breaking news
Tollywood
-
ఆ పరిచయంతో...
హీరోయిన్ సాయిపల్లవి హిందీలో నటించిన తొలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్స్టోరీ చిత్రం ‘మేరే రహో’. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, అమ్మాయి ఓ రోజు విచిత్రకరమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు.ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అన్న కోణంలో ఈ ‘మేరే రహో’ సాగుతుందని బాలీవుడ్ సమాచారం. తొలుత ఈ సినిమాకు ‘ఏక్ దిన్’ అనే టైటిల్ అనుకున్నారు. నవంబరులో రిలీజ్ ప్లాన్ చేశారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా కాకుండా హిందీలో ‘రామాయణ’ సినిమాలో సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. -
స్టంట్ స్టార్ట్
కమల్హాసన్ కొత్త చిత్రం ప్రారంభమైంది. కమల్హాసన్ కెరీర్లోని ఈ 237వ సినిమాతో ‘కేజీఎఫ్, ఖైదీ, అమరన్, కల్కి 2898 ఏడీ’ వంటి సూపర్హిట్ సినిమాలకు పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు–అరివు ద్వయం దర్శకులుగా పరిచయం అవుతున్నారు. 2024 ప్రారంభంలోనే ఈ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సెట్స్కు వెళ్లలేదు.కాగా ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయని, ‘ప్రేమలు, రైఫిల్క్లబ్’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్గా పని చేసిన శ్యామ్ పుస్కరన్ ఈ సినిమాకు అసోసియేట్ అయ్యారని చిత్రయూనిట్ శుక్రవారం అధికారికంగా పేర్కొంది. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే... ఫైట్ మాస్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం యాక్షన్ ప్రాధాన్యంగా ఉంటుందని, కమల్ రిస్కీ స్టంట్స్ చేయనున్నారని కోలీవుడ్ టాక్. -
'పవన్ కల్యాణ్ అభిమాని చీప్ కామెంట్స్'.. గట్టిగా ఇచ్చిపడేసిన రేణు దేశాయ్!
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఆమె చివరిసారిగా మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటోంది. ముఖ్యంగా వన్యప్రాణుల విషయంలో పోరాటం చేస్తోంది. అలాగే మూగజీవాలను ఎవరైనా హింసించినా వెంటనే సోషల్ మీడియా రియాక్ట్ అవుతుంది రేణు దేశాయ్.ఇదిలా ఉంచితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్గా మారింది. పవన్ కల్యాణ్ అభిమాని కామెంట్ చూసిన రేణు దేశాయ్.. తనదైన స్టైల్లో ఇచ్చిపడేసింది. మీ పక్కన పవన్ కల్యాణ్ కాకుండా మరొకరిని ఊహించుకోలేమని అభిమాని ఇన్స్టాలో కామెంట్ చేశాడు. ఇది చూసిన రేణు దేశాయ్ సుదీర్ఘమైన పోస్ట్తో దిమ్మదిరిగేలా రిప్లై ఇచ్చింది. రేణు దేశాయ్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఈ అబ్బాయి/అమ్మాయి కొంతవరకు చదువుకున్న వారిలా ఉన్నారు. అందుకే స్మార్ట్ఫోన్లో సొంత ఇమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుని.. తన పోస్ట్పై కామెంట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినట్లున్నాడు. మనమందరం ఇప్పుడు 2025లో ఉన్నాం. కానీ పితృస్వామ్యం ఎంతగా పాతుకుపోయిందంటే.. నేటికీ చాలా మంది ప్రజలు ఆమెకు స్వంత స్వేచ్ఛా సంకల్పం లేకుండా స్త్రీ కేవలం తండ్రి లేదా భర్త ఆస్తి అని నమ్ముతారు. . నేటికీ మహిళలకు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అనుమతి అవసరం. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు స్త్రీ స్థానం వంట చేయడం, పిల్లలకు జన్మనివ్వడం వంటగదికే పరిమితమని భావిస్తారని' కౌంటరిచ్చింది.రేణు దేశాయ్ ఇంకా రాస్తూ.. 'నేను ఇలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా.. నా స్వరం వినిపించడానికి.. నా స్నేహితులు, అనుచరులు నా గురించి ఏమనుకుంటారో అని భయపడకుండా ఉండటానికి ఇష్టపడతాను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పులకు మార్గం సుగమం చేయడానికి ఒక స్త్రీగా, ఒక ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తున్నా. స్త్రీవాదం అంటే వారాంతాల్లో తాగి తిరగడం కాదు.. మహిళలను పశువులు, ఫర్నిచర్లా చూసే ప్రాథమిక మనస్తత్వం ఉన్న మూలాలను ప్రశ్నించడం! రాబోయే కొద్ది తరాల్లోనే స్త్రీలు విశ్వంలో తమదైన ఉన్నత స్థానాన్ని కనుగొంటారని.. తల్లి గర్భంలో స్త్రీగా పుట్టినందుకు, పరువు హత్యలు, వరకట్న మరణాల కోసం చంపబడరని ఆశిస్తున్నా' అని తనపై కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ అభిమానికి ఘాటుగానే ఇచ్చిపడేసింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.. ఆత్మకథ ఆవిష్కరణలో బ్రహ్మనందం
టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ బయోగ్రఫీని బుక్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మీ అండ్ మై పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పుస్తకం రాసేందుకు ఎందరో నాకు స్పూర్తినిచ్చారని అన్నారు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని.. లెక్చరర్గా పనిచేశాకే.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. నటరాజ ఆశీర్వాదంతో 1200 సినిమాల్లో నటించానని వెల్లడించారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..' నేనెందుకు ఆత్మకథ రాశాను అనేది పెద్ద ప్రశ్న. నాకు ఎటువంటి పొలిటికల్, ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశా. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. బురద నుంచి కమలం పుడుతుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. నాకు వెంకయ్య నాయుడు ఎంతో స్పూర్తి. ఈ మధ్య గ్లోబల్ కమెడియన్ అవార్డ్ ఇచ్చారు. మీమ్స్ బాయ్గా కూడా మార్చారని' అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..' యువకుడిగా ఉన్నపుడు రాజకీయాల్లోకి వచ్చా. నాకు మీడియాతో ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రహ్మానందం జీవిత చరిత్ర పుస్తకం హిందీ, ఇంగ్లీష్లో విడుదలైంది. భారత దేశ చలనచిత్రలో ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం. స్క్రీన్పై ఆయన కనిపిస్తే అందరూ ఆనంద పడేస్తారు. ఎప్పటికీ అందరికీ బ్రహ్మానందం ఫేవరేట్. ఆయన సినిమాలు చూస్తే జనం ఎంజాయ్ చేస్తారు. ఇండియన్ స్క్రీన్ ప్రతిఒక్కరూ మాతృ భాషను నేర్చుకోవాలి, ఆదరించాలి, దాంతో పాటూ ఇతర భాషలు నేర్చుకోవాలి. దేశంలో ఎక్కువ మందికి చేరువ కావాలంటే హిందీ భాష అవసరం. ప్రపంచవ్యాప్తంగా చేరువ కావాలంటే ఇంగ్లీష్ అవసరం. భారత అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు తట్టుకోలేక పోతున్నాయి. ప్రపంచంలో రెండో ఆర్థిక దేశంగా 2035 నాటికి ఇండియా ఎదగటం ఖాయం' అని అన్నారు. Pleased to launch the autobiography of renowned film comedian & Padmashri awardee, Shri Brahmanandam Me and मैं in English & Hindi at the Foreign Correspondents Club of South Asia in New Delhi this evening. Shri Brahmanandam’s long career in movies spanning more than 3 decades… pic.twitter.com/xrf1y7mqpn— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 12, 2025 -
'పరదా' పవర్ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమక్ష ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే, ఈ మూవీలో ప్రేక్షకులను మెప్పించిన ఒక వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేశారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' అంటూ సాగే ఈ పాట ఆందరినీ ఆలోచింపజేస్తుంది. వనమాలి రిచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. -
'మిరాయ్' స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్.. చాలా తక్కువే
తేజ సజ్జా (Teja Sajja), మంచు మనోజ్ (Manchu Manoj) కాంబినేషన్లో తాజాగా విడుదలైన చిత్రం మిరాయ్... కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మిరాయ్లో ఈ మూడు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా బాగుందని ఇప్పటికే సోషల్మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇందులోని విజువల్స్ ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. అయితే, మిరాయ్ కోసం తేజ సజ్జా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది..? అనే చర్చ జరుగుతుంది.సినిమా హిట్ అయితే.. రెమ్యునరేషన్పై తేజమిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కోసం రూ. 60 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ ఔట్ పుట్ చూస్తే మాత్రం సుమారు. 200 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉంటారనిపించేలా ఉంటుంది. అందరూ మిరాయ్ కోసం తేజ సజ్జా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని భావించినా, వాస్తవం కొంచెం భిన్నంగా ఉన్నట్లు సమాచారం. తేజా స్వయంగా చెప్పిన ప్రకారం, హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్నే మిరాయ్కు కూడా తీసుకున్నానని ఒక వేదికపై చెప్పారు. అయితే, ప్రొడ్యూసర్ మీద తనకున్న నమ్మకం వల్ల, సినిమా హిట్ అయితే మంచి అమౌంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అది కేవలం నిర్మాత ఇష్ట ప్రకారంగా తీసుకునే నిర్ణయం మాత్రమేనని అన్నారు. హనుమాన్ హిట్ అయిన తర్వాత కూడా తాను ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడగలేదన్నారు. ఆ సినిమా నిర్మాతల నుంచి కూడా తనకు రెమ్యునరేషన్ మించి ఒక్క రూపాయి కూడా అదనంగా అందలేదని సమాచారం. మనోజ్కే ఎక్కువ రెమ్యునరేషన్హనుమాన్ కోసం తేజ సజ్జా రూ. 2 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతంలో తేజ చెప్పిన ప్రకారం మిరాయ్ సినిమాకు కూడా రూ. 2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు అర్థం అవుతుంది. అయితే, ఇకనుంచి ఆయన నటించనున్న కొత్త సినిమాలకు సుమారు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్.. హనుమాన్ సినిమా కంటే ముందే మిరాయ్తో తేజ సజ్జా ఒప్పందం చేసుకున్నారు. కానీ, తనకు కథ నచ్చితే రెమ్యునరేషన్ పెంచబోనని కూడా తేజ చెప్పడం విశేషం. మంచు మనోజ్ కూడా మిరాయ్ సినిమా కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రియ మాత్రం రూ. 2 కోట్ల వరకు అందుకున్నారని టాక్.. అయితే, ఇందులో హీరోయిన్గా అద్భుతంగా మెప్పించిన రితిక నాయక్ మాత్రం రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం ఉంది. -
బాహుబలి తర్వాత ఈ సినిమానే: రాం గోపాల్ వర్మ ట్వీట్
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025 -
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్.. స్పందించిన రష్మిక!
టాలీవుడ్లో కొన్నేళ్లుగా ఈ జంటపై రూమర్స్ ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఎక్కడా కనిపించినా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు కథనాలొచ్చాయి. ఇంతకీ ఆ జంట ఎవరని అనుకుంటున్నారా? టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ లవ్ బర్డ్స్గా పేరున్న రష్మిక, విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మాత్రమే వచ్చాయి. వీటిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.అయితే ఈ సారి ఏకంగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని కథనాలొచ్చాయి. ఇటీవల సైమా అవార్డుల వేడుకలకు హాజరైన రష్మిక చేతికి ఉంగరం కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో హీరోయిన్ రష్మిక తన చేతి వేలి ఉంగరంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం నా సెంటిమెంట్ ఉంగరమని.. తాను నిశ్చితార్థం చేసుకుంటే అందరికీ చెప్తానని తెలిపింది. కాగా.. ఈ ఏడాది ఛావా, కుబేర సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. -
సొంత ఇళ్లు వాళ్లకు ఇచ్చేసి అద్దె ఇంట్లోకి రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ తన సినీ జీవితం కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ట్రస్ట్ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సహాయం, విద్యా సహాయం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. అనాథ పిల్లలకు ఆశ్రయ, ఆహారం, విద్య, సంరక్షణ వంటి విషయంలో ఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా రాఘవ లారెన్స్ సోషల్మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. 'మీ అందరితో కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. నా సినిమా కాంచన- 4 అధికారికంగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మీలో చాలా మందికి తెలిసినట్లుగా.., నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ నేను ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిసిందే. ఈ క్రమంలోనే నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం ప్రకటించడానికి నేను నిజంగా సంతోషస్తున్నాను.ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత, నేను దానిని అనాథాశ్రమ పిల్లల కోసం గృహంగా మార్చాను. ఆ సమయంలో కుటుంబంతో నేను అద్దె ఇంటిలోకి మారాను. ప్రస్తుతం నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను ప్రారంభిస్తున్న ఉచిత పాఠశాలలో మొదటి ఉపాధ్యాయులు కూడా నా ఇంట్లో పెరిగిన బిడ్డే కావడం విశేషం. నేను చేరదీసిన బిడ్డ ఇప్పుడు చదువుకుని తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఈ విషయం నాకు మరింత సంతోషంగా, గర్వంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.Kanchana 4 is rolling and halfway through — I’m Happy to Announce That I’m Transforming My First Home into a Free School for Children with my Kanchana 4 Advance - with the First Teacher Being a Child Who Grew Up in my home 🙏 I’m so delighted to share some exciting news with… pic.twitter.com/qvcCYQruGE— Raghava Lawrence (@offl_Lawrence) September 11, 2025 -
విరామం ఇస్తున్నాను.. అనుష్క ట్వీట్ వైరల్
హీరోయిన్ ప్రాధాన్య చిత్రాల విషయంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ట్రెండ్ సెట్ చేశారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటేడ్ కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా స్టోరీ ప్రేక్షకులను థియేటర్కు రప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఆమె ఒక నోట్ రాసి ట్వీట్ చేశారు.కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు.. సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నాను. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మరిన్న కథలతో ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు.క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. మూవీ బాగాలేదని విమర్శలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి నటనను మాత్రం అందరూ ప్రశంసించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాత్ర గురించి కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టిని, మీరు ఇంకా ఏదైనా పాత్ర చేయాలనుకుంటున్నారా అని మీడియా వారు అడిగారు. దీనికి నటి, "నేను పూర్తిగా ప్రతికూల పాత్రను చేయాలనుకుంటున్నాను. బలమైన పాత్ర వస్తే, నేను ఖచ్చితంగా ప్రతికూల పాత్రను చేస్తాను" అని చెప్పారు.Love.... always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025 -
ఏడాదిన్నర గ్యాప్.. ఇప్పుడేమో చేతిలో 8 సినిమాలు
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా చాలా తక్కువగానే సినిమాలు చేస్తున్నారు. ఉన్నంతలో రష్మిక పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె కంటే బిజీగా ఉన్న మరో బ్యూటీ ఉంది. ఆమెనే మలయాళ బ్యూటీ సంయుక్త. దాదాపు ఏడాదిన్నరగా ఈమె నుంచి కొత్త మూవీ అప్డేట్ అనేదే లేదు. అలాంటిది ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 8 మూవీస్ ఉండటం విశేషం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?2016 నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త.. 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్లోకి వచ్చింది. దీని తర్వాత బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరస హిట్స్ అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే 2023లో ఈమె హీరోయిన్గా చేసిన 'డెవిల్' ఫ్లాప్ అయింది. గతేడాది ఓ తెలుగు మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. అప్పటినుంచి ఈమె నుంచి రిలీజులు ఏం లేవు. తీరా ఇప్పుడు చూస్తే ఎనిమిది చిత్రాలు లైన్లో ఉన్నాయి.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం)సంయుక్త చేస్తున్న వాటిలో బాలకృష్ణ 'అఖండ 2', పూరీ-విజయ్ సేతుపతి సినిమా, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ', బెల్లంకొండ శ్రీనివాస్ 'హైందవ', నిఖిల్ 'స్వయంభు', లారెన్స్ 'బెంజ్', మహారాణి అనే హిందీ చిత్రం, తెలుగులో ఓ ఫిమేల్ సెంట్రిక్ చిత్రం ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. వీటిలో 'అఖండ 2'.. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ కూడా దాదాపు వచ్చే ఏడాది, ఆపై ఏడాది థియేటర్లలోకి రానున్నాయి.సంయుక్త ప్రస్తుతం చేస్తున్న వాటిలో పూరీ-విజయ్ సేతుపతి, అఖండ 2, స్వయంభు.. పాన్ ఇండియా టార్గెట్గా తీస్తున్న మిగిలినవన్నీ కూడా ఆయా భాషల్లో తీస్తున్నారు. మరి వీటి వల్ల సంయుక్త కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా? హీరోయిన్గా నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ) -
‘మిరాయ్’ మూవీ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ఈ కుర్ర హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్డమ్ని నిలబెట్టుకోవాలంటే.. తేజకి ఇంకో హిట్ కచ్చితంగా కావాలి. అందుకే వెంటనే సినిమా చేయకుండా.. కాస్త సమయం తీసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మిరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తేజా సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ కథ అశోకుడి పాలన(క్రీ.పూ.232)లో ప్రారంభమై.. ప్రస్తుత కాలంలో సాగుతుంది. కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్ ఆశోకుడు పశ్చాత్తాపానికి లోనై.. తనలో దాగి ఉన్న దివ్య శక్తిని 9 గ్రంథాలలోకి ఇముడింపజేస్తాడు. ఒక్కో గ్రంథంలో ఒక్కో శక్తి ఉంటుంది. వాటికి తరతరాలుగా 9 మంది యోధులు రక్షకుల ఉంటారు. మహావీర్ లామా(మంచు మనోజ్) వాటిని చేజిక్కుంచుకుని దివ్య శక్తిలను పొంది.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తాడు. తనకున్న తాంత్రిక శక్తుల బలంతో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. తొమ్మిదో గ్రంథం అంభిక(శ్రియా శరన్) రక్షణలో ఉంటుంది. మహావీర్ కుట్రను ముందే పసిగట్టిన అంభిక.. తొమ్మిదో గ్రంథం రక్షణ కోసం తన కొడుకు వేద(తేజ సజ్జా)ను తయారు చేస్తుంది. అనాథగా పెరిగిన వేదకు విభా(రితిక నాయక్) దిశానిర్దేశం చేస్తుంది. మహావీర్ని ఆడ్డుకునే శక్తి ‘మిరాయ్’ ఆయుధంలో ఉందని వేదకు తెలిసేలా చేస్తుంది. మరి మిరాయ్ ఆయుధం కోసం వేద ఏం చేశాడు? ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? హిమాలయాల్లో ఉన్న ఆగస్త్య(జయరాం) అతనికి ఎలాంటి సహాయం చేశాడు. చివరకు ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ చేతికి వెళ్లిందా లేదా? మహావీర్ నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాణాలు, ఇతీహాసాల్లోని కథలను తీసుకొని, దానికి కాస్త ఫిక్షన్ జోడించి సినిమా చేయడం..ఈ మధ్య టాలీవుడ్లోనూ ట్రెండింగ్గా మారింది. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే ‘మిరాయ్’. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ని తీసుకొని.. ఒకవేళ ఆ గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నిస్తే.. మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. కథగా చూస్తే.. ఇది మరీ అంత కొత్తదేమి కాదు. హను-మాన్, కార్తీకేయ 2 తో పాటు హాలీవుడ్లోనూ ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, విజువల్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉన్నాయి. కార్తీకేయ 2లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే.. మిరాయ్లో శ్రీరాముడి కోదండం కోసం వెతుకుతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నిశాలు స్క్రీన్పై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్. అలాగే సెకండాఫ్లో కూడా ఒకటి, రెండు సీన్లు అదిరిపోయాయి. రాముడి ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే... సెకండాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ట్రైన్ ఎపిసోడ్, శ్రీరాముడి ఎపిసోడ్ .. ఆ సాగదీతను మరిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా ‘మిరాయ్’ మాత్రం థియేటర్స్లో చూడాల్సిన విజువల్ వండర్. ఎవరెలా చేశారంటే.. వేద పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఇదే తరహాలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పోతే మాత్రం..తేజ రేంజ్ ఊహించని స్థాయికి వెళ్తుంది. ఇక మంచు మనోజ్ విలనిజం అద్భుతంగా పండించాడు. తేజ సజ్జ కంటే మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి. మహావీర్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. శ్రీయకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. వేద తల్లి అంభిక పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. ఆగస్త్య పాత్రలో జయరాం చక్కగా నటించాడు. రితికా నాయక్, జగపతి బాబు, వెంకటేశ్ మహా, తిరుమల కిశోర్, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గౌర హరి నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా సంపాతి పక్షి ఎపిసోడ్, రాముడి ఎపిసోడ్కి ఇచ్చిన బీజీఎం గూస్బంప్స్ తెప్పిస్తాయి. దర్శకుడిగానే కాకుంగా సినిమాటోగ్రాఫర్గాను కార్తీక్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్గా ఉంది. ఇక వీఎఫెక్స్ పని తీరు గురించి ముఖ్యంగా చెప్పుకొవాలి. వందల కోట్ల పెట్టి తీసిన సినిమాల్లోనూ గ్రాఫిక్స్ పేలవంగా ఉంటుంది. కానీ రూ. 60 కోట్ల బడ్జెట్లో ఈ స్థాయి ఔట్ పుల్ తీసుకురావడం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఇన్నాళ్లూ భరణి, ఇమ్మాన్యుయేల్ మగాళ్లనుకున్నా.. అంతమాటన్నాడేంటి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీశ్ ఇప్పుడదే చేశాడు. హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. సంచాలక్ మర్యాద మనీష్ వల్ల ఈ టాస్క్ గందరగోళంగా మారింది. ఫైనల్గా ఈ గేమ్లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.భరణి, ఇమ్మాన్యుయేల్.. ఆడవాళ్లు!అయితే తాజా ప్రోమోలో హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్ చేశాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. బాడీ షేమింగ్ చేసినట్లు ఎపిసోడ్లో క్లిప్ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్ చేతిలో పవన్ కల్యాణ్కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్, మనీష్లకు కూడా క్లాస్ పడేట్లు కనిపిస్తోంది. చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం
రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాల్లో కచ్చితంగా డివోషనల్ ఎలిమెంట్స్ లేదా క్లైమాక్స్లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ వరకు కొన్నింటిని దాస్తుంటే మరికొన్నింటిని మాత్రం ముందే రివీల్ చేస్తున్నారు. కానీ తాజాగా థియేటర్లలో రిలీజైన 'మిరాయ్'లో మాత్రం ప్రభాస్ నటించాడనే రూమర్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఓ ఫొటో కూడా సర్కూలేట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన సినిమా 'మిరాయ్'. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్తోనే తీశారు. మంచు మనోజ్ విలన్ కాగా.. ఇందులో రాముడి రిఫరెన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేసుంటారా అని అందరూ మాట్లాడుకున్నారు. అలానే నిన్న రాత్రి తేజ్ సజ్జా.. సినిమాలో ప్రభాస్ సర్ప్రైజ్ కూడా ఉందని ట్వీట్ చేశాడు. దీంతో ఏంటా సంగతి అనుకున్నారు.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)అయితే సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్.. ప్రభాస్తో చెప్పించారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రభాస్ని రాముడిగా ఎడిట్ చేసి థియేటర్ స్క్రీన్పై ఆ బొమ్మని పెట్టేశారు. దీంతో చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇదో ఎడిటెడ్ ఫొటో. 'మిరాయ్' చిత్రం కోసం ప్రభాస్.. తన గొంతు మాత్రమే ఇచ్చాడు. ఇదే నిర్మాణ సంస్థ 'రాజాసాబ్' తీస్తుంది.ప్రస్తుతం 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. కానీ తొలిరోజు వచ్చే టాక్ కాదు, ఒకటి రెండు రోజుల తర్వాత అసలు టాక్ వస్తుంది. అప్పుడు సినిమా రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
ఆ హీరోతో కలిసి పనిచేసినందుకు హ్యాపీ: లావణ్య త్రిపాఠి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రెండు రోజుల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందారు. ఉత్రరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఈమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం టన్నెల్ నేడు (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వారం వాయిదా పడింది. ఈ నెల 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. టన్నెల్ చిత్రం చూసినవారందరూ నా నటనను ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సంతోషంగా ఉందిచిత్ర ప్రథమార్థం రొమాంటిక్ సంఘటనలతోనూ, రెండవ భాగం ఎమోషనన్స్ అంశాలతో ఉంటుందని చెప్పారు. సినిమాలో తన పాత్ర సాధారణంగా కాకుండా కథకు కీలకంగా ఉంటుందన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రవీంద్ర మాధవకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో అంకిత భావంతో పని చేసే హీరో అధర్వతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కెరీర్లావణ్య త్రిపాఠి 2012లో అందాల రాక్షసి చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత బ్రహ్మ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగులోనే వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్లో బిజీ అయ్యారు. కాగా 2017లో మాయాన్ అనే తమిళ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు టన్నెల్ అనే తమిళ చిత్రంలో నటించారు. తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అన్నై ఫిలిమ్ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎం.జాన్ పీటర్ నిర్మించారు. రవీంద్ర మాదవ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Annai Film Production (@annaifilmproductionofficial)చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లుబిగ్బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్గా నిలబడేవారని బిగ్బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్కు భరణి, సంజనకు శ్రీజ, పవన్కు ప్రియ, హరీశ్కు పవన్ కల్యాణ్ సపోర్ట్గా వచ్చారు.సంచాలక్గా మర్యాద మనీష్వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమ్మాన్యుయేల్ను ఎలిమినేట్ చేసిన సంచాలక్శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్గా ఫెయిల్ఇమ్మూ ఆవేశంతో సంచాలక్గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్ఫెయిర్ అంటూ అని మనీష్ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్బాస్కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ -
మిరాయ్ ట్విటర్ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సిసిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిరాయ్’ ఎలా ఉంది? తేజ సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదతర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్లో మిరాయ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉందంటూ చాలా మంది ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే ఇందులో ప్రభాస్ కనిపించడం పెద్ద సర్ప్రైజింగ్ అంశం. ఎక్స్లో ప్రభాస్ పాత్రలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ సినిమాకు ప్లస్ అయిందని చెబుతున్నారు.#Mirai A Worthy Action Adventure Infused with Devotional Elements! Mirai delivers an engaging first half, with a few dips in the middle, but a good pre-interval to interval block. The second half slows down in places, but a few strong sequences and a superb climax hold it…— Venky Reviews (@venkyreviews) September 11, 2025‘చిన్న చిన్న మలుపులతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్ కొన్ని చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా..కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టినట్లు అనిపించదు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. #MiraiReview Positives@shriya1109#Jayaram@tejasajja123@HeroManoj1 (Mohan babu)#RitikaAnd everyone gave their best -VFX 👌👏-Second half BGM-Mirai daggariki vellaka vache sequence -Second half till climaxNegatives:Time ayipothundhani fast fast ga end chesinattundhi— ZoomOnZindagi (@ZoomOnZindagi) September 12, 2025 ‘తేజ సజ్జ, శ్రియ, మనోజ్, జయరామ్, రితికా..ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీఎఫెక్స్ అదిరిపోయింది. సెకండాఫ్ బీజీఎం బాగుంది. మిరాయ్ దగ్గరకు వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్. క్లైమాక్స్ బాగుంది. సినిమాలో నెగెటివ్ పాయింట్ ఏంటంటే.. టైమ్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఎండ్ చేసినట్లు ఉంటుంది’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Just a voice over turned the entire film reception into rebel vibe 🔥🔥🔥Just his name is enough 💥💥💥 #Prabhas #Mirai pic.twitter.com/rhvvntcNGO— Prabhas RULES (@PrabhasRules) September 11, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai – A Divine Action Adventure! 🔥✨High moments, solid interval, superb climax.Tech brilliance + Gowra Hari BGM elevate big time.@tejasajja123 shines bright.@HeroManoj1 👌💥Unique, engaging & worth a big-screen watch!Rating: ⭐⭐⭐⭐/5— 𝐕𝐢𝐡𝐚𝐚𝐧 (@TheRealPKFan) September 12, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai 12 सितम्बर को रिलीज़ हो रही है ये फ़िल्म सनातन धर्म के आदर्श और राम जी की ताक़त से प्रेरित है 🚩दक्षिण भारत हमें सुपरहीरो देता है, बॉलीवुड बस स्टारकिड्स 😏आधुनिक युग में एक बेहतरीन फिल्मइस बार सिनेमा हॉल भरकर दिखाओ कि असली कंटेंट ही जीतेगा 💪#Mirai— ठाकुर राजन तोमर (@rajanbhajpa) September 12, 2025#Mirai - 🆗Teja Sajja delivers a gud Perf. Graceful Shreya. Superb Visuals & BGM. Promising start, middle portions r draggy. Post Interval Transformation fight gud. Lord Rama saved d climax. Though not extra ordinary, it Deserves a One Time Watch for its Cinematic Experience!— Christopher Kanagaraj (@Chrissuccess) September 12, 2025#Mirai Baane undi, Parledu!A decent fantasy action adventure film which has similar tones of #Karthikeya2 & #HanumanFew sequences are fantastic but few are subpar.Loved #ShriyaSaran role👍🏻#TejaSajja is brilliant and he killed it👌#ManchuManoj role is underwhelming🥲 pic.twitter.com/r7gHrlhsph— Sanjeev (@edokatile) September 12, 2025 -
ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ
సహజ నటి జయసుధ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘లక్ష్మణ రేఖ’కు 50 ఏళ్లు. ఈ సినిమాకి ముందు ఓ నాలుగైదు సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేశారు. ఎన్. గో పాలకృష్ణ దర్శకత్వంలో షణ్ముగం చెట్టియార్, ఏవీ కృష్ణారావు నిర్మించిన ‘లక్ష్మణ రేఖ’లో చేసిన సీరియస్ క్యారెక్టర్ జయసధకు మంచి పేరు తెచ్చిపెడితే, దర్శకుడు ఎన్. గో పాలకృష్ణకి ‘లక్ష్మణ రేఖ’ ఇంటి పేరుగా మారి పోయింది. ఈ చిత్రంలో మురళీమోహన్ – జయసుధ జంటగా నటించగా, చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, గుమ్మడి, అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1975 సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లయిన సందర్భంగా ‘సాక్షి’తో జయసుధ ప్రత్యేకంగా పంచుకున్న విషయాలు. ‘లక్షణ రేఖ’ ఓ మరాఠీ చిత్రానికి మూలం. తండ్రి చెప్పిన మాట వినకుండా ప్రేమికుడి కోసం ఇంటి నుంచి వెళ్లిన ఒక అమ్మాయి మోస పోతుంది. ఆ ప్రేమికుడిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ మోసగాడు ఆమె చెల్లెలి భర్తతో పరిచయం పెంచుకుని, వారి కాపురంలో చిచ్చుపెడతాడు. భర్త వదిలేస్తాడు. నేను చెల్లెలి పాత్ర చేశాను. ఇది బరువైన పాత్ర కాబట్టి నా వయసు సరి పోదని, నన్ను వద్దని డైరెక్టర్, ప్రొడ్యూసర్స్తో పెద్దలు చె΄్పారు. అయితే ఆ సినిమా నాకే వచ్చింది. ‘లక్ష్మణ రేఖ’ తర్వాత ‘జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖలు’ వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నావి టఫ్ రోల్స్. అన్నిటికంటే కష్టమైనది ‘ఆమె కథ’. ఆ సినిమా ఇప్పుడు తీసినా ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది. ఏ భాషలో అయినా పనికొస్తుంది. ఇంగ్లిష్లో కూడా తీయొచ్చు. అప్పటి ఆ టైమ్, ఆ సీజన్లో అన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే. ఆ సినిమాలకు ఒక అమ్మాయి దొరికింది... ఆమె జయసుధ (నవ్వుతూ). ఆ రోజుల్లో హీరోయిన్లను బాలీవుడ్ నుంచో వేరే ఉడ్ నుంచో తీసుకురావడం తక్కువ. తెలుగు లేదంటే తమిళ పరిశ్రమ నుంచే ఆర్టిస్టులు ఉండేవారు. దాంతో మాకు ఎక్కువ పాత్రలు వచ్చేవి. సీరియస్గా, మేకప్ లేకుండా, టైట్గా జెడ వేసుకుని, కాటన్ చీరలు కట్టుకుని... ఇలా పాత్రలకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను. ఫిజిక్కి తగ్గ డ్రెస్ వేసుకునేవాళ్లంఅప్పట్లో మా ఫిజిక్కి తగ్గట్టు డ్రెస్ వేసుకునేవాళ్లం. ఆ రోజుల్లో 90 శాతం మంది డైరెక్టర్స్ మా డ్రెస్లు అభ్యంతరకరంగా ఉండకుండా జాగ్రత్త పడేవారు. నేను ట్రెడిషనల్ క్యారెక్టర్స్తో పాటు మోడ్రన్ క్యారెక్టర్స్ చేశాను. ‘నోము’ సినిమాలో అంత వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నా అసభ్యంగా అనిపించలేదు. ‘యుగంధర్’ సినిమాలో అయితే స్విమ్ డ్రెస్ వేసుకున్నాను. అయితే అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అయినా ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టలేదు కథ చెప్పేటప్పుడు నా పాత్ర ఒకలా చెప్పి, షూటింగ్కి వచ్చాక మారిస్తే ఒప్పుకునేదాన్ని కాదు. అప్పటికి నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ‘ఎందుకు ఇలా చేశారు?’ అని ప్రశ్నించేదాన్ని. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉండేది కాబట్టి ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టలేదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్గా, అమ్మ కామ్గా ఉండేవారు. అయితే నచ్చక పోతే వీళ్లు సినిమా వదులుకుంటారని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఒక పద్ధతి ఉండేది... విలువలు ఉండేవి. మహా నటి ఆమె ఒక్కరే... ‘సహజ నటి’ అనే టైటిల్ సూపర్ స్టార్ అని ఒక కార్యక్రమంలో నాకు మీడియా ఇచ్చింది. ఇప్పుడు పది లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసి ఉండరు, అప్పుడే ‘మహా నటి’ అనేస్తారు. మహా నటి అనే బిరుదుకి అర్హత ఉన్న ఏకైక నటి సావిత్రిగారే. ఎన్నో గొప్ప పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిస్తే, ఆమెకు దక్కిన బిరుదు అది. ఇప్పుడున్నవారిని తక్కువ చేయడం లేదు. కానీ, కనీసం ఓ పాతిక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశాక అలాంటి బిరుదులిస్తే బాగుంటుంది. నా బయోపిక్కి ఓకే నా బయోపిక్ ఎవరైనా తీస్తానంటే అభ్యంతరం లేదు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ విషయం గురించి నాతో చె΄్పారు. అయితే ముందుగా ఒక బుక్గా వస్తే బాగుంటుంది. నేనో 350 సినిమాలు చేశానంటే... వదులుకున్నవి ఓ 200 వరకూ ఉంటాయి. ఆ 350 సినిమాల్లో నా పాత్రల్లో నేను ఒదిగి పోవడానికి చేసిన కృషి గురించి తెలియాలి. అప్పటి స్టార్స్ గురించి ఈ జనరేషన్కి తెలియాలి. అది వారికి స్ఫూర్తిగా ఉంటుంది. ఒక చిన్న అమ్మాయిగా సినిమాల్లో మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ జర్నీ తెలియాలి. వెబ్ సిరీస్గా అయితే బాగుంటుందనుకుంటున్నాను.నా పరిచయ చిత్రం ఓ సంచలనంహీరోయిన్ ఓరియంటెడ్ సినిమా... అందులోనూ కొత్త డైరెక్టర్తో... లేని పోని రిస్క్ చేస్తున్నారని నిర్మాతల్ని భయపెట్టారు. జయసుధను ఎంపిక చేయడాన్ని పలు వురు పెద్దలు విమర్శించారు. కానీ నా మీద, నా సబ్జెక్ట్ మీద నమ్మకంతో నిర్మాతలు వెనకడుగు వేయలేదు. వాళ్లు చేసిన రిస్క్ ఫలించి, టేబుల్ ప్రాఫిట్గా ‘లక్ష్మణ రేఖ’ నిలిచి... నా ఇంటిపేరుగా మారింది. ఏరియాల వారిగా బిజినెస్ జరుపుకున్న తొలి చిత్రంగానూ దర్శకుడిగా నా పరిచయ చిత్రం చరిత్ర సృష్టించడం పట్ల ఇప్పటికీ గర్వపడుతుంటాను. – ఎన్. గో పాలకృష్ణ -
ఆయన కోసం కిష్కింధపురి చూస్తాను: అనిల్ రావిపూడి
‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కానీ, మా నిర్మాత సాహుగారి కోసం ‘కిష్కింధపురి’ చూస్తా’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలి పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో సాహు గార పాటి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సాయి శ్రీనివాస్ చాలా కష్టపడతాడు.తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మాత సాహుగారితో ‘భగవంత్ కేసరి’ చేశాను. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాక్షసుడు’లానే ‘కిష్కింధపురి’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బుచ్చిబాబు. ‘‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరి పోయింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుస్మిత కొణిదల. చెప్పారు. -
నా చిన్నప్పుడే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు: హీరో తేజ సజ్జా
‘‘మనం ఎంత ఖర్చుపెట్టినా ప్రేక్షకుల నమ్మకాన్ని కొనలేం. సినిమాలు స్పీడ్గా చేయాలని, రెండు మూడు సినిమాలు వరుసగా చేసేసి, ప్రేక్షకులను ఒక్కసారి నిరుత్సాహపరిచినా నాకు బాధగా ఉంటుంది. నేను దక్కించుకున్న క్రెడిబిలిటీ, నా కష్టం తాలూకు విలువ పోతుంది. నా సినిమా వస్తోంది... థియేటర్స్కు రండి అని ఆడియన్స్ని నేను కాన్ఫిడెంట్గా, ధైర్యంగా పిలిచేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. ‘మిరాయ్’ ఇలాంటి చిత్రమే’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా చెప్పిన సంగతులు. ⇒ ఫుల్ ఫ్యామిలీ అండ్ క్లీన్ ఫిల్మ్ ‘మిరాయ్’. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్... ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రం ఇది. చార్మినార్లోని కుర్రాడు వాడి ధర్మం ఏంటో వాడు గ్రహించి, తనకి, యోధ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని, ఓ పెద్ద ఆపదను ఆపడానికి ఎంత దూరం వెళ్లాడు? తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ప్రపంచం అంతరించబోతున్నటువంటి ఓ పెద్ద ఆపద రాబోతున్నప్పుడు మన ఇతిహాసాల్లో వేల సంవత్సరాల క్రితం పెట్టి ఉంచిన సమాధానాన్ని ఈ కుర్రాడు ఎలా కనుక్కుంటాడు? అన్నది ఈ సినిమా కథాంశం. ⇒ ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ సీక్వెన్స్లు వరకు ఉన్నాయి. వయసులో ఉన్నాను కాబట్టి ఫిజికల్ చాలెంజ్లు ఏం అనిపించలేదు. ఈ సీక్వెన్స్లు చూసి, ఆడియన్స్ ఎంత థ్రిల్ అవుతారో చూడాలనుకుంటున్నాను. టీజీ విశ్వప్రసాద్గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆడియన్స్కు నచ్చే మంచి సినిమా తీద్దామనుకునే నిర్మాత. ఆయనలాంటి నిర్మాతలు అరుదు. అందుకే ఆయనతో మరో సినిమా చేస్తున్నాను. ⇒ నా చిత్రాలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలని తపన పడుతుంటాను. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనుకుంటాను. ఆ ప్రెజర్ ఉంది. కానీ ‘హను–మాన్’ సినిమా సక్సెస్తో నాపై కొత్తగా పెరిగిన ఒత్తిడి ఏం లేదు. చె΄్పాలంటే ఒక రకంగా ‘హను–మాన్’ సినిమా విషయంలోనే ఒత్తిడి ఫీలయ్యాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించింది కదా అని ‘మిరాయ్’ సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు. ⇒ మా నాన్నగారు హార్డ్వర్కింగ్ పర్సన్. ఆయన వయసు 65. ఈ రోజుకీ ఆయన ఉదయం 6.30కి ఉద్యోగానికి వెళ్తారు. సాయంత్రం 8 గంటలకు వస్తారు. పనిని ఫస్ట్ ప్లేస్లో పెట్టేవారిలో మా ఫాదర్ ఒకరు. అలాంటి ఇంటి నుంచి వస్తున్నాను కాబట్టే పనికి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానేమో అనిపిస్తోంది. పనే దైవం అని భావిస్తాను. ⇒ కథ కుదరితే పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా రిలీజ్ చేస్తాం. నిజానికి పాన్ ఇండియా సూపర్ స్టార్లు నా చిన్నప్పట్నుంచి ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావుగార్ల సినిమాలు చెన్నైలో చూసేశారు. చిరంజీవిగారు స్ట్రయిట్గా హిందీలో సినిమాలు చేశారు. రజనీకాంత్, కమల్హాసన్గార్ల సినిమాలు నేను నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. అలాంటి వారికి జోడించాల్సిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని నాలాంటి యంగ్ హీరోస్కి పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నమ్మేవారిలో నేనొకడిని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మేం సినిమాలు చేస్తున్నాం. ఒకవేళ మేం చేసే చిత్రం ఇతర భాషల ఆడియన్స్కు కూడా నచ్చితే, అది మాకు బోనస్. దీని కోసం రిలీజ్ చేయడమే. అంతేకానీ... అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ప్రయత్నం ఏమీ లేదు. ⇒ ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నానా? లేదా అనేది ప్రశాంత్ వర్మగారు చెబుతారు. ‘జాంబిరెడ్డి 2’ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. ప్రశాంత్గారు కథ అందిస్తున్నారు. విశ్వప్రసాద్గారు నిర్మిస్తారు. ‘మిరాయ్’ సినిమా విజయం సాధిస్తే, రెండో భాగం కూడా ఉంటుంది. -
కాంత వాయిదా
‘కాంత’ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా సముద్ర ఖని ఓ కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ పేర్కొంది. కానీ ఆ తేదీకి విడుదల చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని గురువారం చిత్రయూనిట్ ఓ నోట్ను విడుదల చేసింది. ‘‘కాంత’ సినిమా టీజర్ విడుదలైనప్పట్నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆ ప్యాయత, మద్దతు మా హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ‘కాంత’ చిత్రం యూనిట్ పేర్కొంది. -
కొత్త విలన్ గురూ
తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్ గురించి తెలుసుకుందాం. ఓజీ వర్సెస్ ఓమి బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్ ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్ విలన్గా నటిస్తున్నారని తెలిసింది. రామ్ బుజ్జిగా వస్తున్నాడు హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్ సిరీస్ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్’ మున్నా ఇప్పుడు టాలీవుడ్కు వచ్చారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. రామ్బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్చరణ్ క్రికెట్ బ్యాటింగ్ – దివ్యేందు బౌలింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్’ సిరీస్తో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం. వృషకర్మలో.. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్ శ్రీవాత్సవ్. ఈ బాలీవుడ్ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ అండ్ మిథికల్ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో స్పర్‡్ష శ్రీవాత్సవ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్’లో పాజిటివ్ రోల్ చేసిన స్పర్‡్ష శ్రీవాత్సవ్ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. పోటా పోటీ బాలీవుడ్ యాక్షన్ హిట్ ఫిల్మ్ ‘కిల్’ (2023)లో విలన్గా నటించి, ఆడియన్స్ను మెప్పించారు రాఘవ్ జూయల్. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం యాక్షన్ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్ జూయల్ పేరు బాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్ ఇండియన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశం రాఘవ్కు లభించింది. ‘దసరా’ వంటి హిట్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’.ఈ చిత్రంలో రాఘవ్ జూయల్ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఓ మెయిన్ విలన్ రోల్ని రాఘవ్ చేస్తున్నారని, నానీతో రాఘవ్కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్లో ‘కిల్’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, సిద్ధాంత్ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్ ఆడియన్స్ను అలరించారు రాఘవ్. మరి... టాలీవుడ్లోనూ రాణిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్ స్వామి అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, సునీల్తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్స్పెక్టర్ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్స్పెక్టర్ స్వామి క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ సమచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్’ సినిమా కథాంశం.డ్రాగన్తో పోటీ! ‘మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎమ్’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో టొవినో థామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్ చేస్తున్నది విలన్ రోల్ అని, ఆల్రెడీ ‘డ్రాగన్’ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.తెలుగులో విలన్స్గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ⇒ హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఆమె విలన్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్లో ఉండటం సహజం.నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి సీనియర్ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్గా చేశారు. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు.‘దోశె కింగ్’ అనే కొత్త చిత్రం కోసం మోహన్ లాల్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్ రోల్ చేశారు. అలాగే జితిన్ కే జోస్ డైరెక్షన్లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్ యాక్టర్స్ విలన్ రోల్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.కెరీర్లో హీరోగా మంచి పీక్ స్టేజ్లో ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా విభిన్నమైన విలన్ రోల్ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్గా నటించారు. హిందీలో ఎన్టీఆర్కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంలో విలన్గా నటించారు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లోనూ మనోజ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (బడే మియా చోటే మియా), ఫాహద్ ఫాజిల్ (పుష్ప 3), అర్జున్ కపూర్ (సింగమ్ ఎగైన్) వంటి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్ విలన్గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
టోరంటోలో జాన్వీ కపూర్ హోయలు.. ఊహల్లో తెలిపోతున్న బిగ్బాస్ దివి!
గుజరాత్లో శ్వేతా బసు ప్రసాద్ టూర్..డిజైనర్ డ్రెస్లో రష్మిక మందన్నా సూపర్బ్ లుక్..టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..అంతా నీ ఆలోచనలే అంటూ బిగ్బాస్ దివి ప్రేమ కావ్యం..బ్లాక్ బ్యూటీలా జ్యోతి పూర్వాజ్ హోయలు.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
థియేటర్లలో మిరాయ్, కిష్కింధపురి... ఓటీటీల్లో ఏకంగా 17 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో రెండు సినిమాలు రిలీజ్ రెడీ అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద మిరాయ్, కిష్కింధపురి సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే వచ్చిందంటే స్ట్రీమింగ్కు రెడీ అయిపోతున్నాయి. ఈ వారం హిందీలో బిగ్ హిట్ కొట్టిన సయారా, తెలుగులో బకాసుర రెస్టారెంట్, రాంబో ఇన్ లవ్ లాంటి వెబ్ సిరీస్లు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్సయారా (హిందీ సినిమా) - సెప్టెంబరు 12యూ అండ్ ఎవరిథింగ్ ఎల్స్(కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 12మాలెడిక్షన్స్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12రటు రటు క్వీన్స్-(ఇండోనేషియా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12ది రాంగ్ పారిస్(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 12మెటిరియలిస్ట్స్(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 14అమెజాన్ ప్రైమ్డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12ఎవ్రీ మినిట్ కౌంట్స్ - సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12ల్యారీ ద కేబుల్ గాయ్- (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12స్క్రీమ్ బోట్- (ఇంగ్లీష్ మూవీ)-సెప్టెంబరు 12జియో హాట్ స్టార్రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12సన్ నెక్ట్స్మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12లయన్స్ గేట్ ప్లేడిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12హులు అండ్ డిస్నీ ప్లస్లాస్ట్ ఇన్ ది జంగిల్- (డాక్యుమెంటరీ ఫిల్మ్)- సెప్టెంబర్ 12హెచ్బీవో మ్యాక్స్వార్ఫేర్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
'మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు'.. మర్యాద మనీశ్ ఫైర్!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. మొదటి వారం నుంచే హౌస్ హాట్హాట్గా సాగుతోంది. నామినేషన్స్ తంతు ముగియగానే ఒకరిపై ఒకరు తమ ఆగ్రహాన్ని ప్రదరిస్తునే ఉన్నారు. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఎపిసోడ్ ఫుల్ సీరియస్గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ఇవాల్టి బిగ్బాస్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మర్యాద మనీశ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ముల మధ్య పెద్ద వార్ నడిచింది. మీ ఇద్దరు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటున్నారని ప్రియా, శ్రీజపై మర్యాద మనీశ్ మండిపడ్డారు.నేను కామ్గా ఉన్నానని నన్ను సెపరేట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు. ఆ తర్వాత ప్రియాశెట్టి.. మర్యాద మనీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ప్రోమో చూస్తుంటే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఫైటింగ్ నడిచినట్లు తెలుస్తోంది.Fights heating up! 🔥 #PriyaShetty & #SrijaDammu Vs #ManishMaryada🤯Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat–Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/EUTUXSKlR4— JioHotstar Telugu (@JioHotstarTel_) September 11, 2025 -
ఈ లవ్ స్టోరీ చూసి ఫుల్ ఎంటర్టైన్ అయ్యా: అల్లు అర్జున్ ప్రశంసలు
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg— Allu Arjun (@alluarjun) September 11, 2025 -
ఐసీయూలో ఉన్నాడు.. సాయానికి ముందుకు రండి: మంచు మనోజ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మన రామచంద్రకు సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామచంద్ర ఐసీయూలో ఉన్నారని.. ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి సాయం చేసి మీ ప్రేమ, మద్దతు తెలపాలని మనోజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. రామచంద్ర ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపరిచారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని గతంలో రామచంద్ర వెల్లడించారు.కాగా.. 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.Urgent 🚨 Namasthe All🙏🏻 Our dearest Rama Chandra garu is fighting for his life in the ICU. Now is the time for us to come together. Please show your love and support by contributing whatever you can even if it’s just 1 rupee.Details: Kalaga NarayanaGPay & PhonePe:…— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 11, 2025 -
లావణ్య త్రిపాఠికి ‘టన్నెల్’ విషెస్.. రిలీజ్ వాయిదా!
మెగా జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి బుధవారం (సెప్టెంబర్ 10) పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అంతా కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘టన్నెల్’ చిత్రబృందం కూడా లావణ్యకు విషెస్ తెలియజేసింది. ఈ చిత్రంలో అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు.రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఓ వారం వాయిదా వేశారు. అలా ఈ మూవీని సెప్టెంబర్ 19న గ్రాండ్గా థియేటర్లోకి తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.‘టన్నెల్’ ఓ యాక్షన్-థ్రిల్లర్ మూవీ అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అడ్రినల్ రష్ ఇచ్చేలా, ఉత్కంఠ రేకెత్తించేలా సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి. క్రైమ్లు చేస్తున్న సైకోని పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? అనే పాయింట్తో ‘టన్నెల్’ రాబోతోంది. -
వరుణ్ తేజ్కు పోలాండ్ యువకుడు అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్తో పాటు అభిమానులంతా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రామ్ చరణ్ సైతం వరుణ్ తేజ్కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.తాజాగా వరుణ్ తేజ్కు పోలాండ్కు చెందిన జాక్ అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ చిత్రంలో నటించానని జాక్ వెల్లడించారు. నా సహనటుడు మిస్టర్ వరుణ్ తేజ్ తండ్రి కావడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మెగా కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మిస్టర్ షూటింగ్లో వరుణ్ తేజ్తో ఉన్న ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. పోలాండ్ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది.Congrats to my costar of the Film #Mister @IAmVarunTej on being a proud Father to a baby Boy.May the new Born follow the Legacy and be a product of the iconic Mega family and follow the foot steps of @KChiruTweets, @NagaBabuOffl and #powerstar @pawankalyan and be successful in… pic.twitter.com/eG1KK9VeXl— Zbigniew A C (@ZbigsZach) September 10, 2025 -
తెలుగు సీరియల్.. నా కూతురికి నరకం చూపించారు: చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి
ఓ తెలుగు సీరియల్ వల్ల తన కూతురు నరకం చూసిందంటోంది చైల్డ్ ఆర్టిస్ట్ నిషిత (Nishita) తల్లి ప్రియ. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. సెట్లో చిన్నారికి కరెంట్ షాక్ కొట్టిందని, ఆరోగ్యం బాగోలేకపోయినా షూటింగ్ చేయించారని వాపోయింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేసింది.చిన్నారికి కరెంట్ షాక్'అందులో నిషితను గార్డెన్ ఏరియాలో లైట్స్ ఉన్న దగ్గర పడుకోబెట్టారు. అక్కడున్న లైట్స్ ద్వారా కరెంట్ షాక్ రావడంతో ఆ పాప నిస్సహాయ స్థితిలో కేకలేసింది. మరో సీన్లో తను భయపడుతున్నా సరే బలవంతంగా స్విమ్మింగ్ పూల్లోకి లాగారు. అక్కడ తనకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొన్నిసార్లు ఆరోగ్యం బాగోలేక బెడ్పై ఉన్నా సరే.. తనకు విశ్రాంతి ఇవ్వకుండా షూటింగ్కు రమ్మని ఒత్తిడి తెచ్చారు. అనారోగ్యంతోనే తను సెట్కు వచ్చి షూట్ చేయాల్సి వచ్చింది. రెమ్యునరేషన్ ఆపేశారుచిన్నపాప అని ఆలోచించకుండా రాత్రిపూట షూటింగ్స్కు రమ్మనేవారు. సీరియల్ నిర్మాతలు చైల్డ్ ఆర్టిస్టుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అలాగే వీరు ఏప్రిల్ నుంచి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఆపేశారు. పని చేయించుకున్నారు, కానీ డబ్బులివ్వలేదు. దాదాపు 150 ఎపిసోడ్ల తర్వాత సడన్గా నా కూతురిని తొలగించి మరొకరిని తీసుకున్నారు. తనకు ఒంట్లో బాగోలేకపోయినా, ఎంత ఇబ్బందిపడ్డా సరే అవన్నీ ఓర్చుకుని పని చేసింది. చివరకు ఇదా మీరు తనకిచ్చే బహుమతి?టీఆర్పీ కోసం వాడుకున్నారుమీరు నా కూతురిని రీప్లేస్ చేయగలరేమో కానీ తన టాలెంట్ను కాదు. టీఆర్పీ కోసం నెలల తరబడి తనను వాడుకున్నారు. ఇప్పుడేమో ఎక్స్పెన్సివ్ కిడ్ అని పక్కన పెట్టేశారు. ఈ సీరియల్ కోసమే ఎన్నో ప్రాజెక్టులను కాదనుకున్నాం. ఇప్పుడు ఒక్క మాటైనా చెప్పకుండా తీసేశారు' అని నిషిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా నిషిత.. కన్నడంలో లక్ష్మీ నివాస సీరియల్లో నటించింది. ఇందులో పోషించిన ఖుషి పాత్రతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Priya v (@priyaseervi321) View this post on Instagram A post shared by Priya v (@priyaseervi321) చదవండి: హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్! -
ఆడియన్స్ పిచ్చోళ్లా.. ఇంత సపోర్ట్ చేస్తారా?: యంగ్ హీరో
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం సరిగ్గా ఆడడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ వచ్చిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ భారీ విజయం సాధించింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం రిలీజైన తొలిరోజే(సెప్టెంబర్ 5) హిట్ టాక్ తెచ్చుకొని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా హీరో మౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. ‘ఆడియన్స్.. పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా. మేము అస్సలు ఊహించలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. తొలి వారం కొంతమంది చూస్తారు. మౌత్ టాక్తో రెండో వారం నడుస్తుందేమో అనుకున్నాం. అలా అనుకొనే గట్టిగా ప్రమోషన్స్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్స్కి వస్తారా రారా అనుకున్నాం. కానీ ప్రీమియర్స్, ఫస్ట్ రోజు..థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఫస్ట్డే రూ.2.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది మా సినిమా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ఆడియన్స్కి థ్యాంక్స్. ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తునారనో నాకే అర్థం కాలేదు. ఎవరైనా సినిమా బాగోలేదని కామెంట్ పెడితే.. వాళ్లను తిడుతూ రిప్లై ఇస్తున్నారు. రవితేజ, నాని మొదలు ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను మొచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే కష్టపడి మంచి సినిమాలు తీస్తానని అందరికి మాట ఇస్తున్నా’ అన్నారు.సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. 2009-2020 మధ్యకాలంలో జరిగే టీనేజ్ లవ్స్టోరీ ఇది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. -
'సిద్ధు జొన్నలగడ్డ' కొత్త సినిమా.. రొమాంటిక్ టీజర్ చూశారా?
