సీతారాముల కథ..’, ‘ఈ సీత ప్రేమలో రాముడి పడితే..’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు వస్తుంది’’ అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజేశ్ అన్నారు. ‘‘మా సినిమాను థియేటర్స్లో చూసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు స్వామి పట్నాయక్, రత్నాకర్. -
కన్నులలో వెన్నెలలే కురిసే...
రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లుఅరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. శనివారం రష్మికా మందన్నా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ఆడియో, కొత్త స్టిల్ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అలాగే ‘రేయి లోలోతుల సితార...’ పాట కూడా ఉంది. ‘‘కన్నులలో వెన్నెలలే కురిసే, మది మోసే తల వాకిట తడిసే..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీ పాద పాడారు. -
బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా ప్రభాస్
మహేష్బాబు, రామ్చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి సమకాలీకులతో పోలిస్తే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మాత్రం బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా వుంటారు. చాలా కాలం క్రితం ఓ ప్రముఖ కార్ల సంస్ధకు ప్రభాస్ బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేశారు. ఆ తరువాత మళ్లీ ఏ బ్రాండ్కు తను పని చేయలేదు. అయితే ఇటీవల కాలంలో పలు ప్రముఖ బ్రాండ్ల నుండి ఆఫర్లు వచ్చినప్పటికీ ప్రభాస్ వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ కోలా కంపెనీతో పాటు ఓ ఆటోమొబైల్ కంపెనీ వారు ప్రభాస్ను సంప్రదించగా తను వాటిపై ఆసక్తి చూపలేదట.ఓ యాడ్కు కేవలం మూడు రోజుల్లోనే 25 కోట్ల వరకు సంపాదించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం బ్రాండ్ ఎండోర్స్మెంట్లు చేయడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఓ సెలబ్రిటీ మేనేజర్ తెలిపారు.మహేష్బాబు, రామ్చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే పలు బ్రాండ్తో ఒప్పందాలు చేసుకుని ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తన ఫోకస్ అంతా నటన, సినిమాలపైనే పెట్టారు. సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఇలా తనకు కోట్లలో భారీ మొత్తాలను చెల్లించేందుకు పలు బ్రాండ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ డార్లింగ్ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ కేవలం తన నటనపై మాత్రమే ఫోకస్ పెట్టారంటూ ఆ సెలబ్రిటీ మేనేజర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునిరేషన్ తీసుకుంటూ టాప్ స్టార్గా ఉన్నప్పటికీ బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా ఉండటం ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను తెలిజేస్తుంది. -
జైపూర్ లో దేవసేన బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
కొన్నిరోజుల క్రితం మంచు కుటుంబంలో ఎంత రచ్చ జరిగిందో మీ అందరికీ తెలిసిందే. అప్పటివరకు తండ్రితో కలిసి ఉన్న మనోజ్.. ప్రస్తుతం వేరుపడ్డాడు. మంచు మనోజ్ ప్రస్తుతం భార్యతో కలిసి మరోచోట ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన కూతురి పుట్టినరోజు రాగా.. జైపూర్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు.(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?)మనోజ్.. భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు పాప పుట్టగా ఈ చిన్నారికి దేవసేన అని పేరు పెట్టారు. తాజాగా ఈమె పుట్టినరోజుని రాజస్థాన్ లోని జైపూర్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. మొన్న ఫొటోల్ని షేర్ చేసిన మనోజ్.. ఇప్పుడు వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో భార్య, కొడుకు, కూతురితో కలిసి మనోజ్ చాలా ఆనందంగా కనిపించాడు. సాధారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటుంటారు. కానీ మనోజ్ తన కూతురి పుట్టినరోజుని డెస్టినేషన్ బర్త్ డేగా సెలబ్రేట్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా వీడియో మాత్రం చూడముచ్చటగా ఉంది.(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా
హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) పేరు చెప్పగానే తెలుగు, తమిళ, హిందీలో బోలెడన్ని సినిమాలు గుర్తొస్తాయి. టీనేజీలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తాజాగా నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2 (Odela 2 Movie).. విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?)'ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 20 ఏళ్లు అవుతోంది. ఎంతో సంతోషంగా ఉంది. నటిగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఇంతవరకు వస్తానని అనుకోలేదు. అయితే నాకు 21 ఏళ్లున్నప్పుడు జరిగిన సంఘటనని మాత్రం అస్సలు మర్చిపోలేను. పుట్టినరోజు అని ఇంట్లోనే ఉన్నా. అలా న్యూస్ పేపర్స్ తిరగేస్తుంటే.. తమిళంలో నం.1 నటి అనే నా గురించి ఆర్టికల్ ఉంది. ఇది చూసేసరికి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాను. నటించడం ఓ బాధ్యతగా తీసుకున్నాను. ఈ స్థాయికి చేరుకున్నాను' అని తమన్నా చెప్పుకొచ్చింది.సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వ పర్యవేక్షణలో తీసిన ఓదెల 2 సినిమాలో శివశక్తి పాత్రలో తమన్నా నటించింది. ఏప్రిల్ 17న రిలీజయ్యే ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి మిల్కీబ్యూటీ హిట్ కొడుతుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
కామెడీ అనే పదానికి అర్థాలే మారిపోయాయి. స్వచ్ఛమైన హాస్యానికి బదులు డార్క్, వెగటు కామెడీలే ఎక్కువైపోతున్నాయి. అవతలివారిని చులకన చేసి నవ్వించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అయితే కామెడీ పేరుతో తనను నిజంగానే తిట్టారంటోంది నటి, కమెడియన్ వర్ష (Varsha). ఇటీవల ఓ పాడ్కాస్ట్లో వర్ష మాట్లాడుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు, డబ్బు సంపాదించాను. కానీ ఒకానొక సమయంలో కొందరివి రెండు ముఖాలు చూశాను. సీరియల్ నుంచి షోకు వచ్చి హైలైట్ అయినప్పుడు వారు చూపించిన ప్రేమ సడన్గా మాయమవడంతో తట్టుకోలేకపోయాను.నిజంగానే తిట్టారునా మీద పంచులు వేస్తూ కామెడీ చేసినప్పుడు నేను సరదాగానే తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాళ్లు నిజంగానే తిడుతున్నారని తెలిసిందో తట్టుకోలేకపోయాను. ఛీ, దేవుడా ఎందుకీ బతుకు ప్రసాదించావు.. అడుక్కునేవారి ఇంట్లో పుట్టినా బాగుండు కదా! డబ్బు, పేరు, అందరూ ఉన్నా సుఖం లేదు. ఇలాంటి జీవితం నాకు మళ్లీ రావొద్దని దేవుడిని కోరుకుంటాను. అసలు ఈ ఫీల్డ్కే రావొద్దు.కావాలనే పిలిచిఏడేళ్ల క్రితం నన్ను ఓ ఈవెంట్కు పిలిస్తే వెళ్లాను. నేనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని మరీ వెళ్లాను. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు కానీ నన్ను మాత్రం పిలవట్లేదు. నన్నెప్పుడు పిలుస్తారా? అని స్టేజీ వెనకాల ఓ గుడిసెలో కూర్చున్నాను. ఓ అమ్మాయి తను రెడీ అవడానికి అద్దం పట్టుకోమని అడిగింది. గంటసేపు తనకు అద్దం పట్టుకుని కూర్చున్నాను. ఆలస్యంగా అర్థమైందేంటంటే నన్ను కావాలనే పిలిచి అలా ఖాళీగా వెనక కూర్చోబెట్టారు. అప్పుడెంతో బాధపడ్డాను అని వర్ష కంటతడి పెట్టుకుంది.చదవండి: జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ -
మాళవిక లుంగీ లుక్.. అనసూయని ఇలా చూస్తే!
హిందీ పాటకు యాంకర్ అనసూయ క్యూట్ స్టెప్పులులుంగీతో కనిపించి షాకిచ్చిన హీరోయిన్ మాళవికఅల్ట్రా మోడ్రన్ లుక్ తో శ్రీముఖి గ్లామరస్ పోజులువర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న వర్షిణిప్యాంట్ షర్ట్ తో స్టైల్ గా మారిపోయిన సన్నీ లియోన్కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోతో మంచు మనోజ్హనీమూన్ ట్రిప్ వీడియో పోస్ట్ చేసిన పార్వతి నాయర్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) -
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్లో హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ (War 2 Movie)లోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జార్జియాలో జరిగిన వార్ 2 ఈవెంట్లో హృతిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హృతిక్ (Hrithik Roshan) మాట్లాడుతూ.. వార్ సినిమా సీక్వెల్ ఎలా ఉంటుందోనని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడీ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది. మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంటుంది.ఎన్టీఆర్తో డ్యాన్స్..జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ కోస్టార్. తను అద్భుతమైన వ్యక్తి, చాలా తెలివైనవాడు. ఒక పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయింది. ఆ పాటలో ఎన్టీఆర్తో కలిసి డ్యాన్స్ చేయాలంటే కాస్త భయంగా ఉంది. తను ఎలాగైనా చేయగలడు. నేను కూడా బాగా డ్యాన్స్ చేస్తానని అనుకుంటున్నాను. మీరు మా సినిమాను తప్పక ఆదరించాలి అని చెప్పుకొచ్చాడు. వార్ 2 విషయానికి వస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీతో తారక్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇకపై డైరెక్టర్గానూ..హృతిక్ రోషన్ నెక్స్ట్ 'క్రిష్ 4' సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంతో అతడు దర్శకుడిగా మారనున్నాడు. '25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ప్రవేశపెట్టాను.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని హృతిక్ తండ్రి రాకేశ్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించాడు.చదవండి: జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్పోర్ట్.. వీడియో వైరల్ -
వారియర్ లుక్లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్ దేవరకొండ!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.ఈ రోజు(ఏప్రిల్ 5)రష్మిక బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్"(The Girlfriend) సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్, టీజర్ సాంగ్ 'రేయి లోలోతుల' రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రష్మిక వారియర్ లుక్ లో గన్, కత్తితో పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. 'రేయి లోలోతుల' పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటలో వచ్చే పోయెమ్ ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాశారు. 'రేయి లోలోతుల' పాట ఎలా ఉందో చూస్తే - 'రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్పోర్ట్.. వీడియో వైరల్
రాజమౌళి (SS Rajamouli)తో సినిమా అంటే ఆషామాషీ కాదు. ప్రతి ఒక్కరిలోని టాలెంట్ను పూర్తిగా బయటకు తీస్తాడు. అలాగే ఒక్కో సినిమా ఏళ్ల తరబడి చేస్తుంటాడు. 2022లో ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈయన ఈ ఏడాది ఆరంభంలో మహేశ్బాబు (Mahesh Babu)తో సినిమా మొదలుపెట్టాడు. జనవరిలో SSMB29 సినిమాను ఘనంగా లాంచ్ చేశారు. అంతేకాదు.. ఒక సింహాన్ని లాక్ చేసి తన పాస్పోర్ట్ తీసుకున్నట్లుగా ఓ వీడియో రిలీజ్ చేశారు. మహేశ్ను లాక్ చేసిన జక్కన్నఅంటే తను తెరకెక్కించబోయే యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు కోసం మహేశ్ను లాక్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. దీనిపై ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ఇటీవలే ఒడిశాలో SSMB29 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం బ్రేక్ దొరకడంతో మహేశ్ తన కూతురు సితారతో కలిసి హాలీడే ట్రిప్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మహేశ్.. జక్కన్న చేతికి చిక్కిన పాస్పోర్ట్ తిరిగి తనదగ్గరకు వచ్చేసిందంటూ నవ్వుతూ పాస్పోర్ట్ చూపించాడు.కామెడీ టైమింగ్ఇది చూసిన అభిమానులు.. బాబు తన పాస్పోర్ట్ చూపించడం హైలైట్, మహేశ్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందేగా.., బిడ్డకు విడుదల అంటూ కామెంట్లు చేస్తున్నారు. SSMB 29 విషయానికి వస్తే.. మహేశ్బాబు సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను 2027లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) చదవండి: పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. మోహన్బాబు -
మారిపోయిన మనిషిని గుర్తు చేసేలా ‘అరి’ థీమ్ సాంగ్
‘పేపర్ బాయ్’ఫేం జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక.వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్.ఇప్పటికే ఈ చిత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలకు చూపించగా..వారంతా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ తరం తప్పకుండా చూడాల్సిన సినిమా అని సూచించారు. ఇక తాజాగా ఈ చిత్రం థీమ్ సాంగ్ని విడుదల చేశారు మేకర్స్.‘మషినేనా నువ్వు..ఏమై పోతున్నావ్.. మృగమల్లే జారీ..దిగజారిపోయావ్’ అంటూ సాగే ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. షణ్ముఖ ప్రియ అద్భుతంగా ఆలపించింది. ఇక అనూప్ రూబెన్స్ తనదైన సంగీతంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమాలోని కీలక పాత్రలన్నింటిని పరిచయం చేస్తూ.. అసలు ఈ సినిమా కథేంటి? ఎం సందేశం ఇవ్వబోతుందనే విషయాలను తెలియజేలా థీమ్ సాంగ్ ఉంది. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని చిత్రబృందం పేర్కొంది. -
సాయి పల్లవి ‘పొట్టి డ్రెస్’ కథ తెలుసా?
ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే.. స్కిన్ షో కచ్చితంగా చేయాల్సిందేనా? పొట్టి దుస్తులు ధరించి.. తెరపై అందాలను ప్రదర్శిస్తేనే ‘స్టార్’ హోదా వస్తుందా? అంటే కాదని బల్లగుద్ది చెప్పొచ్చు. ‘నీకేం తెలుసు..‘ఎక్స్పోజింగ్’చేస్తేనే సినిమా చాన్స్లు వస్తాయట’ అని ఎవరైనా అంటే..వారికి సాయి పల్లవి (Sai Pallavi) గురించి చెప్పండి. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం నటనతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. సంప్రదాయ దుస్తులతోనే నటించి ‘స్టార్’ హీరోయిన్గా ఎదిగింది. అలా అని గ్లామర్ షో చేస్తున్నవారిని తప్పు పట్టడం లేదు. కానీ గ్లామర్ షో చేస్తేనే స్టార్ హోదా వస్తుందనుకోవడంలో నిజం లేదని సాయి పల్లవి నిరూపించింది.అయితే సాయి పల్లవి మొదటి నుంచి పొట్టి దుస్తులకు వ్యతిరేకం కాదు. కానీ ఆమె తెరపై అలాంటి డ్రెస్సుల్లో కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. గతంలో ఓ సారి పొట్టి దుస్తులతో టాంగో డ్యాన్స్ చేసిందట. ప్రేమమ్ సినిమా తర్వాత ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయిందట. అయితే అందులో అందరూ తన ప్రదర్శనను చూడకుండా.. డ్రెస్సింగ్పై విమర్శలు చేశారట. నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ చూసి తనకే ఎలాగో అనిపించి.. ఇకపై పొట్టి దుస్తులు ధరించ కూడదని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సాయి పల్లవి. అంతేకాదు ఎంత పెద్ద సినిమా అయినా సరే.. అసౌకర్యంగా ఉండే దుస్తులు ధరించకూడదని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది.సినిమా విషయాలకొస్తే.. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. దీంతో పాటు శివకార్తికేయన్తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. -
గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. ఇద్దరి మరణం ఒకేలా..
జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy).. దాదాపు మూడు వందలకు పైగా సినిమాలు చేశాడు. తన మేనరిజంతో, స్పెషల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలన్గా, కమెడియన్గా ఆకట్టుకున్న ఆయన 74 ఏళ్ల వయసులో మరణించారు. జయప్రకాశ్ కుమార్తె మల్లిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. మల్లిక మాట్లాడుతూ.. 'నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మరోపక్క స్టేజీపై నాటకాలు వేసేవారు. రూ.5 లక్షల అప్పుఆయన నటన చూసి సినిమా ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. కొన్నాళ్లకు అక్కడ సెట్ కాకపోవడంతో నాన్న ఐదేళ్లకే తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారు. రూ.5 లక్షల వరకు అప్పు కావడంతో మళ్లీ సినిమాల్లోకి వెళ్లకూడదనుకున్నారు. ఏడేళ్లపాటు టీచర్గానే ఉన్నారు. కానీ ఓసారి రామానాయుడు కంటపడటంతో ఆయన తిరిగి సినిమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రేమించుకుందాం రా మూవీతో నాన్నకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. లాక్డౌన్లో మరణంనాన్నగారి కంటే రెండేళ్ల ముందు అమ్మ చనిపోయింది. నాన్నకు లో బీపీ. కరోనా సమయంలో నా తమ్ముడికి, అతడి పిల్లలకు కూడా వైరస్ సోకడంతో ఆయన భయపడిపోయాడు. షుగర్ లెవల్స్ కూడా తగ్గడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజుల తర్వాత ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉదయం నాలుగున్నర గంటలకు నిద్ర లేచాడు. స్నానానికి వెళ్లినప్పుడు ఎంత సేపైనా బయటకు రాకపోవడంతో ఇంట్లో వాళ్లు డోర్ తెరిచి చూస్తే ఆయన నిర్జీవంగా పడి ఉన్నాడు.అఖండలో ఆఫర్ఆయన మరణం మమ్మల్ని అందరినీ షాక్కు గురి చేసింది. లాక్డౌన్ వల్ల నాన్న అంతిమయాత్రలకు సెలబ్రిటీలు ఎవరూ హాజరు కాలేకపోయారు. నాన్న చనిపోవడానికి ముందు అఖండ, క్రాక్ సినిమా ఆఫర్లు వచ్చాయి. అంతలోనే ఇది జరిగిపోయింది. నాన్న ఎన్నో సహాయకార్యక్రమాలు చేశారు. చాలామందిని చదివించారు. నాన్న మరణించాక ఈ విషయాలు తెలిసి కన్నీళ్లు వచ్చాయి. అమ్మానాన్న ఇద్దరూ గుండెపోటుతోనే మరణించారు.నిర్మాతగా..తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు నిర్మాతగా మారాను. అలా నేను నిర్మిస్తున్న ఓ మూవీ షూటింగ్కు వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదం జరిగి మా కారు బోల్తా కొట్టింది. అప్పుడు నాకు శరీరంపై 42 కుట్లు పడ్డాయి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని నా సినిమాను పూర్తి చేశాను అని మల్లిక చెప్పుకొచ్చింది. ప్రేమించుకుందాం రా.., జయం మనదేరా, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, నిజం, కబడ్డీ కబడ్డీ, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, ఢీ, యమదొంగ, రెడీ, నాయక్.. ఇలా వందల సినిమాలతో వినోదం పంచిన జయప్రకాశ్ రెడ్డి 2020 సెప్టెంబర్ 8న మరణించారు.చదవండి: పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం..: మోహన్బాబు -
బిగ్బాస్లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్'.. హాట్స్టార్ అలా క్లూ ఇచ్చేసిందా..?
ప్రముఖ రియల్టీ షో బిగ్బాస్ తెలుగు సీజన్- 9 కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో మొదలౌతుందని తెలిసిందే. అంటే మరో నాలుగు నెలల్లో బిగ్బాస్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనుల్లో యూనిట్ ఉంది. సీజన్-9లో పాల్గొనే కంటెస్టంట్స్ ఎంపిక విషయంలో బిగ్బాస్ టీమ్ ఉంది.సోషల్మీడియాలో బాగా వైరల్ అయిన వారికే బిగ్బాస్లో ఎంట్రీ ఛాన్స్ దక్కుతుంది. అలాంటి వారినే టీమ్ సెలక్ట్ చేస్తుంది. అయితే, కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. సోషల్మీడియాలో మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్స్ ఉన్నారు. చాలాకాలంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ట్రెండింగ్లో ఉన్నారు. అయితే, కస్టమర్స్పై వారు బూతులతో విరుచుకుపడటం.. అందుకు సంబంధించిన ఆడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్పై మీమ్స్, ట్రోల్స్, వీడియోలు కనీసం 100 మిలియన్స్కు పైగానే వ్యూస్తో ట్రెండ్ అవుతున్నాయి. అలా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్లలో (చిట్టి, అలేఖ్య, రమ్య) ఒకరికి తప్పుకుండా బిగ్బాస్లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరల్ అవుతుంది. కానీ, రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయిని తెలుస్తోంది. మోడ్రన్ డ్రెస్లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా.. రీసెంట్గా జియోహాట్స్టార్లో పికిల్స్కు సంబంధించిన ఒక సీన్ను వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు.ఇదే విషయంపై బిగ్బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్బాస్కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. అసలు బిగ్బాస్కు కూడా కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే అని చెప్పవచ్చు. అప్పుడే తమ రేటింగ్స్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అనుకుంటారు. ఇంత గొడవ జరుగుతున్నా సరే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ధైర్యంగా కెమెరాల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చారు. ఆపై లెక్కలేనన్ని నెగటివ్ కామెంట్లు వస్తున్నా సరే వాటిని తట్టుకుని నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి వారి పేర్లు నోటెడ్ అయిపోయాయి. ఇలా ఎన్నో అంశాలు వారికి బిగ్బాస్ ఛాన్స్ దక్కేలా చేస్తాయని చెప్పవచ్చు. Guess we're in a pickle 🫠Ippudu mirchi kaavali ante, hotstar lone chuddali 🙃#Chatrapathi #Prabhas #HomemadePickle #JioHotstarTelugu pic.twitter.com/tqAC5ELmLg— JioHotstar Telugu (@JioHotstarTel_) April 3, 2025 -
పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. నేను ఫెయిల్యూర్ కాదు!
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా వందలాది సినిమాలు చేశారు నటుడు మోహన్బాబు (Mohan Babu). వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ప్రస్తుతం కన్నప్ప సినిమా (Kannappa Movie)తో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మోహన్బాబు కీలక పాత్ర పోషించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ డైలాగ్ కింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అదే నా తొలి చిత్రంమోహన్బాబు మాట్లాడుతూ.. నేను మొదట చూసిన సినిమా రాజమకుటం. దాసరి నారాయణరావు స్వర్గం- నరకం అనే సినిమాలో నాకు నటించే ఛాన్స్ ఇచ్చారు. అదే నా తొలి సినిమా. ఇది 25 వారాలు ఆడింది. నా గురువు దాసరిగారే భక్తవత్సలం నాయుడుగా ఉన్న నా పేరును మోహన్బాబుగా మార్చేశారు. నందమూరి తారక రామారావు చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ప్రారంభమైంది. నా బ్యానర్లో తీసిన తొలి సినిమా ప్రతిజ్ఞ. ఎన్టీ రామారావుతో నా బ్యానర్లో మేజర్ చంద్రకాంత్ సినిమా చేశాను.అనుభవంతో చెప్తున్నా..ఆయన వద్దన్నా వినిపించుకోకుండా నా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ తీశాను.. హిట్ కొట్టాను. నిర్మాతగా కొన్నిసార్లు ఫెయిలయ్యానేమోకానీ నటుడిగా మాత్రం ఎన్నడూ ఫెయిలవలేదు. అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి మన చేతుల్లో ఉండవు. ఇది అనుభవంతో చెప్తున్నాను. చెత్త సినిమాలు ఆడతాయి.. కానీ బ్రహ్మాండమైన సినిమాలు ఆడవు. దానికి కారణం ఎవరూ చెప్పలేరు. మంచి పాత్ర దొరికితే సినిమా చేస్తాను. లేదంటే విద్యాలయాలు చూసుకుంటూ పిల్లలతో కాలక్షేపం చేస్తాను. అక్కినేని నాగేశ్వరరావు ఒక మాట చెప్తూ ఉండేవారు. బిడ్డల్ని కంటాం కానీ వారి తలరాత మన చేతుల్లో ఉండదు అని! కొన్నిసార్లు అది నిజమే అనిపిస్తుంది.ట్రోలింగ్స్ చూడనుజీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. కేవలం ఒక్క పూట భోజనం చేసిన రోజులున్నాయి. నేను ట్రోలింగ్స్ చూడను. అలాగే ట్రోలింగ్ చేసేవారినీ తప్పుపట్టడం లేదు. వారికి ఆ క్షణంలో అలాంటి ఆలోచనలు వచ్చాయి. మనం ఒకరిని తిడితే అది ఏదో ఒకరోజు మనకే తిరిగొస్తుంది. ఉడుకు రక్తంతో ఇలా చేస్తుంటారు. కానీ అది కుటుంబానికే నష్టం కలిగిస్తుందని ఆలోచించరు. వారి గురించి నేను విమర్శించను.. భయపడి సైలెంట్గా ఉండట్లేదు. ఒకర్ని తిడుతుంటే వారికి ఆనందంగా ఉందంటే సరే ఎంజాయ్ చేయండని వదిలేస్తున్నాను. గతంలో ఈ ట్రోలింగ్స్ లేవు అని చెప్పుకొచ్చారు.మా అమ్మకు చెవుడుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఇది భగవంతుడి ఆశీస్సులు. మా అమ్మకు రెండు చెవులు వినబడవు. రెండుసార్లు గర్భం నిలవకపోతే శివుడికి మొక్కుకుంది. ఆ భగవంతుడు ఐదుమంది సంతానాన్ని ఇచ్చాడు. ఆ దేవుడి ఆశీస్సులతోనే కన్నప్ప ముందుకు సాగింది. రేయింబవళ్లు చాలా కష్టపడ్డాం. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అని మోహన్బాబు ధీమా వ్యక్తం చేశారు.చదవండి: 'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..? -
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్తో కొత్త ట్రెండ్ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్టైన్ చేస్తుందా? చూడాలి. -
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) 'జాక్' సినిమా ఏప్రిల్ 10న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్మీడియాలో సిద్ధూ డైలాగ్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే, సినిమా థియేటర్స్లో చూద్దామని ఆశగా ఉన్న ప్రేక్షకులకు నిరాశ ఎదురుకానుంది అంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.జాక్కు 'గాండీవధారి అర్జున' చిక్కులు2023లో విడుదలైన వరుణ్ తేజ్'గాండీవధారి అర్జున'(Gandeevadhari Arjuna) చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్నే ఇప్పుడు జాక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పుడు ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడంతో చాలామంది నష్టపోయారు. ముఖ్యంగా గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారట. గాండీవధారి అర్జున సినిమా విడుదల సమయంలో రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్నామని, అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేశారట. ఆ సినిమాతో తాము పూర్తిగా మునిగిపోయినట్లు చెప్పుకొచ్చారని సమాచారం. డీల్ ప్రకారం తమకు డబ్బులు వెనక్కివ్వలేదని తెలిపిన వారు.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ సినిమాను విడుదల కానివ్వమని పెద్ద పంచాయితీ పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గాండీవధారి నష్టాలు జాక్ను అడ్డుకుంటున్నాయిని నెటిజన్లు తెలుపుతున్నారు.వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా 'గాండీవధారి అర్జున' చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్లో సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అయితే, ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం రూ. 17 కోట్లు మాత్రమే చేసింది. ఆపై బాక్సాఫీస్ వద్ద రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. దీంతో చాలామంది పంపిణీదారులు ఈ సినిమాతో నష్టపోయారని తెలుస్తోంది. -
పల్లెటూరి చిన్నోడు.. నటనలో మెప్పించాడు
అల్లూరి సీతారామరాజు: కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వెరసి ఓ పల్లెటూరి చిన్నోడు... ‘కోర్ట్’లో మెప్పించి అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న డ్యాన్స్లు వేస్తూ సందడి చేసే ఆ చిన్నోడు డ్యాన్స్ పట్ల మక్కువతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ‘కోర్ట్’ సినిమా ద్వారా హీరోగా మారి బంపర్ హిట్ కొట్టాడు. ఆయన ఇటీవల తన స్వగ్రామమైన కూనవరం వచ్చారు. ఆయనకు స్థానికులు అపూర్వ స్వాగతం తెలిపి ఘనంగా సన్మానించారు. చింతూరు ఏజెన్సీ డివిజన్ కూనవరం గ్రామానికి చెందిన రోషన్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును తెలుసుకుందాం... ఇటీవల విడుదలైన కోర్ట్ సినిమా హిట్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. హీరో నాని నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ బంపర్ హిట్ సాధించింది. ఇందులో యువ హీరోగా రోషన్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషన్ తాత మస్తాన్ కూనవరం ఎంపీడీవో కార్యాలయంలో డ్రైవర్గా పనిచేశారు. తండ్రి రషీద్ వైద్యశాలలో పనిచేసేవారు. రోషన్ చదువు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు భద్రాచలంలో..అనంతరం ఖమ్మంలో పదో తరగతి వరకు సాగింది. రోషన్కు చిన్నతనం నుంచే డ్యాన్స్పై మక్కువ ఉండేది. తన సోదరుడు తౌఫిక్ ప్రోత్సాహంతో పాల్వంచలోని అరవింద్ మాస్టర్, భద్రాచలంలోని పవన్, నాగురాజు మాస్టార్ల వద్ద డ్యాన్స్లో మెలకువలు నేర్చుకున్నారు. సినిమారంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్కు కుటుంబసమేతంగా తరలివెళ్లారు. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శనతో రోషన్కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు తరుణ్భాస్కర్ అతడిలోని ప్రతిభను గుర్తించి, ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఆ తరువాత అరవింద సమేత, గద్దలకొండ గణేష్, వెంకీ మామ చిత్రాల్లో బాలనటుడిగా.. సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, మిషన్ ఇంపాజిబుల్, స్వాగ్ వంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ‘సరిపోదా శనివారం’తో ప్రత్యేక గుర్తింపు సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో రోషన్కు ప్రత్యేక అవకాశం లభించింది. అతనిలో నటనను హీరో నాని గుర్తించారు.. ఈ నేపథ్యంలో నాని నిర్మాతగా, రామ్ జగదీష్ దర్శకత్వంలో తీసిన ‘కోర్ట్’ సినిమాలో యువ కథనాయుకుడిగా రోషన్కు అవకాశం దొరికింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించింది. రోషన్ నటనకు పెద్ద పెద్ద కథనాయకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. స్వగ్రామస్తుల ఆదరణ మరువలేను ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ తాను నటించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవిని కలిశానని, చిత్రంలో తాను చేసిన డ్యాన్స్ను ఆయన మెచ్చుకొని ప్రశంసించారని గుర్తు చేశారు. కోర్ట్ చిత్రం చూసిన తరువాత కథనాయకుడు చిరంజీవి స్వయంగా ఆహ్వానించి జ్ఞాపికను బహుకరించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు.ఇటీవల తన స్వగ్రామం కూనవరం వచ్చానని, స్థానికులు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. ప్రస్తుతం కొందరు దర్శకులు కథలు వినిపించారు. వాటిలో కొన్నింటికి అంగీకారం తెలిపే అవకాశముందని చెప్పారు. -
దేవర 2, అదుర్స్ 2 చిత్రాలపై ఎన్టీఆర్ క్లారిటీ.. ఫ్యాన్స్కి పండగే!
