Tollywood
-
బాపు ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది – నాగ్ అశ్విన్
‘‘బాపు’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంపై క్యూరియాసిటీ కలిగించింది. సినిమా టాక్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్ఫుల్ చేస్తారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. బ్రహ్మాజీ లీడ్ రోల్లో దయా దర్శకత్వం వహించిన చిత్రం ‘బాపు’. ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, చందు మొండేటి, బుచ్చిబాబు సాన, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీ ట్రైలర్లో రా ఎమోషన్ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద చిత్రమే’’ అని చందు మొండేటి చె΄్పారు. ‘‘ఈ సినిమాని దయాగారు చాలా బాగా తీశారు’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని బ్రహ్మాజీ తెలిపారు. ‘‘కిస్మత్’ తర్వాత ‘బాపు’ నా రెండో సినిమా’’ అన్నారు భానుప్రసాద్ రెడ్డి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని పేర్కొన్నారు దయా. -
మాల్దీవుస్లో సాక్షి అగర్వాల్ చిల్.. దుబాయ్లో కాజల్ బ్యూటీ!
ఊప్స్ అబ్ క్యా అంటోన్న శ్వేతా బసు ప్రసాద్..గొడ్డలి చేతపట్టిన సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్..మాల్దీవుస్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్..మహాకుంభ్ మేళాలో పవిత్రం స్నానం చేసిన నిమ్రత్ కౌర్..పార్టీలో ఫుల్గా చిల్ అవుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత..దుబాయ్ టూర్లో కాజల్ అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Pragya Kapoor (@pragyakapoor_) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
'మిస్ యూ మై సన్'.. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. (ఇది చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం)అయితే.. గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. View this post on Instagram A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh) -
గబ్బిలాల శబ్దం వెనుక ఉన్న మర్మమేంటి?.. భయపెట్టిస్తోన్న తెలుగు ట్రైలర్
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ,లక్ష్మీ మీనన్(Lakshmi Menon )జంటగా నటిస్తోన్న చిత్రం శబ్దం (Shabdham). ఈ మూవీకి అరివళగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 7జీ ఫిల్స్మ్స్ బ్యానర్పై శివ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ సైకలాజికల్ ఇన్స్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గబ్బిలాల శబ్ధంతో బాధపడతున్న ఓ మహిళ చుట్టే ఈ కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో దృశ్యాలు చూస్తుంటే మరోవైపు హారర్ థ్రిల్లర్ను తలపిస్తోంది. గబ్బిలాలు, దెయ్యం లాంటి సన్నివేశాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ బాస్కర్, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.The thrill has a new face! 🎬🔥#Sabdham trailer is out now!🎧Link: https://t.co/FsVROFuRUnGet ready for a #SoundThriller ❤️🔥From the makers of #Vaishali #SabdhamTrailer #SabdhamFromFeb28Starring @AadhiOfficialAn @dirarivazhagan FilmA @MusicThaman Musical pic.twitter.com/FTt0HZ814g— Aadhi🎭 (@AadhiOfficial) February 19, 2025 -
మహా కుంభమేళాలో తమన్నా ‘ఓదెల 2’ టీజర్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ టీజర్ని ఈ నెల 22న కాశీ మహా కుంభమేళాలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ 'ఓదెల 2' కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉంది.ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించగా, అజనీష్ లోక్నాథ్ స్వరాలు సమకూర్చాడు. -
ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: రీతూ వర్మ
‘మజాకా’(Mazaka)లో యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రలో నటించాడు.బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా పాత్రను కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రను చేయలేదు. ఆడియన్స్కి కచ్చితంగా నచ్చుతుంది’అని అన్నారు రీతూ వర్మ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రీతూ వర్మ(Ritu Varma) మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ప్రసన్న ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్ గా ఉంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్ కి కథ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. నరేషన్ చాలా నచ్చింది.→ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ ఉంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. రావు రమేష్ గారు డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేశారు. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. 'చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా..16 నా ఏళ్ల కెరీర్ లో అలాంటి సీన్ చూడాలేదు'అని ఆయన చెప్పడం నాకు చాలా మెమరబుల్.→ ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్ లో అందరూ ఎనర్జిటిక్ గా వుండేవారు. అదే ఎనర్జీ ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుంది. బాటిల్ రీల్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది→ త్రినాథ్ రావు గత సినిమాల మాదిరే మజాక కూడా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతోంది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. టీజర్ అందరికీ నచ్చింది.→ సందీప్ గారు చాలా పాజిటివ్ పర్శన్. లవ్లీ కోస్టార్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్షు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ సినిమా కోసం తెలుగు క్లాసులు కూడా తీసుకుంది.→ డైరెక్టర్ త్రినాధ్ రావు చాలా జోవియల్ పర్శన్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. అందరినీ అదే ఎనర్జీతో ఉంచుతారు. టీం అంతా చాలా పాజిటివ్ గా ఉంటారు.త్రినాధ్ రావు, ప్రసన్న వెరీ గుడ్ కాంబో. ప్రసన్న గారు ప్రతి రోజు సెట్ కి వచ్చేవారు. కామిక్ టైనింగ్ లో ఆయన చాలా పర్టిక్యులర్.→ నా సీనీ జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నటిగా చాలా మంచి సినిమాలు పాత్రలు చేశాను. అందులో గుర్తు పెట్టుకునే కొన్ని పాత్రలు వుండటం ఆనందాన్ని ఇస్తుంది. నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది. అలాగే కామెడీ కూడా చేయడం నాకు చాలా ఇష్టం. ఫుల్ లెంత్ పీరియడ్ సినిమా చేయాలని ఉంది.→ ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీ స్టారర్ సైన్ చేశాను. అలాగే ఓ వెబ్ సిరిస్ చేశాను. అది హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ రచన, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది.తాజాగా ఈ చిత్రం సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. కామెడీ, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి. షెర్లాక్ హోమ్స్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే.. ఈ సినిమాలో డిటెక్టివ్ తల్లి పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, హీరో పేరు ఓం ప్రకాశ్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ అన్నీ కలిపి షెర్లాక్ హోమ్స్ అని పెట్టారు.(చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)కథేంటంటే?రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు (1991 మే 21న) శ్రీకాకుళం బీచ్లో మేరీ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న సీఐ భాస్కర్ (అనీష్ కురివెళ్ల) వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికే రాజీనామా చేస్తానని శపథం చేస్తాడు. కానీ రాజీవ్ గాంధీ హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. కేసు పరిష్కరించకపోతే పరువు పోతుందని దాన్ని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనక మేరీ స్నేహితులు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. వీరిలో మేరీని చంపిందెవరు? దానిక గల కారణమేంటి? షెర్లాక్ హంతకుడిని తనకిచ్చిన గడువులో పట్టుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి -
ఓటీటీలోకి ‘విశ్వదర్శనం’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!
కళా తపస్వి కె.విశ్వనాథ్(K Viswanath).. తెలుగు సీనీ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని పేరు ఇది. శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సిరివెన్నెల, స్వాతి ముత్యం, శుభసంకల్పం.. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం ఆయన. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలు ఎప్పుడూ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఇలాంటి గొప్ప దర్శకుడి జీవిత చరిత్రను వెబ్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. జనార్దన మహర్షి దర్శకత్వం వహించిన ఈ డాక్యూమెంటరీకి ‘విశ్వదర్శనం’( Viswadharshanam )అనే టైటిల్ని ఖరారు చేశారు.తాజాగా ‘విశ్వదర్శనం’ ప్రోమోని విడుదల చేశారు. అందులో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కె.విశ్వనాథ్తో తమకున్న అనుబంధాన్ని వివరించనున్నారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా ఇది రిలీజ్ కానున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది. ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుడి కథ.. అంటూ దీన్ని ప్రకటించింది.కాగా,తెలుగు ప్రేక్షకులకు గొప్ప సందేశాత్మక చిత్రాలను అందించిన విశ్వనాథ్(92).. అనారోగ్యంతో గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. Dhisti Teeyandra..😍😍Chinnodu ,Chinna Vadhina Merisipothunaru Iddharu ..😍#akhilakkineni & #zainabravdjee 👩❤️👨 pic.twitter.com/c9ovnyfnyc— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 18, 2025 Anna style vere level #Akhil6 #akhilakkineni pic.twitter.com/cfy3ZBOMUQ— SAITEJA VARMA (@Missile_Saiteja) February 18, 2025 -
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. రివీల్ చేసిన భర్త!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ వాయు అనే కుమారుడు కూడా జన్మించాడు. గతంలో తన కుమారుడిని ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం వత్సల్ సేత్ ఈ వార్తలను ధృవీకరించారు. ఇషితా రెండోసారి గర్భం ధరించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇషిత నాకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు.. ఒక తండ్రిగా నేను సంతోషించానని తెలిపారు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం 2'లో కనిపించింది ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
రజనీకాంత్తో ‘జిగేల్ రాణి’ స్టెప్పులు.. పూజాకి ‘సూపర్’ ఛాన్స్
పూజా హెగ్డే(Pooja Hegde ).. మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. కానీ ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. కొత్తగా వచ్చిన హీరోయిన్లు దూసుకెళ్లడంతో కాస్త వెనుకబడింది. దీంతో టాలీవుడ్ని వదిలేసి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఈ పొడుగు కాళ్ల సుందరికీ నిరాశే ఎదురైంది. దీంతో పూజాకి అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ పెద్దగా అవకాశాలు లభించట్లేదు. కోలీవుడ్లో మాత్రం రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగణ్’తో పాటు కాంచన 4లోనూ పూజా హీరోయిన్గా నటిస్తోంది. ఆ రెండు చిత్రాలు తప్ప పూజా చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఇలాంటి తరుణంలో పూజాగా ఓ ‘సూపర్’ చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి ఓ స్పెషల్ సాంగ్కి స్టెప్పులేయబోతుందట.‘కావాలయ్యా’తరహాలో ..రజనీకాంత్(Rajinikanth ) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’(Coolie Movie) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. ఆ పాటకి పూజా హెగ్డేతో స్టెప్పులేయించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం పూజాని సంప్రదించారట. పాట నచ్చడంతో పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. రజనీకాంత్తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నాడని సమాచారం.పూజాకి కొత్తేమి కాదుస్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయింది. ఇక కూలీ విషయానికొస్తే.. లోకేశ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో రజనీ సరికొత్తగా కనిపించబోతున్నాడట. ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ నెలలో ఈప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
సుడల్ తెలుగు ట్రైలర్ విడుదల చేసిన నాగచైతన్య
తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్లోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను టాలీవుడ్ హీరో నాగచైతన్య విడుదల చేశారు. 2022లో విడుదలై తమిళ వెబ్ సిరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ సీక్వెల్గా పార్ట్2 తెరకెక్కింది. బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. విక్రమ్ వేదా చిత్రం ఫేమ్ గాయత్రి పుష్కర్ల ద్వయం నిర్మించింది. ఇందులో కదీర్, ఐశ్వర్యా రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో నటించారు. -
సినిమా కోసం కాదు.. రూమ్కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి
'మమ్మల్ని పిలుస్తోంది సినిమాలో నటించేందుకు కాదు.. వారితో కలిసి రాత్రంతా రూమ్లో ఉండేందుకు!' అంటూ ఆగ్రహం, అసహనం ఒకేసారి వ్యక్తం చేసింది నటి సనం శెట్టి (Sanam Shetty). సమానత్వం అంటే ఇదా? అని ప్రశ్నించింది. కూల్ సురేశ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి సనం శెట్టి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె.. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్పై విమర్శలు గుప్పించింది.అది సమానత్వమా?సనం శెట్టి మాట్లాడుతూ.. బ్యాడ్గర్ల్ టీజర్ బోల్డ్ ఎగ్జాంపుల్ కాదు.. అదొక చెత్త ఉదాహరణ. స్వేచ్ఛ, లింగసమానత్వం అనే అంశాలను చాలా తప్పుగా చూపించారు. అబ్బాయిలతో పోటీపడి సిగరెట్ తాగడం, మందు తాగడం సమానత్వం కాదు. సమానత్వం అంటే అన్నింట్లోనూ మాకు సమాన అవకాశాలివ్వాలి, సమాన గౌరవం దక్కాలి. హీరోను సంప్రదించే విధానం, హీరోయిన్ను సంప్రదించే విధానం ఒకేలా ఉందా? లేదు. నన్నే తీసుకోండి. సినిమాలో నటించమని పిలవడానికి బదులు వారితో కలిసి గదిలో ఉండమని పిలుస్తున్నారు. ఇది సమానత్వమా?ఎందుకు తీస్తారో అర్థం కాదుబ్యాడ్ గర్ల్ టీజర్ ఏమాత్రం బాగోలేదు. ఇది టీనేజీ అమ్మాయిలను చెడగొట్టేలా ఉంది. ఇలాంటి చెత్త మూవీస్ ఎందుకు తీస్తారో అర్థం కాదు. బాధ్యతాయుతమైన ఫిలింమేకర్స్ ఇలాంటి సినిమాలు చేయడం మరింత బాధాకరం అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. అంబులి 3డీ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమైందీ బ్యూటీ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాలతో తెలుగువారికి పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో ఎతిర్ వినైయాత్రు మూవీ చేస్తోంది. #BADGIRL Teaser is NOT a BOLD Example.. ❌It's a #BAD Example! 👎#Freedom of choice and #GenderEquality concepts are wrongly portrayed in case of #Minors here! #Legally, #Ethically and even #Medically it sends a terribly #wrong message to the already influencable adolescent… pic.twitter.com/Dv6pVdXxtG— Sanam Shetty (@ungalsanam) February 18, 2025 చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే? -
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) వివాహబంధంలో అడుగుపెట్టాడు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేశాడు. ఈ క్రమంలో తమ ఆత్మీయులకు, అభిమానులకు నూతన దంపతులు క్షమాపణ చెప్పారు. కర్ణాటకలోని మైసూరులో బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.పెళ్లి తంతు పూర్తి అయిన తర్వాత మీడియా పూర్వకంగా అందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్మీడియా ద్వారా పలు విషయాలు పంచుకున్నారు. పెళ్లికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి వేడుకలు ఘనంగా జరగడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖ ఇలా ఎంతో మంది కృషి చేశారు. వారందరికీ మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. మా పెళ్లి కోసం చాలామంది హాజరయ్యారు. దీంతో కొంతమంది మాపై అభిమానంతో ఫంక్షన్ హాలు వరకు వచ్చి కూడా లోపలికి రాలేకపోయారు. మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో తిరిగి మిమ్మల్ని కలుస్తాము. పెద్ద మనుసుతో మమ్మల్ని ఆశీర్వదించండి.' అని ఆయన తెలిపారు.కన్నడలో హీరో కమ్ విలన్గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.ధనంజయ్ సతీమణి ధన్యత విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు. ధనంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు. View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
నాన్నా.. చరణ్ సినిమాకు అలా అడగాల్సిన పనిలేదు: బుచ్చిబాబు
ఉప్పెన(2021) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana). తొలి సినిమాతోనే రూ.100 కోట్లుకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించాడు. అయితే ఈ సినిమా రిలీజై నాలుగేళ్లు అవుతున్నా.. బుచ్చిబాబు నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Ram Charan)తో సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా(RC16). ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా బుచ్చి బాబు సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ హీరోకి ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందించాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్టే అందిస్తానని చెబుతున్నాడు బుచ్చిబాబు. తాజాగా ఓ ఈవెంట్ రామ్ చరణ్ సినిమాపై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘బాపు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైన బుచ్చిబాబు మాట్లాడుతూ..‘మా నాన్న రైతు. చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. వ్యవసాయం గురించి మా నాన్న నాతో ఓ మాట చెప్పాడు. ‘పేకాట ఆడితే డబ్బులు మనకో లేదా పక్కోడికో వస్తాయిరా..కానీ వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో తెలియదు..అంతా పోతాయి’ అని అనేవాడు. నిజంగానే ఏడాదంతా కష్టపడితే ఏకరం మీద రైతుకు మిగిలేది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది’ అని బుచ్చిబాబు అన్నారు. అలాగే తన నాన్న గురించి మాట్లాడుతూ..‘ఉప్పెన రిలీజ్ సమయంలో మా నాన్న థియేటర్ బయటే నిలబడి ‘సినిమా బాగుందా’ అని వచ్చిన వారందరినీ అడిగేవాడట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయన మా నుంచి బౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. ప్రస్తుతం నేను చరణ్తో తీస్తున్న సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన పని లేదు నాన్నా.. అది కచ్చతంగా హిట్ అవుతుంది’ అని బుచ్చిబాబు ఎమోషనల్గా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
ఇంకో 23 ఏళ్లయినా కష్టపడతా..సక్సెస్ తర్వాతే బయటకు వెళ్తా: అదిరే అభి
అదిరే అభి, స్వాతి మందల్ జంటగా గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది డెవిల్స్ చైర్’(the devil's chair). కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్రసుబ్బా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా పాయింట్ చెప్పినప్పుడు ఎగ్జైటింగ్గా అనిపించింది. అభి అద్భుతంగా నటిస్తాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అదిరే అభి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అవుతోంది. ఈ 23 ఏళ్లు ఉన్నందుకు సంతోషపడాలా? ఇంకా స్ట్రగుల్స్ పడుతున్నాని బాధపడాలా? అన్నది అర్థం కావడం లేదు. నేను ఈ 23 ఏళ్లు కష్టపడుతూనే ఉన్నాను. ఇంకో 23 ఏళ్లు అయినా కష్టపడతాను.. సక్సెస్ అయిన తరువాత బయటకు వెళ్తాను. ఒకరో ఇద్దరికో అయినా ఇన్ స్పైరింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాల మీదున్న ప్యాషన్తోనే అన్నీ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతీ శుక్రవారం ఓ ఆర్టిస్ట్ తలరాత మారిపోతుంది. ఈ శుక్రవారం మేం రాబోతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్తో పాటు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుంది. నవీన్ గారు నిర్మాతగా మరో సినిమాను చేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తున్న ప్రతీ ఒక్క నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ.. ‘‘ది డెవిల్స్ చైర్’ ఫిబ్రవరి 21న రాబోతోంది. చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది. ఈ చిత్రం కోసం అభి చాలా కష్టపడ్డాడు. అతని సపోర్ట్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నిర్మాతల సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. నాకు ఈ ప్రాజెక్ట్ చేసిన గడ్డం నవీన్ అన్నకి థాంక్స్’ అని అన్నారు. -
యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్!.. ఇదెప్పుడు జరిగింది?
యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam), దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రేమలో పడ్డారు. రష్మీ అయితే ఓ అడుగు ముందుకేసి తనతో కలిసి డ్యుయెట్ కూడా పాడేసింది. కాకపోతే అది కలలో! ఇదంతా రీల్ లైఫ్లో జరిగింది. వీరిద్దరి ప్రేమకహానీకి సంబంధించిన సన్నివేశం క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మీ గౌతమ్ యాంకర్ అవడానికి ముందు సీరియల్స్ చేసింది. యువ సీరియల్ (Yuva Serial)లో ప్రధాన పాత్రలో నటించింది. ఇదే ధారావాహికలో రాజమౌళి కూడా అతిథి పాత్ర చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన క్లిప్ను నెట్టింట వదిలారు.రాజమౌళితో డ్యుయెట్అందులో ఏముందంటే.. రష్మీ తన స్నేహితురాలితో కలిసి ఓ కెఫెలో కూర్చుంది. ఇంతలో రాజమౌళి అక్కడకు వస్తాడు. అది చూసిన రష్మీ ఫ్రెండ్.. ఇన్నిరోజులు నీకు ఫోన్ చేస్తోంది రాజమౌళియా? అని అడుగుతుంది. అటు రష్మీ మాత్రం తనతో ఇన్నాళ్లూ కబుర్లాడింది రాజమౌళి అని తెలిసేసరికి గాల్లో తేలుతుంది. జింతాత జితా జితా పాటకు తనతో కలిసి స్టెప్పులేస్తున్నట్లు కలగంటుంది. వెంటనే తేరుకుని తన ఫ్రెండ్ను అక్కడినుంచి పంపించేస్తుంది.(చదవండి: సింపుల్గా ఈ టిప్స్ పాటించి బరువు తగ్గాను: హన్సిక)అంకుల్ అయ్యుంటే..ఇంతలో జక్కన్న.. రష్మీ దగ్గరకు వస్తాడు. ఆమె సంతోషంతో.. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. ఇన్నిరోజులు నాతో మాట్లాడుతుంది మీరా? అని అడుగుతుంది. అందుకు జక్కన్న రోజులు కాదు గంటలు.. అరగంటకోసారైనా మాట్లాడాలిగా అని డైలాగ్ వదులుతాడు. నేను అంకుల్ అయ్యుంటే ఏం చేసేవాడివని ప్రశ్నించగా పర్లేదు, నేను ఆంటీనయ్యేదాన్ని అని రష్మీ రిప్లై ఇచ్చింది. త్వరగా వెళ్లిపోవాలని రాజమౌళి అంటే అప్పుడే వెళ్లాలా అని అతడి చేయి నిమురుతుంది. రాజమౌళికి ప్రపోజ్ చేసిన రష్మీఏంటో చెప్పమని ఆరా తీస్తే రష్మి కనురెప్పలు టపాటపా కొడుతుంది. అది అర్థం చేసుకోలేని రాజమౌళి కళ్లు మండుతున్నాయా? అని అడుగుతాడు. దీంతో హీరోయిన్ కోపంతో ఊగిపోతూ షటప్.. దానర్థం ఐ లవ్యూ... నీక్కూడా తెలీదా? అని అరిచేస్తుంది. ఇది చూసిన జనాలు ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కళాకారుడే.. రష్మిది చిన్న వయసు కాదన్నమాట.. ఇదెక్కడి కాంబినేషన్రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కింగ్ నాగార్జున.. 2007లో యువ సీరియల్ నిర్మించారు. ఇందులో రష్మీ ప్రధాన పాత్రలో నటించింది. Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్ -
ఓటీటీలో 'కీర్తీ సురేష్' బాలీవుడ్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- కీర్తీ సురేష్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు.బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది. -
'విశ్వంభర'లో ఇద్దరు మెగా వారసుల ఎంట్రీ
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది.ప్రోడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ శంకర్పల్లిలో వేసిన ఓ భారీ సెట్లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు.ఇదిలావుంటే ఈ మూవీలో మెగా వారసులు నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. ముఖ్యంగా మెగా హీరోలు ఆయనతో పాటు కనిపిస్తే ఫ్యాన్స్కు పండగే అని చెప్పవచ్చు. వారిని సంతోష పరిచేందుకు ఈ సినిమాలో నటుడు సాయధరమ్ తేజ్తో పాటు నాగబాబు కూతురు నిహారికా కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, చిరు కాంబినేషన్లో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని టాక్ ఉంది.టీజర్ విడుదలయిన తర్వాత సినిమాపై కాస్త నెగెటివిటీ వచ్చింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేదంటూ విమర్శలు వచ్చాయి. దీంతో వాటి వర్క్ మళ్లీ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఎంతో ప్రతిభ ఉన్న కెమెరామెన్ చోటా కే నాయుడు విషయంలోనూ చిత్ర యూనిట్ కాస్త అసంతృప్తిగా ఉందని ఒక వార్త వైరల్ అయింది. చిరంజీవి నటించిన చాలా హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. వారిద్దరి కాంబో అంటే ఫ్యాన్స్కు పండగే.. తెరపై చిరును అద్భుతంగా చూపిస్తారని చోటా కే నాయుడుకు పేరుంది. బింబిసారకు కూడా చోటానే పనిచేయడంతో వశిష్టతో మంచి బాండింగే ఉంది. కానీ, విశ్వంభర విషయంలో కాస్త తేడా కొట్టినట్లు తెలుస్తోంది. అందుకే హాలీవుడ్ నుంచి మరో కెమెరామెన్ను లైన్లోకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. -
పీవీఆర్ మల్టీప్లెక్స్ యాడ్స్పై ఫిర్యాదు.. కోర్టు జరిమానా
సినిమా ప్రారంభానికి ముందు ప్రదర్శించే వాణిజ్య ప్రకటనల పట్ల చాలామంది ప్రేక్షకులు విసిగిపోతున్నారు. పలు నగరాల్లోని లగ్జరీ మల్టీప్లెక్స్ల్లో సినిమా చూసేందుకు రూ. 300 పైగా డబ్బు చెల్లించి థియేటర్కు వెళ్తుంటారు. అయితే, ముందుగా ప్రకటించిన సమయానికి సినిమా ప్రదర్శన ఉండదు. దీంతో వారి సమయం వృధా కావడమే కాకుండా.. ఒక్కోసారి ముందుగా వారు నిర్ణయించుకున్న పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురౌతుంది. ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొన్న బెంగళూరుకు చెందిన ఒకరు పీవీఆర్-ఐనాక్స్పై కేసు వేశాడు.తన సంతోషం కోసం టికెట్ కొని సినిమాకు వెళ్తే.. పీవీఆర్-ఐనాక్స్ వారు 25 నిమిషాల పాటు యాడ్స్ వేసి తన సమయాన్ని వృథా చేశారని బెంగళూరు కన్జ్యూమర్ కోర్టులో అభిషేక్ ఎంఆర్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు పీవీఆర్ సినిమాస్ వారికి షాకింగ్ తీర్పును వెల్లడించింది. 2023లో బెంగళూరుకు చెందిన పీవీఆర్-ఐనాక్స్లో 'సామ్ బహదూర్' సినిమా చూసేందుకు వెళ్లినట్లు ఫిర్యాదులో అభిషేక్ పేర్కొన్నారు. సినిమాకి ప్రారంభానికి ముందే దాదాపు 25 నిమిషాల పాటు యాడ్స్ ప్లే చేశారని ఆయన అన్నారు. దీంతో సినిమా ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు. ఆ కారణం వల్ల సినిమా కూడా ఆలస్యంగానే పూర్తి అయ్యిందన్నారు. ఫలితంగా తాను అనుకున్న సమయానికి ఆఫీస్కు వెళ్లలేకపోయినట్లు కోర్టుకు ఆయన చెప్పుకొచ్చారు.డిసెంబర్ 26, 2023న సాయంత్రం 4:05 గంటలకు షో కోసం మూడు టిక్కెట్లను రూ.825.66 చెల్లించి అభిషేక్ బుక్ చేసుకున్నాడు. సినిమా సాయంత్రం 6:30 గంటలకు ముగిసేలా షెడ్యూల్ చేయబడింది. తద్వారా అతను సమయానికి ఆఫీస్కు వెళ్లొచ్చని అనుకున్నారు. అయితే, సాయంత్రం 4 గంటలకు హాలులోకి అడుగుపెట్టినా.. 4:05 నుంచి 4:28 గంటల వరకు ప్రకటనలు మాత్రమే ప్రదర్శించారు. గతంలో కూడా తాను ఈ ఇబ్బంది ఎదుర్కొవడంతో ముందు జాగ్రత్తగా ఆ ప్రకటనలన్నీ తన ఫోన్లో చిత్రీకరించి వాటిని కోర్టుకు సమర్పించారు. షో టైమింగ్స్ను తప్పుగా చెప్పి, అక్రమంగా యాడ్స్ ప్లే చేసి లబ్ధిపొందేందుకు థియేటర్ యాజమాన్యం చూస్తుందని ఆరోపించారు. తన ఫిర్యాదులో బుక్మైషోను కూడా చేర్చారు.పీవీఆర్- ఐనాక్స్పై కోర్టు సీరియస్ అయింది. వారిపై రూ. 1లక్ష జరిమానా విధిస్తూ బెంగళూరు కన్జ్యూమర్ కోర్టు తీర్పు ఇచ్చింది. వినియోగదారుడి విలువైన సమయాన్ని వృథా చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ హెచ్చరించింది. ఆపై ఫిర్యాదుదారుడు అభిషేక్కు రూ. 50వేల నష్ట పరిహారం చెల్లించాలని తెలుపుతూ.. అతని మానసి క్షోభకు బదులుగా రూ. 8వేల పరిహారం ఆపై కేసు ఫైలింగ్ కోసం అతను చేసిన ఇతర ఖర్చులకు రూ. 10వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. టికెట్ మీద చూపిన సమయానికే సినిమా ప్రదర్శించాలని పీవీఆర్-ఐనాక్స్కు బెంగళూరు కన్జ్యూమర్ కోర్టు తెలిపింది. పీఎస్ఏ (పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్స్) కింద ఉన్న యాడ్స్ మాత్ర చట్ట పరిధిలోనే రన్ చేయాలని సూచించింది. -
ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్కు ఆర్థిక కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషి 2023లో విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో ఆమె నటించలేదు. అయితే, గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సమంత పలకరించింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని నెట్టింట వైరల్ అవుతుంది.నెట్ఫ్లిక్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లలో రక్త్ బ్రహ్మాండ్ ఒకటి. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ను డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్ణు పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ రీసెంట్గా సిటాడెల్ సిరీస్ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో ప్రారంభించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ను ఆర్థిక సమస్యల వల్ల తాత్కాలికంగా ఆపేశారని సమాచారం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న ఒకరు బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్కు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ చిత్రీకరణ ఇప్పటి వరకు 25 రోజులు పూర్తి చేసుకుందట. ఇంకా చాలా షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయట. కానీ, ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది. ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయటపడిందట.. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్ను ఆపేశారని టాక్ ఉంది. నెట్ఫ్లిక్స్, డీ2ఆర్ ఫిల్మ్స్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ పనులను రాజ్ అండ్ డీకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మేకింగ్ సమయంలో స్క్రీన్ ప్లేలను ఎప్పటికప్పుడు మార్చేస్తుండటంతో ఖర్చు భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తప్పుబడుతుంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలా స్క్రిప్ట్ మారుస్తూ ఉండటంతో కనిపించని స్థాయిలో దుబారా అవుతుందని నెట్ఫ్లిక్స్ పేర్కొంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. -
సింపుల్గా ఈ టిప్స్ పాటించి బరువు తగ్గాను: హన్సిక
ఉత్తరాది భామ హన్సిక(Hansika Motwani) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2003లో తన నట జీవితానికి శ్రీకారం చుట్టిన ఈ ఉత్తరాది బ్యూటీ 2007లో దేశముదురు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. తెల్లగా, బొద్దుగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ భామ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని అందరి దృష్టిలోనూ పడింది. ఆ తర్వాత 2011లో ధనుష్కు జంటగా మాప్పిళై చిత్రంతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రం సక్సెస్ అవడంతో హన్సికకు వరుసగా అవకాశాలు ఎక్కువగా తలుపుతట్టాయి. అలా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బొద్దుగా ఉండడంతో మొదట్లో కోలీవుడ్లో చిన్న కుష్బూ అనే ముద్రను కూడా వేసుకుంది. కాగా పలు భాషల్లో కథానాయకిగా నటించి 50 చిత్రాల మైలురాయి అధిగమించిన హన్సిక ఆ మధ్య పెళ్లి చేసుకుంది. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే ఇంట్లో ఖాళీగా మాత్రం కూర్చోవడం లేదు. వాణిజ్య ప్రకటనల్లో నటించడం, టీవీ షోలకు అతిథిగా పాల్గొనడం అంటూ బిజీగానే ఉంటూ, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటోంది. ఇంతకుముందు బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడు చాలా స్లిమ్గా తయారైంది. తాను అలా తయారు కావడానికి ఉపయోగించిన టిప్స్ను కూడా చెప్పుకొచ్చింది. అందులో మంచినీళ్లు ఎక్కువగా తాగడం ముఖ్యకారణం అని పేర్కొంది. అదేవిధంగా యోగా, ధ్యానం, వంటి శారీరక కసరత్తులు చేస్తానని కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వనని ఈ టిప్స్ బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఈ బొద్దుగుమ్మ చిక్కినా సక్కగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
లవ్... ఎమోషన్
‘‘దిల్ రూబా’ టీజర్, ట్రైలర్లో ఏ కంటెంట్ చూపించామో సినిమాలోనూ అదే ఉంటుంది. ఎక్కడా అనవసరపు కంటెంట్ ఉండదు. ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) చెప్పారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది.సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘హే జింగిలి..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ని రిలీజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటని సామ్ సీఎస్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘సారెగమ వాళ్లు ఫస్ట్ టైమ్ ఈ మూవీతో టాలీవుడ్లోకి వస్తున్నారు. రవిగారు, విశ్వ కరుణ్ మూడేళ్లుగా ఈప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. వాళ్ల కోసమైనా ‘దిల్ రూబా’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘మా ‘దిల్ రూబా’ పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియాప్రొడక్షన్ సారెగమతో కలిసి సినిమా చేశాం’’ అని రవి చెప్పారు. ‘‘హే జింగిలి... పాటకి మంచి పేరొస్తుంది’’ అన్నారు విశ్వ కరుణ్. ‘‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్తో అద్భుతంగా ఉంటుంది’’ అని రుక్సార్ థిల్లాన్ పేర్కొన్నారు. లిరిక్ రైటర్ భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడారు. -
అల్లు అర్జున్కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ..?