'తెలుసు కదా' సినిమా నుంచి క్లాసిక్ టీజర్ విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఆయన నటించిన మూవీ జాక్ నిరుత్సాహపరిచింది. దీంతో ‘తెలుసు కదా’ మూవీపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇందులో వైవా హర్ష కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించారు. -
హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలు సహజం. గొడవ మొదలుపెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికేవాళ్లుంటారు. ఈ సీజన్లో కూడా మూడు రోజుల్లోనే కావాల్సినదానికంటే ఎక్కువ రభసే జరుగుతోంది. దానికి మూల కారణం సంజనా (Sanjana Galrani)! ఈమె సరదాసరదాగా చేసే పనులకే హౌస్ తగలబడిపోతోంది. నిజంగా గొడవపడితే హౌస్ ఏమైపోతుందో మరి!అందరికీ పూనకాలు తెప్పిస్తున్న సంజనాతను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్లో ఉన్న 14 మంది ఒకచోట చేరి కొట్టుకున్నంత పని చేశారు. కానీ సంజనా మాత్రం తాపీగా సోఫాలో కూర్చుని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్ చేసింది. ఆ ఒక్క సీన్ చాలు.. నువ్వుండాలమ్మా.. కచ్చితంగా ఉండాల్సినదానివే! అని ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు. అవసరమైన చోట కౌంటర్స్ ఇస్తూ తాపీగా ఉంటోంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు. కానీ, అందరికీ బీపీలు తెప్పిస్తోంది. ప్రస్తుతానికి హౌస్లో ఈమెనే అందరికంటే హైలైట్గా నిలుస్తోంది.కెప్టెన్గా..ఇకపోతే నేడు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలక్ట్ చేయమని బిగ్బాస్ సంజనాకు బాధ్యత అప్పగించాడట! దాంతో ఆమె హరీశ్, శ్రష్టి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్లను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి కెప్టెన్సీ సంజనా చేతికి చిక్కిందట! గుడ్డు దొంగిలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్. ఇప్పుడదే ఇంట్లో కెప్టెన్ బెడ్రూమ్లో దర్జాగా సేద తీరనుంది సంజనా. కెప్టెన్గా అందరినీ ఎలా ఆటాడిస్తుందో చూడాలి!చదవండి: 5 నెలల పాప.. గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?: సంజనా ఫైర్ -
సీనియర్ సిటిజన్కు సినీ నిర్మాత టోకరా.. కేసు నమోదు
బంజారాహిల్స్: పదేళ్ల పాటు లీజుకు తీసుకుని భవనాన్ని 99 ఏళ్ల లీజు అంటూ ఫోర్జరీ పత్రాలను సృష్టించి మోసం చేయడంతో పాటు వృద్ధురాలిని బెదిరింపులకు గురిచేస్తున్న వ్యవహారంలో సినీ నిర్మాత, రౌడీషీటర్ షేక్ బషీద్తో పాటు అతని భార్యపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లో నివాసం ఉంటున్న లక్ష్మీశ్వరి (85) కుమారుడు తిరుమల వెంకటేష్ అమెరికాలో ఉంటారు. అతడికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లో భవనం ఉంది. దానికి జీపీఏ హోల్డర్గా ఉన్న తల్లి లక్ష్మీశ్వరి వద్ద నుంచి 2013లో సినీ నిర్మాత షేక్ బషీద్, అతని భార్య షేక్ కరీమున్నీసా లీజుకు తీసుకున్నారు.పదేళ్ల పాటు లీజుకు ఇచ్చినట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2023లో లీజు గడువు ముగియడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు చెప్పగా, తమకు 99 ఏళ్ల పాటు లీజు ఉందంటూ పత్రాలు చూపించారు. 2012 నుంచి 2112 దాకా ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ షేక్బషీద్ చెప్పడంతో లక్ష్మీశ్వరి షాక్కు గురయ్యారు. అప్పటి నుంచి అద్దె చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వాలు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ 99 ఏళ్లకు ఇంటిని లీజు ఇవ్వరని, తప్పుడు పత్రాలతో తన ఇంటిని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు షేక్బషీద్తో పాటు అతని భార్య కరీమున్నీసాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'కిష్కింధపురి' ట్విస్ట్.. సినిమా చూసిన వారి టాక్ ఇదే
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కిష్కింధపురి'.. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు.'కిష్కింధపురి' ప్రీమియర్ షోలు సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని AAA ముల్టీప్లెక్స్లో ప్రదర్శించారు. సినిమా చూసిన ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడిని చెబుతున్నారు. ఫస్టాఫ్ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ను తెరపై అంతే చక్కగా చూపించారు. ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్గా హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడ తక్కువ చేయకుండా అదరగొట్టాడు డైరెక్టర్. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పిస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్కు ఈ జానర్ బాగా సెట్ అయిందనే చెప్పాలి. సూపర్గా నటించి మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్. హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేసాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి మరి అలరిస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది. -
ఓటీటీలో సెన్సేషనల్ హిట్ సినిమా 'సైయారా'
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'సైయారా'(Saiyaara) ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) జంటగా 'సైయారా'తో బాలీవుడ్కు పరిచయమ్యారు. వీరిద్దరూ క్రిష్, వాణి పాత్రలతో యూత్ను మెప్పించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా విడుదలైన 'సైయారా' నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 12న ఓటీటీలోకి రానుందని ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది. అందుకే ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో భారీ ఫైట్స్ లేవు. పవర్ఫుల్ డైలాగ్స్ లేవు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కేవలం ఎమోషన్ మాత్రమే ఈ చిత్రాన్ని నిలబెట్టింది. -
షారుక్ ఖాన్, దీపికా పదుకొణెకు ముందస్తు బెయిల్
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలకు రాజస్థాన్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హ్యుందాయ్ కార్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుక్, దీపికాలపై రాజస్థాన్కు చెందిన కీర్తిసింగ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కార్ల కంపెనీ ప్రచారం చేయడం వల్ల తాను ఒక కారు కొనుగోలు చేసి నష్టపోయానని, వారిద్దరూ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన కేసు వేశారు. అయితే, ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని రాజస్థాన్ హైకోర్టును నటీనటులు కూడా ఆశ్రయించారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25న ఉంటుందని పేర్కొంది.గతంలో కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు ఇలా ఉంది. 2022 జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ కారును సుమారు రూ. 24 లక్షలకు కొనుగోలు చేస్తే.. కేవలం ఆరు నెలల్లోనే కారు ఇంజన్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాడు. అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్ నుంచి తీవ్రమైన శబ్ధం వస్తుందని ఒక్కోసారి దారి మధ్యలోనే ఆగిపోతుందని తెలిపాడు. కారు సమస్య గురించి కంపెనీ ఏజెన్సీని సంప్రదించినప్పుడు, ఇది ఈ కారు మోడల్ తయారీ లోపమంటూ దాన్ని పరిష్కరించలేమని అక్కడి సిబ్బంది చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపాడు. హ్యూందాయ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేస్తున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె( Deepika Padukone) ఈ ఘటనలో బాధ్యత వహించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. -
మల్లెపూల ఎఫెక్ట్.. అస్ట్రేలియా అధికారులకు నటి లేఖ
మలయాళ నటి నవ్య నాయర్ (Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. ఓ ఈవెంట్కు హాజరయ్యేందుకు ఆమె మెల్బోర్న్ ఎయిర్పోర్టులో దిగారు. అయితే, తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లడంతో అక్కడి ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం అక్కడ నిషిద్ధం. ఈ క్రమంలోనే నవ్య నాయర్ బ్యాగులో పూలు లభించడంతో ఆమెకు రూ. 1.14లక్షల జరిమానా విధించారు. ఈ అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు.తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, జరిమానాను రద్దు చేయాలని కోరుతూ ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖకు నవ్య నాయర్ లేఖ రాశారు. ఆపై ఆస్ట్రేలియన్ కస్టమ్స్ అధికారులకు కూడా ఆమె లేఖను పంపారు. "జరిమానా విధించిన తర్వాత నేను ఒక విధంగా షాక్ అయ్యాను. ఈ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవంగా ఆరోజు నా బ్యాగ్లో పువ్వులు తీసుకెళ్లనే లేదు. పువ్వులు నా జుట్టుమీద మాత్రమే ఉన్నాయి. అది అందరికీ బహిరంగంగానే కనిపిస్తుంది. దానిని నేను ఏమీ దాచలేదు. కానీ, నా బ్యాగులో మొదట పువ్వులు ఉంచడం వల్ల ఎయిర్పోర్ట్లోని స్నిఫర్ డాగ్స్ పసిగట్టాయి. బ్యాగులో ఒకటి లేదా రెండు ఫ్లవర్ బాగాలు ఉండిపోయాయి. దీంతో అక్కడి అధికారులు ఫైన్ వేశారు. 28రోజుల్లో చెల్లించాలని కోరారు' అని ఆమె చెప్పారు.ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖను మెయిల్ ద్వారా నవ్య నాయర్ సంప్రదించారు. 'జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పాను. జరిమానా మొత్తాన్ని మాఫీ చేయమని కోరాను. వారు మాఫీ చేయకపోతే రూ. 26వేలు వసూలు చేస్తారని ఒక ఆర్టికల్లో చదివాను. ప్రస్తుతానికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మానవతా కోణంలో వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. జరిమానా చెల్లించాల్సిందే అని కోరితే నాకు వేరే మార్గం లేదు. ఒక దేశ చట్టాన్ని ఎవరైనా సరే పాటించాలి. ' అని ఆమె అన్నారు.ఆస్ట్రేలియాలో ఎందుకు నిషేదం..?బయోసెక్యూరిటీ నియమాల ప్రకారం మల్లెపూలతో పాటు ఇతర మొక్కలు, పూలు, గింజలు, కాయగూరలు, మట్టి, జంతు సంబంధిత ఉత్పత్తులు తీసుకెళ్లినా కూడా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. వాటి ద్వారా ఆయా క్రిమికీటకాలు తమ దేశంలోకి వ్యాప్తి చెందుతాయని, ఆపై అక్కడి పంటలకు నష్టం కలిగిస్తాయని వారు కనుగొన్నారు. -
అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో
హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. నాకు ఇష్టమైన జానర్👻 టీనేజ్లో ఉన్నప్పట్నుంచి నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్లో నిర్మించిన ‘కాంచన’ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ కౌశిక్ ‘కిష్కింధపురి’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. హారర్ కారణంగా మా సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలమైందని సెన్సార్ సభ్యులు అభినందించడం ఆనందాన్నిచ్చింది.👻 ఈ సినిమా కోసం సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ని సెట్గా వేశాం. అలాగే ఓ పాడుబడ్డ గృహంలో షూట్ చేశాం. మంగళవారం ఈ సినిమాని మా స్నేహితులతో కలిసి థియేటర్స్లో చూశాం... సినిమా అదిరిపోయింది. సౌండ్ డిజైనర్ రాధాకృష్ణగారు సౌండ్ని అద్భుతంగా డిజైన్ చేశారు. కౌశిక్ మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ పరిమితులుంటాయి. కానీ, సాహు గారపాటిగారు ఆడియన్స్కి ద బెస్ట్ ఇవ్వాలని రాజీ పడకుండా నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించారు. 👻 ‘మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుల్లో మొదటి పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అని సరదాగా అన్నాను... దాన్ని వైరల్ చేశారు. మా చిత్ర కథ అంత ఆసక్తిగా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు... ఇండస్ట్రీలోనే ఉంటాను... భవిష్యత్లో దర్శకత్వం కూడా చేస్తాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కథ ఉంటే నేను, నా తమ్ముడు సాయి గణేశ్ కలిసి సినిమా చేస్తాం.చదవండి: బిగ్బాస్: 5 నెలల బాబు.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
బిగ్బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో మొదటివారం నామినేషన్స్ పూర్తయ్యాయి. కామనర్స్ నుంచి డిమాన్ పవన్, సెలబ్రిటీలలో భరణి మినహా మిగతా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇక ఈ షోకి కావాల్సిన కంటెంట్ నేనిస్తానంటూ ఫుల్ జోష్ మీదుంది సంజనా. మొన్న షాంపూ కోసం పంచాయితీ పెట్టిన ఆమె నిన్న గుడ్డు దొంగిలించి అందరికీ బీపీలు వచ్చేలా చేసింది. గుడ్డు ఎవరు కొట్టేశారో అర్థం కాక ఓనర్స్ (కామనర్స్) తల పట్టుకున్నారు. టెనెంట్స్లోనే అసలైన దొంగ ఉన్నాడని తెలిసి వాళ్లందరిపైనా ఒంటికాలిపై లేచారు.అందరి అనుమానం తనపైనేమీరు ఇంట్లో అడుగుపెట్టేదే లేదని టెనెంట్స్పై ఆంక్షలు విధించారు. అయితే అందరి అనుమానం సంజనా (Sanjana Galrani)పైనే.. కానీ ఆమె మాత్రం ఓపక్క నవ్వుతూ, మరోపక్క అమయాకంగా ముఖం పెడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. ఈ క్రమంలో భరణి, హరీశ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇలా అందరూ అరుచుకుంటూ ఉంటుంటే అప్పుడు సంజనా సైలెంట్గా వచ్చి.. ఆకలేసి నేనే గుడ్డు తిన్నా.. అడిగితే ఇవ్వరనే అలా చేశాను అని తాపీగా చెప్పింది. ఇరికించేసిందిగా!దీంతో ఓనర్లు.. అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పొచ్చు కదా? అని ఫైర్ అయ్యారు. ఇక సంజనా తాను తినేటప్పుడు కిచెన్లో ఉన్న భరణి, తనూజ కూడా చూశారని, రాముకు కూడా తెలుసని ఇరికించేసింది. దాంతో అందరూ షాకయ్యారు. శ్రష్టి అయితే సంజనా దగ్గరకు వెళ్లి.. గుడ్డు తినడానికి సిగ్గు లేదా? అని తిట్టేసింది. అటు రీతూ చౌదరి.. మీ ముగ్గురూ కలిసి గేమ్ ఆడారు అని భరణిపై ఫైర్ అయింది. అప్పుడు భరణి నోరు విప్పి జరిగిందంతా చెప్పాడు. ఏడ్చేసిన సంజనామేము కిచెన్లో ఉన్నప్పుడు సంజనా అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనూజకి చెప్పిందట. 5 నెలల బేబీని వదిలేసి వచ్చాను.. ఏదో ప్రాబ్లమ్ ఉందంది. అందుకే నేను సైలెంట్గా ఉన్నా అన్నాడు. అప్పుడు సంజనా ఎంటరై.. నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు, నా గురించి మీకు తెలీదు. నేను బాధితురాలిని. నేను ప్రతిరోజు ఏడుస్తూనే పడుకుంటాను అని ఏడ్చేసింది. అలా ఒక్క గుడ్డు దొంగతనంతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేసింది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా -
బయ్యర్లకు రూ. 4 కోట్లు రిటర్న్ చేసిన నిర్మాత?
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా (Mazaka) సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే, ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా కనెక్ట్ కాలేదు. దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజేశ్ దండ నిర్మించారు. రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అయితే, ఈ సినిమా చాలామంది బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే బయ్యర్లు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్మాతలతో ఢీల్ సెట్ చేసుకుంటున్నారు. సినిమాకు భారీ నష్టాలు వస్తే కొంత నిర్మాతల నుంచి రిటర్న్ ఉండేలా ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు.మజాకా మూవీని కొనుగోలు చేసిన బయ్యర్స్ను నిర్మాత రాజేశ్ దండ ఆదుకున్నారంటూ ఒక వార్త సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మజాకా ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో నిర్మాతలు చెప్పిన ధరకు బయ్యర్స్ కొనుగోలు చేశారు. విడుదల తర్వాత కూడా సినిమా బాగుందని టాక్ వచ్చింది. కానీ, కమర్షియల్గా అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో బయ్యర్లు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టపోయారట. ఆ డబ్బు తిరిగివ్వాలని నిర్మాతను చాలారోజులుగా బయ్యర్తు అడుగుతూ వచ్చారట. అయితే, తాజాగా ఆ మొత్తాన్ని వారికి చెల్లించారని తెలుస్తోంది.ప్రస్తుతం నిర్మాత రాజేశ్ దండ మరో సినిమాతో రానున్నారు. కిరణ్ అబ్బవరంతో కే రాంప్ (K-Ramp) మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ మూవీకి లైన్ క్లియర్ కావాలంటే బయ్యర్లతో ఉన్న వివాదం సెటిల్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చేశారని టాక్. -
ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు.నేడు అర్ధరాత్రి ( సెప్టెంబర్ 11) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూలీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లో చూడని వారు ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుందని తెలుస్తోంది.కథేంటి..?వైజాగ్ పోర్ట్లో కింగ్పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ. -
ప్రేమకథ షురూ
దుల్కర్ సల్మాన్ని ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని రయ్ రయ్మంటూ పూజా హెగ్డే బండి నడిపారు. ఇద్దరూ ఎలా చిరునవ్వులు చిందించారో ఇక్కడున్న ఫొటోలో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్గా ఓ ప్రేమకథా చిత్రం షురూ అయింది. రవి నెలకుదిటి దర్శకునిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా ప్రకటించి, బుధవారం ఆమె షూట్లో పాల్గొన్న విషయాన్ని చిత్రబృందం తెలియ జేసింది. ‘‘రవి నెలకుదిటి చక్కని ప్రేమకథ రాశారు. ఈ కథలో మంచి హ్యూమన్ డ్రామా, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉన్నాయి’’ అని కూడా యూనిట్ పేర్కొంది. పాన్–ఇండియా మూవీగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి. -
సందడే సందడి
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. చిరంజీవి, నయనతారలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇదే స్టూడియోలో మరో కాంప్లెక్స్లో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూట్లో భాగంగా విజయ్ సేతుపతి, టబుతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు పూరి. రెండు సినిమాల షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో షాట్ గ్యాప్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్ని కలిసి, సందడి చేసింది పూరి అండ్ టీమ్. ఇక ‘మన శంకరవర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే విజయ్ సేతుపతి– పూరి జగన్నాథ్ చిత్రం కూడా 2026 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అమ్మ అడుగుపెట్టగానే నాన్న స్టెప్పులు తడబడ్డాయి: చిరంజీవి కూతురు
మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి ఈవెంట్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమ్మను చూస్తే మీ నాన్నగారికి చిన్నపాటి భయం ఏదైనా ఉందా? అని సుస్మితను అడిగారు. దీనికి సుస్మిత స్పందిస్తూ ఇవాళ జరిగిన విషయాన్ని పంచుకున్నారు.సుస్మిత మాట్లాడుతూ..'ఇవాళే మన శంకర వరప్రసాద్గారు మూవీ సాంగ్ షూట్ చేశాం.. అక్కడికి అమ్మ కూడా రావడంతో నాన్న స్టెప్ అటు ఇటు అయింది. నాన్న సరిగ్గా డాన్స్ చేయలేకపోయారు. అమ్మ సెట్లో అడుగుపెట్టడంతో ఆ ఎఫెక్ట్ నాన్నపై పడిందని' పంచుకుంది. మీకు ఏదంటే భయమని సుస్మితను అడగ్గా.. మనకి భయపెట్టడం తప్ప.. భయపడటం ఏమీ ఉండదని సమాధానమిచ్చింది. కాగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి చిత్రం ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
వీడు మంచి స్టూడెంట్.. ఎగ్జామ్ పాసవుతాడు: కిష్కింధపురి డైరెక్టర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ కౌశిక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ..' మొదటి 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తాను. అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెబితే నాకు భయం వేసింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని రాత్రంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సినిమా చూశాం. అస్సలు కంగారు లేదు.. మూవీ చాలా బాగా వచ్చింది. ఎవరికైనా సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. నేను ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇచ్చింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు.. నన్ను నమ్మి నా ఎగ్జామ్ ఫీజ్ కట్టింది నిర్మాత సాహుకు.. వీడు గుడ్ స్టూడెంట్ ఎగ్జామ్లో పాసవుడుతాడని నమ్మడం వల్లే జరిగింది. కచ్చితంగా డిస్టింక్షన్లో పాసవుతామనే నమ్మకం ఉంది' అని అన్నారు. -
అల్లుడిని చూసి మురిసిపోతున్న నిహారిక.. బ్లాక్ శారీలో బిగ్బాస్ బ్యూటీ దివి!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ పిక్స్..విదేశాల్లో చిల్ అవుతోన్న నటి మంజు వారియర్..వరుణ్ తేజ్ కుమారుడితో నిహారిక కొణిదెల పిక్..బ్లాక్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..హాలీవుడ్ పాపలా పోజులిచ్చిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
బిగ్బాస్ హౌస్లో గుడ్డు గోల.. భరణిపై రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్!
తెలుగు బుల్లితెర ప్రియుల్లో అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్గా ప్రారంభమైంది. ఈనెల 7న 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టారు. ఈ సారి భిన్నంగా కామన్ కేటగిరీ నుంచి ఏకంగా ఆరుగురిని పంపించారు. ఈ సీజన్లో బిగ్బాస్లో తొమ్మిది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్గా అడుగుపెట్టారు. అయితే ప్రారంభమైన మూడు రోజులకే నామినేషన్స్తో హౌస్ను హీటెక్కించారు బిగ్బాస్. తొలివారంలో ఏకంగా తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.అయితే తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను బిగ్బాస్ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈరోజు జరిగే ఎపిసోడ్లో కేవలం గుడ్డు కోసం హౌస్ సభ్యులంతా గొడవకు దిగారు. ఎవరు గుడ్డు తిన్నారు అంటూ హౌస్మేట్స్ను ప్రశ్నించగా.. నేనైతే తినలేదండి.. ప్రామిస్ అంటూ సంజనా గల్రానీ అన్నారు. నీవల్లే అందరికీ ప్రాబ్లం అంటూ సంజనాతో భరణి వాదించారు. దీంతో భరణిపై మాస్క్ మ్యాన్ హరీశ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. మీరు టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను మీకంటే బాగా చేస్తానని మాస్క్ మ్యాన్ అన్నారు. దీంతో భరణికి, హరీశ్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హౌస్మేట్స్ అంతా వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్రోమో ఎపిసోడ్పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం బిగ్బాస్ ప్రోమో చూసేయండి.Guddu Poyindhi!🥚😬Tenants are banned from the House🚫🏠Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/9FdoevSKDG— JioHotstar Telugu (@JioHotstarTel_) September 10, 2025 -
‘కానిస్టేబుల్’కి 30 లక్షలు!
"హ్యాపీడేస్, కొత్త బంగారులోకం" వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’ తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ..‘ఈ సినిమాట్రైలర్ ను ఆగస్టు 31 వ తారీఖున రిలీజ్ చేశాం. ,నాటి నుంచి ఇప్పటివరకు జనాల్లో విశేష స్పందన వస్తోంది. 30 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ని ఆదరించారు. మా అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. త్వరలో భారీగా ప్రపంచవ్యాప్తంగా చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం’ అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ‘టైలర్ కి అద్భుత స్పందన రావడం ఆనందదాయకం. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా ఉంటుంది, అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది’అని అన్నారు. -
‘మిరాయ్’ షూటింగ్లో తేజకు గాయాలు, అనారోగ్యం.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ‘మిరాయ్’ అవకాశం వచ్చింది. అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ చిత్రంలోని యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అని అన్నారు హీరోయిన్ రితీకా నాయక్. హనుమాన్ తర్వాత తేజ సజ్జ నటించిన తాజా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా నటించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్గా రితీకా నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. ముఖ్యంగా తేజ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా చేసింది. అయినప్పటికీ ఆయన కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.మనోజ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా ఫన్ ఫుల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.కార్తీక్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. -
జూనియర్ ఎన్టీఆర్తో సినిమా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది భైరవం మూవీతో మెప్పించిన మనోజ్ మిరాయ్తో అలరించనున్నారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రంలో విలన్గా అభిమానులను మెప్పించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో తెరకెక్కించిన మిరాయ్ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన అభిమానులతో ఎక్స్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆస్క్ బ్లాక్స్వార్డ్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్లో ఫ్యాన్స్ పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని నిన్ను, జూనియర్ ఎన్టీఆర్ను తెరపై చూడాలన్న కోరిక ఉందని అడిగాడు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ..నాది కూడా అదే కోరిక అంటూ రిప్లై ఇచ్చారు.మరో అభిమాని మీరు నంద్యాలకు ఎప్పుడు వస్తారు అన్న అని అడిగాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మిరాయ్ సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తా.. నంద్యాల వైబ్ యే వేరు.. అది మిస్సయితే నా ఇంట్లో నాకు ఫుడ్ కూడా ఉండదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ట్విటర్లో సమాధానాలిచ్చాడు మంచు మనోజ్. కాగా.. మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Nakkuddaaa…♥️♥️♥️ #Tfi 🙏🏼❤️#AskBlackSword #Mirai https://t.co/P3PF1GwCat— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 Joining in to celebrate #Mirai big time!!! 🙌🏼Nandyal vibe ye veru :) ♥️♥️ Miss ayithe, na intilo naku food vundadhu… #AskBlackSword https://t.co/jw2isqn1LC— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 -
176 సినిమాలు చేశా కానీ, తిరుపతికి వెళ్తే ఓ పెద్దావిడ అలా అనేసింది: తమన్
తెలుగు ఇండియన్ ఐడల్ షో నాలో కొత్త మార్పుని తీసుకొచ్చింది. నేను సంగీతం అందించిన సినిమాలు నన్ను ప్రేక్షకుల ఇంటిదాక తీసుకెళ్తే.. ఈ షో ఇంటిలోపలికి తీసుకెళ్లేలా చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ కు పనిచేయడం ఒక బాధ్యతగా, గౌరవంగా భావిస్తున్నాం’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా, శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ గాన ప్రతిభను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - ఈ షో తర్వాత మేము మ్యూజిక్ కన్సర్ట్స్ కు వెళ్తే ఇండియన్ ఐడల్ లో బాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మా కన్సర్ట్స్ కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తిరుపతి దర్శనానికి వెళితే.. ఓ పెద్దావిడ క్యూలో నుంచి అందరిని పక్కకి నెట్టి నా దగ్గరకు వచ్చి ‘ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నావు’ అని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు నేను 176 సినిమాలకు సంగీతం అందించా.. వాటి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. షో గురించి చెప్పి వెళ్లింది(నవ్వుతూ..). అలాంటి గుర్తింపు మాకు తెలుగు ఇండియన్ ఐడల్ తీసుకొచ్చింది. ఈ షోలో డల్లాస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ షోను ఆర్గనైజ్ చేయబోతున్నాం. అందుకే గల్లీ టు గ్లోబల్ అనే క్యాప్షన్ పెట్టాం. కంటెస్టెంట్స్ పాడటం ఒక్కటే కాదు వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, ఇక్కడ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేవి అన్నీ క్యాప్చర్ చేస్తున్నాం. ఈ షోకు వస్తే మాకు హాలీడేకు వచ్చిన ఫీల్ కలుగుతుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ను ఒక ఆస్తిలా భావిస్తున్నాం. అన్నారు.నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతంగా వచ్చింది. అంత బాగా మీరు చేస్తానంటేనే సీజన్ 4కు ఇన్వెస్ట్ మెంట్ పెడదాం అని అన్నాను. ఇండియన్ ఐడల్ వారికి ప్రతి సీజన్ కు డబ్బు ఇచ్చి రైట్స్ తీసుకోవాల్సిఉంటుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ 4 బాగా చేస్తున్నారు. ఇందుకు తమన్ కు థ్యాంక్స్ చెప్పాలి. ఈ షోకు తమన్ లైఫ్ తీసుకొచ్చాడు. స్కూల్ లో చదువుతున్న పిల్లలు కూడా వచ్చి బాగా పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ ఎంతలా ఉందంటే అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వచ్చారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం, కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది. ఆహా నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ షో చేస్తున్నందుకు గర్వంగా ఉంది’అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ సమీరా భరద్వాజ్, గీతా మాధురి పాల్గొని మాట్లాడారు. -
ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు : హీరో బెల్లంకొండ
నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా హారర్ సినిమాలంటే ఇష్టం. మా ప్రొడక్షన్ లో చేసిన కాంచన లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను.చాలా రోజుల తర్వాత నాకు నచ్చే జానర్లో కిష్కింధపురి అనే ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ చిత్రం డియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది’అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సాయి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...→ దర్శకుడు కౌశిక్ కు మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ సాహు ఆడియన్స్ కి ద బెస్ట్ ఇవ్వాలని టెక్నికల్ గా గ్రాఫిక్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చారు.ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది.→ నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో ఈ సినిమా చూసాం. అదిరిపోయింది. ముఖ్యంగా సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం.→ ఈ సినిమా కథలోనే యాక్షన్ ఉంది. మొత్తం ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు. హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు. హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ఇది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.→ ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్ ని సెట్ గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్ లో షూట్ చేశాం. అది రియల్ గా పాతబడిపోయిన బిల్డింగ్. తర్వాత వాళ్లకి కొత్త బిల్డింగ్ వేసి ఇవ్వడం జరిగింది.→ ఈ సినిమాని టీనేజ్ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హారర్ కారణంగా సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలం అయిందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందాన్నిచ్చింది.→ ఈ మధ్య ఏదైనా ఒక కొత్తగా చేయాలి, యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది. ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు సెట్లో లొకేషన్ లో ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.→ కొత్త సినిమాల విషయానికొస్తే.. టైసన్ నాయుడు షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హైందవ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ ఈపాటికి షూటింగ్ అయిపోయేది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్. -
‘లిటిల్ మ్యాన్’ అంటూ కొడుకు ఫోటో షేర్ చేసిన వరుణ్.. చిరంజీవి పోస్ట్ వైరల్
మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ రోజు ఉదయం (సెప్టెంబర్ 10) హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ‘మా లిటిల్ మ్యాన్’ అంటూ ఒళ్లో బిడ్డను ఎత్తుకొని ఉన్న లావణ్య నుదిటిపై ముద్దు పెడుతున్న ఆయన ఫోటోని షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7)మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వరుణ్ జంటకు కంగ్రాట్స్ చెప్పారు. ‘కొణిదెల ఫ్యామిలీలోకి మరోవ్యక్తి వచ్చాడు. వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు. నాగబాబు, పద్మజ గ్రాండ్ పెరెంట్స్గా ప్రమోట్ అయినందుకు ఆనందంగా ఉంది’అంటూ బాబుని తన చేత్తుల్లో ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశాడు. చిన్నారికి అభిమానుల ఆశీస్సులు ఉండాలి అని చిరంజీవి కోరారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)కాగా, లావణ్య, వరుణ్లది ప్రేమ వివాహం. మిస్టర్ (2017) సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ చేసి, 2023 నవంబర్లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఏడాది మేలో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు మెగా ఫ్యామిలీ చెబుతోంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి
టాలీవుడ్ స్టార్ దంపతులు వరుణ్ తేజ్ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. లావణ్య బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి కూడా 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ సెట్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్- లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అటు అభిమానులు, సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా వరుణ్ జంటకు విషెస్ చెప్తున్నారు.లవ్ మ్యారేజ్వరుణ్-లావణ్యలది ప్రేమ వివాహం. 2017లో మిస్టర్ సినిమాలో తొలిసారి జంటగా నటించారు. తర్వాత అంతరిక్షంలోనూ యాక్ట్ చేశారు. ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడింది. అది ప్రేమగా మారడంతో కొంతకాలం డేటింగ్లో ఉన్నారు. తర్వాత పెద్దలనొప్పించి 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ చివరగా గతేడాది మట్కా సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం #VT15 అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. Our little man 🩵🩵🩵10.09.2025 pic.twitter.com/dFTCFFPl9o— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2025 View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
ఏడుస్తున్నా వినకుండా ఆ సీన్స్ చేయించారు.. నాపై చేతబడి చేశారు!
చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.వద్దని ఏడ్చా..చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. ఓ సినిమాలో దర్శకుడు రొమాంటిక్ సాంగ్ను స్విమ్మింగ్ పూల్లో ప్లాన్ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.ఇష్టం లేకుండా నటించాఅప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్గా కనిపించేలా చేశారు.చేజారిన సినిమాలు'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీలో సిమ్రాన్కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్ 'ముత్తు' సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు. నాపై చేతబడిమనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్గా మీనాను సెలక్ట్ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి -
'మహావతార్ నరసింహా' స్పూర్తి.. తెలుగులోనూ యానిమేషన్ సినిమా
కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహా' అనే యానిమేషన్ సినిమా సంచలనం సృష్టించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి రికార్డ్స్ కొల్లగొడుతోంది. ఇప్పుడు దీన్ని స్పూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ తెలుగులోనూ ఓ మూవీ తీసేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తన కొత్త మూవీని ప్రకటించింది. హనుమంతుడి జీవితం ఆధారంగా 'వాయుపుత్ర' పేరుతో ఈ త్రీడీ యానిమేషన్ సినిమాని తీస్తున్నారు. 'కార్తికేయ', 'కార్తికేయ 2', 'తండేల్' లాంటి హిట్ చిత్రాలు తీసిన చందు మొండేటి.. ఈ యానిమేషన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.నరసింహా అవతారం ఆధారంగా 'మహావతార్' మూవీ తీశారు. జనాల్ని భక్తి పారవశ్యం చెందేలా చేశారు. ఇప్పుడు 'వాయుపుత్ర' పోస్టర్ చూస్తుంటే హనుమంతుడి జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని యానిమేషన్ రూపంలో చూపించబోతున్నారని అనిపిస్తుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో నటీనటుల్ని పక్కనబెట్టి ఇలా పురాణాల్లోని క్యారెక్టర్స్ ఆధారంగా యానిమేషన్ మూవీస్ మరిన్ని వస్తాయేమో అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ)మన చరిత్ర, ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడిది ప్రత్యేక స్థానం. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు.. తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో 'వాయుపుత్ర' చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం.. భారీస్థాయిలో త్రీడీ యానిమేషన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. -
నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్
కామనర్స్ అంటే బెరుకుగా, భయంభయంగా ఉంటారనుకున్నారేమో! కానీ, సెలబ్రిటీలనే బెదరగొడుతున్నారు. అందులోనూ బిగ్బాస్ వారికి సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఇంటిని కామనర్ల చేతిలో పెట్టాడు. వాళ్ల అనుమతితోనే టెనెంట్లు (సెలబ్రిటీలు) లోపల అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పని, వంటపని, అందరి బట్టలు ఉతికే పని కూడా సెలబ్రిటీలే చేస్తున్నారు.షేడ్స్ చూపిస్తున్న కామనర్స్ఒక్కోసారి సెలబ్రిటీల పరిస్థితి చూసి జాలిపడతారు, బిగ్బాస్ (Bigg Boss Telugu 9) వద్దన్నా సరే మానవత్వం అంటూ అరటిపండ్లు ఇచ్చేందుకు ముందుకొస్తారు. అదే సమయంలో వాళ్లు ఆకలిగా ఉందని ఏదైనా తింటే మాత్రం బిగ్బాస్ రూల్ మర్చిపోయారా? అని లాక్కుంటారు. వాళ్ల విధానాలు వారికే అర్థం కావాలి! ప్రస్తుతానికి హౌస్లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పక్షపాతం చూపించాడు బిగ్బాస్. కామనర్స్ను పక్కనపెట్టేసి టెనంట్స్ మాత్రమే ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలన్నాడు.చేతులెత్తి దండం పెట్టిన తనూజఅంతటితో ఆగలేదు.. వారి నామినేషన్ కరెక్ట్గా ఉందా? లేదా? అన్నది చూడాల్సిన బాధ్యతను కామనర్స్కు అప్పగించాడు. ఇప్పటికే సంజనా, సుమన్ నామినేట్ అయ్యారు. తాజాగా ఈ నామినేషన్కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో శ్రీజ మాట్లాడుతూ.. వచ్చినప్పటి నుంచి కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారని తనూజ (Thanuja Puttaswamy)తో అంది. దానికామె చేతులెత్తి దండం పెట్టింది. పని కూడా చిరాకుపడుతూ చేస్తున్నారంది.అర్హత లేదని హెచ్చరికఒకరు ఒకసారి ఓ పని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకోపని చెప్తారు, నేనూ మనిషినే.. అంటూ తనూజ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించగా మధ్యలో మాస్క్ మ్యాన్ దూరాడు. నీ దయదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? మీ మాట, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని తిట్టాడు. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. కానీ తర్వాత మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. భరణి మినహా మిగతా అందరు సెలబ్రిటీలు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్, సుమన్, సంజన, ఫ్లోరా, రాము రాథోడ్, శ్రష్టి వర్మ నామినేషన్స్లో ఉన్నారు. వీరితో పాటు కామనర్ డిమాన్ పవన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
ఆసక్తికరంగా విజయ్ ఆంటోని 'భద్రకాళి' ట్రైలర్
తమిళ సంగీత దర్శకుడు కమ్ హీరో విజయ్ ఆంటోని వరసపెట్టి సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్తో వచ్చాడు. ఇప్పడు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఓ మూవీ చేశాడు. అదే 'భద్రకాళి'. లెక్క ప్రకారం సెప్టెంబరు 5నే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ 19వ తేదీకి వాయిదా పడింది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)ట్రైలర్ బట్టి చూస్తుంటే థ్రిల్లింగ్, పొలిటికల్ అంశాలు కనిపిస్తున్నాయి. సమాజంలోని దుష్టశక్తుల ఆటకట్టించే శక్తివంతమైన వ్యక్తిగా విజయ్ ఆంటోని పాత్ర ఉండనుందని అర్థమవుతోంది. ఈవారం 'మిరాయ్', 'కిష్కంధపురి' లాంటి తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వచ్చే వారం రాబోతున్న 'భద్రకాళి'కి పెద్దగా పోటీ లేదు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ) -
రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!
బిగ్బాస్ షో (Bigg Boss 9 Telugu)లో మొదటివారం నామినేషన్స్ సిల్లీగా ఉంటాయి. ఆమె నాతో మాట్లాడలేదు, తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు, ఆయన సరిగా ఇల్లు తుడవలేదు, నాకింకో ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం మీ అందరికీ బలమైన పాయింట్ అందించేందుకు నేనున్నానంటూ సంజనా గల్రానీ అభయమిచ్చింది. చీటికిమాటికి చిరాకు పడుతూ, గొడవలతో విసుగు తెప్పిస్తూ అందరికంట్లో పడింది. నీ పనిమనిషినా?ఇంకేముంది ఓనర్స్ అందరూ కలిసి సంజనాను ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు. తర్వాత వాష్రూమ్ దగ్గర రచ్చ మొదలైంది. కండీషనర్, షాంపూ బాత్రూంలో పెట్టకండి, బయటపెట్టుకోండి అని ఫ్లోరా చెప్తుంటే సంజనా అడ్డంగా వాదించింది. విసుగెత్తిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా? బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా? అని నిలదీసేసరికి సంజనా కోపం నషాళానికంటింది. మ్యానర్స్ లేదు, అదీ ఇదీ అని చెడామడా తిట్టేసరికి ఫ్లోరా ఏడ్చేసింది.ఫుటేజ్ కోసమా?అదంతా చూసిన శ్రీజ.. ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలమైన సంజనా.. ఏమన్నావ్? ఫుటేజ్ కోసమా? నా ముందు వేలు చూపించి మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తూనే చీప్ అని తిట్టింది. తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్తో శ్రీజను చూపిస్తూ అది సైకో, దాన్ని చూస్తేనే చిరాకు అని చీదరించుకుంది తర్వాత టెనెంట్స్లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలన్నాడు బిగ్బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. రీతూ తలకు గాయంసుత్తిని అందుకున్నవారు నామినేషన్స్ చేస్తారు. ఈ ప్రక్రియలో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దాంతో ఆమెను మెడికల్ రూమ్కు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎక్కువగా మౌన వ్రతంలోనే ఉంటున్న సుమన్.. ఎట్టకేలకు నిన్న నోరు విప్పాడు. కానీ సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. మిగతా నామినేషన్స్ నేటి ఎపిసోడ్లో కొనసాగనున్నాయి.చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ -
హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ
ఎన్ని సినిమాలు చేసినా సరే నటీనటులకు ఏదో ఒక డ్రీమ్ పాత్ర మిగిలే ఉంటుంది. అలా ప్రముఖ నటి శోభన కూడా ఓ పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. గొప్ప నాట్య కళాకారిణి కూడా. నటించడం తగ్గించి భరతనాట్యం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తోంది. అలా చైన్నెలో డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తోంది. మరోవైపు అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. అదీ తనకు నచ్చిన పాత్రలు అయితేనే.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)ఇటీవల మలయాళంలో మోహన్ లాల్కు జంటగా 'తుడరుమ్' మూవీలో శోభన లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం అద్భుతమైన హిట్ అయింది. శోభన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓనం సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ.. తాను ఓ హిజ్రా పాత్రని పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయమై దర్శకులతోనూ మాట్లాడానని అన్నారు. కానీ వారు మాత్రం.. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో అంగీకరించరని తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.మమ్ముట్టి నటిస్తే స్వాగతించలేదా? అని సదరు దర్శకుల్ని తాను ప్రశ్నించినట్లు శోభన చెప్పారు. మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి.. రీసెంట్గా 'కాదల్ ది కోర్' అనే సినిమా చేశారు. ఇందులో స్వలింగ సంపర్కుడిగా (హిజ్రా) నటించడం విశేషం. దీంతో హిజ్రా పాత్రలో నటించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు శోభన పేర్కొన్నారు. ఆ తరహా పాత్రలో నటించడం చాలా కష్టమని చెప్పిన ఈమె.. అందుకు రూపురేఖలు, మాట్లాడే తీరు, గొంతు లాంటివి చాలా ముఖ్యమని అన్నారు అందువల్ల అలాంటి పాత్రలో నటించడం తనకు చాలా ఛాలెంజ్గా ఉంటుందని పేర్కొన్నారు. కాగా శోభనని హిజ్రాగా నటింపజేయడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ) -
నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎందుకంటే టాలీవుడ్లో సినిమాలు వస్తున్నాయి గానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడట్లేదు. అయితే హిట్ లేదంటే డిజాస్టర్ అవుతున్నాయి. మరోవైపు మూవీ టీమ్ నుంచి ఎవరో ఒకరు షాకింగ్ ఛాలెంజులు చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్గా నిర్మాత నాగవంశీ ఇలానే ఛాలెంజ్ చేసి ఎంత ట్రోలింగ్కి గురయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.కొన్ని నెలల క్రితం 'భైరవం'తో వచ్చిన బెల్లంకొండ.. ఫ్లాప్ చవిచూశాడు. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీమ్ అంతా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. అయితే హీరో చేసిన కామెంట్స్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)'రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు అన్నీ మరిచిపోయి సినిమాలో లీనమయ్యే సత్తా ఈ 'కిష్కింధపురి'కి ఉంది. మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్ పట్టుకోకపోతే చాలు మనం సక్సెస్ అయినట్లే. ఈ చిత్రం కూడా అలాంటిదే. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరైనా ప్రేక్షకులు తమ మొబైల్ బయటకు తీశారంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా' అని బెల్లంకొండ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ హీరో ఏం చేస్తాడో చూడాలి?బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన ఈ హారర్ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పాడుబడిన రేడియో స్టేషన్, అక్కడికి వెళ్లిన కొందరు ఔత్సాహికులు, కాసేపటికి దెయ్యం ఎంటర్, తర్వాత ఏమైంది? అనే కాన్సెప్ట్తో తీసిన మూవీలానే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్) -
సస్పెన్స్... థ్రిల్
సన్నీ కునాల్ హీరోగా, దేవిక సాహూ, ఆశ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోహిణి’. సంగ కుమార్ దర్శకత్వంలో కేవీ నరసింహ రాజు సమర్పణలో కుశాల్ రాజు నిర్మించారు. ఆనంద్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో లాంచ్, ట్రైలర్ విడుదల వేడుకని హైదరాబాద్లో నిర్వహించారు. సంగ కుమార్ మాట్లాడుతూ–‘‘యూనిట్లోని ప్రతి ఒక్కరి కృషి వల్లే మా సినిమా త్వరగా పూర్తయింది.రాజేంద్ర రాజు కాంచనపల్లి అందించిన సహకారం మా సినిమాకు బలం’’ అని తెలి పారు. ‘‘త్వరలోనే విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు కుశాల్ రాజు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సస్పెన్స్, థ్రిల్, రొమాన్స్ వంటి అంశాలు మా చిత్రంలో చాలా ఉన్నాయి’’ అన్నారు సన్నీ కునాల్. ‘‘దాసరి వెంకటరమణగారి పాటలు వినసొంపుగా, కనువిందుగా ఉంటాయి’’ అని సమర్పకుడు కేవీ నరసింహ రాజు తెలి పారు. -
ఏటిగట్టుపై యాక్షన్
సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్లో యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ‘‘రూ. 125 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది.పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్ స్టార్తో ఈ షెడ్యూల్లో తేజ్ తలపడతారు. మా చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నాం... సమ్మె కారణంగా వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్ తెలిపింది. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ట్రైలర్ రిలీజ్పై బిగ్ అప్డేట్!
తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం మిరాయ్. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ గురించి మాట్లాడారు. టికెట్ ధరలు పెంచబోమని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ మంది సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.ది రాజాసాబ్ అప్డేట్ ఇదే..మిరాయ్ ప్రెస్మీట్లో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా విడుదల కానుందని తెలిపారు. రిషబ్ శెట్టి కాంతార-2 ప్రదర్శించే థియేటర్లలో ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే ఈ లెక్కన అక్టోబర్ 2న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజున తొలి పాటను విడుదల చేసే ఆలోచన ఉందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ది రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.#TheRajaSaab trailer1 will be attached with #KantaraChapter1 🔥 - #TGVishwaPrasad, Producer. Be ready for mass trailer in just one month. #KantaraChapter1onOct2 #TheRajaSaabTeaser #Prabhas #RishabhShetty #Bijuria pic.twitter.com/pmV250U6Q6— Subha The Luck (@Subha_The_Luck) September 3, 2025 -
కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన ఆయన.. నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. తన డ్రీమ్ను ఇవాళ నేరవేర్చుకున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఓఎంఐ అనే సంస్థను లాంఛ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.శర్వానంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ..' ఈరోజు నా హృదయానికి దగ్గరైన కల.. ఓఎంఐకి నాంది పలికింది. ఈ దార్శనికతను ప్రారంభించినందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు. ఓఎంఐ అనేది సృజనాత్మకత, స్థిరత్వం, మానవ సంబంధాన్ని పెంపొందించడానికి మొదలెట్టిన ఒక వాగ్దానం' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారుఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ భోగి చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ డింపుల్ హయతి లీడ్ రోల్ చేస్తున్నారు.Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz— Sharwanand (@ImSharwanand) September 9, 2025 -
నా మిత్రురాలికి ఆల్ ది బెస్ట్.. ఐకాన్ స్టార్ ప్రశంసలు
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దక్ష(Daksha – The Deadly Conspiracy). తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్పై బన్నీ ప్రశంసలు కురిపించారు. నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు, మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.అల్లు అర్జున్ రియాక్షన్పై దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే మోహన్ బాబు, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతమందిస్తున్నారు. Best wishes to my dearest friend @LakshmiManchu on her upcoming film #Daksha. Lots of Love & Warm hug. It’s wonderful to see you and @themohanbabu garu together on screen.#DakshaTrailer – https://t.co/PSsbRCP2FFWishing the film immense success. Best wishes to director…— Allu Arjun (@alluarjun) September 9, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించారు. -
చీరలో భాగ్యశ్రీ.. కెమెరా పచ్చబొట్టుతో త్రిష
చీరలో ఎల్లోరా శిల్పంలా అనిపిస్తున్న భాగ్యశ్రీ బోర్సేవీపుపై మూవీ కెమెరా పచ్చబొట్టుతో త్రిషసింపుల్ లుక్స్లో కీర్తి సురేశ్ ఎంజాయ్ మెంట్ఓనం ఫుడ్ తింటూ ఆస్వాదిస్తున్న రష్మీ గౌతమ్కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న రకుల్ ప్రీత్డిజైనర్ డ్రస్సులో మీనాక్షి చౌదరి గ్లామర్ చూశారా? View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) -
తెలుగు సినిమా టైటిల్ చెప్పండి చాలు.. లక్ష రూపాయలు మీకే!
సినిమా పేరు చెప్పండి.. లక్ష రూపాయలు మీకే. ఏంటి మూవీ పేరు లక్ష రూపాయలిస్తారా?అని అనుకుంటున్నారా? అవునండి మీరు విన్నది నిజమే.. మీ మెదడుకు పదునుపెట్టి టైటిల్ ఏంటో పట్టేయండి.. లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.త్రినాధ్ కటారి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఐఎంవై అనే టైటిల్తో రూపొందిస్తున్నారు.ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఓం గమ్ గణపతయే నమహా అంటూ సాగే భక్తి పాటను కూడా విడుదల చేశారు. ఈ పాట ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు.అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ను మేకర్స్ ప్రారంభించారు. ఐఎంవై మూవీకి తెలుగులో టైటిల్ పేరు కరెక్ట్గా చెప్పినవాళ్లకు లక్ష రూపాయల బహుమతి అందించనున్నారు. అంతేకాకుండా టాప్-10 క్రియేటివ్ టైటిల్స్ పంపినవారికి సైతం రూ.5 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఈ లక్ష రూపాయలు నగదు గెలుచుకోవాలనుకుంటే ఈనెల 13వ తేదీలోగా మీ సమాధానాన్ని 7569933855 నంబర్కు వాట్సాప్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రియేటివిటీతో లక్ష రూపాయలు సొంతం చేసుకోండి.కాగా.. ఈ చిత్రాన్ని సంజీవని ప్రొడక్షన్ బ్యానర్లో కె శంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ, దేవి శ్రీప్రసాద్, గోపరాజు రమణ, తనికెళ్ల భరణి, మధుమణి, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by K Shankar (@sanjeevaniproductionss) -
ఎన్నో అవమానాలు.. ఈ స్థాయికి వస్తాననుకోలేదు: నిర్మాత ఎమోషనల్
అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana). అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.15 సినిమాలుతన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ఈ ఘనత తన ఒక్కడిదే కాదని, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని తెలిపారు. 15 సినిమాల్లో "యండమూరి కధలు, కె.పి.హెచ్.బి. కాలనీలో, మా నాన్న హీరో, మహానాగ" చిత్రాల రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, మిగతా చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయని వివరించారు. ఇదే ఏడాదిలో ఒక ప్రముఖ దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈ బర్త్డే ఎంతో స్పెషల్ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు!! తొలినాళ్లలో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న తనకు... ఇండస్ట్రీ ఇంత మంచి స్థానాన్ని, స్థాయిని ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇందుకు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని వెల్లడిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతగా 200 చిత్రాలు పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకటించారు. -
ఎనిమిది భాషల్లో మిరాయ్ రిలీజ్.. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న హీరో తేజ సజ్జా. ప్రస్తుతం యాక్షన్-ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్లో కనిపించనున్నారు.తాజాగా మిరాయ్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు హీరో తేజ సజ్జా ట్వీట్ చేశారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఈ మూవీని ఎంజాయ్ చేయండని పోస్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా యాక్షన్, ఎమోషన్, భక్తి ఉండే చిత్రమని రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా మెప్పించనుంది. అంతేకాకుండా శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. 2డీతో పాటు 3డీ ఫార్మాట్లో రిలీజవుతోంది.#MIRAI Censored with 𝐔/𝐀 ❤️🔥A CLEAN FILM for KIDS, FAMILIES and ALL SECTIONS OF AUDIENCE to experience Action, Emotion & Devotion on the big screens💥💥💥GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🥷Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg… pic.twitter.com/p3zCOrTWK9— Teja Sajja (@tejasajja123) September 8, 2025 -
మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
మంచు ఫ్యామిలీ నుంచి రీసెంట్గా వచ్చిన సినిమా 'కన్నప్ప'. చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీ చేసినా సరే మంచు విష్ణుకి పెద్దగా కలిసిరాలేదు. పాన్ ఇండియా కాన్సెప్ట్ కావడంతో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరుల్ని ఒప్పించిన విష్ణు.. ఈ చిత్రంలో వీళ్లతో అతిథి పాత్రలు చేయించాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది. ఇప్పుడు మంచు కుటుంబం నుంచి మరో చిత్రం విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్)మంచు లక్ష్మీ లేటెస్ట్ మూవీ 'దక్ష'. మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పోలీస్ పాత్రలో మంచు లక్ష్మీ కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని అల్లు అర్జున్ లాంచ్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే చాన్నాళ్ల క్రితం తీసిన మూవీలా అనిపిస్తుంది. అలానే మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో తీసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతానికి ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ థియేటర్లలో విడుదల ఎప్పుడు ఏంటనేది మాత్రం వెల్లడించలేదు.మరోవైపు మంచు మనోజ్.. కొన్నాళ్ల క్రితం 'భైరవం'తో చాన్నాళ్ల తర్వాత నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇతడు విలన్గా చేసిన 'మిరాయ్' అనే సూపర్ హీరో మూవీ రిలీజ్కి సిద్ధమైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం.. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
టాలీవుడ్ రేంజ్ పెంచే సినిమా 'ఏ మాస్టర్ పీస్': మూవీ టీమ్
శుక్ర, మాటరాని మౌనమిది తదితర సినిమాలు తీసిన దర్శకుడు పూర్వాజ్ లేటెస్ట్ మూవీ 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సినిమాని మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశా. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ని, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఓ అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్ని ఈ చిత్రంలో చూస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ పూర్వాజ్ చెప్పుకొచ్చారు. -
మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా
'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించాడు హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ (Mirai Movie). మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. వారికోసమే ఈ నిర్ణయంతెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, మరాఠి, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సోమవారం నాడు మిరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై టికెట్ రేట్ల పెంపు గురించి హీరో క్లారిటీ ఇచ్చాడు. తేజ సజ్జా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు లేదు. తక్కువ ధరకే ఈ సినిమాను చూడబోతున్నారు. మా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ను ఇబ్బంది పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కుటుంబమంతా వచ్చి చూడాలనే టికెట్ రేట్లు పెంచడం లేదు అని తేజ సజ్జ పేర్కొన్నాడు.టికెట్ రేట్లు యథాతథంఅయితే ఓ రెండు సర్ప్రైజ్లు దాచుంచామని, అది ఎవరికీ తెలియదని, తెలుసుకోవాలంటే థియేటర్కు రమ్మని పిలుపునిచ్చాడు. ఈరోజుల్లో మధ్య తరహా, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. అలాంటి తరుణంలో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా తీసుకొస్తుండటంతో పలువురూ మిరాయ్ టీమ్ను అభినందిస్తున్నారు.కథేంటంటే?మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని భావించి దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. ఆ గ్రంథాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ వాటిని ఒక్కొక్కటిగా తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాటిని హీరో కాపాడాడా? లేదా? అన్నదే సినిమా కథ! ఈ మూవీని చైనా, జపాన్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
వీడియోలు తొలగించండి.. ఢిల్లీ హైకోర్టుకు ఐశ్వర్య రాయ్
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను అనుమతి లేకుండా పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని వెంటనే వాటిని నిర్మూలించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. అనుమతి లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. AI- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య అన్నారు.ఐశ్వర్య రాయ్ పిటిషన్ను జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఐశ్వర్య తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సందీప్ సేథి కోర్టులో బలంగానే వాదించారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఐశ్వర్య పేరును ఉపయోగించి పలు వస్తువులను అమ్ముతున్న అనేక వెబ్సైట్ల వివరాలను కోర్టుకు అందించారు. aishwaryaworld.com అనే ఒక వెబ్సైట్ను సూచిస్తూ.. ఆమె నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే అది "ఐశ్వర్య రాయ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్" అని చెప్పుకుంటున్నారని సేథి అన్నారు.ఒకరి లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ఆమె పేరు, ఫోటోలు ఉపయోగించబడుతున్నాయని న్యాయవాది సందీప్ సేథి కోర్టులో లేవనెత్తారు. ఒక పెద్దమనిషి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది చాలా నీచమైన పని అంటూ న్యాయవాది ఫైర్ అయ్యారు. దీంతో న్యాయస్థానం కూడా ఐశ్వర్యకు అనుకూలంగానే స్పందించింది. వివిధ ప్రయోజనాల కోసం ఆమె చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్సైట్లపై ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే URL లింక్లను పూర్తిగా తొలగించడానికి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం తెలిపింది. -
నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్లో హీరోయిన్
బిగ్బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్బాస్ హౌస్లో ఎవరైతే కిచెన్లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి! -
దోశ 'కింగ్' బయోపిక్లో మోహన్లాల్!
పీ రాజగోపాల్.. ఈ పేరు దేశవ్యాప్తంగా పరిచయమే.. తమిళనాడులో శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. కోట్ల రూపాయలు సంపాధించాడు. అయితే, తన జాతకాల పిచ్చి వల్ల ఒక మహిళ జీవితం నాశనం కావడం ఆపై అతని జీవితం కూడా అగ్గిలో కాలిపోయింది. ఇప్పుడు అతని బయోపిక్ వెండితెరపైకి రానుంది. ఇప్పటికే ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ చిత్రంలో నటించేందుకు స్టార్ హీరో అంగీకరించినట్లు తెలుస్తుంది.జై భీమ్, వేట్టాయాన్ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. తాజాగా ఈ దర్శకుడు తన మూడవ చిత్రానికి సిద్ధమయ్యాడు. సరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్ జీవిత ఇతివత్తంతో చిత్రాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో రాజగోపాల్, జీవజ్యోతి అనే మహిళ మధ్య జరిగిన ప్రేమ పోరాటం, రాజగోపాల్ జైలు పాలైన సంఘటనలు ప్రధానాంశంగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు. దీనికి దోసెకింగ్ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఇందులో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ను నటింపజేసేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జంగ్లి పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం మోహన్లాల్ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దోసెకింగ్ చిత్రంలో నటించడానికి మోహన్ లాల్ ఓకే చెబుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.జ్యోతిష్యం పిచ్చి.. దహించేసిన 'కామాగ్ని'‘శరవణ భవన్’ పి.రాజగోపాల్ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది.జీవజ్యోతితో పెళ్లి కోసం..జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. అతనికి 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది.ట్యూషన్ మాస్టర్తో ప్రేమజీవజ్యోతి పి.రాజగోపాల్ను తన గార్డియన్గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి,శాంతకుమార్ ఒప్పుకోలేదు.జీవజ్యోతి భర్త హత్యజీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్తో శాంతకుమార్ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది.ఒంటరి పోరాటంరాజగోపాల్కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు. -
గుండంకుల్.. ఎంతమాటన్నాడ్ సార్? అపరిచితుడు బయటకొచ్చేశాడు!