‘‘షూటింగ్కి వెళ్లి కెమేరా ముందు నిల్చున్న ప్రతిసారీ నాకు వణుకు వస్తుంటుంది. అలాగే మీ ముందు (ఫ్యాన్స్) మాట్లాడాలన్నా... (నవ్వుతూ). ఒక నటుడికి వినోదం పండించడం అనేది చాలా కష్టం. అందుకే నేను ‘అదుర్స్ 2’ చేయడానికి కాస్త భయపడుతున్నాను. మళ్లీ జీవితంలో అలాంటి కామెడీ మూవీ వస్తుందో లేదో’’ అని హీరో ఎన్టీఆర్(Jr NTR) అన్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, ‘సత్యం’ రాజేశ్, కార్తికేయ, విష్ణు, ప్రియాంకా జవాల్కర్, రెబ్బా మోనికా జాన్ (స్పెషల్ సాంగ్) ఇతర పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్మీట్కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘అభిమాన సోదరులకు పేరు పేరునా కృతజ్ఞతలు. చాలా కాలమైంది మనం కలుసుకుని. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా మనల్ని నవ్వించే మనిషి ఉంటే చాలు కదా అనిపిస్తుంది. ఈ రోజు దర్శకుడు కల్యాణ్ శంకర్ మనకి దొరికాడు. ‘మ్యాడ్ స్క్వేర్’తో మళ్లీ సక్సెస్ కొట్టిన కల్యాణ్కి అభినందనలు. ఓ బ్లాక్బస్టర్ మూవీ సీక్వెల్తో జనాలని రంజింపచేయడం చాలా కష్టం. కానీ మీరు సాధించారు. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. ఈ మూవీలో మురళీధర్గారు అద్భుతంగా నటించారు. లడ్డు పాత్ర చేసిన విష్ణు లేకుంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కాదేమో? అనిపించింది. డైరెక్టర్ శోభన్గారి అబ్బాయిలు సంతోష్, సంగీత్లను చూస్తే ఆయన గుర్తొస్తారు. మనకి బాగా ఇష్టమైన వాళ్లు మనకి దూరమైనా మన చుట్టూనే ఉంటారు. మీ నాన్నగారు కూడా గర్వపడుతుంటారు. ‘మ్యాడ్’లో రామ్ నితిన్ని చూస్తే నేను యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నారు. నాకు 2011లో పెళ్లయింది. నార్నే నితిన్ అప్పుడు చాలా చిన్నపిల్లాడు. నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కానీ, ధైర్యం చేసి నా వద్దకు వచ్చి నాతో చెప్పిన ఒకే ఒక్క మాట ‘బావా... నేను యాక్టర్ అవుతాను’ అని.. అంతే ధైర్యంగా నేను ‘నా సపోర్ట్ నీకు ఉండదు... పోయి చావ్ అన్నాను’. కానీ, ఇండస్ట్రీలో తన కెరీర్ ఎలా ఉండబోతోంది? అనే భయం ఉండేది. నీకు నువ్వుగా ముందుకెళ్లు అన్నాను. తనే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాడు. ఈ రోజు తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సునీల్ లేకపోతే ‘మ్యాడ్ స్క్వేర్’ లేదు. సంగీత దర్శకుడు భీమ్స్, రచయిత కాసర్ల శ్యామ్తో పాటు ఈ సినిమాకి పని చేసిన అందరికీ అభినందనలు. వీళ్లందరి వెనకాల కనపడని ఓ శక్తే మా చినబాబు. త్వరలోనే మేం ఓ సినిమా చేయబోతున్నాం. ఇక ‘దేవర’ చిత్రాన్ని ఆదరించినందుకు, మీ (ఫ్యాన్స్) భుజాలపైన మోసినందుకు ధన్యవాదాలు. ‘దేవర 2’ (Devara 2) కచ్చితంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో ప్రశాంత్ నీల్గారు వచ్చారు. నేను ఫ్యాన్స్ కోసమే కష్టపడుతుంటాను. మిమ్మల్ని ఆనందపరచడానికే బతికుంటాను. మీరెప్పుడూ కాలర్ ఎత్తుకునేలాగే ప్రయత్నిస్తాను.. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు.. కానీ మీకోసం కష్టపడుతూనే ఉంటాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. నేను వచ్చినప్పటి నుంచి ‘జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్’ అనే స్లోగన్స్ చూస్తుంటే... జేఏఐఎన్టి... జెయింట్ గుర్తొస్తోంది. సో.. ఎన్టీఆర్ జెయింట్’’ అన్నారు. ఈ వేడుకలో ‘మ్యాడ్ స్క్వేర్’ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులకు షీల్డ్లు ప్రదానం చేశారు. -
'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..?
చిత్రం: టెస్ట్నటీనటులు: ఆర్. మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్, కాళీ వెంకట్, నాజర్ తదితరులు దర్శకత్వం: ఎస్.శశికాంత్నిర్మాతలు: ఎస్.శశికాంత్, రామచంద్రసినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్సంగీతం: శక్తిశ్రీ గోపాలన్నిర్మాణ సంస్థలు: వైనాట్ స్టూడియోస్స్ట్రీమింగ్ వేదిక: నెట్ఫ్లిక్స్భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం.. అందుకే ఈ ఆట చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి. టెస్ట్( Test) సినిమాలో కేవలం ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎంచుకుని అందులో క్రికెట్ను ప్రధాన అంశంగా జోడించి దర్శకుడు శశికాంత్ తెరకెక్కించాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో(Nayanthara) పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. తమిళ్,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.కథేంటంటే.. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా కథ. సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కుముద (నయనతార ) ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకుంటుంది. కుముద భర్త శరవణన్ (ఆర్ మాధవన్) భారతదేశంలోనే బెస్ట్ సైంటిస్ట్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కుముద స్కూల్మేట్ అర్జున్ (సిద్ధార్థ్) స్టార్ క్రికెటర్గా గుర్తింపు ఉన్నప్పటికీ ఫామ్ కోల్పోయి భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా ముగ్గురు తమ కోరికలను ఎలాగైన సరే నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో వారి లైఫ్లోకి బెట్టింగ్ మాఫియా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఎవరు ఎలాంటి తప్పులు చేస్తారు అనేది దర్శకుడు చూపారు. చెన్నైలో ఇండియా, పాక్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్తో వీరి ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉంటాయి. శరవణన్ సైంటిస్ట్గా తను కనుగొన్న ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం రూ. 50 లక్షలు అప్పు చేస్తాడు. కానీ, అది ముందుకు సాగదు. అర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో కుమదతో శరవణ్కు గొడవలు వస్తాయి. గొప్ప చదవులు పూర్తి చేసినప్పటికీ జీవితంలో ఏమీ సాధించలేని అసమర్థుడిగా మిగిలిపోతానేమో అనుకున్న శరవణన్.. అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. శరవణన్కు బెట్టింగ్ మాఫియాతో ఎలా లింక్ ఏర్పడుతుంది..? తన స్నేహితుడి కుమారుడిని కిడ్నాప్ చేసినా కూడా అర్జున్కు కుముద ఎందుకు చెప్పదు..? కుమారుడిని కూడా పనంగా పెట్టి అర్జున్ ఎందుకు ఆడుతాడు..? ఈ తతంగం అంతా పోలీసులు ఎలా పసిగడుతారు..? చివరకు ఈ ముగ్గురి జీవితాలు ఎలా ముగిసిపోతాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..దర్శకుడు కథ చెబుతున్నప్పుడు అద్భుతంగా అనిపించే నయనతార, సిద్దార్థ్, మాధవన్ ఒప్పుకొని ఉండొచ్చు. కానీ, స్క్రీన్పై స్టోరీ చూపించడంలో డైరెక్టర్ శశికాంత్ ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. మిడిల్క్లాస్ జీవితాలను చూపించే సమయంలో ఎమోషన్స్ లేకపోతే ఆ సీన్స్ పెద్దగా కనెక్ట్ కావు. ది టెస్ట్ సినిమాలో అదే ఫీల్ కలుగుతుంది. సినిమా టైటిల్, ట్రైలర్ను చూసిన వారందరూ కూడా ఈ మూవీ మరో జెర్సీ లాంటి స్పోర్ట్స్ డ్రామా, థ్రిల్లర్ సినిమానే అనుకుంటారు. కానీ, ఇందులో ఆ రెండూ బలంగా లేవు. కథలో భాగంగా ప్రతి పాత్రలో ఎక్కువ షేడ్స్ కనిపించేలా ఉండాలి. ఆపై ఆ పాత్రల చుట్టూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న తీరు ప్రేక్షకులకు దగ్గర చేయాలి. ఇవి ఏమీ ఇందులో ఉండవు. అర్జున్ ఒక స్టార్ క్రికెటర్. అతనికి కుముద తండ్రి కోచ్గా ఉండేవాడని చెప్తారు. అయితే, కుముదతో ఉన్న బాండింగ్ను దర్శకుడు చూపిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆటగాడికి జట్టులో చోటు దక్కడం కష్టం అంటున్న సమయంలో బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసం శ్రమిస్తున్నట్లుగా ఒక్క సీన్ కూడా ఆర్జున్కు సంబంధించి వుండదు. చివరికి కొడుకుని కూడా పణంగా పెట్టి గ్రౌండ్లో అర్జున్ అడుగుపెడుతాడు. కానీ, తనకు క్రికెటే ముఖ్యం అనేలా దర్శకుడు చూపించలేకపోయాడు. దీంతో ఆర్జున్ ఆటకు ప్రేక్షకులు కనెక్ట్ కావడం చాలా కష్టం.ఎవరెలా చేశారంటే..టెస్ట్ సినిమాలో కాస్త పర్వాలేదు అనిపించే పాత్ర ఏమైనా ఉందంటే శరణన్ (మాధవన్) అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్లో ఆయన పెర్ఫార్మెన్స్కు ఫిదా అవుతారు. ఒక సైంటిస్ట్గా దేశం కోసం ఏదైనా చేస్తాను అనే పాత్రలో చక్కగా సెట్ అయ్యాడు. టెస్ట్ మ్యాచ్లా సాగుతున్న సినిమాను వన్డే ఆటలా మార్చేశాడు. విలన్, హీరో ఇలా రెండు షేడ్స్ ఆయనలో కనిపిస్తాయి. తన వరకు వస్తే ఒక మనిషి ఎంత అవకాశవాదో శరవన్ పాత్రలో దర్శకుడు చూపాడు. ఈ కోణంలో చూస్తే చాలామందికి నచ్చుతుంది. టెస్ట్ సినిమాలో సిద్దార్ధ్ పాత్రను ఇంకాస్త హైలెట్ చేసి చూపింటే బాగుండేది. ది టెస్ట్లో మంచి, చెడు, సంఘర్షణ, స్వార్ధం గెలుపు, ఓటమి ఇలా ఎన్నో షేడ్స్ ఉన్నాయి. కానీ, తెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. -
తిరుమలలో నాగ్ అశ్విన్.. కల్కి2 గురించి అప్డేట్
డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin), ప్రియాంక దత్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాటు వారు పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి వెళ్తుండగా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' పార్ట్-2 అప్డేట్ గురించి అడిగారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.చాలారోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని నాగ్ అశ్విన్ అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ అంతా అంతా బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కల్కి2 సినిమా గురించి మాట్లాడుతూ.. అందుకు ఇంకా చాలా టైమ్ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. పూర్తయిన దాని బట్టి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్పైకి వెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన ప్రకటించారు.‘కల్కి’ పార్ట్2 గురించి కొద్దిరోజుల క్రితమే మీడియా సమావేశంలో నాగ్ అశ్విన్ మాట్లాడారు. మహాభారతం నేపథ్యం నుంచి సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేశామన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్), స్పిరిట్, సలార్2, కల్కి2 చిత్రాలు ఉన్నాయి. అందుకే కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. -
డ్యాన్స్తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
నటనకు ఎల్లలు ఎలాగైతే లేవో ప్రేమకు సరిహద్దులు ఉండవు. దీనికి చిన్న ఉదాహరణ నటుడు ఆర్య, నటి ఆయేషాసైగల్. ప్రేమబంధం ఎప్పుడు ఎవరితో ముడిపడుతుందో ఎవరికి తెలియదు. కోలీవుడ్లో ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ఆర్యకు, బాలీవుడ్ భామ ఆయేషా సైగల్కు (Sayyeshaa Saigal) అలా ప్రేమబంధం ముడిపడింది. అఖిల్ అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీని దర్శకుడు విజయ్ కోలీవుడ్కు పరిచయం చేశారు. నటుడు రవిమోహన్కు జంటగా వనమగన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా, ఆయేషా సైగల్ మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తరువాత తమిళంతో పాటు కన్నడం, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను అందుకోలేకపోయారు. కాగా ఆర్యకు జంటగా గజినీకాంత్ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆయనతో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇరు కుటుంబసభ్యుల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. వివాహనంతరం ఆయేషా సైగల్ నటనకు బ్రేక్ ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. దీంతో ఆయేషా సైగల్ మళ్లీ నటనపై దృష్టి సారించారు. అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు. మరో విషయం ఏమిటంటే ఆయేషా సైగల్ మంచి డాన్సర్. తన డాన్స్ రీల్స్ను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు పని చెబుతూ ఉంటారు. అలా తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 2013లో విడుదలైన రేస్–2 చిత్రంలోని లాట్ లక్ కయీ అనే పాటకు ఆమె డాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు అమ్మ అయితే మాత్రం డాన్స్ ఆడకూడదా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలో ఆర్య, ఆయేషా జంటగా కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. View this post on Instagram A post shared by Sayyeshaa (@sayyeshaa) -
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
‘‘నేను నటించిన ‘హృదయ కాలేయం’ విడుదలై పదకొండేళ్లయింది. ఇన్నేళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. ఈ నెల 25న ‘సోదరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి’’ అని సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) తెలిపారు. సాయి రాజేశ్ నీలం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హృదయ కాలేయం’. ఈ మూవీ ద్వారా సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. 2014 ఏప్రిల్ 4న ఈ చిత్రం విడుదలై, హిట్గా నిలిచింది. ఈ మూవీ 11వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సంపూర్ణేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నరసింహాచారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయ కాలేయం’తో సంపూర్ణేష్ బాబుగా మార్చిన సాయి రాజేశ్ అన్నకు రుణపడి ఉంటాను. ఈ మూవీ టైమ్లో డైరెక్టర్ రాజమౌళిగారు చేసిన ట్వీట్ వల్ల నాకెంతో గుర్తింపు దక్కింది. ‘హృదయ కాలేయం’ టైమ్లో సందీప్ కిషన్ అన్న, మారుతి, తమ్మారెడ్డి భరద్వాజగార్లు ఎంతో సపోర్ట్ చేశారు. నా జీవన విధానానికి, ‘బిగ్ బాస్’ పరిస్థితికి సరిపోక ఆ షోలో ఉండలేకపోయాను. నా సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. కనీసం కారులో తిరగ్గలనా? అనుకున్న నన్ను విమానంలో తిరిగేలా చేశారు సాయి రాజేశ్ అన్న’’ అని తెలిపారు. -
ఏఐ కూడా ఊహించలేదుగా...
శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘శిల్పి ఎవరో...’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. ఈపాటకి శ్రీమణి సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్పాడారు. ‘ఏఐ కూడా ఊహించలేదుగా ఇంత అందాన్ని ఏం చెప్పినా’ అనే పల్లవితో ఈపాట ఆరంభం అవుతుంది. ‘‘తన జీవితంలోని ఇద్దరమ్మాయిల (కేతిక, ఇవానా) అందంపై శ్రీవిష్ణు ప్రశంసలు కురిపిస్తూ ఈపాట సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
అజిత్ కుమార్ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. Maamey!THE MASS CELEBRATION is here 🤩#GoodBadUglyTrailer out now ❤🔥▶️ https://t.co/9KbtVtrkqP#GoodBadUgly Grand release worldwide on April 10th, 2025 with VERA LEVEL ENTERTAINMENT 💥💥#AjithKumar @trishtrashers @MythriOfficial @Adhikravi @gvprakash @AbinandhanR… pic.twitter.com/d2ECC3CoJz— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2025 -
అతను లేకపోతే మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్
మ్యాడ్ స్క్వేర్ మూవీతో మరో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కల్యాణ్ శంకర్. గతంలో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ నిర్వహించింది. హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాట్ టీమ్ను ఉద్దేశించిన ఎన్టీఆర్ మాట్లాడారు. మ్యాడ్ స్క్వేర్ టీమ్పై ప్రశంసలు కురిపించారు .జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నవ్వించడం అనేది ఒక పెద్ద వరం. అలా మనల్ని ఎప్పుడు నవ్వించడానికి మనకు కల్యాణ్ శంకర్ దొరికాడు. దర్శకుడికి నచ్చినట్లుగా మీరు చేయడం కూడా గొప్ప వరం. ఈ సినిమాలో లడ్డు(విష్ణు) లేకపోతే హిట్ అయ్యేది కాదేమో. అతను ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు. కానీ సినిమాలో అలా చేశాడు. సంగీత్ శోభన్ను చూసి ఆయన కుటుంబం అంతా గర్వపడుతున్నారు. రామ్ నితిన్.. నేను ఎలా ఉండేవాన్నో అలానే ఉన్నారు. కెమెరా ముందు నిలబడటం అంతా ఈజీ కాదు. కామెడీని పండించడం చాలా కష్టమైన పని. రామ్ నితిన్ నీకు మంచి భవిష్యత్తు ఉంది' అని అన్నారు.బామర్ది నార్నే నితిన్ గురించి మాట్లాడుతూ..'2011లో నాకు పెళ్లైంది. అప్పుడు నార్నే నితిన్ చిన్న పిల్లవాడు. మొదట నాతో మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసి మొట్టమొదటిసారి చెప్పిన మాట బావ నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నీ సావు నువ్వు చావు.. నా సపోర్ట్ అయితే నీకు ఉండదు అని చెప్పా. ఆ తర్వాత అతని కెరీర్పై నాకు భయం ఉండేది. నాకు ఏమి చెప్పొద్దు అనేవాడిని. ఏరోజు నన్ను ఏది అడగలేదు. ఈ రోజు తనను చూసి చాలా గర్వంగా ఉంది. మంచి దర్శకులు, నిర్మాతలతో పనిచేశాడు. కచ్చితంగా వారిని గుర్తు పెట్టుకో. నిన్ను నువ్వు నమ్ముకో. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంటికెళ్లాక మరోసారి నీతో మాట్లాడతా.' అంటూ సరదాగా మాట్లాడారు. -
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆయన డైరెక్టరా? డ్యాన్స్ మాస్టరా?
ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ సారి డబుల్ మ్యాడ్నెస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించారు.ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తనలోని మరో టాలెంట్ను బయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాయిరే నాయిరే అనే సాంగ్కు డ్యాన్స్తో అదరగొట్టారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను ఊర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Director #KalyanShankar sets the stage on fire with #JrNTR's 'Nairey Nairey'. pic.twitter.com/mixonqAiR7— Suresh PRO (@SureshPRO_) April 4, 2025 -
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
బెంగాలీ బ్యూటీలో ముస్తాబైన యాంకర్ అనసూయఒమన్ ట్రిప్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న రష్మికహాట్ పోజులతో రెచ్చిగొట్టేస్తున్న జాన్వీ కపూర్చీరలో కిర్రెక్కిపోయే అందంతో కావ్య కల్యాణ్ రామ్పచ్చనిచెట్ల మధ్య తృప్తి దిమ్రి సోయగాల విందుఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెప్పిన అనుపమహాలీవుడ్ అందగత్తెలా కనిపిస్తున్న శ్రీలీల View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by ForeverNew India (@forevernew_india) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) -
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ?ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.ఎవరెలా చేసారంటే..? నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.టైటిల్ : 28°Cనటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులునిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్నిర్మాతలు: సాయి అభిషేక్ఎడిటింగ్: గ్యారీ BHదర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు విడుదల: ఏప్రిల్ 04, 2025 -
ఖరీదైన బైక్ కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట.. ధర ఎన్ని లక్షలంటే?
బుల్లితెరపై తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి విష్ణు ప్రియ. తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్తో ఫేమస్ అయింది. అంతేకాకుండా తమిళంలోనూ పలు సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 11/ఏ ఏటిగట్టు అనే వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఇటీవలే ఈ సిరీస్కు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.అయితే తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ ఖరీదైన బైక్ను కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన బీఎండబ్లూ బైక్ను కొనేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ బైక్ ధరలు దాదాపు లక్షల్లోనే ఉంటాయి. బీఎండబ్ల్యూ బ్రాండ్లో వీటి ప్రారంభ ధరలే దాదాపు రూ.3 లక్షల నుంచి మొదలవుతాయి. విష్ణు ప్రియ కొనుగోలు చేసిన ఈ ఖరీదైన బైక్ ధర దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) -
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆర్జీవి డెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్గా చెప్పే ఏకైక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్ని క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్గానే తీర్చిదిద్దారు. -
'స్క్విడ్ గేమ్' నటుడికి శిక్ష విధించిన కోర్టు
'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు 'ఓ యోంగ్ సు'కు న్యాయస్థానంలో శిక్ష పడింది. 90 దేశాల్లో నెం.1గా కొనసాగిన ఈ సిరీస్కు చాలామంది అభిమానులు ఉన్నారు. నెట్ఫ్లిక్స్లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్సిరీస్గా గుర్తింపు ఉంది. 'స్క్విడ్ గేమ్' సిరీస్లో కీలకపాత్రలో కనిపించిన 'ఓ యోంగ్ సు' మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసింది. 2017లో వచ్చిన అభియోగాలు నిజమేనని కోర్టు పేర్కొంది. దీంతో 80 ఏళ్ల ఈ నటుడికి దక్షిణ కొరియా కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.దక్షిణ కొరియాకు చెందిన 'ఓ యోంగ్ సు' కేసు తాజాగా తుది విచారణ జరిగింది. ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ.. నాటక రంగంలో దాదాపు 50 సంవత్సరాలుగా పేరు గడించిన అనుభవజ్ఞుడైన నటుడిగా ఆయన్ను అభివర్ణించారు. కానీ, అతని చర్యలు మాత్రం ఆదర్శవంతంగా లేవని పేర్కొన్నారు. సువాన్ జిల్లా కోర్టు 'ఓ యోంగ్ సు'కు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అలాగే సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది. గతంలో కూడా ఆయనపై మరో లైంగిక వేధింపుల కేసు కూడా ఉన్నట్లు న్యాయస్థానం దృష్టికి వచ్చింది.2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన యోంగ్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఓ సరస్సు దాటేందుకు సహాయం కోసం మాత్రమే ఆ మహిళ చేతిని పట్టుకున్నట్లు యోంగ్ తెలిపాడు. అందుకు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపాడు. కానీ వాస్తవంగా ఆ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పూర్తి ఆధారాలు కోర్టుకు దక్కడంతో ఆయనకు శిక్ష ఖరారు అయింది. -
'లూసిఫర్2' నిర్మాత ఆఫీస్లపై ఈడీ దాడులు.. రూ. 1000 కోట్ల కేసులో
మోహన్లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత ఆఫీస్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లను తప్పుగా ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఆపై విలన్ పేరును భజరంగిగా పెట్టడం కూడా తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ కూడా రాజ్యసభలో ఈ మూవీపై మాట్లాడారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో నిర్మాతపై ఈడీ దాడులు చేయడం చర్చనియాంశంగా మారింది.లూసిఫర్2 సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన తమిళనాడు, కేరళ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కోడంబాక్కంలోని గోకుల్ చిట్ ఫండ్స్ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి.పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు సుమారు రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాపై వివాదం రావడంతో సుమారు 17 సెన్సార్ కట్స్ చేశారు. దీంతో సినిమా నిడివి సుమారు 5నిమిషాలు తగ్గింది. -
దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్ పంపిన 'రామ్ చరణ్- ఉపాసన'
మార్చి 27న రామ్చరణ్ 40వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు ఒక గిఫ్ట్ పంపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తాజాగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారు. చరణ్ పంపిన ఆ కానుక చాలా ప్రత్యేకమైనదని అందులో బుచ్చిబాబు పేర్కొన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో పెద్ది సినిమా తెరకెక్కుతుండటం వల్ల వారిద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగిన విషయం తెలిసిందే.చరణ్- ఉపాసన గిఫ్ట్గా దర్శకుడు బుచ్చిబాబుకు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని పంపారు. అందులోనే హనుమంతుడి ప్రతిమ, శ్రీరాముని పాదుకలను కూడా ఆయనకు పంపారు. ఆపై బుచ్చిబాబు గురించి చరణ్ ఒక నోట్ ఇలా రాశారు.'కష్టకాలంలో హనుమాన్ నా వెంటే ఉన్నాడు. జీవితంలో నన్ను ఆయనే గైడ్ చేశాడు. ఇప్పుడు నేను 40వ దశకంలో అడుగుపెడుతున్నాను. ఇన్నేళ్లు నాకు శక్తిని ఇచ్చిన హనుమాను ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా మనసులో నీవు (బుచ్చిబాబు) ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటావు.' అని చరణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బుచ్చిబాబు కూడా చరణ్ దంపతులకు కృతజ్ఞతలు చెప్పాడు. హనుమంతుని ఆశీస్సులు మీకు మరింత బలాన్ని, శక్తిని ప్రసాదించుగాక అని బుచ్చిబాబు ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను బుచ్చిబాబు షేర్ చేశారు.Tqqq very much dear @AlwaysRamCharan Sir nd @upasanakonidela garu for the wonderful gift 🤍 Indebted to ur love nd support 🙏🏼May the blessings of Lord Hanuman be with you nd give more strength nd power to you Sir...Your values r truly inspiring nd always remind us to stay… pic.twitter.com/1pt1k01zkz— BuchiBabuSana (@BuchiBabuSana) April 4, 2025 -
'మ్యాడ్ స్క్వేర్' సెలబ్రేషన్స్ వివరాలు.. బావమరిది కోసం వస్తున్న ఎన్టీఆర్
'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాడ్ గ్యాంగ్ (నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ )తో తారక్ అల్లరి ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో చూడొచ్చు. 2023లో వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్గా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగవంశీ సమర్పకులుగా ఉన్నారు.మార్చి 28న విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' కేవలం ఐదురోజుల్లోనే రూ. 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వారంలోపే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ను దాటేసి లాభాల బాట పట్టింది. దీంతో అభిమానుల కోసం సక్సెస్ మీట్ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. తన బావమరిది నార్నె నితిన్ 'మ్యాడ్ స్క్వేర్'తో వరుసగా హ్యాట్రిక్ కొట్టడంతో ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారో చూడాలి.ఏప్రిల్ 4న హైదరాబాద్లోని శిల్పా కళా వేదికలో 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయింత్రం 6గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ రాత్రి 8గంటలకు అక్కడికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్తో చిత్ర నిర్మాత నాగవంశీకి మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో 'మ్యాడ్' ట్రైలర్ను రిలీజ్ చేసిన తారక్ ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. -
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్లో తెరకెక్కిన 'పెరుసు' (Perusu) సినిమా ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించింది. ఇప్పుడు ఈచిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో నటుడు వైభవ్తో(Vaibhav) పాటు సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిహారిక(Niharika NM) కీలక పాత్రలలో మెప్పించారు. ఆపై సునీల్ రెడ్డి, బాల శరవణన్, రెడిన్ కింగ్స్లీ, చాందిని తమిళరసన్ నటించారు. 'టాంటిగో' (శ్రీలంక చిత్రం) ఆధారంగా ‘పెరుసు’ మూవీని దర్శకుడు ఇళంగో రామ్ తెరకెక్కించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, బవేజా స్టూడియోస్, ఎంబర్ లైట్ స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి.మార్చి 14న కోలీవుడ్లో మాత్రమే విడుదలైన పెరుసు చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కథ తెగనచ్చేసిందంటూ నెటిజన్లు పోస్ట్లు పెట్టారు. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెరుసు ఏప్రిల్ 11న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రానుంది. తమిళ్, తెలుగు, కన్నడ,మలయాళంలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
మాధవన్ డ్రీమ్ ప్రాజెక్ట్లో శివానీ రాజశేఖర్.. 'జి.డి. నాయుడు'పై సినిమా