తెలుగు చిత్ర పరిశ్రమలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్గా చేస్తున్నారామె. ఈ యంగ్ బ్యూటీకి మరో సూపర్ చాన్స్ దక్కిందట. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా అట్లీ(Atlee) దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుందట. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి... ఈ వార్త నిజమై అల్లు అర్జున్ సరసన జాన్వీ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం వెకేషన్లో భాగంగా అల్లు అర్జున్ స్పెయిన్లో ఉన్నారు. తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమాకు చెందిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది. -
సుకుమార్ ప్రాజెక్ట్లో సరికొత్తగా కనిపించనున్న రామ్చరణ్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించారు హీరో రామ్చరణ్(Ram Charan). ‘పుష్ప 1: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో డైరెక్టర్ సుకుమార్(Sukumar) కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రెండో సినిమా తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్ కెరీర్లో ఇది 17వ చిత్రంగా రూపొందనుంది.ఈ మూవీలో రామ్చరణ్ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నారని టాక్. రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2022) బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వారి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రామ్చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్చరణ్, సుకుమార్ మూవీ పట్టాలెక్కుతుందని టాక్. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా పక్కా పల్లెటూరు, ఫుల్ మాస్ పాత్రలో రామ్చరణ్ని చూపించారు సుకుమార్. తాజా చిత్రంలో అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో చరణ్ని చూపించనున్నారట.ఈ చిత్రంలో అల్ట్రా స్టైలిష్ అర్బన్ లుక్లో కనిపిస్తారట. ‘రంగస్థలం’లో చరణ్ని, ‘పుష్ప’ చిత్రాల్లో అల్లు అర్జున్ని పక్కా మాస్గా చూపించిన సుకుమార్... ఈసారి మాత్రం చరణ్ కోసం పూర్తి అర్బన్ బ్యాక్డ్రాప్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నాని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
సందీప్ కిషన్ 'మజాకా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాకు సంబంధించి క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'హేయ్ పగిలి పగిలి అంటూ సాగే' లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. కాగా.. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు. -
మాల్దీవుస్లో సాక్షి అగర్వాల్ చిల్.. సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ లేటేస్ట్ లుక్!
మజాకా ప్రమోషన్స్తో బిజీ బిజీగా మన్మధుడు హీరోయిన్ అన్షు..సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ లుక్స్..లైప్ ఈజ్ బూమరాంగ్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ బ్యూటీలా మెరిసిపోతున్న శ్రీలీల..మాల్దీవుస్లో చిల్ అవుతోన్న సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు.. అంతలోనే కనుమరుగైన స్టార్స్ వీళ్లే!
సినిమా అంటే రంగుల ప్రపంచం. ఈ రంగంలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు.. అవకాశాలు కూడా అలా వెతక్కుంటూ వస్తాయి. అయితే అదే క్రేజ్ కెరీర్ మొత్తం ఉంటుందనుకోవడం పొరపాటే. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే ఈ పరిస్థితి కాస్తా భిన్నంగా ఉంటుంది. ఒకసారి గుర్తింపు వచ్చినా.. దాన్ని కెరీర్ మొత్తం నిలబెట్టుకోవడం కష్టమే. అలా మొదట స్టార్ హీరోయిన్లుగా ఫేమ్ తెచ్చుకున్న కొందరు స్టార్స్ తర్వాత తెరపై పెద్దగా కనిపించలేదు. అలాంటి వారి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ స్టార్ డమ్ నుంచి కనుమరుగైన నటీమణులెవరో మీరు చూసేయండి.అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి..తెలుగులో రవితేజ సరసన అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో మెప్పించిన కోలీవుడ్ భామ ఆసిన్. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె తన కెరీర్ తమిళంలో పోక్కిరి, కావలన్, తెలుగులో లక్ష్మీ నరసింహ, రెడీ, ఘర్షణ, హిందీలో గజిని, హౌస్ఫుల్ 2 వంటి భారీ విజయాలు దక్కించుకుంది. అంతేకాకుండా ఆసిన్, ఫిల్మ్ఫేర్, సైమా లాంటి అనేక అవార్డులను గెలుచుకుంది. తన కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన 2015 నుంచి చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా కనుమరుగైంది.అజిత్ భార్య శాలిని..తొలి రోజుల్లో బేబీ శాలినిగా గుర్తింపు పొందిన శాలిని అజిత్ కుమార్. 1980లలో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. ఎంటే మమట్టిక్కుట్టియమ్మక్కు, టీవీ సిరీస్ అమ్లూ వంటి చిత్రాలలో బాలనటిగా మెప్పించింది. అంతేకాకుండా పలు క్లాసిక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ 2000 ఏడాదిలో నటుడు అజిత్ కుమార్ను వివాహం చేసుకున్న తర్వాత వెండితెరపై కనిపించలేదు. 2002 తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది.నగ్మాతెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటి నగ్మా. 1990లో తమిళం, తెలుగు, హిందీ, భోజ్పురి సినిమాల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఘరనా మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి అల్లుడు లాంటి హిట్ సినిమాల్లో కనిపించింది. తమిళంలో కాదలన్, బాషా, మెట్టుకుడి, తమిళంలో చతురంగం, చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కానీ 2008లో తన సినీ కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలోనే నగ్మా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.గోపికమలయాళంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి గోపిక. ముఖ్యంగా ఫోర్ ది పీపుల్ అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా గోపిక తనదైన ముద్ర వేసింది. రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీలో అభిమానులను మెప్పించింది. అయితే 2008లో వివాహం తర్వాత గోపిక సినీ పరిశ్రమను పూర్తిగా విడిచిపెట్టేసింది.తెలుగులో స్టార్ హీరోయిన్..రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి యీది కాగా.. సినిమాలతో వచ్చిన గుర్తింపు వల్ల రంభగా మార్చుకుంది. 1990ల్లో దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్గా ఎదిగింది. అరుణాచలం, ఉల్లతై అల్లిత, క్రానిక్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలలో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో భైరవ ద్వీపం, బంగారు కుటుంబం, హిట్లర్, గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో విజయవంతంగా దూసుకెళ్తోన్న రంభ 2011లో నటనకు ఎండ్ కార్డ్ ఇచ్చేసింది. -
‘తకిట తధిమి తందాన’ హిట్ కావాలి: కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ చేతుల మీదుగా "ఫస్ట్ లుక్ పోస్టర్" ఆవిష్కారం జరుపుకున్న వినూత్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "తకిట తధిమి తందాన" చిత్రం తాజాగా భాజపా అగ్రనేత - కేంద్రమంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టీజర్ విడుదల జరుపుకుంది. యూత్ తోపాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకునేలా టీజర్ ఉందని ప్రశంసించిన బండి సంజయ్... "తకిట తధిమి తందాన" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు."మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - కొత్తమ్మాయి ప్రియ జంటగా.. యువ ప్రతిభాశాలి రాజ్ లోహిత్ దర్శకత్వంలో ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై.. చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన "తకిట తదిమి తందాన" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సినెటేరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో విడుదల కానుంది. -
‘అఖండ 2’ నుంచే కారు గిఫ్ట్.. బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇటీవల సంగీత దర్శకుడు తమన్కి హీరో బాలకృష్ణ(Balakrishna ) ఓ కారు గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ధర దాదాపు కోటీన్నర వరకు ఉంటుంది. బాలయ్య నుంచి అంతపెద్ద బహుమతి రావడం తమన్తో పాటు టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా బహుమతిగానే ఇచ్చాడా? లేదంటే దీని వెనుక ఏదైనా మతలబు ఉందా? అని నెటిజన్స్ చర్చిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమన్ ఫ్రీగా ఫండ్ రైజింగ్ ప్రొగ్రాం చేశాడు. దానికి ప్రతిఫలంగా బాలయ్య ఈ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు కూడా నెట్టింట వినిపించాయి. (చదవండి: సినీతారలకు ముద్దులూ, రొమాన్స్ నేర్పేది వీరే...)అయితే ఇక్కడ వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు. గిఫ్ట్గా ఇచ్చానని బాలయ్య చెప్పడం..అభిమానంతో ఇచ్చాడని తమన్ మురిసిపోవడం మాత్రమే అందరికి తెలుసు. అయితే టాలీవుడ్లో ఇలా ఒకరు మరొకరి గిఫ్ట్ ఇచ్చారంటే.. ఏదో ఆశించి ఇచ్చినట్టేననే టాక్ అయితే ఉంది. అది సినమాల పరంగానా లేదా పర్సనల్గానా అనేది తెలియదు కానీ బహుమతి వెనుక బహుళ ప్రయోజనాలే ఉంటాయి.ఇటీవల బాలయ్య నటించిన చిత్రాలన్నింటికి తమనే సంగీతం అందిస్తున్నాడు. ‘డిక్టేటర్’, ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ ‘డాకు మహారాజ్’ ఇవన్నీ మ్యూజిక్ పరంగా మంచి విజయం సాధించాయి. అందుకే తమన్ బాలయ్యకు క్లోజ్ అయ్యాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’(Akhanda 2 Movie) కి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. అయితే బాలయ్య కెరీర్కి బిగ్గెస్ట్ విజయాలు అందించిన బోయపాటిని కాదని తమన్కు బహుమతి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గిఫ్ట్కి అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట డబ్బులు ఇచ్చారట. తన రెమ్యునరేషన్లో డబ్బులు కట్ చేసి కారు కొనివ్వమని బాలయ్య చెప్పడంతో నిర్మాతలు ఆ పని చేశారట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆఖండ 2కి బాలయ్య అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. రూ.35 కోట్ల వరకు పారితోషికంగా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా వాయిదాల ప్రకారం బాలయ్య చేతికి చేరుతుంది. డాకు మహారాజ్కి రూ.28 కోట్లు తీసుకున్న బాలయ్య..తదుపరి చిత్రానికి ఏకంగా 7 కోట్లను పెంచేశాడు. అయితే ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే మాత్రం బాలయ్య తీసుకునేది తక్కువే అని ఇండస్ట్రీ టాక్. -
మనం ఇలా విడిపోతామని ఎప్పుడూ అనుకోలేదు: తారకరత్న భార్య ఎమోషనల్
సరిగ్గా రెండేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో, నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆయన చివరికీ కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 18, 2023న నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇవాళ తారకరత్న వర్ధంతి కావడంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ప్రపంచంలో నువ్వు లేని లోటు పూడ్చలేనిదని ఎమోషలైంది. నిన్ను కోల్పోయిన క్షణం కాలం నయం చేయలేని గాయం.. నీ స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. మనం ఎప్పుడూ ఇలా విడిపోవాలని అనుకోలేదు... నువ్వు ఇక్కడ ఉండకపోవచ్చు.. కానీ నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు వదిలి వెళ్లిన కలల్లో వికసిస్తూనే ఉంటుందని రాసుకొచ్చింది. మాటలకు , కాలానికి, జీవితానికి అతీతంగా మేము నిన్ను మిస్ అవుతున్నాం అంటూ అలేఖ్యా రెడ్డి.. తన భర్త తారకరత్నను గుర్తు చేసుకుంది.(ఇది చదవండి: Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత)నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
తెలుగమ్మాయిలపై వివాదాస్పద కామెంట్స్: టాలీవుడ్ నిర్మాత వివరణ
ఇటీవల డ్రాగన్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించమని.. వారిని తీసుకుంటే ఏమవుతుందో తెలుసని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను చెప్పిన వాటిలో వివాదమేముందని ఎస్కేఎన్ రిప్లై కూడా ఇచ్చారు.(ఇది చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వకూడదు: ఎస్కేఎన్)అయితే తాజాగా ఈ వివాదంపై నిర్మాత ఎస్కేఎన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది తెలుగమ్మాయిలను పరిచయం నిర్మాతల్లో తాను కూడా ఉన్నానని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఈవెంట్లో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని తెలుగువారిని వెండితెరకు పరిచయం చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో మరో 25 మందిని ప్రతిభావంతులైన తెలుగమ్మాయిలను టాలీవుడ్కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగువారి ప్రతిభను ప్రోత్సహించడం ఎల్లప్పుడూ నా ప్రాదాన్యతగా భావిస్తానని ట్విటర్లో వీడియోను పంచుకున్నారు. అందుకే దయచేసి తనపై ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వీడియోలో ఎస్కేఎన్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇటీవల డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు అమ్మాయిల గురించి మాట్లాడా. కానీ నేను తెలుగు అమ్మాయిలతో పని చేయనని రాశారు. కానీ చాలా మంది తెలుగు నటీమణులను పరిశ్రమకు పరిచయం చేసిన కొద్దిమంది నిర్మాతలలో నేను ఒకడిని. రేష్మా, ఆనంది, మానస, ప్రియాంక జువాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత లాంటి వారని నేనే పరిచయం చేశా. ఇలా ఎనిమిది మందిని పరిచయం చేశానని' అన్నారు. Hi everyone, Namaste. I am one of the few producers who have introduced Many Telugu actresses to the industry. A lighthearted comment I made recently was misunderstood, leading to unnecessary headlines with incorrect meanings.To clarify, I have introduced 8 talented individuals… pic.twitter.com/raWN8Suvpk— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 18, 2025 -
అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్)ఇవాళ అనుపమ బర్త్ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేశారు. దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్ను షేర్ చేస్తూ అనుపమకు పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్
పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను రప్పా.. రప్పా.. రప్పా అంటూ దాటుకుంటూ వచ్చేసింది. 75 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్ల (గ్రాస్) వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ నిలవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీగా నిలిచింది. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ మూవీగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది.ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో 'దంగల్' (రూ.2024 కోట్లు) టాప్లో కొనసాగుతుంది. రెండో స్థానంలో 'పుష్ప2' (రూ. 1871 కోట్లు), మూడో స్థానంలో బాహుబలి-2 (రూ.1810 కోట్లు) ఉంది. తర్వాతి స్థానాల్లో ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు), కేజీయఫ్- 2 (రూ.1250 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) వరుసగా ఉన్నాయి.ముఖ్యంగా పుష్ప2 సినిమాకు బాలీవుడ్లోనే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్పగాడికి ప్రత్యేక స్థానం దక్కింది. కేవలం హిందీ బెల్ట్లోనే రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ త్రీడీ వెర్షన్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గుర్తుండిపోయే రికార్డ్లను నమోదు చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఓటీటీ కోసం రీలోడెడ్ వర్షన్ పేరుతో అదనం మరో 24 నిమిషాల సీన్లను కలిపారు. దీంతో ఈ మూవీ నిడివి మొత్తం 3 గంటల 40 నిమిషాలుగా ఉంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
మరో ఓటీటీలో వరుణ్ సందేశ్ సినిమా.. ఇప్పుడెందుకు ఈ బాదుడు..?