బిగ్బాస్ 9 (Bigg Boss 9 Telugu) మొదలైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున అన్నది కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. మొదటి రోజే గొడవపడ్డారు. మాస్క్ మ్యాన్ హరీశ్, కమెడియన్ ఇమ్మాన్యుయేట్ మధ్యే ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం కూడా ఓ రకంగా బిగ్బాస్ అనే చెప్పాలి! సెలబ్రిటీలను కామనర్స్గా, కామనర్స్ను సెలబ్రిటీలుగా మార్చేశాడు బిగ్బాస్. సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక, ప్రధాన హౌస్లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు. నోటి కాడ కూడును లాక్కున్నాడు కూడా!ఒక్క పూట అన్నం కోసం..వాళ్లకు వండిపెట్టాలని చెప్పానే తప్ప తినమని ఎవరు చెప్పారన్నట్లుగా సరిగ్గా ప్లేటు ముందు పెట్టుకున్న సమయంలో ఆ ఫుడ్ను లోపల పెట్టేయమన్నారు. దీంతో తొమ్మిది మంది సెలబ్రిటీలు చేసేదేం లేక కళ్లతోనే భోజనాన్ని ఆస్వాదించి తిండి మాని పస్తులున్నారు. ఇది హరీశ్ తట్టుకోలేకపోయాడు. తిండి లాక్కోవడం తప్పంటూ బిగ్బాస్కే క్లాస్ పీకాడు. వాళ్లు తినేవరకు తానూ తినేది లేదని భోజనం ప్లేటు మీద నుంచి లేచాడు. అంతేకాదు, బ్రదర్ నేనున్నా అంటూ సెలబ్రిటీలకు అరటిపండ్లు పట్టుకెళ్లాడు. దాంతో బిగ్బాస్ మరోసారి వారించాడు. గుండు అంకుల్.. బెడిసికొట్టిన కామెడీవారిని పస్తులుంచడం తట్టుకోలేని హరీశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అయినా బిగ్బాస్ మరీ అంత చెడ్డోడు కాదులే.. ఏదో కాసేపు అలా తినొద్దని భయపెట్టినా తనే స్వయంగా ఫుడ్ పంపించాడు. అంటే కామనర్లకు సెలబ్రిటీలు వండిపెడ్తే.. సెలబ్రిటీలకు బిగ్బాస్ ఆహారం పంపిస్తాడన్నమాట! ఇకపోతే ఇమ్మాన్యుయేల్ ఏదో కామెడీ చేద్దామని ప్రయత్నించాడు. హరీశ్ను గుండు అంకుల్ అన్నాడు. మొదట ఆయన పట్టించుకోలేదు, కానీ రెండుమూడు సార్లు అనేసరికి చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు? ఎవరు అంకుల్? అని ఫైరయ్యాడు.బాడీ షేమింగ్అప్పటికే హర్ట్ అయ్యాడని గమనించిన ఇమ్ము.. అన్నా సారీ చెప్పా కదా అని సముదాయించాడు. అయినా తగ్గని హరీశ్.. లిమిట్లో ఉండు, బాడీ షేమింగ్ చేయొద్దని హెచ్చరించాడు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా, నెత్తిమీద ఎక్కాలని చూస్తే తొక్కిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చాలాసేపు వీరిమధ్య ఫైట్ నడిచింది. ఆయన గుండు చేయించుకుందే బిగ్బాస్ కోసం! అగ్నిపరీక్ష షోలో అరగుండు చేయించుకోమనగానే క్షణం ఆలోచించకుండా సగభాగం షేవ్ చేసుకున్నాడు. అతడిని ధైర్యాన్ని మెచ్చిన బిందుమాధవి.. మరీ అరగుండుతో ఎంతకాలం ఉంటావని పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది. అపరిచితుడు బయటకొచ్చేశాడుఇక బిగ్బాస్ షో అంతా అరగుండుతోనే ఉండాలని హరీశ్కు కండీషన్ కూడా పెట్టారు. ఈయన ఒక్కరోజులోనే తినమని ప్రేమ, తిననందుకు కన్నీళ్లు, తనపై కామెడీ చేసినందుకు కోపం.. ఇలా అన్నీ చూపించాడు. లైవ్లో అయితే వయసెంత అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సరదాగా ఉన్నాడట! మొత్తానికి మొదటిరోజే అపరిచితుడిని చూసేశామన్నమాట! చదవండి: రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్ -
అల్లు కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదనంగా పెంట్హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్హౌస్ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. ఈ పార్క్ జూబ్లీహిల్స్లో ఉంది. ఇది గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, అనుమతులు లేకుండా పెంట్హౌస్ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. -
రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్
వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కాజల్ అగర్వాల్కు టాలీవుడ్లో భారీగానే అభిమానులు ఉన్నారు. కన్నప్పలో చివరిసారిగా కనిపించిన ఆమె బాలీవుడ్ రామాయణలో నటించనుంది. అయితే, ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయింది.'నేను ప్రమాదానికి గురైనట్లు కొన్ని నిరాధారమైన వార్తలను చూశాను. ఇక లేనని కూడా! కూడా ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. వాటిని చూసిన తర్వాత నేను ఎంతో నవ్వుకున్నాను. అంతకు మించిన ఫన్నీ న్యూస్ ఏమీ ఉండదు. పూర్తిగా అవాస్తవం ఉన్న వార్తలను వైరల్ చేయాల్సిన పనిలేదు. దేవుని దయవల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. అంతేకాకుండా మరింత బాగానే ఉన్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రేమ, కృతజ్ఞతతో మీ కాజల్' అంటూ ఆమె పోస్ట్ చేసింది.కాజల్ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతోందని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి పుకార్లు ఎక్కడి నుండి వచ్చాయో , అవి ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియాల్సి ఉంది. కానీ, కాజల్ స్వయంగా సకాలంలో వివరణ ఇవ్వడం ఆమె అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించింది.I’ve come across some baseless news claiming I was in an accident (and no longer around!) and honestly, it’s quite amusing because it’s absolutely untrue. 😄By the grace of god, I want to assure you all that I am perfectly fine, safe, and doing very well ❤️I kindly request…— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 8, 2025 -
'మిరాయ్' కోసం శంకర్ మహదేవన్.. పవర్ ప్యాక్డ్ సాంగ్ వచ్చేసింది
మిరాయ్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. తేజ సజ్జా ప్రధాన కథానాయుకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్లోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో రితికానాయక్ హీరోయిన్గా నటించగా.. మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి 'జైత్రయా' సాంగ్ను విడుదల చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించారు. -
ఆకతాయిల నుంచి హీరోయిన్ను కాపాడిన స్టార్ హీరో ఫ్యాన్స్
ఒక్కో సారి చిత్ర యూనిట్కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే కన్నడ నటి 'నీమా రే' ఎదుర్కున్నారు. తమిళ్లో మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇరవిన్ విళిగళ్.. ఈ చిత్రాన్ని సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. 'నీమా రే' హరోయిన్గా నటిస్తుంది. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిన అభిమానులు భారీగానే చేరిపోతారు.అయితే, తను నటిస్టున్న కొత్త చిత్రం సామాజిక మాధ్యమాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్గా రానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ను తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్ 'నీమా రే' చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్ దళపతి అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టారని దర్శకుడు చెప్పారు. ఈ సంఘటనతో నటి 'నిమా రే' చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్ విళిగల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. నటి నీమా రే.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఆపై ఎయిర్ హోస్టెస్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె తమిళం, కన్నడ, తులు భాషల చిత్రాలలో నటించారు. -
ఆ నమ్మకంతోనే ఉన్నాం: కౌశిక్ పెగల్లపాటి
‘‘సాయి శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్లో వచ్చిన ‘రాక్షసుడు’(2019) సినిమా మంచి విజయం సాధించింది. వారి కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘కిష్కింధపురి’పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. మా సినిమా ఫైనల్ ఔట్పుట్ చూశాక ఆ అంచనాలను అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. ఒక సున్నితమైన కథతో, మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది’’ అని డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’.షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆ తర్వాత కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఓ సందర్భంలో నిర్మాత సాహుగారికి ‘కిష్కింధపురి’ కథ చెప్పాను.. ఆయనకి చాలా నచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస్గారు విని, బాగా ఎగై్జట్ అయ్యారు. ఈ సినిమా చేయడానికి అల్లు అరవింద్, బన్నీవాస్గార్లు కూడా ఒప్పుకున్నారు.హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ‘కిష్కింధపురి’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ కథకి స్ఫూర్తి రామాయణం. 1989లో కథ మొదలవుతుంది. కథ, విజువల్, టెక్నికల్గా ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని శ్రీనివాస్గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు చేయని పాత్రలో అనుపమ కనిపిస్తారు. సాహు గారపాటిగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.చేతన్ భరద్వాజ్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా చిత్రంలో స్మోకింగ్, డ్రింకింగ్ సన్నివేశాలు ఉండవు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. నా తొలి సినిమాకి ద్వితీయ చిత్రానికి ఎక్కువ గ్యాప్ వచ్చింది.. అయితే ఇకపై ఆ గ్యాప్ రాకూడదని కోరుకుంటున్నా. నా తర్వాతి సినిమాకి రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని చెప్పారు. -
డిజే టిల్లు దర్శకుడి కొత్త సినిమా.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో రాగ్ మయూర్ మరో సినిమాకు రెడీ అయిపోయారు. డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ డైరెక్షన్లో పని చేయనున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ బ్యానర్లో వస్తోన్న నాలుగో చిత్రం కావడం విశేషం. ఇవాళ నిర్వహించిన పూజా వేడుకలో హీరో రాగ్ మయూర్ పాల్గొన్నారు.మేఘ చిలక స్నేహ, జగ్తియాని క్లాప్ కొట్టగా.. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తుంఽగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, నవీన్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
పెళ్లి కూతురిలా జాన్వీ కపూర్.. నివేదా చబ్బీ లుక్
పెళ్లి కూతురిలా ముస్తాబైన జాన్వీ కపూర్జిగేలు మనే డ్రస్సులో మెరిసిపోతున్న తమన్నాతెల్లని చీరలో ఓనం జరుపుకొన్న నివేదా థామస్చీరలో మరింత అందంగా అనన్య నాగళ్లఇళయరాజా పాట పాడి ఆకట్టుకున్న మడోన్నారెడ్ డ్రస్సులో 'లిటిల్ హార్ట్స్' శివానీ నాగారం View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
సింగర్గా రామ్ పోతినేని.. ఆంధ్ర కింగ్ తాలూకా సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే.. రామ్కు జంటగా నటిస్తోంది. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 28న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని పప్పీ షేమ్ అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ను రామ్నే ఆలపించడం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించహా.. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. -
'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'లిటిల్ హార్ట్స్' హిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే ఈ మూవీలో మిగతా పాటలేమో గానీ సెకండాఫ్లో వచ్చే 'కాత్యాయని' పాట అయితే వేరే లెవల్ ఉంటుంది. సంగీతంలో ఉండే రూల్స్ లాంటివి ఏం అందులో పాటించరు కానీ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అయిదే ఇది రీమేక్. దీనికి ఒరిజినల్ ఇప్పటికే ఉంది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)'కాత్యాయని' అంటూ సినిమాలో ఉన్న పాటకు ఎనిమిదేళ్ల క్రితం యూట్యూబ్లో రిలీజైన ఓ సాంగ్ మూలం. శరత్ గౌడ్ అనే కుర్రాడు 'కమాన్ బేబీ' పేరుతో ఓ గీతాన్ని పాడుతూ డ్యాన్స్ చేశాడు. అప్పట్లో పెద్ద వ్యూస్ రాలేదు కానీ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' రిలీజైన తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పాటని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ సాంగ్ ఓసారి వినేయండి.'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని నాగరం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకుడు. టీనేజ్ లవ్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో పెద్ద కథేం ఉండదు. ఫన్నీ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. అవే ఇప్పుడు ప్రేక్షకుల్ని ఫుల్గా నవ్విస్తున్నాయి. నాలుగు రోజుల్లో కలెక్షన్ కూడా చాలానే వచ్చాయి.(ఇదీ చదవండి: హిందీ వెబ్ సిరీస్లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్) -
'ఓరేయ్.. నా ముందుకొచ్చి మాట్లాడరా?'.. మంచు లక్ష్మీ ఆగ్రహం!
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి దాదాపు ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనుంది. ప్రస్తుతం ఆమె దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని తన సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి వంశీకృష్ణ మల్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఇటీవల దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్-2025 వేడులకు హాజరైంది. మంచు లక్ష్మీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అక్కడే మంచు లక్ష్మీ వేదిక వద్దకు వెళ్తుండగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని అసభ్యకరంగా కామెంట్ చేయడంతో మంచు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా? మీకసలు సెన్స్ లేదు రాస్కెల్స్.. అంటూ మండిపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత చాలామంది అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చింది మంచు లక్ష్మీ.కాగా.. మంచు లక్ష్మీ నటించిన యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మంచు లక్ష్మీ పవర్పుల్ పాత్రలో కనిపించారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నుంచి పదేళ్ల తర్వాత దక్ష రూపంలో మరో చిత్రం విడుదల కానుంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు మూవీ ఆ బ్యానర్ నుంచి చివరిగా విడుదలైంది. View this post on Instagram A post shared by KIO TV (@kiotv27) -
నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్బాస్ 9 ప్రోమోస్ రిలీజ్
బిగ్బాస్ షో ఏ సీజన్ తీసుకున్నా సరే కాస్త కుదురుకోవడానికి కాస్త సమయం పట్టేది. తర్వాత నామినేషన్స, గొడవలు లాంటివి ఉండేవి. ఈసారి మాత్రం వచ్చీ రాగానే మొదలుపెట్టారు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచిన సామాన్యులు హరీశ్, మనీష్. తొలిరోజే గొడవ పెట్టేసుకున్నారు. ఇందుకు సంబంధించిన తొలిరోజు ప్రోమోని రిలీజ్ చేశారు.షో ప్రారంభమైన ఆదివారం నాడే ఇల్లు క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, బట్టలు ఉతకడం లాంటి బాధ్యతలు కొందరికి అప్పగించారు. అలానే అగ్నిపరీక్షలో నెగ్గి వచ్చిన ఆరుగురు లోపల హౌస్ ఓనర్స్ అని, మిగిలిన తొమ్మిది టెనెంట్స్ అని నాగార్జున చెప్పారు. ఇప్పుడు తొలిరోజు బాధ్యతల గురించి 15 మంది మధ్య డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీష్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ఎవరెవరు ఏయే పనులు చేయాలనే చర్చ నడించింది. ఈ క్రమంలోనే ఒకరికొకరు అందుకు సంబంధించిన బ్యాడ్జిలు కేటాయించుకున్నారు. తినేసిన గిన్నెల్ని రీతూ చౌదరి శుభ్రం చేయాలని పవన్ బ్యాడ్జ్ ఇచ్చాడు. అలానే వంట చేసే వాళ్లు క్లీన్ చేయరు, వంట మాత్రమే చేస్తారు అని ప్రియ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతో హరీష్.. ఖాళీగా ఉన్న సంజన క్లీనింగ్ చేస్తే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. దీంతో మర్యాద మనీష్ కల్పించుకున్నాడు. అది కరెక్ట్ కాదు అని అనేసరికి హరీష్ ఫైర్ అయ్యాడు.'మనీష్.. నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. మీరు మాట్లాడొద్దు' అని హరీశ్.. మనీష్తో అన్నాడు. ఎందుకు మాట్లాడకూడదు అని మనీష్ అడిగేసరికి ఇద్దరి మధ్య మాటల వార్ నడిచింది. మధ్యలో భరణి వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశాడు కానీ హరీష్ తగ్గినట్లు కనిపించలేదు. 'ఏదైనా అయితే నేను చూసుకుంటా.. అవసరం అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికైనా రెడీ' అని హరీష్ అన్నాడు. అలా ప్రోమో ఎండ్ చేశారు.(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ ఓ గూండా.. 'దబంగ్' దర్శకుడు సంచలన కామెంట్స్) -
సోషల్ మీడియాలో నటి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు!
సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ కావడంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం కొన్ని ట్విటర్ పేజీలతో పాటు రాధకృష్ణ కూడా అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని నటి ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు షేర్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గతంలో రాధకృష్ణతో రంగ సుధ రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దర మధ్య విబేధాలు రావడంతో గతకొంత కాలంగా రంగ సుధ.. రాధకృష్ణకు దూరంగా ఉంటుంది. ఈ కోపంతోనే ఆయన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మోడల్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రంగ సుధ.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. మలయాళంలో హీరోయిన్ గా మారింది. తేరి మేరీ అనే మలయాళ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
బిగ్బాస్ 9: అతనికి మద్దతుగా నాగబాబు పోస్ట్.. నెటిజన్స్ సెటైర్స్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ఆదివారం గ్రాండ్గా ప్రారంభం అయింది. ఈ సారి కూడా హోస్ట్గా కింగ్ నాగార్జుననే వ్యవహరించాడు. మొత్తం 15 మంది హౌస్లోకి వెళ్లారు. సోషల్ మీడియాలో నిన్న మొన్నటిదాక చక్కర్లు కొట్టిన లిస్టులో ఉన్న వాళ్లే..ఇప్పుడు హౌస్లోకి అడుగుపెట్టారు. ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ట వర్మ, సంజనా గల్రానీ, ఆశాశైనీలు సెలబ్రెటీ కంటెస్టెంట్స్గా వెళ్లగా.. కామనర్స్గా మాస్క్ మెన్ హరీశ్, శ్రీజ, మర్యాద మనీష్, జవాన్ పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరంతా సోషల్ మీడియాలో ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇలా బిగ్బాస్ షో ప్రారంభం అయిందో లేదో అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు ఏడో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు భరణికి మద్దతు తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు.(చదవండి: బిగ్బాస్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే.. హైలెట్స్ ఇవే)‘నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్బాస్ 9 సీజన్లోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అంటా నాగబాబు ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. నాగబాబు పోస్టుపై కొంతమంది నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ‘నీ నోటితో అన్నావ్గా..ఇక త్వరగానే బయటకు వచ్చేస్తాడులే’, ‘నాలుగు వారాల్లో వచ్చేస్తాడు’, ‘భరణిని గెలిపించాలని జనసైనిక్స్కి నాగబాబు టాస్క్ ఇచ్చాడు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది భరణికి మద్దతుగా పోస్టులు పెట్టారు.ఇక భరణి విషయానికొస్తే.. అప్పట్లో చిలసౌ స్రవంతి సీరియల్తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశారు. బాహుబలి, ఆవిరి, ధీర, క్రేజీ అంకుల్స్ తదితర చిత్రాల్లో నటించాడు. గతకొంతకాలంగా అటు వెండితెరపై కానీ, ఇటు బుల్లితెరపై కానీ భరణికి సరైన అవకాశాలు రావడం లేదు. బిగ్బాస్ 9 గుర్తింపు వస్తే.. అవకాశాలు వస్తాయనే ఆశతో హౌస్లోకి వెళ్లాడు. మరి భరణి ఎన్నిరోజులు హౌస్లో ఉంటాడో చూడాలి. -
హీరో విజయ్పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు!
నటి త్రిష.. తొలుత తమిళంలో జోడి అనే చిత్రంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో నటించారు. ఆ తర్వాత సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి చిత్రం త్రిషను స్టార్ హీరోయిన్ చేసింది. అంతే ఆ తరువాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన ఈ బ్యూటీకి కలగలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషలలో నటిస్తూ అగ్ర కథానాయకిగా మారారు. ఈ 42 ఏళ్ల చెన్నై సుందరి ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. అదేవిధంగా కథానాయకిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే త్రిష కెరీర్లోను చాలా ఎత్తు పల్లాలు చోటుచేసుకున్నాయి. అలా పడి లేస్తూ తన కెరీర్ను పదిల పరుచుకుంటూ వస్తున్న త్రిష ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు. ఇదిలా ఉంటే త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ త్రిషకు మంచి మిత్రుడు. అయితే స్నేహబంధం కొందరు వేరే విధంగా కూడా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో 25 ఏళ్ల సినీ కెరియర్ గాను నటి త్రిషకు స్పెషల్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తాను నటించిన ఒక్కో హీరో గురించి త్రిష మాట్లాడారు. నటుడు విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ ఆయన నూతన పయనానికి గుడ్ లక్ అని పేర్కొన్నారు అదేవిధంగా విజయ్ కి ఎలాంటి కల ఉన్నా అది నెరవేరాలని, అందుకు ఆయన అర్హుడని, ఆయనకు తన శుభాకాంక్షలు అని అన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
మాస్ డ్యాన్స్?
మాస్ డ్యాన్స్ చేస్తారా? రొమాంటిక్ సాంగ్ పాడుకుంటారా? ఇంతకీ చిరంజీవి–నయనతార ఏ తరహా పాట చేయనున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఈ ఇద్దరూ పాల్గొనగా ఒక పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తోంది ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.ఇటీవల ఆరంభమైన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, ఇతర ముఖ్య తారలు పాల్గొనగా టాకీ పార్ట్ షూట్ చేశారు. నేటి నుంచి చిరంజీవి, నయనతార పాల్గొనగా హైదరాబాద్లో ఒక పాట చిత్రీకరించనున్నట్లు యూనిట్ పేర్కొంది. ‘‘భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ రూపొందించారు.చిరంజీవి–నయనతారపై చిత్రీకరించే పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు’’ అని యూనిట్ తెలియజేసింది. అయితే... ఇది మాస్ నంబరా? రొమాంటిక్ సాంగా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
ఆ రోజే మాస్ జాతర?
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్లో రవితేజ – శ్రీలీల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ ఇద్దరూ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారని టాక్. కాగా, ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్లీ ‘మాస్ జాతర’ అక్టోబరు 31న విడుదల కానుందని, ఈ దిశగా యూనిట్ సన్నాహాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి... వార్తల్లో ఉన్నట్లుగా ఆ రోజే వెండితెరపై మాస్ జాతర కనిపిస్తుందా? వేచి చూడాల్సిందే. -
తెలుసు కదా.. బై బై!
‘తెలుసు కదా’ యూనిట్కు బై బై చెప్పారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర షూట్ను పూర్తి చేశారు రాశీ ఖన్నా.ఈ సందర్భంగా ‘తెలుసు కదా’ సినిమా ప్రయాణం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ –‘‘కెమెరాలు ఆగి పోయిన తర్వాత కూడా మర్చి పోలేని కథలు ఉంటాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలు కలగలిసిన ప్రయాణం ఇది. ఇందులో నాతో పాటు నడిచిన చిత్రయూనిట్ అందరికీ కృతజ్ఞతలు. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్లా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
వచ్చిన కాసేపటికే ఎలిమినేషన్.. బిగ్బాస్లో 'బాక్స్' డ్రామా
కోపపు నీడలో పెరిగిన తన ఆవేశమే అస్తిత్వంగా మారిపోయింది. సినిమా సామ్రాజ్యంలో చోటు దక్కింది. అందరూ ద్వేషించడానికి ఇష్టపడే పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయాడు. అందరూ ద్వేషించే దారిలో నడుస్తుండగా ఓ ప్రశ్న ఎదురైంది. దానికిచ్చిన సమాధానంతో అతడి జీవితమే మారిపోయింది. కన్నతల్లి చేయూతనిచ్చింది. దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడేవాళ్లు.ఆవేశంతో రాజ్యమేలిన వ్యక్తి మనసు ఏలేందుకు ముందుకొస్తున్నాడు. ఓ గిఫ్ట్ బాక్స్తో హౌస్లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ బాక్స్ తీసుకెళ్లేందుకు వీల్లేదన్నారు. అందుకు భరణి ఒప్పుకోలేదు. ఈ బాక్స్ కూడా నా శరీరంలో ఒక భాగం అని, దాన్ని వదిలేసి వెళ్లలేనన్నాడు. అలాగైతే బాక్స్ తీసుకోమని ఇంటికెళ్లిపోమంటే అందుకు క్షణం ఆలోచించకుండా సరేనని తలూపాడు.పోనీ, ఆ బాక్స్ వెనక సీక్రెట్ ఏంటో చెప్పి, ఆ చైన్ మెడలో వేసుకుని వెళ్లమంటే కూడా అందుకు భరణి ఒప్పుకోలేదు. ఈ స్టేజీపై ఆ రహస్యాన్ని బయటపెట్టలేనన్నాడు. దాంతో అతడిని స్టేజీపై నుంచి బయటకు పంపించారు. కానీ మరికాసేపటికే భరణిని లోనికి పంపించారు. అయితే ఇక్కడ ఇంకాస్త డ్రామా పండించే ఛాన్స్ ఉన్నాసరే బిగ్బాస్ ఎందుకో త్వరగానే భరణిని త్వరగా లోపలికి పంపించేయడం మాత్రం కాస్త అసంతృప్తిగా అనిపించింది.అప్పట్లో 'చిలసౌ స్రవంతి' సీరియల్తో విలన్గా చేసి అందరినీ భయపెట్టిన భరణి.. తర్వాత ఎన్నో సినిమాలు చేసినా సరే 'స్రవంతి' విలన్గానే గుర్తుండిపోయాడు. ఇప్పడు బిగ్బాస్ షోలోకి వచ్చి తనని తాను మరోసారి నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఎన్ని వారాల పాటు ఉంటాడో చూడాలి?The house is ready for him!💥 Bharani enters the Bigg Boss 9 house, bringing high voltage drama & fun-filled chaos ❤️🔥The house doors are open! 🏠 Catch the Grand Launch of #BiggBossSeason9 Playing Now only on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/J6EmKjrds1— JioHotstar Telugu (@JioHotstarTel_) September 7, 2025 -
నాకు చావెందుకు రాలేదు? నిరూపించుకోవడానికే వచ్చా: హీరోయిన్ కన్నీళ్లు
సినిమాలకన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమసైంది సంజనా గల్రాని (Sanjana Galrani). బుజ్జిగాడు మూవీతో టాలీవుడ్లో పరిచయమైంది. తెలుగులో కన్నా కన్నడలో మంచి స్టార్డమ్ సంపాదించింది. 2020లో రహస్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం. అంతా బాగున్న సమయంలో డ్రగ్స్ కేసుతో తన కెరీర్ కుప్పకూలింది. డ్రగ్స్ కుంభకోణంలో జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగు పెట్టింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా పేరు అర్చన. ఏడో తరగతి చదువుతున్న సమయంలో మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. జాన్ ఇబ్రహీంతో ఓ యాడ్ చేశాను. అప్పుడు పూరీ జగన్నాథ్ నన్ను చూసి బుజ్జిగాడు సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను. ఒకరోజు సడన్గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? అని బాధపడ్డాను. ఆ రోజు గురించి తలుచుకుంటేనే బాధేస్తోంది.ఒక్కో మీడియా ఛానల్ ఒక్కోలాగా చెప్పింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ, అదెవరికీ కనిపించలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్బాస్కు వచ్చాను అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది. -
నువ్వసలు మనిషివే కాదు, లూజర్.. కట్ చేస్తే బిగ్బాస్ షోలో!
బిగ్బాస్ 9 (Bigg Boss 9 Telugu) ఈసారి స్పెషల్గా ఉండబోతోంది. కారణం.. సామాన్యుల ఎంట్రీ! గతంలోలాగా ఎవరో ఒకర్ని తీసుకురాలేదు. సత్తా ఉన్న సామాన్యులనే తీసుకురావాలని అగ్నిపరీక్ష షో నిర్వహించారు. వేలాది మంది అప్లై చేసుకోగా వారిలో 15 మందిని అగ్నిపరీక్షలో పరీక్షించారు. చివరకు 13 మంది మిగిలారు. ఇప్పుడు వారందరూ బిగ్బాస్ 9కి వచ్చారు.ఆరుగురికి ఎంట్రీ అగ్నిపరీక్ష షోకి శ్రీముఖి యాంకర్గా వ్యహరించగా, నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జిలుగా వ్యవహరించారు. అభిజిత్ మినహా మిగతా ముగ్గురు నేడు స్టేజీపైకి వచ్చారు. షోలో ఎల్లో కార్డులతో కంటెస్టెంట్లను భయపెట్టిన వీరు గ్రీన్ కార్డులతో కంటెస్టెంట్లలో కొత్త ఆశలు రేకెత్తించారు. నవదీప్.. దమ్ము శ్రీజను, బిందు మాధవి.. హరీశ్ను సెలక్ట్ చేసి హౌస్లోకి పంపించారు.ప్రేక్షకుల ఓట్లతో ముగ్గురునువ్వు మనిషివే కాదంటూ హరీశ్ను తిట్టిన బిందుమాధవి.. అందర్నీ కాదని అతడిని సెలక్ట్ చేయడం విశేషం. ప్రేక్షకుల ఓట్లతో పవన్ కల్యాణ్, డిమాన్ పవన్, డాక్టర్ ప్రియ హౌస్లోకి వెళ్లారు. చివర్లో నాగ్ షో ముగించేస్తుంటే శ్రీముఖి ఆపండంటూ ఎంట్రీ ఇచ్చింది. ఇంకొక్కరిని లోనికి పంపించమని వేడుకుంది. అభిజిత్, తాను కలిసి తీసుకున్న నిర్ణయం అంటూ మర్యాద మనీష్ను సెలక్ట్ చేసింది. అలా ఏడుగురు కంటెస్టెంట్లు సామాన్యుల కేటగిరీలో హౌస్లోకి వెళ్లారు. -
అధ్యక్షా.. ఈ కమెడియన్ ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?
అధ్యక్షా.. డైలాగ్తో పాపులర్ కాదు సెన్సేషన్ అయ్యాడు కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఇతడు ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే ఈసారి సినిమా ద్వారా కాదు, బిగ్బాస్ షో ద్వారా! తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)లో అడుగుపెట్టిన సుమన్ శెట్టి తన జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. తొలి సినిమాకే నంది అవార్డుఅధ్యక్షా.. నన్ను గుర్తుపట్టారా? సుమన్శెట్టిని.. చిన్నప్పటినుంచే సినిమాలంటే పిచ్చి. ఇంటర్ పూర్తయ్యాక ఓ మ్యాగజైన్లో కొత్త ఆర్టిస్టులు కావాలన్న ప్రకటన చూసి వెంటనే హైదరాబాద్ వెళ్లాను. దర్శకుడు తేజ నన్ను ఆడిషన్ చేసి సెలక్ట్ చేశారు. జై మూవీతో కెరీర్ మొదలైంది. ఫస్ట్ సినిమాకే నంది అవార్డు గెలిచాను. జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం సినిమాల్లో అవకాశాలిచ్చి తేజ గారు నాకు గాడ్ ఫాదరయ్యారు.300 సినిమాలుతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశాను. అలా సినిమాలు చేస్తుండగా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేశారు. నాకు ఓ కూతురు, కొడుకు సంతానం. 2019లో మా నాన్న చనిపోయారు. నాన్న లేకపోయేసరికి ఒంటరితనం ఆవరించింది. నీ కెరీర్ మళ్లీ మొదలుపెట్టు అని అమ్మ తోడుగా నిలిచింది. బిగ్బాస్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతాను. బిగ్బాస్ హౌస్లో ఈ సుమన్ శెట్టి ఆటేంటో చూపిస్తా అన్నాడు సుమన్ శెట్టి. మరి ఈ కమెడియన్ బిగ్బాస్లో ఎంతమేరకు మెప్పిస్తాడో చూడాలి! -
మా ఇంటిబిడ్డలా చూసుకుంటాం.. అభయమిచ్చిన నాగ్
'ముద్దమందారం' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. కూతుర్ని టీచర్ను చేయాలనుకుంటే తనూజ మాత్రం నటనవైపు అడుగులు వేసింది. కాలేజీలో చదువుతున్న సమయంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా సినిమా చేసింది. మూడేళ్లు మాటల్లేవ్దాంతో ఆమె తండ్రి మూడేండ్లు నటితో మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజయ్యాక తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ముద్ద మందారం సీరియల్లో ఆఫర్ వచ్చింది. ఈ ధారావాహికతోనే తన దశ తిరిగిపోయింది. తాజాగా ఆమె తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్నకు యాక్టింగ్ అస్సలు ఇష్టం లేదు. అయినా హైదరాబాద్కు వచ్చి యాక్టింగ్ ద్వారా పేరు సంపాదించుకున్నాను. తప్పకుండా శిక్షిస్తారుఅప్పుడు వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు బిగ్బాస్కు వెళ్తున్నా అని కూడా నాన్నకు తెలియదు. ఆయన తప్పకుండా నన్ను శిక్షిస్తారు. నాతో మాట్లాడరు.. నాన్నకు తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో నాగ్.. ఆడపిల్లను మా ఇంటిబిడ్డలా చూసుకుంటాము. ఇండస్ట్రీ గురించి ఎటువంటి భయం అవసరం లేదు అని అభయమిచ్చాడు. -
మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని.. అప్పుడే మొదలెట్టేశాడుగా!