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్ను ఇప్పటికే ఖరారు చేశారు. భారత ప్రముఖ ఇంజనీరు జి.డి. నాయుడు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాజశేఖర్, జీవితల కుమార్తె కూడా నటిస్తున్నారు. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) షార్ట్గా జి. డి. నాయుడు అని కూడా అంటారు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రియమణి, జయరాం, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.జీడీ నాయుడు బయోపిక్లో టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ కూడా నటించనుంది. ఇందులో మాధవన్తో పాటుగా బిగ్ స్క్రీన్పై ఆమె కనిపించనున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుండటంతో ఏర్పాట్లు స్పీడ్గా చేస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన జి.డి నాయుడు కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్లో కొన్ని పరికరాల ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్లో విప్లవం సృష్టించారని చెప్పవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ను రూపొందించింది ఆయనే కావడం విశేషం. అందుకే ఆయన్ను ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 1893లో జన్మించిన ఆయన 1974లో మరణించారు. ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్లో మాధవన్ నటిస్తుండటం విశేషం. మరి... వెండితెరపై మిరాకిల్ మేన్గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. -
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
బుల్లితెరపై పలు సీరియల్స్లో సందడి చేసిన నందకిషోర్ హీరోగా నటించిన 'నరసింహపురం' చిత్రం తాజాగా యూట్యూబ్లో విడుదలైంది. రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బిగ్బాస్ ఫేమ్ సిరి హనుమంతు హీరోయిన్గా నటించింది. శ్రీరాజ్ బళ్లా దర్శకత్వం వహించగా.. టి.ఫణిరాజ్, నందకిషోర్, శ్రీరాజ్ సంయుక్తంగా నిర్మించారు. సిస్టర్ సెంటిమెంట్కు రివేంజ్ లవ్ స్టోరీని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.నరసింహపురం సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, యూట్యూబ్లో ఫ్రీగా ఈ మూవీని చూడొచ్చు. ఈ సినిమాలో సిరి చాలా గ్లామర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ తర్వాత ఆమెకు పలు సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కాయి. సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్ కార్యక్రమంలో సిరి పాల్గొనలేదని నందకిషోర్ పలు విమర్శలు చేశారు.సినిమా విడుదల సమయంలో సిరిపై నందకిషోర్ చేసిన కామెంట్స్'తెలుగమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు ఇవ్వడం అరుదనే చెప్పాలి. అలాంటి సమయంలో వైజాగ్ అమ్మాయి సిరి హన్మంత్కు కథానాయికగా ఛాన్స్ ఇచ్చారు. మిగతా సినిమాల్లాగా కాకుండా హీరోయిన్కు మంచి ప్రాధాన్యత ఉంది. ఇంత మంచి పాత్రలు తెలుగువాళ్లకు రావు. ఆమెను ప్రమోషన్స్కు పిలిచినప్పుడు నేను రాలేను అని చెప్పింది. ట్రైలర్లో తన పాత్ర అసభ్యంగా ఉందని, అది చూసినవాళ్లకు తన మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని తనకు తానే ఊహించుకుంది. దానికి, ప్రమోషన్స్కు రాకపోవడానికి సంబంధం ఏంటో నాకర్థం కాలేదు. ఏదేమైనా హీరోయిన్గా సినిమా ప్రమోషన్స్కు రావడం తన బాధ్యత. తన పాత్ర గురించి ముందు ఒకలా చెప్పారు కానీ తర్వాత వేరేలా చూపించారని ఆమె ఫీలైంది. కానీ ఒకసారి సిరి సినిమా చూస్తే దర్శకుడు తనను ఎంత బాగా చూపించాడో అర్థం అయ్యేది. నాకు తెలిసి ఆమె ఇప్పటికీ సినిమా చూసి ఉండదు, చూస్తే మాత్రం తన అభిప్రాయం మారొచ్చు' అని నంద కిషోర్ చెప్పుకొచ్చాడు. అయితే, సిరి మాత్రం బదులుగా తన నుంచి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. -
దేశభక్తి చిత్రాలకు కేరాఫ్ 'మనోజ్ కుమార్' ఇకలేరు
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్(87) శుక్రవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలీవుడ్లో ఆయన ఎక్కువగా దేశభక్తి చిత్రాలను తెరకెక్కించడంతో పాటు నటించారు. దీంతో ఆయన్ను అందరూ 'భరత్ కుమార్' అని కూడా పిలుస్తారు. ఉపకార్ (1967), పురబ్ ఔర్ పశ్చిమ్ (1970), క్రాంతి (1981) వంటి క్లాసిక్ సినిమాలను ఆయన అందించారు. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన అపారమైన కృషికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో కేంద్రప్రభుత్వం గౌరవించింది. సినిమాల నుంచి దూరం అయిన తర్వాత రాజకీయంగా ఆయన బీజేపీలో చేరారు. కానీ, ఎలాంటి పదవులు తీసుకోలేదు. మనోజ్ కుమార్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని మోదీ సంతాపంమనోజ్ కుమార్ మృతిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్మీడియా ద్వారా సంతాపం తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమలో ఐకాన్గా ఉన్న మనోజ్ మరణ వార్త తననెంతో బాధించిందన్నారు. ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ అన్నారు. మనోజ్ రచనలు తరతాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎక్స్ ద్వారా మోదీ సానుభూతి తెలిపారు. -
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్
పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలు కొట్టేశాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి. దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్ కథానాయకుడుగా జవాన్ చిత్రాన్ని చేశారు. ఇందులో నయనతార, దీపిక పడుకొనే హీరోయిన్స్గా నటించారు. అయితే, అల్లు అర్జున్తో నటించే హీరోయిన్ను కూడా అట్లీ ఫైనల్ చేశారట. ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో నటించడానికి ఆమె రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఆమె గనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవల్కు వెళుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్ను ఎంపిక చేశారట. భారీ పీరియాడిక్ డ్రామా కథతో రానున్నారట. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్న గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్లో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యముందని వైరల్ అవుతుంది. ఆగష్టులో ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభం కావచ్చు. -
ఎలాగా అయిపోయానే... ‘ఓ భామ అయ్యో రామ’ సాంగ్
సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. కాగా ‘ఎలాగుండే వాడ్నే... ఎలాగా అయిపోయానే...’ అంటూ సాగే ఈ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటకు శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా శరత్ సంతోష్ ఆలపించారు. మొయిన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘యూత్ఫుల్గా సాగే ఈ పాటలో హీరో, హీరోయిన్ ఎనర్జీ ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని హరీష్ నల్ల పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర బాగుంటుంది’’ అని రామ్ గోధల అన్నారు. -
డేట్ ఫిక్స్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల 18న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కల్యాణ్ రామ్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ లుక్లో కల్యాణ్ రామ్ కనిపిస్తారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది -
సొంత ఊరి జ్ఞాపకాలు గుర్తొస్తాయి: రాజీవ్ కనకాల
రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వంలో నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ నేటి నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సిరీస్ ప్రివ్యూను హైదరాబాద్లో ప్రదర్శించారు.ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ‘‘హోమ్ టౌన్’ వెబ్ సిరీస్లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సిరీస్ ప్రివ్యూ చూసిన వారిలో కొందరికి తమ సొంత ఊరు, మరికొందరికి తమ గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఈ సిరీస్లో పిల్లల అల్లరి చూస్తుంటే 35 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. నవీన్ మేడారంగారు ఈ సిరీస్కు బ్యాక్బోన్లా నిలబడ్డారు. నాతో కలిసి నటించిన ఝాన్సీగారికి, ఇతర టీమ్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత మా సంస్థలో చేసిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’.‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్లో నటించిన ఆ ముగ్గురు పిల్లలు ఓవర్ నైట్ స్టార్స్ ఎలా అయ్యారో, ‘హోం టౌన్’ సిరీస్ స్ట్రీమింగ్ తర్వాత ఈ ముగ్గురు పిల్లలకు కూడా అంతే పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు నవీన్ మేడారం.‘‘సొంతూరుతో ముడిపడిన జ్ఞాపకాలను మర్చిపోలేం. అలాంటి భావోద్వేగాలు ఈ ‘హోమ్ టౌన్’ వెబ్ సిరీస్లో ఉంటాయి. సిరీస్లోని అందరు వారి బెస్ట్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అవకాశం ఇచ్చిన నిర్మాత నవీన్, ఆహాకు థ్యాంక్స్’’ అని తెలిపారు శ్రీకాంత్రెడ్డి పల్లే. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనిరుధ్, అనీ, శ్రావ్య, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడారు. -
త్వరలో చూస్తారు!
‘దసరా’(2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని సంతృప్తిగా లేరని, అదేవిధంగా బడ్జెట్ బాగా పెరిగిపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ గత కొద్దిరోజులుగా ఆన్లైన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్తలపై చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. ‘‘ది ప్యారడైజ్’పై ఎలాంటి అనుమానాలొద్దు. మేము అనుకున్నవిధంగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ మూవీని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నామో త్వరలోనే చూస్తారు. ఆ సమయం వరకు పుకార్లు సృష్టిస్తూ కొందరు బతికేయచ్చు. ఎందుకంటే ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తుంటాయి కదా! మా సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను చాలా దగ్గరగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. ప్రేమ, ద్వేశాన్ని రెండింటినీ తీసుకుని.. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగులో ఉండే గొప్ప చిత్రాల్లో ఒకటిగా ‘ది ప్యారడైజ్’ ఉంటుంది. సినిమాపై పుకార్లు సృష్టిస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలి. అభిమానులంతా గర్వపడే చిత్రంతో నాని మీ ముందుకు వస్తారని మాట ఇస్తున్నాం’’ అని యూనిట్ పోస్ట్ చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమేరా: ఏఓ విష్ణు, సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
అలాంటి ఛాన్స్ వస్తే 'సై' అంటున్న టాలీవుడ్ హీరోయిన్స్
సిల్వర్ స్క్రీన్పై అందంగా మెరిసిపోతుంటారు కథానాయిలు. ఫర్ ఎ చేంజ్ డీ గ్లామరస్గా కనిపించే అవకాశం వస్తే... ‘సై’ అంటారు. అలాంటి పాత్రలు చేసినప్పుడు దక్కే కిక్కే వేరు అంటున్నారు ఈ భామలు. గ్లామర్.. డీ గ్లామర్... ఏదైనా కొందరు తారలు ప్రస్తుతం అదిరిపోయే లుక్కుల్లో కనిపించడం మాత్రమే కాదు... నటనపరంగానూ విజృంభిస్తున్నారు. అదిరిపోయే లుక్కుల్లో కనిపించనున్న ఆ అందాల భామల గురించి తెలుసుకుందాం.ప్రతీకారంతో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్ అనుష్కా శెట్టి నటించిన తాజా సినిమా ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) మూవీ తర్వాత అనుష్క టాలీవుడ్లో కమిటైన చిత్రమిది. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారట.బిజినెస్ ఉమన్గా సత్తా చాటుతున్న ఆమెను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. ఈ కారణంగా వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని టాక్. ఈ చిత్రంలో దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్ని తమిళ నటుడు విక్రమ్ ప్రభు పోషించారు. అత్యధిక బడ్జెట్తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందిన ‘ఘాటీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో సహా పలు భాషల్లో ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్ ఆరంభమైనా చిత్రయూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో విడుదల ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది.ఇటు అమ్మోరు తల్లి... అటు రాక్షసి...ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్లా ఉంటారు నయనతార. అలాగే డిఫరెంట్ రోల్స్ చేయడంలోనూ ఆమె ముందుంటారు. నటనలో వైవిధ్యం చూపిస్తుంటారు. ప్రస్తుతం నయనతార తమిళంలో ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. సుందర్.సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపిస్తారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవ్నీ సినీమ్యాక్స్, రౌడీ పిక్చర్స్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రూ. వంద కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ఇటీవల మొదలైంది. ఇక 2020లో నయనతార లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్గా ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘రాక్కాయీ’ సినిమాలో తన చిన్నారిని రక్షించేందుకు ఎంతటి సాహసాలనైనా చేసే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార గెటప్ కొత్తగా ఉంటుంది. సెంథిల్ నల్లస్వామి డైరెక్షన్లో డ్రమ్స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వెర్స్ ఇండియా సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.నాగ సాధువుగా...ఓ వైపు హీరోయిన్గా, మరో వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు ప్రత్యేక పాటల్లో సందడి చేస్తున్నారు తమన్నా. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజయే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి క్రియేటర్గా వ్యవహరించారు. తొలి భాగంలో జోడీగా నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా మలిభాగంలోనూ నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటించారు తమన్నా. ఓదెల గ్రామానికి ఊహించని కష్టం వస్తుంది. ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న స్వామి నాగ సాధు (తమన్నా) పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. పైగా ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సూపర్ హిట్ కావడంతో ‘ఓదెల 2’పై భారీ అంచనాలున్నాయి. రివాల్వర్ పట్టిన రీటా...‘నేను శైలజ’ (2016) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు కీర్తి. ఆమె టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్కుమార్, రెడిన్ కింగ్సీ కీలక పాత్రలు పోషించారు.ప్యాషన్ స్టూడియోస్ అండ్ ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనీస్వామి నిర్మించారు. కామెడీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సాధారణ జీవితం గడుపుతున్న ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రీటా అనుకోని పరిస్థితుల్లో తుపాకీ చేతపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను హాస్య మూవీస్ అధినేత, నిర్మాత రాజేశ్ దండా సొంతం చేసుకున్నారు.డీ గ్లామరస్గా బుట్టబొమ్మ... తెలుగు తెరపై బుట్టబొమ్మలా పూజా హెగ్డే ఎంతో అందంగా కనిపించారు. ఎన్నో గ్లామరస్ రోల్స్ కూడా చేశారు. కానీ రొటీన్కి డిఫరెంట్గా పూజా హెగ్డే తొలిసారిగా ఓ డీ గ్లామరస్ రోల్ చేశారు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘రెట్రో’. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ ‘రెట్రో’ మూవీలోనే పూజా హెగ్డే డీ గ్లామరస్ రోల్ చేశారు. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ‘రెట్రో’ మే1న విడుదల కానుంది. ఇంకా రాఘవా లారెన్స్ సక్సెస్ఫుల్ హారర్ ఫ్రాంచైజీ ‘కాంచన’ లేటెస్ట్ మూవీ ‘కాంచన 5’లో పూజా హెగ్డే ఘోస్ట్ రోల్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే... పూజాకు ఈ రోల్, గెటప్ కూడా సరికొత్తదే.