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 2న విడుదలైంది. అయితే, కేవలం 20 రోజుల్లోనే ఆహా తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.విరాజి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో తాజాగా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ. 99 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఒక పోస్టర్తో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా తెలుగు ఓటీటీలో ఉచితంగా చూసే సౌలభ్యం ఉండగా మళ్లీ అదనంగా రెంట్ చెల్లించి చూడటం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త సినిమా అనుకొని విరాజి రైట్స్ను అమెజాన్ ఏమైనా కొనుగోలు చేసిందా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పాత సినిమాకు రూ. 99 రెంట్ బాదుడు ఎందుకు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రాన్ని చూసేయండి. విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. -
ఓటీటీలో చిన్నారులను మెప్పించే 'సైన్స్ ఫిక్షన్' సినిమా
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. -
OTT: తమిళ్ మూవీ ‘జే బేబీ’ రివ్యూ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జే బేబీ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ సినిమా చూసేముందు ఎవరికి వారు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. అదేమంటే మనకిష్టమైన వారిపై మనకెంతకాలం ఇష్టం ఉంటుంది? అలాగే, మనకు ఇష్టం లేని వారిపై కష్టం ఎంతవరకు ఉంటుంది... ఈ రెండు ప్రశ్నలు కాస్త విచిత్రమైనవే. కానీ వాటికి మనం ఇచ్చే సమాధానాన్ని బట్టే ఉంటుంది మనతో ఉన్న వారి జీవితం. మనకు తోడుగా ఇష్టంగా ఉండేవారు ఎందరో ఉంటారు. అలాగే వారంటే మనకెంత ఇష్టమో వారికి తెలియజేయాలి. ఈ జీవితం మీ తల్లి మీకు ప్రసాదించింది. ఆ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేది మీ తండ్రి. మరి ఆ తల్లిదండ్రుల వయస్సు పైబడిన తర్వాత వారికి అండగా ఉండాల్సింది మీరే. అలాంటి అండ కోరుకున్న ఓ అమ్మ కథే జే బేబి. కథ లైను వినడానికి సింపుల్గా ఉన్నా సినిమా చూసినంతసేపు వయస్సు పైబడ్డ మన తల్లిదండ్రులకు మన అవసరం ఏపాటిదో మనకు అర్థమవుతుంది. ఇది అల్లుకున్న కథ కాదు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఈ కథ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. కథలోని పాత్రలు, కథా పాత్రల్లా కాక మన కళ్ల ముందే కదలాడుతున్న అనుభూతిని కలిగిస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా తల్లిదండ్రులున్న ప్రతి కొడుకు, కూతుళ్లు చూడవలసిన సినిమా. అంతలా ఏముంది ఈ సినిమాలో... ఓ సారి కథ చెప్పుకుందామా మరి. జే బేబి ఓ తమిళ సినిమా. దీనికి సురేష్ మారి దర్శకుడు. జే బేబికి ముగ్గురు సంతానం. శంకర్, సెంథిల్, కవిత. జే బేబి తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబాన్ని అతికష్టం మీద పైకి తీసుకువస్తుంది. కానీ జే బేబీ మానసికస్థితి కొంత దెబ్బతింటుంది. చికిత్సకోసం పిల్లలు ఆసుపత్రిలో చేర్పిస్తే అక్కడి నుంచి తప్పించుకుని తెలియకుండా చెన్నైనగరం నుండి కోల్కతా చేరుకుంటుంది. జే బేబీని వెతికే క్రమంలో శంకర్,సెంథిల్ బయలుదేరతారు. తల్లిని వెదికే క్రమంలో ఒకే ప్రయాణాన్ని ప్రారంభించిన ఇద్దరు కొడుకులు ఓ వివాదం వల్ల మాట్లాడుకోని స్థితిలో ఉంటారు. మాట్లాడుకోని వీళ్లు, మానసిక పరిపక్వత లోపించిన తమ తల్లిని తమకు భాష రాని నగరానికి వెళ్లి ఎలా వెదుకుతారు?, అసలు వాళ్లకి మళ్లీ జే బేబీ దొరుకుతుందా?. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న జే బేబి చూడాల్సిందే. సినిమాలోని ప్రధానపాత్రలో నటించిన ప్రముఖ నటి ఊర్వశి జే బేబి పాత్రను పోషించలేదు, జీవించింది. సినిమా ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ అప్పుడప్పుడూ చక్కటి హాస్యాన్ని జోడించి స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమా, రివ్యూ మమతానురాగాలకోసం వయస్సు పైబడిన పసి మనస్సులకు అక్షరాంకితం.– ఇంటూరు హరికృష్ణ -
ఆ సినిమాతో రూ. 40 వేలు కాస్త రూ. 40 లక్షలు అయింది: అభిమన్యు
‘గబ్బర్సింగ్’ సినిమాలో సిద్దప్పనాయుడిగా అభిమన్యు సింగ్ భయపెట్టాడు. భయపెడుతూ భయపెడుతూనే... నవ్వకుండానే నవ్వించాడు. అలా ఆయనకు తెలుగులో భారీగా ఛాన్సులు దక్కించుకున్నాడు. రామ్గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో బుక్కారెడ్డిగా వణుకు పుట్టించాడు. ‘రక్తచరిత్రలో’ బుక్కారెడ్డి పాత్రను భయంకరంగా పండించి ‘ఉత్తమ విలన్’ అని అభిమన్యు నిరూపించకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. తన రెమ్యునరేషన్తో పాటు పలు విషయాలను పంచుకున్నాడు.2001లోనే అభిమన్యు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2010లో ఆర్జీవీ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాతోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. రక్తచరిత్రలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపుతుంది. సినిమా చూసే వారిలో భయాన్ని నెలకొలుపుతుంది. అలా తన నటనతో దుమ్మురేపాడు. ఆపై 2017లో అతను ఏకంగా శ్రీదేవితో కలిసి మామ్ చిత్రంలో నటించాడు. హిందీ చిత్రాలలో కనిపించడమే కాకుండా, ఆయన తమిళం, తెలుగు భాషా చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం పవన్ ఓజీలో చాలా కీలక పాత్రలో అభిమన్యు ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.మొదటి రెమ్యునరేషన్'నేను నటించిన మొదటి సినిమా (అక్స్) కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 12 వేలు మాత్రమే. చాలా ఏళ్ల పాటు ఒక సినిమాకు రూ. 20 వేల లోపే ఇచ్చేవారు. కానీ, రక్తచరిత్ర సినిమాకు రూ. 40 వేలు ఇచ్చారు. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీలో నటించాను కాబట్టే పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్లో ఛాన్స్ వచ్చింది. నేను డబ్బును నమ్ముకోలేదు. అందువల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వచ్చాను. గబ్బర్ సింగ్ కోసం రూ. 40 లక్షలు ఇచ్చారు. దీంతో లైఫ్ మొత్తం మారిపోయింది. అలా 2010లో తొలిసారి ఎక్కిన కార్వాన్ 2025 వచ్చినా సరే నేను ఇంకా దిగలేదు. ఆ రెండు సినిమాలు నా జీవితంలో అంతలా ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఓజీలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పుడు కూడా మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని తెలిపాడు.చీపురుతో ఫ్లోర్లు ఊడ్చేవాడుఅభిమన్యుసింగ్ స్వస్థలం బిహార్రాజధాని పట్నా. ‘బాలీవుడ్’ కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ బొంగరంలా తిరిగాడు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. ‘థియేటర్’ రూట్ నుంచి వెళితే...ప్రయాణం కాస్త సులువవుతుంది అనుకొని మకరంద్ దేశ్పాండే థియేటర్ గ్రూప్ ‘అంశ్’లో చేరాడు. ‘‘నటన అంటే ఇదీ’’ అని చెప్పలేదు మకరంద్. ‘‘చీపురు అంటే ఇదీ’’ అన్నట్లుగా మూలకు ఉన్న చీపురును అభిమన్యుకు చూపి...ఫ్లోర్ ఊడ్చమన్నాడు. ‘నేను వచ్చింది నటన నేర్చుకోవడం కోసం. ఊడ్చడం కోసం కాదు’ అభిమన్యులో కోపం కెరటమై లేచింది. అయితే నటన మీద ప్రేమ... ఆ కోపాగ్నిపై నీళ్లు చల్లింది. అలా....చీపురుతో ఫ్లోర్ ఊడ్చాడు అభిమన్యు. ‘ఇగో మెల్టింగ్’ పూర్తయ్యాక... అభిమన్యుకు నటనలో ఓనమాలు దిద్దించాడు మకరంద్. ‘అంశ్’ థియేటర్ గ్రూప్లో కె.కె. మీనన్, అనురాగ్ కశ్యప్లు అభిమన్యుకు సీనియర్లు. ‘బాగా నటిస్తున్నాడు’ అని పేరైతే వచ్చిందిగానీ... సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదు. తన రూమ్లో ఒంటరిగా ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయి. పట్నాలో ఉన్నప్పుడు నటుడు మనోజ్ బాజ్పాయ్ నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. కట్ చేస్తే... రాకేష్ మెహ్ర ‘అక్స్’లో పోలీస్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. అలా ‘రక్తచరిత్ర’తో దక్షిణాది సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. చెడు పాత్రలను ‘ఎంత మంచిగా చేశాడు’ అనిపించుకోవడం అంత తేలికేమీకాదు... అందుకే అభిమన్యు సింగ్ ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. -
'తుంబాడ్' మేకర్స్ క్రేజీ సినిమా ట్రైలర్ చూశారా..?
భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇదే సెన్సేషనల్ హిట్గా నిలిచిన చిత్రం 'తుంబాడ్'.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు క్రేజీ (Crazxy Movie) అనే మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సోహుమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సోహుమ్ షాతో పాటు ముకేశ్ షా, అమిత్ సురేశ్, ఆదేశ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న రానుంది. తుంబాడ్ (2018) విషయానికి వస్తే.. హారర్ జానర్లో సెన్సేషన్ హిట్ అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. -
పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా భాకారాపేట సమీపంలోని ఉర్జా రిసార్ట్లో బస చేస్తున్న మనోజ్ వద్దకు పెట్రోలింగ్లో భాగంగా పోలీసులు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ను వారు పలు ప్రశ్నలు అడిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకు ఉంటున్నారని వారు ప్రశ్నించారు. ఇక్కడ సెలబ్రిటీలకు అంత సురక్షితం కాదని వారు సూచించారు. అయితే, ఇదంతా పోలీసుల డ్రామా అంటూ వారి తీరును మనోజ్ తప్పుపట్టారు. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అంటూ ఆయన ప్రశ్నించారు.అయితే, పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. 'నేను టెర్రరిస్టా.. నేను దొంగనా.. అర్థరాత్రి ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు. సీఎం పేరు ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారు. అసలు మీరు నాదగ్గరకు ఎందుకు వచ్చారు..? మమల్ని ఎందుకు బెదిరించారో, చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను.' అంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెట్లపై మంచు మనోజ్ బీష్మించుకుని కూర్చున్నారు.సుమారు రాత్రి 12 గంటల తర్వాత ఈ గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ ఇమ్రాన్ భాషా వచ్చి సర్దిచెప్పడంతో మనోజ్ ఆందోళన విరమించారు. కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. యూనివర్శిటీ వ్యవహారాల్లో కూడా మనోజ్ జోక్యం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనతో పాటు కొందరు బౌన్సర్లు కూడా ఉన్నారని సమాచారం ఉంది. మరోసారి యూనివర్శిటీ వద్ద మనోజ్ తన బౌన్సర్లతో ఏమైనా గొడవ చేస్తాడనే ఆలోచనతో మోహన్ బాబు నుంచి వచ్చిన సమాచారం వల్ల పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 🚨BREAKING NEWS 🚨#ManchuManoj in Police Custody!Case filled by #MohanBabu Concerning Family MattersStay Strong @HeroManoj1 brother We all are with you❤️pic.twitter.com/nI8AEibJDm— BS 🦅 (@biggscreen_offl) February 18, 2025 -
'లైలా' కలెక్షన్స్.. విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్
లైలా సినిమా విశ్వక్ సేన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. చిత్రపరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీగా విశ్వక్ సినిమాలకు రిటర్న్స్ వస్తాయని నిర్మాతలు నమ్ముతారు. అందుకే ఆయన ఏడాదికి సుమారు నాలుగు చిత్రాలు చేయగలుగుతున్నాడు. అయితే, నటుడు పృథ్వీరాజ్ లైలా ఈవెంట్లో చేసిన రాజకీయ కామెంట్లు లైలాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అతగాడి చవకబారు వ్యాఖ్యలపై సోషల్ మీడియా భగ్గుమంది. ఫైనల్లీ పృథ్వీరాజ్ లెంపలేసుకున్నా ఫలితం లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.లైలా కోసం లేడీ గెటప్తో విశ్వక్ సేన్ ప్రేక్షకులను మెప్పించాడు. తెరపై తన నటన గురించి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర ఉన్నా సరే ఈజీగా చేసేస్తాడు. లైలా విజయం కోసం ఆయన తీవ్రంగానే కష్టపడ్డాడు. రకరకాల ప్రమోషన్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో మార్కెట్లో పెద్ద సినిమా కూడా లేదు. ఈజీగా బాక్సాఫీస్ వద్ద లైలా సందడి ఉంటుందని అందరూ అంచనా వేశారు. కేవలం పృథ్వీరాజ్ వ్యాఖ్యలతో నిర్మాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది.ఫిబ్రవరి 14న విడుదలైన లైలా ఇప్పటి వరకు రూ. 3 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. నిర్మాతకు కూడా భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. శని, ఆదివారాల్లో అయినా బాక్సాఫీస్ వద్ద కోలుకుంటుందని మేకర్స్ భావించారు. కానీ వీకెండ్లో చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. దీంతో లైలా ప్రయాణం దాదాపు ముగిసిపోయింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా కొంత మేరకు లాస్ కవర్ చేసుకున్నా కూడా నిర్మాతకు థియేట్రికల్గా సుమారు రూ. 10 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.లైలా నిర్మాత సాహు గరపాటి సినిమాల గురించి చూస్తే.. మజిలీ, భగవంత్ కేసరి లాంటి హిట్లతో గుర్తింపు పొందారు. చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ సినిమా నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. హీరో విష్వక్ సేన్ కూడా దర్శకుడు అనుదీప్తో ఒక సినిమా లైన్లో పెట్టేశాడు. దీని తరువాత భీమ్లా నాయక్ డైరక్టర్ సాగర్కు విశ్వక్ ఓకె చెప్పారు. -
అమ్మమ్మ ఇచ్చిన చీరతో పెళ్లిపీటలు ఎక్కుదామనుకుంటే..: సాయి పల్లవి
సినిమాల్లో నటించే వారందరూ నటీనటులే. అయితే అందులో మంచి గుర్తింపు పొందే వారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారికి అవార్డులు అంగీకారమే కాకుండా, చాలా ప్రోత్సాహంగా ఉంటాయి. కాగా ఒక్కో సారి ప్రతిభావంతులైన నటీనటులకు కూడా ఉత్తమ అవార్డులు ఆలస్యంగానే వస్తుంటాయి. ఆ పట్టికలో నటి సాయిపల్లవి కూడా ఉన్నారు. ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నటించిన ప్రతిచిత్రంలోనూ తన ప్రత్యేకతను చాటు కుంటారు. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తారు. ఇటీవల ఈమె నటించిన తమిళ చిత్రం అమరన్, తెలుగు చిత్రం తండేల్ ఒక ఉదాహరణ. సినీ విజ్ఞులను సైతం తన నటనతో మెప్పిస్తున్న నటి సాయిపల్లవి. మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తుంది. ఈమె ఇటీవల ఓ భేటీలో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. దీని గురించి సాయిపల్లవి తెలుపుతూ తనకు 21 ఏళ్ల వయసులో తన బామ్మ ఓ చీరను ఇచ్చారన్నారు. దాన్ని తన పెళ్లి రోజున కట్టుకోవమని చెప్పారన్నారు. అప్పటికి తను సినిమాల్లోకి రాలేదట, కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు కట్టుకుందామనుకుని దానిని దాచిపెట్టినట్లు చెప్పింది. తనకు 23 ఏళ్ల వయసులో ప్రేమమ్ చిత్రంలో అవకాశం వచ్చినట్లు చెప్పింది. అయితే, ప్రేమమ్ విడుదల తర్వాత ఏదోక రోజు ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటానని నమ్మకం కలగినట్లు చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో అంత గొప్ప అవార్డు జాతీయ అవార్డే కాబట్టి అందుకోసం కష్టపడుతానని ఆమె చెప్పింది. అందుకే దాన్ని దక్కించుకున్న రోజు అమ్మమ్మ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సాయి పల్లవి పేర్కొంది. ఆ అవార్డును గెలుచుకునే వరకూ తనకు ఆ భారం ఉంటుందని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అలా జాతీయ అవార్డుతో అమ్మమ్మ చీరకు ఒక కనెక్షన్ ఉండిపోయిందని నవ్వుతూ చెప్పింది. -
మజాకాతో పెద్ద హిట్ కొడుతున్నాం: సందీప్ కిషన్
‘‘మజాకా’(Mazaka) సినిమా కోసం నెల రోజులుగా పగలు, రాత్రి చిత్రీకరణ చేస్తున్నాం. ఈ మూవీ కోసం మేము క్రియేటివ్గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. అందులో భాగంగా ఔట్డోర్లో జరుగుతున్న మా సినిమా షూటింగ్కి మీడియా వారు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ నెల 26న ‘మజాకా’ చిత్రంతో పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది’’ అని సందీప్ కిషన్ తెలిపారు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. కాగా ఈ మూవీలోని ‘రావులమ్మ..’ అంటూ సాగే పాట చిత్రీకరణ షూటింగ్ ప్రస్తుతం ఔట్డోర్లో జరుగుతోంది. ఈ షూటింగ్ని లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ–‘‘రావులమ్మ’ ఫుల్ మాస్ అండ్ ఫోక్ సాంగ్. సందీప్, రీతు అద్భుతమైన డ్యాన్స్తో ఇరగదీశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాం’’ అని చెప్పారు రీతూ వర్మ. ‘‘మజాకా’తో ఈసారి మళ్లీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘మా బ్యానర్లో ఇది బెస్ట్ సినిమా అని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు రాజేష్ దండా. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడారు. -
సూర్యతో జోడీ?