బిగ్బాస్ (Bigg Boss Reality Show) ప్రతి సీజన్లో ఓ కమెడియన్ కచ్చితంగా ఉండాల్సిందే! ఎప్పుడూ గొడవలతో అగ్నిలా భగభగమండుతూ ఉండే హౌస్లో నవ్వుల వర్షం కురిస్తేనే బాగుంటుంది. అందుకే కమెడియన్ ఉంటేనే షోకి కళ. ఈ సారి ఓ ఫేమస్ కమెడియన్ను పట్టుకొచ్చారు. అతడే జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Emmanuel). నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ, ఎదుటివారి పెదాలపై నవ్వు చూడటం కోసం తనపై తాను జోకులు వేసుకోవడానికి కూడా వెనుకాడడు.ఒక్క ఛాన్స్తాజాగా బిగ్బాస్ 9 స్టేజీపై అడుగు పెట్టిన ఇమ్మాన్యుయేల్ తన జర్నీ వివరించాడు. 'నేను చదివిన చదువుకు ఉద్యోగం రాలేదు. అందుకే అమ్మానాన్నకు చేదోడువాదోడుగా ఉండాలనుకున్నాను. పొలంపనిలో సాయం చేశాను. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఛాన్స్ ఇస్తాడంటారు. అలా నాకు వచ్చిన ఒక్క ఛాన్స్.. నేను కన్న కలవైపు మొదటి అడుగు పడేలా చేసింది. అవకాశం వచ్చింది, కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. నాగార్జునతో కామెడీమూడేళ్లు గడిచిపోయాక మన తలరాత మనమే రాసుకోవాలని అర్థమైంది. వందల స్కిట్లు రాసి, అందులో నటించి మిమ్మల్ని అలరించాను. బిగ్బాస్లో నా పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను' అంటూ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే తన టాలెంట్నంతా బయటపెట్టాడు. నాగార్జునతో.. బిగ్బాస్లో మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని అంటూ జోకులు మొదలుపెట్టేశాడు. అలాగే ఆడ గొంతుకతో పాట పాడి అలరించాడు. తర్వాత మిమిక్రీ చేశాడు. -
బిగ్బాస్: 20 ఏళ్లకే లవ్, ప్రియుడి చేతిలో నరకం చూసిన హీరోయిన్
ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని (Flora Saini). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు. నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, ప్రేమతో రా, మైఖేల్ మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి పలు చిత్రాల్లో నటించింది. లక్స్ పాప.. సాంగ్తో బాగా ఫేమస్ అయింది. తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది.రానా నాయుడు, ద ట్రయల్ వెబ్ సిరీస్లలోనూ మెరిసింది. అందరమ్మాయిల్లాగే తనూ ప్రేమలో పడింది. నమ్మిన ప్రియుడి చేతిల్లో నరకం చూసింది. ఆ మధ్య తనపై దాడి జరిగినట్లుగా ఫోటోలు కూడా షేర్ చేసింది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ప్రేమపై నమ్మకాన్నే కోల్పోయింది. నిస్సహాయ స్థితికి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత అమ్మానాన్నే తన ప్రపంచంగా భావించింది. ఇప్పుడు బిగ్బాస్ 9 షోలో అడుగుపెట్టింది.అసలేం జరిగిందంటే?20 ఏళ్ల వయసులో ఓ నిర్మాతలో ప్రేమలో పడింది ఆశా సైని. అప్పటికే దాదాపు పది చిత్రాలు చేసింది. మోడల్గానూ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసింది. కానీ నిర్మాతను ప్రేమించిన కొద్దిరోజులకే పరిస్థితులు తారుమరయ్యాయి. అతడు ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఫోన్ లాక్కున్నాడు, నటించవద్దని బలవంతం చేశాడు. ఏడాదిన్నర పాటు ఎవరితోనూ తనను మాట్లాడనివ్వలేదు. ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై కొట్టాడని ఫ్లోరా సైని సోషల్ మీడియాలో వాపోయింది. ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని చెప్పుకొచ్చింది. తిరిగి మామూలు మనిషి కావడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపింది. -
జానపదంలో రాణిస్తున్న నల్లగొండ నాగదుర్గ
చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యంపై మక్కువ. యూకేజీ చదివే సమయంలోనే తల్లిదండ్రులు కూచిపూడి శిక్షణ ఇప్పించారు. ఆ నాటి నుంచి మొదలైన ఆమె డ్యాన్స్ ప్రయాణం తన అందం.. అభినయంతో నేడు వందల జానపద పాటల్లో రాణిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది నల్లగొండ పట్టణానికి చెందిన గుత్తా నాగదుర్గ. అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాగదుర్గను శనివారం ‘సాక్షి’ పలకరించగా.. ఆమె తన కేరీర్కు సంబంధించిన విషయాలను పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే..రామగిరి (నల్లగొండ) : మా స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు. ఉద్యోగరీత్యా మా అమ్మానాన్న గుత్తా చలపతిరావు, వాసవి నల్లగొండలో స్థిరపడ్డారు. నేను పదో తరగతి వరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాను. హైదరాబాద్లో ఇంటర్, బీఏ జర్నలిజం పూర్తి చేశాను. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూచిపూడిలో పీజీ చేశాను. మా అమ్మకు నాట్యం అంటే ఇష్టం. తను నేర్చుకోవాలకుంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు. నేను చిన్ననాటి నుంచి డాన్స్ బాగా వేసే దాన్ని. అమ్మ గుర్తించి కూచిపూడి నేర్పించింది. పాలబిందెల బాలు మాస్టారు వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. అనేక సందర్భాల్లో స్టేజీ ప్రోగ్రాముల్లో కూచిపూడి నాట్యం చేశాను. అప్పుడు వచ్చిన ప్రశంసలు నాకు ప్రేరణ కలిగించాయి. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నాను. కానీ డాన్స్ పైనా ఎక్కువ శ్రద్ద పెట్టాను. పేరిణి లాస్యంలో కూడా శిక్షణ తీసుకున్నాను. ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి మంజుభార్గవి వద్ద కూచిపూడి వర్క్షాపుకు హాజరయ్యాను. నల్లగొండకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వద్ద రీ రికార్డింగ్లో పనిచేశాను. ఆ తర్వాత జానదప పాటల్లో నటించే అవకాశం లభించింది.2021లో మొదటి అవకాశం2021లో సై టీవీ రూపొందించిన ‘తిన్నాతీరం పడతలే’ అనే పాటలో మొదటిసారి నటించాను. ఆ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు సంవత్సరాల్లో 300 వరకు జానపద పాటల్లో నటించాను. చాలా అవకాశాలు వస్తున్నా.. అందులో మంచివి మాత్రమే ఎంచుకుంటాను. ఫోక్ పాటలకు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ లభించింది. యూట్యూబ్లో 100 మిలియన్ బేంచ్ మార్క్కు చేరింది. శాసీ్త్రయ నాట్యం నుంచి జానపదానికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా జానపద పాటల్లో ప్రారంభమైన నటన నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కలివి వనం’ అనే సినిమాలో నటించాను. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కూచిపూడిలో పీహెచ్డీ చేస్తా..చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నా. అనేక వర్క్షాపులకు హాజరయ్యా. డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్స్ డిగ్రీ చదివాను. అయినప్పటికీ కూచిపూడిలో పరిశోధన చేసి పీహెచ్డీ చేయాలనేది నా లక్ష్యం. అంతే కాదు నేను నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలని భావించాను. నల్లగొండలో మాకు సొంత ఇల్లు ఉంది. అవకాశాల కోసం హైదరాబాద్లో ఉంటున్నాం. నేను నేర్చుకున్న కళ పది మందికి నేర్పించాలనేది నా కోరిక. నల్లగొండలో నాగదుర్గ నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రం నడిపిస్తున్నా. 60 మంది వరకు విద్యార్థులు శిక్షణకు వస్తున్నారు. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి శని, ఆదివారం నల్లగొండకు వస్తాం. -
డిజైనర్ చీరలో అనసూయ.. బీచ్ ఒడ్డున 'ఓజీ' బ్యూటీ
డిజైనర్ చీరలో మరింత అందంగా అనసూయబీచ్ ఒడ్డున 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్కేరళ వెళ్లిపోయిన 'సింగిల్' ఫేమ్ ఇవానాజిమ్ వేర్లో హీరోయిన్ ఈషా రెబ్బా గ్లామర్దేవకన్యలా మెరిసిపోతున్న 'ఉప్పెన' కృతిశెట్టి'తెలుసు కదా' షూటింగ్ జ్ఞాపకాలతో రాశీఖన్నా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) -
అమ్మాయిలంటే సామాన్లా? థియేటర్లో దారుణంగా.. దిశ యాప్ సాయంతో!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి సెలబ్రిటీలు వర్సెస్ కామన్మ్యాన్ అన్నట్లుగా పోటీ ఉండనుంది. ఇప్పటికే లాంచింగ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా 14 మంది హౌస్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో ఇన్ఫ్లుయెన్సర్ రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్) కూడా ఉండనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ లిస్టులో మాత్రం ఆమె పేరు లేదు.వైల్డ్ కార్డ్ ఎంట్రీగా..అయితే ఆమె వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న బిగ్బాస్ 9 గ్రాండ్ లాంచ్ 2.0 కింద ఐదారుగురిని హౌస్లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నారు. వీరిలో రమ్య పేరు కూడా ఉంది. ఇకపోతే రమ్య మోక్ష, తన సిస్టర్స్ అలేఖ్య, సుమ కంచర్లతో కలిసి ఇటీవల థియేటర్కు వెళ్లగా అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని సుమ యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది. పచ్చళ్లతో బాగా సంపాదించుకుంటున్నారు. మా డబ్బుతోనే తింటున్నారు, మా డబ్బుతోనే బతుకుతున్నారు అని ప్రతి వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.ఏం తప్పు చేశాం?మేమేం చేస్తున్నామని? మాకు వచ్చిన విద్య పచ్చళ్ల చేయడం.. వాట్సాప్ నెంబర్ పెట్టి ఆర్డర్ చేయమంటున్నాం. మా క్వాలిటీ మాకు తెలసు కాబట్టి ఒక రేటు ఫిక్స్ చేస్తున్నాం, అది మా ఇష్టం! నచ్చినవాళ్లు కొంటున్నారు, నచ్చనివాళ్లు లైట్ తీసుకుంటున్నారు. అంతకుమించి మేం ఏం తప్పు చేశాం? వాట్సప్లో చెండాలమైన వీడియోలు పంపుతాం.. దానికి డబ్బు పంపండి అని అడిగామా? చిట్ ఫండ్స్ పెట్టి ఎత్తేశామా? మేము సమస్యల్లో ఉన్నామని డబ్బులు అడుక్కుంటున్నామా? అవేమీ చేయడం లేదుగా!ఒక్కరు స్పందించరే?అందులో మీకు తప్పేం కనిపించింది? అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదమైనప్పుడు మా మీద ఎన్నెన్ని వీడియోలు చేశారు? ఇప్పుడు మా గురించి తప్పుడు కామెంట్స్ పెడుతుంటే ఒక్కరు స్పందించరేంటి? మేము బయట కనిపిస్తే అలా చేయండి, ఇలా చేయండి అని జనాల్ని రెచ్చగొడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ రోజు నా భర్త బర్త్డే కాబట్టి చెల్లివాళ్లందరితో కలిసి సినిమాకు వెళ్లాను. అక్కడ కొందరు మమ్మల్ని గుర్తుపట్టి సెల్ఫీలు దిగారు. అసభ్య కామెంట్స్తర్వాత క్యాంటీన్లో కూల్డ్రింక్స్ కొనుక్కుని సినిమా హాల్లోకి వెళ్తున్నాం. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అంకుల్స్ మమ్మల్ని చూస్తూ చెండాలంగా సైగలు చేస్తున్నారు. చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అనవసరంగా మూడ్ నాశనం చేసుకోకూడని ముందుకు వెళ్లిపోయాం. థియేటర్లో కూడా మా వెనకాలే కూర్చుని... మొగుడు పక్కనుంటే మాట్లాడకూడదా? అంటూ ఏదేదో పిచ్చిగా వాగారు. ఆ కామెంట్స్ భరించలేక వెళ్లిపోతుంటే సినిమా చూడాలంటే సామాన్లు బాగుండాలంటీ అన్నారు. అమ్మాయిలంటే సామాన్లా? మా శరీరం గురించి చెత్తగా వాగుతుంటే ఎవరూ పట్టించుకోరా?దిశ యాప్ వల్లే..అలేఖ్య తెలివిగా వెంటనే దిశ యాప్లో కంప్లైంట్ పెట్టింది. పోలీసులు వెంటనే మేమున్న ప్రదేశానికి వచ్చి ఆ ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. అప్పటివరకు మాగురించి చెడుగా కామెంట్ చేసుకుంటూ నవ్వినవాళ్లు పోలీసులను చూడగానే మా కాళ్లు పట్టుకునేందుకు కూడా వెనుకాడలేదు. ఇలాంటివారిని వదిలపెట్టకూడదు. అందుకే పోలీసులను కేసు నమోదు చేయమన్నాం అని సుమ ఆగ్రహించింది.చదవండి: ‘సైమా ’లో సత్తా చాటిన నిహారిక మూవీ -
'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
రీసెంట్ వీకెండ్లో మూడు సినిమాలొస్తే ఏ మాత్రం అంచనాల్లేని 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన మౌళి, శివాని నాగారంతో పాటు హీరో ఫ్రెండ్గా చేసిన జయకృష్ణని అందరూ ప్రశంసిస్తున్నారు. మౌళి, జయకృష్ణ యూట్యూబర్స్ అని చాలామందికి తెలుసు. కానీ కాత్యాయని పాత్రలో హీరోయిన్గా కనిపించిన శివాని ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు? ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?ఈ సినిమాలో మౌళితో పాటు కాత్యాయని పాత్రలో శివాని కూడా ఆకట్టుకుంది. ఈమె ఇదివరకే ఓ తెలుగు సినిమాలో చేసింది. అయితే ఈమె యాక్టింగ్తోపాటు సింగర్ కమ్ ట్రైన్డ్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1988లో హైదరాబాదులో పుట్టిన శివానీ.. చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్లో డిగ్రీ చేసింది. 'అంతర్గత' అనే షార్ట్ ఫిల్మ్తో నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్లో నటించింది.(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?)ఇన్ స్టాలో చూసి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రంలో ఛాన్స్ ఉందని శివానికి తెలిసింది. అయితే హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇస్తే, అదృష్టం కలిసొచ్చి ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఈమె.. ఖాళీ సమయంలో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అలానే తమ్ముడితో కలిసి సాంగ్స్ పాడుతూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తొలి సినిమా కంటే ముందు 'జాతిరత్నాలు'లో న్యూస్ ప్రెజెంటర్గా చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' మూవీతో కాత్యాయనిగా కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేస్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న 'హే భగవాన్' అనే మూవీలో హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) -
లారెన్స్ మనసు బంగారం.. దివ్యాంగురాలి కోసం..
స్టార్ హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మంచి చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఎవరి పరిస్థితైనా బాగోలేదని తెలిస్తే క్షణం ఆలోచించకుండా సాయం చేస్తుంటాడు. ఈమధ్యే కూతురి చదువు కోసం చనిపోయిన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టిన ఓ తండ్రి కథ విని చలించిపోయాడు. భార్య జ్ఞాపకంగా మిగిలున్న మంగళసూత్రాన్ని విడిపించి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చాడు.అప్పుడు స్కూటీ గిఫ్ట్తాజాగా పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. నిజానికి ఆ దివ్యాంగురాలు నడవలేని స్థితిలో ఉంటే ఆమె కాలికి సపోర్ట్గా ఉండే పరికరాన్ని కొనిచ్చి ఆమె నడిచేలా చేశాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లేందుకు వీలుగా స్కూటీ బహుమతిగా ఇచ్చాడు. అయినా ఇంకా ఏదో వెలితిగా అనిపించింది. ఆమెను పూరి గుడిసె నుంచి మంచి ఇంటికి మార్చాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఇంటి బాధ్యతమంచి ఇంటికి మారితేనే తన జీవితం కూడా బాగుంటుందని భావించాడు. ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. లారెన్స్ మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. లారెన్స్ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్ చేయనున్నాడు. Hi everyone, this is Swetha. Earlier, I was able to support her with leg support for walking. Later, I gifted her a scooty so she could move around independently. Now, I feel building a house for her will truly change her life. She is a girl with a golden heart, and my own heart… pic.twitter.com/vp0KUS1jsZ— Raghava Lawrence (@offl_Lawrence) September 7, 2025 చదవండి: Bigg Boss 9 : ఊహకందని మార్పులు.. ప్రోమోతోనే ట్విస్ట్ -
‘సైమా ’లో సత్తా చాటిన నిహారిక మూవీ
‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025’(సైమా) లో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సందీప్ సరోజ్ కి సైమా అవార్డు వచ్చింది. నిర్మాతగా తొలి ఫీచర్ ఫిల్మ్తోనే నిహారిక టాలీవుడ్లో ఓ హిస్టరీని క్రియేట్ చేసినట్టు అయింది. ఈ మూవీకి యదు వంశీ డైరెక్టర్గా, ఎదురురోలు రాజు సినిమాటోగ్రఫర్గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం గతేడాది ఆగస్ట్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రూ.9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 24.5 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా, దర్శకుడు యధు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా గామా అవార్డుల్లోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా యదు వంశీకి గామా అవార్డులు వచ్చాయి. -
Bigg Boss 9 : ఊహకందని మార్పులు.. ప్రోమోతోనే ట్విస్ట్.. వీళ్లు కన్ఫార్మ్!
ఊహకందని మార్పులు..ఊహించని మలుపులు. డబుల్ హౌస్తో డబుల్ జోష్తో మీ ముందుకు వచ్చేసింది బిగ్బాస్ నైన్ అంటూ బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కొత్త ప్రోమో రిలీజైంది. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షో.. తొమ్మిదో సీజన్ నేడు(సెప్టెంబర్ 7) గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకి సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్ వాయిస్ మాత్రమే వినిపించారు. వారు ఎవరనేది గుర్తుపట్టకుండా ప్రోమోని కట్ చేశారు. అయితే తొలి రోజే ఓ కంటెస్టెంట్కి షాకిచ్చినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.ఓ కంటెస్టెంట్ హౌస్లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్బాస్ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి రెండు హౌస్ల ఉండబోతున్నాయి. టాస్క్లు కూడా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ ఈసారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ సారి 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లబోతున్నారట. వారిలో 9 మంది డైరెక్ట్గా హౌస్లోకి వెళ్లగా, మిగతా 5 మంది అగ్ని పరీక్షలో గెలిచిన వాళ్లు వెళ్తారు. సెలెబ్రిటీ లిస్ట్లో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, తనూజ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. కామనర్స్గా కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి వెళ్లే అవకాశం ఉంది. -
SIIMA 2025: ఉత్తమ నటి సాయి పల్లవి.. కోలీవుడ్, మాలీవుడ్ విజేతలు వీళ్లే!
దుబాయ్ వేదికగా ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు. కోలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా అమరన్, మలయాళం నుంచి ఉత్తమ చిత్రంగా ‘మంజుమ్మల్ బాయ్స్’ ఎన్నికయ్యాయి. ఇక తమిళ్లో ఉత్తమ నటి అవార్డ్ను అమరన్కు గాను సాయి పల్లవికి లభించింది. ఉత్తమ నటుడిగా ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ (ది గోట్ లైఫ్) నిలిచాడు. తమిళంలో అమరన్, మహారాజా, లబ్బర్ పండు చిత్రాలకు, మలయాళంలో ది గోట్ లైఫ్ చిత్రానికి అత్యధిక అవార్డులు వచ్చాయి. ‘సైమా’ విజేతలు (కోలీవుడ్)ఉత్తమ చిత్రం : అమరన్ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరియసామి(అమరన్)ఉత్తమ నటి : సాయి పల్లవి(అమరన్)ఉత్తమ విలన్ : అనురాగ్ కశ్యప్(మహారాజా)ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాశ్ (అమరన్)ఉత్తమ కమెడియన్ : బల శరవణన్(లబ్బర్ పందు)ఉత్తమ నటుడు(క్రిటిక్స్) : కార్తి (మెయ్యజగన్)ఉత్తమ నటి(క్రిటిక్స్): దుషారా విజయన్ (రాయన్)ఉత్తమ దర్శకుడు(క్రిటిక్స్): నిథిలన్ సామినాథన్(మహారాజ)ఉత్తమ నూతన దర్శకుడు: తమిళరాసన్(లబ్బర్ పందు)‘సైమా’ విజేతలు (మాలీవుడ్)ఉత్తమ చిత్రం : మంజుమ్మల్ బాయ్స్’ఉత్తమ దర్శకుడు: బ్లెస్సీ (ది గోట్ లైఫ్)ఉత్తమ నటి : ఊర్వశి(ఉళ్లోళుక్కు)ఉత్తమ విలన్ : జగదీష్(మార్కో)ఉత్తమ సంగీత దర్శకుడు : దిబు నినన్ థామస్(ఏఆర్ఎం)ఉత్తమ కమెడియన్ : శ్యామ్ మోహన్(ప్రేమలు)ఉత్తమ నటుడు(క్రిటిక్స్) : ఉన్ని ముకుందన్(మార్కో)ఉత్తమ నూతన దర్శకుడు: జోబూ జార్జ్(పని)ఉత్తమ నూతన నటుడు(క్రిటిక్స్) : కేఆర్ గోకుల్(ది గోట్ లైఫ్) -
Mirai: విడుదలకు ముందే రూ.20 కోట్ల లాభం!
ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు.అందుకే థియేటర్స్లో ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం లేదు. ఒకవేళ జరిగిన లాభాలు లేకుండానే రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమా రిలీజ్కి ముందే రూ. 20 కోట్ల లాభాలను సంపాదించింది. అదే ‘మిరాయ్’.ట్రైలర్తోనే...హనుమాన్తో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన తేజ సజ్జా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. విలన్గా మంచు విష్ణు, హీరో తల్లిగా శ్రియ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు భారీ స్పందన లభించింది. మూవీ విజువల్ వండర్లా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. వీఎఫెక్స్ అదిరిపోయింది. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలే వీఎఫెక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. మాత్రం ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినట్లు ట్రైలర్తోనే తెలిసిపోతుంది. ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే..?సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే రిలీజ్కు ముందే ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చాయి. ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ. 45 కోట్ల ఆదాయం వచ్చిందట. రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడం లేదు. పెట్టిన ఖర్చును కూడా వెనక్కి తెచ్చుకోలేపోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తేజ సజ్జా లాంటి కుర్ర హీరో సినిమా రిలీజ్కు ముందే లాభాలు తెచ్చిపెట్టడం టాలీవుడ్కి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. -
OTT: రొమాన్స్ కాదు.. బ్రొమాన్స్.. ఎలా ఉందంటే..?
టైటిల్ : బ్రొమాన్స్నటీనటులు: మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ తదితరులుదర్శకత్వం: అర్జున్ డి. జోస్ఓటీటీ: సోనీ లివ్ఓటీటీలు వచ్చాక ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించడం మరింత సులభతరం అయిపోయింది. ఏ కొత్త సినిమా వచ్చినా నెల రోజుల్లోపే ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నారు. ఓటీటీలు రావడంతో కంటెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కంటెంట్ బాగుంటే ఏ మూవీనైనా ఆడియన్స్ వదలడం లేదు. ఏ భాషలో వచ్చినా కథ బాగుంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఇక మలయాళ సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. క్రైమ్, కామెడీ జోనర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అలాంటి జోనర్లో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్కు వచ్చేసిన మలయాళ సినిమా బ్రొమాన్స్. టైటిల్తోనే ఆసక్తి పెంచేసిన బ్రొమాన్స్.. సినిమా ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..షింటో (శ్యామ్ మోహన్), బింటో (మాథ్యూ థామస్) ఇద్దరు అన్నదమ్ములు. అమ్మా, నాన్నతో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. అయితే ప్రతి విషయంలో అన్నతో తమ్ముడు బింటోను పోలుస్తూ ఉంటారు. ఇది నచ్చని బింటో అన్న అంటే అంతగా ఇష్టముండదు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉంటారు. బింటో ఎప్పుడు రీల్స్ పిచ్చిలో పడి లైఫ్ను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఊహించని విధంగా బింటో అన్న షింటో మిస్సింగ్ అవుతాడు. ఆ తర్వాత తనకు అంతగా ఇష్టం లేని అన్న కోసం తమ్ముడు ఏం చేశాడు? చివరికీ అన్న షింటోను కనిపెట్టాడా? లేదా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..సాధారణంగా అన్నదమ్ముల స్టోరీ అనగానే సగటు ఆడియన్స్ ఎమోషనల్ డ్రామా అనుకుంటే పొరపాటే. కథ ప్రారంభంలో ఫ్యామిలీ లైఫ్, అన్నదమ్ముల అనుబంధం చూడగానే ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ కథ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ డైరెక్టర్ ఇక్కడ తీసుకున్న పాయింట్ ఏంటంటే.. ఎమోషనల్ టచ్ ఇచ్చి.. కామెడీ పండించాడు. ఒకవైపు అన్న అంటే పడని తమ్ముడు.. అతను మిస్సింగ్ అయ్యాడని తెలిశాక జరిగే పరిణామాలు అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. ఆ తర్వాత అన్న కోసం ఆరా తీసే క్రమంలో షింటో స్నేహితుడు షబీర్ (అర్జున్ అశోకన్) బింటోకు సాయం చేస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ డాక్టర్ ఐశ్వర్య, ఎస్సై టోనీ నుంచి ఊహించని ట్విస్ట్లు ఎదురవుతాయి. ఈ సన్నివేశాలు సీరియస్గా అనిపించినా.. ప్రతి సీన్లో కామెడీ పండించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.అన్నదమ్ముల సెంటిమెంట్ అనే లైన్ తీసుకున్న డైరెక్టర్.. కథను పూర్తిగా కామెడీ యాంగిల్లోనే తీసుకెళ్లాడు. అన్న కోసం వెతుకుతున్న బింటో.. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్ సాయం తీసుకుంటాడు వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ను తెగ నవ్విస్తాయి. అలా బింటో అన్న కోసం వెతుకున్న టీమ్లో కీలక మెంబర్ పాత్ర పోషిస్తాడు. తన అన్నను ఏమైనా అంటే విపరీతమైన కోపంతో ఊగిపోయే బింటోకు కొరియర్ బాబు రూపంలో గట్టి షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఎస్సై ఎంట్రీ ఇవ్వడంతో కథ కామెడీతో పాటు ఆసక్తికరంగా మారుతుంది. కేరళలో మొదలైన కథ.. కర్ణాటకకు షిప్ట్ అయ్యాక కథలో వచ్చే సీన్స్ ఆడియన్స్లో నవ్వులు పూయిస్తాయి. ప్రతి సీన్లో కామెడీని ఇరికించే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్కు ముడిపెట్టి ఫుల్ కామెడీ వైపు నడిపించిన దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కేవలం కామెడీపైనే దృష్టి పెట్టడంతో సగటు ప్రేక్షకుడికి కథతో ఎమోషనల్ టచ్ మిస్సయింది. ఆ విషయంలో డి జోస్ మరింత ఫోకస్ చేయాల్సింది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే అక్కడ కూడా సీరియస్నెస్ ఉన్నప్పటికీ.. ఫైట్ సీన్ ఆద్యంతం నవ్వులు తెప్పించాడు. క్లైమాక్స్లో ఎమోషనల్ టచ్ ఇచ్చినా.. అంతగా ఆడియన్స్కు కనెక్ట్ చేయడంలో భావోద్వేగాలు పండించలేకపోయాడు. చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చి.. నవ్విస్తూనే ఎండ్ కార్డ్ పడేశాడు. ఓవరాల్గా చూస్తే సీరియస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్లో ఫుల్గా నవ్వుకోవాలంటే..ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. అభ్యంతరకర సన్నివేశాలు లేనందున ఫ్యామిలీతో చూసేయొచ్చు.ఎవరెలా చేశారంటే...ప్రేమలు మూవీతో తెలుగు ఆడియన్స్కు దగ్గరైన మాథ్యు థామస్ తన పాత్రలో మెప్పించాడు. షింటోగా శ్యామ్ మోహన్ తన పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్గా సంగీత్ ప్రతాప్ పాత్ర కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, శ్యామ్ మోహన్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. గోవింద్ వసంత నేపథ్య సంగీతం బాగుంది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. చామన్ చాకో కొన్ని అనవసర సీన్స్ను కట్ చేయాల్సింది. నిర్మాణ విలువల పరంగా ఫర్వాలేదపించారు. -
ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది : నిర్మాత
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన హారర్ మిస్టరీ మూవీ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సాహు గారపాటి మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే మా ‘కిష్కింధపురి’ చిత్రం మాత్రం వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్, దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్, రేడియోతో దెయ్యానికి ఉన్న కనెక్షన్ ఇవన్నీ మా సినిమాలో కొత్తగా ఉంటాయి. ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటివరకు రాలేదు. కొన్ని షాకింగ్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్గారి ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలోని పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమా కథ అనుకున్నప్పుడే అనుపమను హీరోయిన్గా అనుకున్నాం. అనుపమ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం నెల రోజులు కష్టపడి, దాదాపు రూ. 2 కోట్లతో ఓ రేడియో స్టేషన్ సెట్ వేశాం. సినిమాలోని కీలక సన్నివేశాలు ఇక్కడే జరుగుతాయి. తొలి భాగం వినోదాత్మకంగా, సెకండాఫ్లో సీరియస్ హారర్ ఫిల్మ్గా టర్న్ అవుతుంది. ‘కిష్కింధపురి’ అనే ఊర్లో జరిగే కథ కనుక ‘కిష్కింధపురి’ అని టైటిల్ పెట్టడం జరిగింది. మా సినిమా థియేటర్స్లో ఆడియన్స్ను తప్పక ఎంగేజ్ చేస్తుంది. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాన్– థియేట్రికల్ రైట్స్ విషయంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఓటీటీ డీల్స్ కుదరని కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి. సినిమాల రిలీజ్ డేట్స్ ప్రభావితం అవుతున్నాయి. చూస్తుంటే ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది. ఇక సినీ కార్మికుల సమ్మె ప్రభావం మా బ్యానర్లో (ఈ సినిమాకు సుస్మితా కొణిదెల మరో నిర్మాత) నిర్మిస్తున్న చిరంజీవిగారి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై పడింది. కానీ ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తాం. కాకపోతే అక్టోబరులో షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాం. కానీ నవంబరు కల్లా పూర్తి చేస్తాం. ఓ పదిహేను రోజులు తేడా అంతే’’ అని అన్నారు. -
జోరుగా హుషారుగా షూటింగ్కి పోదమా
ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదన్నట్లు జోరుగా షూటింగ్స్ చేస్తారు స్టార్స్. అలాంటివారికి హఠాత్తుగా బ్రేక్ వస్తే... ఓ నాలుగైదు రోజులు బాగానే ఉంటుంది. కానీ దాదాపు 20 రోజులు బ్రేక్ వస్తే... ఎప్పుడెప్పుడు షూటింగ్స్కి పోదామా అని వెయిట్ చేస్తారు. తెలుగు చలన చిత్ర కార్మికుల సమ్మె కారణంగా ఆ మధ్య దాదాపు 20 రోజులు బ్రేక్ రావడం, ఈ మధ్యే మళ్లీ షూటింగ్స్ మొదలు కావడంతో ‘జోరుగా హుషారుగా షూటింగ్కి పోదమా’ అంటూ భాగ్యనగరంలో కొందరు స్టార్స్ షూటింగ్స్తో బిజీ అయ్యారు. ఆ విశేషాలు...స్పీడుగా శంకరవరప్రసాద్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి, గాడ్ఫాదర్’ చిత్రాల తర్వాత హీరో చిరంజీవి, హీరోయిన్ నయనతార కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో వెంకటేశ్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్యాథరిన్ మరో కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. కాగా ఆగస్టు 5న ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ సినీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది.తాజాగా ఈ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. చిరంజీవితో పాటు ఈ చిత్రంలోని కీలక తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్లోనే చిరంజీవి–వెంకటేశ్ కాంబినేషన్లో కూడా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని, వీరి కాంబినేషన్లోనే ఓ సెలబ్రేషన్ సాంగ్ను కూడా చిత్రీకరించాలని ఈ చిత్రదర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేశారని తెలిసింది. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.అయితే కార్మికుల సమ్మె కారణంగా ఒక షెడ్యూల్ చిత్రీకరణ ఆలస్యమైంది కనుక ఇకపై పెద్దగా బ్రేక్స్ లేకుండా స్పీడ్గా షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను నిలపాలని ఈ చిత్రయూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక ఈ చిత్రంలో శంకరవరప్రసాద్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన పాత్ర ఉంటుంది. చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెంకటేశ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. చలో గ్రీస్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, రిద్ధీ కుమార్, నిధీ అగర్వాల్ హీరోయిన్లు్లగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే గ్రీస్ వెళ్లనుందట ‘ది రాజాసాబ్’ చిత్రయూనిట్. అక్కడ పాటలు చిత్రీకరించనున్నారట.ఆల్రెడీ ఈ చిత్రదర్శకుడు మారుతి అక్కడి లొకేషన్స్ చూసొచ్చారట. ఈ గ్రీస్ షెడ్యూల్తో ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని సమాచారం. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా విశ్వప్రసాద్ ఇటీవల వెల్లడించారు. ఇక ‘ది రాజాసాబ్’ సినిమాలో సంజయ్ దత్, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో తాత–మనవళ్లుగా సంజయ్ దత్–ప్రభాస్ కనిపిస్తారని టాక్.విదేశాలకు డ్రాగన్హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగు తోందని తెలిసింది. ఎన్టీఆర్ షూట్లో పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొంత టాకీ పార్టుతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారట ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ను ప్రశాంత్ నీల్ విదేశాల్లో ప్లాన్ చేశారని, ఈ దిశగా ఏర్పాట్లు కూడా మొదలై పోయాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా ప్రధాన కథకు ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని, ప్రధాన కథాంశం 1969 నేపథ్యంలో ఉంటుందని, ముఖ్యంగా కోల్కత్తా ప్రస్తావన ఉంటుందని తెలిసింది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. మాస్ జడల్... ఒక హిట్ కాంబినేషన్లో మళ్లీ సినిమా రూ పొందితే ఎన్ని అంచనాలు ఏర్పడతాయో అన్నీ ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఉన్నాయి. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత ఆ చిత్రకథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో రూ పొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. ఇప్పటివరకు విడుదల చేసిన స్టిల్లో ఓ లుక్లో నాని రెండు జడలు వేసుకుని కనిపించారు. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.కాగా... సినిమాలో నాని వేసుకునే జడలకు, ఈ చిత్రదర్శకుడు శ్రీకాంత్ ఓదెల జీవితానికి చిన్న కనెక్షన్ ఉందట. శ్రీకాంత్ ఐదో తరగతి వరకూ అతని తల్లి ఇలా రెండు జడలు వేసి స్కూల్కి పంపించేవారట. ఇది మాత్రమే కాదు... నాని క్యారెక్టర్కి జడలు వేయడం వెనక వేరే కారణం ఉందట. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని ఆ మ«ధ్య ఓ సందర్భంలో శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇక జడల్ పాత్రలో నాని ఫుల్ మాస్గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో వేసిన భారీ సెట్స్లో జరుగుతోంది. టాకీ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. శంకర్పల్లిలో... హీరో రవితేజ వరుస సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతుంటారు. ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరో రెండు మూడు సినిమాలు కమిట్ అవడంతో పాటు సెట్స్పైకి తీసుకెళుతుంటారాయన. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్టీ 76’ (వర్కింగ్ టైటిల్). కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ మిస్ కాకుండా ఉండేలా కథను సిద్ధం చేశారట కిశోర్ తిరుమల.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్కి సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ కొనసాగుతోందట. రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కిశోర్ తిరుమల. శరవేగంగా ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసి, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉందట యూనిట్. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు.‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు ఫిల్మ్నగర్లో వినిపిస్తున్నాయి. ముచ్చింతల్లో... రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది.ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా, ఆయన వీరాభిమాని పాత్రలో రామ్ నటిస్తున్నారు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్స్టాప్గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ని హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు యూనిట్. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొద్ది రోజులు షూటింగ్స్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం ముచ్చింతల్లో షూటింగ్ జరుపుకుంటోంది. హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట పి. మహేశ్బాబు. వివేక్–మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘పప్పీ షేమ్...’ అంటూ సాగే పాటని ఈ నెల 8న విడుదల చేయనున్నారు. మిస్టిక్ థ్రిల్లర్... ‘తండేల్’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్నారు హీరో నాగచైతన్య. అంతేకాదు... తొలిసారి ఆయన వంద కోట్ల క్లబ్లో చేరారు. అలాంటి హిట్ మూవీ తర్వాత నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ‘విరూపాక్ష’ (2023) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్గా రూ పొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన సెట్ రూ పొందించారు మేకర్స్. ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఈ లుక్ కోసం ఆయన శారీరకంగా కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కూడా. అలాగే మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర ముఖ్యమైన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట కార్తీక్ వర్మ. మాదాపూర్లో... ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాలతో ఆయనకంటూ ప్రత్యేకమైన మేనరిజమ్ని, యూత్లో మాంచి ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారాయన. సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లోని మాదాపూర్లో జరుగుతోంది. సిద్ధు శైలి వినోదంతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పొందుతోన్న ఈ చిత్రంలో మనసుని హత్తుకునే భావోద్వేగాలు, అనుబంధాలు కూడా ఉంటాయట. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే... ఈ దీపావళికి సిద్ధు జొన్నలగడ్డ నవ్వుల మతాబులు పేల్చనున్నారన్నమాట. కొనసాగుతున్న సంబరాలు సాయిదుర్గా తేజ్ కథానాయకుడిగా రూ పొందుతున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రోహిత్ కేపీ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ (2024) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ఎస్వైజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది.ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ‘బ్రో’ సినిమా 2023 జూలై 28న విడుదలైంది. అప్పటి నుంచి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్నారు సాయిదుర్గా తేజ్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తి కానందున మరోసారి విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బూత్ బంగ్లాలో... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా (2023) తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూ పొందుతోన్న ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్లోకి మారి పోయారు అఖిల్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్. కాగా ఈ సిని మాలో హీరోయిన్గా తొలుత శ్రీలీల ఫిక్స్ అయ్యారు. కార ణాలు తెలియదు కానీ ఆమె స్థానంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారని టాక్. ముచ్చింతల్లో మహా కాళి ‘హను–మాన్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని, అదే స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారాయన. ఈ యూనివర్స్లో వచ్చిన తొలి చిత్రం ‘హను–మాన్’ బ్లాక్బస్టర్గా నిలవగా, తాజాగా రూ పొందుతోన్న సినిమా ‘మహా కాళి’. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఇది.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. మహాకాళి అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూ పొందుతోంది. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఆ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఒక అమ్మాయి తన తలను పులి తలకు ప్రేమగా తాకుతున్న లుక్ వైరల్గా మారింది. మరి... ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే చిత్రయూనిట్ ప్రకటించే వరకు వేచి ఉండాలి. పైన పేర్కొన్న చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో సందడి సందడిగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
థ్రిల్లింగ్గా ఉంది
బాలీవుడ్ దర్శక–నిర్మాత విక్రమాదిత్య మొత్వాని, నటి సన్నీ లియోన్ అంతర్జాతీయ స్థాయిలో ఓ బయోపిక్ చేయనున్నారు. వెబ్ సిరీస్గా రానున్న ఈ బయోపిక్ హక్కులు సన్నీ లియోన్కి చెందిన సన్సిటీ సంస్థ దక్కించుకుందట. దీంతో విక్రమాదిత్య మొత్వానికి చెందిన ఆండొలన్ ఫిల్మ్స్, సన్నీ లియోన్ ‘సన్ సిటీ’ సంస్థలు ఈ అంతర్జాతీయ బయోపిక్ను రూ పొందించనున్నాయి. ‘‘ఈ ప్రాజెక్ట్ కోసం అసోసియేట్ అవుతున్నందుకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ బయోపిక్లోని స్టోరీ నన్ను ఇన్స్పైర్ చేసింది’’ అని సన్నీ లియోన్ పేర్కొన్నారు. ఇక... ఇది ఎవరి బయోపిక్? ఇందులో నటీనటులు ఎవరు? సన్నీ లియోన్ కూడా ఈ సిరీస్లో నటిస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
రాముడిగా..?