సీతగా సాయిపల్లవి... పల్లెటూరి అమ్మాయిలా, స్టూడెంట్లా... ఇలా హీరోయిన్ సాయిపల్లవి ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు చేశారు. కానీ ఇప్పటివరకు ‘రామాయణం, మహాభారతం’ వంటి ఇతిహాసాల నేపథ్యంలో రూపొందిన సినిమాల్లో సాయి పల్లవి స్క్రీన్పై కనిపించలేదు. అయితే సీతగా సాయిపల్లవి ఎంత అద్భుతంగా వెండితెరపై మెరిసిపోతారో, వచ్చే ఏడాది దీపావళికి సిల్వర్ స్క్రీన్పై చూడొచ్చు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ’ మూవీ తీస్తున్నారు.ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవిదుబే, హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని సమాచారం. నితీష్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా రిలీజ్ కానున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలీవుడ్లో సాయిపల్లవి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే హిందీలో సాయి పల్లవి ‘ఏక్ దిన్’ అనే లవ్స్టోరీ మూవీ కూడా చేశారు. ఆమిర్ ఖాన్ తనయుడు జూనైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.మహిళల చుట్టూ పరదా...అనుపమా పరమేశ్వరన్ కూడా జోరుమీదున్నారు. అటు హీరోయిన్గా, ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. తాజాగా ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. దర్శనా రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియాపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. వైవిధ్యమైన సోషియో డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో సుబ్బు పాత్రలో నటించారు అనుపమ. ఆమె పుట్టినరోజు (ఫిబ్రవరి 18) సందర్భంగా చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. ‘పరదాలమ్మా పరదాలు... రంగురంగుల పరదాలు... డిజైనర్ పరదాలు.... తీసుకోవాలమ్మా తీసుకోవాలి’ అంటూ అనుపమ చెప్పే డైలాగులకి మంచి స్పందన వచ్చింది. మహిళల చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేటిని ప్రకటించనున్నారు మేకర్స్. స్వారీకి సై...‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు సంయుక్త. ఆ తర్వాత ‘బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. ప్రస్తుతం తెలుగులోనూ చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. ‘స్వయంభూ, నారి నారి నడుమ మురారి, హైందవ, అఖండ 2: తాండవం’ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారామె. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారు.ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఈ మూవీలో సంయుక్త కూడా పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉందట. ఈ స్టంట్స్ చేయడానికి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు సంయుక్త. మరి.. ఆమె పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. ఇదిలా ఉంటే... సంయుక్త టిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మోహన్లాల్ హీరోగా రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్త. యువరాణి పంచమి‘సవ్యసాచి’ (2018) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిధీ అగర్వాల్. ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్పై ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ మూవీ మే 9న విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిన ‘హరి హర వీరమల్లు’లో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా.. పంచమి అనే యువరాణి పాత్రలో నిధీ అగర్వాల్ సరికొత్తగా కనిపించనున్నారు. ఆమె పాత్రకు చాలాప్రాధాన్యం ఉంటుందట. ఈ కథానాయికలే కాదు... ఇంకొందరు కూడా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి, మెప్పించనున్నారు. -
పొట్టి గౌనులో సుప్రీత హోయలు.. బ్లూ శారీలో అనసూయ అందాలు!
పొట్టి గౌనులో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..కామాఖ్య ఆలయంలో సంయుక్త మీనన్ పూజలు..ఫ్యాషన్ షోలో మెరిసిన అత్తారింటికి దారేది హీరోయిన్..బ్లూ శారీలో అనసూయ బ్యూటీఫుల్ లుక్స్..రాబిన్హుడ్ హీరోయిన్ శ్రీలీల క్యూట్ పిక్స్.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
హృదయాలను హత్తుకునేలా ‘‘అనగా అనగా కథలా’ పాట
సత్య రాజ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న భారీ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. ఈ మూవీకి దర్శకుడు మోహన్ శ్రీవత్స. వానర సెల్యూలాయిడ్ బ్యానర్పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్లు అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా మరో ఫీల్ గుడ్ సాంగ్ను రిలీజ్ చేశారు.అనగా అనగా కథలా అంటూ సాగే ఈ పాటను టీకేఆర్ కాలేజ్లో విద్యార్థుల సమక్షంలో బుధవారం నాడు కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ పాటను కార్తిక్ ఆలపించారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన హృద్యమైన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక సనరే రాసిన సాహిత్యంతో తాతయ్య అనే ఎమోషన్, మనవరాలితో తాతయ్యకు ఉండే అనుబంధాన్ని చక్కగా వివరించారు.పాటను రిలీజ్ సందర్భంగా సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘టీకేఆర్ కాలేజ్లోని విద్యార్థుల ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇలా పద్నాలుగు వేల మంది విద్యార్థుల సమక్షంలో పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా పాటను విడుదల చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి.. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన హరనాథ్ రెడ్డి గారికి, అమర్ నాథ్ రెడ్డి గారికి థాంక్స్. త్రిబాణధారి బార్భరిక్ చిత్రంలోని 'అనగా అనగా కథలా' పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో సత్య రాజ్ గారు అవ్వడం నా అదృష్టం. 170 చిత్రాల్లో హీరోగా చేసిన సత్య రాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రంలోని పాటను ఈ కాలేజీలో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పాటను విడుదల చేసేందుకు సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి థాంక్స్. మా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు. -
‘డియర్ ఉమ’ వచ్చేస్తోంది
ప్రస్తుతం ప్రేక్షకులు సాధారణ ఫార్మాట్లో వచ్చే చిత్రాల కంటే విభిన్న కంటెంట్, కొత్త కాన్సెప్ట్లతో రూపొందిన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే, వినూత్నమైన కథాంశంతో ఒక ఫీల్గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్గా నటించడమే కాకుండా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుముఖ ప్రతిభ కలిగిన సుమయ రెడ్డి, సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు.నిర్మాణ బాధ్యతలను సుమయ రెడ్డి నిర్వహించగా, నగేష్ లైన్ ప్రొడ్యూసర్గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్ప్లే, మాటలు రాసి, దర్శకత్వం వహించారు. అనేక విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట సినిమాటోగ్రాఫర్గా, బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రదన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ఇప్పటివరకూ ‘డియర్ ఉమ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. వీటిని బట్టి చూస్తే, ఇది ఒక ఫీల్గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. ఈ ప్రేమకథను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.ఈ ఫీల్గుడ్ లవ్ స్టోరీ అందమైన సందేశంతో పాటు అధిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తయారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. -
ఐకాన్ స్టార్ వారసుడి బర్త్ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025 -
తమన్నాలా నేనెప్పుడు చేయలేదు: హెబ్బా పటేల్
‘ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైం లో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు’ అని హెబ్బా పటేల్(Hebah Patel) అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఓదెల 2 (Odela 2 Movie) సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 చాలా పెద్ద సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.⇢ ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్ లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్ లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ⇢ తమన్నా గారు ప్రతి క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. ఓదెల2 కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు. తమన్నా గారిలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు. ఫ్యూచర్లో అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను.⇢ సంపత్ గారు విజనరీ ఫిలిం మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సంపత్ గారు చాలా నైస్, కైండ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.⇢ కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.⇢ అజినీస్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. ఆయన మ్యూజిక్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. బ్యాగ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ కి కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ⇢ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తానని నమ్మకం ఉంది.⇢ ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది. -
ఓటీటీ ఆఫర్స్ రాలేదు..ఇది అది మార్చు అని ఇబ్బంది పెట్టారు: నవీన్ చంద్ర
ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు తప్పవు. ఆరేళ్ల క్రితం నా సినిమాలు సరిగా ఆడకపోవడం వల్ల అప్పుడు నటించిన ‘28°C’ మూవీకి బిజినెస్ జరగలేదు. ప్పటికి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇంతగా లేవు. ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు.పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు "28°C" సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. "28°C" థియేటర్ లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు యంగ్ హీరో నవీన్ చంద్ర అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్చంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికి నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. "28°C" సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.→ "28°C" సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం కానీ ఆ టైమ్ లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్ గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.→ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్ గా మలిచారు మా డైరక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్ గా రాశారు.→ కోవిడ్ తర్వాత థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ ఎక్కువయ్యాయి. మూవీస్ లో హింస పెరిగింది. సొసైటీలో కూడా హింస పెరిగింది. ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినిమాల్లోనూ అలాంటి క్రైమ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను హీరోగా చేసే సినిమాలకు ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నాను. క్యారెక్టర్స్ చేస్తే అది లైఫ్ లీడ్ చేయడానికి, కొంత డబ్బు సంపాదించడానికి, నా క్రాఫ్ట్ ను కెరీర్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నా.→ అరవింద సమేత వీర రాఘవలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి పేరొచ్చింది. నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రంలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. గేమ్ ఛేంజర్ లో ఉండిపోవడం వల్ల సూర్య రెట్రో మూవీలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం మిస్ అయ్యింది. ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో షో టైమ్ తో పాటు 11 అనే మరో మూవీ ఉంది. నాకు బాగా పేరు తెచ్చిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. -
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లాడారు. 2023లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్లే మంచు మనోజ్ ఆమెను పెళ్లాడారు. హైదరాబాద్లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది ఈ జంట ముద్దుల కూతురిని తమ జీవితంలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తమ గారాలపట్టికి దేవసేన శోభ అని శోభనాగిరెడ్డి పేరు కలిసేలా నామకరణం చేశారు. ఈ జంటకు ఏప్రిల్ 2, 2024లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇవాళ తమ కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ సైతం చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. తనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.ఇక మనోజ్, మౌనిక దంపతులు తమ ముద్దుల కూతురి దేవసేన తొలి పుట్టినరోజు ఫోటోలను షేర్ చేశారు. ఓ పురాతన కట్టడంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమ కూతురిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.మనోజ్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఏడాది క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక తిరుగులేని బంధం. ఈ నాలుగు పిల్లర్స్ ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు అనంతమైన ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నికు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం.' అంటూ కూతురిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు మనోజ్ దంపతుల ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
ట్రైలర్లో ఎక్కువగా బూతులు.. అందుకే వాడాల్సి వచ్చింది: సిద్ధు జొన్నలగడ్డ
డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్గా మారిన టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. గతేడాది టిల్లు స్క్వేర్తో మరో అభిమానులను మెప్పించిన సిద్ధు సినిమాతో అలరించేందుకు రెడీ అయిపోయాడు. సిద్ధు- బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న సరికొత్త యాక్షన్ మూవీ జాక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరో సిద్ధు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే జాక్ ట్రైలర్లో ఎక్కువగా బూతు పదాలు ఉపయోగించడంపై సిద్ధును ప్రశ్నించారు.అవును.. బూతులు వాడాం.. కానీ అక్కడ సీన్కు తగినట్లుగానే పెట్టాల్సి వచ్చిందని సిద్ధు అన్నారు. ఈ విషయంలో హీరో క్యారెక్టర్కు.. ఆ సమయంలో ఎమోషన్కి ఆ డైలాగ్స్ పెట్టామని తెలిపారు. పీక్ క్లైమాక్స్ కావడంతో ఆ ఎమోషన్కు అది కరెక్ట్ అని అలా చేసినట్లు సిద్ధు వెల్లడించారు. అలాగే మీ మూవీ సెన్సార్ పూర్తయిందా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు ఇంకా తెలియదని బదులిచ్చారు.కాగా.. ఈ చిత్రంలో సిద్ధు సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