హీరో సూర్య(Suriya) సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్గా నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫిల్మ్నగర్ సర్కిల్స్లో. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారని తెలిసింది.ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేశారని తెలిసింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, మే నుంచి రెగ్యులర్ షూటింగ్ను ఆరంభించేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓ మల్టీస్టారర్ అని, సూర్యతో పాటు మరో హీరో కూడా నటిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. -
ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్.. ప్రదానం చేసేది ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక గామా అవార్డుల వేడుక అంతా సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న ఐదో ఎడిషన్కు సంబంధించిన వివరాలను దుబాయ్ వేదికగా ప్రకటించారు. దుబాయ్లోని మైత్రి ఫార్మ్లో నిర్వహించిన ఈవెంట్లో తేదీ, వేదికను ఖరారు చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సింగర్ రఘు కుంచె సమక్షంలో జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గామా అవార్డ్స్ గ్రాండ్ రివీల్ పేరిట ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.మొట్టమొదటి సారి చాలా వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించారు. గామా అవార్డ్స్-2025 వేడుక 5వ ఎడిషన్ జూన్ 7, 2025న దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ జ్యూరీ చైర్ పర్సన్స్ సభ్యులుగా టాలీవుడ్ సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి , సంగీత దర్శకులు కోటి , సినీ దర్శకులు బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో ఎంపికైన టాలీవుడ్ నటీనటులకు, సినిమాలకు గామా అవార్ద్స్ అందజేస్తారు.ఈ సందర్బంగా కుంచె రఘు గారు మాట్లాడుతూ.. 'తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ గామా అవార్డ్స్. గామాతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటామని చెప్పారు. కాగా.. ఈ వేడుకలో యాంకర్, సింగర్ తిరు, శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో వచ్చిన అతిధులను ఆకట్టుకున్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలతో ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. -
జిమ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ.. పుష్ప నటి లేటేస్ట్ లుక్స్!
జిమ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..పుష్ప నటి కరణం పావని లేటేస్ట్ ఫోటో లుక్స్..టూర్లో చిల్ అవుతోన్న బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి..భూమిక చావ్లా లేటేస్ట్ ఫోటో షూట్..గ్రీన్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు...సైకిల్ నేర్చుకుంటోన్న ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
ఈ గుండు పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. బాల్యంలో మన చిలిపి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని చూసినప్పుడు.. అసలు అక్కడ నేనేనా అన్నంతలా ఉంటాయి. ఒక్కసారి ఆ బాల్యంలోకి తిరిగి వెళ్తే బాగుంటుందని అనుకోరు ఉండరేమో. ఆ చిన్ననాటి రోజులే బాగుండేవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్లమని ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటూనే ఉంటాం. అంతటి అద్భుతమైన క్షణాలు ఆ బాల్యపు రోజులు. ఆ రోజులనే మరోసారి గుర్తు చేసుకుంది మన స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ తీపి గుర్తులను మీరు కూడా చూసేయండి.బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్గా కనిపించింది. చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..మహేశ్బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పెళ్లాడిన టాలీవుడ్ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి మాన్షి జోషి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవ్ను పెళ్లాడింది. బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి అభినందనలు చెబుతున్నారు.కన్నడలో పలు సీరియల్స్లో నటించిన మాన్షి జోషి.. తెలుగులో దేవత అనే సీరియల్లో కనిపించింది. ఈ సీరియల్లో అర్జున్ అంబటి, చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కన్నడలో పారు సీరియల్తో ఫేమ్ తెచ్చుకుంది. రాధ రమణ, అంబుదాన్ ఖుషీ, గీతాంజలి, రాధ రాఘవ్ లాంటి సీరియల్స్తో మెప్పించింది. -
ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్
'క' మూవీతో భారీ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం దిల్రూబా మూవీ చేస్తున్నాడు. ఇందులో రుక్సర్ ధిల్లాన్ (Rukshar Dhillon) కథానాయికగా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. మొన్నటి వాలంటైన్స్ డేకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం మార్చి 14వ తేదీకి వాయిదా పడింది.జింగిలి బాగుంటదిలే..ఇకపోతే దిల్రూబా సినిమా (Dilruba Movie) నుంచి హే జింగిలి పాటను ఫిబ్రవరి 18న సాయంత్రం 5.01 గంటకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై రుక్సర్ స్పందిస్తూ.. ఓయ్ కిరణ్ అబ్బవరం.. ఇంకేం దొరకనట్టు, బుజ్జి, బంగారం కాకుండా ఈ జింగిలి జింగిలి ఏంటి? అని ప్రశ్నించింది. అందుకు కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య జనాలు పిల్చుకునే కూకీ, వైఫుల కన్నా జింగిలి చాలా బాగుంటది లే అన్నాడు. అదంతా కాదు, ఈ జింగిలి అంటే ఏంటి? ముందు అది చెప్పు అని హీరోయిన్ ప్రశ్నించింది. రేపటిదాకా ఆగాల్సిందేఅందుకు హీరో.. జింగిలి (Jingili) అంటే J అంటే జాన్, I అంటే ఇర్రెస్టిబుల్, N అంటే నెక్స్ట్ లెవల్, G అంటే గార్జియస్, I అంటే ఇర్రీప్లేసబుల్, L అంటే లైఫ్లైన్.. అంటూనే చివర్లో I అంటే ఇవ్వేవీ కాదన్నాడు. రేపు రిలీజయ్యే హేయ్ జింగిలి పాట వింటే నీకే తెలుస్తుందన్నాడు. అయితే మరీ అంతగా వెయిట్ చేయించకుండా హేయ్ జింగిలి ప్రోమోను రిలీజ్ చేశాడు. ప్రోమోలో అయితే పాట మరీ స్లోగా ఉంది. మరి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. Ee madhya janaalu pilchukunne pookie, cookie, Waifu lu kanna JINGILI chaala baguntaadhi le.#HeyJingili https://t.co/9FEXgMjd27— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025Jingili ante!J - JaanI - Irresistible N - Next LevelG - Gorgeous I - Irreplaceable L - LifelineI - Ivvevi kaadhuRepu #HeyJingili song vachaka vinnu.Feb 18th 5:01 ki. https://t.co/JA25iVHaQt— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025Tomorrow 5:01pm ❤️#HeyJingili #Dilruba pic.twitter.com/kNSlBWmLTv— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025 చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్.. ఆయన రిప్లై ఇదే! -
తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్.. ఆయన రిప్లై ఇదే!
'టాలీవుడ్లో తెలుగు వచ్చిన అమ్మాయిలకన్నా తెలుగురాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రేమిస్తుంటాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది. అందుకని ఇక మీదట తెలుగురానివారిని ఎంకరేజ్ చేయాలని నేను, డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) నిర్ణయించుకున్నాం' అంటూ నిర్మాత ఎస్కేఎన్ (Producer SKN) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన చివరిగా నిర్మించిన సినిమా బేబీ. అందులో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్గా పరిచయం చేయడంతో.. ఆమెకు బేబీ టీమ్కు మధ్య విభేదాలు వచ్చాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.ఆరుగురు తెలుగమ్మాయిలను..నిజానికి ఎస్కేఎన్ దాదాపు ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్స్గా మార్చాడు. 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మ రాథోడ్, ఆనంది, 'రొమాన్స్'తో మానస, 'టాక్సీవాలా'తో ప్రియాంక జవాల్కర్ (దీనికంటే ముందు కల వరం ఆయే సినిమా చేసింది కానీ గుర్తింపు రాలేదు), 'బేబి'తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)ను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేశాడు. సంతోశ్ శోభన్తో తీస్తున్న సినిమాలో దేత్తడి హారికను కూడా కథానాయికగా పరిచయం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ.. ఎస్కేఎన్.. చాలామంది తెలుగు హీరోయిన్లకు తెరకు పరిచయం చేశారు. కవర్ డ్రైవ్ఫన్ కోసమో, ఫ్లోలోనో వివాదానికి దారితీసేలా స్టేట్మెంట్ పడేశారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడటం సరికాదేమో? అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్కేఎన్ స్పందిస్తూ.. హహ్హహ్హ.. ఈ మధ్య చాలామంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ.. ఏం చేస్తాం చెప్పండి! అని రిప్లై ఇచ్చాడు. కాంట్రవర్సీ మీరే చేసి ఇప్పుడు కవరింగ్ దేనికో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్హిట్టు: కరణ్ జోహార్ -
కాశీనాథుని ఆలయంలో విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ సతీమణి కూడా!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే మహాకుంభ్ మేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు విమానం ఆలస్యం కావడంతో చాలా సేపు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ చేరుకున్న విజయ్ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను పంచుకున్నారు. అయితే తాజాగా మహాకుంభ్ మేళా జర్నీకి సంబంధించిన మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. వీరితో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం తనకెంతో జ్ఞాపకాలను అందించిందని పోస్ట్ రాసుకొచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యాక్షన్ మూవీ కింగ్డమ్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీజర్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్ను అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్హిట్టు: కరణ్ జోహార్
కొన్ని సినిమాలకు లాజిక్తో పని లేదంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar). కథపై నమ్మకం ఉంటే చాలు అవి హిట్టవుతాయంటున్నాడు. తాజాగా కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మనం ఎంచుకున్న కథను నమ్మడం అన్నింటికన్నా ముఖ్యమైనది. కొందరు ఉత్తమ దర్శకులనే ఉదాహరణగా తీసుకోండి.. వారు లాజిక్స్ను పట్టించుకోకుండా కథను నమ్మడం వల్లే పెద్ద విజయాలు అందుకున్నారు.లాజిక్ లేకపోయినా..సినిమా నచ్చితే లాజిక్ను ఎవరూ పట్టించుకోరు. ఉదాహరణకు రాజమౌళి (SS Rajamouli) సర్ సినిమాలే తీసుకోండి. ఆయన తీసిన సినిమాల్లో లాజిక్స్ గురించి జనాలు మాట్లాడుకుంటారా? లేదు కదా.. ఆయనకు కథపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరు. యానిమల్, ఆర్ఆర్ఆర్, గదర్.. ఈ సినిమాలన్నింటికీ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ప్రేక్షకులు నమ్మారుఒక వ్యక్తి సింగిల్ హ్యాండ్తో వెయ్యిమందిని కొడుతున్నట్లు చూపించినప్పుడు అది ఎలా సాధ్యం? అని ఎవరూ లెక్కలు వేయరు. సన్నీ డియోల్ (Sunny Deol)కు వెయ్యి మందిని ఓడించే శక్తి ఉందని అనిల్ శర్మ నమ్మాడు. అదే వెండితెరపై చూపించాడు. ప్రేక్షకులూ అదే విశ్వసించారు. అందుకే గదర్ 2 అంత పెద్ద బ్లాక్బస్టర్ హిట్టయింది. దర్శకులు తమ కథను నమ్మినప్పుడే విజయాలు సాధించగలరు. చేసే పనిని సందేహించినా, ఆడియన్స్ ఏమనుకుంటారోనని లాజిక్పై ఎక్కువ ఫోకస్ పెట్టినా సమస్యలు చుట్టుముట్టడం ఖాయం' అని చెప్పుకొచ్చాడు.నిర్మాతగా ఫుల్ బిజీకరణ్ జోహార్ ప్రస్తుతం 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా నిర్మిస్తున్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్య మల్హోత్రా, రోహిత్ శరఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కరణ్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో అక్షయ్కుమార్- మాధవన్ల కేసరి: చాప్టర్ 2తో పాటు కార్తీక్ ఆర్యన్తో మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: ఓటీటీ సెన్సేషన్.. జాన్వీ కపూర్ కంటే గొప్ప నటి.. అయినా పట్టించుకోరే? -
మా రెమ్యునరేషన్తోనే ఈ బిల్డింగ్ నిర్మించాం: సూర్య
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, కార్తీ కుటుంబ సభ్యులు అందరూ చెన్నైలోని ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కుటుంబ ఆద్వర్యంలో నడుస్తున్న అగరం ఫౌండేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి నటుడు శివకుమార్, సోదరి బృందా, జ్యోతికతో పాటు వారి పిల్లలు అందరూ పాల్గొన్నారు. సుమారు ఏడాది తర్వాత ఈ కార్యక్రమం కోసం ముంబై నుండి చెన్నైకి జ్యోతిక పిల్లలతో పాటు వచ్చారు. అగరం ఫౌండేషన్ అనేది నటుడు సూర్య నేతృత్వంలోని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. గత 20 సంవత్సరాలుగా, అతని కుటుంబ సభ్యులు అట్టడుగు ఆర్థిక వర్గాల విద్యార్థులకు వారి కలలను సాధించడంలో సహాయం చేస్తున్నారు. చెన్నైలో ఫౌండేషన్ కొత్త కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. తమిళంలో అగరం అంటే 'అ'కారం... అంటే తొలి అక్షరం అని సూర్య తెలిపారు. ఈ ఫౌండేషన్కు తెలుగువారు భారీ స్థాయిలో విరాళాలు అందించినట్లు గతంలో సూర్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి తమ సొంత డబ్బుతో నిర్మించామన్నారు. సుమారు 20 ఏళ్ల పాటు కష్టానికి ప్రతిఫలం ఈ భవనం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పిల్లల విద్య కోసం తమ సంస్థకు వచ్చిన విరాళాల నుంచి ఒక్క రూపాయి కూడా బిల్డింగ్ నిర్మాణం కోసం ఉపయోగించలేదన్నారు. సినిమా నుంచి తమకు వచ్చిన రెమ్యునరేషన్లో కొంత మొత్తాన్ని దాచిపెట్టి నిర్మించామన్నారు. ప్రస్తుతం ఏడాదికి 700-800 మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. భవిష్యత్లో ఈ సంఖ్యను పెంచేందుకే ఈ భవన నిర్మాణం చేశామని ఆయన తెలిపారు.సూర్య తండ్రి శివకుమార్ అతని కుటుంబ సభ్యులు చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. ఈ ఫోటోలలో ఆయన సతీమణి లక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ప్రస్తుతం నెట్టింట వీడియోలతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. • Exclusive - @Karthi_Offl , @Suriya_offl With Family At Inaugration Of New @agaramvision 's Office | #Karthi #VaaVaathiyaar #Sardar2 #Karthi29 #Kaithi2 #Retro pic.twitter.com/w5qvDxukqW— MKB Santhosh (@MKB_SANTHOSH23) February 16, 2025 -
శివకార్తికేయన్ కొత్త సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్
శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ ప్రకటనతో పాటు అదిరిపోయే గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన శివ కార్తికేయన్. ఇప్పుడు మరో భారీ విజయంపై కన్నేశాడు. తన కెరీర్లో 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రానికి మదరాసి అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్లతో ఉంది.మదరాసి చిత్రంలో శివ కార్తికేయన్ పవర్పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్పై శ్రీ లక్ష్మి ప్రసాద్, సుందర్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తెలుగు సినిమా సెట్లో పదేపదే ఇబ్బంది పెట్టారు: శ్వేతా బసు ప్రసాద్
కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒక తెలుగు హీరో గురించి పలు వ్యాఖ్యలు చేసింది. మొదటి సినిమాతోనే యూత్కు బాగా దగ్గరైన ఈ బ్యూటీ అమాయకపు చూపుతో దగ్గరైంది. నిష్కల్మషమైన నవ్వుతో తొలి చిత్రంతోనే ఎంతోమంది గుండెలు కొల్లగొట్టిందీ హీరోయిన్. టాలీవుడ్లో ఫస్ట్ సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఛాన్సులు పెద్దగా దక్కలేదు. సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాపులు కొనితెచ్చుకుంది. తర్వాత జీనియస్ సినిమాలో డిబిరి డిబిరి అనే ఐటం సాంగ్లోనూ ఆడిపాడింది. ఏడేళ్లపాటు తెలుగు తెరకు దూరమైన ఆమె 2018లో విజేతతో పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు మంచి కమ్బ్యాక్ ఇవ్వలేకపోయింది. తను నటించిన 'ఊప్స్ అబ్ క్యా' (Oops Ab Kya) వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20న జియోహాట్స్టార్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఆ హీరో తెలుగువాడే.. అయినా తెలుగు రాదు: శ్వేతా బసునటి శ్వేతా బసు ప్రసాద్ ఒక తెలుగు సినిమా సెట్లో వేధింపులకు గురైనట్లు ఆమె గుర్తుచేసుకుంది. తాను ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. పలు ఛాన్స్లతో కెరీర్ పరంగా బాగానే ఉందని చెప్పింది. కానీ, ఒక సందర్భంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపింది. అది కూడా తెలుగు సినిమా సెట్లోనే అంటూ పేర్కొంది. 'నేను తెలుగులో ఒక హీరోతో సినిమా చేస్తున్న సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. నా హైట్ 5'2 ఉంటుంది. ఆయన మాత్రం సుమారు ఆరు అడుగులు ఉంటాడు. దీంతో అందరూ నన్ను హీరోతో పోలుస్తూ.. నేను ఎత్తు తక్కువగా ఉన్నానంటూ సెట్లో ప్రతిఒక్కరూ ఎగతాళి చేసేవారు. ఆయనేంటి అంత ఎత్తు ఉంటే.. ఈవిడేమో 5 అడుగులు మాత్రమే ఉందని కామెంట్లు చేసేవారు. ఈ విషయంలో హీరో కూడా కామెంట్ చేసినట్లు తెలిసింది. నా హైట్ మీద ఆయన కూడా పలుమార్లు వ్యంగ్యాన్ని కూడా ప్రదర్శించేవాడు. ప్రతిరోజూ నా ఎత్తును గుర్తుచేస్తూ కామెంట్ చేసేవారు. ఇక్కడ హీరోతో మరో సమస్య ఉంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు అతను ప్రతి సన్నివేశాన్ని గందరగోళానికి గురిచేసేవాడు. ఎన్నో రీటేక్లు తీసుకుంటాడు. తెలుగువాడే అయినప్పటికీ అతనికి భాష కూడా సరిగ్గా రాదు. తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు. అతని మాటలు సెట్స్లో ఎవరికీ అర్థం కావు. నేను చాలా కష్టపడి తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్పేదానిని. అయినప్పటికీ చాలామంది నా హైట్ గురించే కామెంట్ చేసేవాళ్లు. అతని భాష గురించి ఎవరూ పట్టించుకోరు. నా కంట్రోల్లో లేని హైట్ గురించి వాళ్లు కామెంట్ చేసినప్పుడు చాలా బాధ అనిపించేది.' అని ఆమె చెప్పింది. ఈ గొడవ అంతా ఏ సినిమాలో జరిగిందో ఆమె వెళ్లడించలేదు.ఆమె కొత్త బంగారు లోకం (2008)లో తన తొలి చిత్రంతో ఎంట్రి ఇచ్చింది. ఆపై రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ చిత్రాలలో ఆమె నటించింది. ఆమె చివరి తెలుగు చిత్రం విజేత (2016) అని తెలిసిందే. తెలుగు సినిమాతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో కూడా శ్వేత మెప్పించింది. -
అదీ నాకు దక్కిన అదృష్టం: మీనాక్షి చౌదరి
తనకు పట్టిన అదృష్టం గురించి నటి మీనాక్షి చౌదరి చెబుతూ తెగ సంబరపడిపోతోంది. కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోల సరసన నటిస్తూ మంచి బ్రేక్ కోసం ఎదురుచూసిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం రావడంతో పాపులర్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన గుంటూరు కారం చిత్రంలో నటించే అవకాశాన్ని పొందింది. ఆ చిత్రంలో పెద్దగా నటించడానికి అవకాశం లేకపోయినా బాగానే గుర్తింపు పొందింది. కోలీవుడ్లోనూ అలాంటి అవకాశంతోనే పాపులర్ అయ్యింది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రంలో ఆయనకు జంటగా నటించే అవకాశం రావడం, అందులోనూ ఈమె పాత్ర ఒక పాట, రెండు మూడు సన్నివేశాలకే పరిమితమైనప్పటికీ గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది. అయితే ఈ చిత్రం నటించడానికి అంగీకరించి తొందరపడ్డాను అనే అభిప్రాయాన్ని నటి మీనాక్షి చౌదరి ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేయడం విశేషం.ఏదేమైనా సింగపూర్ సలూన్ అనే చిన్న చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. ఆ తర్వాత విజయ్ ఆంటోని కథానాయకుడు నటించిన కొలై చిత్రంలో ముఖ్య పాత్రలో నటించింది. ఆ తర్వాత గోట్ చిత్రంలో దళపతి విజయ్కి జంటగా నటించే అవకాశం వరించింది. అదేవిధంగా దుల్కర్ సల్మాన్కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇటీవల ఈమె తెలుగులో వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించడంతో చాలా ఖుషీలో ఉంది. కాగా నటి మీనాక్షి చౌదరి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ గత ఏడాది తనకు చాలా ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని చెప్పింది. సినిమాల్లో చాలా ఏళ్లుగా అనుభవం ఉన్న చాలామందికి వైవిధ్య భరిత కథల్లో నటించే అవకాశాలు ప్రస్తుతం లభించడం లేదని, అలాంటిది తన కెరీర్ ఆరంభ దశలోనే పలు వైవిధ్య భరిత కథల్లో నటించే అవకాశాలు రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అన్నట్టు ఇటీవల గ్లామర్ విషయంలో ఈ అమ్మడు మోతాదును పెంచిందనే చెప్పాలి. -
తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వకూడదు: ఎస్కేఎన్
టాలీవుడ్లో బేబీ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత 'ఎస్కేఎన్'.. అయితే ఆ మూవీ విజయంలో కీలక పాత్ర తెలుగమ్మాయి 'వైష్ణవి చైతన్య'దే అని అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని నెట్టింట వైరల్ అవుతుంది. లవ్ టుడే సినిమాతో తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో రెండో హీరోయిన్గా అస్సాం నటి 'కయదు లోహర్' నటిస్తుంది. ఆమెను ఉద్దేశిస్తూ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా వేడుకలో హీరోయిన్ 'కయదు లోహర్' గురించి ఎస్కేఎన్ మాట్లాడారు. సరిగ్గా హీరోయిన్ పేరు కూడా ఆయన పలకలేకపోయారు. 'కయదు లోహర్' బదులుగా కాయల్ అంటూనే.. ఎమండీ మీ పేరు కాయలా..? పళ్లా..? అంటూ ఎటకారంతో కవరింగ్ చేసేశాడు. 'మేము తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ఇష్ణపడుతాం. ఎందుకంటే, తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమౌతుందో తర్వాత నాకు తెలిసింది. ఇకనుంచి తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయకూడదని నాతో పాటు మా డైరెక్టర్ సాయి రాజేశ్ నిర్ణయించుకున్నాం' అని తెలిపాడు. ఆపై అప్పుచేసి అయినా సరే సినిమా టికెట్లు కొనాలని యూత్కు సలహా ఇచ్చాడు. కావాలంటే లోన్ యాప్ నుంచి డబ్బు తీసుకుని అయినా సరే టికెట్లు కొని సినిమా చూడాలని యూత్కు ఉచిత సలహా ఇచ్చాడు.'బేబీ' హీరోయిన్ వైష్ణవి గురించేనా..?ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు కూడా తప్పుబడుతున్నారు. బేబీ హీరోయిన్ వైష్ణవి గురించే అతను ఈ కామెంట్ చేశాడా..? అంటూ చర్చించుకుంటున్నారు. తెలుగు హీరోయిన్లకు ఛాన్సులివ్వండని వేదికలపై కొంత మంది హీరోలు గట్టిగానే చెబుతుంటే.. ఈయనేంటి ఇలా అంటున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. సినిమా హిట్తో ఒక తెలుగు నటి సక్సస్ అయిందన్న మాట తప్ప..! ఇప్పటివరకూ ఆమెకి కొత్త అవకాశాలు వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదని వారు గుర్తుచేస్తున్నారు. కానీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 80 శాతం అక్కడి అమ్మాయిలకే అవకాశాలు ఇస్తారని చెప్పుకొస్తున్నారు. మన నిర్మాతలకు పక్కింటి పుల్లగూర రుచిగా ఉటుందని ఈ విషయంలో ఇప్పటికే మేకర్స్పై విమర్శలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు దొరకడం లేదు, రూల్స్ పెడతారు అంటూ సాకులు చెబుతూనే ఎలాంటి మార్కెట్ లేని పరభాషా హీరోయిన్లని తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు.మన తెలుగమ్మాయిలకు సరిగ్గా పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయాలే గానీ తెరపై బాగా రాణించగల సత్తా ఉంది. తెలుగమ్మాయిల్లో టాలెంట్కు ఎలాంటి కొదవ లేదు. కానీ, మన నిర్మాతలకు, డైరెక్టర్లకు వారు కనబడరు. తెల్లతోలు తారలకు నటన రాకపోయినా పర్లేదు వాళ్లకు అడిగినంతా డబ్బు ముట్టజెప్పి ఛాన్సులు ఇచ్చేస్తారు. ఇలా ఎన్నో విమర్శలు తెలుగు మేకర్స్పై ఉన్నాయి.గ్లామర్ రోల్స్లో మనోళ్లు ఏమాత్రం తగ్గరుమెగా డాటర్ నిహారిక కొణిదెల సెకండ్ ఇన్నింగ్స్లో సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది. తమిళ సినిమా మద్రాస్కారన్లో గ్లామర్ రోల్లో కనిపించి ఆడియన్స్కు షాక్ ఇచ్చింది. మరోవైపు నిర్మాతగానూ తన మార్క్ చూపుతుంది. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈషా రెబ్బా సరైన పాత్ర కోసం ఎదురుచూస్తుంది. సరైన ఛాన్స్ల కోసం లెక్కలేనన్ని గ్లామరస్ ఫోటోషూట్స్తో సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. కెరీర్ ప్రారంభం నుంచే గ్లామర్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న తెలుగుమ్మాయి ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా సినిమాలో నటించిన ఆమె.. ట్రెడిషనల్ లుక్తో పాటు గ్లామరస్ పాత్రలు అయినా చేయగలదు. అయినా, ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావటం లేదు. గ్లామర్ విషయంలో ముంబై అమ్మాయిలకు ఏమాత్రం వీళ్లు తగ్గరు. కానీ, ఛాన్సులు మాత్రం దక్కడం కష్టంగా మారిందని చెప్పవచ్చు. #SaiRajesh and myself decided not to encourage Telugu Heroines in our films - #SKN 🤯🤯🤯But his Idol #AlluArjun wants to encourage more Telugu Heroines👀 pic.twitter.com/9295BEOYoz— ScreenPlay (@screenplay_in) February 16, 2025 -
నటుడు సత్యరాజ్ కుమార్తెకు కీలక పదవి
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడ్డ సత్యరాజ్ తనయ దివ్య సత్యరాజ్ కొద్దిరోజుల క్రితమే డీఎంకే పార్టీలో చేరారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆమెకు కీలక పదవి అప్పగించారు. ఆ పార్టీ అనుబంధ ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ప్రకటించారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. గతకొంత కాలంగా రాజకీయాల్లో రావాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఆయన కుమార్తె దివ్య గత నెలలో డీఎంకేలో చేరారు. సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే సభ్యత్వం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం డీఎంకేలో పలు జిల్లాలకు కార్యదర్శులు, ఇన్చార్జ్లు, అనుబంధ విభాగాలకు కొత్త వారి నియామకం వేగం పుంజుకుంది. ఆ దిశగా ఆదివారం ఐటీ విభాగంలో పదవులను భర్తీ చేశారు. ఇందులో దివ్యకు ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి పదవి అప్పగించారు. అలాగే డీఎంకే అనుబంధ మైనారిటీ విభాగం, వర్తక తదితర విభాగాలతో పాటూ మరికొన్ని విభాగాల పదవులను భర్తీ చేస్తూ దురై మురుగన్ ప్రకటించారు. అలాగే పార్టీ ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడిగా ముబారక్ను నియమించారు. -
ప్రముఖ నిర్మాత–నటి–గాయని కృష్ణవేణి కన్నుమూత
తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి ప్రపంచ స్థాయికి ఎదగడం వరకూ చూసిన నాటి తరం ప్రముఖ నిర్మాత–నటి–గాయని చిత్తజల్లు కృష్ణవేణి(Krishnaveni) (101) ఇక లేరు. పదిహేను రోజులుగా ఆమె హైదరాబాద్లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న కృష్ణవేణి జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి, బహుమతులు అందుకున్నారామె. కాగా ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో రాజమండ్రిలో ‘తులాభారం’ నాటకం చూశారు. ఆ నాటకంలో కృష్ణవేణి నటన నచ్చి, ‘సతీ అనసూయ’కు అవకాశం ఇచ్చారు.అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాతో కృష్ణవేణి తొలిసారి వెండితెరపై కనిపించారు. బాల నటిగా కొన్ని చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లారామె. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు, పేరు దక్కాయి. కాగా ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజు (మేకా రంగయ్య) బేనర్లో ఆమె ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేశారు.నటిగా కృష్ణవేణిని బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. ఆ చిత్రం తర్వాత మీర్జాపురం రాజుతో ఆమె పెళ్లయింది. వారిది ప్రేమ వివాహం. ఆ తర్వాత జయా పిక్చర్స్పై తన భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. అలా నిర్మాణరంగంవైపు వచ్చారామె. ఇక వివాహం తర్వాత జయా పిక్చర్స్ని శోభనాచల స్టూడియోస్గా మార్చారు. ఈ బేనర్ నిర్మించిన ‘దక్షయజ్ఞం (1941), గొల్లభామ (1947), లక్ష్మమ్మ (1950)’ వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు కృష్ణవేణి.ఒకవైపు నటిస్తూనే ‘బాల మిత్రుల కథ, కీలు గుర్రం’ వంటి సినిమాల్లో పాటలు కూడా పాడారు. కాగా ‘తిరుగుబాటు’ సినిమాలో కృష్ణవేణి చేసిన వ్యాంప్ క్యారెక్టర్ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక 1942లో మీర్జాపురం రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. ఒకవైపు అనురాధ ఆలనా పాలనా, మరోవైపు సినిమాల నిర్మాణ పనులు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాల చేత కృష్ణవేణి నటించడం తగ్గించారు.ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సాహసం’ (1952). అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా కృష్ణవేణికి పేరుంది. ‘ధర్మాంగద’ చిత్రానికి గాను ఆమె రూ. 45 వేలు పారితోషికం అందుకున్నారట. ఎన్టీఆర్ని పరిచయం చేసిన నిర్మాతగా... ‘మన దేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ని పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి బాగా పాపులర్ అయ్యారు. పూర్తి స్థాయి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి నిర్మించిన ‘మన దేశం’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్గానూ చేశారు. ఇదే చిత్రంతో గాయనిగా పి. లీలను పరిచయం చేశారు. అలాగే ‘వరూధిని’ చిత్రం తర్వాత, ఊరికి వెళ్లిపోయిన ఎస్వీ రంగారావును పిలిపించి, ‘మన దేశం’కు అవకాశం కల్పించారామె. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావుకు పూర్తి స్థాయి సంగీతదర్శకునిగా తొలి అవకాశం కల్పించింది కూడా కృష్ణవేణియే కావడం మరో విశేషం. ‘దాంపత్యం’ (1957) నిర్మాతగా కృష్ణవేణికి ఆఖరి చిత్రం. నటిగా, నిర్మాతగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారామె. కృష్ణవేణి 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2022లో ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. ఇక ఆమె కుమార్తె అనురాధ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించారు. కన్నడంలో ‘భక్త కుంభార’ (1974) నిర్మాతగా ఆమె తొలి చిత్రం.అదే సినిమాని తెలుగులో నాగేశ్వరరావు హీరోగా ‘చక్రధారి’గా రీమేక్ చేశారు. ‘రాముడే రావణుడైతే, శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు, అనుబంధం, ఆలయ దీపం, ఇల్లాలే దేవత’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ , కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారామె. తెలుగులో తీసిన ‘మా పెళ్లికి రండి’ నిర్మాతగా ఆమె చివరి చిత్రం. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్ని సొంతం చేసుకున్నారామె.కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఫిల్మ్నగర్లోని ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణవేణికి కూతురు అను రాధా దేవి, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె చిన్న మనమరాలు అర్చన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు.కృష్ణవేణి కాశీ మజిలీ కథలతో పాటు చాలా పుస్తకాలు చదివేవారు. వాటిలో సినిమా తీయడానికి పనికొస్తాయనిపించే పాయింట్స్ తీసుకుని, కథ తయారు చేయించేవారు. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి షూటింగ్ షెడ్యూల్స్ ΄్లాన్ చేసి, షూటింగ్ స్పాట్లో ఉండటంవరకూ అన్నీ దగ్గరుండి చూసుకునేవారు కృష్ణవేణి.సినీ నిర్మాత, నటి, గాయని, రఘుపతి వెంకయ్య అవార్డుగ్రహీత కృష్ణవేణి మృతిపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనేక భాషల్లో నటించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొంది, నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. పలు గొప్ప చిత్రాలు తీసి, నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి, పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడినిప్రార్థిస్తున్నానని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.‘‘అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించింది. పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణిగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడినిప్రార్ధిస్తున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్ను చిత్ర రంగానికి పరిచయం చేసి, కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. -
ఎమోషనల్ బ్యూటీ
అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యూటీ’. వర్ధన్ దర్శకత్వంలో వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రోడక్ట్ పతాకాలపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ఓ అందమైన ప్రేమకథతో పాటు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ను ప్రేక్షకులు ఈ మూవీలో చూస్తారు’’ అని తెలిపింది యూనిట్. ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్. -
కాలేజీ మ్యాజిక్
‘డోన్ట్ నో వై... ఇంకా ఉన్నా... నేనే ఇష్టం లేనిప్రాణాలేమో పోనే పోవే..’ అంటూ మొదలవుతుంది ‘మ్యాజిక్’ సినిమాలోని ‘డోన్ట్ నో వై...’ పాట. సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాశ్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు ప్రధాన పాత్రధారులుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు, తమిళ చిత్రం ‘మ్యాజిక్’.ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘డోన్ట్ నో వై..’ పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ఐశ్వర్యా సురేష్ బింద్రాతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించారు. ‘‘కాలేజ్ ఫెస్ట్ కోసం పాట చేయడానికి ఓ నలుగురు యువతీ యువకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అని యూనిట్ తెలిపింది. -
ప్రేమకథ షురూ
అభినవ్ మణికంఠ(Abhinav Manikanta), దివిజా ప్రభాకర్, తన్మయి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘హే చికితా(Hey Chikittha)’. ధన్రాజ్ లెక్కల దర్శకత్వంలో ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా టైటిల్ పోస్టర్ను దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) విడుదల చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించాం. తెలంగాణ, ఆంధ్రాలోని పలు లొకేషన్స్లో చిత్రీకరణ జరుపుతాం’’ అని యూనిట్ తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమేరా: ‘గరుడవేగ’ అంజి. -
వంద కోట్ల తండేల్
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిందని చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ సినిమా కోసం నాగచైతన్య కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు.విడుదలైన తొలి రోజే ఆన్లైన్లో పైరసీ వెర్షన్ రిలీజ్ కావడం, ఫిబ్రవరి వంటి ఆఫ్–సీజన్ రిలీజ్ కావడం వంటి అవాంతరాలను దాటుకుని కూడా ‘తండేల్’ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఓవర్సీస్లోనూ వన్ మిలియన్ మార్క్ను చేరుకుంది. గీతా ఆర్ట్స్లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్గా నిలవడం సంతోషంగా ఉంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక నాగచైతన్య కెరీర్లో రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిన తొలి చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. -
బ్యాక్ టు షూట్
‘బ్యాక్ టు షూట్’ అంటూ దాదాపు నెల రోజుల తర్వాత రష్మికా మందన్నా(Rashmika Mandanna) షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టారు. గత నెల జిమ్లో వర్కవుట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆమె కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. దాంతో కొన్ని వారాలు ఆమె షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చారు. గాయం తగ్గిపోవడంతో షూట్కి రెడీ అయ్యారు.సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం ‘సికందర్’(Sikandar) షూట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాకి సంబంధించి నైట్ షూట్ జరుగుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ‘సికందర్’ కాకుండా హిందీలో ‘థామా’, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘కుబేర’, తెలుగు చిత్రం ‘గర్ల్ ఫ్రెండ్’ వంటివి రష్మిక సైన్ చేశారు. నెల రోజుల బ్రేక్ తీసుకున్నారు కాబట్టి ఇక ఈ చిత్రాల షూటింగ్తో బిజీగా ఉంటారు. -
సాయిపల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
కథానాయిక సాయిపల్లవి (Sai Pallavi) ఎంచుకునే కథలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. ఏవి పడితే అవి చేసుకుంటూ పోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్ని మాత్రమే చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తండేల్ సినిమా చేసింది. ఇందులో మరోసారి తన నటనతో కట్టిపడేసింది. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్ల క్లబ్లో చేరింది.సెల్ఫీ దిగాక..ఇకపోతే తండేల్ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ఓ ఈవెంట్లో జరిగిన చిన్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విడుదలకు ముందు జరిగిన తండేల్ జాతర ఈవెంట్లో ఓ మహిళా అభిమాని ఎలాగోలా సాయిపల్లవిని చేరుకుంది. తనతో సెల్ఫీ దిగిన అమ్మాయి హీరోయిన్ షేక్హ్యాండ్ ఇచ్చింది. దీంతో తెగ సంతోషపడిపోయిన ఆమె సాయిపల్లవి చేతికి ముద్దు పెట్టింది.బుజ్జి తల్లికి బాషా రేంజ్ ఎలివేషన్ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాషా సినిమాలో రజనీకాంత్ మాణిక్ బాషాగా మారిన సమయంలో తన అనుచరులంతా కూడా ఆయన చేతిని ముద్దాడుతుంటారు. ఆ సీన్తో సాయిపల్లవి క్లిప్ను పోలుస్తూ బుజ్జితల్లికి బాషా రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నారు. ఇకపోతే సాయిపల్లవి ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తోంది. ఇందులో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ❤️🔥🧎🏻♂️😋 pic.twitter.com/1IFhJl5LH0— SHANMUKH (@Shanmukh_008) February 15, 2025 చదవండి: నా భార్య చనిపోయేవరకు వీల్చైర్లోనే.. అదే చివరిమాట.. : చిన్నా -
టాలీవుడ్ సెన్సేషనల్ నటి రెండో పెళ్లి.. ఎప్పుడంటే?
టాలీవుడ్ నటి పావని రెడ్డి (Pavani Reddy) చాలాకాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది. ఇప్పుడు ఆ ప్రేమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానోచ్ అంటూ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పింది. కొరియోగ్రాఫర్ ఆమిర్తో ఏప్రిల్ 20న పెళ్లి జరగనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు స్పెషల్ వీడియో షేర్ చేసింది. అందులో ఒకరికొకరు తోడుంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నారు. ఈ వీడియోకు కలిసి జీవిద్దామని క్యాప్షన్ ఇచ్చింది. తెలుగు, తమిళంలో సినిమాలుకాగా పావని రెడ్డి.. తెలుగులో సీరియల్స్తో పాటు డబుల్ ట్రబుల్, డ్రీమ్, గౌరవం, లజ్జ చిత్రాలు చేసింది. తెలుగులో పెద్దగా గుర్తింపు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అక్కడ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో టాలీవుడ్లోనూ యాక్ట్ చేసింది. అలా ప్రేమకు రెయిన్చెక్, మళ్లీ మొదలైంది, చారి 111 చిత్రాల్లో మెరిసింది. 2013లో తెలుగు నటుడు ప్రదీప్కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సడన్గా ఏమైందో ఏమో కానీ 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిగ్బాస్ షోలో మొదలైన పరిచయం..భార్య మరొకరితో చనువుగా ఉన్న ఫోటో చూసే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగింది. ఈ ఘటనతో చాలారోజులపాటు పావని పేరు మీడియాలో మార్మోగిపోయింది. ఈ విషాదం తర్వాత పావని.. నిర్మాత ఆనంద్జాయ్ను పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే అది నిజం కాదని ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. తమిళ బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న పావని సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఆమిర్తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా అతడితో రెండో పెళ్లికి సిద్ధమైంది. View this post on Instagram A post shared by Pavni (@pavani9_reddy)చదవండి: నా భార్య చనిపోయేవరకు వీల్చైర్లోనే.. అదే చివరిమాట.. : చిన్నా -
బిగ్గెస్ట్ మైల్స్టోన్ చేరుకున్న 'తండేల్'.. నాగచైతన్యకు ఫస్ట్ సినిమా
తండేల్ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది.తండేల్ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన తండేల్.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్ చూపింది. ఈ చిత్రం HD వెర్షన్ సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్లో 1 మిలియన్ దాటింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్కు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ చిత్రానికి ప్రేక్షకులు క్యూ కట్టేశారు.. శ్రీకాకుళం,విజయనగరం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపలేదని వారు వాపోయిన విషయం తెలిసిందే. -
నా భార్య చనిపోయేవరకు వీల్చైర్లోనే.. అదే చివరిమాట.. : చిన్నా భావోద్వేగం
కబలి (కబడ్డీ).. కబలి.. నేను ఆళ్తా.. అంటూ తన డైలాగులతో నవ్వించాడు చిన్నా అలియాస్ జితేంద్ర రెడ్డి. కామెడీ పాత్రలే కాదు ఆ ఇంట్లో వంటి చిత్రాలతో సీరియ్ పాత్రలు కూడా చేశాడు. శివ, పుట్టింటి పట్టుచీర, మనీ మనీ, మధురానగరిలో, పిట్టల దొర, అల్లుడా మజాకా, మురారి, సొంతం, గౌతమ్ ఎస్ఎస్సీ, ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా నటుడు చిన్నా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. మాజీ సీఎం మేనల్లుడిని..చిన్నా (Actor Chinna) మాట్లాడుతూ.. మాకు 25 ఎకరాల భూమి.. పొలంలోనే ఇల్లు, ఊర్లో థియేటర్లో ఉంది. కానీ నాకు సినిమాలపై ఆసక్తి. ఫిలిం ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ సాధించాను. తొలిసారి ఆడిషన్స్కు వెళ్లినప్పుడు సీనియర్ డైరెక్టర్ వంశీ హేయ్.. వెళ్లు అంటూ తరిమేశారు. ఇండస్ట్రీ ఇలా ఉంటుందా? అనిపించింది. అయినా ప్రయత్నాలు ఆపలేదు. కష్టపడి అవకాశాలు సాధించాను. ఇక్కడో విషయం చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సోదరే మా అమ్మ. అనారోగ్యం బారిన చిన్నా భార్యనేను నటుడిగా పేరు తెచ్చుకున్నాక కేబినెట్ మీటింగ్కు పిలిచాడు. ఈయనెవరో తెలుసా? నా మేనల్లుడు అంటూ అక్కడున్నవారికి గర్వంగా చెప్పుకున్నాడు. కానీ ఎవరికీ నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకునేవాడిని కాదు. నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కానీ పెళ్లయిన పదేళ్లకు ఆమె ఆరోగ్యం దెబ్బతింది. చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన రోజు ఆమె నడవలేకపోతున్నానంది. మల్టిపుల్ క్లీరోసిస్ వ్యాధి వల్ల వీల్చైర్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. రెడీ చేయడం దగ్గర్నుంచి అన్నీ నేనే..రూ.4 లక్షలు పెట్టి తైవాన్ నుంచి వీల్చైర్ తెప్పించాను. అది మనం కూర్చోవడానికే కాకుండా నిలబడేందుకు సాయపడుతుంది. ట్రీట్మెంట్లో భాగంగా చాలాసార్లు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఐదారేళ్లపాటు వీల్చైర్లోనే ఉంది. చివరి రెండేళ్లయితే తనకు రెడీ చేయడం, డ్రెస్ వేయడం, తినిపించడం.. అన్నీ నేనే చేశాను. అయితే ఎక్కువసేపు మంచానికే పరిమితవడం వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. అది ఎక్కువవడంతో ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బందిపడింది. నా చేయి పట్టుకుని..మా ఆయన్ను చూడాలనుందని అక్కడివారికి చెప్పింది. ఆ విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నాను. ఏదైనా తాగాలనుందంది. గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి మూడు, నాలుగు చెంచాలు తాగిపించాను. నాకు ఇక్కడ ట్రీట్మెంట్ బాగోలేదు అని చిరాకు పడటంతో స్పెషల్ ఐసీయూకు షిఫ్ట్ చేయిస్తానన్నాను. తనను స్ట్రెచర్పై పడుకోబెట్టగానే నా చేయి పట్టుకుని నేనిక బతకనేమో అంది. అదే తన చివరి మాట. ఏం కాదు అని ధైర్యం చెప్పాను. కానీ 24 గంటల్లో అంతా అయిపోయింది.ఒంటరినయ్యా..ఇద్దరు కూతుర్ల పెళ్లి చూడకుండా 42 ఏళ్ల వయసులోనే తను మాకు దూరమైంది. కొన్ని నెలలపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా కూతుర్లిద్దరిదీ లవ్ మ్యారేజ్. ఇద్దరికీ పెళ్లయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఒంటరినయ్యాను. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే శూన్యంలా అనిపిస్తుంది. రోజూ నా భార్య ఫోటోకు పూలు పెట్టి దండం పెట్టుకుంటాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: నటుడు చేసిన పనికి ఏడ్చేసిన అత్త.. గ్రేట్ అంటూ ప్రశంసలు! -
'ఛావా' సినిమా చూసి కన్నీళ్లతో ప్రేక్షకులు.. వీడియోలు వైరల్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక (Rashmika) జోడీగా నటించిన చిత్రం 'ఛావా'.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన భార్యగా, మహారాణి యేసుబాయిగా రష్మిక మందన్న నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ. 86 కోట్లు రాబట్టింది.1689 సమయంలో మొఘల్ చక్రవర్తి ఔరం గజేబు మరాఠా సామ్రాజ్యంపై దండెత్తిన సమయంలో తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వారు చూపిన ధైర్యసాహసాలను కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ చూసిన ప్రేక్షకుల కంటతడి పెట్టుకుంటున్నారు. చాలా ఎమోషనల్గా తమ అభిప్రాయాన్ని సోషల్మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మూవీ చూసిన వారిలో ఎక్కువ భాగం కన్నీళ్లతోనే బయటకు వస్తున్నారు. థియేటర్లోనే శంభాజీ మహరాజ్ను గుర్తు చేసుకుంటూ కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా ఛావా సినిమాపై భారీగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శంభాజీ మహరాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయిగా రష్మికల నటన పట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. చివరి 40 నిమిషాలు సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లారంటూ మెచ్చుకుంటున్నారు. బుక్మైషోలో రోజుకు 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బాలీవుడ్లో ఎక్కడ చూసిన కూడా హోస్ఫుల్ బోర్డులతో థియేటర్స్ కనిపిస్తున్నాయి.Ek Maratha sherni ka garjan🔥#ChhatrapatiSambhajiMaharaj #Chaava pic.twitter.com/E1249nucNc— Peddoda🔱🚩 (@_peddodu) February 15, 2025Chaava is not just a movie it's an emotion,pain ,our HISTORY It is difficult to watch on screen imagine how much our Raje tolerated n suffered... #Chaava #ChaavaReview pic.twitter.com/Vv5YtD4hX9— Harsha Patel 🇮🇳 (@harshagujaratan) February 15, 2025Just watched #Chaava, a powerful tribute to Sambhaji's bravery & struggle for Hindutva. A must-know chapter in Indian history! Jai Hind! #IndianHistory #Hindutva pic.twitter.com/Cudc1u4t78— Neha Chandra (@nehachandra800) February 15, 2025The most unfortunate thing about being a south indian the I'd not be able to feel these goosebumps in real with all theses doomed circle.of mine 😭 #Chaava #VickyKaushal#HarHarMahadevॐpic.twitter.com/MTNwYkvZkY— AlteredO (@AlteredDrift)When the audience of a film is giving it a standing ovation even after it's ended, then that film doesn't need anyone's review or rating. #Chhaava has won people's hearts. @iamRashmika @vickykaushal09 @MaddockFilms #AkshayKhanna #RashmikaMandanna ❤️ #VickyKaushal ❤️ pic.twitter.com/bqbuN1qWj5— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) February 15, 2025ref_src=twsrc%5Etfw">February 16, 2025 Yesterday when I went to a movie theater there was a poster of Chhava movie and some young boys were taking pictures on that poster when I looked at them they had no slippers on their feet and they were taking pictures. @vickykaushal09 @iamRashmika #chavaa #VickyKaushal #Chhaava pic.twitter.com/PhTXmh7ama— Sumit kharat (@sumitkharat65) February 15, 2025 -
నారి:చిన్మయి నోట స్త్రీ శక్తిని చాటే పాట
ఓ విద్యార్థిని తన టీచర్తో అమ్మాయిలు ఈ సమాజంలో ఎదుర్కొనే కష్టాలు, సమస్యల గురించి చెబుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో 7 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఈ క్లిప్ నారి చిత్రంలోనిదే అని తెలుసుకుని స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి చిత్రయూనిట్ను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టు జస్టిస్ శ్రీమతి రాధారాణి గారు, ఐఏఎస్ పూనం మాలకొండయ్య, ఐపీఎస్ జయచంద్ర గార్ల చేతుల మీదుగా ర్యాప్ సింగర్ సీషోర్ పాడిన ‘ఈడు మగాడేంట్రా బుజ్జి’ పాట 8 మిలియన్ల వ్యూస్తో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్ల మీద శ్రీమతి శశి వంటిపల్లి నిర్మాతగా సూర్య వంటిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘నారి’. ఈ చిత్రంలో ఆమని, వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, కార్తికేయ దేవ్, ప్రగతి, సునయన, ప్రమోదిని, నిత్య శ్రీ, కేదార్ శంకర్, రాజమండ్రి శ్రీదేవీ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.మహిళా దినోత్సవం సందర్భంగా నారి చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం(ఫిబ్రవరి 15 ) సాయంత్రం నారి చిత్రం నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించారు. వినోద్ కుమార్ విన్ను బాణీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మహిళా సాధికారత, స్త్రీ శక్తిని చాటేలా ఈ పాటను ప్రసాద్ సానా రచించారు.పాట విడుదల సందర్భంగా దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు, మహిళల సమస్యల మీద తీస్తున్న చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ఈ చిత్రంలో ఆమని గారి నట విశ్వరూపం చూస్తారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. అందరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుంద’ని అన్నారు.నిర్మాత శశి వంటిపల్లి మాట్లాడుతూ.. ‘షి ఫిల్మ్, హైదరాబాద్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రతీ పురుషుడు తన ఫ్యామిలీనీ తీసుకు వచ్చి ఈ చిత్రాన్ని చూపించాలి. అందరూ చూడాల్సిన చిత్రమిది’ అని అన్నారు. -
SSMB 29: మహేశ్కి జక్కన్న కండీషన్.. నిర్మాతకు రూ. కోటి సేఫ్!
రాజమౌళి(SS Rajamouli )తో సినిమా అంటే నటీనటులు ఎంత ఇష్టపడతారో అంతే భయపడతారు కూడా. ఒక్కసారి ఆయనతో సినిమా కమిట్ అయితే చాలు.. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే జక్కన్న పెట్టే కండీషన్స్ ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు మహేశ్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే షూటింగ్ కూడా ప్రారంభమైంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి… ఖర్చుల దగ్గర జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనవసరపు ఖర్చులు తగ్గించి, ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో జక్కన్న ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెట్లో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేదించారట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని సెట్లోకి అనుమతించట్లేదట. మహేశ్బాబుతో సహా ప్రతి ఒక్కరు ఈ రూల్ని పాటించాల్సిందేనట.నిర్మాతలకు రూ.కోటి వరకు సేఫ్రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్లో రోజుకు దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొంటున్నారట. అంత మందికి వాటర్ బాటిళ్లు అందించడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే సెట్లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేయిస్తున్నారట. దాహం వేస్తే ప్రతి ఒక్కరు దీనితోనే నీళ్లు తాగాలట. పర్సనల్గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండొద్దని చెప్పారట. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడలని చెప్పారట. వీలైనంత వరకు ప్లాస్టిక్ని నిషేదించాలని యూనిట్ని ఆదేశించారట. దీని వల్ల నిర్మాతకు దాదాపు రూ. కోటి వరకు సేఫ్ అవుతుందట. ఈ నిర్ణయం కారణంగా డబ్బు ఆదా అవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని జక్కన్న ప్యామిలీ భావిస్తుందట. ఈ ఆలోచన కీరవాణి సతీమణి వల్లీకి వచ్చిందట. ఆమె చెప్పడంతోనే రాజమౌళి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేదించారట.మహేశ్ సినిమాకు టైటిల్ కష్టాలు..మహేశ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తాను మహేశ్తో సినిమా చేస్తున్నానని రాజమౌళి ప్రకటించినప్పటికీ.. కథ అప్పటికీ ఫిక్స్ కాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజైన కొద్ది రోజులకి ఈ కథపై దృష్టి పెట్టాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం జక్కన్నకు ఇంకా క్లారిటీ రాలేదట. గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినా... ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం షూటింగ్ చేస్తూనే టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది జక్కన్న టీమ్. టైటిల్ పెట్టే వరకు మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించొద్దని రాజమౌళి ఆదేశించారట. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ని ప్రారంభించారు. టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత చిన్న టీజర్ని రిలీజ్ చేస్తూ టైటిల్ని వెల్లడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. -
ఆరేళ్ల వయసు నుంచే ఆ పని చేస్తున్నా: అమల
ఆరేళ్ల వయసు నుంచి జంతువుల సంక్షేమంలో నా ప్రయాణం ప్రారంభమైందని జంతు ప్రేమికురాలు, సినీ నటి అమల (Amala Akkineni) పేర్కొన్నారు. యానిమల్ ఛారిటీ హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా మిషన్ పేరును హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్గా మార్చారు. దీనికి సంబంధించిన కొత్త పేరు, లోగోలను నగరంలోని ఓ హోటల్లో శనివారం ఆమె ఆవిష్కరించారు. అదే లక్ష్యంగా పని చేస్తున్నా..అనంతరం అమల మాట్లాడుతూ.. జంతువుల బాధలను అంతం చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానన్నారు. విద్యార్థులు సైతం మాతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. సర్కస్లో వన్యప్రాణులను నిలుపుదల చేయడం నుంచి జంతువులపై ప్రయోగాలు నిర్వహించే ప్రయోగశాలల వరకు అందరితో మాట్లాడామన్నారు. నా జీవితానికి విలువ లేదుప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులంతా కలిసి చేసే పనులు, తీసుకు వస్తున్న మార్పులే లేకుంటే నా జీవితానికి విలువ లేదన్నారు. జంతువులు, ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ మనల్ని ఒకచోటకు చేరుస్తుందని పేర్కొన్నారు. అన్ని రకాల జంతువుల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జంతువుల పట్ల మానవత్వం చూపే సంప్రదాయం రావాలని ఆకాంక్షించారు.హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ సంస్థ చేస్తున్న అద్భుతమైన కృషికి ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ అధ్యక్షులు, సీఈవో కిట్టి బ్లాక్, పలువురు సంస్థ ప్రతినిధులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. చదవండి: 48 ఏళ్ల వయసులో నటుడి రెండో పెళ్లి.. వయసుతో సంబంధం లేదంటూ -
ఈ స్టార్ హీరోల రెస్టారెంట్స్, పబ్స్ గురించి తెలుసా..?
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న వ్యాపారరంగంలోకి కంగనా రనౌత్ అడుగుపెట్టారు. సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న ఆమె హిమాచల్లోని మనాలిలో కేఫ్ను ప్రారంభించారు. హిమాలయాల నడిబొడ్డున ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో ఒక సుందరమైన రెస్టారెంట్ను ప్రారంభించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, హైదరాబాద్ వేదికగా కొందరు సినీ సెలబ్రిటీలు పలు రెస్టారెంట్స్లను ప్రారంభించారు. విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు.బంజారా హిల్స్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 'AN రెస్టారెంట్'తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ డిసెంబర్ 8, 2022న AN రెస్టారెంట్ని బంజారా హిల్స్లో ప్రారంభించారు. మినర్వా, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి వారు దీనిని ప్రారంభించారు. రెస్టారెంట్లో అద్భుతమైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సర్వీస్తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీగానే మెనూ లిస్ట్ ఉంటుంది. ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చేలా ఇక్కడి ఫుడ్ ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వన్–8 కమ్యూన్గత ఏడాదిలో హైదరాబాద్లోని హైటెక్ సిటీకి దగ్గరలో వన్–8 కమ్యూన్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ను కోహ్లీ, అనుష్క శర్మ ప్రారంభించారు. హైదరాబాద్కు ఉన్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో చాలామంది చిల్ అవుతున్నారు. ఫుడ్ లవర్స్తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్గా మారింది. కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరంభం'గచ్చిబౌలి 'ఎఫ్ 45' పేరుతో జిమ్ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ .. జూబ్లీహిల్స్లో కూడా ఓ బ్రాంచ్ మొదలు పెట్టి లీజ్కు ఇచ్చేసింది. అయితే, ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంలో, నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని మాదాపూర్ వద్ద 'ఆరంభం' పేరుతో ఒక రెస్టారెంట్ను ఓపెన్ చేశారు. Curefoods భాగస్వామ్యంతో, సాంప్రదాయ భారతీయ వంటకాల డొమైన్లో మిల్లెట్-ఎయిడెడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి ఆమె ఈ వెంచర్ను ప్రారంభించారు. మిల్లెట్ను భారతీయ ఆహారంలో ప్రధాన భాగం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ చొరవ తీసుకున్నట్లు ఆమె చెప్పారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు ఆమె రెస్టారెంట్పై ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్ హైలైఫ్పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్నారు. అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు ఉన్న హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే వింటారు. హైలైఫ్ పేరుతో 2016లోనే జూబ్లీహిల్స్లో ఈ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ M కిచెన్, నిర్మాత కేదార్ సెలగంశెట్టితో కలిసి రన్ చేస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోబఫెలో వైల్డ్ వింగ్స్ (B-డబ్స్) అనే అమెరికన్ రెస్టారెంట్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ రెండూ కూడా హైదరాబాద్లోని పార్టీలకు స్వర్గధామంగా మారాయి. మీరు ఏదైనా సందర్బంలో పార్టీ కోసం వెతుకుతున్నట్లయితే, హైలైఫ్ మీకు సరైన స్థలమని చెప్పవచ్చు.అక్కినేని నాగార్జున యొక్క 'N గ్రిల్, N ఏషియన్'టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు కూడా హైదరాబాద్లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద N గ్రిల్ పేరుతో ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంది. 2014లో ఎంటర్ప్రెన్యూర్ ప్రీతం రెడ్డి సహకారంతో ఆయన దీనిని ప్రారంభించారు. ఇది ఆధునిక గ్రిల్ హౌస్గా గుర్తింపు ఉంది. దీంతో పాటు జూబ్లీ హిల్స్లో కూడా ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్ని కూడా నాగ్ ఏర్పాటు చేయడం విశేషం. రెండు రెస్టారెంట్లు భారతీయ, ఇటాలియన్, పాన్ ఆసియన్తో పాటు మెడిటరేనియన్ వంటకాలను అందించే విభిన్న మెనూకు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్లో ప్రీమియం డైనింగ్ అనుభవం కోసం వెతుకుతున్న ఆహార ప్రియుల కోసం ఈ ప్రదేశాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నాగ చైతన్య 'షోయూ'ఫుడ్ బిజినెస్లోకి 2022లోనే నాగచైతన్య ఎంట్రీ ఇచ్చేశాడు. 'షోయూ' పేరుతో జూబ్లీహిల్స్ ప్రాంతలో ఓ సరికొత్త రెస్టారెంట్ను ఆయన ఓపెన్ చేశాడు. అక్కడ అనేక రకాల పాన్-ఆసియన్ వంటకాలు దొరుకుతాయి. క్లౌడ్ కిచెన్గా తన వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆహారప్రియులకు తమ వంటకాలను అందిస్తుంది. రుచికరమైన జపనీస్ మీల్స్ అక్కడి ప్రత్యేకత. బ్రాండ్ స్థిరమైన ప్యాకేజింగ్ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన విధానాన్ని అవలంబిస్తుంది, క్లయింట్లు పర్యావరణ ప్రయోజనకరమైన భోజన అనుభవాన్ని కలిగి ఉండేలా రెస్టారెంట్ యాజమాన్యం చూస్తుంది.నవదీప్- BPM పబ్హీరో నవదీప్ కూడా చాలా రోజుల క్రితమే ఒక పబ్ను ప్రారంభించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ వ్యాపారంలో ఆయన రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బీట్స్ పర్ మినిట్ అకా BPM పబ్ను నవదీప్ నడుపుతున్నాడు. చాలామంది సెలబ్రిటీలు అక్కడకు వెళ్తూ ఉంటారు. -
Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ?
ఛావా(Chhaava )..ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. విక్కీ కౌశల్, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్లో రిలీజై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.31 కోట్లు ఓపెనింగ్స్ని రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.భారీ ధరకు ఓటీటీ రైట్స్ఛావా చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. యావరేజ్ టాక్ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ని పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణం మరాఠా సామ్రాజ్యంపై మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) కన్నేస్తాడు. వారిని ఎదుర్కొని తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్). ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి తానే స్వయంగా సైన్యంతో యుద్ధానికి బయల్దేరుతాడు. శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి ఏసుభాయి(రష్మిక) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాటంతో ఎలా అణచివేశాడు? అనేది ఈ సినిమా కథ. -
రోడ్డు ప్రమాదంలో స్టార్ నటుడు మృతి అంటూ ప్రచారం
చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్గా రాణిస్తున్న యోగిబాబు రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కొంత సమయం క్రితం సోషల్మీడియా ద్వారా ఒక పోస్ట్ ద్వారా ఆయన వివరణ ఇచ్చారు. యోగిబాబు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కల్పిత వార్తల పట్ల తాను చింతిస్తున్నట్లు యోగిబాబు తెలిపారు.చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు యోగిబాబు మరణించారని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే నెట్టింట ట్రెండ్ అయిపోయింది. దీంతో యోగి బాబు తన ఎక్స్ పేజీలో వివరణ ఇస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. 'నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కానీ, ఆ కారులో ఉన్నది నేను కాదు. కనీసం నా సహాయకుడు కూడా ఆ కారులో ప్రయాణించలేదు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుపుతున్నాను. తప్పుడు వార్తల వల్ల నా స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు, పత్రికాధిపతులు వంటి అనేకమంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. నా క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. నా పట్ల వారు చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.' అని ఆయన తెలిపారు.Im fine all. This is false news pic.twitter.com/EwO3MB3T2Q— Yogi Babu (@iYogiBabu) February 16, 2025 -
వేసవిలో ధనుష్ ‘ఇడ్లీ కొట్టు ’
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు). ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ– ‘‘రాయన్’ మూవీ తర్వాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఇడ్లీ కడై’పై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ధనుష్కి ఇది నటుడిగా యాభై రెండో చిత్రం, అలాగే ఆయన దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా. ఈ మూవీకి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ‘విడుదల 2’ చిత్రాన్ని ఇటీవల మా బ్యానర్లో తెలుగులో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది’’ అని తెలిపారు. -
మరో ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మాలీవుడ్ స్టార్ ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన చిత్రం మార్కో(Marco Movie). మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్ను షేర్ చేసింది. అయితే ఆహాలో కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే ఓవర్సీస్ అభిమానులకు మాత్రం ఈనెల 18 నుంచే స్ట్రీమింగ్ కానుంది. కాగా.. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.మార్కో కథేంంటంటే?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.Get ready to experience the most violent and biggest film on Aha! #Marco storms in with action like never before. Streaming from Feb 21 only in Telugu, on Aha!Overseas streaming from Feb 18 ! pic.twitter.com/uHFHr7zH6f— ahavideoin (@ahavideoIN) February 16, 2025 -
తెలుగువారికి గొప్ప బహుమతిని అందించారు: మంచు విష్ణు
సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి మరణం పట్ల మా అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాలో ఒక చిరు దీపం వెలిగించిన లెజెండరీ కృష్ణవేణి.. నందమూరి తారక రామారావును బిగ్ స్క్రీన్కి పరిచయం చేసి మన ఇండస్ట్రీకి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయన్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని మంచు విష్ణు పోస్ట్ చేశారు.కాగా.. కృష్ణవేణి సినిమాల్లోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేశారు. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు. కృష్ణవేణికి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్యతో వివాహం జరిగింది. కేవలం నటిగానే కాదు.. తానే స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. 1957లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గానూ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. ఆమె భర్త స్థాపించిన సంస్థ జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్నారు.కృష్ణవేణి నిర్మించిన సినిమాలుమన దేశం (1949)లక్ష్మమ్మ (1950)దాంపత్యం (1957)గొల్లభామ (1947)భక్త ప్రహ్లాద (1042) Telugu cinema lo oka chiru deepam veliginchina Legendary Krishnaveni Garu kalasina tidhi 🙏. Aame parishrama tho Nandamuri Taraka Rama Rao Garu ni big screen ki introduce chesi, mana industry ki oka amulya mayina gift icharu. Aame gnapakalu eppudu mana hrudayallo undipothayi.… pic.twitter.com/dYYqz6nmxK— Vishnu Manchu (@iVishnuManchu) February 16, 2025 -
నిరీక్షణకు తెరపడింది.. డాకు మహారాజ్ ఓటీటీ డేట్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గతంలోనే ఓటీటీకి వస్తుందని భావించినా అది జరగలేదు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈనెల 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. దీంతో ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.డాకు మాహారాజ్ కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025