మహేశ్బాబు వెండితెరపై రాముడిగా కనిపించనున్నారట. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కెన్యా దేశంలోని నైరోబీలో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ నెల రోజులకు పైనే ఉంటుందట. అయితే చిన్న గ్యాప్ రావడంతో ప్రస్తుతం మహేశ్బాబు హైదరాబాద్ చేరుకున్నారని, త్వరలోనే మళ్లీ నైరోబీకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. కాగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథనం విభిన్న కాల మానాల్లో జరుగుతుందని, ఇందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో రాముడి పాత్రలో మహేశ్బాబు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 120కి పైగా దేశాల్లో ఈ చిత్రం 2027లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
మిరాయ్ కథకు ఆ స్కోప్ ఉంది: దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని
తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ– ‘‘ఏడేళ్ల క్రితమే ‘మిరాయ్’ ఐడియా పుట్టింది. ఈ సినిమా పూర్తిగా కల్పితం. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ ఉంది.ఈ తొమ్మిది గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నించగా, వీటిని మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు? అన్నదే ‘మిరాయ్’ సినిమా కథ. ఈ చిత్రంలో తల్లి–కొడుకుల బలమైన ఎమోషన్ కూడా ఉంది. తల్లి–కొడుకులుగా శ్రియ– తేజ నటించారు. ఆధ్యాత్మిక భావనలు గల అంబిక (శ్రియ పాత్ర పేరు) తన ఆశయం నెరవేరడానికి తన కొడుకుకి ఎలా మార్గనిర్దేశకత్వం చేసింది? అన్నది సినిమాలో చూడాలి. తేజ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్ల్యాండ్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు.మనోజ్ రోల్ కథలో చాలా బలంగా ఉంటుంది. హీరోని గైడ్ చేసే అగస్త్య మునిగా జయరామ్, తాంత్రిక గురువుగా జగపతిబాబు నటించారు. జటాయు బ్రదర్ సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం. ట్రైలర్లో కనిపించే పక్షి సీక్వెన్స్ ఇది. ఈ పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. రియల్ లొకేషన్స్లో ఈ సినిమాను చిత్రీకరించాం. శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయ్ల్యాండ్... మొత్తం ఆసియా అంతా తిరిగేశాం. ఈ చిత్రంలో ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. శ్రీలంకలో తేజపై ట్రైన్ నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం మన ఇతిహాసాల్లోనో, పురాణాల్లోనో ఉందనే నమ్మకంతో ఈ సినిమా కథ చేశాను.చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇతిహాస కథలు, పాత్రలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే ఈ అంశాలన్నింటినీ కథలో ఆసక్తికరంగా బ్లెండ్ చేయడం అనేది నాకు సవాల్గా అనిపించింది. ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే అయింది. అయినా విశ్వ ప్రసాద్గారు చాలా స పోర్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్ పనులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే లోకల్గా చేస్తున్నారు.సినిమాలో వీఎఫ్ఎక్స్ బాగుండాలంటే ఒకటి మన దగ్గర డబ్బులు ఉండాలి లేదా మన దగ్గర టైమ్ ఉండాలి. మాకు టైమ్ ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. హరి గౌర సినిమాను ఎలివేట్ చేసే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఓ ఫ్రాంచైజీ బిల్డ్ చేసే స్కోప్ ఉన్న కథ ‘మిరాయ్’. ఈ సినిమా విజయంపై అది ఆధారపడి ఉంటుంది. ఇక దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా, ఎడిటర్గా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఏదన్నా ఐడియా ఉన్నప్పుడు వేరేవాళ్లకు కథలు కూడా ఇస్తున్నాను’’ అని అన్నారు. -
కామెడీ షురూ
హీరో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న 65వ సినిమా షురూ అయింది. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ‘నరేశ్ 65’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్ కొట్టారు.దర్శకుడు వీఐ ఆనంద్ ఫస్ట్ షాట్కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ఠ, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్ను నిర్మాతలకు అందజేశారు. ‘‘యునిక్ కాన్సెప్ట్స్తో ఆకట్టుకున్న కామెడీ కింగ్ నరేశ్ తన కొత్త చిత్రం ‘నరేశ్ 65’తో తిరిగి కామెడీ జానర్లోకి వచ్చారు. ఈ సినిమాలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఫ్యాంటసీ, కామెడీ బ్లెండ్తో సరికొత్తగా ఉంటుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి. -
ఘనంగా సైమా అవార్డ్స్ వేడుక
ప్రతి ఏడాది నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుకలు ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతున్నాయి. 13వ సైమా అవార్డు వేడుకని దుబాయ్లోని ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్ పో సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు.‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ‘సైమా’ అవార్డ్ని సొంతం చేసుకున్నారు. ‘సైమా’ నుంచి ఆయన అందుకున్న ఐదో అవార్డు ఇది. ‘సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అల వైకుంఠపురములో (2021), పుష్ప (2022)’ వంటి చిత్రాలకుగాను ఇప్పటికే ఆయన నాలుగుసార్లు ఉత్తమ నటుడిగా అవార్డ్స్ అందుకున్నారు.ఇక ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి ఉత్తమ నటిగా రష్మికా మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీతదర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్గా శంకర్బాబు అవార్డులు అందుకున్నారు. ‘కల్కి 2898 ఏడి’ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత సి. అశ్వనీదత్, ఉత్తమ ప్రతినాయకుడి అవార్డును కమల్హాసన్, ఉత్తమ సహాయ నటి అవార్డును అన్నా బెన్లకు ప్రదానం చేశారు. ఇదే చిత్రానికి ఉత్తమ సహాయనటుడి అవార్డుకు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు.హీరో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికిగాను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, రచయిత రామజోగయ్య శాస్త్రి, గాయని శిల్పారావు అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) తేజ సజ్జా, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటి (క్రిటిక్స్) మీనాక్షీ చౌదరి... ఇంకా పలు విభాగాల్లో పలువురు తారలు అవార్డులు అందుకున్నారు.‘పుష్ప 3’ ఉంటుంది: ఇదే వేదికపై ‘పుష్ప 3’ ఉంటుందా? అని సుకుమార్ని యాంకర్ అడగ్గా... అల్లు అర్జున్ వైపు చూశారాయన. ఆ తర్వాత ‘ఉంటుంది’ అని స్పష్టం చేశారు సుకుమార్. -
మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బిజినెస్లు కూడా చేస్తుంటారు. మహేశ్, అల్లు అర్జున్ తదితరులకు రెస్టారెంట్స్, థియేటర్లు ఉన్నాయి. వీళ్లతో పాటు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా థియేటర్ వ్యాపారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మెగా హీరో రామ్ చరణ్ కూడా రాబోతున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.మహేశ్ బాబుకి ఏఎమ్బీ, అల్లు అర్జున్కి ఏఏఏ, రవితేజకు ఏఆర్టీ, విజయ్ దేవరకొండకు ఏవీడీ పేరుతో మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఆసియన్ సునీల్తో కలిసి ఈ హీరోలందరూ థియేటర్ బిజినెస్లో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ రంగంలోకి రాబోతున్నారట. త్వరలో లాంఛనంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు)అయితే పైన చెప్పిన హీరోలందరికీ మల్టీప్లెక్స్లు తెలంగాణలోనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్.. తన ఏఏఏ సినిమాస్ని వైజాగ్లోనూ లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆంధ్రాలోనే ఏఆర్సీ(ARC) సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారట. ప్రస్తుతం చర్చలో దశలో ఉందని, త్వరలో ఎక్కడ నిర్మించాలనేది ఫిక్సవుతారని టాక్ వినిపిస్తోంది. మరి బన్నీలానే చరణ్ కూడా వైజాగ్లోనే థియేటర్ నిర్మిస్తాడా? లేదంటే విజయవాడ, తిరుపతి లాంటి ఆప్షన్స్ చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది.రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఘోరమైన దెబ్బ పడింది. దీంతో 'పెద్ది' హిట్ కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి 2' ఇంటర్వెల్ చూసి భయపడ్డా..: సందీప్ రెడ్డి వంగా) -
నిధి అగర్వాల్ జిగేలు.. గ్లామరస్ దివ్యభారతి
డిజైనర్ డ్రస్సులో జిగేలు మనేలా నిధి అగర్వాల్బ్లాక్ ఔట్ ఫిట్లో 'చిరుత' నేహా శర్మ క్యూట్ సెల్ఫీగ్లామర్ చూపించేస్తున్న తమిళ బ్యూటీ దివ్యభారతిచీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న నిహారిక ఎన్ఎమ్దుబాయిలో సైమా ఈవెంట్ కోసం నిహారిక అందంగామలయాళ బుట్టబొమ్మలా హానీరోజ్ అందాల విందు View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) -
వివి వినాయక్ చేతుల మీదుగా 'విద్రోహి' పాట విడుదల
రవి ప్రకాష్, శివ కుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విద్రోహి'. విఎస్వి దర్శకుడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఇప్పుడు తొలి సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దీన్ని లాంచ్ చేశారు. ఈ మధ్యే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.సాంగ్ విడుదల అనంతరం వినాయక్ మాట్లాడుతూ.. 'విద్రోహి ఫస్ట్ లుక్ చూశాను. అలాగే ఈ కథ గురించి కూడా విన్నాను. చాలా మంచి కథ. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నా. నేను విడుదల చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఇందులో పోలీస్ ఆఫీసర్గా చేసిన రవి ప్రకాష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మంచి ఆర్టిస్ట్. ఈ సినిమా, టీమ్ అందరికీ మంచి సక్సెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు. -
'నువ్వే చెప్పు చిరుగాలి' పాట లాంచ్ చేసిన మంచు మనోజ్
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ చెలియా'. రూపాశ్రీ కొపురు నిర్మించగా ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద 'ఓ చెలియా' నుంచి తొలి పాటని రిలీజ్ చేశారు.'నువ్వే చెప్పు చిరుగాలి' అని సాగే ఈ పాటని మంచు మనోజ్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేశారు. ఈ గీతాన్ని సాయి చరణ్ ఆలపించగా, ఎంఎం కుమార్ బాణీని అందించారు. సుధీర్ బగడి రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించబోతోన్నారు. -
'బాహుబలి 2' ఇంటర్వెల్ చూసి భయపడ్డా..: సందీప్ రెడ్డి వంగా
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు చెప్పగానే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు గుర్తొస్తాయి. తీసింది మూడు మూవీస్ అయినప్పటికీ పాన్ ఇండియా లెవల్లో చాలా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. త్వరలో ప్రభాస్తో 'స్పిరిట్' చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 70 శాతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికే పూర్తయిందని చెప్పాడు. అలానే 'బాహుబలి 2' ఇంటర్వెల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోకు రాంగోపాల్ వర్మతో కలిసి వచ్చిన సందీప్ రెడ్డి వంగా పలు విషయాలు మాట్లాడాడు. అలానే 'బాహుబలి 2' వల్ల తాను భయపడిన సందర్భాన్ని బయటపెట్టాడు. ఈ చిత్రం 'అర్జున్ రెడ్డి' విషయంలో ఏర్పడిన గందరగోళం గురించి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?) 'నేను ఇప్పటివరకు చూసిన సినిమాల్లో 'బాహుబలి 2' ఇంటర్వెల్ సీన్ హైలెట్ అని చెబుతాను. దాన్ని మించినది ఇప్పటివరకు రాలేదు. ఆ మూవీ చూసిన తర్వాత.. నేను అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీన్ చూసుకున్నాను. ఇది ఆడియెన్స్కి నచ్చుతుందా లేదా అని ఒక్క నిమిషం భయమేసింది. అలాంటి ఇంటర్వెల్ చూసి జనాల అరుపులు గోల చూశాక.. నా ఇంటర్వెల్లో ఏమో హీరో తన ప్యాంటులో టాయిలెట్ పోసుకుంటాడు. అలాంటి సీన్ ఎక్కుద్దా అని భయపడ్డా. కానీ మొదటి సీన్ నుంచి మళ్లీ చూసుకున్న తర్వాత అప్పుడు నమ్మకం వచ్చింది.''టీజర్ వచ్చిన తర్వాత ఇంకా నమ్మకం పెరిగింది. సినిమాకు ఇంటర్వెల్ కూడా గొప్పగా ఉండాలని రాజమౌళి నిరూపించారు. అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు దైర్యం వచ్చింది' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు) -
‘ప్రొద్దుటూరు దసరా’ ఎంగేజింగ్గా ఉంది: దర్శకుడు కరుణ కుమార్
‘ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్గా, అద్భుతంగా అనిపించింది’ అన్నారు దర్శకుడు కరుణ కుమార్. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీని శుక్రవారం (సెప్టెంబర్ 5) నాడు ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం..ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలి అనే నియమాల్ని బద్దలు కొడుతూ. ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తెరకెక్కించారు. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్, పాట విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఏఐని వాడుకుని గొప్పగా చూపించారు. ఇంటర్నేషనల్ వైడ్గా డాక్యుమెంటరీలను ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శిస్తుంటారు. డాక్యుమెంటరీ అనేది దృశ్యరూపంలో ఉండే చరిత్ర. ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ... ఇప్పటి వరకు మా ఏరియా అంటే వయలెన్స్ మాత్రమే ఉంటుందని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మా మూలాల్లోని కథల్ని చూపిస్తాను. యశ్వంత్ మ్యూజిక్, నిఖిల్ కెమెరా వర్క్ గొప్పగా వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. -
శ్రీదేవికి తక్కువ పారితోషికం.. నిర్మాతలే రాజమౌళికి ఎక్కించి చెప్పారు!
బాహుబలి సినిమా (Bahubali Movie)తోనే పాన్ ఇండియా ట్రెండ్ పాపులర్ అయింది. ఆ తర్వాత సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ను ఏలాయి. దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తరణకు బాహుబలి తోడ్పడింది. ఈ మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి ఈ సినిమాలో దివంగత హీరోయిన్ శ్రీదేవి (Sridevi) నటించాల్సిందట!ఇప్పటికీ నా దగ్గరే..శివగామి పాత్ర కోసం తొలుత శ్రీదేవిని అనుకున్నారు. మరి అదెందుకు కార్యరూపం దాల్చలేదన్నదానిపై శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) స్పందించాడు. బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి అభిమానిని అని రాజమౌళి పంపిన మెసేజ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సినిమా కోసం ఆమె చెప్పిన సూచనలు విన్నాక ఆయనకు శ్రీదేవిపై గౌరవం రెట్టింపైంది. కానీ, నిర్మాతల వల్ల ఆ సినిమా తను చేయలేకపోయింది.చాలా తక్కువ పారితోషికంరాజమౌళి మా ఇంటికి వచ్చి తన సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన గది నుంచి బయటకు వెళ్లగానే నిర్మాతలు ఎంటరయ్యేవారు. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకు శ్రీదేవి తీసుకున్నదానికంటే కూడా తక్కువే ఇస్తామన్నారు. ఆమె చిన్న నటి కాదు కదా! తనవల్ల సినిమాకు కూడా ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. తమిళం, హిందీలోనూ కొంత పాపులారిటీ వస్తుంది. అలాంటప్పుడు నా భార్యను ఒక మెట్టు దిగి సినిమా చేయమని నేనెందుకు చెప్తాను?రివర్స్లో చెప్పారుకానీ నిర్మాతలు మాత్రం రాజమౌళికి అంతా రివర్స్లో చెప్పారు. హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం తనే కావాలంటోందని చాడీలు చెప్పారు. మేము అడిగిందొక్కటే.. మా పిల్లలకు హాలీడేస్ ఉన్నప్పుడు పెద్ద షెడ్యూల్ పెట్టుకోమన్నాము. అంతకుమించి పెద్ద డిమాండ్లేమీ చేయలేదు. కానీ నిర్మాతలు రాజమౌళికి వేరేవిధంగా ఎక్కించారు. నిర్మాత శోభు యార్లగడ్డకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేకే ఇలాంటి పుకార్లు సృష్టించాడు. తను ప్రొఫెషనల్గా ఉండదని కామెంట్ చేశాడు. రూ.10 కోట్ల డిమాండ్?అదే నిజమైతే రాకేశ్ రోషన్, యష్ చోప్రా, రాఘవేందర రావు.. వీళ్లందరూ తనతో ఎలా పని చేశారు? ఆమెను అన్ప్రొఫెషనల్ అని ఎలా అంటారు? అని అసహనం వ్యక్తం చేశాడు. కాగా బాహుబలి రిలీజైన సమయంలో శ్రీదేవి డిమాండ్లపై పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమాకుగాను రూ.10 కోట్లు, 10 ఫ్లైట్ టికెట్స్, హోటల్లో ఓ అంతస్తు మొత్తం తనకే కావాలని శ్రీదేవి డిమాండ్ చేసిందని రాజమౌళి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కామెంట్స్ విని బాధపడ్డ శ్రీదేవి.. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. 300కి పైగా సినిమాలు చేశాను. అలాంటి డిమాండ్లు చేసే ఈ స్థాయికి చేరాననుకుంటున్నారా? నిజంగా అలా చేస్తే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండేదాన్నా? నా గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నిర్మాతలే రాజమౌళికి ఇలా నాగురించి తప్పుగా చెప్పి ఉండొచ్చు! కానీ, ఇలా పబ్లిక్గా మాట్లాడకపోయుంటే బాగుండేది అని విచారం వ్యక్తం చేసింది. దీంతో రాజమౌళి సైతం పబ్లిక్గా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధపడ్డాడు. కాగా శ్రీదేవి 2018లో మరణించింది. బాహుబలి విషయానికి వస్తే మొదటి భాగం 2015లో రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ చిత్రాలను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.చదవండి: నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్ -
ఓటీటీలో వెబ్ సిరీస్లదే హవా.. ఏ భాషలో ఎక్కువ చూస్తున్నారంటే..?
భారత్లో ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికలు వైవిధ్యమైన కంటెంట్తో వీక్షకుల మది దోచుకుంటున్నాయి. ప్రధానంగా వెబ్ సిరీస్లకు జనం పట్టం కడుతున్నారు. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వెబ్ సిరీస్లదే హవా. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. అంతేగాక టాప్–10లో మొదటి తొమ్మిది స్థానాల్లోనూ ఇవే ఉండడం చూస్తుంటే వీక్షకుల ఆసక్తి ఇట్టే అర్థం అవుతోంది. ‘క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్’ హిందీ సిరీస్ ఏకంగా 2.77 కోట్ల మంది వ్యూయర్స్తో దేశంలో టాప్లో నిలిచింది. టాప్–50లో అయిదు సినిమాలు, అయిదు రియాలిటీ షోలు చోటు సంపాదించాయి. భాషల పరంగా చూస్తే హిందీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్–50 జాబితాలో అత్యధికంగా 16 సిరీస్, సినిమాలు, రియాలిటీ షోలతో జియో హాట్స్టార్ ముందంజలో ఉంది. -
బిగ్బాస్ 9 లో యూట్యూబ్ సెన్సేషన్? ఒక్క పోస్ట్తో తేల్చేసిందిగా!
తిన్నాతిరం పడతలే, ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి, దారిపొంటత్తుండు, నా పేరే ఎల్లమ్మ.. వంటి పాటలతో యూట్యూబ్లో నెస్సేషన్ అయింది ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ (Nagadurga Gutha). నాలుగేండ్ల వయసులోనే కూచిపూడి నేర్చుకుంది. పద్నాలుండేగ్ల వయసులో పేరిణి నాట్యం నేర్చుకుంది. నృత్యకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం కూడా స్థాపించింది. లాక్డౌన్లో ఆమె నటించిన తిన్నాతిరం పడతలే.. పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. ఫోక్ సాంగ్స్ క్వీన్ఆ పాటతో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎన్నో యూట్యూబ్ సాంగ్స్లో అందంగా స్టెప్పులేసింది. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్లో నటించే ఛాన్స్ వచ్చిందట! అలాగే అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్గా అడిగారట! కానీ ఆ అవకాశాలను తిరస్కరించిన నాగదుర్గ.. నటన అంటే ఇష్టమే కానీ నాట్యంలో డాక్టరేట్ సాధించాలనేది నా కల అని చెప్పుకొచ్చింది. పీహెచ్డీ పట్టా చేతికొచ్చాకే సినిమాల గురించి ఆలోచిస్తానన్న ఈమె కలివి వనం అనే ఒకే ఒక్క సినిమాలో మాత్రం నటిచింది.బిగ్బాస్పై ఆసక్తి లేదుఇంతలో నాగదుర్గ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొననుందని ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై నాగదుర్గ స్పందించింది. తాను బిగ్బాస్ 9వ సీజన్కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ షోకి వెళ్లాలన్న ఆసక్తి తనకు ఏమాత్రం లేదని తెలిపింది. కాబట్టి ఈ ప్రచారానికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టమని కోరింది. అయితే త్వరలోనే ఓ పెద్ద అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.చదవండి: దృశ్యం నటుడు కన్నుమూత -
'పుష్ప'గాడి రూల్.. అవార్డ్స్లో అల్లు అర్జున్ ఆధిపత్యం
దుబాయ్లో జరుగుతున్న సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుకలో ఐకాన్స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటారు. పుష్ప2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆయన అవార్డ్ సొంతం చేసుకున్నారు. సైమా నుంచి ఇప్పటి వరకు ఐదు అవార్డ్స్ బన్నీకి లభించాయి. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అలా వైకుంఠపురంలో (2021),పుష్ప (2022) చిత్రాలకు సంబంధించి అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే దుబాయ్లో జరిగిన 'గామా' అవార్డ్స్ -2025లో కూడా బన్నీ సత్తా చాటారు. 'గామా' నుంచి బెస్ట్ యాక్టర్ (పుష్ప 2) అవార్డును తొలిసారి అందుకున్నారు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గద్దర్ అవార్డ్స్-2025లో కూడా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని తెలంగాణ చరిత్ర పుటల్లో చేరారు. అల్లు అర్జున్ తన కెరీర్లో 20కి పైగా ఎంతో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఇది ఆయన నటనా ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు.పుష్ప2 ఖాతాలో సైమా అవార్డ్స్సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ సింగర్గా శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్) పాటకు అందుకున్నారు. ఏకంగా ఈ చిత్రానికి 5 అవార్డ్స్ రావడం విశేషం.అల్లు అర్జున్కు అవార్డ్స్.. సీక్రెట్ ఏంటి..?గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ఒక సంచలనం.. సినిమా కలెక్షన్స్తో పాటు అనేక రికార్డ్స్ను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్కు అవార్డులు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆయన నటనలో అభినయం, శ్రమ, వైవిధ్యం కనిపిస్తాయి. ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు తన శక్తిని అంతా ఉపయోగిస్తారు. ఆయన నటనా ప్రస్థానమే కాకుండా.. పాత్రల ఎంపిక ఆపై సినిమా ఏదైనా సరే అందులో ఆయన చూపించే మెథడ్ యాక్టింగ్ తనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాత్ర కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డ్యాన్స్ ప్రాక్టీస్, యాసలు నేర్చుకోవడం వంటి అంశాలపై ఆయన చేసిన కృషి.. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయే విధానం ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. అల్లు అర్జున్కి అవార్డులు రావడం కేవలం గెలుపు మాత్రమే కాదు.. తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన ఘనత కూడా అని చెప్పవచ్చు.నటన, డ్యాన్స్తో ఆధిపత్యం ఆర్యలో అమాయక ప్రేమికుడిగా కనిపించిన బన్నీ.. వేదంలో స్ట్రీట్ కుర్రాడిగా మెప్పించారు. రుద్రమదేవిలో గోన గన్నా రెడ్డి పాత్రలో తెలుగు చరిత్రకు ప్రాణం పోసినట్టు చేశారు. పుష్పలో చిత్తూరు యాస, మాస్ బాడీ లాంగ్వేజ్తో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ గడ్డపై ఆధిపత్యం చూపించారు. పుష్పలో “తగ్గేదే లే” అనే డైలాగ్కి ఆయన ఇచ్చిన ఎమోషనల్ వెయిట్ మామూలుగా ఉండదు. ఇలా ప్రతి సినిమాలో కూడా తన ప్రత్యేకతను చూపారు. అల్లు అర్జున్కి 'ఇండియా బెస్ట్ డాన్సర్' అనే ట్యాగ్ రావడానికి కారణం వెండితెరపై ఆయన వేసిన స్టెప్పులని చెప్పవచ్చు. బుట్ట బొమ్మ, సీటీ మార్, టాప్ లేచిపోద్ది వంటి పాటల్లో స్పీడ్, గ్రేస్, కంట్రోల్ అన్నీ కలిపి మనకు ఒకేసారి చూపిస్తారు. అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకే కాదు, మలయాళం, తమిళం, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బన్ని నటనా శైలి అంటే ఒకే ఫార్ములా కాదు.. ప్రతి పాత్రకు తనదైన శైలి, శక్తికి మించిన శ్రమతో ప్రాణం పోసేలా కష్టపడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనకు అవార్డులతో పాటు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. -
70 శాతం పూర్తి.. 'స్పిరిట్'పై షాకింగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి
ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి దర్శకులు సందీప్ రెడ్డి వంగా అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యానిమల్ సినిమా తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు.స్పిరిట్ సినిమా గురించి సందీప్ రెడ్డి ఇలా అన్నారు. ' ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 70శాతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేశాం. గతంలో యానిమల్ సినిమా సమయంలో కూడా షూటింగ్ కంటే ముందే 80శాతం బీజీఎమ్ వర్క్ పూర్తి చేసి.. ఆ తర్వాతే సెట్స్ మీదికి వెళ్లాం. ఇలా చేయడంలో వల్ల సీన్ ఎలాంటి ఔట్పుట్ వస్తుందో తెలిసిపోతుంది. ఆపై సమయంతో పాటు ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా తగ్గుతుంది. ప్రభాస్తో నాకు చాలా సన్నిహితం ఉంది. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఈ సినిమాకు సహకరించారు. పాన్ ఇండియా రేంజ్ హీరో అనే ఫీలింగ్ ఆయనలో కనిపించదు. త్వరలో ప్రభాస్తో కలిసే వస్తాం' అంటూ సందీప్ చెప్పారు.ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసాఫీపర్పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రకథలో ఫ్లాష్బ్యాక్ ఉందట. ఈ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మాఫియా డాన్లా కనిపిస్తారని సమాచారం. త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్న విషయం తెలిసిందే.. సందీప్ రెడ్డి వంగా సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి క్రేజ్ తెచ్చుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ కోసం పనిచేస్తున్నారు. యానిమల్లో కొన్ని పాటలతో పాటు రావణాసుర, డెవిల్ తదితర సినిమాలకూ ఆయన సంగీత వహించారు."70% of the BGM is already done 🔥💥#Prabhas is a very transparent and very sweet person to work with. We’ll start shooting very soon."- #SandeepReddyVanga | #Spiritpic.twitter.com/P6nbFGkaPk— Whynot Cinemas (@whynotcinemass_) September 6, 2025 -
మా సినిమా ఆ కోవకి చెందుతుంది : జేడీ చక్రవర్తి
‘‘జాతస్య మరణం ధ్రువం’ పేరు సజెస్ట్ చేసింది నేనే. టైటిల్ క్రెడిట్ నాకే వస్తుంది (నవ్వుతూ). మలయాళం నుంచి వచ్చే సినిమాలు బావుంటాయని అంటాం. మా ‘జాతస్య మరణం ధ్రువం’ ఆ కోవకి చెందిన సినిమా... అందరికీ నచ్చుతుంది’’ అని జేడీ చక్రవర్తి తెలిపారు. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్, ప్రీతీ జంగియాని ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో స్క్రీన్ప్లే, ట్విస్టులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘చాలా బలమైన స్క్రిప్ట్ ఇది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అద్భుతంగా ఉంటుంది’’ అని శ్రవణ్ జొన్నాడ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని సీరత్ కపూర్ చెప్పారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘΄ాన్ ఇండియా స్థాయిలో రూ΄÷ందించిన ఈ సినిమాని అదే స్థాయిలో విడుదల చేస్తాం’’ అని తెలి΄ారు. -
ఓటీటీలో అదరగొడుతున్న స్పై సిరీస్.. రెండు కథలు ఒకటే!
ఏ ఎండకాగొడుగు అన్న నానుడి వినే ఉంటారు. కాని ఇప్పుడు ఓటిటిల్లో దీనినే ఏ ట్రెండ్ కా స్టోరీ అన్న విధంగా నడుస్తోంది. ఆగష్టు 15 అనగానే , ఆ తేదీకి ముందు తరువాత నెలల్లో దేశభక్తి సినిమాలు రావడం పరిపాటే. ఇలా ప్రస్తుతం ఓటిటి సిరీస్ లు కూడా విడుదలవుతున్నాయి. ఇదే నేపధ్యంలో సరిగ్గా వారం రోజుల వ్యవధిలో రెండు దిగ్గజ ఓటిటిల్లో రెండు సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వాటిలో జియో హాట్ స్టార్ వేదికగా సలాక్కార్ ఒకటి అయితే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సారే జహా సే అచ్చా మరొకటి. వీటిలో విశేషం ఏమిటంటే రెండు కథాంశాలు దాదాపు ఒకటే. పాత్రలు, కథను నడిపించిన తీరు తప్ప రెండూ అన్నిటికీ అన్నీ సమానమే.అంతలా వీటిలో ఉన్న కథాంశమేమిటో ఓ సారి చూద్దాం.1960 నుండి 1990 సంవత్సర కాలంలో భారతదేశానికి యుద్ధాలు, ఇతర దేశాల నుండి కవ్వింపు చర్యలు లాంటివి ఎన్నో జరిగాయి. సరిగ్గా పాకిస్తాన్ భారత్ తో యుద్ధం జరిగిన ఆ సమయంలో పాకిస్తాన్ దేశం న్యూక్లియార్ బాంబును తయారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కాని ఆ ప్రయత్నాలన్నీ మన దేశానికి సంబంధించిన గూఢాచార సంస్థ రా నాశనం చేసింది. తమ సంస్థ ద్వారా పాకిస్తాన్ లోకి గూఢాచారులను పంపి పాకిస్తాన్ న్యూక్లియార్ బాంబు తయారీని సమర్ధవంతంగా ఎదుర్కుంది.ఇప్పుడు పైన చెప్పుకున్న రెండు టీవి సిరీస్ లలో ఇదే కథా నేపధ్యం. 1978 లో పాకిస్తాన్ దేశం జనరల్ జియా నేతృత్వంలో ఉంది. ఆ సమయంలో ఆదిర్ దయాళ్ అనే గూఢాచారి ఇండియన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా పాకిస్తాన్ లో ప్రవేశిస్తాడు. పాకిస్తాన్ లోని ఓ ప్రాంతంలో న్యూక్లియార్ బాంబు తయారవుతుందని తెలుసుకోని ఆ ప్రయత్నాలను నాశనం చేయడమే జియో హాట్ స్టార్ లో 5 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సలాక్కార్ కథ.1972 లో పాకిస్తాన్ దేశం భారత్ తో షిమ్లా ఒప్పందం తరువాత ఆ దేశ నేత అయిన జుల్ఫికర్ అలీ భుట్టో వేరే దేశాల నుండి విడిభాగాలు తెప్పించి పాకిస్తాన్ లో న్యూక్లియార్ బాంబు తయారు చేయాలనుకుంటాడు. ఈ ఆపరేషన్ కి ఐయస్ఐ హెడ్ అయిన ముర్తజా మాలిక్ ని నియమిస్తాడు. మాలిక్ ఆపరేషన్ ని పాకిస్తాన్ లోనే ఉన్న భారత గూఢాచారి విష్టు సర్వనాశనం చేస్తాడు.ఇదే నెట్ ఫ్లిక్స్ లో 6 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సారే జహా సేఅచ్ఛా సిరీస్ కథ.రెండు సిరీస్ లు థ్రిల్లర్ జోనర్ తో వచ్చినవే.చూసే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయనడంలో సందేహమే లేదు. చరిత్రలో కనమరుగైన మన గూఢాచారుల కథలు ఇవి. వర్త్ ఫుల్ వాచ్ -
ఓటీటీలో 'సు ఫ్రమ్ సో'.. అఫీషియల్ ప్రకటన
కన్నడ హిట్ సినిమా 'సు ఫ్రమ్ సో'(Su From So Movie) ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. షనీల్ గౌతమ్, సంధ్య, రాజ్ బి.శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని క్రియేట్ చేసింది. ఈ మూవీకి కథ, దర్శకత్వం జేపీ తుమినాడ్ అందించారు. తెలుగులో ఆగష్టు 8న మైత్రీ మూవీ మేకర్స్ వారు విడుదల చేశారు.కన్నడలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన 'సు ఫ్రమ్ సో' చిత్రం.. తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఈ చిత్రం జియోహాట్స్టార్ (JioHotstar)లో సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు ఆ ఓటీటీ సంస్థ అప్కమింగ్ సినిమా జాబితాలో 'సు ఫ్రమ్ సో'ను చేర్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఏకం రూ.40కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.కథేంటి?కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
టికెట్ ధరలపై జీఎస్టీ.. ప్రధానికి నాగ్ అశ్విన్ విజ్ఞప్తి
కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల చిత్రపరిశ్రమలో కూడా కొంత ఉపశమనం లభించింది. అయితే, ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ సోషల్మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కాస్త మార్పులు చేస్తే చాలామందికి లాభం చేకూరుతుందన్నారు.కొత్త జీఎస్టీ మార్పుల ప్రకారం రూ. 100 లోపు టికెట్లను కొనుగోలు చేసే వారిపై 5 శాతం జీఎస్టీ పడుతుంది. గతంలో 12 శాతం ఉండేది. అయితే, రూ. 100 మించి టికెట్ ధర ఉంటే రూ. 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఇదే విషయంలో ప్రధానిని నాగ్ అశ్విన్ విజ్ఞప్తి చెశారు. ప్రస్తుతం చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే రూ.100 లోపు ధరలతో టికెట్లు విక్రయిస్తున్నారని దీంతో ఎక్కువ మందికి లాభాదాయకంగా ఉండదన్నారు. 5 శాతం జీఎస్టీ శ్లాబ్ని కేవలం రూ.100 లోపు టికెట్లకే కాకుండా.. రూ.250 వరకూ పొడిగిస్తే బాగుంటుందని ఆయన కోరారు. -
లక్కీఛాన్స్.. స్టార్ హీరోతో మీనాక్షి చౌదరి
సినిమా ఎల్లలు దాటి చాలా కాలమైంది. అది సినీ తారలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లకు ప్రయోజనంగా మారింది. ఒక భాషల్లో అవకాశాలు తగ్గాయనుకుంటే వెంటనే మరో భాష నుంచి పిలుపు వస్తోంది. నటి మీనాక్షిచౌదరికి అలాంటి అదృష్టమే పట్టిందిప్పుడు. టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేసిన ఈ అమ్మడికి ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. చివరిగా ఈమె తెలుగులో నటించిన సంక్రాంతికి వస్తున్నాం మంచి విజయాన్ని సాధించింది. దీంతో మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే అలాంటి పరిస్థితి రాలేదు. ఇక తమిళంలోకి విజయ్ ఆంటోని హీరోగా నటించిన కొలై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత సింగపూర్ సెలూన్, విజయ్కు జంటగా ది గోట్ చిత్రాల్లో నటించారు. విజయ్కు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడు బాగా ప్రచారం పొందారు. కానీ, చిత్రంలో ఆమె పాత్ర మాత్రం పరిమితమే అయ్యింది. దీంతో ఇక్కడ కూడా అవకాశాలు అడుగంటాయి. అలాంటిది తాజాగా మరో లక్కీఛాన్స్ వరించిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. ఈయన నటించి, దర్శకత్వం వహించిన ఇడ్లీకడై చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం హిందీ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ధనుష్ పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ధనుష్ నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. దీని తరువాత అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన 55వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని గోపురం ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో ధనుష్కు జంటగా నటి మీనాక్షిచౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అదే విధంగా ఒక హిందీ చిత్రంలోనూ మీనాక్షిచౌదరి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సైమా అవార్డ్స్-2025 విజేతలు వీరే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
దుబాయ్లో సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుక ఘనంగా ప్రారంభమైంది. దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్తో సైమా గౌరవిస్తుంది. 2024లో సెన్సార్ అయిన చిత్రాలకు సంబంధించి తాజాగా విన్నర్స్ జాబితాను విడుదల చేశారు. గత పన్నేండేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 5న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. సెప్టెంబర్ 6న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమారు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డ్స్ దక్కించుకున్నారు. అయితే, ఉత్తమ చిత్రంగా 'కల్కి' నిలిచింది.సైమా విజేతలు.. వారి వివరాలు* ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ* ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప-2)* ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్) * ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2) * ఉత్తమ నటి : రష్మిక మందన్నా (పుష్ప-2)* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజా సజ్జా (హనుమాన్)* ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్) * ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి) * ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి) * ఉత్తమ నూతన నటి : భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప -2)* ఉత్తమ గేయ రచయిత 'చుట్టమల్లే' పాట కోసం: రామజోగయ్య శాస్త్రి (దేవర)* ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: శిల్పారావ్ (దేవర) 'చుట్టమల్లే' పాట కోసం* ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి (పుష్ప2) 'పీలింగ్స్' పాట* ఉత్తమ విలన్ : కమల్ హాసన్ (కల్కి) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర) * ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2) * ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)* ఉత్తమ నూతన నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)* ఉత్తమ నూతన దర్శకుడు: నందకిషోర్ ఇమాని (35 ఒక చిన్నకథ)* ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి) -
ఇప్పుడే ప్రారంభించాను!
సిసినీ ఇండస్ట్రీలో నటుడిగా 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు హీరో నాని. ‘అష్టా చమ్మా’ (2008 సెప్టెంబరు 5న రిలీజ్) చిత్రం ద్వారా నాని నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. స్వాతి, అవసరాల శ్రీనివాస్, భార్గవి ముఖ్య తారలుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.‘‘మీ అందరి ప్రేమతో 17 ఏళ్ళు పూర్తయ్యాయి. నేను ఇప్పుడే ప్రారంభించాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాని. ఇక ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నారు నాని. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో వేసిన సెట్స్లో జరుగుతోంది.ఈ చిత్రం నుంచి నాని పోస్టర్ను రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల కానుంది. -
మురిసె... మెరిసె...
ఓనమ్ పండగ ఆనందంలో మాత్రమే కాదు... సక్సెస్ సంబరంలోనూ ఉన్నారు మాళవికా మోహనన్. మోహన్లాల్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్గా నటించిన మలయాళ చిత్రం ‘హృదయపూర్వం’ ఇటీవల విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో జోష్గా పండగ చేసుకున్నారు మాళవిక. మరో మాట.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’తో తెలుగులోకి వస్తున్నారీ బ్యూటీ. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ⇒ ‘8 వసంతాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనంతికా సనీల్కుమార్. ఈ యంగ్ బ్యూటీ ఓనమ్ సెలబ్రేషన్స్ను కాస్త ముందుగా మొదలుపెట్టి, ఆ ఫొటోలు షేర్ చేసి, ఆనందాన్ని వ్యక్తపరిచారు. ⇒ తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఆల్రెడీ గెలుచుకున్న హీరోయిన్ కృతీ శెట్టి ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రేమ, శాంతి, ఆనందం... మనందరి జీవితాల్లో నెలకొనాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారీ బ్యూటీ. ⇒ అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ సంయుక్త. అయినా పండగకి ఓ కాల్షీట్ కేటాయించారీ సుందరి. ఓనమ్ ఫెస్టివల్ను సంతోషంగా జరుపుకుని, అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు. ⇒ ఒకప్పటి హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా మీనా గురించి, తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మీనా ఓనమ్ ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసి, ఆ ఫొటోలను షేర్ చేశారు. ఇక వెంకటేశ్ కాంబినేషన్లో మీనా నటించనున్న ‘దృశ్యం 3’ సినిమా ఈ నవంబరులో ప్రారంభం కానుంది. ఇంకా హీరోయిన్లు మడోనా సెబాస్టియన్, అంజు కురియన్, అనిఖా సురేంద్రన్ వంటి మరికొందరు ఓనమ్ పండగను జరుపుకున్నారు. కొందరు పండగ రోజున, మరికొందరు ప్రీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటూ సందడి చేశారు. -
అక్షయ్ కుమార్ భారీ విరాళం.. ఏకంగా రూ.5 కోట్లు
భారీ వర్షాలతో పంజాబ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడి ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నం చేశాయి. అయతే, తాజాగా బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన వంతుగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. అయితే, దానిని తాను విరాళం అనుకోవడంలేదని పేర్కొన్నారు. డొనేషన్ అనే పదం తనకు నచ్చదని తెలిపారు. ఇతరులకు డొనేట్ చేసేందుకు నేనెవరిని..? అంటూనే ఇలా సాయం చేయడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి అదృష్టంగా భావిస్తుంటానని తెలిపారు. -
'మైత్రి మూవీ మేకర్స్'పై ఇళయరాజా కేసు
అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్పై సంగీత దర్శకులు ఇళయరాజా మద్రాస్ కోర్టులో కేసు దాఖలు చేశారు. తన సంగీతంలో వచ్చిన పాటలను అనుమతి లేకుండా ఈ సినిమాలో ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇళయరాజా న్యాయవాదులు తెలిపారు.తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్లో నటుడు అజిత్ కుమార్తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాలో ఇళయరాజా పాత పాటలను తన అనుమతి లేకుండా ఉపయోగించారు.., అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. ఆపై ఏడు రోజుల్లోగా సినిమా నుంచి పాటను తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇళయరాజా న్యాయవాదులు కె. త్యాగరాజన్, ఎ. శరవణన్ మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు.అయితే, ఆ పాటలకు సంబంధించిన అసలు హక్కుదారుల నుంచి అనుమతి తీసుకున్నామని సినిమా నిర్మాతలు చెబుతున్నారు. కానీ, అసలు యజమాని ఎవరో వెల్లడించలేదని న్యాయవాదులు అంటున్నారు. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలను పలు సినిమాల్లో నిరంతరం ఉపయోగించడాన్ని నిషేధించాలని వారు కోరారు. ఇప్పటివరకు ఉపయోగించుకున్న వారు తగిన పరిహారం చెల్లించాలని తెలిపారు. ఈ కేసు సెప్టెంబర్ 8న న్యాయమూర్తి సెంథిల్కుమార్ ముందు విచారణకు రానుంది. -
'కూలీ' మూవీ.. హిట్ వీడియో సాంగ్ చూశారా?
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'చికిటు' అంటూ సాగే ఈ పాటకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. సుమారు రూ. 400 కోట్లకు పైగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. సన్పిక్చర్స్ భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించింది. అయితే, అనిరుధ్ మ్యూజిక్కు రజనీ వేసిన క్లాస్ స్టెప్పులు ఈ సాంగ్లోనే కనిపిస్తాయి. -
హిట్ ఫ్రాంచైజీ చిత్రం 'ట్రాన్: ఏరీస్' ట్రైలర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం 'ట్రాన్: ఏరీస్'.. దర్శకుడు జోయాకిమ్ రోన్నింగ్ తెరకెక్కించిన ఈ మూవీ నుంచి తాజాగా కొత్త పోస్టర్, ట్రైలర్ను డిస్నీ విడుదల చేసింది. సైన్స్ ఫిక్షన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ట్రాన్ (1982), దాని సీక్వెల్ ట్రాన్: లెగసీ (2010) తర్వాత వస్తున్న మూడవ చాప్టర్ ఇది. ఈ చిత్రం భారతదేశంలో అక్టోబర్ 10, 2025న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.డిజిటల్ ప్రపంచం నుండి రియల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అధునాతన ప్రోగ్రామ్ ఏరీస్ ఒక ప్రమాదకరమైన మిషన్లో నడిచే కథ ఇది. ఇదే మానవజాతి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I.) జీవుల మధ్య మొదటి భేటీగా నిలుస్తుంది. ఈ చిత్రంలో జారెడ్ లేటో ప్రధాన పాత్రలో నటించగా, గ్రెటా లీ, ఎవాన్ పీటర్స్, హసన్ మినహాజ్, జోడీ టర్నర్-స్మిత్, గిల్లియన్ ఆండర్సన్ వంటి అంతర్జాతీయ నటీనటులు కనిపించనున్నారు. -
ఓనం స్పెషల్.. మలయాళ బ్యూటీస్ అందం చూడతరమా?
మలయాళీలు ఎంతో ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునే ఓనం వచ్చేసింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేసే మలయాళ బ్యూటీస్తో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించే పలువురు బ్యూటీస్.. అందమైన చందమామల్లా రెడీ అయిపోయారు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. వీరిలో మాళవిక మోహనన్, సంయుక్త, ఐశ్వర్య లక్ష్మి, అపర్ణ బాలమురళి, సానియా అయ్యప్పన్ తదితరులు ఉన్నారు. మీరు ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Saniya (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
రెడ్హ్యాండెడ్గా పోలీసులకు చిక్కిన హీరోయిన్
బెంగాలీ నటి 'అనుష్క మోనీ మోహన్ దాస్'(41) పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగాలీ సినీ పరిశ్రమలో పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో నటించి ఆమె గుర్తింపు పొందింది. అయితే, తాజాగా ఆమెను మహారాష్ట్రలోని ఠాణే జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుష్క మోనీ(Anushka Moni mohan Das) కొంతమంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్తో ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే వ్యభిచార కూపంలో చిక్కుకున్న మరో ఇద్దరు నటీమణులను కూడా రక్షించారు. ఈ ఘటన బెంగాలీ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆమెపై గతంలోనూ కొన్ని ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.మొదట కస్టమర్స్ రూపంలో అనుష్క మోనీని పోలీసులే సంప్రదించారు. ఒక మాల్లో వారి నుంచి ఆమె డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 143(3) కింద, మానవ అక్రమ రవాణాకు సంబంధించి, అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది. రక్షించబడిన మహిళలను షెల్టర్ హోమ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార మూఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు ACP బల్లాల్ తెలిపారు. -
‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: లిటిల్ హార్ట్స్నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులురచన, దర్శకత్వం : సాయి మార్తండ్నిర్మాత: ఆదిత్య హాసన్సంగీతం: సింజిత్ యెర్రమల్లిసినిమాటోగ్రఫీ : సూర్య బాలాజీవిడుదల తేది: సెప్టెంబర్ 5, 2025‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ఫేమ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్తో ప్రేక్షకుల్లో మంచి బజ్ని క్రియేట్ చేసుకుంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమాపై ఓ మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఈ సినిమా కథ 2009-2020 మధ్య కాలంలో సాగుతుంది. నల్లి అఖిల్(మౌళి తనూజ్) చదువులో చాలా వీక్. అతన్ని ఇంజనీర్ చేయాలానేది తండ్రి గోపాలరావు(రాజీవ్ కనకాల)ఆశయం. కానీ అఖిల్ ఎంసెట్లో క్వాలిఫై కూడా కాడు. తనవల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్టర్మ్ కోచింగ్కి పంపిస్తాడు తండ్రి. ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న కాత్యాయని(శివానీ నాగారం) పరిస్థితి కూడా అంతే. ఆమెకు మెడిసిన్ చదవడం ఇష్టం ఉండదు. కానీ పెరెంట్స్ బలవంతంగా లాంగ్టర్మ్ కోచింగ్కి పంపిస్తారు. అక్కడే అఖిల్కి కాత్యాయని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. అఖిల్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగానే.. కాత్యాయని ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడిస్తుంది. అదేంటి? అఖిల్, కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వీరిద్దరు ఎలా ఎదుర్కొని..ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్గా, రొటీన్గా ఉన్నా.. తెరపై చూస్తుంటే బోర్ కొట్టదు. ఊహించే మలుపు ఉన్నా.. ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా.. ఎంటర్టైన్ అవుతుంటాం. లిటిల్ హార్ట్స్ ఆ కోవలోకి చెందిన చిత్రమే. కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్ రొటీజ్ టీనేజ్ లవ్స్టోరీ. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. పంచ్ డైలాగులు సినిమాను నిలబెట్టాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా 2009-2020 మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. జియో సిమ్ రాకముందు అంటూ హీరోహీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లో హీరోహీరోయిన్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాత్యాయని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్లో కామెడీ డబుల్ అవుతుంది. హీరోయిన్కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఆమె బర్త్డే కోసం అఖిల్ చేసే సర్ప్రైజ్.. అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోహీరోయిన్లు కలిసేందుకు చిన్న పిల్లలను వాడుకోవడం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న యూత్ఫుల్ కామెడీ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి. బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ‘గోల్స్ ఎప్పుడు అందంగా ఉండాలి’ అంటూ హీరోతో ఒక డైలాగ్ చెప్పించడమే కాకుండా.. క్లైమాక్స్లో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. యూత్ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. అఖిల్ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. కాత్యాయని పాత్రకి శివానీ నాగారం న్యాయం చేసింది. మౌళికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో స్నేహిడు మధుగా జయకృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది. మరో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. -
శిల్పా శెట్టి దంపతులపై లుకౌట్ నోటీసులు
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఒక కంపెనీకి సంబంధించి పెట్టుబడుటు పెట్టేందుకు తన నుంచి రూ. 60 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్థిక నేరాల విభాగానికి (EOW) చెందిన అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం శిల్పాశెట్టి దంపతుల ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మూతబడిన ఆ కంపెనీ ఆడిటర్ను కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు దేశం విడిచిపోకుండా ఉండేందుకు వారికి లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారని తెలుస్తోంది.2015- 2023 సమయంలో షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ డీల్ టీవీ కంపెనీకి డైరెక్టర్స్గా శిల్పాశెట్టి దంపతులు ఉన్నారు. అయితే, వ్యాపార విస్తరణలో భాగంగా పెట్టుబడులు పెట్టాలని దీపక్ కొఠారిని కోరడంతో అతను రూ. 60 కోట్ల మేరకు నిధులు వారికి అందించాడు. ఇదే విషయాన్ని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీలో ఎక్కువ వాట ఉన్న శిల్పాశెట్టి 2016లో హామీ కూడా ఇచ్చారన్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం.. ఆ తర్వాత ఆ కంపెనీ దివాలా కూడా తీయడం జరిగిందని చెప్పారు. -
ఓటీటీలో హారర్, కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్’.. ఆగష్టు 8న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఎస్జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు.‘బకాసుర రెస్టారెంట్’ హారర్, థ్రిల్లర్, మైథాలజీ కాన్సెప్ట్తో స్టోరీ ఉంటుంది. అయితే, ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ, ఓటీటీ ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 12న 'సన్నెక్స్ట్' (Sun NXT)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. మన స్నేహితుడు అనివార్య కారణాల వల్ల మనకు దూరమైతే ఎంతటి బాధ ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఆపై కామెడీ ఎటూ ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులకు మంచి కాలక్షేపాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తినేస్తుంది.ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఒకే అపార్ట్మెంట్లో ఇద్దరు భార్యలతో నటుడు.. పోలీసులకు ఫిర్యాదు
తమిళ నటుడు శరవణన్పై మొదటి భార్య ఫిర్యాదు చేసింది. జైలర్, రాయన్, మేడమ్ సార్ వంటి చిత్రాలతో ఆయన తెలుగు వారికి కూడా పరిచయమే.. 1990లో వైదేహి వందాచ్చు అనే తమిళ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత, పొండాట్టి రాజ్యం, అభిరామి, మామియార్ విడు మొదలగు పలు చిత్రాల్లో నటించిన నటుడు శరవణన్. ఆ తరువాత క్యారెక్టర్గా పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. కాగా 2003లో సూర్యశ్రీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే, 2015 నుంచి సహజీవనం సాగిస్తున్న శ్రీదేవి అనే యువతిని 2018లో శరవణన్ రెండో వివాహం చేసుకున్నారు. కాగా వీరు స్థానిక మాంగాడు సమీపంలోని మౌలివాక్కంలో ఉన్న ఒకే భవనం మొదటి అంతస్తులో శరవణన్ మొదటి భార్య కింద భాగంలో రెండో భార్యతో శరవణన్ కలిసి నివసిస్తున్నారు. కాగా ఆవడి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు శాఖ ప్రజాసమస్యల కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న నటుడు శరవణన్ మొదటి భార్య తన భర్తపై హత్యా బెదిరింపు ఫిర్యాదు చేశారు.అందులో తాను శరవణన్ 1996 నుంచి 2003 వరకు సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు రెండో భార్య శ్రీదేవి చెప్పారు. అప్పట్లో తాను కస్టమ్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేదానినని దీంతో పలుమార్లు తాను ఆర్థికంగా శరవణన్ను ఆదుకున్నానని చెప్పారు. అలాంటిది ఆయన తనకు ఇప్పుడు అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. రెండో పెళ్లి చేసుకున్న శరవణన్ ఆమెతో కలిసి తనకు హత్యా బెదిరింపులు చేస్తూ హింసిస్తున్నారని ఆరోపించారు. ఇదేవిధంగా తనకు జీవన భరణిగా రూ. 40 లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Wow Tamizhaa (@wowtamofficial)