బుల్లితెరపై యాంకర్గా క్రేజ్ దక్కించుకున్న టాలీవుడ్ నటుడు ప్రదీప్ మాచిరాజు. పలు రియాలిటీ షోలకు యాంకర్గా పనిచేశారు. అలా యాంకరింగ్తో ఫేమస్ అయిన ప్రదీప్ పలు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆయనే హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో ఆడియన్స్ను పలకరించనున్నారు. ఈ సినిమకు నితిన్- భరత్ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రదీప్. ఇటీవలే ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్వరలోనే ఓ రాజకీయ నాయకురాలితో మీ పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పుకుండా పెళ్లి అయితే చేసుకుంటానని అన్నారు.తన పెళ్లి గురించి ప్రదీప్ మాట్లాడుతూ.. 'నా పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు. ముందు జీవితంలో సెటిల్ కావాలనుకున్నా. నాకు సొంతంగా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ముందు వాటిని సాధించడమే నా లక్ష్యం. అవీ ఆలస్యం కావడంతోనే మిగిలిన పనులు కూడా వాయిదా పడుతున్నాయి. అన్నీ కూడా సరైన టైమ్కే పూర్తి అవుతాయని నమ్ముతున్నా. రాజకీయ నాయకురాలితో తన పెళ్లి అని వస్తున్న వార్తలు నేనూ విన్నా.. అంతకుముందే రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి అన్నారు.. త్వరలో క్రికెటర్తో పెళ్లి అంటారేమో. అన్నీ సరదా కోసమే చేస్తున్న ప్రచారం' అంటూ నవ్వుతూ మాట్లాడారు. కాగా.. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న విడుదల కానుంది. -
'హారర్' సినిమా సూపర్హిట్.. పార్ట్-3 కోసం లైన్ క్లియర్
కోలీవుడ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తీకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం 'డీమాంటీ కాలనీ'(Demonte Colony). తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది. అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హారర్ కథా చిత్రం 2015లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అజయ్ జ్ఞానముత్తు 9 ఏళ్ల తర్వాత డీమాంటీ కాలనీకి సీక్వెల్ చేశారు. ఇందులోనూ నటుడు అరుళ్ నిధినే కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి ప్రియా భవానీ శంకర్ నటించారు. అరుణ్ పాండ్యన్, నటి మీనాక్షి గోవింరాజన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పార్టు 1 కంటే మరింత భారీ బడ్జెట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది తెరపైకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది.కాగా ఈ చిత్రానికి పార్టు -3 ఉంటుందని చివరిలో లీడ్ ఇచ్చారు. దీంతో డీమాంటీ కాలనీ సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం డిమాంటీ కాలనీ –3 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే షూటింగ్ను ప్రారంభించి చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులోనూ అరుళ్ నిధినే హీరోగా నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
'జాక్' నుంచి బ్లాక్బస్టర్ ట్రైలర్.. సిద్ధూ ఇరగదీశాడు
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కొత్త సినిమా 'జాక్' (Jack) ట్రైలర్ వచ్చేసింది. ఇందులో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకానే అనిపించేలా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్ వాయిస్తో ప్రారంభమైన ‘జాక్’ ట్రైలర్ను చూస్తే పూర్తి వినోదాత్మక చిత్రంలా ఉంది. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. -
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్ అవుతున్నాయి.పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్రాజ్ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్గా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్రాజ్ అన్నారు.తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు. He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister. - @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025 -
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి సరదాగా నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్స్ నితిన్–భరత్ చెప్పారు. ప్రదీప్ మాచిరాజు(pradeep Machiraju), దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్– మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నితిన్, భరత్ మాట్లాడుతూ– ‘‘ప్రదీప్గారి ఫస్ట్ సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. అప్పుడే ఆయనతో సినిమా తీయాలనుకున్నాం. అలా మేం చెప్పిన కథ ప్రదీప్కి నచ్చడంతో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఆరంభమైంది. ఇది పవన్ కల్యాణ్ గారి సినిమా టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుందని అనుకున్నాం. అలాగే కాన్సెప్ట్ కూడా టైటిల్కి యాప్ట్గా ఉండడం వల్లే పవన్ కల్యాణ్ గారి టైటిల్ తీసుకోవడం జరిగింది. రొమాంటిక్ ఎంటర్టైనర్లా రూపొందిన ఈ సినిమాలో వినోదం సందర్భానుసారంగా, ఆర్గానిక్గా ఉంటుంది. తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుని, ఆడిషన్స్ చేసి, దీపికని తీసుకున్నాం. ప్రదీప్గారి ఫ్రెండ్స్ ఈ మూవీ నిర్మించారు. రథన్గారి అద్భుతమైన సంగీతం, బాల్ రెడ్డిగారి విజువల్స్ ఆకట్టుకుంటాయి. మా సినిమా మైత్రీ మూవీ మేకర్స్కి నచ్చడంతో విడుదల చేస్తున్నారు’’ అన్నారు. -
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
‘‘34 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఆదిత్య 369’ (Aditya 369 Movie) రీ రిలీజ్ కావడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్గా అప్గ్రేడ్ చేసి రీ రిలీజ్ చేస్తుంటే... ప్రేక్షకులకే కాదు.. నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్’’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa) పేర్కొన్నారు. బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ సీక్వెల్కి కథ సిద్ధం చేశాం. ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు. కానీ, ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని అంటుంటారు. అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం. ఇక నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్. జి. వెల్స్ రచించిన ‘ది టైమ్ మిషన్’ నవల ఆధారంగా ‘ఆదిత్య 369’ తీశాను. ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా. పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్.. ఇలా ముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం. పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్ని, టైమ్ మెషిన్ను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని తెలిపారు. -
తల్లిదండ్రులైన కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, సంగీత
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, నటి సంగీత దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో సంగీత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. లేటు వయసులో 2023 డిసెంబర్ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇప్పుడు తమకు కుమార్తె జన్మించినట్లు సోషల్మీడియా ద్వారా నటి సంగీత తెలిపింది. దీంతో వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.రెడిన్ కింగ్స్లీ, నటి సంగీత దంపతులకు కుమార్తె జన్మించడంతో వారి కుటుంబంలో మరింత సంతోషం నెలకొంది. ఈ క్రమంలో ఆమె ఒక పోస్ట్ షేర్ చేసింది. 'మా లిటిల్ ప్రిన్సెస్ను అందరూ ఆశీర్వదించాలని సంగీత కోరింది. మా జీవితంలో అద్బుతమైన కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో మీరందరూ నన్ను ఎంతగానో ప్రేమించారు. ఈ శుభవార్తతో మా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంతకు మించిన మధురమైన క్షణాలు ఏవీ ఉండవు అనుకుంటున్నాను.' అని సంగీత తెలిపింది.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమాతో రెడిన్ కింగ్స్లీ బాగా పాపులర్ అయ్యాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్లో నటించి గుర్తింపు పొందింది.సంగీతకు రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై ఆ సమయంలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by Sangeetha.V🦋 (@sangeetha.v.official) -
సీన్లో అతడు హద్దుమీరాడు: పోటుగాటు హీరోయిన్
బాలీవుడ్ నటి అనుప్రియా గోయెంకా(Anupriya Goenka) ఒక ముద్దు సీన్లో చాలా ఇబ్బంది పడ్డానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగులో పోటుగాడు, పాఠశాల సినిమాలతో తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టైగర్ 3, పద్మావత్ వంటి సినిమాలతో పాటు పాంచాలి, అసుర్, ఆశ్రమ్ వంటి వెబ్ సిరీస్లతో ఆమె మెప్పించింది. కథకు అవసరం అనుకుంటే ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు ఆమె ఏమాత్రం తగ్గదు. అయితే, ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక నటుడు తనతో కావాలనే అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ఆ నటుడి వివరాలను గోప్యంగానే ఉంచిన ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఒక సినిమాకు సంబంధించి ముద్దు సీన్ను షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సీన్లో నా దుస్తులు అసౌకర్యంగానే ఉంటాయి. కిస్సింగ్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు అతను తేలికగా నా నడుము పట్టుకోవచ్చు.. స్క్రిప్ట్లో కూడా అదే ఉంది. కానీ, ఆ సమయంలో అతను అసభ్యకరంగా మరోచోట చెయి వేశాడు. దీంతో చాలా బాధపడ్డాను. అలా ఎందుకు చేస్తున్నావ్ అని అతన్ని ప్రశ్నించవచ్చు.. కానీ, అడగలేదు. ఎందుకంటే పొరపాటు అయిందని సింపుల్గా చెప్పి వెళ్లిపోతాడని తెలుసు. అందుకే అడగలేదు. తర్వాతి టేక్లో ఇలా చేయకండి అంటూ అతనికి చెప్పాను. ఆ సీన్ తీస్తున్నప్పుడు అతను చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. నేనే కంట్రోల్ చేశాను. నాకు రెండుసార్లు ఇలా జరిగింది.' అని అనుప్రియా గోయెంకా చెప్పింది. 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' టెలివిజన్ సిరీస్ గురించి ఆమె మట్లాడినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. తాను ఒక సినిమా షూటింగ్ కారవాన్లో డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఒక డైరెక్టర్ లోపలికి వచ్చేశాడని తెలిపింది. అనుమతి లేకుండా రావడంతో అతనిపై మండిపడినట్లు కూడా ఆమె పేర్కొంది. సౌత్ దర్శకుడు అని క్లూ ఇచ్చిన ఈ బ్యూటీ కూడా అతని పేరు చెప్పలేదు. -
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
టాలీవుడ్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ సినిమా 'ది ప్యారడైజ్'(The Paradise ).. పోస్టర్తో పాన్ ఇండియా రేంజ్లో సినీ ప్రేక్షకులను మెప్పించిన ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓటీటీ ఢీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. కేవలం గ్లింప్స్తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని, కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు వైరల్ అయింది. ఆపై బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోవడం వల్ల ఈ సినిమాను ఆపేస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై చిత్ర యూనిట్ గట్టిగానే రియాక్ట్ అయింది.సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు రూమర్స్ వైరల్ చేసేవారిని జోకర్స్తో పోలుస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'ది ప్యారడైజ్ ప్రాజెక్ట్పై ఎలాంటి అనుమానాలు వద్దు. మేము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నాం. దానిని మీరందరూ కూడా త్వరలో చూస్తారు. ఆ సమయం వరకు రూమర్స్తో కొందరు బతికేయవచ్చు. 'గజరాజు నడుస్తూ ఉంటే..గజ్జి కుక్కలు అరుస్తాయి'. ది ప్యారడైజ్ సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను మేము చాలా దగ్గరగా చూస్తునే ఉన్నాం. ఆపై ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. మేము ప్రేమ, ద్వేశాన్ని రెండూ తీసుకుంటాము. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగు పరిశ్రమలో ఉండే గొప్ప చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ ఉంటుంది. సినిమాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.. ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్యారడైజ్ సినిమాతో నాని తిరిగొస్తాడని మాట ఇస్తున్నాం.' అని ఒక చిత్ర యూనిట్ ఒక పోస్ట్ చేసింది.హిట్ 3 టీజర్లో మోస్ట్ వయోలెంట్ ఆఫీసర్గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్లో ది ప్యారడైజ్లో కనిపంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వచ్చే సంవత్సరం మార్చి 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో ది ప్యారడైజ్ విడుదల కానుంది. To all 🤡s out there, you feed on us... because we let you do so.#TheParadise is rising in all its glory. Rest assured, it is on the right track. And you all will witness it soon.Meanwhile, keep feeding on us as much as you can. Because...'Gajaraju nadiste..Gajji kukkalu…— THE PARADISE (@TheParadiseOffl) April 2, 2025 -
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
సాధారణంగా సినీ కుటుంబాలకు చెందిన వారసులు చిత్ర పరిశ్రమంలోనే పనిచేయాలని కోరుకుంటుంటారు. ముందు వేరే వృత్తులకు సంబంధించిన చదువులను అభ్యసించినప్పటికీ చివరికి వారి పయనం మాత్రం సినిమానే అవుతుంది. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. కాగా కోలీవుడ్లో ప్రముఖ సినిమా జంటల్లో దర్శకుడు సుందర్ సి, నటి, నిర్మాత కుష్బూల జంట ఒకటి. వృత్తిపరంగా విజయ పథంలో దూసుకుపోతున్న ఈ జంట 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ముచ్చటైన జంటకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు అందమైన కూతుర్లు ఉన్నారు. వీరి పేరుతోనే అవ్నీ సినీ మ్యాక్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా విత్తనం ఒకటైతే మొక్క మరొకటి అవుతుందా? అనే సామెత మాదరి దర్శకుడు సుందర్ సి, నటి కుష్బూ వారసులు కూడా వారి బాటలోనే నడుస్తారనిపిస్తోంది. ఎందుకంటే సుందర్ సి, కుష్బూ దంపతుల కుమార్తెలు అవంతిక, ఆనందిత ఇప్పుడు చదువులు పూర్తి చేసుకున్నారు. వీరిలో అవంతిక అచ్చు తన తల్లి కుష్బూ రూపురేఖలనే కలిగి ఉండడంలో అతిశయోక్తి కాదు.. అవంతికను చూస్తుంటే చిన్ననాటి కుష్బూనే స్మరణకు వస్తారు. అవంతిక తాజాగా ప్రత్యేకంగా ఫొటోషూట్లో పాల్గొంది. ఎంతో గ్లామర్గా ఉన్న ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తెరపైకి కుష్బూ వారసురాలు రెడీ అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తండ్రి ప్రముఖ దర్శకుడు. తల్లి సంచలన నటి, నిర్మాత. వారికి తోడు సమ్మోహన రూపంతో కనిపించే అవంతికకు కథానాయకి కావడానికి ఇంతకంటే మరేం కావాలి. హీరోయిన్గా ఈ క్యూట్ గర్ల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by avantika (@avantikasundar) -
చిరంజీవి సినిమాలో అతిథి?
చిరంజీవి, వెంకటేశ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే... అవుననే సమాధానమే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ఈ సినిమాలోని అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
‘‘సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి? అనే అంశంపై తీసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. కథ రాసినప్పుడు నేను ఊహించనదానికంటే సినిమాను బాగా తీశాడు దర్శకుడు గిరికృష్ణ కమల్. ఈ సినిమా సబ్జెక్ట్ను చర్చిస్తున్నప్పుడు, అతని ఆలోచనలు నచ్చి, ‘శారీ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించాను’’ అని దర్శక–నిర్మాత–రచయిత రామ్గోపాల్ వర్మ అన్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘శారీ’. గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ పతాకాలపై రవిశంకర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ– ‘‘సత్య, ఆరాధ్య... ఇలా ప్రధానంగా రెండు పాత్రలతో సాగే ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఇది నాకో డ్రీమ్ ప్రాజెక్ట్’’ అని పేర్కొన్నారు ఆరాధ్య దేవి. ‘‘ఈ మూవీలో ఉన్నవి తక్కువ పాత్రలే అయినా, అవి ఎఫెక్టివ్గా ఉంటాయి’’ అని తెలిపారు సత్య యాదు. ‘‘గులాబి’ సినిమా నుంచి రామ్గోపాల్ వర్మతో వర్క్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఏ మూవీ కోసం పిలిచినా రెడీగా ఉంటాను’’ అని చె΄్పారు ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్. -
పాముతో సీన్స్ చేయడానికి భయపడ్డాను
హీరోయిన్ కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో, మహేశ్ శ్రీరామ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫణి’. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, ఏయూ అండ్ ఐ స్టూడియోల సమర్పణలో డా. మీనాక్షి అనిపిండి ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రెస్మీట్కు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై, ‘ఫణి’ సినిమా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వీఎన్ ఆదిత్య కొత్త వాళ్లతోనూ సినిమా చేయగలడు, స్టార్స్తోనూ సినిమా చేయగలడు. ‘ఫణి’ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘నాకు పాములంటే భయం. దీంతో పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని ఆదిత్యగారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అయితే షూటింగ్ చివర్లో పాము కాంబినేషన్లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ పూర్తయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. మేలో మా ‘ఫణి’ మూవీని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు కేథరిన్. ‘‘యూఎస్ వెళ్లినప్పుడు నా సోదరి మీనాక్షి–బావ శాస్త్రిగారి ఇంట్లో ఉంటాను. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తామన్నప్పుడు నాకు భయం వేసింది. ‘ఫణి’ చిత్రాన్ని చిన్నగా మొదలు పెట్టాం. ఆ తర్వాత కేథరిన్గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది’’ అన్నారు వీఎన్ ఆదిత్య. ‘‘ఫణి’ మూవీతో కేథరిన్గారికి జాతీయ అవార్డు వస్తుంది’’ అని తెలిపారు నిర్మాత, సంగీత దర్శకురాలు డా. మీనాక్షి అనిపిండి. ‘‘హాలీవుడ్లో మోడలింగ్, మూవీస్ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించడంతో సొంత ఇంటికి వచ్చినట్లుంది’’ అన్నారు మహేశ్ శ్రీరామ్. ఈ చిత్రసమర్పకుడు పద్మనాభరెడ్డి, సహ–నిర్మాత శాస్త్రి అనిపిండి, రైటర్ పద్మ, నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. -
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
హెచ్సీయూ వివాదంపై టాలీవుడ్ సినీతారలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రేణూ దేశాయ్, రష్మిక మందన్నా, నాగ్ అశ్విన్, సమంత కూడా స్పందించారు. దాదాపు 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలానికి పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది .యాంకర్ రష్మీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోను ఎలాంటి రాజకీయాల కోసం చేయటం లేదు. ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి విరుద్ధంగా పోస్ట్ చేయడం లేదు. హెచ్సీయూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఆన్ హెచ్సీయూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. నేను చాలా సౌకర్యంగా అపార్ట్మెంట్లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను. గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగించారో నాకు కూడా తెలుసు' అని అన్నారు. 'కానీ ప్రస్తుతం హెచ్సీయూలో జరుగుతున్న అభివృద్ధి వల్ల నెమళ్లు, వేల పక్షులు సఫర్ అవుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన వీడియో చూసిన తర్వాత పక్షులు, జంతువులను వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రస్తుత వేసవికాలం అందులో పక్షులు, నెమళ్లు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఆ పశు, పక్షులను దృష్టిలో ఉంచుకుని పునరావాసం కల్పించండి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
గోల్ఫ్ ఆడుతూ చిల్ అవుతున్న ఐశ్వర్యా రాజేశ్హాట్ నెస్ తో కాక రేపుతున్న దిశా పటానీవిచిత్రమైన డ్రస్సులో ప్రియమణి పోజులు50 ఏళ్లకు దగ్గరవుతున్న వన్నె తగ్గని జ్యోతికవింత వేషధారణలో బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్చీరలో నాభి అందాలు చూపించేస్తున్న రీతూ చౌదరిబీచ్ రిసార్ట్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అను ఇమ్మన్యుయేల్ View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో 400 ఎకరాల భూ వివాదంపై స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna ) స్పందించారు. ఈ విషయంపై ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. "రాత్రికి రాత్రే బుల్డోజర్లు. విద్యార్థుల అరెస్టులు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో నిజంగా ఏమి జరుగుతోంది?" అంటూ ఆమె ప్రశ్నించారు.ఈ వివాదం గత కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చింది. విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మాణం కోసం వేలం వేయాలని ప్రతిపాదించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాజాగా రాజకీయ పార్టీలు తోడవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. (చదవండి: హార్డ్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!)400 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లను నరికివేయడంతో, ఆ అడవిపై ఆధారపడిన మూగజీవుల జీవనాధారం కోల్పోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, జీవవైవిధ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిరసనకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా మద్దతు ఇస్త్ననారు. స్టార్ హీరోయిన్ సమంత, నాగ్ అశ్విన్, నటి రేణూ దేశాయ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. -
కిడ్నాప్ చేసి నిన్ను ముంబై తీసుకెళ్లిపోతా: మంచు లక్ష్మీ
మంచు కుటుంబంలో మనోజ్, విష్ణు.. హైదరాబాద్ లో ఉంటున్నారు. కానీ మంచు లక్ష్మీ మాత్రం ముంబైలో ఉంటోంది. రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ గొడవల్లోనూ ఈమె ఎక్కడా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇన్ స్టాలో మనోజ్ కూతురు గురించి లక్ష్మీ క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది.మనోజ్ కూతురిని తెగ ముద్దు చేసేస్తున్న మంచు లక్ష్మీ.. చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమనంతా బయటపెట్టింది. 'నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. పని కూడా ఉంది. కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన. నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను. రోజంతా నీతోనే గడిపాను. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్.'(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)'మనిద్దరి మధ్య మంచి అనుబంధముంది. మాటల్లో అది చెప్పలేను. నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తని. నీ తొలి పుట్టినరోజున చాలా చెప్పాలని ఉంది. కానీ నువ్వు ఆనందంగా ఎదగాలి. నీ ప్రపంచం అందంగా ఉండాలి. నువ్వు మా ఇంటి రాణివి. నిన్ను తర్వలో కిడ్నాప్ చేసి ముంబై తీసుకెళ్లిపోతా (నవ్వుతూ). ఈ డైమండ్ ని నాకు ఇచ్చినందుకు మనోజ్-మౌనికకు థ్యాంక్యూ' అని మంచు లక్ష్మీ రాసుకొచ్చింది.మనోజ్, అతడి కూతురు దేవసేనతో మంచు లక్ష్మీ బాండింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. కానీ కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు.. ఇప్పుడు మనోజ్ కూతురు గురించి లక్ష్మీ పోస్ట్ పెట్టడం చూస్తుంటే మోహన్ బాబు-విష్ణు ఒకవైపు.. మనోజ్-లక్ష్మీ ఒకవైపు ఉన్నట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సీయూ విద్యార్థులు ఆందోళనలకు దిగడం..వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడంతొ ఈ వివాదం ఇంకాస్త పెద్దదైంది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదంతా పక్కకి పెడితే ప్రకృతి ప్రేమికులు మాత్రం 400 ఎకరాల్లో ఉన్న చెట్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు.(చదవండి: 'రేపోమాపో నేను చనిపోతాను.. తల్లిగా అడుక్కుంటున్నా..', 'మూగజీవాల్ని ఏం చేస్తారు?')సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రేణు దేశాయ్, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, యాంకర్ రష్మి తదితరులు ఈ వివాదంపై స్పందిస్తూ.. చెట్లను, జంతువులను కాపాడుకోవాలని కోరారు. ఇక తాజాగా ప్రముఖ హీరోయిన్ సమంత, యాంకర్, నటి అనసూయ సైతం ఈ వివాదంపై స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల కథనంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలంగాణ టుడేలో వచ్చిన ఆర్టికల్ని పోస్ట్ చేసిన సమంత..బులడోజర్స్ తో 400ఎకరాల్లో చెట్లను నరకటం చాలా బాధగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయని.. అడవుల్ని నరుక్కుంటూ పోతే.. ఇప్పటికే ఉన్న దానికంటే.. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అటవీ జంతువులు, పక్షులను కాపాడండి అని నినాదం ఇచ్చింది.ఇక సోషల్ మీడియా సంచలనం అనసూయ సైతం ఈ వివాదంపై ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. హెచ్సీయూ క్యాంపస్లోని రాత్రి పూట వీడియోలు, జింకలు, ఇతర మూగజీవాలు సేద తీరుతున్న వీడియోలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ..ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ రాసుకొచ్చింది. -
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్.. ఇప్పుడు హీరోగా మరో మూవీ ఓకే చేశారు. 'కమిటీ కుర్రాళ్లు' మూవీతో నిర్మాతగా తొలి హిట్ అందుకున్న నిహారిక.. ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై రెండో చిత్రాన్ని ప్రారంభించింది. మానస శర్మ అనే కొత్తమ్మాయిని దర్శకురాలిగా పరిచయం చేస్తోంది. గతంలో ఈమె.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీసులకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు సినిమాకు డైరెక్షన్ వహించబోతుంది. ఇదివరకే నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ లో సంగీత్ శోభన్ నటించాడు. దానికే మానస శర్మ కూడా పనిచేసింది. అప్పుడు ఓటీటీ సిరీస్ కోసం పనిచేసిన ఈ ముగ్గురు.. ఇప్పుడు సినిమా కోసం ఒక్కటయ్యారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాదే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) -
హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి గిఫ్ట్.. ఎందుకో తెలుసా?
పెళ్లి సందడి తర్వాత టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది శ్రీలీల. ఇటీవలే నితిన్ సరసన రాబిన్హుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగులో స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్లోనూ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సిక్కింలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా బహుమతులు అందజేశారు. అంతేకాకుండా మూవీ షూటింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎంఓ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ సందర్భంగా డైరెక్టర్ అనురాగ్ బసు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఇక్కడ షూటింగ్ సమయంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉందని కార్తీక్ ఆర్యన్ అన్నారు. మాకు భద్రత కల్పించినందుకు సిక్కిం పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా షూటింగ్ సజావుగా పూర్తి చేసేందుకు సహకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సిక్కింలోని ప్రకృతి దృశ్యాలు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనను ఆకర్షించాయని హీరోయిన్ శ్రీలీల అన్నారు. ఈశాన్య రాష్ట్రానికి తన మొదటి పర్యటనను నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు.It was a pleasure to meet Bollywood filmmaker Shri Anurag Basu and renowned actors Mr Kartik Aaryan and Ms. Sreeleela at my official residence, Mintokgang. They have been in the state for a week, shooting their upcoming film at iconic locations such as MG Marg and Tsomgo Lake.… pic.twitter.com/ycwHB8R7IG— Prem Singh Tamang (Golay) (@PSTamangGolay) April 2, 2025 -
విగ్ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్పై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్స్టార్ రజనీకాంత్(Rajinikanth) బయట ఎంత సింపుల్గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎక్కువగా తెల్ల పంచె, షర్ట్ ధరించే కనిపిస్తాడు. సినిమా ఈవెంట్స్కి కూడా అలానే వెళ్తాడు. అవసరం అయితే తప్ప మేకప్ వేసుకోరు. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు ఎంత మంది ఉన్నారో..ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్లుకూడా అంతే ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ..రజనీకాంత్పై బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా(Mukesh Khanna) ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ హీరోలలో ఎంతో మందికంటే రజనీకాంత్ చాలా గొప్పవాడని, రియల్ హీరో అంటే ఆయనేనని పొగడ్తలతో ముంచేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు రజనీకాంత్ని వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్గా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు కూడా మేకప్ వేసుకోరు. కనీసం విగ్గు కూడా ధరించడు. ఫ్యాన్స్తో ఓ సామాన్య వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడు.బాలీవుడ్ హీరోల్లో ఎవరూ కూడా రజనీకాంత్లా ఉండలేరు. మేకప్ లేకుండా వాళ్లు బయట తిరగలేరు. వాళ్లతో పోలిస్తే రజనీకాంత్ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రియల్ హీరో’ అని మేకేష్ చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ గురించి చెబుతూ.. డైలాగులు లేని కారణంగా చాలా పెద్ద సినిమాలు వదులుకున్నానని చెప్పారు. విలన్గా చేయడం ఇష్టంలేక సినిమాలను దూరం పెట్టానని చెప్పారు. ‘మహాభారతం’ సీరియల్లో మొదట దుర్యోధనుడి పాత్ర ఇస్తే నో చెప్పానని, ఆ తర్వాత భీష్ముడి పాత్ర వచ్చిందని చెప్పారు. బాలీవుడ్ హీరోలపై ముకేశ్ ఖన్నా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి."రూహీ"(1981) చిత్రంలో ముకేశ్ ఖన్నా తన సినీ కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత అతను "వక్త్ కీ దీవార్" (1981), "దర్ద్ కా రిష్తా" (1982) వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు. 1980లలో అతను అనేక హిందీ చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు, కానీ అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1997లో దూరదర్శన్లో ప్రసారమైన "శక్తిమాన్" అనే టెలివిజన్ సీరియల్తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్లో అతను శక్తిమాన్ అనే సూపర్హీరో పాత్రను పోషించాడు. ఈ పాత్ర అతన్ని ఇంటింటికీ చేర్చింది, ముఖ్యంగా పిల్లల్లో అతను అత్యంత ప్రజాదరణ పొందాడు. "శక్తిమాన్" సీరియల్ను అతను స్వయంగా నిర్మించడం విశేషం.‘మహాభారతం’ లో పోషించిన భీష్మ పాత్ర అతన్ని భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. నటనతో పాటు నిర్మాణం మరియు దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చాటిన ముకేష్ ఖన్నా, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. -
మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి
ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనా గల్రానీ.. తెలుగులో మరికొన్ని మూవీస్ కూడా చేసింది. కాకపోతే అనుకున్నంత పేరు రాలేదు. కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులోనూ ఈమె పేరు వినిపించింది కానీ ప్రస్తుతానికి అంతా సైలెంట్. ఇకపోతే నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈమెకు ఇదివరకే ఓ కొడుకు ఉండగా.. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)తాజాగా ఉగాది సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో బేబీ బంప్ కనిపించేలా ఉన్న వీడియోస్, ఫొటోలని సంజన.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొడుకుతో కలిసి ఈ ఫొటోషూట్ లో పాల్గొంది. దీంతో ఈమెకు నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
ఆదిత్య 369 (Aditya 369 Movie).. 1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది.విజయశాంతిని అనుకున్నాం..ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఆదిత్య 369 సినిమా మొదటగా విజయశాంతిని అనుకున్నాం. తను కూడా సరేనంది. కానీ అప్పటికే ఆమె సినిమాలతో బిజీగా ఉంది. మీరు వేరే హీరోయిన్ను తీసుకోండి, నాకు విజయశాంతి కావాలని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. సరేలే అనుకుని రాధను సెలక్ట్ చేయాలనుకున్నాం. కానీ, ఆమె కాస్త బొద్దుగా మారటంతో మళ్లీ వేరే కథానాయికను వెతికే పనిలో పడ్డాం.నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైసినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. తమిళంలో 'ఈరమాన రోజావే' సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని సూచించాడు. అలా ఆమెను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేస్తే అందరికీ నచ్చింది. అలా మోహిని ఈ సినిమా చేసింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిందనుకుంటాను. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు ముగింపు పలికింది అని తెలిపాడు. ఇకపోతే ఆదిత్య 369 వచ్చిన 34 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కథ రెడీ అయిందని, త్వరలోనే పార్ట్ 2 ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.చదవండి: నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా