Tollywood
-
ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్ను ఆల్రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్తో తిరిగొచ్చాడు.తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.🎥 జపాన్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైంది.🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.🎥 నంబర్ 9 అంటే తారక్కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టం.🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్లో రెండు సార్లు నిలిచాడు.🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు 🎥తారక్కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు. -
కలెక్టర్ కావాలనుకున్న పేద విద్యార్థినికి కమల్ సాయం
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తను చేసిన సాయాన్ని బయటిప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద చెప్పిన తర్వాత వైరల్ అవుతుంటుంది. ఈయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వందల మందికి విద్యాదానం చేస్తున్నారు. తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని ప్లస్ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించింది. ఈమె తండ్రి మత్స్యకారుడు. తల్లి పీతలు ఎగుమతి కంపెనీలో రోజువారీ కూలీ. కాగా తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధిని శోభన. ఈమెకు ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలన్నది ఆశ. అయితే కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసి ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కమలహాసన్ విద్యార్ధిని శోభనను తన కార్యాలయానికి పిలిపించి కమల్ సాంస్కృతి కేంద్రం ద్వారా ఆమె ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు సాయం చేశారు. తను సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తన సంరక్షణలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆపై సివిల్ సర్వీస్కు కావాల్సిన వనరులు ఏర్పాటు చేస్తానని శోభనకు ఆయన మాట ఇచ్చారు. దీంతో శోభన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కమల్ సార్ చేసిన సాయాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ వృధా కానివ్వనని శోభన చెప్పింది. తాను సివిల్ సర్వీస్ సాధించి తప్పకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతానని మాటిచ్చింది. -
ఇక నాకు ఇది కొత్త జన్మ: మంచు మనోజ్
‘‘నాకు నా హార్డ్వర్క్పై పూర్తి నమ్మకం ఉంది. ఈ బర్త్ డే (మే 20) నుంచి నాకు ఇది కొత్త జన్మ. నా బర్త్ డే స్టార్ట్ కాక ముందే నేను ఏదైతే స్టేజ్ (సినిమా వేదిక) మిస్సవుతున్నానో ఆ స్టేజ్కు తీసుకువచ్చాడు దేవుడు. అంతకంటే పెద్ద బర్త్ డే గిఫ్ట్ ఏదీ ఉండదు’’ అని మంచు మనోజ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. జయంతిలాల్ గడా సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. అలాగే నేడు (మంగళవారం) మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో మనోజ్ పంచుకున్న విశేషాలు.⇒ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తమ్ముడు శ్రీనివాస్ (బెల్లంకొండ సాయి) నన్ను కలవడం, ‘గరుడన్ ’ సినిమా తెలుగు రీమేక్ ‘భైరవం’ గురించి దర్శకుడు విజయ్తో మాట్లాడమని చెప్పడం, కథ నచ్చి, నేనీ సినిమాకు ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయాయి. ∙ఈ చిత్రంలో నేను గజపతి వర్మ అనే క్యారెక్టర్ చేశాను. ‘భైరవం’ని డైరెక్టర్ విజయ్ బాగా తీశాడు. యాక్టర్స్గా నాకు, శ్రీనివాస్, నారా రోహిత్గారికి కొంత స్క్రీన్ గ్యాప్ వచ్చింది. అయినా మాతో రాధామోహన్ గారు మంచి మూవీ నిర్మించారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది.⇒ నా జీవితంలో నాకు మా నాన్నే హీరో (ప్రముఖ నటుడు–నిర్మాత మోహన్ బాబు). నాన్నగారు కష్టపడి, పోరాడి ఇంత గొప్ప స్థాయికి వచ్చింది మనందరం చూశాం. ఆయన్ను చూస్తూ పెరిగాను. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నమ్మినవాళ్లను బాగా చూసుకోవడం, వాళ్లతోనే ఉండటం, పదిమందికి హెల్ప్ చేయడం, స్కూల్ని బిల్డ్ చేయడం... ఇలా నాన్నగారు చాలా చేశారు. ఇక దాన్నుంచి (ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి కావొచ్చు) నేను బయటకు రాలేకపోతున్నాను. విష్ణు అన్న నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే ఏ సిట్యువేషన్ లోనైనా మాట్లాడి, ఆ పరిస్థితులను ఎలా సెట్ చేయవచ్చో విష్ణు అన్న దగ్గర్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను.⇒ నేను తిరుపతిలో చదువుకున్నాను. తను (భార్య మౌనిక) ఆళ్లగడ్డలో చదువుకున్నారు. ఈ సిటీ జీవితమే కాకుండా మాకు పల్లె జీవితం కూడా ఉంది. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆదరణ మాపై ఉన్నాయి. మా పిల్లలకు ఏదైనా ఇవ్వగలను అంటే అది ఇదే.⇒ నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు. కానీ నా ఇబ్బందుల్లో వారిని ఇన్ వాల్వ్ చేయాలనుకోలేదు. నా భార్య మౌనిక సపోర్ట్ సరిపోయింది. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు గమ్మునుండిపోతే, తప్పు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతాం. భవిష్యత్లో మా పిల్లలు ‘నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావ్’ అంటే, ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదనిపించింది. తప్పు చేయనప్పుడు ఎక్కడైనా మాట్లాడగలను. -
రబ్బరు గాజులు సాంగ్.. థియేటర్లోనే ఇరగదీసిన ఫ్యాన్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యమదొంగ. 2007లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. అప్పట్లో థియేటర్లలో ఓ రేంజ్లో వసూళ్లు రాబట్టింది. అయితే ఈ నెల 20న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను ఈరోజు థియేటర్లలో ప్రదర్శించారు.అయితే ఈ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత యమదొంగ బిగ్ స్క్రీన్పై సందడి చేయడంతో అభిమానులు ఆనందంలో చిందులు వేశారు. రబ్బరు గాజులు పాట రాగానే పూనకంతో ఊగిపోయారు. ఈ సినిమా చూస్తూ థియేటర్లో రబ్బర్ గాజులు సాంగ్కు స్టెప్పులు వేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.(ఇది చదవండి: ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్.. థియేటర్స్లో ‘యమదొంగ’)కాగా.. ఈ చిత్రంలో మోహన్ బాబు యమధర్మరాజు పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో ప్రియమణి, మమత మోహన్దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇద్దరి ఇరగదీశారు మాటల్లేవ్ 💟💟❤️🔥❤️🔥ఇదేం క్రేజీ రా బాబు మామూలుగా లేదుగా సెలబ్రేషన్ 😍😍🥵🥵👌👌#Yamadonga4K @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/ZN1j0zj5kF— Shivam🐉🔱🚩 (@tarak9999SM) May 19, 2025 -
యంగ్ టైగర్ బర్త్ డే.. వార్-2 అప్డేట్ వచ్చేసింది!
బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో వార్ -2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్-2 గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. జూనియర్కు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ షేర్ చేశారు. ఈ తాజా ప్రకటనతో వార్-2 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అత్యధిక ధరకు తెలుగు రైట్స్..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, దేవర... ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ డీల్ను చేజిక్కించుకున్నారు. విడుదలకి ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలొస్తున్నాయి. #HappyBirthdayNTR Can’t wait for this BANGER 💥💥💥💥💥💥 pic.twitter.com/2hg9aAZgNJ— thaman S (@MusicThaman) May 19, 2025 -
ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్తో అదరగొట్టిన హీరోయిన్!
హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. కోలీవుడ్ హీరోయిన్ ఆదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందు వస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భైరవం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. #AditiShankar Live Dance Performance for #OVennela Song at #Bhairavam Event#BellamkondaSaiSreenivas #ManchuManoj #NaraRohith pic.twitter.com/ehgv08ARi5— The Cult Cinema (@cultcinemafeed) May 18, 2025 View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
'ఛత్రపతి' రీమేక్ అందుకే ఫెయిలైంది: బెల్లంకొండ శ్రీనివాస్
తెలుగులో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. మధ్యలో హిందీలో సినిమా చేశాడు. చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ఇక్కడ 'భైరవం' చిత్రం చేశాడు. మే 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో పాల్గొన్న ఇతడు.. ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)'హిందీలో సినిమాలు చేసిన తెలుగు హీరోలు పెద్దగా లేరు. ప్రస్తుతం రానా, రామ్ చరణ్ మాత్రమే చేశారు. చరణ్ చేసింది 'జంజీర్' రీమేక్. హిందీ మూవీని మళ్లీ హిందీలో చేయడం వల్ల ప్రేక్షకులు అలా తీసుకున్నారేమో తెలియదు. నేను చేస్తున్నది సౌత్ మూవీ కదా అనుకున్నాను. రాజమౌళి హిట్ సినిమా, ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతారని అనుకున్నాం''పైగా సవతి తల్లి, బిడ్డల సెంటిమెంట్ లాంటివి హిందీలో పెద్దగా ఉండవని నిర్మాత భరోసా ఇచ్చారు. దీంతో వర్కౌట్ అవుతుందేమోనని అనుకున్నాం. కానీ ఛత్రపతి మూవీని రీమేక్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే సౌత్ సినిమాల్ని హిందీ ప్రేక్షకులు బాగా చూసేశారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుందా? అనే టెన్షన్ వల్ల పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి) -
రకుల్ ప్రీత్ సొగసులు.. హెబ్బా ట్రెడీషనల్ వేర్
పక్కా ట్రెడిషనల్ గా తయారైన హెబ్బా పటేల్స్విమ్ సూట్ లో కనిపించిన నటి హంస నందినిఒంటికి అతుక్కుపోయిన డ్రస్సులో జాక్వెలిన్అందాలన్నీ చూపించేస్తున్న కేథరిన్ ట్రెసాపట్టుచీరలో మెరిసిపోతున్న పూజా హెగ్డేతెలుగమ్మాయి రమ్య అదిరిపోయే గ్లామర్గ్లామర్ గా కనిపించేందుకు కష్టపడుతున్న అన్షు View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shaneem (@shaneemz) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
నమ్రతా శిరోద్కర్ సిస్టర్కు కరోనా.. సోషల్ మీడియాలో పోస్ట్!
హిందీ బిగ్బాస్ షోలో ఫ్యాన్స్ను మెప్పించిన బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్. హిందీ బిగ్బాస్ 18వ సీజన్లో టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె వంద రోజుల తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. ఈ షో ద్వారా శిల్పా మరింత ఫేమస్ అయ్యారు. అయితే శిల్పా శిరోద్కర్ తాజాగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తనకు కరోనా పాజిటివ్గా వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు స్టే సేఫ్.. టేక్ కేర్ మేడమ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్పై ఆమె సిస్టర్, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ సైతం స్పందించింది. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
నాకు ఆ వ్యాధి.. అందుకే ఇలా కనిపిస్తున్నా: పూనమ్ కౌర్
అప్పట్లో తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన పూనమ్ కౌర్.. ప్రస్తుతం రాజకీయాలు అంటూ తిరుగుతోంది. ఇది కాకుండా ఎప్పుడో ఏదో ట్వీట్ వేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, అందువల్లే ఇలా మారిపోయానని చెప్పుకొచ్చింది.తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి పూనమ్ కౌర్.. ఆయనకు ఓ బహుమతిని అందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసి.. తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి కూడా బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)'గత రెండు రోజులుగా ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నాను. దీని వల్ల ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా వచ్చింది. అందుకే శరీరం ఇలా ఉబ్బిపోయింది. యాంటీ బయోటిక్స్ కూడా వాడుతున్నా కదా. అందుకే ఇలా' అని పూనమ్ కౌర్ ట్విటర్ లో రాసుకొచ్చింది.పూనమ్ కౌర్ ఎప్పుడూ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ పై సెటైర్స్ వేస్తూ ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనూ త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసింది. కానీ ఇదెక్కడ వరకు వచ్చిందో తెలీదు. ప్రస్తుతానికైతే పూనమ్.. నటిగా ఎలాంటి సినిమాలు చేయట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం) -
కట్టు బట్టలతో రోడ్డున పడేశారు: మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు హాజరైన మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరును తలచుకుని ఎమోషనలయ్యారు.మంచు మనోజ్ మాట్లాడుతూ..' కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల దుస్తులు, చిన్నప్పటి నుంచి దాచుకున్న వాటితో సహా ఏది వదలకుండా రోడ్డున పడేశారు. మేము బయటికి కూడా వెళ్లడానికి కార్లు కూడా లేకుండా చేశారు. కానీ నాకు మాత్రం శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు అన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్నా నా కోసం. ప్రతి ఒక్కరూ మేమున్నాం అంటూ నాకోసం నిలబడ్డారు. కానీ నాకొక్కటే బాధ. ఇంత చేసినా.. ఇంత జరిగినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నాపై ఎన్ని కేసులు వేసినా.. నాకు ఎవరి మీద కోపం రావట్లేదు.. బాధగా మాత్రమే ఉంది. అది నా బలహీనతో.. వాళ్ల బలమో నాకు అర్థం కావట్లేదు.' అని అన్నారు.తన తండ్రి గురించి మాట్లాడుతూ..'ఎన్ని జన్మలైనా.. ఈ జన్మకు మాత్రం నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే.. అది మార్చడం ఎవరి వల్ల కాదు..నా చిన్నప్పటి నుంచి ఆయన నేర్పించిన క్రమశిక్షణే. నీతి వైపు నిలబడాలని నాకు నేర్పించారు. నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కలా అందరూ చేరి తప్పు అంటున్నారు. ఏదేమైనా.. ఎన్ని జన్మలెత్తినా.. మీరే నా దేవుడు.. నా తండ్రి.. నా తల్లి.. మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్గా మాట్లాడారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో మంచు మనోజ్కు తన ఫ్యామిలీతో గొడవలు తలెత్తిన సంగతి తెలిసిందే. -
'భగవంత్ కేసరి' రీమేక్.. ఆ ఒక్క సీన్ కోసం పట్టుబట్టిన విజయ్
‘భగవంత్ కేసరి’ని దళపతి విజయ్ వదిలిపెట్టలేదు. అంతలా ఈ చిత్రానికి ఆయన కనెక్ట్ అయ్యారు. బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భగవంత్ కేసరి’. గతేడాదిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ను జననాయగన్ పేరుతో తమిళ్లో విజయ్ దళపతి రీమేక్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇదే చివరి సినిమా అని కూడా తెలుస్తోంది. అయితే, ఈ రీమేక్ అంశం గురించి తాజాగా మరో కొత్త విషయం బయటకొచ్చింది.విజయ్ కొత్త సినిమా 'జన నాయగన్' కోసం ‘భగవంత్ కేసరి’లోని ఒక ముఖ్యమైన సన్నివేశానికి సంబంధించి హక్కులను పొందారట. ఈ సినిమాలో 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' గురించి అందరికీ అవగాహన ఉండాలని బాలకృష్ణతో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇప్పుడు అదే సీన్ను జన నాయగన్లో విజయ్ రీక్రియేట్ చేశాడని సమాచారం. ఈ సీన్ మాత్రమే రీమేక్ అని, మిగతాది అంతా భగవంత్ కేసరితో జన నాయగన్ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని విజయ్ అభిమానులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది. అందుకే ఈ సినిమాపై విజయ్ ఆసక్తి చూపాడని తెలుస్తోంది. 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' సీన్ కోసం జగ నాయగన్ టీమ్ హక్కులు కూడా పొందిందని సమాచారం. అందుకోసం సుమారు రూ. 4 కోట్లు చెల్లించినట్లు టాక్. ఈ సీన్ మహిళలకు బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ భావించాడట. పొలిటికల్గా కూడా తనకు కొంతమేరకు ఉపయోగపడొచ్చని తెలుస్తోంది.#JanaNayagan : Just to use a single episode, the makers have acquired the remake rights of #BhagavanthKesari film. Overall, there is no other connection between Jana Nayagan and Bhagavanth Kesari#JanaNayagan pic.twitter.com/sthnxzv4Q1— 𓃰TVK✘BALA𓃰 (@TvkSouthWing) May 19, 2025 -
నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం
తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇతడి తల్లి కమలహాసిని.. ఆదివారం రాత్రి చెన్నైలో మరణించారు. ఈ క్రమంలో తోటి నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చెన్నైలోని భరత్ ఇంటికి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు వచ్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) దర్శకుడు శ్రీనువైట్ల తీసిన వెంకీ, రెడీ, ఢీ, కింగ్ సినిమాలతో పాటు బిందాస్, మిస్టర్ ఫెర్ఫెక్ట్ తదితర 80 తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. పెద్దవాడు అయిన తర్వాత అల్లు శిరీష్ 'ఏబీసీడీ' మూవీతో నటుడిగా మారాడు. చివరగా గతేడాది రిలీజైన గోపీచంద్ విశ్వం సినిమాలో సహాయ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు.నటుడిగా తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలు చేసిన మాస్టర్ భరత్.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోవడంతో చాలా బాధపడుతున్నాడు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో మాస్టర్ భరత్ అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగారు.(ఇదీ చదవండి: అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ) -
'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం
కోలీవుడ్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా పెట్టాలెక్కింది. సూర్యకు రెట్రో, వెంకీ అట్లూరికి లక్కీ భాస్కర్ చిత్రాలు మంచి విజయాన్ని ఇచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ను తాజాగా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’), దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ సినిమాల కోసం ఇతర భాషలకు చెందిన హీరోలను ఎంపిక చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు మళ్లీ తమిళ హీరో సూర్యతో మరో సినిమా ప్లాన్ చేయడం విశేషం. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
స్టార్ డైరెక్టర్ సినిమాలో శోభితకు ఛాన్స్
నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు నటి శోభిత ధూళిపాళ ఓకే చెబుతుంది. పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్ మోడల్గా గుర్తింపు పొందారు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత 2016లో రామన్ రాఘవన్ 2.0 అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో మేజర్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. అలా హిందీ, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత 2022లో మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా హాలీవుడ్లో మంకీ మాన్ చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో హీరోయిన్గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు అట్టకత్తి, కబాలి, సార్పట్టా పరంపరై వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పా.రంజిత్ ఇటీవల విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రం చేశారు. తాజాగా వట్టువన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోల్డెన్ రేష్మియా ఫిలిమ్స్తో కలిసి నీలం స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్ కథానాయకుడుగా, ఆర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్స్ ఇతివృత్తంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం కారైక్కుడి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ నటిస్తున్న పాత్ర ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఏపీలో నంది అవార్డులు ప్రకటిస్తాం: మంత్రి
ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులను ప్రకటిస్తామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఏలూరులో జరిగిన భైరవం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మాదిరిగానే విశాఖను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అక్కడ స్టూడియోల నిర్మాణంతో పాటు డబ్బింగ్, రీరికార్డింగ్ వంటి థియేటర్లు నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పాలసీ తెచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. కొద్దిరోజుల్లో సినిమా పరిశ్రమకు చెందిన పలు నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో ఏపీ ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి, నంది అవార్డుల గురించి చర్చిస్తామని తెలిపారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చేందుకు గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. వారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను చేర్చారు. కొద్దిరోజుల క్రితం పలు సినిమాల నుంచి నామినేషన్స్ కూడా తీసుకున్నారు. -
'రెట్రో' కలెక్షన్స్ విడుదల.. సూర్య కెరీర్లో ఇదే టాప్
రెట్రో సినిమాతో సూర్య భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ను మేకర్స్ విడుదల చేశారు. సూర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్స్టర్గా సూర్య ఇందులో నటించాడు.రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157 కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. రెట్రో సినిమాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ భారీగానే దెబ్బ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టాక్ బాగుండటంతో కోలీవుడ్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. లేదంటే రెట్రో కలెక్షన్స్ సులువుగా రూ. 300 కోట్లకు దగ్గర్లో ఉండేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.Dear Audience and #AnbaanaFans, we're humbled by your immense love and support for #TheOne ‼️ Grateful for the glory, it's all because of you ❤#RETRO@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/wScjYwaqu4— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 18, 2025 -
నవీన్ పోలిశెట్టికి లక్కీచాన్స్ వరించనుందా..?
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి జాక్పాట్ కొట్టబోతున్నారా? ఈ యువ నటుడికి డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వరించనుందా..? ఈ క్రేజీ చిత్రంలో ఆ స్టార్ కథానాయకి నటించి ఉన్నారా..? దీనికి సంబంధించిన వార్తనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా బుక్లో దర్శకుడు మణిరత్నం పేరు ఎప్పటికీ ప్రముఖంగానే ఉంటుంది. రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో చిత్రాలు చేసి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కమలహాసన్, శింబు, త్రిష, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నలకు పలు రకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తున్నాయి. తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవీన్ పోలిశెట్టి ఇంతకుముందు తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సక్సెస్ చిత్రాల్లో నటించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సాయిపల్లవి కథానాయకిగా నటింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక పర్యటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. -
సరదాలే సరిగమలై...
‘‘వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన... ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన.. సరదాలే సరిగమలై పలికిన శుభవేళ’’ అంటూ సాగేపాట ‘షష్టిపూర్తి’(Shashtipoorthi) సినిమాలోనిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్లో రూపేష్, ఆకాంక్షా సింగ్ ప్రధానపాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సినిమాలోని ‘వేయి వేణువుల నాదం మోగే...’పాటను దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈపాటను కార్తీక్, విభావరి ఆప్టే జోషి ఆలపించారు. స్వర్ణ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఈపాట గురించి పవన్ ప్రభ మాట్లాడుతూ– ‘‘ఈపాటను చైతన్య ప్రసాద్ అద్భుతంగా రాశారు.ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా ఈపాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజాగారు స్వరపరిచిన ఈ సినిమాపాటల రికార్డింగ్ని ప్రత్యక్షంగా వీక్షించి, పులకించిపోయామను. ఈపాట కోసం తోట తరణిగారు ఓ మండువా లోగిలిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. రాజేంద్రప్రసాద్, అర్చనగార్లు, రూపేష్–ఆకాంక్ష ఈ ΄పాటలో జీవించారు. చాలా కాలం గుర్తుండిపోయేపాట ఇది’’ అని తెలిపారు. -
మైథలాజికల్ మూవీగా 'వసుదేవ సుతం'.. ఆసక్తిగా గ్లింప్స్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తోన్న మైథలాజికల్ చిత్రం వసుదేవ సుతం. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్బో సినిమాస్ బ్యానర్పై ధనలక్ష్మి బాదర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్ను రిలీజ్ చేశారు.విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్ చూస్తే ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంబికావాణి, జాన్ విజయ్, మిమ్గోపి, సురేష్చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ హరితేజ..!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్ హరితేజ. గతేడాది బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టి అభిమానులను అలరించింది. దాదాపు పదివారాల పాటు హౌస్లో ఉండి ఫ్యాన్స్ను అలరించింది. సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్గా వ్యవహరించింది. గతేడాది రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా మెప్పించింది.అయితే తాజాగా తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది హరితేజ. వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లి పెళ్లి వైభోగం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది హరితేజ. అయితే తన సిస్టర్ పెళ్లి ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా మరోసారి ఫోటోలను పంచుకుంది. కాగా.. హరితేజ కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2021లో భూమి అనే కూతురు జన్మించింది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.తాజాగా తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మా నాన్న గారి నుంచి నేర్చుకుంటున్న మొదటి గొప్ప విషయం గురించి అనసూయ రాసుకొచ్చింది. సంతోషంలో, విషాదంలో, భయాందోళనలో, అనారోగ్యంలో, ప్రేమలో ఉన్నా జైహనుమాన్ అని తలుచుకోకుండా నేనేమి చేయగలను అని తండ్రి చెప్పేవారని తెలిపింది. నా తండ్రి తర్వాత తండ్రిగా భావించేది ఆ హనుమంతుడినే.. అందుకే నా పెద్ద కొడుకుకు శౌర్య అని ఆయన పేరు పెట్టుకున్నాం అని వివరించింది. ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అగ్ని దేవుడు (దూత) అని అంటారు.. అందుకే ఏ దేవుడికి ఏమైన గట్టిగా చెప్పుకోవాలన్న హోమం ద్వారానే చెప్పుకుంటాం.. ఈ విధంగా ఆ రోజు నా హనుమాన్ మా ఇంటి పేరుని.. మా ఇంటికి ఆహ్వానించాడనికి వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేసింది. అందరు ఆధ్యాత్మికంగా ఉండరు.. నాకు తెలుసు.. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించిందని అనసూయ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ముగ్గురు హీరోల 'భైరవం'.. ట్రైలర్ ఎలా ఉందంటే?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. గతేడాది డిసెంబరు నుంచి రిలీజ్ మాట వినిపిస్తుంది. మరి కారణాలేంటో తెలీదు గానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా) ముగ్గురు హీరోల సీన్స్ తో పాటు అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసేలా ట్రైలర్ కట్ చేశారు. చూస్తుంటే సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్. ట్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో కొన్నిరోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
ఎర్రని బుగ్గలతో సుప్రీత.. రెడ్ శారీలో సంయుక్త
ఎర్రని బుగ్గలతో యంగ్ బ్యూటీ సుప్రీతచుడీదార్ లో పద్ధతిగా కనిపించిన కేతిక శర్మరెడ్ శారీలో హాట్ హాట్ గా సంయుక్త స్టిల్స్40ల్లోనూ అందంతో కేక పుట్టిస్తున్న శ్రియహైదరాబాద్ లో బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లాడ్యాన్స్ తో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్చీరలో కవ్విస్తున్న కీర్తి సురేశ్.. ఐశ్వర్య రాజేశ్ కూడా View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) -
ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్.. స్టేట్ లెవల్ కి ఆడాడు. కానీ మరి మనసు ఎక్కడ మారిందో ఏమో గానీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధీర్ బాబు. 'ఏ మాయ చేశావె'లో సమంతకు అన్నగా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'ఎస్ఎమ్ఎస్' మూవీతో హీరోగా మారాడు. సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ తదితర సినిమాలతో హిట్స్ కొట్టాడు. తర్వాత నుంచి చాలా మూవీస్ చేస్తున్నాడు గానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినిని సుధీర్ బాబు.. సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో పెద్దోడు తండ్రి బాటలో హీరో అయ్యే పనిలో బిజీ ఉన్నాడు. (ఇదీ చదవండి: నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?) మరోవైపు సుధీర్ బాబు నటుడి కాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. తన స్నేహితుడు బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆలస్యమవుతూ వస్తోంది.సరే ఈ ఫొటో విషయానికొస్తే.. తన తొలి ఫొటోషూట్ లో తీసుకున్న పిక్ ఇది అని సుధీర్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన చాలామంది ఇప్పటికి అప్పటికీ ఎంత మార్పో అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయం..!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, సురేశ్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చేనెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. -
నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2' కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.2017లో 'మెంటల్ మదిలో' అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'బ్రోచేవారెవరురా' తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.(ఇదీ చదవండి: కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి) -
దూసుకెళ్తున్న నవీన్ చంద్ర.. అప్పుడే మరో కొత్త సినిమా!
హీరో నవీన్ చంద్ర వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య లెవన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్ హీరో..తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘కరాలి’అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ మీద మందలపు శివకృష్ణ నిర్మిస్తున్నారు. రాశీసింగ్, కాజల్ చౌదరి హీరోయిన్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్కు సాహు గారపాటి స్క్రిప్ట్ను అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ... ‘కొత్త వారు కొత్త పాయింట్తో వచ్చినప్పుడు సినిమాలు నిర్మించేందుకు శివ గారి లాంటి ధైర్యం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. ‘కరాలి’ అనే టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా. కాజల్ చౌదరి నటించిన ‘అనగనగా’ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మా సినిమాకు మంచి టీం దొరికింది. ఇంత వరకు నన్ను ఆడియెన్స్, మీడియా ఎంకరేజ్ చేస్తూనే వచ్చింది. ఈ మూవీని ఆడియెన్స్ అంతా ఎంజాయ్ చేసేలా రూపొందిస్తున్నామ’ని అన్నారు.‘నేను చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో నిర్మించేందుకు వచ్చిన శివ గారికి థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మేం చాలా నమ్మకంగా ఉన్నాం’ అని చిత్ర దర్శకుడు రాకేష్ పొట్టా అన్నారు.నాకు స్క్రిప్ట్ చాలా నాకు నచ్చింది. నవీన్ చంద్ర గారి సినిమాలు, ఆయన ఎంచుకునే కథలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఈ మూవీతో మంచి కథతో మీ అందరి ముందుకు రాబోతోన్నాం’అని హీరోయిన్ కాజల్ చౌదరి అన్నారు. -
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
గతేడాది బిగ్బాస్ సీజన్లో అభిమానులను అలరించిన టాలీవుడ్ నటి రోహిణి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్లో దాదాపు 9 వారాల పాటు హౌస్లో ఉండి ఫ్యాన్స్ను అలరించింది. మొదటిసారి కంటే రెండోసారి బిగ్బాస్ ఛాన్స్ వల్ల రోహిణికి మరింత ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ షోతో రోహిణి దాదాపు రూ.18 లక్షల వరకు పారితోషికం అందుకుంది. రోహిణి టాలీవుడ్లో పలు సినిమాల్లో తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అయితే తాజాగా రోహిణి తన సొంతింటి కలను నేరవేర్చుకుంది. హైదరాబాద్లో శివారు ప్రాంతంలో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేస్తూ వెల్లడించింది. తాను కొనుగోలు చేసిన విల్లా అత్యాధునిక వసతులు ఉన్నాయని వెల్లడించింది. ఈ విల్లా ధర రూ.1.7 కోట్లు అని రోహిణి తెలిపింది. మై న్యూ ఛాప్టర్ స్టార్ట్స్ నౌ అంటూ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ రోహిణికి అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ హైదరాబాద్లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద సందడి చేశారు. హాలీవుడ్ మూవీని థియేటర్లో వీక్షించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూసి బయటకు వచ్చిన ఆర్జీవీని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సినిమా ఎలా ఉందని అడగడంతో సూపర్గా ఉందంటూ రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. టామ్ క్రూయిజ్ అద్భుతంగా చేశాడని కొనియాడారు. ఇప్పటి వరకు రిలీజైన వాటిలో ఇది చాలా బెస్ట్ అని అన్నారు. ఈ సినిమాను మించిన కథ రాదేమో అని అనుకుంటున్నట్లు ఆర్జీవీ మాట్లాడారు.కానీ ఈ సినిమా చూశాక ఆయన చేసిన ఓ కామెంట్ తెగ వైరలవుతోంది. మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి- మహేశ్ కాంబోలో వస్తోన్న మూవీలో స్టంట్స్ ఇలాగే ఉంటున్నాయని అంటున్నారని ఆర్జీవీ ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలీదన్నారు. కాగా.. హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17న ఇండియాాలో రిలీజైంది. ఈ సినిమా చూసిన రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. #MissionImpossibleTheFinalReckoning#MissionImpossibleMANAM KUDA FILM MAKERS ANI CHEPPU KOVADANIKI SIGGU ESTADI - @RGVzoomin 💥💥💥💥💥I don't think anyone can say like what RGV has said . A BRUTAL HONEST OPINION pic.twitter.com/OkrXxyEvva— EXISTENTIAL NIHILIST 👻 (@Forced_Existenc) May 17, 2025 -
తెలుగులో విజయ్ సేతుపతి ‘ఏస్’
విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఏస్’. అరుముగ కుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై అరుముగ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్పై బి. శివప్రసాద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ‘‘ఏస్’ కోసం ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడినా తెలుగు విడుదల హక్కులను మేము దక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు బి. శివ ప్రసాద్. -
నటుడు మిథున్ చక్రవర్తికి నోటీసులు
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్లో ఉండే ఎరంగేల్ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది. అయితే, తాను ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేయలేదని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బీఎంసీకి అందిస్తానని మిథున్ చక్రవర్తి తెలిపారు.గత వారం రోజులుగా అదే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలను, బంగ్లాలను బీఎంసీ తొలగిస్తుంది. ఇప్పటికే దాదాపు 130 అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మే 31లోపు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. -
ఆస్పత్రి పాలైన నటి సురేఖావాణి కూతురు.. పోస్ట్ వైరల్
సహాయ పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది సురేఖావాణి. ఈమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా వల్ల మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సుప్రీత ప్రస్తుతం తెలుగులో రెండు మూడు చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే తను ఆస్పత్రి పాలైన విషయాన్ని ఇన్ స్టాలో వెల్లడించింది.(ఇదీ చదవండి: హీరో తప్పుకొన్నాడు.. హిందీ 'బేబి'కి బ్రేకులు?) 'దిష్టి నిజమే. ఈ వారం జీవితంలో బలంగా ఎలా ఉండాలో ఆలోచించాను. నేను శివయ్యని నమ్ముతా. కానీ ఆయనకు నాపై కోపం వచ్చినట్లు ఉంది. అయినా శివయ్య, అమ్మ, ప్రసన్న, రమణ.. వీళ్లు లేకుండా నేను లేను. జీవితం ఎప్పుడూ నన్ను పరీక్షిస్తోంది. దిష్టి నా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. శారీరర, మానసిక ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యమే' అని సుప్రీత రాసుకొచ్చింది. సుప్రీత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోల బట్టి చూస్తుంటే సెలైన్ ఎక్కించుకున్నట్లు కనపిస్తుంది. ఎప్పటికప్పుడు టూర్స్ కి వెళ్లే సుప్రీత.. ఇలా అనారోగ్యానికి గురవడంపై ఆమె ఫాలోవర్స్.. త్వరగా కోలుకోవాలని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. అటు సినిమాలతో పాటు అడపాదడపా పలు షోల్లో సుప్రీత కనిపిస్తోంది.(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
బాలయ్యా, నీ హీరోయిన్ మద్యం ప్రచారంపై ఏమందో విన్నావా?
ఆయన ఓ ప్రముఖ సినీనటుడు,అంతేకాదు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు.. అంతవరకు అయినా పర్లేదేమో కానీ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కార గ్రహీత కూడా. అలాంటి నేపథ్యం వున్న బాలకృష్ణ(Nandamuri Balakrishna ) మాన్షన్ హౌస్ మద్యం ద్వారా పేరొందిన బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో నటించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న బాలకృష్ణ, అలాంటి గౌరవనీయమైన పురస్కారం పొందిన తర్వాత మద్యం ప్రకటనలో పాల్గొనడం అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. “పద్మ భూషణ్ పొందిన వ్యక్తి ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం ఎలా అనుమతిస్తారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారుఇదిలా ఉండగా, బాలకృష్ణ నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఇలాంటి ప్రకటనల్లో నటించడం బాధ్యత లేనితనమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ మద్యం యాడ్ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చలకు గతం లో ని కొన్ని విషయాల ప్రస్తావనకు దారి తీసిందిబాలకృష్ణ ఆ మద్యం బ్రాండ్ పై తన అభిమానాన్ని పదే పదే చాటు కోవడం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి, అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడo బాలకృష్ణ బరితెగింపు కి నిదర్శనం గా అనిపిస్తోంది. గతంలో ఈ తరహా మద్యం బ్రాండ్ల ప్రచారంలో సెలబ్రిటీలు పాల్గొనడం పై ఉవ్వెత్తున విమర్శలు రావడం దాంతో అనేకమంది స్టార్స్ ఇక తాము అలాంటి ప్రకటనల్లో కనిపించం అని నిర్ణయం తీసుకోవడాన్నీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.ఓ కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రచారం చేసినందుకే చిరంజీవి పై విమర్శలు రావడం దాంతో అయన వెనక్కి తగ్గడం కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒకనాటి బాలకృష్ణ హీరోయిన్, బంగారు బుల్లోడు సినిమా లో అయన సరసన నటించిన రవీనాటండన్(Raveena Tandon) తారల మద్యం ప్రచారం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. సెలబ్రిటీలుగా తమపై ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుందనీ, ఆల్కహాల్ ఉత్పత్తులకు తాము ప్రచారం చేయడం అంటే యువత ను తప్పుదారి పట్టించడమే అవుతుంది అని ఆమె వ్యాఖ్యనించారు.. మరి బాలయ్య కి ఇలాంటి మంచి మాటలు చెవికెక్కుతాయా... లేక మంచి చెడూ జాంతానై.. మా బ్లడ్డు బ్రీడు సపరేట్ హై.. అంటూ ఇలాగే కంటిన్యూ అయిపోతారా.. దీనికి ఆన్సర్ కోసం జనం మాత్రమే కాదు ఆయన్ను వరించిన పద్మ భూషణ్ కూడా ఆశగా ఎదురు చూస్తోంది. -
హీరోయిన్తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్పై విమర్శలు
కోలీవుడ్ స్టార్ హీరో హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. సోషల్మీడియాలో ట్రైలర్పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై తెలుగులో విడుదల చేస్తున్నారు.ముద్దు సీనుతో వైరల్‘థగ్ లైఫ్’ ట్రైలర్లో కమల్ హాసన్(70), అభిరామి (41) మధ్య లిప్లాక్ సీన్ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వయసు 30ఏళ్లు గ్యాప్ ఉంది. దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆపై త్రిషతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కమల్కు భార్యగా అభిరామి నటించింది. ఇద్దరి మద్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్పై మిశ్రమ స్పందన వస్తుంది.అయితే, కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. మొత్తం ట్రైలర్లో కేవలం ముద్దు సన్నివేశాలు,సన్నిహిత సన్నివేశాలను తీసుకొని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో ఇవన్నీ చాలా కామన్గానే ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు.., తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయం కాదని, వాటిని ఎలా సమర్ధిస్తారని కౌంటర్ ఇస్తున్నారు.అభిరామి ఎవరు..?కేరళకు చెందిన అభిరామి తెలుగులో 'చెప్పవే చిరుగాలి'(2004) సినిమాలో నటించింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని, మహారాజ, సరిపోదా శనివారం, భలే ఉన్నాడే, వెట్టైయన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా తర్వాత 2004లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్కు తమిళ వెర్షన్లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్లీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది. -
హీరో తప్పుకొన్నాడు.. హిందీ 'బేబి'కి బ్రేకులు?
తెలుగు సినిమా 'బేబి'.. రిలీజైన టైంలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదేం సినిమా అని చాలామంది అన్నారు కానీ యూత్ మాత్రం ఈ మూవీని హిట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని దర్శకుడు సాయి రాజేశ్ ఫిక్స్ అయ్యాడు. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు.(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త)ప్రస్తుతానికైతే ఇంకా చర్చల దశలోనే ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నట్లు నటుడు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. లెక్క ప్రకారం హీరోల్లో ఒకరిగా ఇతడిని తీసుకోవాలని సాయి రాజేశ్ అనుకున్నాడు. కానీ రీసెంట్ గా బాబిల్.. బాలీవుడ్ ని పరోక్షంగా తిడుతూ వీడియో పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్న బాబిల్ ఖాన్.. ఆ దర్శకుడితో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నానని, దురదృష్టవశాత్తూ అది సాధ్యపడటం లేదని రాసుకొచ్చాడు. సాయి రాజేశ్, టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని, భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందని అన్నాడు.బాబిల్ పోస్ట్ పై స్పందించిన సాయి రాజేశ్.. 'నేను కలిసిన టాలెంటెడ్, కష్టపడే నటుల్లో బాబిల్ ఒకడు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోని మిస్ అవుతున్నాను. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. మేం తప్పకుండా మ్యాజిక్ సృష్టిస్తాం' అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రీమేక్ నుంచి ఓ హీరో తప్పుకొన్నాడు. ఇప్పటికిప్పుడు మరో హీరోని వెతికి పట్టుకుని అతడికి ట్రైనింగ్ ఇప్పించి సినిమా చేయడానికి మరికొన్నాళ్లు పట్టొచ్చు. అంటే 'బేబి' హిందీ రీమేక్ కి బ్రేకులు పడ్డట్లే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Babil (@babil.i.k) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
శ్రీవారి సేవలో ఆది పినిశెట్టి- నిక్కీ
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి దర్శించుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం(మే 18) ఉదయం భార్య నిక్కీ గల్రానీతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడుతూ.. ‘పెళ్లి రోజు సందర్భంగా శ్రీవారి దర్శననానికి వచ్చాను. ఇది మా మూడోవ వివాహ వార్షికోత్సవం. ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. డిస్కో, మరగదమణి చిత్రాలలో నిక్కితో కలిసి నటిస్తున్నానని చెప్పారు. వీటిలో పాటు పలు వెబ్ సిరీస్ కూడా చేస్తూన్నట్లు ఆది తెలిపారు.హీరోయిన్ నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ మలుపు చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించారు. ఈ ప్రయాణంలో స్నేహం కాస్తా ప్రేమగా మారడం.. ఆపై నిక్కీనే ఆదికి ప్రపోజ్ చేయడం జరిగిపోయింది. అలా ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటి అయ్యారు. -
‘పైసావాలా’ విజయం సాధించాలి: శ్రీలీల
రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పైసావాలా’(Paisawala Movie). కె. నవీన్ తేజస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, వీకేఎం మూవీస్ బ్యానర్లపై కె. నవీన్ తేజస్, నూనెల పైడిరాజు, పిజె దేవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ను స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ, “‘పైసావాలా’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్రానికి నగేష్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్గా, ఎంజే సూర్య ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ‘పైసావాలా’ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. -
ముగ్గురు హీరోలతో కష్టం అనుకున్నా! : దర్శకుడు విజయ్ కనకమేడల
‘‘చాలామంది ఫ్రీమేక్లు చేస్తున్నారు. కానీ... మేం అధికారికంగా రీమేక్ (తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’కు తెలుగు రీమేక్ ‘భైరవం’) చేశాం. అయినా ప్రేక్షకులు ఏ సినిమా బాగున్నా చూస్తారు. అది రీమేకా... ఫ్రీమేకా? అని పెద్దగా ఆలోచించరు. ‘భైరవం’(Bhairavam Movie) సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. నా ప్రతి సినిమాలో ఉండే ఓ సామాజిక సందేశం ఈ సినిమాలోనూ ఉంది’’ అని అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల(Vijay Kanakamedala). బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విజయ్ కనకమేడల మాట్లాడుతూ–‘‘తమిళ సినిమా ‘గరుడన్’ కథ కమర్షియల్గానూ నాకు నచ్చింది. తెలుగులోనూ ముగ్గురు హీరోలతో చేయొచ్చనిపించింది. కథ అనుకున్నప్పుడే సాయిగారిని హీరోగా ఫైనల్ చేశాం. రోహిత్, మనోజ్గార్లను ఆ తర్వాత కలిస్తే, వారూ ఓకే చెప్పారు. కథలో ఈ ముగ్గురు హీరోలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. మొదట్లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడం కష్టమేమో అనిపించింది. కానీ... ఈ ముగ్గురు ఆఫ్ స్క్రీన్లోనూ మంచి మిత్రులు. దాంతో నా పని సులువైంది. ఇక ‘భైరవం’ కథ విషయానికొస్తే... ముగ్గురు స్నేహితుల ఫ్యామిలీల మధ్య జరిగే కథ. ఒక గ్రామంలో గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి ‘భైరవం’ అని టైటిల్ పెట్టాం. కథలో ఒక హీరోకు (బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పాత్రను ఉద్దేశించి) చిన్నప్పట్నుంచి కాలభైరవుడు పూనతాడు. ఎందుకు? ఏమిటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్లూ అలరిస్తాయి. నా తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. నా దగ్గర చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్గార్లకు తగిన కథలు ఉన్నాయి’’ అని అన్నారు. -
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
ప్రముఖ కన్నడ హీరో, దివంగత పునీత్ రాజ్కుమార్ కూతురు ధృతి అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె పెదనాన్న శివరాజ్ కుమార్ తన సోషల్మీడియా ద్వారా తెలిపారు. 2021లో చదువుకునేందుకు అమెరికాకు ధృతి వెళ్లింది. అత్యున్నతమైన మార్కులతో తన ఫ్యాషన్ డిజైనర్ కోర్సును ఆమె పూర్తి చేసిన ఆమె పట్టభద్రురాలైంది.ధృతి గురించి శివరాజ్ కుమార్ ఇలా చెప్పారు. 'హాయ్ టోటో (ముద్దుపేరు), నీకు అభినందనలు! ఈ రోజు మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది, మనందరికీ చాలా గర్వకారణమైనది కూడా.. మీ నాన్నతో పాటు నన్ను కూడా చాలా గర్వపడేలా చేశావు. మీతో చాలా మంచి జ్ఞాపకాలు నా కళ్లముందు ఉన్నాయి. నువ్వు నవ్వినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, అప్పు(పునీత్ రాజ్కుమార్) వచ్చినట్లు ఉంటుంది. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు. అందుకే మా ప్రియమైన అప్పుకు మరోసారి అభినందనలు.' అని ఆయన అన్నారు. ధృతి తండ్రి పునీత్ రాజ్కుమార్ 2021లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.దింగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా పట్టభద్రురాలైంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ డిజైన్ స్కూల్గా ఆ యూనివర్శిటికి గుర్తింపు ఉంది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ కాలేజీ 1941లో ఫ్రాంక్ అల్వా పార్సన్స్గా పేరు మార్చబడింది. ఈ సంస్ధ ఐదు విభాగాలలో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తుంది. ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్లలో శిక్షణ ఇస్తుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పేరుగాంచిన మార్క్ జాకబ్స్, డోనా కరణ్ వంటివారు ఇక్కడే విద్యను అభ్యసించారు.Hi ಟೋಟೊ, Congratulations! ಈ ದಿನ ಬಹಳ ವಿಶೇಷವಾದ ದಿನ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ಹೆಮ್ಮೆಯ ದಿನ. You made me and dodappa very proud. Lots of good memories with ಅಪ್ಪು, ಅಶ್ವಿನಿ, you and ನುಕ್ಕಿ. ನೀನು ನಗುವಾಗ, ನಡೆಯುವಾಗ ಅಪ್ಪು ಬಂದಂತೆ, ನಿನ್ನಲಿಯೇ ಅಪ್ಪು. ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಅಪ್ಪುಗೆ. Congratulations once… pic.twitter.com/JZOw2mkZXW— DrShivaRajkumar (@NimmaShivanna) May 17, 2025 -
Vidyapati Review: వీడు మామూలోడు కాదు
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో కన్నడ చిత్రం విద్యాపతి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎవరికైనా ఆశ ఉండొచ్చు, అత్యాశ పనికి రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది తమ తక్షణ అవసరాల కోసం అత్యాశకు పోయి అనర్థాలు కొని తెచ్చుకుంటుంటారు. ఆ తరువాత బాధ పడుతుంటారు. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ కోవకు చెందిన కథే ‘విద్యాపతి’(Vidyapati ). ఇది ఓ కన్నడ సినిమా. ఇషాన్ ఖాన్, హసీమ్ ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్యాపతి’. నాగభూషణ, మలైకా వసుపాల్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. యాక్షన్ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దర్శకులు ఈ స్క్రీన్ప్లేని సరదా సరదాగా తీసుకువెళ్ళారు. అసలీ ‘విద్యాపతి’ సినిమా కథేంటంటే... విద్య అనే సినిమా హీరోయిన్ పెద్ద స్టార్. ఆ హీరోయిన్ని అల్లరి చిల్లరగా తిరిగే హీరో మోసం చేసి పెళ్ళి చేసుకుంటాడు. అంతేనా... పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయికి సంబంధించిన సినిమా వ్యవహారాలతోపాటు ఆస్తి పైన అప్పనంగా పెత్తనం చెలాయిస్తుంటాడు. అలా చెలాయిస్తూనే తన పేరును విద్యకు అనుసంధానంగా విద్యాపతిగా మార్చుకుని చెలామణి అవుతాడు. కానీ ఎప్పుడూ టైమ్ ఒకేలా ఉండదు కదా. విద్యకి విద్యాపతి చేసిన మోసం తెలిసి, తన ఇంటి నుండి గెంటేస్తుంది. అప్పటిదాకా ఫైవ్ స్టార్ భోగాలు అనుభవించిన విద్యాపతి తినడానికి, ఉండడానికి కూడా గతి లేక తన ఇంటికి వెళతాడు. విద్యాపతి తండ్రి బిరియానీ బండి నడుపుతుంటాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును అసహ్యించుకుంటాడు. తెలివొచ్చే టైమ్లో అన్నీ తెలిసొస్తాయన్నట్టు మన విద్యాపతి కళ్ళు నేల మీదకు వచ్చి విద్య దగ్గర తన లవ్ను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరి... విద్యాపతి ప్రయత్నం ఫలించిందా లేక బెడిసికొట్టిందా అనేది మాత్రం సినిమాలోనే చూడాలి. ఓ మంచి లైన్తో దర్శకులు చక్కటి హ్యూమర్ను జోడించి, సినిమాను సరదాగా రూపొందించారు. గుడ్ మూవీ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
యూట్యూబ్లో కొత్త సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
ప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్లో విడుదలైంది. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్.మదర్ సెంటిమెంట్తో అమ్మ రాజశేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆయన కుమారుడు రాగిన్ రాజ్కు ఇదే ఫస్ట్ సినిమా.. అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ఈ మూవీలో రెండు పాటలకు తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. అయితే, ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ఉచితంగానే రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లేకుంటే యూట్యూబ్లో 'తల' సినిమాను చూడొచ్చు.కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే! -
ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి
తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం తాజాగా తమిళ్లో విడుదలైంది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు మామన్ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. ఆపై వారు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. సినిమా కటౌట్లకు పాలతో అభిషేకం చేశారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయం తెలుకున్న సూరి తన అభిమానులపై ఫైర్ అయ్యారు. కథ, కథనం బాగుంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నారు. సినిమా చూసి కాస్త ప్రేమ చూపుతే చాలన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, సినిమా విడుదల సమయంలో ఇలా వృధాగా ఖర్చు చేయడం చాలా వేదన కలిగిస్తోందని అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే వారు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతాయనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు. ( వీడియో సన్ న్యూస్ సౌజన్యంతో) -
తొలిసారి ఖాకీ డ్రెస్లో కనిపించనున్న నయనతార
సౌత్ ఇండియా స్టార్ నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య హిందీలో షారుక్ఖాన్కు జంటగా నటించిన జవాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించినా ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య ఉమన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్తో కలిసి నటించిన టెస్ట్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో ఆమెను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అర డజన్కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మోరు2) ఒకటి. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నా రు. ఇది రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్2 చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పాత్ర కాగా, మరొకటి పోలీస్ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్లో పోలీస్ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు. కాగా మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు మరో హైలెట్గా ఉంటాయని సమాచారం. -
నో అప్డేట్!
హీరోల పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల జోష్ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో నటిస్తున్న సినిమాల నుంచి కొత్తపోస్టర్, టైటిల్, టీజర్... ఇలా ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆశిస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఈ హీరో నటిస్తున్న తెలుగు సినిమా అప్డేట్ ఏమీ ఉండదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్).ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్ నీల్’ నుంచి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. ఆ రోజు ఎటువంటి అప్డేట్ ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు.హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ అప్డేట్ రానుండటంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్నిపోస్ట్΄ోన్ చేసినట్లు ప్రకటించారు. ఇక ‘వార్’ ఈ ఏడాది ఆగస్టు 14న, ‘ఎన్టీఆర్ నీల్’ 2026 జూన్ 25న రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్, ప్రియమణి జంటగా, మోహన్బాబు, మమతా మోహన్దాస్ కీలకపాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమదొంగ’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. -
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
చిరంజీవి హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేసినట్లు ప్రకటించి, స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నయనతార... తన టీమ్తో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్పాటలు వినడం, ‘హలో మాస్టర్... కెమేరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చెప్పడం ఆకట్టుకున్నాయి.ఫైనల్గా అనిల్ రావిపూడి, నయనతార కలిసి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని చెప్పడంతో ఈ వీడియో ముగిసింది. ‘‘సైరా నరసింహారెడ్డి, గాడ్ఫాదర్’ చిత్రాల తర్వాత చిరంజీవి–నయనతార కలిసి మూడోసారి నటించనున్న చిత్రమిది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంటుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమేరా: సమీర్ రెడ్డి. -
సాహసం శ్వాసగా సాగిపో...
లక్ష్య సాధన కోసం అడవికి వెళ్తున్నారు హీరోలు. ఒకరిది నిధి అన్వేషణ అయితే, మరొకరిదిపోరాటం. ఇంకొకరిది ఆధిపత్యం... ఇలా తెలుగు హీరోలు తమ తమ లక్ష్య సాధన కోసం అడవి బాట పట్టారు. సాహసమే శ్వాసగా ముందుకు సాగుతున్నారు. ఇలా అడవి మాదే... శత్రువుల వేట మాదే అంటున్న కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేద్దాం.ఫారెస్ట్లో అడ్వెంచర్ ఫారెస్ట్లో మహేశ్బాబు ఏదో నిధి కోసం అన్వేషించనున్నారట. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రకథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. సో... ఈ సినిమాలోని మేజర్ కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంతోనే ముడిపడి ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.అలాగే ఇటీవల ఈ సినిమాకు చెందిన ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో పూర్తయింది. ఓ భారీ సెట్లో ఈ షెడ్యూల్ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో అడవి బ్యాక్డ్రాప్లో ఉండే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా షూటింగ్కు ముందు రాజమౌళి కెన్యా వెళ్లి, అక్కడ కొన్ని లొకేషన్స్ను చూసి వచ్చారు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ విదేశీ అడవుల్లోనూ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్బాబు, రాజమౌళి వేసవి బ్రేక్లో ఉన్నారు. ఈ బ్రేక్ పూర్తవగానే మళ్లీ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. జూన్ రెండో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావొచ్చు.నెక్ట్స్ షెడ్యూల్ కోసం వారణాసిని తలపించేలా హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ను తీర్చిదిద్దుతున్నారని, ఈ సెట్లోనే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్, దేవ కట్టా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇంగ్లిష్ డైలాగ్స్ కోసం ఓ హాలీవుడ్ రైటర్ను నియమించుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుందని సమాచారం.వీరమల్లు అన్వేషణ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చారిత్రాత్మక చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేయగా, పంచమి అనేపాత్రలో హీరోయిన్గా నిధీ అగర్వాల్ నటించారు. కాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అడవి నేపథ్యంతో ఉంటాయని తెలిసింది. ఓ నిధి అన్వేషణ కోసం వీరమల్లు తన బృందంతో కలిసి అడవికి వెళ్తాడని, ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని ఫిల్మ్నగర్ భోగట్టా. ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఏమ్ రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అడవిలో డ్రాగన్ ఫారెస్ట్లో అదిరిపోయే చేజింగ్ ఫైట్ చేస్తున్నారు హీరో ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇటీవల కర్ణాటక లొకేషన్స్లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణలో ఓ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ యాక్షన్ సీన్ తీశారని తెలిసింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఈ ఫారెస్ట్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్గా ఉంటుందని, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ యాక్షన్ సీక్వెన్ని డిజైన్ చేశారని తెలిసింది. కాగా లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్కి హాజరయ్యారు ఎన్టీఆర్, అలాగే ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. సో... ఈ రెండు కారణాల వల్ల ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తిరిగి ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లోపాల్గొంటారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, రష్మికా మందన్నా ఓ కీలకపాత్ర చేయనున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ విలన్గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాలో కొన్ని ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సన్నివేశాలు ఉన్నట్లుగా చూశాం. ఇటీవల ‘దేవర 2’ సినిమాను ఓ సందర్భంగా కన్ఫార్మ్ చేశారు ఎన్టీఆర్. ఇలా వచ్చే ఏడాది ‘దేవర 2’ సినిమా కూడా సెట్స్పైకి వెళుతుందని ఊహింవచ్చు. సో... ‘దేవర 2’లోనూ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని ఊహించవచ్చు.అడవిలో జాతర రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘మాస్ జాతర’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి అనే పవర్ఫుల్పోలీస్ ఆఫీసర్పాత్రలో రవితేజ కనిపిస్తారు. కాగా ఈ సినిమాలో కూడా అడవి నేపథ్యంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అరకు,పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల లొకేషన్స్లో ‘మాస్ జాతర’ సినిమా చిత్రీకరణ జరిగిందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్స్ని కూడా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘మాస్ జాతర’ సినిమా జూలై చివర్లో లేదా ఆగస్టులో రిలీజ్ కావొచ్చు.భక్త కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమాలో తిన్నడుపాత్రలో కనిపిస్తారు విష్ణు మంచు. దైవత్వాన్ని నమ్మని తిన్నడు శివుడికి ఎలా వీరభక్తుడు అయ్యాడు? భక్త కన్నప్పగా ఎలా ప్రఖ్యాతి చెందాడు? అనే అంశాల ఆధారంగా ‘కన్నప్ప’ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కథ రీత్యా ఈ సినిమా మేజర్పార్ట్ అంతా అడవి నేపథ్యంతోనే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్పోస్టర్స్.. వంటి ప్రమోషనల్ కంటెంట్... ‘కన్నప్ప’ సినిమా ఫారెస్ట్ నేపథ్యంతోనే సాగుతుందన్న విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నాయి. ప్రీతీ ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మోహన్బాబు, మోహన్లాల్, ఆర్. శరత్కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మాజీ, రఘుబాబు తదితరులు ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మోహన్బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిధి వేట నిధి వేటలో ఉన్నారట అర్జున్. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వృషకర్మ’తోపాటు మరో రెండు టైటిల్స్ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో నిధిని అన్వేషించే అర్జున్పాత్రలో నాగచైతన్య, పురావస్తు శాస్త్రవేత్తగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ఇలా నిధి అన్వేషణలో భాగంగా అర్జున్ ఫారెస్ట్కి వెళతాడట. అక్కడ ఫారెస్ట్లో కొన్ని సాహసాలు చేస్తాడట. ఈ సినిమా కోసం ఓ గుహ సెట్ను రెడీ చేశారు మేకర్స్. ఈ గుహ సెట్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, ఈ సీక్వెన్స్ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుందని తెలిసింది. బాపినీడు సమర్పణలో సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే లేదా జూన్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అరణ్యంలో భోగి హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భోగి’. 1960 నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రత్యేకమైన విలేజ్ సెట్ను ఏర్పాటు చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు, కొంత భాగం అడవి నేపథ్యంలోనే ఉంటాయని తెలిసింది. ఈ మూవీ కోసం శర్వానంద్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ కావొచ్చు.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కిష్కింధపురిలో ఏం జరిగింది? ‘కిష్కింధపురికి’ ప్రేక్షకులను తీసుకు వెళ్లనున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టరీ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’. ఇటీవల ‘కిష్కింధపురి’ సినిమా గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ రాత్రివేళ అడవిలోకి వెళ్లడం, అక్కడ వీరిద్దరూ ఎందుకోసమో వెతుకాలడంట వంటి విజువల్స్ కనిపించాయి. చూస్తుంటే... ‘కిష్కింధపురి’ మేజర్ సీన్స్లు అడవి నేపథ్యంలో ఉంటాయని, అది కూడా రాత్రివేళ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనీ తెలుస్తోంది.అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘హైందవ’ అనే మూవీ రూపొందుతోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాలోనూ ఫారెస్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలిసింది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.కింగ్డమ్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతుందని, ఫ్లాష్ బ్యాక్ టైమ్లైన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అడవి నేపథ్యంతోనే ఉంటాయని ఫిల్మ్ నగర్ సమాచారం. పైగా ‘కింగ్డమ్’ సినిమా టీజర్లోనూ అడవిని తలపించే కొన్ని షాట్స్ కనిపించాయి. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 4న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇలా అడవి నేపథ్యం, అడవి సన్నివేశాలు కీలకంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
'అమరావతికి ఆహ్వానం' మధ్య ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి
తెలుగులో తీస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జివికె దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మధ్య ప్రదేశ్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. మధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్తీపూర్ లాంటి పలు అందమైన లొకేషన్స్లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. అమరావతికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నాం. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది అని చెప్పుకొచ్చారు. -
మృణాల్ చాలా పద్ధతిగా.. మీనాక్షి నెవ్వర్ బిఫోర్ లుక్
పద్ధతిగా క్యూట్ లుక్స్ లో మృణాల్ ఠాకుర్నాభి అందాలతో షాకిచ్చిన మీనాక్షి చౌదరిఫ్రెండ్స్ తో ట్రిప్ లో కల్యాణి ప్రియదర్శన్చీరలో మరింత అందంగా సమంతజీన్స్ లో మెరిసిపోతున్న యాంకర్ అనసూయజిమ్.. ఫుడ్ క్రేవింగ్స్ వీడియోతో తృప్తి దిమ్రి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Face Magazine (@facemag.in) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
ఎన్టీఆర్ బర్త్డే స్పెసల్.. థియేటర్స్లో ‘యమదొంగ’
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మోహన్ బాబు, ప్రియమణి, మమత మోహన్దాస్ కాంబినేషన్లో వచ్చిన ఐకానిక్ సోషియో ఫాంటసీ చిత్రం ‘యమదొంగ’(Yamadonga) బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ చిత్రాన్ని మే 18 నుంచి రీ రిలీజ్ చేయనున్నారు.రీ రిలీజ్ కోసం టీం అమితంగా శ్రమించినట్లు తెలుస్తోంది. ‘యమదొంగ’ను 8Kలో స్కాన్ చేసి, 4K నాణ్యతకు కుదించి, అసాధారణమైన దృశ్య అనుభవాన్ని అందించేలా సిద్ధం చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను మరింత ఉన్నత నాణ్యతలో ఆస్వాదించవచ్చు.సోషల్ మీడియాలో ‘యమదొంగ’ రీ రిలీజ్ సందడి జోరుగా సాగుతోంది. ప్రధాన నటీమణులు ప్రియమణి, మమత మోహన్దాస్ షూటింగ్ రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ విడుదల చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజమౌళి దర్శకత్వ విజన్, ఎంఎం కీరవాణి సంగీతంతో ‘యమదొంగ’ మరోసారి తెరపై సందడి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. -
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి పనిచేశాడు. అదే 'థగ్ లైఫ్' సినిమా. జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. తాజాగా తెలుగు, తమిళ ట్రైలర్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) ట్రైలర్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా అని క్లారిటీ వచ్చేసింది. కమల్ హాసన్ గ్యాంగ్ స్టర్ కాగా.. అతడి దగ్గర శింబు పెరిగి పెద్దవాడవుతాడు. కానీ పెద్దయ్యాక కమల్-శింబు మధ్య గ్యాప్ వస్తుంది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన కమల్.. తిరిగొస్తే ఏం జరిగింది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇందులో కమల్ హాసన్ కి జోడీగా అభిరామి, త్రిష నటించారు. శింబు సరసన సన్య మల్హోత్రా చేసింది. వీళ్లు కాకుండా ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ట్రైలర్ చూస్తే మంచి రిచ్ గా ఉంది. చూస్తుంటే 'విక్రమ్'లా కమల్ మరో హిట్ కొడతాడనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'సీతారామం' నటి కారులో భారీ చోరీ) -
'సీతారామం' నటి కారులో భారీ చోరీ
'సీతారామం' సినిమాలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.23 లక్షలు విలువైన వస్తువుల్ని దొంగిలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో కనుక్కొని డ్రైవర్ ముహమ్మద్ మస్తాన్ ని అదుపులోకి తీసుకున్నారు.ఇంతకీ ఏమైంది?ఈ నెల 11న మార్నింగ్ వాకింగ్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి రుక్మిణి వెళ్లింది. ఓ గేట్ దగ్గర తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయింది. ఈ హడావుడిలో తన కారు లాక్ చేసుకోవడం మర్చిపోయింది. అదే కారులో ఖరీదైన హ్యండ్ బ్యాగ్స్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ తదితర విలువైన వస్తువులు ఉన్నాయి.(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)రుక్మిణి కారుకి లాక్ వేయని విషయాన్ని గమనించిన ట్యాక్సీ డ్రైవర్ మస్తాన్.. కారులోని రూ.23 లక్షలు విలువ చేసే వస్తువుల్ని దొంగిలించాడు. దీంతో నటి రుక్మిణి.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుడు మస్తాన్ ని అరెస్ట్ చేసి, దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి.. తొలుత కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. 'సీతారామం'లో హీరోయిన్ ఫ్రెండ్ రేఖ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) -
'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్
వేల మంది కష్టపడితేనే ఓ సినిమా తీయడం సాధ్యమవుతుంది. అదే మూవీ హిట్ అయితే గనక హీరో హీరోయిన్ లేదా దర్శకుడికే ఎక్కువ క్రెడిట్ వస్తుంది. కానీ ఇదే మూవీ కోసం పనిచేసిన చాలామందికి పెద్దగా గుర్తింపే దక్కదు. సరిగ్గా ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ అంటున్నాడు.బాస్కో మార్టిస్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇతడు తెర వెనక మాత్రమే ఉంటాడు. తెలుగు, హిందీలో సూపర్ హిట్ అనిపించుకున్న చాలా పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. కానీ తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతేడాది రిలీజైన 'దేవర'లో చుట్టమల్లే పాటని కొరియోగ్రఫీ చేసింది కూడా ఇతడే.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చుట్టమల్లే పాటకు తనకు గుర్తింపు దక్కకపోవడంపై తన బాధని బయటపెట్టాడు. 'దేవర ప్రమోషన్స్ లో జాన్వీ నా గురించి మాట్లాడి ఉండాల్సింది. కానీ పర్వాలేదులే. మన పని మనం చేసుకుంటే చాలు' అని బాస్కో మార్టిస్ చెప్పుకొచ్చాడు.బాస్కో మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే జాన్వీ తన పేరు చెప్పకపోవడంపై బాధ పడుతున్నట్లు అనిపించింది. అలానే ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కి సరైన గుర్తింపు దక్కకపోవడం గురించి మరీ నేరుగా కాకపోయినా పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టినట్లు అనిపించింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన చిన్న చిన్న టెక్నీషియన్స్ కి కూడా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆ లెక్కన బాస్కో చాలా బెటర్!(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు) -
రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం
మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్ తో తీసిన సినిమా 'కన్నప్ప'. జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లు మొదలుపెట్టిన విష్ణు.. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన కుటుంబం విషయాలు, ప్రభాస్ తో బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇవి హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)ప్రభాస్ గురించి మాట్లాడిన విష్ణు.. 'నేను, ప్రభాస్ బాగా క్లోజ్. అతడు ఎంత గొప్ప నటుడో అతడికి కూడా తెలియదు. ప్రభాస్ లా చాలా తక్కువమంది ఉంటారు. ఇంత పెద్ద స్టార్ అయ్యాక కూడా సింపుల్ గా ఉండటం అతడి గొప్పతనం. మేం ఎప్పటికీ సోదరులమే''రక్తం పంచుకుని పుట్టినవాళ్లే ఈ రోజు నా పతనాన్ని కోరేటప్పుడు.. ప్రభాస్-నేను రక్తం పంచుకుని పుట్టలే కానీ నా మంచి కోరి, నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా నేను అతడికి రుణపడి ఉంటాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు.తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. 'మా నాన్న ఆనందమే నాకు ముఖ్యం. దాని కోసం ఏదైనా చేస్తాను. ఆయన సంతోషంగా లేకపోతే నాకు ఏది అక్కర్లేదు. ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చినరోజు నేను బతికున్నా చచ్చినట్లే. ఆ రోజు ఎప్పటికీ తీసుకురాను. ఆయన పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తాను. కానీ చెడగొట్టేలా ఎప్పుడు చేయను' అని విష్ణు తన కుటుంబ సమస్యల గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్) -
సోదరి కోసం ప్రీమియం ఇల్లు కొన్న తాప్సీ.. ధర ఎన్ని కోట్లంటే..
బాలీవుడ నటి తాప్సీ పన్ను ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేసింది. తన సోదరి సోదరి షగున్తో కలిసి తాజాగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారని స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్ ద్వారా సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమెకు ముంబైలో ఒక ఇల్లు ఉంది. అది ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. తన సోదరి వెడ్డింగ్ ప్లానర్ కావడంతో ఆ ఇంటిని చాలా అందంగా డెకరేషన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.తాప్సీ పన్ను, ఆమె సోదరి షగున్ పన్నుతో కలిసి ముంబైలోని గోరేగావ్ వెస్ట్లో రూ.4.33 కోట్లతో ప్రీమియం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ణు కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్లో ఈ సమాచారం ఉంది. అందుకు సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా పోర్టల్లో ఉన్నాయి. రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కావడంతో వారు త్వరలోనే కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.21.65 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు అదనంగా రూ.30,000 ఛార్జీలను చెల్లించారు. ముంబైలోని ఇంపీరియల్ హైట్స్ ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చదరపు అడుగుకు రూ.32,170గా ఉంది. ఇది ఈ ప్రాంతంలో అత్యంత డిమాండ్ ఉన్న లగ్జరీ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.కొత్త ఇల్లు తన సోదరి షగున్ కోసం తాప్సీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన తాప్సీ తన భర్త మథియాస్ బోతో పాత ఇంట్లోనే ఉంటుంది. అతను డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. కొన్నేళ్లుగా వారిద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి తర్వాత తన సోదరికి ఒక సొంత ఇల్లు ఉండాలని తాప్సీ కొన్నట్లు సమాచారం. -
చిరంజీవి- అనిల్ సినిమా.. ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్
చిరంజీవి- అనిల్ రావిపూడి ప్రాజెక్ట్లోకి నయనతార ఎంట్రీ ఇచ్చేశారు. ఈమేరకు తాజాగా చిత్రయూనిట్ ఒక వీడియోను షేర్ చేస్తూ స్వాగతం పలికింది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరిగింది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.Mega157లో నయనతార నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిని ధృవీకరిస్తూ నయనతారతో ఒక ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి విడుదల చేశారు. జూన్లో ప్రారంభం కానున్న షూటింగ్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ చిత్రంతో చాలారోజుల తర్వాత నయనతర హీరోయిన్గా తెలుగులో మళ్లీ అడుగుపెడుతున్నారు. ఇక ఈ సినిమా కోసం అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది -
దాదా సాహెబ్ ఫాల్కే గెటప్లో ఎన్టీయార్ స్టిల్స్ బయటకు...
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి అనే పేరు సెన్సేషన్ అనే పదం రెండూ చెట్టాపట్టాలేసుకుని పక్కపక్కనే నడుస్తుంటాయి. ప్రస్తుతం మహేష్బాబుతో సినిమాకు సంబంధించి ఒక్క వార్తా బయటకు రాకుండా సినీ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్... ఇటీవలే తాను తీయబోయే మహాభారతం సినిమా గురించి ఓ అప్డేట్గా హీరో నాని కి పాత్ర ఇవ్వనున్నట్టు చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఆయన అంతకు మించిన సంచలనాన్ని సృష్టించారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను సినిమాగా సమర్పించబోతున్నానని ప్రకటించారు.అంతేకాదు ఆయన చేసిన ప్రకటనను బట్టి చూస్తుంటే ఆ సినిమాలో కధానాయకుడి పాత్రను జూ.ఎన్టీయార్ పోషించబోతున్నారని దాదాపుగా రూఢీ అయింది. నిజానికి ఇది ఆయన రెండేళ్ల నాడే చెప్పిందే అయినప్పటికీ... ముడి సరకు అంతా రెడీ అయిపోయింది... ఇక షూటింగ్ పట్టాలెక్కబోతోంది అని ఆయన ప్రకటనతో తేలిపోయింది.తాజాగా ఆయన చేసిన పోస్ట్ ఇలా ఉంది..‘‘నేను మొదటిసారి కథ విన్నప్పుడు, అది నన్ను మరేదీ లేని విధంగా భావోద్వేగపరంగా కదిలించింది. బయోపిక్ను సినిమాగా తీయడం చాలా కష్టం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించి ఊహించడం మరింత సవాలుతో కూడుకున్నది. అయితే మా అబ్బాయిలు దానికి సిద్ధంగా ఉన్నారు సగర్వంగా, మేడ్ ఇన్ ఇండియాను ప్రజంట్ చేస్తున్నాను’’రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రకటించి రెండు సంవత్సరాలు అయింది. అప్పుడే ఈ చిత్రానికి మేడ్ ఇన్ ఇండియా అని పేరు పెట్టారు. ఇలా రాజమౌళి పోస్ట్ చేశారో లేదో... అలా ఈ పాత్రకు ఎన్టీయార్ పోషించబోతున్నారని వార్తలు వ్యాపించాయో లేదో... అంతే... ఆధునిక సాంకేతిక యుగపు నిపుణులు తమ టాలెంట్కు పదును పెట్టారు.దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో యంగ్ టైగర్ ఎలా ఉంటాడు అనేదానిపై తమ ఊహలకు రూపాల్ని ఇస్తున్నారు. వారికి అత్యాధునిక ఏఐ వంటి టెక్నాలజీలు తోడయ్యాయి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ దాదా గెటప్ చిత్రాలు ఇంటర్నెట్లో తుఫానుగా మారాయి, ఏఐ రూపొందించిన ఈ చిత్రాలలో జూనియర్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఇమిడిపోయినట్టు కనిపిస్తున్నాడు, ఖాదీ కుర్తా ధరించి, కళ్ళద్దాలు గడ్డం తో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని వరుణ్ గుప్తా (మాక్స్ స్టూడియోస్) ఎస్ఎస్ కార్తికేయ (షోయింగ్ బిజినెస్) నిర్మిస్తారు. నిర్మాతలు స్క్రిప్ట్ పై పనిలో బిజీగా ఉన్నారు మరియు తుది డ్రాఫ్ట్ను పూర్తి చేస్తున్నారు.ఓ రకంగా ఇది భారతీయ సినిమా కధ అని చెప్పొచ్చేమో... ఎందుకంటే.. ఈ సినిమా కథాంశం భారతీయ సినిమా పుట్టుక పెరుగుదలకు అద్దం పట్టనుంది. మరోవైపు మేడ్ ఇన్ ఇండియా సినిమా జూనియర్ ఎన్టీఆర్కు యాక్షన్ చిత్రాల నుంచి ఒక్కసారిగా రిఫ్రెషింగ్ బ్రేక్ అవుతుంది అనేది నిర్వివాదం.ఇదిలా ఉంటే.. అటు బాలీవుడ్లోనూ ఆమిర్ఖాన్ - రాజ్కుమార్ హిరాణీ కలయికలో ఈ బయోపిక్ రూపొందుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందిస్తూ.. రాజమౌళి సమర్పణలో ఈ ప్రాజెక్ట్ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. ఆయన టీమ్ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు. కానీ ఆమిర్-రాజ్ కుమార్ హిరానీ టీమ్ మూడేళ్లుగా నాతో టచ్లో ఉన్నారు’ అని చెప్పారు. మరి రాజమౌళి సినిమా ఉంటుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ ఏఐ ఫోటోలు అయితే నెట్టింట వైరల్గా మారుతున్నాయి. History meets legacy. Jr. NTR becomes the face of a revolution — portraying the man who gave India its first cinematic heartbeat: Dadasaheb Phalke.”@tarak9999 as Dada Saheb Phalke@ssrajamouli @dpiff_official #historyofcinema #DadasahebPhalke #jrntr #ntrasdadasahebphalke pic.twitter.com/kdyUjoX16t— House Of 24 (@of_2491841) May 15, 2025 -
'కేసరి చాప్టర్ 2' తెలుగు ట్రైలర్
‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ మే 23న తెలుగులో విడుదల కానుంది. ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్లైన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. -
అదే మా ‘ట్రాలాలా’ లక్ష్యం: సమంత
‘‘శుభం’ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరిలో నవ్వులు, సంతోషం కనిపిస్తున్నాయి. ఇదే అసలైన విజయం. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు’’ అని హీరోయిన్, నిర్మాత సమంత చె΄్పారు. హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియా కొంతం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో సమంత మాట్లాడుతూ– ‘‘శుభం’ చూస్తే నా వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. మమ్మల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఓ మూవీని మా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన రోజులన్నీ మళ్లీ గుర్తుకొచ్చాయి. ‘శుభం’తో అందర్నీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. ఇలాంటి మంచి చిత్రాలను తీసి కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తు చేస్తూనే ఉంటాం... అదే మా ట్రాలాలా లక్ష్యం. సినిమా రిలీజ్కు ముందు మూడు రోజులు మా టీమ్లోని ఏ ఒక్కరూ నిద్ర΄ోలేదు. ఇప్పుడు వస్తున్న ప్రేమ, అభిమానం, ప్రశంసలన్నింటికీ వాళ్లే కారణం. నాకు సపోర్ట్గా నిలిచిన మైత్రి శశి, సురేష్బాబుగార్లకు థ్యాంక్స్. అభిమానులే నా ప్రపంచం. ‘శుభం’ని ముందుకు తీసుకెళ్తున్న ఫ్యాన్స్కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ– ‘‘సమంతగారు లేక΄ోతే ‘శుభం’ని ఎవరు చూస్తారు? ఆమె వల్లే ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి’’ అన్నారు. నటీనటులు శ్రియా కొంతం, శ్రావణి, షాలినీ, వంశీధర్, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్, రచయిత వసంత్, సహ నిర్మాత హిమాంక్, ‘మైత్రీ’ మూవీస్ శశి, ్ర΄÷డక్షన్ డిజైనర్ రామ్, క్యాస్ట్యూమ్ డిజైనర్ పూజిత, రాగ్ మయూర్ మాట్లాడారు. -
కేరళలో 'అల్లు అర్జున్'ను స్టార్గా చేసిన ఖాదర్ ఎవరో తెలుసా?
అల్లు అర్జున్కు మలయాళంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ మన బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా..? ‘ఆర్య’ సినిమా తర్వాత అల్లు అర్జున్కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్ అరి ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్లో ఆయన సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. కేరళలోనూ ఆడుతుంటాయి. పుష్ప విడుదల సమయంలో అక్కడ ఏ సినిమా కూడా పోటీకి దిగలేదు అంతలా స్టార్డమ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా.అల్లు అర్జున్ను మలయాళ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయాణం గురించి నిర్మాత ఖాదర్ హసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వ్యూహాలతో పాటు కేరళలో అల్లు అర్జున్కు వచ్చిన ప్రజాదరణ గురించి ఆయన మాట్లాడారు. నేను పేరుకే నిర్మాతను. కానీ, నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని భాషల సినిమాలను చూస్తుంటాను. అలా 2002లో జెమిని టీవీలో 'నువ్వే నువ్వే' సినిమా చూశాను. అందులో 'ఐ యామ్ వెరీ సారీ' పాట నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ కేరళలో విడుదల చేయాలని హైదరాబాద్ వచ్చేశాను. నిర్మాత రవి కిషోర్ను కలిసి డబ్బింగ హక్కులను పొందాను. మలయాళంలో 'ప్రణయమయి' పేరుతో విడుదల చేశాను. అయితే, సినిమాకు పెద్దగా డబ్బులు రాలేదు. కానీ, మంచి పేరు వచ్చింది. అలా మొదటిసారి డబ్బింగ్ సినిమాలపై నా అడుగులు పడ్డాయి.'ప్రణయమయి' సినిమా తర్వాత మరోక ప్రాజెక్ట్ను కేరళలో విడుదల చేయాలని నిర్మాత ఖాదర్ హసన్ అనుకుంటున్న సమయంలో ఆర్య పాటలు ఆయన చెవున పడ్డాయి. 'ఆర్య సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ తప్పకుండా కేరళలో స్థానం దక్కించుకుంటాడని నాకు అనిపించింది. 2004లో మళ్లీ హైదరాబాద్ వెళ్లి దిల్రాజును కలిశాను. ఆర్య డబ్బింగ హక్కులు కావాలని అడిగాను. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. చాలాకష్టపడి ఆయన్ను ఒప్పించి కేరళలో ఆర్య సినిమాను విడుదల చేశాను. అప్పటికి తెలుగు సినిమాలకు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు. డబ్బింగ్ సినిమాలు అంటేనే చిన్నచూపు చూసేవారు. దానిని నేను ఎలాగైనా సరే మార్చాలని అనుకున్నాను. మలయాళీలకు తగ్గట్టుగా ఆర్య కోసం మంచి సంభాషణలు రాయించాను. మిక్సింగ్, ఇతర సాంకేతిక అంశాలను చెన్నైలోని భరణి వంటి ప్రఖ్యాత స్టూడియోలలో చేపించాను. ఆర్య పాటలను ప్రముఖ మలయాళ గాయకులు పాడారు. ఈ సినిమా కోసం నేను వ్యక్తిగతంగా చాలా రిష్క్ చేశాను. అప్పటికీ నేను అల్లు అర్జున్ను కనీసం కలవలేదు' అని అన్నారు.ఆర్య విజయం కోసం..ఆర్య సినిమా బాగుంది. కానీ, మలయాళీలకు పరిచయం చేయాలని తాను చాలా కష్టపడ్డానని నిర్మాత ఖాదర్ హసన్ అన్నారు. 'ఈ సినిమా పాటలు, ట్రైలర్లను విస్తృతంగా ప్రసారం చేయడానికి మేము ఆసియానెట్ కేబుల్ వారితో కనెక్ట్ అయ్యాం. లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్లను కూడా సంప్రదించాము. ఆపై సినిమా చూడటానికి విద్యార్థులను ఆహ్వానిస్తూ కళాశాలల్లోని యూనియన్లను సంప్రదించాం. అల్లు అర్జున్ స్టిక్కర్స్ను పంపిణీ చేశాం. పిల్లలకు అవి బాగా నచ్చాయి. బన్నీ మాస్క్లను కూడా ఉచితంగానే ఇచ్చాం. వాటితో పాటు మేము 3డి ఫ్యాన్ కార్డ్ను విడుదల చేశాం. ఇలా ఎన్నో ఆర్య సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం' అని ఆయన అన్నారు.ఆర్యతో అనుకున్నది చేశాను: ఖాదర్ఆర్య విడుదల తర్వాత తాము అనుకున్నది సాధించామని ఖాదర్ హసన్ అన్నారు. ఎవరూ ఊహించలేనంతగా తమకు లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్లు ఈ చిత్రం వందరోజులు కూడా రన్ అయినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ తర్వాత తాము బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 ఇలా దాదాపు అన్ని సినిమాలు మలయాళంలో విడుదల చేశామన్నారు. ఆర్య విజయం తర్వాత కేరళ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు మలయాళీలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఇప్పటికీ ఆయనంటే అభిమానం చూపుతారు. 'ఈ ప్రయాణంలో, కేరళలో తన ఉనికిని స్థాపించడానికి నేను చేసిన ప్రయత్నాలకు అల్లు కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన మద్దతు మాపై ఎప్పటికీ ఉంటుంది. మలయాళీ ప్రజల పట్ల అల్లు అర్జున్ ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటాడు. ఇలా పరస్పర గౌరవం, అవగాహన వల్లే బన్నీతో వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేసింది. నన్ను ఒక స్నేహితుడిగానే మల్లు అర్జున్ చూస్తాడు' అని ఖాదర్ అన్నారు. -
పెళ్లి పాటలో సుహాస్, మాళవికా
టాలీవుడ్ హీరో సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేశారు. పెళ్లి బ్యాక్డ్రాప్లో కొనసాగిన పాటలో సుహాస్, మాళవికా చాలా క్యూట్గా కనిపించారు. చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటను టిప్పు, హరిణి ఆలపించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్పై హరీశ్ నల్లా నిర్మిస్తున్నారు. ఇందులో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది
భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే) బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ అసలు విషయం చెప్పారు. ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపుతుంది ఎవరో ఆయన పంచుకున్నారు.దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందని ఆయన మనవడు చంద్రశేఖర్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. 'దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో రాజమౌళి టీమ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, ఆమిర్ టీమ్ నన్ను సంప్రదించింది. ఈ బయోపిక్ కోసం ఆమిర్ మూడేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్కుమార్ హీరాణీ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. రాజ్కుమార్ హీరాణీ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ హిందూకుష్ భరద్వాజ్ నాతో మూడేళ్లుగా టచ్లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ బాగా సెట్ అవుతాడు.' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఎన్టీఆర్ నటించడం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది. తారక్ నటిస్తున్నారని వార్తలు వచ్చిన 24 గంటల్లోపే ఈ ప్రాజెక్ట్లో ఆమిర్ ఖాన్ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే, మేడ్ ఇన్ ఇండియా... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ (హిందీ చిత్రం ‘నోట్బుక్’ ఫేమ్) ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అప్డేట్ ఏదీ బయటకు రాలేదు. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవుడి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. -
రెమ్యునరేషన్ పెంచేసిన 'డ్రాగన్' బ్యూటీ.. ఎంతో తెలుసా..?
రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే వారి స్థాయి ఉన్నతంగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కయ్యదు లోహర్(Kayadu Lohar)ది ఇదే పరిస్థితి. ఇండస్ట్రీలో సరైన ఛాన్స్ కోసం ఈ బ్యూటీ కూడా మూడు, నాలుగేళ్లు పోరాడిందనే చెప్పాలి. 2021లో కన్నడంలో ముకిల్ పేట్ అనే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత మలయాళంలో పత్తొంబదామ్ నూట్రాండు చిత్రంతో అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఆ తరువాత తెలుగులో అల్లూరి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠి భాషలోనూ నటించింది. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయం సాధించకపోయినా, వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. అలా ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈమెకు డ్రాగన్ చిత్రం రూపంలో అదృష్టం పట్టుకుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక నాయకిగా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ చిత్రం సూపర్హిట్ కావడంతో నటి కయ్యదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, కథానాయకులు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈమె నటించిన డ్రాగన్ చిత్రం ఒక్కటే విడుదలైంది. అయితే కయ్యదు లోహర్ రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ చిత్రానికి తను కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే, సినిమాకు భారీ లాభాలు రావడంతో ఆమెకు మరో రూ. 70 లక్షలు ఇచ్చారని ప్రచారం ఉంది.అయితే, తన కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం సంచలన నటుడు శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మడిని హీరోయిన్గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం నటుడు అధర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కయ్యదు లోహర్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా ఇమ్మార్టల్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా శింబు 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్తో జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న చిత్రంలో కయ్యదు లోహర్ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రంలోనూ కయ్యదు లోహర్నే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ధనుష్తో సినిమా ఛాన్స్ పూర్తి అయితే.. తన రెమ్యునరేషన్ మరో రూ. 3 కోట్లు పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తుంది. అదే సమయంలో టాలీవుడ్లోనూ మరో చిత్రం చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క చిత్రం సక్సెస్తో ఇప్పుడు కోలీవుడ్లో కయ్యదు లోహర్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇది కదా లక్కు అంటే. -
మరోసారి నిరూపించారు
‘‘సింగిల్’ సినిమా రషెస్ చూశాక మా గీతా ఆర్ట్స్లో మరో రెండు సినిమాలు చేయాలని శ్రీవిష్ణుకి చెక్ ఇచ్చాను. మనిషిగా, నటుడిగా తను అంత నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్కి వస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అరవింద్. శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరో హీరోయిన్లుగా ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘సింగిల్’ కథని దాదాపు 15 మంది తిరస్కరించారు. వాళ్లందరికీ థ్యాంక్స్ (నవ్వుతూ). మంచి టీమ్తో చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అయితే బాగుంటుందనుకున్నాను... అదే జరిగింది’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఉపయోగపడింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘సింగిల్’ని నా లైఫ్లో మర్చిపోలేను’’ అని కార్తీక్ రాజు చెప్పారు. ‘‘మా సినిమాకి ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని విద్య, భాను ప్రతాప, రియాజ్ చౌదరి తెలిపారు. -
నిధి అన్వేషణలో అర్జున్
‘తండేల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర వేసిన గుహ సెట్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే ట్రెజర్ హంటర్గా కనిపిస్తాను. నాగేంద్రగారు గుహని అద్భుతంగా తీర్చిదిద్దారు’’ అని తెలిపారు. ‘‘ఈ గుహలో తీస్తున్న సీన్స్ సినిమాలో 20 నిమిషాలకు పైగా ఉంటాయి’’ అన్నారు కార్తీక్ వర్మ. ‘‘ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. ‘‘ప్రేక్షకులకు ఒరిజినల్ సినిమాటిక్ అనుభూతినిచ్చేందుకు గుహ సెట్ వేసి, సీన్స్ తీస్తున్నాం’’ అని బీవీఎస్ఎన్ ప్రసాద్ చెప్పారు. ‘‘ప్రేక్షకులకు సెట్ అనే భావన కలగకుండా50 రోజులు కష్టపడి ఈ సెట్ని సహజంగా తీర్చిదిద్దాం’’ అని నాగేంద్ర పేర్కొన్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు. -
దెయ్యం కోరికను తీర్చే 'బకాసుర రెస్టారెంట్'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్స్ వైవా హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఈ మూవీకి ఎస్జే శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్జే మూవీస్ బ్యానర్లో లక్ష్మయ్య ఆచారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైవా హర్ష, ప్రవీణ్ కామెడీ అభిమానులను ఓ రేంజ్లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో సీన్స్ హారర్ సినిమాను తలపించేలా ఉన్నాయి. ప్రేమకథా చిత్రమ్ పార్వతి కదూ? పదేళ్లయినా అదే దెబ్బ.. నువ్వు ఇంకా పోలేదా? అని ప్రవీణ్ చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ సినిమాకు వికాస్ బడిస సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. -
అమ్మ కోరిక తీర్చిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్కు అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్గా సెట్ అయింది. అయితే ఈనెల 30న థియేటర్లలో విడుదల కావాల్సిన కింగ్డమ్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కింగ్డమ్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే విజయ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి కోరికను తీర్చాడు. ఈ వీకెండ్లో డిన్నర్ బయట ప్లాన్ చేద్దామని అమ్మ కోరడంతో వెంటనే విజయ్ డిన్నర్ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్తో డిన్నర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.(ఇది చదవండి: అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?)విజయ్ తన పోస్ట్లో రాస్తూ..'అమ్మ అకస్మాత్తుగా మనం డిన్నర్ కి బయటకు వెళ్దామని అడిగింది. మేము బయటకు వెళ్లి చాలా కాలం అయింది. మనమందరం ఎప్పుడూ పని, లక్ష్యాల వెంట పరిగెడుతుంటాం. పనిలో బిజీగా ఉంటూ కొన్నిసార్లు జీవించడం మర్చిపోతాం. అందుకే నిన్న రాత్రి మేము బయటకు వెళ్లి చాలా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకెళ్లండి, వారికి కొన్ని కౌగిలింతలు, ముద్దులు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
నేను కూడా సెల్ఫిష్.. రివ్యూల విషయంలోనూ అంతే: సమంత
హీరోయిన్ సమంత ప్రస్తుతం శుభం సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టిన సామ్.. కొద్ది రోజులుగా ఫుల్ బిజీ అయిపోయింది. సామ్ తన సొంత బ్యానర్లో నిర్మించిన శుభం మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత సైతం అతిథి పాత్రలో మెరిసింది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టీమ్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన శుభం సక్సెస్ మీట్లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా సినిమా రివ్యూల గురించి ప్రస్తావించింది.(ఇది చదవండి: Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ)తాను కూడా సినిమా రివ్యూలను చదువుతానని సామ్ తెలిపింది. అయితే కేవలం తన పాత్రకు సంబంధించినంత వరకే పరిమితమవుతానని వెల్లడించింది. నా గురించి చదివాకే.. మిగిలిన వారి గురించి చూస్తానని సమంత పేర్కొంది. ఈ విషయంలో నేను కూడా చాలా సెల్ఫిష్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ . కానీ, నిర్మాతగా మారాక అభిప్రాయం మార్చుకున్నట్లు తెలిపింది సమంత. -
మీరిద్దరు శుభంతో జర్నీ మొదలెట్టారు.. ఎప్పటికీ అలాగే ఉండాలి: సమంతపై టాలీవుడ్ నటి కామెంట్స్
ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తాను నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్లో తెరకెక్కించిన శుభం మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో సామ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తన టీమ్తో కలిసి సక్సెస్ వేడుకను గ్రాండ్గా నిర్వహించింది. ఈ ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ నటి మధుమణి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.మధుమణి మాట్లాడుతూ..'నా 39 ఏళ్ల ప్రయాణంలో చాలా అవార్డులు గెలుచుకున్నా. ఎంతో హీరోలతో పాటు హీరోయిన్లకు తల్లిగా నటించా. కానీ సమంతతో ఒక్క సినిమా కూడా చేయలేదు. తనకు రంగస్థలంలో అమ్మగా నటించే అవకాశం చేజారిపోయింది. ఆ బాధ ఇప్పటికీ ఉంది. శుభం కోసం నన్ను సంప్రదించినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నా అదృష్టం కలిసొచ్చి శుభం మూవీలో నటించా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్కు శుభం. రాజ్ మీరు కలిసి శుభంతో ప్రయాణం మొదలెట్టారు. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. శతమానం భవతి అంటూ' అని ఇద్దరినీ దీవించింది.అయితే ఇది విన్న సమంత ఫ్యాన్స్ కాస్తా షాకింగ్కు గురవుతున్నారు. రాజ్ నిడిమోరు- సామ్ డేటింగ్పై చర్చ జరుగుతున్న వేళ మధుమణి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా..ఇటీవల మరోసారి సమంత-రాజ్ నిడిమోరు గురించి మరోసారి చర్చ మొదలైన సంగతి తెలిసిందే. రాజ్ నిడిమోరు తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే. సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. -
కిస్సీ పోజుల్లో సురేఖావాణి.. చీరలో అందంగా 'హిట్ 3' కోమలి
బెడ్ పై పడుకుని పోజులిచ్చేస్తున్న సురేఖావాణిహిట్ 3 బ్యూటీ కోమలి ప్రసాద్ చీరలో కనువిందుమెరుపుల డ్రస్సులో జిగేలుమనిపిస్తున్న ఫరియాన్యూయార్క్ టూర్ వీడియోని షేర్ చేసిన నమ్రతభర్తతో కలిసి విదేశాల్లో తిరిగేస్తున్న మేఘా ఆకాశ్సెల్ఫీ పోజుల్లో దృశ్యం పాప ఎస్తర్అనాథశ్రమంలో అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్
బిగ్ బాస్.. ఓ రియాలిటీ షో మాత్రమే. గత కొన్ని సీజన్లపై దారుణమైన విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏడో సీజన్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ అని చెప్పుకొనే పల్లవి ప్రశాంత్ వల్ల షోకి చాలా చెడ్డ పేరు వచ్చింది. దీనంతటికీ కూడా సదరు కంటెస్టెంట్స్ కి ఉండే బలుపే కారణం. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు. స్వయనా సొహెల్ చెప్పాడు. ఈ షో వల్ల తనకు ఎంత మైనస్ అయిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'బిగ్ బాస్ తర్వాత నాకు చాలా మైనస్ అయింది. ప్లస్ కూడా అయింది. ముఖ్యంగా మైనస్ గురించి చెప్పుకొంటే.. ఆ టైంలో నాకు విపరీతంగా బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. అస్సలు కంట్రోల్ లో లేను. కొన్ని మాటలు నోరు జారాను. నా ఫ్రెండ్సే.. నన్ను అలా మాట్లాడేలా చేశారు. ఏందన్నా నువ్వు కానియ్ అనేవారు. అప్పట్లో నా ముందు ఎవరైనా మైక్ పెడితే నోటికొచ్చింది మాట్లాడేవాడిని. కప్పుది ఏముంది చేయించుకుందాం లాంటి అతి మాటలు మాట్లాడేవాడిని. దీనంతటికీ పక్క వాళ్ల ప్రభావమే కారణం''జీరోగా బిగ్ బాస్ షోకి వెళ్లాను. బయటకు వచ్చిన తర్వాత క్రేజ్ చూసేసరికి బలుపు పెరిగిపోయింది. కానీ నేను కావాలని నోరు జారలేదు. 'లక్కీ లక్ష్మణ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా.. 'నా కొడకల్లారా ఇంటికి వచ్చి కొడతా' అని వార్నింగ్స్ ఇవ్వడం చేశా. ఇప్పుడు ఆ బలుపు మొత్తం తగ్గిపోయింది. సమయం రావాలంతే. అదే మొత్తం సెట్ చేస్తుంది. నాకు ఇప్పుడు టైమ్ వచ్చింది'(ఇదీ చదవండి: శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ)) 'చాలామంది బిగ్ బాస్ షోని తిట్టుకుంటారు కానీ.. అది నాకు చాలా నేర్పించింది. అక్కడ రియల్ గానే ఉన్నాను. బిగ్ బాస్ సీజన్ 4 బెస్ట్ అంటారు. గెలవాలనే తపన అక్కడ నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మా సీజన్ మాత్రం విలువలతో కూడిన సీజన్' అని సొహెల్ చెప్పుకొచ్చాడు.సొహెల్ మాటల బట్టి చూస్తే అతడు చెప్పింది అక్షరాలా నిజమేననిపిస్తుంది. ఎందుకంటే తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు గెలిచిన ఎవరూ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. పైపెచ్చు పూర్తిగా కనుమరుగైపోయారు కూడా. ఇకపై వచ్చే సీజన్లలో పాల్గొనే కంటెస్టెంట్స్ సొహెల్ మాటలు ఓసారి వింటే బెటర్ ఏమో?(ఇదీ చదవండి: 'రామాయణ్'లో కాజల్ అగర్వాల్.. అలాంటి పాత్రలోనా?) -
వీర జవాన్ మురళి నాయక్కు టాలీవుడ్ కమెడియన్ నివాళి
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ శివారెడ్డి వీరజవాన్కు నివాళులర్పించారు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన వార్లో అమరుడైన మురళి నాయక్కు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్ స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా కల్లి తండాలో వెళ్లిన శివారెడ్డి వీర జవాన్ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జవాన్ మాతృమూర్తి కాళ్లకు ఆయన నమస్కరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మరణించారు. ఆ తర్వాత పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై వరుస దాడులతో విరుచుకుపడింది. ఈ యుద్ధ సమయంలోనే మన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆ వీరుడిని తలచుకుంటూ భారతీయులంతా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. -
సతీమణి కోసం మెగా హీరో కొత్త అవతారం.. తానే స్వయంగా!
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నట్లు ప్రకటించారు. తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి ఈ శుభవార్తను ఫ్యాన్స్తో పంచుకున్నారు. ఇక తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ధరించడంతో మెగా హీరో కొత్త అవతారం ఎత్తాడు. తన ముద్దుల సతీమణి కోసం చెఫ్గా మారిపోయారు. స్వయంగా తానే పిజ్జా తయారు చేసి తన భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు మెగా హీరో. వరుణ్ తేజ్ పిజ్జా తయారు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. 2023లో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట మొదటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు. 2017లో వరుణ్, లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.వీరిద్దరు కలిసి ‘మిస్టర్’ అనే సినిమాలో తొలిసారి నటించారు. ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. చివరికీ వీరిద్దరి ప్రేమ సక్సెస్ కావడంతో కుటుంబ సభ్యుల ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరగగా.. హైదరాబాద్లో రిసెప్షన్ ఘనంగా జరిగింది.(ఇది చదవండి: మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!)ఇక సినిమాల విషయానికొస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నటిస్తున్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం సతీ లీలావతి అనే సినిమాలో కనిపించనుంది. వరుణ్తేజ్తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి చిత్రం కావడం విశేషం. View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) -
మళ్లీ థియేటర్స్లోకి ‘జనం’
సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకటరమణ, ప్రగ్య నైనా నటించిన చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “జనం” మూవీ మే 29న రీ-రిలీజ్ కాబోతుంది. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది.సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటన లను ఎత్తి చూపిస్తూ, అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులందరికి చేరాలనే మళ్లీ విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా రచన,దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. "అదుపు తప్పుతున్న నేటి తరానికి అవగాహన కోసం చక్కటి సినిమా అందిస్తున్నాం. ఉత్తమ పౌరులుగా ఉండాల్సిన వారు స్మార్ట్ఫోన్కు, నాయకుల పంచే మందు, డబ్బులకు ఎలా బానిస అవుతున్నారో ఆలోచింపచేసేలా సినిమా తెరకెక్కించాము. ఒకప్పుడు సినిమాలు జనాన్ని ఆలోచింప చేసే విధంగా ఉండేవి. కంటి చూపుతో విమానం కూలటం, రక్త పాతం, హింస, బీపీలు పెరిగే సౌండ్ అర్ధం లేని సినిమాలు వేల కోట్ల కలెక్షన్స్. సమాజానికి,రేపటి తరానికిఎలాంటి నేపథ్యమో ఆలోచించండి.మీ కోసం.... ఈ నెలలో విడుదల అవుతున్నజనం సినిమా చూడండి.. ఓటీటీకి ప్లాన్ చేయడం లేదు. ఈ సినిమాకు సుమన్ గారే హీరో. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఇందులో కమర్షియల్ అంశాలు, సందేశం, సెంటిమెంట్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మే 29న థియేటర్ లకు వెళ్లి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు. -
శుభం సక్సెస్ మీట్.. అసిస్టెంట్ను ఓదార్చిన సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. కొత్తవారితో తాను నిర్మించిన శుభం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ సక్సెస్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది సామ్. తన సినిమాకు హిట్ టాక్ రావడంతో సెలబ్రేషన్స్ చేసుకుంది. శుభం మూవీ టీమ్తో కలిసి సక్సెస్ వేడుకలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే ఈవెంట్లో పాల్గొన్న సమంత అసిస్టెంట్ ఆర్యన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఆర్యన్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన సమంత వెంటనే అతన్ని ఓదార్చింది. హృదయానికి హత్తుకుని మరి అసిస్టెంట్ను సముదాయించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది చూసిన పలువురు నెటిజన్స్ సమంత గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఈ మూవీ తర్వాత సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె ఫోటోలు షేర్ చేయడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఈ విషయంపై రాజ్ నిడిమోరు భార్య కూడా స్పందించింది. Entha love unte ❤️ oka team member ki edupu ostadi 🙌 @Samanthaprabhu2 HEARTFUL MOMENT WITH HER TEAM 🥹❤️🔥👏#shubham #SamanthaRuthPrabhu#Samantha pic.twitter.com/UE58hUBJ4c— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) May 16, 2025 -
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
గత కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కాసారిగా వీళ్లు స్టార్స్ అయిపోయారు. పచ్చళ్ల బిజినెస్ మూతపడినప్పటికీ వీరికి ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఓ కస్టమర్తో వీరి సంభాషణ వైరల్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి మాట్లాడిన డైలాగ్స్పై మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్లో వచ్చాయి.ఇదంతా పక్కనపెడితే అలేఖ్య సిస్టర్స్లో ఒకరైన రమ్య సడన్లో సినిమా ఈవెంట్లో కనిపించింది. టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లోనే రమ్య సందడి చేసింది. వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పక్కనే కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం రమ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఈవెంట్కు రమ్య హాజరు కావడంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. పచ్చళ్ల బిజినెస్తో ఫేమస్ అయి.. ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసిందా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా సెలబ్రిటీ అయిపోయారా? అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఏదేమైనా రమ్య టాలీవుడ్ మూవీ ఈవెంట్లో కనిపించడంతో మరోసారి అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్ తెరపైకి వచ్చింది. మరి అందరూ ఊహించినట్లుగానే రమ్య ఈ సినిమాలో నటించిందా? లేదా అన్నది తెలియాలంటే ఆమె దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే.గతంలో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్లలో ఒకరికి తప్పుకుండా బిగ్బాస్లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరలైంది. కానీ, రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపించింది. మోడ్రన్ డ్రెస్లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా.. గతంలో జియోహాట్స్టార్లో పికిల్స్కు సంబంధించిన ఒక సీన్ను వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. ఇదే విషయంపై బిగ్బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్బాస్కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. View this post on Instagram A post shared by Ramya moksha kancharla 👻🌸 (@ramyagopalkancharla) -
‘కన్నప్ప’ కామిక్ మూడో ఎపిసోడ్ రిలీజ్!
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించగా, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటలు పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. యూఎస్లో విష్ణు మంచు స్టార్ట్ చేసిన కన్నప్ప ప్రమోషనల్ టూర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కన్నప్ప కథను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ రూపంలోకి విష్ణు మంచు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.కామిక్ సిరీస్లోని మొదటి రెండు ఎపిసోడ్లకు అఖండ స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడో అధ్యాయాన్ని విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది.ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్, వీడియో అందరినీ అబ్బుర పరిచేలా ఉంది. ఇంతకు మించి అనేలా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీం చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్లో జాప్యం వల్లే ఈ మూవీని జూన్ 27కి వ్యూహాత్మకంగా మార్చారు. -
‘హరిహర వీరమల్లు’ వచ్చేస్తున్నాడు
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాలతో బీజీ కావడం వల్ల షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. దీంతో విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోవడంతో రిలీజ్ డేట్ని ప్రకటించారు. జూన్ 12నీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన ఆ బాధ్యల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఎ.ఎం. జ్యోతి కృష్ణ రంగంలోకి దిగి మిగిలిన భాగాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో' గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️🏹Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025! 💥 💥The battle for Dharma begins... 🔥⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVMPowerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi… pic.twitter.com/3KKNcspFIr— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 16, 2025 -
40ప్లస్ క్లబ్లో అనసూయ.. ఇదే గ్లామర్తో ఇంకెన్నాళ్లు?
దాదాపు ఓ పన్నెండేళ్ల క్రితం టీవీ చానెల్లో న్యూస్ ప్రెజెంటర్గా తన ప్రస్తానం ప్రారంభమైనప్పుడు తానే కాదు ఎవరూ ఊహించి ఉండరు.. ఇంతగా, ఇన్ని విధాలుగా అనసూయ(Anasuya Bharadwaj) తెలుగు వారికి దగ్గరవుతుందని. కేవలం పుష్కర కాలంలో పుష్కలమైన అవకాశాలు అందుకుంటూ అంతకంతకూ ఎదుగుతూ వచ్చిన అనసూయ...స్టార్ యాంకర్ నుంచి సిల్వర్ స్క్రీన్ స్టార్ దాకా దూసుకుపోయింది. తెలుగులో చిన్నితెర మీద యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్గా చేసిన ఎవరూ సాధించలేకపోయిన క్రేజ్ను ఆమె స్వంతం చేసుకుంది. ఓ వైపు యాంకర్గా పలు టీవీ షోస్లో కనిపిస్తూనే, మరోవైపు వెండితెర మీద కూడా తనదైన ముద్ర వేస్తోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాల్లోని ఆమె పాత్రలు సినీరంగంలో ఆమె అవకాశాలను విస్త్రుతం చేశాయి. ప్రస్తుతం అనసూయ చిన్నితెర మీద కావచ్చు, వెండితెర మీద కావచ్చు, పబ్లిక్ ఈవెంట్స్ లో కావచ్చు... ఫుల్ క్రే జ్ ఉన్న సెలబ్రిటీ అనడంలో అతిశయోక్తి లేదు అయితే ప్రస్తుతం సెలబ్రిటీల ఇమేజ్, పాప్యులారిటీని సరైన రీతిలో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. గతంలో ఒక నటి/నటుడు, యాంకర్ ఎవరైనా సరే తమ ప్రతిభ ద్వారా మాత్రమే అత్యున్నత స్థానాన్ని సాధించారని చెప్పేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాలు, రీల్స్...వగైరాలు వెల్లువెత్తుతూ సినీ విమర్శకుల్ని సైతం సెలబ్రిటీల స్థాయిపై విశ్లేషణలకు వీలు లేకుండా చేస్తూన్నాయి. మరోవైపు అనసూయ సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ. ఆమెను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంచిన వాటిలో ఆమె గ్లామర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనేది నిర్వివాదం. ఆ విషయం ఆమె కూడా గుర్తించింది కాబట్టే సినిమాల్లో కాకున్నా, సోషల్ మీడియాలో గ్లామరస్ పోస్టులు, వీడియోల ద్వారా మెరిపిస్తూ ఉంటుంది. తన దుస్తులు, వస్త్రధారణ విషయంలో వచ్చే విమర్శలకు ఘాటుగా బదులిస్తూ ప్రతి విమర్శలు చేస్తూ వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. వీటన్నింటి నడుమ... ఆమె దురదృష్టమో అదృష్టమో కానీ.. ఎన్ని వైవిధ్యభరిత చిత్రాల్లో నటించినా, అనసూయ అనగానే ఓ అందమైన అమ్మాయి అనే భావనే సినీ అభిమానుల్లో స్థిరపడిపోయింది.ఏదేమైనా దాదాపు పాతికేళ్లు పైబడిన వయసులో ‘షో’ బిజినెస్లోకి ఆరంగేట్రం చేసిన అనసూయ నిన్నటి(మే 15)తో ఫార్టీ ప్లస్ వయస్కుల క్లబ్లోకి చేరుతోంది. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా ఈ గ్లామర్ ఇకపై ఎంతకాలం నిలుస్తుందో తెలీదు. కాబట్టి ఇకపై నటనలో కూడా తనేంటో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా ఎంచుకున్నట్టే వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ.. గ్లామర్ డోస్ను తగ్గిస్తూ... అందమైన మహిళ అనే అభిప్రాయాన్ని మరిపిస్తూ.. అభినయ ప్రావీణ్యమున్న నటిగా కూడా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేయగలిగితే మరికొన్ని దశాబ్ధాల పాటు ఆమెకు తిరుగు ఉండకపోవచ్చు. -
ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్
యాంకర్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. గురువారం తన పుట్టినరోజుని కాస్త డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఈమె.. అక్కడి చిన్నారులతో ఆడుతూపాడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్)సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ పోస్ట్ పెడుతూ ఫాలోవర్స్ ని అలరించే అనసూయ.. మూడు నాలుగు రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి కూడా అడుగుపెట్టింది. లగ్జరీగా కట్టుకున్న ఇంటి ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది జరిగిన రెండు రోజులకే తన పుట్టనరోజు రావడంతో అనాథలకు పుస్తకాలు, ఫుడ్ పెట్టడంతో పాటు వాళ్లతో కలిసి డ్యాన్సులు కూడా వేసింది.అనసూయ కెరీర్ విషయానికొస్తే.. చివరగా పుష్ప 2 మూవీలో కనిపించింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త సినిమాలేం లేనట్లు తెలుస్తోంది. టీవీలో ఒకటి రెండు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఓటీటీలో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'.. ఉచితంగానే స్ట్రీమింగ్
విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. భారీ యాక్షన్ కాన్సెప్ట్తో నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఈ వీకెండ్లో ఇంట్లోనే చూసేయండి.ఏప్రిల్ 18న విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు భారత్లో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇప్పుడు సడెన్గా భారత్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు.అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. చివరకు వారిద్దరూ ఎలా కలుసుకున్నారు..? తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం ఏంటి? అనేదే మిగతా స్టోరీ. -
హాయ్.. తారక్, మే 20న నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంది: హృతిక్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్2' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా హృతిక్ ఒక శుభవార్త చెప్పారు. టీజర్ ఎప్పుడు విడుదలౌతుందో ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తన పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని తెలిసింది.హృతిక్ రోషన్(Hrithik Roshan) తాజాగా తారక్ను ట్యాగ్ చేస్తూ సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'హాయ్.. తారక్ ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..? సిద్ధంగా ఉండు నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది' అని ఆయన పంచుకున్నారు. ఈ సారాంశాన్ని చూస్తే వార్2 టీజర్ ఆరోజున విడుదల కావచ్చని తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆరోజు ఈ సినిమా నుంచి తప్పకుండా టీజర్ విడుదల కా 2019లో హిట్గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్గా ‘వార్ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్గా నటించనున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో షారుక్ఖాన్, సల్మాన్ఖాన్, హృతిక్ రోషన్లు రా ఏజెంట్ పాత్రలలో నటించి అక్కడ మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందుకున్నారు. అయితే, వార్2లో వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆపై ఈ మూవీలో హృతిక్ - ఎన్టీఆర్లపై అదిరిపోయే సాంగ్ను ప్లాన్ చేశారట . దాదాపు 500మంది డ్యాన్సర్లుతో వారు స్టెప్పులేశారట.Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2— Hrithik Roshan (@iHrithik) May 16, 2025 -
‘లెవన్’ మూవీ రివ్యూ
నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెవన్’. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. AR ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్,రేయా హరి నిర్మించిన ఈ చిత్రం నేడు(మే 16) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘లెవన్’ కథేంటంటే.. అరవింద్(నవీన్ చంద్ర) ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఏసీపీ హోదాలో వైజాగ్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్ కుమార్ (శశాంక్) డీల్ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. విలన్ క్రైమ్ చేయడం... పోలీసు అయిన హీరో ఆ కిల్లర్ని పట్టుకోవడం..అతనికో ప్లాష్ బ్యాక్ స్టోరీ..ఇలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల ఫార్మాట్ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘లెవన్’ ఈ విషయంలో ఇది కొంతవరకు సఫలం అయింది. విలన్ ప్లాట్ రొటీన్గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులను ముందుగా డీకోడ్ చేయడం కొంతవరకు కష్టమే. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను రెగ్యులర్గా చూసేవాళ్లు విలన్ ఎవరనేది కనిపెట్టినా.. వాళ్ల మైండ్తో కూడా గేమ్ ఆడేలా స్క్రీన్ప్లే ఉంటుంది. సినిమా ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సీరియల్ కిల్లింగ్ కేసు హీరో చేతికి వచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రీఇంటర్వెల్ నుంచి కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ప్లాష్బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇక చివరిలో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. ఈ కథకి లెవన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేదానితో పాటు ప్రతి సీన్కి లాజిక్ ఉంటుంది. మొత్తంగా ‘లెవన్’ సినిమా రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కథే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. నవీన్ చంద్రకు పోలీసు పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ మధ్య ఆయన ఎక్కువ ఇలాంటి పాత్రలే చేశాడు. ఇందులో ఏసీపీ అరవింద్గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీలాంగ్వేజ్, లుక్ నిజమైన పోలీసుల అధికారిని గుర్తు చేసేలా ఉంటుంది. హీరోయిన్ రియా హరి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఎస్సై మనోహర్గా దిలీపన్, పోలీసు ఉన్నతాధికారిగా ఆడుకాలం నరేన్, ఏసీపీ రంజిత్ కుమార్గా శశాంక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కిరీటీ, రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డి ఇమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతా ఉన్నాయి. -
మురళీ నాయక్పై 'మంగ్లీ' పాట.. కన్నీళ్లు తెప్పించే వీడియో
‘ఆపరేషన్ సిందూర్’లో మీరమరణం పొందిన మన తెలుగుబిడ్డ మురళీనాయక్పై సింగర్ మంగ్లీ ఒక పాట పాడారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో మంగ్లీ తెలిపారు. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించేలా ఆ సాంగ్ ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ ఆపరేషన్ సిందూర్లో భాగంగా సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగాడు. ఈ వార్తతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. వారికి అండగా రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు నిలిచారు. ఈ క్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులను మంగ్లీ కూడా కలిసి ఓదార్చారు. దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించాడని ఆమె కొనియాడారు. దేశంలోని ప్రతి మహిళ సిందూరంలో మురళీనాయక్ నిలిచి ఉంటాడని మంగ్లీ భావోద్వగభరితంగా చెప్పారు. ఇప్పుడు తాజాగా తన పాట రూపంలో ప్రపంచానికి తెలిపారు. -
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు సరసన కొద్దిరోజుల క్రితమే 'పద్మ భూషణ్' చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ అవార్డ్ ప్రాముఖ్యతలో దేశంలోనే మూడవ స్థానం ఉంది. ఏరంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవకు గుర్తుగా ఈ అవార్డుతో కేంద్రప్రభుత్వం గుర్తిస్తుంది. దేశంలో మూడో అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య తాజాగా ఒక లిక్కర్ (మద్యం) కంపెనీకి సంబంధించిన యాడ్లో నటించడం సోషల్మీడియాలో విమర్శలకు దారితీసింది.తాను మద్యం తీసుకుంటానని పలు వేదికల మీద బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా.. పలుమార్లు సినిమా వేడుకల సమయంలో తన కుర్చీ పక్కనే మద్యం మిక్స్ చేసిన బాటిల్ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఓటీటీలో బాలకృష్ణ చేసిన ఒక టాక్ షోకు కూడా తనకు ఇష్టమైన బ్రాండ్ కంపెనీనే స్పాన్సర్ చేసింది. అలా బాలయ్యకు ఆ బ్రాండ్తో చాలా అనుబంధం ఉంది. అంతవరకు ఫర్వాలేదు, దానిని ఎవరూ తప్పబట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం అదే బ్రాండ్కు ఆయన ప్రచార కర్తగా వ్యవహరించడాన్ని మాత్రం అంగీకరించలేం ఎందుకంటే ఒక సినీ నటుడిగా బాలకృష్ణ ఇలాంటి యాడ్ చేయడాన్ని ఎవరూ తప్పబట్టరు.. చాలామంది సినీ సెలబ్రిటీలు యాడ్స్ లో చేశారు. కానీ, ఇప్పుడు వారందరితో బాలయ్యను పోల్చలేం. ఆయనొక ఎమ్మెల్యే ఆపై అన్నింటికి మించి దేశంలోనే మూడో అత్యున్నత అవార్డు 'పద్మ భూషణ్'ను రీసెంట్గానే అందుకున్నారు. పేరు పక్కన అంతటి గౌరవం దక్కిన తర్వాత కనీసం కొంత అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశిస్తారు.కావాల్సినంత డబ్బు, పేరు ఉన్నాయి కదా.. మరీ ఇలాంటి మద్యం బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ఎందుకంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంలో బాలకృష్ణపై విమర్శలు వస్తున్నాయి. పద్మభూషణ్ అవార్డు అందుకొని నెల కూడా కాలేదు ఇంతలోనే ఒక లిక్కర్ కంపెనీ యాడ్ చేయడం ఏంటి అంటూ తప్పుబడుతున్నారు. బాలయ్య కాస్త అవార్డుకైనా విలువ ఇవ్వవయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారుBalayya Mansion House Drinking Water Teaser 🔥#NandamuriBalakrishna pic.twitter.com/wJwqoRRH16— NBK Cult (@iam_NBKCult) May 15, 2025 -
డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్
సౌత్ ఇండియా పాపులర్ నటి సమంత డేటింగ్లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంపై తన మేనేజర్ స్పందించారు. తాజాగా తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham) విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలో నటించారు. మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్లో భాగంగా ఆ చిత్ర యూనిట్తో పాటు దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రాజ్- సమంత ఇటీవల తరచూ ఒకే చోట కనిపించడంతో కొద్దిరోజులుగా రూమర్స్ వచ్చాయి. తాజా ఫొటోతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. వారు డేటింగ్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్పై సమంత మేనేజర్ స్పందించారు.డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మేనేజర్ అన్నారు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనంటూ తెలిపారు. సమంత నిర్మించిన శుభం సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసిన ఫోటోలను ఇలా తప్పుడు వార్తలకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్ తన కూతురితో పాటు సమంతతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడని వచ్చిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అసలు ఆయనకు కూతురే లేదన్నారు. తనతో పాటు ఉన్న అమ్మాయి కోడైరెక్టర్ కృష్ణ డీకే కూతురని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని సమంత మేనేజర్ కోరారు. -
మహేశ్ - రాజమౌళి సినిమాలో మరో పాన్ ఇండియా హీరో!
సూపర్స్టార్ మహేశ్బాబు- దర్శకుడు రాజమౌళి కలయికలో మొదలైన సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్తో కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, తాజాగా కోలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్స్ పైకి కూడా వస్తాడనేది నెట్టింట వైరల్ అవుతుంది.‘ఎస్ఎస్ఎంబీ29’ వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లోకి తమిళ స్టార్ హీరో విక్రమ్ జాయిన్ కాబోతున్నాడని సమాచారం. ఈమేరకు ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయట. గతంలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ గురించి మొదట రూమర్స్తోనే ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొంతకాలానికి అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మే నుంచి జూన్ వరకు ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో బిగ్ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ సీన్ నుంచే విక్రమ్ ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.‘ఎస్ఎస్ఎంబీ29’లో విక్రమ్ నటించబోతున్నట్లు గతేడాదిలోనే ఈ రూమర్స్ వచ్చాయి. అప్పుడు స్వయంగా విక్రమ్ ఇలా స్పందించాడు. 'రాజమౌళి, నేను రెగ్యూలర్గానే టచ్లో ఉంటాం. రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ, మహేష్ మూవీ గురించి మా మధ్య ప్రస్తుతానికి చర్చలు జరగలేదు' అని ఆయన తెలిపారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తనపై రూమర్స్ వచ్చినప్పుడు ఇలానే రియాక్ట్ అయ్యాడు. కొంత కాలానికి మహేష్ సినిమాలో తాను భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి విక్రమ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. -
హిట్3 నటి 'కోమలి ప్రసాద్' ఎవరో తెలుసా..?
ఇప్పుడు నటీనటులు ఒక్క భాషలో నటిస్తే చాలు. ఇతర భాషల్లోనూ ఇట్టే ఛాన్సులు అందిపుచ్చుకుంటున్నారు. అలా ఇతర భాషల్లోనూ అవకాశాలు పొందుతూ తమ సత్తాను చాటుకుంటున్నారు. అలా కోలీవుడ్లో పాగా వేయాలని ఆశపడుతున్న టాలీవుడ్ నటి కోమలి ప్రసాద్(Komalee Prasad). పదహారణాల తెలుగు అమ్మాయి అయినా ఈమె ప్రతిభ పాటవాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కోమలి ప్రసాద్లో నటి మాత్రమే కాకుండా ఒక వైద్యురాలు (డెంటిస్ట్), జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి. ఇప్పటికే తెలుగులో నెపోలియన్,హిట్2, రౌడీ బాయ్స్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్ తాజాగా నాని కథానాయకుడిగా నటించిన హిట్–3 చిత్రంలో ఏఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను కోమలి ప్రసాద్ పంచుకుంటూ హిట్–3 చిత్రంలో తాను పోషించిన ఎస్పీ వర్షా పాత్ర శారీరకంగానూ, మానసికంగానూ చాలెంజ్ అనిపించిందన్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్ అనిల్ వద్ద శిక్షణ పొందినట్లు చెప్పారు. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు ఆనంద భాష్పాలు వచ్చాయన్నారు. ఈ చిత్రంలో నానితో కలిసి నటించడం మంచి అనుభవం అని, ఆయన చాలా సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథా చిత్రంలోనూ నటించాలన్నది తన కలగా పేర్కొన్నారు. తమిళ చిత్రాలపై ఆశతో తమిళభాషను సరళంగా మాట్లాడడం నేర్చుకున్నానని చెప్పారు. సి. ప్రేమ్కుమార్, ఆల్ ఫోన్స్ పుత్తిరన్, మణికంఠన్, గౌతమ్మీనన్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు, అజిత్ ఎప్పటికీ తన ఫేవరెట్ అని, ఆయనతో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు కోమలి పేర్కొన్నారు. -
థగ్ లైఫ్ ట్రైలర్ రెడీ
హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై తెలుగులో విడుదల చేస్తున్నారు.కాగా ఈ సినిమా ప్రమోషనల్ ప్లాన్ను విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 17న ట్రైలర్ను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 24న హైదరాబాద్లో గ్రాండ్గా ఆడియో లాంచ్, 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ–రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు ప్రమోషనల్ ఈవెంట్స్కు ముందు చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో ఈ చిత్రం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్తో, ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ ఈవెంట్ జరపనున్నట్లు మేకర్స్ తెలిపారు.అలాగే పాన్ ఇండియా స్థాయిలో ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్స్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇదిలా ఉంటే... ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 38 సంవత్సరాల తర్వాత రానున్న ‘థగ్ లైఫ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. -
బాక్సాఫీస్ సెంటిమెంట్ వెలుగు... జీవనజ్యోతి
సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం... మండు వేసవి. దాదాపు 113 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో బెజవాడ అక్షరాలా ‘బ్లేజ్వాడ’గా ఠారెత్తిస్తోంది. వడగాడ్పులు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆ పరిస్థితుల్లో వాణిశ్రీ ప్రధానపాత్రలో, శోభన్బాబు హీరోగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జీవనజ్యోతి’ చిత్రం రిలీజైంది. ఆ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆ మండుటెండల్లోనే బాక్సాఫీస్ మలయమారుతమైంది. దేశంలో ఇందిరాగాంధీ సర్కార్ ఎమర్జెన్సీ విధించడానికి 40 రోజుల ముందు విడుదలై అటు ప్రకృతి, ఇటు సమాజంలోని ఆటుపోట్లకు అతీతంగా అఖండ విజయం అందుకుంది. సిల్వర్జూబ్లీ సూపర్హిట్గానే కాక, ఆ ఏడాది అత్యధిక వసూళ్ళు సాధించిన అరుదైన చిత్రంగా చరిత్రకెక్కింది. నిర్మాత డి.వి.ఎస్. రాజు సహా చిత్ర యూనిట్ అందరికీ చిరస్మరణీయ చిత్రంగా మిగిలిపోయింది. ‘జీవనజ్యోతి’ విడుదలై నేటితో 50 ఏళ్ళు. ఆ చిత్ర విశేషాలు... ఎన్టీఆర్ కంపెనీలోకి... శోభన్బాబుడి.వి.ఎస్. ప్రొడక్షన్స్, నిర్మాత డి.వి.ఎస్. రాజు పేరు చెప్పగానే ఆయన ఎన్టీఆర్తో నిర్మించిన ‘మంగమ్మ శపథం’ (1965) లాంటి పలు హిట్ చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాతో మొదలుపెట్టి వరుసగా పదేళ్ళ పాటు ఎన్టీఆర్తోనే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన నిర్మాత ఆయన. అలాంటి డి.వి.ఎస్. రాజు తొలిసారిగా వేరే హీరోతో తీసిన సినిమా – ‘జీవనజ్యోతి’. నిజానికి, పంపిణీ సంస్థ ‘విజయా’ పిక్చర్స్ అధినేత పూర్ణచంద్రరావు చెప్పడంతో, దర్శకుడు విశ్వనాథ్ వద్దకు వెళ్ళి ఈ కథ విన్నారు రాజు. ఈ కథను కూడా ఆయన ఎన్టీఆర్తోనే తీద్దామనుకున్నారట. కానీ, ఫస్టాఫ్లో హీరో కాలేజీ విద్యార్థిగా కనిపించడం లాంటివి ఉన్నాయని తటపటాయించారు. చివరకు ఎన్టీఆరే ‘మనం మరో కథతో సినిమా చేద్దాం. శోభన్బాబు లాంటి నవ తరం హీరోతో ఈ కథ తెరకెక్కించమన్నార’ట. అలా రెగ్యులర్గా ఎన్టీఆర్తో సినిమాలు చేసే కంపెనీలోకి హీరోగా శోభన్బాబు వచ్చి చేరారు. అలా వచ్చింది – ‘జీవనజ్యోతి’. ఆ సూపర్హిట్ తర్వాత ఆ అందాల నటుడు ఆ బ్యానర్లోనే ‘జీవితనౌక’ (1977), ‘కాలాంతకులు’ (1978), ‘దోషి – నిర్దోషి’ (1990) చేశారు. ఇక, ‘జీవనజ్యోతి’ కన్నా ముందు నుంచే విశ్వనాథ్తో ‘చిన్ననాటి స్నేహితులు’ (1971) లాంటి చిత్రాలు నిర్మించిన డి.వి.ఎస్. రాజు అటు తర్వాత కూడా ఆ సృజనశీలికి పెద్దపీట వేశారు. 1980ల దాకా ఆయన నిర్దేశకత్వంలో పలు చిత్రాలు తీస్తూ వచ్చారు.అయిదేళ్ళలో 4 ‘బంగారాల’ క్రేజీ కాంబినేషన్కొన్ని కాంబినేషన్లు కుదిరిన వేళావిశేషం అంతే. విశ్వనాథ్ – శోభన్బాబుల కాంబినేషన్ ‘జీవనజ్యోతి’ ముందు నుంచీ సూపర్డూపర్ సక్సెసే. కాసులతో పాటు కావలసినంత పేరూ తెచ్చింది. 1971 నుంచి 1973 దాకా వరుసగా మూడేళ్ళూ వారిద్దరి కలయిక (‘చెల్లెలి కాపురం’, ‘కాలం మారింది’, ‘శారద’) కమర్షియల్ హిట్. ఆ చిత్రాలన్నీ ఉత్తమ చిత్రాలుగా రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించినవే. ఒక్క ఏడాది గ్యాప్ తర్వాత 1975లో మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జీవనజ్యోతి’ కూడా బాక్సాఫీస్ వద్దే కాక అవార్డుల్లోనూ బంగారమే పండించింది. అదీ అప్పట్లో విశ్వనాథ్ – శోభన్బాబుల క్రేజీ కాంబినేషన్ ఘనత. మరో విశేషం ఏమిటంటే, మధ్యలో 1974లో వాళ్ళిద్దరి కలయికలో సినిమా రాలేదు కానీ, ఆ ఏడాది కూడా విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘ఓ సీత కథ’ (1974) బంగారు నందిని కాకున్నా, ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని గెలిచింది. ఆ 1974లో బంగారు నంది తెలుగు విప్లవవీరుడి జీవితకథా చిత్రమైన కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ను వరించింది.తెరపై ప్రతిభామూర్తుల త్రివేణీ సంగమం నిజానికి, ‘జీవనజ్యోతి’ సమయానికి శోభన్బాబు హీరోగా వరుస విజయాలతో తారాపథానికి ఎదిగారు. ప్రతిభాశాలి అయిన దర్శకుడు కె. విశ్వనాథ్ ఏమో మూడేళ్ళు వరుసగా ఉత్తమ చిత్రాలు అందించి, వాటికి రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించి, మంచి ఊపు మీదున్నారు. పైగా, ఆ మూడు చిత్రాల్లోనూ హీరో శోభన్బాబే. హీరోయిన్ వాణిశ్రీ అప్పటికే సమకాలికులు అందరినీ దాటుకుంటూ ఆల్రెడీ అగ్రతారగా ఎదిగారు. ఆంధ్రుల అభిమాన నటీమణిగా మార్కెట్లో వెలిగారు. టాప్ హీరోలు ఎన్టీఆర్ (‘కోడలు దిద్దిన కాపురం’, ‘దేశోద్ధారకులు’, ‘మాయా మశ్ఛీంద్ర’), ఏయన్నార్ (‘దసరా బుల్లోడు’, ‘ప్రేమ్నగర్’) సరసన తీరిక లేనంత బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆమెకు వచ్చింది. అందులోనూ మానసికంగా దెబ్బతిన్న ముసలి తల్లి పాత్ర, ఆ కన్నతల్లి కోసం చిన్నారి కొడుకును త్యాగం చేసే కూతురి పాత్ర... రెండూ పోషించాల్సిన డ్యుయల్ రోల్ ఆఫర్. అంతకు ముందే కన్నడంలో సంచలనం రేపిన ‘శరపంజర’ (1971) చిత్రానికి తెలుగు రీమేక్గా హీరో కృష్ణంరాజు తీసిన ‘కృష్ణవేణి’ (1974)లో మానసిక స్వస్థత కోల్పోయిన ఇల్లాలిగా నటించి పేరు తెచ్చుకున్నారు ‘కళాభినేత్రి’ వాణిశ్రీ. ఆ వెంటనే ఈ ‘జీవనజ్యోతి’లోని రెండు పాత్రలనూ మరో సవాలుగా తీసుకున్నారు. అలా అరుదైన దర్శకుడు, నాయికా నాయకుల కలయికలో నవరసాలూ రంగరించి, సప్తవర్ణాలతో ‘ఈస్ట్మన్ కలర్’లో తయారైంది – ‘జీవనజ్యోతి’.గోదావరి పొంగు లాంటి కోనసీమ పిల్ల లక్ష్మి (వాణిశ్రీ)ని చూసీచూడగానే ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు గుంటూరు పిల్లగాడు వాసు (శోభన్బాబు). అతనికీ, ఆ ఉమ్మడి కుటుంబానికీ జ్యోతిగా మెలుగుతున్న ఆమెకు అనుకోని ఓ విషాద ఘటనతో మతి చలిస్తుంది. ఆ విషాదాన్ని ఆమె మనసు నుంచి దూరం చేసి, ఆమెను ఎవరు, ఎలా మామూలు మనిషిని చేశారు? ఆ కుటుంబంలో మళ్ళీ ‘జీవనజ్యోతి’ ఎలా వెలిగిందన్నది ఈ సెంటిమెంట్ సినిమా. సినిమా ఫస్టాఫ్లో అల్లరిపిల్లగా కనిపించి, సెకండాఫ్లో పోగొట్టుకున్న తన బాబు కోసం ఆరాటపడే మతి భ్రమించిన మాతృమూర్తిగా కన్నీళ్ళుపెట్టించే లక్ష్మి పాత్రపోషణలోని రెండు విభిన్న ఛాయలను వాణిశ్రీ అద్భుతంగా అభినయించారు. అదే సమయంలో వయసు మళ్ళిన కన్నతల్లి కోసం తన ‘బాబు’ను త్యాగం చేసే కూతురు శోభ పాత్రనూ అంతే పరిణతితో పోషించారు. ‘సిన్ని ఓ సిన్నీ...’ అని పాటలు పాడే కోడెకారు కుర్రవాడి నుంచి మానసికంగా దెబ్బతిన్న భార్యను కాపాడుకోవడానికి తపించే భర్త వరకు జీవితంలోని వివిధ దశల్ని ప్రతిఫలించే వాసు పాత్రలో ఆ పరిణామాన్ని శోభన్బాబు తెరపై బాగా చూపారు. ముఖ్యంగా, చిన్నారి ‘బాబు’గా బేబీ వరలక్ష్మి కూడా రెండు పాత్రల్లో ఆ రోజుల్లో ప్రేక్షకుల మనసు చూరగొంది. రథం కింద బాబు పడిపోయే అత్యంత కీలకమైన దృశ్యం గగుర్పాటు కలిగించి, కన్నీరు తెప్పించింది. సినిమా కథను మలుపు తిప్పే ఆ సన్నివేశ చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ, జి.కె. రాము ఛాయాగ్రహణ నైపుణ్యం తెరపై సినిమా కాదు... నిజజీవిత ఘట్టం చూస్తున్నామన్నంత అనుభూతిని కలిగించాయి. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ సంస్థలో కలర్లో తీసిన తొలి సినిమా కూడా ఇదే. అందుకు తగ్గట్టే, నిర్మాత రాజు తాను పుట్టిపెరిగిన కోనసీమ ప్రాంత అందాలనూ, ఆహ్లాదం పంచే అరటి – కొబ్బరి తోటలనూ, గోదావరి నదీ తీర సౌందర్యాన్నీ పాటల్లో, సన్నివేశాల్లో చూపేలా గన్నవరం ఆక్విడెక్ట్ వద్ద, అమలాపురం దగ్గరలోని కోడూరుపాడు, అల్లవరం, వెన్నుమూరు లంక గ్రామాల్లో చిత్ర నిర్మాణం సాగించారు. ఆయన మేనమామ గారి ఊరైన కోడూరుపాడులోనే క్లిష్టమైన రథోత్సవం సీన్ చిత్రీకరణ సాగింది.అభిప్రాయ భేదాలున్నా... అదే అభిమానంసినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల్ని కథలో లీనమైపోయేలా తీసిన ప్రతిభ దర్శకుడిది. ప్రముఖ రచయిత ఆరుద్ర జీవిత భాగస్వామి – స్వయంగా ప్రఖ్యాత రచయిత్రి అయిన శ్రీమతి కె. రామలక్ష్మి ఈ చిత్రానికి మూలకథ సమకూర్చారు. దానికి విశ్వనాథ్ స్క్రీన్ప్లేతో సానపెట్టారు. (రామలక్ష్మి నవల ‘ఆడది’ ఈ చిత్రానికి మూలమని కొందరు రాస్తుంటారు. కానీ, 1967– ’68 ప్రాంతంలో ధారావాహికగా రాసిన ఆ చిన్న నవలకూ, ఈ సినిమాకూ పోలికే లేదు). అయితే, ఈ చిత్ర సందర్భంగా రామలక్ష్మి, విశ్వనాథ్ల మధ్య సృజనాత్మక అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆ తరువాత వారిద్దరూ ఎప్పుడూ కలసి పనిచేయలేదు. కానీ, చివరి వరకు పరస్పర గౌరవాభిమానాలు మాత్రం ఎప్పటిలానే కొనసాగడం నేటి తరానికి ఓ గొప్ప జీవనపాఠం.‘జీవనజ్యోతి’లో కె. విశ్వనాథ్ ఎప్పటిలానే విలక్షణమైన క్యారెక్టర్లు, వాటికంటూ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్లతో పాటు తనదైన మార్కుతో కథలో అంతర్భాగంగానే రాజబాబు, రమాప్రభ జంటతో హాస్యం చిలికించారు. ఆయన చిరకాల మిత్రుడు, సహాధ్యాయి అయిన సముద్రాల జూనియర్ సంభాషణల్లో తన పట్టును మరోసారి ఈ చిత్రంలో చూపారు. అఫ్కోర్స్... ఆ రచనలో విశ్వనాథ్ గారి అదృశ్యహస్తమూ ఉందనేది బహిరంగ రహస్యం. సాక్షాత్తూ చిత్ర నిర్మాత డి.వి.ఎస్. రాజు సైతం బాహాటంగా చెప్పిన సత్యం.ఇంటింటా మోగిన ఆ పాటలు‘ఇంత మంచి చిత్రం ఇటీవల రాలేదనీ, ఇది సినిమా కాదు... జీవితమనీ’ ఈ సినిమాకు జనం నీరాజనాలు పట్టారు. ఆ రోజుల్లో ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు...’ (గానం – పి. సుశీల) పాట మోగని ఇల్లు లేదు. పాడని తల్లి లేదు. ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో...’ (గానం – బి. వసంత, పి. సుశీల) అంటూ సినిమాలో కీలకమైన పిల్లాడి పాత్ర మీద వచ్చే పాట అప్పట్లో ఆబాలగోపాలానికీ ఆల్టైమ్ ఫేవరెట్. డ్యూయెట్లలో ‘సిన్ని ఓ సిన్నీ... ఓ సన్నజాజుల సిన్నీ...’ పాట అన్ని దిక్కుల ప్రేక్షకుల్నీ ఊపేసింది. కొత్తగా పెళ్ళయిన జంట మీద వచ్చే ‘ఎందుకంటే ఏమి చెప్పను... ఏమిటంటే ఎలా చెప్పను...’ గీతం యువ ప్రేక్షకుల్ని స్వానుభవాల ఊహలలో తేలియాడించింది. వెరసి, ‘పూతరేకుల తీయదనం... పాలమీగడ కమ్మదనం’ నిండిన సినారె సాహిత్యం, కె.వి. మహదేవన్ సంగీతం, విశ్వనాథ్ మార్కు సంగీత – సాహిత్యాభిరుచి త్రివేణీ సంగమమై, పాటల పల్లకీలో ఈ మ్యూజికల్ హిట్ చిత్రాన్ని ఊరూరా బాక్సాఫీస్ వద్ద ఊరేగించాయి.దర్శకేంద్రుణ్ణి వెనక్కి నెట్టిన కళాతపస్వి!సరిగ్గా ఆ ఏడాదే, అదీ శోభన్బాబు హీరోగానే ‘బాబు’ చిత్రంతో కె. రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు. ‘జీవనజ్యోతి’కి సరిగ్గా 14 రోజుల ముందు 1975 మే 2న ఆ సినిమా రిలీజైంది. భారీ తారాగణం, ఖరీదైన సెట్లతో సహా అన్ని రకాల హంగులు, ‘ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన...’ లాంటి పాపులర్ పాటలతో ఆ చిత్రం రిలీజైంది. కొత్త దర్శకుడైనా, ఖరీదైన టేకింగ్తో సినిమా ఫరవాలేదని అనిపించుకుంటున్న తరుణంలో సరిగ్గా 2 వారాలకు శోభన్బాబే నటించిన కె.విశ్వనాథ్ ‘జీవనజ్యోతి’ అనుకోని పోటీగా అవతరించింది. మనసుకు పట్టే పాటలు, మహిళల్ని కట్టిపడేసే సెంటిమెంట్తో ‘జీవనజ్యోతి’ సమకాలపు సినిమాలన్నిటినీ చిత్తు చేసి, బాక్సాఫీస్ విన్నరైంది. ఇంకా చెప్పాలంటే, ఆ ఏడాది తెలుగులో వచ్చిన చిత్రాలన్నిటిలోకీ అత్యధిక వసూళ్ళు ఆ సినిమావే!‘‘అప్పట్లో విశ్వనాథ్ గారి ‘జీవనజ్యోతి’ హోరులో నా తొలిచిత్రం ‘బాబు’ అడ్రస్ గల్లంతైంది’’ అని రాఘవేంద్రరావే స్వయంగా అంగీకరించారు. కలెక్షన్ల రీత్యా ‘బాబు’ యావరేజ్ సినిమాగా నిలిచినా, మితిమీరిన చిత్ర నిర్మాణ వ్యయం కారణంగా ట్రేడ్ లెక్కలో ఆ సినిమా ఫెయిల్యూర్గా మిగిలింది. తర్వాతి కాలంలో అదే రాఘవేంద్రరావు వసూళ్ళవర్షం కురిపించే కమర్షియల్, మాస్ చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అదే కె. విశ్వనాథ్ అభిరుచి గల కళాత్మక చిత్రాలతోనూ కాసులు కురిపించిన సినీ తపస్విగా సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. అదీ విశేషం.సిల్వర్ జూబ్లీ సూపర్హిట్ ‘జ్యోతి’! ఆ రోజుల్లో ‘జీవనజ్యోతి’ మొత్తం 32 కేంద్రాల్లో రిలీజై, అశేష ప్రేక్షకాదరణతో ఏకంగా 31 సెంటర్లలో 50 రోజులు ఆడింది. అదే ఊపులో 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. నిజానికి, మరిన్ని కేంద్రాల్లో నూరు రోజుల పండుగ చేసుకోవాల్సి ఉన్నా, దిగువ కేంద్రాలకు త్వరగా కొత్త సినిమా పంపడం కోసం పంపిణీదారులైన విజయా పిక్చర్స్ వారి పద్ధతైన 50 – 50 శాతం షేర్ వసూళ్ళ షరతు అవరోధమైంది. అలా కొన్ని సెంటర్లలో 80, 90 రోజులు పూర్తయ్యాక కూడా శతదినోత్సవ ఘనత రాకుండానే ‘జీవనజ్యోతి’ని థియేటర్ నుంచి తప్పించిన తార్కాణాలున్నాయి. ఏమైనా, హైదరాబాద్లో మాత్రం ఈ చిత్రం షిఫ్టులతో 25 వారాలు నడిచింది. హైదరాబాద్లోని అమీర్పేటలో విజయలక్ష్మీ టాకీస్లో ఆ ఏడాది నవంబర్ 6న అలా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడు నెలలకు 1975లోనే డిసెంబర్లో వచ్చిన శోభన్బాబు ‘సోగ్గాడు’ సైతం పెద్ద హిట్. అది కూడా 32 కేంద్రాల్లోనే రిలీజై, 31 కేంద్రాల్లో 50 రోజులు జరుపుకోవడం విశేషం. అయితే, ఆ చిత్రం 19 సెంటర్లలో వంద రోజులాడినా, రజతోత్సవ ఘనత దక్కలేదు. చాలామందికి తెలియనిదేమిటంటే, శోభన్ కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ హిట్ అని అందరూ అనుకొనే ‘సోగ్గాడు’ కన్నా ‘జీవనజ్యోతి’దే వసూళ్ళలో పైచేయి. ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. టికెట్ రేట్లు ఎక్కువుండే ఏసీ, డీలక్స్ థియేటర్లలో ‘సోగ్గాడు’ రిలీజైన కాకినాడ, నెల్లూరు టౌన్లను మినహాయిస్తే, మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ వసూళ్ళు వచ్చింది – ‘జీవనజ్యోతి’కే! ‘జీవనజ్యోతి’ వసూళ్ళ రేంజ్ అదీ!ఈ చిత్రం హిట్ రేంజ్కు మచ్చుకు ఓ ఉదాహరణ – కీలకమైన గుంటూరు కేంద్రం బాక్సాఫీస్ కథ. చలనచిత్ర చరిత్రలో... గుంటూరు టౌన్లో రూ. 4 లక్షల పైచిలుకు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా – ఈ ‘జీవనజ్యోతే’. ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ళకు ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ (1977) అంతటి వసూళ్ళతో, ఆ ఘనత సాధించిన రెండో సినిమా అయింది. విశేషం ఏమిటంటే, మిగతా హీరోలంతా గుంటూరులో ఆ మైలురాయి వసూళ్ళకు చేరుకోవడానికి దాదాపు అయిదారేళ్ళ సమయం పట్టింది. కృష్ణకు ‘ఊరుకి మొనగాడు’ (1981), కృష్ణంరాజుకి ‘సీతారాములు’ (1980), ఏయన్నార్కి ‘ప్రేమాభిషేకం’ (1981) వచ్చేవరకు గుంటూరులో ఆ 4 లక్షల మైలురాయి లేదన్నది బాక్సాఫీస్ విశ్లేషకుల మాట. సాక్షాత్తూ శోభన్బాబు సైతం ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడేళ్ళకు ‘దేవత’ (1982 సెప్టెంబర్ 10 రిలీజ్) వచ్చేవరకు మరోసారి ఆ రూ. 4 లక్షల ఘనత గుంటూరులో సాధించలేదు. అయితే, ఆ నడిమధ్య కాలంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు మాత్రం రూ. 4 లక్షల‡మైలురాయిని దాటి, వసూలు చేశాయి. అదీ ‘జీవనజ్యోతి’ హిట్ రేంజ్! శోభన్బాబు కెరీర్లో టాప్ ఇయర్!స్వీయ నిబంధనలకు తగ్గట్టు నటించి, ఇంకా క్రేజ్, ఇమేజ్ ఉన్నా సరే సొంత ఆలోచనలకు తగ్గట్టే నటన విరమించిన అందాల నటుడు, ‘నటభూషణ’ శోభన్బాబుది చిరస్మరణీయమైన సినీ జీవితం. అంతటి కెరీర్లోనూ ఆయనకు శిఖరాయమాన సంవత్సరమంటే – ‘జీవనజ్యోతి’ రిలీజైన 1975యే! టాప్ హీరో ఎన్టీఆర్ గణనీయమైన సంఖ్యలో సినిమాలు చేస్తున్నా, హిట్లూ – కలెక్షన్లూ వస్తూనే ఉన్నా, జనం ఆగి అబ్బురపడేటంత భారీ బాక్సాఫీస్ హిట్లు రాని ఏడాది అది. మరో అగ్రహీరో ఏయన్నార్ అంతకు ముందే అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చారు. సినిమాలకు విరామమిచ్చి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో, ఆ ఏడాది ఆయనకు రిలీజులే లేవు. శోభన్కు సాటివాడైన హీరో కృష్ణ చకచకా సినిమాలు చేస్తున్నప్పటికీ, క్రిందటేడు ‘అల్లూరి సీతారామరాజు’ (1974) తెచ్చిన ఇమేజ్ దెబ్బతో, ‘పాడిపంటలు’ (1976) వరకు సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతున్న విచిత్రమైన సంవత్సరం అది.అలాంటి చిత్రమైన సందర్భంలో శోభన్బాబు పట్టిందల్లా బంగారమైంది. ఆ 1975లో శోభన్ సినిమాలు మొత్తం 8 రిలీజయ్యాయి. అందులో 5 (‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘జీవనజ్యోతి’, ‘బలిపీఠం’, ‘జేబుదొంగ’, ‘సోగ్గాడు’) హిట్లు . రెండే (‘గుణవంతుడు’, ‘అందరూ మంచివారే’) ఫ్లాపులు. ఒకటి మాత్రం (‘బాబు’) యావరేజ్. అయిదు హిట్లలోనూ ‘జీవనజ్యోతి’ ఒకటే 25 వారాలు ఆడి, సిల్వర్జూబ్లీ చేసుకుంది. ఏయన్నార్కి పర్మినెంట్ నిర్మాతైన డి. రామానాయుడు తీసిన ‘సోగ్గాడు’ సైతం రజతోత్సవానికి ఒక వారం ముందే థియేటర్ల నుంచి వైదొలగింది. అలా ఒకే ఏడాది అధికశాతం కమర్షియల్ సక్సెస్లతో శోభన్బాబు క్రేజు పెరిగిపోయింది. పరిశ్రమలో ఆయన రేంజే మారిపోయింది.హిందీలోనూ హిట్టయిన మదర్ సెంటిమెంట్! బాక్సాఫీస్ రికార్డులే కాదు... విమర్శకుల రివార్డులు, ప్రభుత్వ – ప్రైవేటు అవార్డుల్లోనూ ‘జీవనజ్యోతి’కి అగ్రతాంబూలం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో ఆ ఏడాదికి బంగారు నంది అందుకున్న ఉత్తమ చిత్రం అదే! (అప్పటికింకా వ్యక్తిగత విభాగాల్లో ప్రత్యేకంగా నంది అవార్డులు ఇవ్వడమనే ఆనవాయితీ లేదు. ఉత్తమ చిత్రం అవార్డు కింద నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లను అందరినీ గౌరవించేవారు. అలా ‘జీవనజ్యోతి’ ప్రధాన బృందం అంతటికీ గౌరవం దక్కింది). ఇక, పాపులర్ అవార్డులైన ‘ఫిల్మ్ఫేర్’లోనూ దక్షిణాదిన ఈ సినిమాదే హవా. ఉత్తమ తెలుగు సినిమా, ఉత్తమ దర్శకుడు (కె. విశ్వనాథ్), ఉత్తమ నటుడు (శోభన్బాబు), ఉత్తమ నటి (వాణిశ్రీ)... ఇలా అవార్డుల పంట పండింది. ఇదే సినిమా దశాబ్ద కాలం తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలోనే హిందీలో జితేంద్ర, జయప్రదలతో ‘సన్జోగ్’ (1985)గా రీమేకైంది. అక్కడా ఈ కథ హిట్. కథానాయికగా జయప్రదకు మంచి పేరు తెచ్చింది. ఉత్తమ నటిగా ఆమె ‘ఫిల్మ్ఫేర్’కు నామినేటైంది. చిత్రమేమంటే, ఈ తెలుగు సూపర్హిట్ సినిమా 21 ఏళ్ళ తర్వాత కన్నడంలోనూ వచ్చింది. విష్ణువర్ధన్, ఆమనితో ‘బాళిన జ్యోతి’ (1996)గా క్రాంతికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘లేడీస్ స్పెషల్ షో’ ట్రెండ్!విశేషమేమిటంటే, అదే ఏడాది ప్రపంచ మహిళా సంవత్సరం. ఈ సెంటిమెంట్ సినిమాకు స్త్రీలు పోటెత్తడంతో, కొన్ని తరగతుల టికెట్లు, కొన్ని షోలు ఆడవారికే ప్రత్యేకంగా కేటాయించేవారు. మూకీలు పోయి టాకీలొచ్చాక, తెలుగు సినిమా ఆధునికతను సంతరించుకున్నాక ఈ ‘లేడీస్ స్పెషల్ షో’ ట్రెండ్కూ ఈ ‘జీవనజ్యోతే’ నాంది!ప్రాంతాలు, భాషల తేడా లేకుండా ‘జీవనజ్యోతి’లోని సార్వత్రికమైన తల్లి సెంటిమెంట్ అన్నిచోట్లా పండింది. ఆ సింపుల్ సెంటిమెంట్ కథ... విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, వాణిశ్రీ అభినయ వైదుష్యం, అందాల శోభన్బాబు క్రేజీ ఇమేజ్, పదే పదే పాడుకోవాలనిపించే పాటలతో ఇవాళ తెరపై చూసినా తాజాగా అనిపించడం చెప్పుకోదగ్గ గొప్పదనం.– రెంటాల జయదేవ -
పోటాపోటీగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్
భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే) బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.త్రీ ఇడియట్స్ కాంబినేషన్... భారతీయ తొలి ఫీచర్ ఫిల్మ్ దర్శక–నిర్మాతగా ‘రాజా హరిశ్చంద్ర’తో చరిత్రలో నిలిచిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో టైటిల్ రోల్ని ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఈ చిత్రానికి రాజ్కుమార్ హీరాణీ దర్శకత్వం వహించనున్నారు. ‘త్రీ ఇడియట్స్’ (2009), ‘పీకే’ (2014) వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత హీరో ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్కుమార్ హీరాణీ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సినిమా కోసం వర్క్ చేయనుండటం విశేషం. రాజ్కుమార్ హీరాణీ, అభిజిత్ జోషీ, హిందూకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్లు ఈ బయోపిక్కు నాలుగేళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ బయోపిక్ చిత్రీకరణ అక్టోబరులో ఆరంభం అవుతుందట. ఇక ఈ చిత్రానికి దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసాల్కర్ తన వంతు సహకారం అందించనున్నారని బాలీవుడ్ టాక్.మేడ్ ఇన్ ఇండియా... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023 సెప్టెంబరులో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ (హిందీ చిత్రం ‘నోట్బుక్’ ఫేమ్) ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.ఆ తర్వాత ఈ సినిమా గురించిన అప్డేట్ ఏదీ బయటకు రాలేదు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్కు మేకర్స్ ఎన్టీఆర్ను సంప్రదించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారనే వార్తలు తాజాగా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోపే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ను ఆమిర్ ఖాన్ చేస్తున్నట్లుగా గురువారం అధికారిక ప్రకటన వచ్చింది. -
థాయ్లాండ్లో మంచు లక్ష్మీ చిల్.. శారీలో బిగ్బాస్ బ్యూటీ విష్ణు ప్రియ హోయలు!
థాయ్లాండ్లో చిల్ అవుతోన్న మంచు లక్ష్మి..బాలీవుడ్ భామ దిశా పటానీ అలాంటి పోజులు..పెళ్లి తర్వాత లండన్లో ఎంజాయ్ చేస్తోన్న అభినయ..శారీలో బిగ్బాస్ బ్యూటీ విష్ణు ప్రియ హోయలు..థాయ్లాండ్లో కావ్య థాపర్ వేకేషన్.. View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
'ప్రేమించడం.. ప్రేమించబడటం.. రెండూ కర్మలే'.. ఆసక్తిగా టీజర్
దేవన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'కృష్ణలీల'. ఈ చిత్రాన్ని హీరో దేవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. 'ప్రేమించడం.. ప్రేమించబడటం.. రెండూ కర్మలే.'.. ప్రేమ అనే ధర్మం దేవతలైనా.. రాక్షసులైనా.. యోగి అయినా..భోగి అయినా ఎవరైనా అనుభవించాల్సిందే' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది.టీజర్లో 'ఈ ప్రేమను అనైతికంగా అనుభవించాలనుకున్నా.. దూరం పెట్టాలనుకున్నా.. అది నీకు సరైన పాఠం నేర్పుతుంది' అనే డైలాగ్ వింటే ప్రేమ అనే కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వినోద్ కుమార్ , పృధ్వీ, రవి కాలే , తులసి, సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. -
రాంగ్ రూట్ కేసు.. విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయనపై కేసు నమోదు కావడంతో జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు వచ్చారు. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో కారు నడపడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అవసరమైతే మరోసారి కోర్టు విచారణకు రావాలని ఆయనకు పోలీసులు సూచించారు. ఇప్పటికే హీరో కారును సీజ్ చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు.(ఇది చదవండి: దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!)అసలేం జరిగిందంటే..జూబ్లీహిల్స్లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న బెల్లకొండ శ్రీనివాస్ ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం భైరవం మూవీలో నటిస్తున్నారు. -
'ధర్మం దారి తప్పినప్పుడు.. వచ్చినవాడు గౌతమ్'.. ఆసక్తిగా టీజర్
అశ్విన్ బాబు లీడ్ రోల్ నటిస్తోన్న తాజా చిత్రం 'వచ్చినవాడు గౌతమ్'. ఈ చిత్రంలో రియా సుమన్, అయేషాఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మామిడాల ఎం ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 'ధర్మం దారితప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో అజయ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, సాయి రోనక్, అభినయ, నెల్లూరు సుదర్శన్, వైవా రాఘవ, విద్యులేఖ, షకలకశంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గౌర హరి సంగీతమందిస్తున్నారు. -
ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన రష్మిక!
బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఆనంద్, వైష్ణవి మరోసారి లవ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన పూజా కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా క్లాప్ కొట్టగా.. శివాజీ కెమెరా స్విచ్చాన్ చేయగా.. డైరెక్టర్స్ వెంకీ అట్లూరి. కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ అందించారు. జూన్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ లవ్ స్టోరీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. And it begins for the MOST RELATABLE LOVE STORY 😍@SitharaEnts Production No. 32 takes off with a pooja ceremony full of love ❤️&Regular shoot commences this June 🫶🏻Clap by @iamRashmika Camera Switch On by @ActorSivajiScript handover by #VenkyAtluri & @kalyanshankar23… pic.twitter.com/POVPgdqhco— Sithara Entertainments (@SitharaEnts) May 15, 2025 -
దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!
సాక్షి, బంజారాహిల్స్: రాంగ్రూట్లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai srinivas)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ జర్నలిస్ట్కాలనీలో నివసించే బెల్లంకొండ శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 వైపు నుంచి జర్నలిస్ట్కాలనీ వరకు వచ్చి చౌరస్తాలో రాంగ్రూట్లో తన ఇంటికి వెళుతుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అతడిని అడ్డుకున్నాడు. (చదవండి: రాంగ్ రూట్ లో కారు నడిపిన తెలుగు హీరో)దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించడమేగా అతడి పైకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. దీంతో కానిస్టేబుల్ భయంతో పక్కకు తొలగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా? అన్న విషయం తేలాల్చి ఉంది. శ్రీనివాస్ను స్టేషన్కు పిలిపించి విచారించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజ్ భుజంపై వాలిన సమంత.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru), హీరోయిన్ సమంత(samantha) ప్రేమలో ఉన్నారనే వార్త గతకొంత కాలంగా నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ సక్సెస్ సెలెబ్రేషన్స్లో భాగంగా చిత్రబృందం రాజ్ నిడిమోరుతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సమంత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా..అవికాస్త వైరల్గా మారాయి. రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతారని, ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోని షేర్ చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేశారు. వారిద్దరు డేటింగ్లో ఉన్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్ సతీమణి శ్యామాలి(Shhyamali De) తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నాను’అని అమె ఇన్స్టాలో రాసుకొచ్చారు. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శ్యామాలి సమంత ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. శ్యామాలి ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టారనేది తెలియదు కాని..నెటిజన్స్ మాత్రం సమంత,రాజ్ల గురించే ఈ పోస్ట్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు. కాగా, రాజ్, శ్యామాలిల వివాహం 2015లో జరిగింది. వీరిద్దరి ఒక పాప కూడా ఉన్నారు. పెళ్లికి ముందు శ్యామాలి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్లో సాయం చేస్తుండేవారు. అయితే గతకొంత కాలంగా రాజ్, శ్యామాలి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే వారిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. -
‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’పై విజయ్ దేవరకొండ!
తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ పత్రిక 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తన తాజా ఎడిషన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండను ప్రచురించింది. "విజయ్ దేవరకొండ: ది మ్యాన్ ఆన్ ఎ మిషన్" అనే ఆకర్షణీయ టైటిల్తో విడుదలైన ఈ మ్యాగజైన్ దృష్టిని సొంతం చేసుకుంటోంది. "ఆత్మవిశ్వాసం, ఆకర్షణతో నిండిన విజయ్ దేవరకొండను మేము క్యాప్చర్ చేశాం. తన రాబోయే చిత్రం 'కింగ్డమ్'తో విజయ్ ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు" అని 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తమ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొంది.విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన పాన్-ఇండియా చిత్రం "కింగ్డమ్"తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. "కింగ్డమ్" జూలై 4, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ మరియు జోమన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్తో ఈ చిత్రం సాంకేతికంగా కూడా ఉన్నతంగా రూపొందుతోంది. 'కింగ్డమ్' విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
RAPO 22: ఆంధ్రాకింగ్ తాలుకా.. టికెట్ ఇవ్వాల్సిందే..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం ‘RAPO 22’ టైటిల్ గ్లింప్స్ను విడుదల చేసి అభిమానుల్లో సందడి రేపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందుతోంది. నేడు (మే 15) రామ్ బర్త్డేను పురస్కరించుకుని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka) అనే టైటిల్ను ఆకర్షణీయమైన గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.ఈ గ్లింప్స్ ఒక కిక్కిరిసిన థియేటర్ వెలుపల అభిమానుల కోలాహలంతో ప్రారంభమవుతుంది. అక్కడ ‘ఆంధ్ర కింగ్’ సూర్య కుమార్ (ఉపేంద్ర) కొత్త సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎమ్మోర్వో నుంచి ఎమ్మెల్యే వరకు వీఐపీ రిఫరెన్స్లతో టికెట్లు తీసుకోవడంతో విసిగిపోయిన థియేటర్ యజమాని వద్దకు రామ్ సైకిల్పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అభిమానిగా చెప్పగానే యజమాని టికెట్లను అందజేస్తాడు. వాటిని తీసుకున్న రామ్ తోటి అభిమానులతో సంబరాలు చేసుకుంటాడు. అనంతరం సూర్య కుమార్ భారీ కటౌట్పై పూల వర్షం కురిపిస్తూ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని అరవడంతో టైటిల్ కార్డ్ పడుతుంది.పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.మరోవైపు, సోషల్ మీడియాలో రామ్ పోతినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు #HappyBirthdayRAPO హ్యాష్ట్యాగ్తో ఈ టైటిల్ గ్లింప్స్ను షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2, 2025న విడుదల కానుందని సమాచారం. -
దేశభక్తిని రగిలించే సినిమా.. తెలుగులో విడుదల
జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2). ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 23న టాలీవుడ్లో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్లైన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. అక్షయ్ కుమార్ నటించిన దేశభక్తి చిత్రాల్లో ‘కేసరి’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా ‘కేసరి: ఛాప్టర్ 2’ను మేకర్స్ రూపొందించారు. ప్రముఖ రచయితలు రఘు, పుష్ప పలాట్ రచించిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ ఆధారంగా కరణ్ సింగ్ దీన్ని తెరకెక్కించారు. కేసరి చాప్టర్2 సినిమాకు కూడా బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్వాలా బాగ్ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. హిందీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిన ఈ చిత్రం మే 23న తెలుగులో కూడా విడుదల కానుంది. గంతంలో ఛావా సినిమా కూడా మొదట హిందీలో విడుదలై ఆ తర్వాత తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.దేశభక్తిని రగిలించే కోర్టు రూం డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను బ్రిటీష్ ప్రభుత్వం కచ్చితంగా చూడాలని అక్షయ్ కుమార్ గతంలో కోరారు. ఆ ప్రభుత్వంతో పాటు కింగ్ చార్లెస్ కూడా ఈ చిత్రాన్ని చూసి వారి తప్పులను ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. ఈ సినిమా చూశాక వారు కచ్చితంగా క్షమాపణలు చెబుతారని ఆయన అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు, దర్శకుడు సుందర్ సి కలిసి నటించిన 'గ్యాంగర్స్' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబట్టింది. ఖుష్బు సుందర్ నిర్మించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.'గ్యాంగర్స్' తమిళ యాక్షన్ కామెడీ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, మునిష్కాంత్, భగవతి పెరుమాల్ నటించగా వెంకట్ రాఘవన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు. ఒక చిన్న పట్టణంలో ఉండే పాఠశాలలో ఒక బాలిక తప్పిపోతుంది, ఉపాధ్యాయురాలు సుజిత (కేథరిన్ థ్రెసా) ఆమెను కనుగొనమని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు ఓ పోలీసు అధికారి రహస్యంగా అదే స్కూల్లో పీటీగా అండర్ కవర్లో నియమించబడతారు. పోలీస్ అధికారి రాకతో అసలు పీటీ (వడివేలు) పరిస్థితి ఏంటి..? ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలోనే కథ మరో మలుపు తిరుగుతుంది. స్థానికంగా ఉండే ముగ్గురు రౌడీల వద్ద ఉన్న డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు. వీరికి, తప్పిపోయిన బాలికకు ఉన్న లింక్ ఏంటి..? వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. -
'ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా' బయోపిక్లో ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- దర్శకుడు రాజమౌళి మళ్లీ ఒక సినిమా కోసం కలవబోతున్నారు. వీరిద్దరూ కలిసి ఒక బయోపిక్ను తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు చర్చలు జరిపారని సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో తారక్ నటించనున్నారట. ఈమేరకు బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. దాదాసాహెబ్ జీవితం అందరినీ ప్రభావితం చేసేలా ఉండటంతో దానిని ఒక సినిమాగా తెరకెక్కించి ప్రపంచానికి చూపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.భారతీయ సినిమా పితామహుడి బయోపిక్ నిర్మించేందుకు 'మేడ్ ఇన్ ఇండియా' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. సుమారు రెండేళ్ల క్రితమే రాజమౌళి ఈ టైటిల్ను ప్రకటించారు. అయితే, నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి.దాదాసాహెబ్ ఫాల్కే (Dhundiraj Govind Phalke), ఆయనను భారతీయ సినిమా పితామహుడిగా పిలుస్తారు. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ప్లే రచయితగా పేరుపొందారు. 1870 లో జన్మించిన ఆయన 1944 లో కన్నుమూశారు. 1913లో భారతదేశ మొదటి సినిమా "రాజా హరిశ్చంద్ర"ను ఆయనే తెరకెక్కించారు. అక్కడి నుంచి మొదలైన మన ప్రయాణం నేడు ప్రపంచస్థాయి గుర్తించే దిశగా అడుగులేస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే భారత చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏర్పాటు చేసింది. భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. -
ఏపీ పోలీస్ ఆఫీసర్గా బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఏపీ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఎప్పుడూ ఫుల్ లెన్త్ సినిమాలు చేసే బాలయ్య తొలిసారి రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనువిందు చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. సన్పిక్చర్స్ సంస్థ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 2023లో విడుదలైన జైలర్లో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్కుమార్, మోహన్లాల్, జాకీ ష్రాఫ్ల పర్ఫామెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఇందులో కూడా వారందరూ నటించనున్నారు. ప్రస్తుతం వారి సరసన టాలీవుడ్ నుంచి బాలకృష్ణ చేరనున్నట్లు సమాచారం.రజనీకాంత్ కోసం జైలర్2లో నటించేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేసిందని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పోలీస్ ఆఫీసర్గా రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహా వంటి సినిమాల్లో ఆయన మెప్పించారు. ఇప్పుడు చాలారోజుల తర్వాత జైలర్2 కోసం పోలీస్ యూనిఫామ్ ధరించనున్నారు. రజనీకాంత్, బాలయ్య మధ్య భారీ ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందని, అదికూడా సుమారు 5నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.జైలర్2తో తాను నటించబోతున్నట్లు రీసెంట్గా శివరాజ్కుమార్ ఫైనల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మేనన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సీక్వెల్లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లో జైలర్2 విడుదల చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నారు. -
నటుడు సంతానంకు నోటీసులు
తమిళ నటుడు సంతానంకు తిరుపతికి చెందిన ఓ బీజేపీ నేత నోటీసులు పంపారు. సంతానం కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్’ నిహారిక ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, ఆర్యకు చెందిన షో పీపుల్ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈచిత్రంలో శ్రీ వేంకటేశ్వరభక్తి గీతాలు శ్రీనివాస గోవిందా అనే పాటను పొందుపరిచారు. ఈ పాటలో నటుడు సంతానం నటించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీవేంకటేశ్వరస్వామి భక్తి గీతాన్ని డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రంలో పొందుపరిచి భక్తుల మనోభావాలను గాయపరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా తిరుమల, తిరుపతి పోలీస్స్టేషన్లలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంతానంపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేత దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ చిత్ర విడుదలను నిషేధించాలని, ఆ చిత్రంలో భక్తి గీతాన్ని తొలగించాలని, ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్ చానళ్ల ద్వారా భక్తుల్లోకి వెళ్లి వారి మనోభావాలను గాయపరిచినందుకుగాను నష్టపరిహారం చెల్లించాలని సంతానానికి, నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టెయిన్మెంట్కు నోటీసులు పంపారు. నోటీసులపై 15 రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
ఆర్ఆర్ఆర్-2 చేస్తారా?.. రాజమౌళి సమాధానమిదే.. వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్లో సందడి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అక్కడే ఉన్నారు. తాజాగా లండన్లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మూవీ ప్రదర్శనతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ ఫరెవర్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఉన్నారు.ఈ సందర్భంగా ఉపాసన ఆర్ఆర్ఆర్-2 చేస్తారా? అంటూ రాజమౌళిని అడిగింది. దీనికి రాజమౌళి అవును అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే 'గాడ్ బ్లెస్ యూ' అంటూ వారిని దీవించింది. ఈ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ ఈవెంట్లో ఆస్కార్ స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటిసారి వేదికపై తిరిగి కలిశారు.ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో జతకట్టారు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
విదేశాల్లో విహరిస్తున్న దిల్రాజు.. సతీమణితో అలా సరదాగా!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఉన్నారు. నిర్మాతగా ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఆయన.. కాస్తా గ్యాప్ రావడంతో విదేశాల్లో విహరిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి వేకేషన్లో చిల్ అవుతున్నారు. తాజాగా తన భార్య తేజస్వినితో కలిసి సైకిల్ రైడింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన దిల్ రాజు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా దిల్రాజు కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పలు సినిమాలను తెరకెక్కించారు. ఈ ఏడాది విడుదలైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని దిల్రాజు నిర్మించారు. వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయనే నిర్మాత. ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన బ్యానర్లో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. అంతేకాకుండా ఇటీవలే విజయ్ దేవరకొండతో మూవీ చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. -
Virgin Boys Teaser: యూత్ని ఆకట్టుకునేలా ‘వర్జిన్ బాయ్స్’ టీజర్
‘వర్జిన్ బాయ్స్’ టీజర్ విడుదలైంది. గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్గురు ఫిల్మ్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందింది.టీజర్లో యూత్ఫుల్ ఎనర్జీ, కలర్ఫుల్ విజువల్స్, ఫ్రెష్ వైబ్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్కు జోష్ను జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఎనర్జిటిక్గా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్ను క్రిస్పీగా, ఆకర్షణీయంగా మలిచింది. గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ టీజర్లో హైలైట్గా నిలుస్తుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్తో నిండిన ఈ కథ ఆధునిక రిలేషన్షిప్స్ను సరికొత్త శైలిలో చూపించనుంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ కామెడీ టైమింగ్, క్యారెక్టర్ టీజర్లో సందడి చేస్తున్నాయి, ఇంకా ఎక్కువ ఫన్ను సినిమాలో ఆశించవచ్చని తెలుస్తోంది. డైలాగ్స్, సీన్స్లో ఫన్ ఎలిమెంట్స్ యూత్ను ఆకర్షిస్తున్నాయి. ఈ సమ్మర్లో ‘వర్జిన్ బాయ్స్’ థియేటర్లలో యూత్ను అలరించే ఫుల్ ఎంటర్టైనర్గా నిలవనుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ, "‘వర్జిన్ బాయ్స్’ యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది. గతంలో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ను మించేలా, రొటీన్కు భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. యూత్ ఈ సినిమాతో తప్పకుండా రిలేట్ అవుతారు," అని అన్నారు. -
అతనితో రిలేషన్లో సమంత.. ఆ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందా?
సమంత ఇటీవల నిర్మాతగా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన సొంత బ్యానర్లో నిర్మించిన శుభం మూవీతో నిర్మాతగా మారిపోయింది. మే 9న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ను సామ్ ఎంజాయ్ చేస్తోంది. హీరోయిన్గా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా తనకు ఎదురలేదని చెబుతోంది సమంత. అయితే తాజాగా శుభం సినిమా వీక్షించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోల్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా సామ్తో పాటే ఉన్నారు. శుభం వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.అయితే గత కొద్దికాలంగా సమంతపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. దీనికి కారణం సిటాడెల్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరు. అతనితో ఇప్పటికే సమంత చాలాసార్లు పలు వేదికలపై జంటగా కనిపించింది. పికిల్ బాల్ లీగ్లో వీరిద్దరూ ఒక్కసారిగా వేదికపై మెరిశారు. అప్పుడు కూడా రాజ్తో సామ్ డేటింగ్లో ఉందని వార్తలొచ్చాయి.తాజాగా మరోసారి శుభం మూవీని సమంత, రాజ్ కలిసి వీక్షించిన ఫోటోలు షేర్ చేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ ఫోటోల్లో విమానంలో రాజ్ భుజాలపై సన్నిహితంగా కనిపిస్తూ పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోతో రిలేషన్ను అఫీషియల్గా ప్రకటించారంటూ పోస్టులు పెడుతున్నారు. మరో నెటిజన్స్ ఈ జంటకు సామ్రాజ్ అనే కొత్త పేరు బాగుంటుందని కామెంట్ చేశాడు. ఏదేమైనా వీరిద్దరు కలిస్తే డేటింగ్ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఫుల్స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాగా. గతంలో తిరుమలకు వెళ్లిన సమయంలోనూ సమంత, రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అలాంటి దేశాల్లో మన డబ్బులు ఖర్చు చేయకండి: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే నిఖిల్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. పాక్కు మద్దతుగా టర్కీ నిలవడంపై నిఖిల్ ఫైరయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని.. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. పాక్తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ చేసిన కామెంట్స్పై ఓ నెటిజన్స్ పోస్ట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్కు మద్దతుగా టర్కీతో పాటు చైనా కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టర్కీ యాపిల్స్ను సైతం దిగుమతి చేసుకోవడం ఆపేశారు.Anyone still visiting Turkey ? Please read this Below Thread...Indians Spend Billions of Dollars Every year in Turkey. Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025 -
బాలకృష్ణ కాలు తొక్కా.. ప్యాకప్ చెప్పి.. నన్ను వద్దన్నారు: హీరోయిన్
లయ(laya)...ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పింది. 1999లో వేణు 'స్వయంవరం' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ.. 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులోనే గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లి పోయింది. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ తర్వాత డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది. కరోనా కారణంగా అది మూతపడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన లయ.. ఇన్స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్ వల్లే..మళ్లీ సినిమా చాన్స్లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాలో లయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే.. సీరియస్ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పాడని, నన్ను ఆటపట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోరున ఏడ్చానని చెప్పింది.‘విజయంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాను. ఆ సినిమా ఫస్డ్డే షూటింగ్ రోజే పాట పెట్టారు. దాని కోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్రమంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను. దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్ అయ్యాడు. ‘నా కాలే తొక్కుతావా..? ప్యాకప్.. ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి’అని చెప్పి పక్కకి వెళ్లిపోయాడు. బాలకృష్ణ అలా అనడం నేను తట్టుకోలేకపోయాను. గట్టిగా ఏడ్చేశాను. వెంటనే బాలయ్య వచ్చి..‘అయ్యో..నేనేదో సరదాగా అన్నాను.. నిజమనుకున్నావా? ఇలాంటివి నేను బోలెడు అంటున్నాను’ అని నవ్వేశాడు. ఆయన జోక్ చేశాడనే విషయం గ్రహించక నేను ఏడ్చేశాను. సెట్లో ఎప్పుడు ఆయన అలానే సరదాగా ఉండేవాడు’ అని లయ చెప్పుకొచ్చింది. -
'కింగ్డమ్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. లెక్క ప్రకారం ఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటికీ ప్రమోషన్స్ ఏం మొదలు పెట్టకపోవడంతో వాయిదా గ్యారంటీ అని గత కొన్నిరోజులుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. కొత్త రిలీజ్ తేదీని మూవీ టీమ్ ప్రకటించింది.'లైగర్', 'ద ఫ్యామిలీ స్టార్' లాంటి డిజాస్టర్స్ తర్వాత విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో ఎలాండి హడావుడి లేకుండా 'కింగ్డమ్' పూర్తి చేశాడు. కొన్నిరోజుల క్రితం ఓ పాట రిలీజ్ చేయగా అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడేమో జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. కానీ రీ రికార్డింగ్ లాంటి కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈ వాయిదా అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇకపోతే జూలై 4న నితిన్ 'తమ్ముడు' కూడా రిలీజ్ కానుంది. కొన్నిరోజుల క్రితమే ఇది అనౌన్స్ చేశారు. మరి ఇద్దరూ వస్తారా? లేదా ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?'కింగ్డమ్' మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. నాగవంశీ నిర్మాత. చాన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా. ఇప్పుడు రాబోయేది తొలి పార్ట్ మాత్రమే. హిట్ అయిన దానిబట్టి సీక్వెల్ కూడా ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్) -
'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్
రామ్ చరణ్ మైనపు విగ్రహం.. రీసెంట్ గా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి చరణ్ అక్కడికి వెళ్లాడు. విగ్రహావిష్కరణ పూర్తి కాగానే యూకేలోని తన అభిమానులని కలిసి ముచ్చటించాడు. 'పెద్ది' విశేషాలు చెప్పి హైప్ పెంచేశాడు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) అభిమానులతో మాట్లాడిన చరణ్.. 'పెద్ది' సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతుంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను. కానీ ఈసారి రాసిపెట్టుకోండి' అని చెప్పాడు. దీంతో అక్కడున్న ఫ్యాన్స్ అరిచి గోలగోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదివరకే రిలీజ్ చేసిన 'పెద్ది' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా చివరలో వచ్చే క్రికెట్ షాట్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సందర్భంగా లండన్ లో ఫ్యాన్స్.. ఓ బ్యాట్ ని రామ్ చరణ్ కి బహుకరించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. బుచ్చిబాబు దర్శకుడు కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) Idhi nenu mamuluga anni cinemalaki cheppanu... Ee Cinema matram raasi pettukondi 💥💥💥@AlwaysRamCharan about #PEDDI ! pic.twitter.com/CPOKMjOwcl— Trends RamCharan ™ (@TweetRamCharan) May 13, 2025 -
Single Movie: థియేటర్లలో నవ్వులే నవ్వులు
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్. ఈ నెల 9న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సింగిల్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్నాయని చెప్పారు. దర్శకుడు కార్తీక్ రాజు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహకారం అందించారన్నారు. కథ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సంభాషణలతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తమ పాత్రలకు ప్రాణం పోశారని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ సూపర్ నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడన్నారు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని తెలిపారు. సినిమాలో అనేక ఆసక్తికరమైన పాత్రలు, మలుపులు పెట్టి దర్శకుడు కార్తీక్రాజు ప్రేక్షకులను నవి్వంచారని, ముఖ్యంగా సెకండాఫ్లోని ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని ఆయన తెలిపారు. విశాఖ అంటే చాలా ఇష్టం హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే తమకు చాలా ఇష్టమని, ఈ సినిమాలో నటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్తో కలిసి నటించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని వారు తెలిపారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవి్వంచారని వారు కొనియాడారు. -
సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్
ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ పాపులర్ అవుతూ ఉంటుంది. అలా గత కొన్నాళ్లలో చూసుకుంటే భాగ్యశ్రీ బోర్సే పేరు గట్టిగా వినిపిస్తుంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ అయింది గానీ వరస అవకాశాలు ఈమెని వరించాయి.ప్రస్తుతం తెలుగులో రామ్ కొత్త సినిమాలో, అలానే దుల్కర్ సల్మాన్ 'కాంత'లో భాగ్యశ్రీనే హీరోయిన్. మరోవైపు ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే మూవీలోనూ ఈమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె ఇప్పుడు ఓ సాహసం చేసింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 'వన్ లైఫ్, వన్ బ్రీత్, వన్ జంప్' అని భాగ్యశ్రీ.. దుబాయిలో స్కై డైవింగ్ చేసింది. ఇందులో భాగంగా విమానంలో ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి దూకేస్తారు. చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తున్నప్పటికీ.. ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ చేసి తన చిన్న చిన్న కోరికలని భాగ్యశ్రీ నెరవేర్చుకుంటోంది.మరోవైపు భాగ్య శ్రీ.. తెలుగు హీరో రామ్ తో డేటింగ్ లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత కలిసి ఓ సినిమా చేస్తున్న వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. అయితే ఇది నిజమా? మూవీ పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంటా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సినిమాలతోనే కాదు సాహసాలు చేస్తూ కూడా ట్రెండింగ్ లో ఉంటోందిగా.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
'జబర్దస్త్' కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తొస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. సాధారణ కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. టీమ్ లీడర్ గా ఎదిగి.. ప్రస్తుతం రియాలిటీ షోలకు యాంకర్ గా, మరోవైపు సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు. వయసు దాటిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది.సుడిగాలి సుధీర్ తో పాటు అతడి కుటుంబం గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే గతంలో తాను యాంకర్ గా చేస్తున్న టైంలో ఒకటి రెండుసార్లు కుటుంబ సభ్యులు.. షోలో కనిపించారు. అసలు విషయానికొస్తే గుడ్ న్యూస్ సుధీర్ పెళ్లి గురించి అయితే కాదు. వీళ్ల ఇంట్లోకి వారసుడు వచ్చాడు. సుధీర్ తమ్ముడు రోహన్-రమ్య దంపతులకు బాబు పుట్టాడు. ఈ మేరకు రోహన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్) సుధీర్ కి తమ్ముడు, చెల్లి ఉన్నారు. రోహన్ ఇక్కడే కుటుంబంతో కలిసి ఉండగా.. చెల్లి శ్వేత మాత్రం భర్తతో కలిసి విదేశాల్లో ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. సుధీర్ తమ్ముడు రోహన్ కి రమ్యతో పెళ్లి కాగా కొన్నేళ్ల క్రితం పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. దీంతో సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. అంతా ఓకే కానీ మరి సుధీర్ పెళ్లెప్పుడు చేసుకుంటాడో?సుధీర్ సినిమాల విషయానికొస్తే.. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడ్, కాలింగ్ సహస్ర అని మూవీస్ చేశాడు. ప్రస్తుతం G.O.A.T అనే చిత్రంలో నటిస్తున్నాడు. చాలారోజుల క్రితం దీన్ని ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) View this post on Instagram A post shared by Rohan Bayana (@bayana.rohan) -
రామ.. రామ... రామ...
‘రామ... రామ..’ అంటూ యూట్యూబ్ వీక్షకులను చిరంజీవి అలరిస్తున్నారు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘విశ్వంభర’లోని ‘జై శ్రీరామ్... జై శ్రీరామ్... రామ... రామ... రామ..’ అంటూ సాగేపాట లిరికల్ వీడియోను ఏప్రిల్లో విడుదల చేశారు మేకర్స్.ఈపాట యూట్యూబ్ మ్యూజిక్లో 25+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, శ్రోతలను బాగా ఆకట్టుకుందని చిత్రబృందం పేర్కొంది. ‘‘జై శ్రీ రామ్’ అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్గా మారి, చార్ట్ బస్టర్గా నిలిచింది. చిరంజీవిగారి డ్యాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణిగారి మ్యూజిక్, రామజోగయ్యశాస్త్రిగారి లిరిక్స్, భారీ సెట్... ఇలా ఈపాట అన్ని విధాలుగా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తోంది. మున్ముందు ఈపాట మరింత పెద్ద హిట్ అవుతుందని ఊహిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
కింగ్ 100 నాటౌట్!
కొన్ని రోజులుగా తన వందో సినిమా కోసం నాగార్జున కథలు వింటున్నారు. ఈ క్రమంలో నాగార్జున వందో సినిమాకు ఈయనే డైరెక్టర్ అంటూ పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్ చెప్పిన కథ నాగార్జునకు నచ్చిందని సమాచారం. దీంతో కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట కార్తీక్. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ అతి త్వరలో పూర్తి స్థాయిలో మొదలవుతాయని, ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని టాక్. ఇక నాగార్జునను అభిమానులు ‘కింగ్’ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నూరవ చిత్రానికి ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే... రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’, ధనుష్ ‘కుబేర’ సినిమాల్లో నాగార్జున లీడ్ రోల్స్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ‘కుబేర’ జూన్ 20న, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. -
రామ్చరణ్పై డాక్యుమెంటరీ?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రామ్చరణ్. ఈ చిత్రం తర్వాత ఆయనకి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని రామ్చరణ్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందించేందుకు నెట్ఫ్లిక్స్ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఈ సంస్థ ఆరు నెలలుగా రామ్చరణ్ డాక్యుమెంటరీ పైన వర్క్ చేస్తోందని టాక్. ఈ హీరో కెరీర్, ఫ్యాన్స్తో ఉన్న అనుబంధం, అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవం, సాధించిన అవార్డులు... వంటి వాటన్నింటినీ ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా నెటఫ్లిక్స్ సంస్థ డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ నయనతారలపై డాక్యుమెంటరీ ఫిల్మ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక రామ్చరణ్ తాజా సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
అషూ అందాల జాతర.. క్యూట్ గా మాయ చేస్తున్న రితిక
స్కై డైవింగ్ చేసి అదరగొట్టేసిన భాగ్యశ్రీ బోర్సేబర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న నందితా శ్వేతమిడ్ నైట్ పార్టీ చేసుకుంటున్న సుప్రీతఅందాల ముద్దుగుమ్మలా రితికా నాయక్ థాయ్ లాండ్ లో చిల్ అవుతున్న స్రవంతిహాట్ బ్యూటీలా మెరిసిపోతున్న జ్యోతిరాయ్ఇద్దరు పిల్లలకు తల్లయిన ప్రణీత తగ్గట్లేదుగా View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్
తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాన్నాళ్లుగా తెరపై కనిపించలేదు. ఇతడి లేటెస్ట్ మూవీ 'భైరవం' మే 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ నడుస్తున్నాయి. మరోవైపు ఈ హీరో ఇప్పుడు అనుకోని విషయంలో చర్చనీయాంశమయ్యాడు. రాంగ్ రూట్ లో కారు నడపడమే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర రాంగ్ రూట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సదరు హీరోని నిలదీశాడు. దీంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నిర్మాత కొడుకు అయిన సాయి శ్రీనివాస్.. 'అల్లుడు శ్రీను' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఇది ఓ మోస్తరు హిట్ అనిపించుకుంది. మధ్య రాక్షసుడు అనే సినిమా కాస్త పర్వాలేదనిపించింది. ఈ రెండు తప్పితే మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ప్రస్తుతం 'భైరవం' కాకుండా కిష్కిందపురి, టైసన్ నాయుడు, హైందవ అని మరో మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకొంటున్నాయి.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) రాంగ్ రూట్ లో కార్ డ్రైవింగ్ నటుడు బెల్లంకొండ ను వెనక్కి పంపిన ట్రాఫిక్ పోలీస్..!నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో రాంగ్ రూట్ లో కారును తీసుకెళ్లడానికి యత్నించాడు... ఈ క్రమంలో కారు అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తాకినంత పనిచేసింది..!దీంతో… pic.twitter.com/BYcE9MA2lR— Telangana Awaaz (@telanganaawaaz) May 13, 2025 -
ఓటీటీలోకి సస్పెన్స్, థ్రిల్లర్ ‘కన్ఖజురా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళ నటుడు రోషన్ మాథ్యూ,బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కన్ఖజురా’ టీజర్ తాజాగా రిలీజైంది. ఈ సిరీస్ గోవాలో జరిగే నేరాల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. నిశ్శబ్దం మోసపూరితంగా, బయటకు కనిపించే దానికంటే ప్రమాదకరంగా ఉంటుందనే ట్యాగ్లైన్తో ఈ సిరీస్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ ఆధారంగా ఈ సిరీస్ను హిందీ ప్రేక్షకుల కోసం అనువదించగా, భారతీయ ప్రేక్షకుల సంస్కృతికి తగ్గట్టు స్థానికీకరణ చేసి తెరకెక్కించారు.‘కన్ఖజురా’ కథ విడిపోయిన ఇద్దరు సోదరుల మధ్య జరిగే సంఘర్షణ, వారి చీకటి గతంతో పోరాటం, జ్ఞాపకశక్తి మరియు వాస్తవికత మధ్య నలిగిపోయే సంఘటనల చుట్టూ నడుస్తుంది. ఈ కథలో భావోద్వేగ తీవ్రత, గందరగోళం, మరియు నిశ్శబ్దంలో దాగి ఉన్న తుఫాను వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.సిరీస్లో కీలక పాత్ర పోషించిన నటుడు రోషన్ మాథ్యూ మాట్లాడుతూ, “‘కన్ఖజురా’ ఒక ఎమోషనల్ రోలర్కోస్టర్. ఈ కథలోని భావోద్వేగ తీవ్రత, నిశ్శబ్దంలో దాగి ఉన్న గందరగోళం నన్ను ఈ పాత్రలో నటించేలా ప్రేరేపించాయి. నా పాత్ర ‘అషు’లో బహుముఖీయత ఉంది. ఒక్కో క్షణంలో ఒక్కోలా మారుతూ, లోపల నిశ్శబ్ద తుఫానును మోస్తుంది. ఈ సిరీస్ ప్రేక్షకుల హృదయాలను కదిలించడమే కాకుండా, వారిని వెంటాడుతుంది” అని అన్నారు.ఈ చిత్రానికి అరోరా దర్శకత్వం వహించగా, అజయ్ రాయ్ నిర్మాతగా వ్యవహరించాడు. సారా జేన్ డయాస్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా ఇతర కీలక పాత్రలు పోషించారు. మే 30 నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో టాప్-2లో ట్రెండింగ్!
సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) నటించిన జాక్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన థియేటర్లలో విడుదలై భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది.అయితే జాక్ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. మే 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న జాక్ ఏకంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం జాక్ మూవీ టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో అందుబాటులో ఉంది.డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు.. జాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ అంచనాలు తప్పడంతో అంతా రివర్స్ అయింది. ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సుమారు రూ. 36 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.#Jack is back… and he’s trending! 💥Now streaming and sitting pretty at #2 on @NetflixIndia!❤️🔥Watch now in Telugu, Tamil, Hindi, Kannada & Malayalam!🔗 https://t.co/PjBIjRjVYv#JackOnNetflix #SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/HZotUC59tU— SVCC (@SVCCofficial) May 13, 2025 -
ప్రభాస్ స్పిరిట్.. ఆ హీరోయిన్కు ఏకంగా రూ.20 కోట్లా!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం స్పిరిట్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదు.అయితే తాజాగా వీరు కాకుండా మరో హీరోయిన్ పేరు నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే స్పిరిట్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనుందని టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఈ మూవీకి దాదాపు రూ.20 కోట్ల పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా దీపికా రికార్డ్ క్రియేట్ చేయనుంది. కాగా..ఇప్పటికే దీపికా కల్కి 2898 ఏడీ మూవీలో కనిపించారు. గతంలో ప్రియాంక చోప్రా, అలియా భట్ కూడా భారీ పారితోషికం తీసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి.ఈ మూవీ ఫుల్ యాక్షన్-ప్యాక్డ్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఏడాదిలోనే 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్రెడ్డి వంగా (సందీప్రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు . వచ్చే ఏడాది చివర్లో స్పిరిట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
సమంత కొత్త జర్నీ.. సక్సెస్ అయినట్లేనా?
స్టార్ హీరోయిన్ సమంత(samantha) కొత్త జర్నీ ప్రారంభించింది. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్తో పోలిస్తే..ఇది మంచి నెంబరనే చెప్పాలి. ఓవరాల్గా ఈ చిత్రానికి రూ. 3.5 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. రిలీజ్కి ముందే సమంత తనకున్న పలుబడితో టేబుల్ ప్రాఫిట్ని పొందినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులను మంచి రేటుకే అమ్మేసిందట. షూటింగ్కి ముందే ‘జీ’ సంస్థతో డీల్ కుదుర్చుకుందట సమంత. సినిమా మొత్తం ఓ సీరియల్ చుట్టు తిరుగుతుంది.. అది జీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్గా చూపిస్తామని ‘బ్రాండింగ్’మాట్లాడుకున్నారట. ఆ తర్వాత అదే సంస్థ ఓటీటీ, శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. నిజానికి ఇలాంటి చిన్న సినిమాకి రిలీజ్ ముందే బిజినెస్ జరగడం చాలా అరుదు. పెద్ద పెద్ద సినిమాలకే ఓటీటీ బిజినెస్ కావడం లేదు. సమంత ఉంది కాబట్టే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రిలీజ్కి ముందే సేల్ అయ్యాయి. ఇక రిలీజ్ తర్వాత మంచి టాక్ రావడం.. వసూళ్లు రోజు రోజుకి పెరగడంతో ‘శుభం’తో సమంతకు మంచి లాభాలే వచ్చేశాయి. మొత్తానికి సమంత కొత్త జర్నీ లాభాలతోనే ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఆమె బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు, బలమైన కథలతో వస్తే, 'సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్'గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. -
వీకెండ్ విన్నర్ '#సింగిల్'.. వసూళ్లు ఎంతొచ్చాయంటే?
గత వీకెండ్ మూడు నాలుగు సినిమాలు రిలీజైతే వాటిలో శ్రీ విష్ణు '#సింగిల్' హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలానే కలెక్షన్లలోనూ మంచి జోరు చూపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. అలానే లాభాలు కూడా వస్తున్నాయి. ఈ కామెడీ మూవీకి ఇప్పటివరకు ఎంత వసూళ్లు వచ్చాయి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్)శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన '#సింగిల్' సినిమాకు నాలుగు రోజుల్లో రూ.19.01 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. గత వీకెండ్ లో సమంత నిర్మించిన శుభం కూడా విడుదలైంది గానీ ఈ సినిమా దెబ్బకు పూర్తిగా డల్ అయిపోయినట్లు కనిపిస్తుంది.ట్రెండింగ్ సోషల్ మీడియా కంటెంట్ బేస్ చేసుకుని రాసుకున్న జోక్స్.. సింగిల్ మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. అలానే శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ కాంబో కూడా క్లిక్ అయింది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీకే ఓటేస్తున్నారు. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి సింగిల్ చిత్రానికే ప్లస్ అవ్వొచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా) -
కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా
యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు సినిమాలు, రియాలిటీ షోలు చేస్తూ బిజీగా ఉంది అనసూయ. ఇప్పుడు ఈమె హైదరాబాద్ లో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. శాస్త్రోక్తంగా సోమవారం ఉదయం గృహప్రవేశం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అనసూయ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.'ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలో మరో అధ్యాయం. శ్రీరామ సంజీవని. మా కొత్తింటి పేరు.. జైశ్రీరామ్. జై హనుమాన్' అని అనసూయ ఇన్ స్టాలో రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: మైనపు విగ్రహంతో రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్)తెలుగు సంప్రదాయ ప్రకారం ఆవుని ఇంట్లోకి తీసుకురావడం, పాలు పొంగించడం, పూజ చేయడం, తన కుటుంబంతో కలిసి దేవుళ్ల పటాలతో ఇంట్లో అడుగుపెట్టడం.. ఏమేమైతే చేసిందో వాటిని ఫొటోలుగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్ని హితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇంటి ఖరీదు రూ.కోట్లలోనే ఉండొచ్చని సమాచారం.పుష్ప 2లో చివరగా కనిపించిన అనసూయ.. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏం చేస్తుందో తెలీదు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'అరి' రిలీజ్ కావాల్సి ఉంది. మరోవైపు తెలుగులో ఒకటి రెండు రియాలిటీ షోలు చేస్తోంది.(ఇదీ చదవండి: ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?) -
‘చిత్రపురి కాలనీ’ 40 నెలల్లో పూర్తి చేస్తాం: వల్లభనేని అనిల్ కుమార్
చిత్రపురి కాలనీలో నూతన ప్రాజెక్ట్ ‘సఫైర్ సూట్’ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ భూమి పూజ త్వరలో జరుగుతుందని, 40 నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ల్యాండ్మార్క్గా నిలుస్తుందని, రూ.166 కోట్ల అప్పు, బఫర్ జోన్ సమస్యలను అధిగమించి అందరికీ ఇళ్లు అందించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.‘చిత్రపురి కాలనీ అనేది చక్కటి ఆలోచనతో వచ్చిన ప్రయత్నం. చిత్రపురి కాలనీ కోసం మనం ఎంతగానో కష్టపడ్డాము. ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నవారికి అలాగే కొత్త వారికి కూడా ఇప్పుడు చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు రాబోతున్నాయి అనే వార్త సంతోషకరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కడ ఉండే ఎన్నో వేల మంది సమస్యలు పరిష్కరింపబడతాయి’అని సీ కల్యాణ్ అన్నారు. ‘చిత్రపురి కాలజీ స్థలం వేలానికి వెళ్ళిన సమయంలో చదలవాడ శ్రీనివాసరావు గారు వచ్చి మనకోసం అండగా నిలబడ్డారు. అలాగే భారత భూషణ్ గారు ప్రభుత్వాలతో ఉన్న సన్నిహిత సంబంధం వల్ల ఈ ప్రాజెక్టు మరింత ముందుకు వెళ్లేందుకు సహాయపడ్డారు. ఈ సమస్యను ఛాంబర్ లోని వారంతా మన సమస్యగా అనుకుని కూర్చుని మాట్లాడుకుని సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాం. కమిటీ వారందరికీ మరోసారి ధన్యవాదాలు’అని నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ అన్నారు.బ్రోచర్ విడుదల చేసిన ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్ తదితరులు పాల్గొని, ప్రాజెక్ట్ విజయానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ సభ్యులకు ప్రాధాన్యత, కొత్త సభ్యులకు ధృవీకరణ పత్రాలతో మెంబర్షిప్ ఇవ్వనున్నారు. -
‘నాటు’పాటకి చిరంజీవి, బాలకృష్ణ స్టెప్పులేస్తే.. : ఎన్టీఆర్
ఎన్టీఆర్(Jr NTR), రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం)(RRR). ఆలియాభట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ , రే స్టీవెన్ సన్ , అలిసన్ డూడీ ఇతర పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2022 మార్చి 25న విడుదలైంది. తాజాగా లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్తో పాటు కీరవాణి లైవ్ కాన్సెర్ట్ జరిగింది. ఈ వేడుకకు అశాంతి ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘నాటు నాటు’ పాటలో నా మిత్రుడు, అద్భుతమైన డ్యాన్సర్ రామ్చరణ్తో కలిసి డ్యాన్స్ చేయడాన్ని మర్చిపోలేను. చిరంజీవిగారు గ్రేట్ డ్యాన్సర్. మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్. చిరంజీవిగారు(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) బాబాయ్ కలిసి ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తే అది మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్చరణ్, రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు. ఇక ఈ వేడుకకు మహేశ్బాబు హాజరవుతారనే ప్రచారం సాగినప్పటికీ ఆయన పాల్గొనలేదు. ఇక 2023 మార్చిలో జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్ర బోస్లకు ఆస్కార్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా 2019లో రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్క్రీనింగ్ జరిగింది. -
'మిస్ వరల్డ్'లో మన స్థానం ఎంత.. కిరీటం అందుకున్న బ్యూటీస్ ఎందరు..?
ప్రపంచ సుందరి- 2025 (Miss World Competitions 2025) పోటీలు హైదరాబాద్లో అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ ఏడాది కిరీటాన్ని అందుకునే అందాల రాశి ఎవరా? అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మిస్ వరల్డ్ అవ్వాలనే ఆశయంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటికి పైగానే అమ్మాయిలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకుంటారు. 160కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటాయి. అందుకే బ్యూటీ వరల్డ్లో ఈ పోటీలకు అంత ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి ప్రతిష్టాత్మకత కలిగిన ఈ పోటీలలో గెలుపొందిన మన భారతీయ సుందరిలు ఆరుగురు ఉన్నారు.భారత్ నుంచి ఆరుగురు అందాల భామలు ఈ కిరీటాన్ని అందుకున్నారు. మొట్టమొదటిసారి ముంబైకి చెందిన రీటా ఫరియా (1966)లో ఈ కిరిటాన్ని దక్కించుకుంది. మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్ కూడా ఆమె కావడం విశేషం. గెలిచిన తర్వాత సినిమాల్లో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధిక కిరీటాలు (6) గెలిచిన దేశాల జాబితాలో భారత్తో పాటు వెనిజులా ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యంగా 2000సంవత్సరంలో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ ఏడాదిలో ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్), లారా దత్తా (మిస్ యూనివర్స్) దియా మిర్జా (మిస్ ఆసియా పసిఫిక్)గా గెలవడంతో ఒకే ఏడాది మూడు ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ టైటిళ్లు సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. అలా బ్యూటీ వరల్డ్లో భారత్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. -
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లిన నాగార్జున
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్లారు. ఆయన ఆర్టీఏ కార్యాలయంలో ఫోటోలు దిగి, సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆర్టీఏ సిబ్బందితో ఆయన సెల్ఫీలు దిగి వారితో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు.. నాగ్ వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కూడా ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నారు. వారితో కూడా అయన ఫోటోలు దిగారు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని అందుకే రెన్యువల్ కోసం వచ్చానని ఆయన చెప్పారు.నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా 'కూలీ'లో కూడా నాగ్ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్లో కనిపించనున్నారు. -
కేంద్రం అంటే బాలీవుడ్కు భయం.. అందుకే నోరెత్తరు: రచయిత
హిందీ చిత్ర పరిశ్రమ గురించి బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటే బాలీవుడ్కు భయం అని ఆయన అన్నారు. అందుకే ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసం చేయరని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైన తెగించి విమర్శలు చేస్తే.. దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం బాలీవుడ్ హీరోలలో ఉందని అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ దాడుల భయమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా నిరోధిస్తుందని ఆయన అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్తో జరిగిన చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు.'బాలీవుడ్ తారలు గొప్ప పేరు ప్రఖ్యాతులతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతారు. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయాల్లో వారు కూడా సామాన్యుల తరహాలోనే ఆలోచిస్తారు. ఈ బడా హీరోలను వెనక నుంచి నడిపించేది మొత్తం పారిశ్రామికవేత్తలే. ఎట్టిపరిస్థితిల్లోనూ వారితో పోరాడేంత పెద్దవారు కాదు ఈ సినీ తారలు. ఈ క్రమంలోనే వారి వైఖరిపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. అదే హాలీవుడ్ నటులు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తారు. తాజాగా అమెరికన్ నటి మెర్లీ స్ట్రీప్ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించినా ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. అలాంటి వ్యాఖ్యలు ఇక్కడి ప్రభుత్వంపై చేస్తే ఈడీ, సీబీఐ దాడుల పేరుతో రంగంలోకి దిగుతారు. ఆ భయంతోనే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని ప్రశ్నించదు.' అని ఆయన జావేద్ అఖ్తర్ వ్యాఖ్యనించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తాను నిరంతరం సోషల్మీడియాలో ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నానని జావేద్ అన్నారు. ఓ పౌరుడిగా సమస్యలపై స్పందించడం తన ధర్మమని ఆయన పేర్కొన్నారు.జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. -
ఐపీఎల్లో నాకిష్టమైన జట్టు ఇదే: మీనాక్షీ
పంజాబీ బ్యూటీ మీనాక్షీ చౌదరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. ఈమె సినిమాలతో పాటు రీసెంట్గా వైద్య విద్యను పూర్తి చేశారు. అదే విధంగా సిమ్మింగ్, బాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. అంత కంటే పలు అందాల పోటీల్లో పాల్గొని రన్నర్గా నిలిచారు. చివరికి నటిగా స్థిరపడింది. తొలుత నటిగా బాలీవుడ్లో రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అలా 2020లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే చిత్రంలో నటించి గుర్తింపు పొందారు. అయితే హిట్ ది సెకండ్ కేస్ చిత్రం ఈ బ్యూటీకి తొలి విజయానందాన్నిచ్చింది. అంతే కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. అక్కడ విజయ్ ఆంటోనితో కలిసి కొలై చిత్రంలో నటించారు. అది ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, విజయ్కి జంటగా గోట్ చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యారు. దుల్కర్ సల్మాన్కు జంటగా లక్కీభాస్కర్ చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి బాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఇంతకు ముందు స్త్రీ, మిమీ తదితర హిట్ చిత్రాలను నిర్మించిన దినేశ్ విజయ్ తాజాగా నిర్మిస్తున్న చిత్రంలో మీనాక్షీ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ ఇటీవల ఒక భేటీలో ఐపీఎల్ జట్లుల్లో మీకు నచ్చిన జట్టు ఏదని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఐపీఎల్ జట్టులో ప్రత్యేకంగా నచ్చిన జట్లు అంటూ ఏమీ లేవన్నారు. అయితే ఎంఎస్.ధోని అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆయన ఏ జట్టులో ఉంటే ఆ జట్టే తనకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోని అంటే ఇష్టం ఏర్పడిన తరువాతనే తాను క్రికెట్ క్రీడను చూడడం మొదలెట్టానని ఈ 33 ఏళ్ల సుందరి చెప్పుకొచ్చారు. -
తెలుగులో నా ఎంట్రీకి సరైన సినిమా ఇదే: డైరెక్టర్ కూతురు
‘‘నేను తమిళంలో చేసిన తొలి చిత్రం ‘విరుమన్’ని విజయ్ కనకమేడలగారు చూశారు. ఆ తర్వాత నాకు కాల్ చేసి, ‘భైరవం’ (bhairavam)సినిమా గురించి చెప్పారు. కథ నచ్చడంతో నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. తెలుగులో ఇది నా తొలి చిత్రం. టాలీవుడ్లో నా ఎంట్రీకి ‘భైరవం’ సరైన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మంచి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడం సంతోషంగా ఉంది’’ అని అదితీ శంకర్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్పై జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతున్న అదితీ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా నాన్నగారితో(డైరెక్టర్ శంకర్) కలిసి హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్కి వచ్చేదాన్ని. ఇప్పుడు నా సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం చూస్తే నా కల నిజం అయిందనిపిస్తోంది. నాన్నగారి ఇమేజ్ని ఒక గౌరవంగానే భావిస్తాను తప్ప ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను. ‘భైరవం’లో బోల్డ్ అండ్ హానెస్ట్తోపాటు బబ్లీగా ఉండే క్యారెక్టర్లో కనిపిస్తాను. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్గార్లకు తమిళ్ మాట్లాడడం వస్తుంది. అందుకే ఈ ప్రయాణం చాలా సౌకర్యంగా అనిపించింది.సెట్స్లో షూటింగ్ని చాలా ఎంజాయ్ చేశాను. రాధామోహన్గారు చాలా మంచి వ్యక్తి. ప్రతిరోజు సెట్స్కి వచ్చేవారు. విజయ్ కనకమేడలగారు క్లారిటీ విజన్ ఉన్న డైరెక్టర్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఇష్టమైన తెలుగు చిత్రం ‘మగధీర’. నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా అది. అలా రాజమౌళి, రామ్ చరణ్గార్లకు నేను బిగ్ ఫ్యాన్గా మారిపోయాను. నాకు హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలతోపాటు సవాల్తో కూడినపాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
అందరివాడు మన సూర్యకుమార్
‘అందనివాడు.. అందరివాడు.. మన సూర్యకుమార్’ అంటున్నారు హీరో రామ్. ఈ సూర్యకుమార్ ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. రామ్ హీరోగా పి. మహేశ్బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకుమార్పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారని వెల్లడించి, ‘అందనివాడు.. అందరివాడు... మన సూర్యకుమార్’ అంటూ ఉపేంద్ర ఫస్ట్లుక్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది. కాగా ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ అనుకుంటున్నారని, సూపర్స్టార్ సూర్యకుమార్పాత్రలో ఉపేంద్ర కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు వివేక్– మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. -
గురి తప్పదు తమ్ముడు
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అంటూ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్.రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్గా సౌరభ్ సచ్దేవ్ కనిపించబోతున్నారు. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ వీడియో చివర్లో నితిన్ ఎంట్రీ, బాణం వదిలిన తీరు ఆసక్తిగా ఉంది. ‘‘నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోకనాథ్. -
మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సతీ లీలావతి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరుణ్తేజ్తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి చిత్రం కావడం విశేషం.(ఇది చదవండి: 'కొణిదెల లావణ్య త్రిపాఠి'గా మొదటి సినిమా ప్రకటన)భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలను తెలియజేస్తూ ఎమోషనల్ అంశాలతో సతీ లీలావతి సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో టాలీవుడ్ మూవీ ప్రదర్శన
టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ఎంఫోర్ఎం' (Motive for Murder). తాజాగా ఈ చిత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన అవకాశం దక్కించుకుంది. మే 17న సాయంత్రం 6:00 గంటలకు కేన్స్లోని పలాయిస్ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ చేయనున్నారు. గొప్ప నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో జో శర్మ ప్రతిష్టాత్మక వేవ్స్ ఈవెంట్లో సందడి చేశారు. ఈవెంట్లో అమెరికన్ డెలిగేట్ నటిగా పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంఫోర్ఎం టీమ్ ముంబయిలోని థియేటర్లో ప్రెస్ మీట్ నిర్వహించింది.మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..'మా సినిమాను కేన్స్లో ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం, ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. మా టీమ్ అంతా చాలా ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం' అని తెలిపారు.ఈ సినిమా హత్యా కథాంశం ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత థ్రిల్లర్గా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇకపోతే, హంతకుడెవరో ఊహించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. మోహన్ వడ్లపట్ల టాలీవుడ్లో మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో లాంటి చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. -
'వేర్ ఆర్ యూ గోయింగ్ కారా..'.. రామ్ చరణ్ కూతురి క్యూట్ వీడియో చూశారా?
మెగాఫ్యామిలీ ప్రస్తుతం యూకేలో సందడి చేస్తున్నారు. చిరంజీవితో సహా రామ్ చరణ్ దంపతులు సైతం లండన్లో ఉన్నారు. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహంతో పాటు పెట్ డాగ్ రైమ్ను కూడా ఏర్పాటు చేశారు. మే 10న ఈ అరుదైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో తన మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ ఫోటోలకు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కాగా.. మేడమ్ టుస్సాడ్స్లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం.అయితే విగ్రహం ఆవిష్కరణ తర్వాత రామ్ చరణ్ ఫోటోలు దిగారు. ఆ సమయంలో చెర్రీ-ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార సందడి చేసింది. రామ్ చరణ్ తన విగ్రహంతో ఫోటోలు దిగుతుండగా నాన్న వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న ఉపాసన కారా.. కారా.. అంటూ అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రానుంది.Most Beautiful Video on Internet today ❤️ #RamCharanWaxStatue ! pic.twitter.com/73mqiirlPA— Trends RamCharan ™ (@TweetRamCharan) May 12, 2025 View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
సంక్రాంతి వస్తున్నాం సూపర్ హిట్.. అవార్డ్ కొట్టేసిన ఐశ్వర్య రాజేశ్!
హీరో వెంకటేశ్తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీమామ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వెంకటేశ్ భార్యగా తనదైన స్టైల్లో అభిమానులను మెప్పించింది. గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే అంటూ సాగే సాంగ్లో ఐశ్వర్య రాజేశ్ అదరగొట్టింది. ఈ మూవీలో తన నటనకు గానూ ఐశ్వర్య రాజేశ్ క్రేజీ అవార్డ్ను సొంతం చేసుకుంది.టాలీవుడ్లో అందించే ప్రముఖ అప్సర అవార్డ్ ఐశ్వర్య రాజేశ్ను వరించింది. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేశ్ అవార్డ్ అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు అనిల్ రావిపూడిని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
విష్ణుప్రియ గ్లామర్ డోస్.. కొత్త కారుతో సోనియా
భర్త రామ్ చరణ్ మైనపు విగ్రహంతో ఉపాసనకొత్త కారుకి పూజలు చేయించిన సోనియా సింగ్నాభి అందాలతో రచ్చ లేపుతున్న విష్ణుప్రియథాయ్ లాండ్ కి షికారుకెళ్లిన బిగ్ బాస్ స్రవంతినభా నటేశ్ గ్లామర్ విషయంలో తగ్గట్లేదుగాఅనసూయ అందాల జాతర.. ఫొటోలు వైరల్మేకప్ లేకుండా కనిపించిన బిగ్ బాస్ దివి View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
మైనపు విగ్రహంతో రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ జరగ్గా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కొన్నిరోజుల క్రితమే కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన చరణ్.. మే 10న విగ్రహాన్ని ఆవిష్కరించాడు.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్) కొన్నాళ్ల క్రితం మ్యూజియం నిర్వహకులు స్వయంగా హైదరాబాద్ వచ్చి చరణ్ కొలతలు తీసుకుని వెళ్లారు. మైనపు విగ్రహంలో చరణ్ తోపాటు అతడి పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. అలానే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం. తద్వారా చరణ్ అరుదైన ఘనత సాధించాడు.గతంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ లో, అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని.. మేడమ్ టుస్సాడ్స్ దుబాయి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఈ గౌరవం దక్కింది. చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఇది థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?
పూరీ జగన్నాథ్ కు వరస డిజాస్టర్లు పడ్డాయి. దీంతో టైం తీసుకుని విజయ్ సేతుపతిని ఓ సినిమా చేసేందుకు ఒప్పించాడు. ఇదంతా కొన్నిరోజుల క్రితం సంగతి. అప్పటినుంచి ఈ ప్రాజెక్టులోకి ఒక్కో యాక్టర్ వస్తున్నారు. ఇదివరకే టబు, దునియా విజయ్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ గా ఇన్ స్టా బ్యూటీని తీసుకున్నట్లు తెలుస్తోంది.లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి దెబ్బ మీద దెబ్బ పడింది. దీంతో పూరీ ఇకపై మూవీస్ చేయడం సందేహమే అని అందరూ ఫిక్సయ్యారు. మరి ఏం స్టోరీ చెప్పాడో ఏమో గానీ విజయ్ సేతుపతి.. పూరీతో కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పాడు. కొన్నిరోజుల క్రితం ఈ కాంబోని అధికారికంగా ప్రకటించారు కూడా.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్) బెగ్గర్ అనే టైటిల్ అనుకున్నారని, అందుకు తగ్గట్లే కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందనే ప్రచారం జరిగింది. టబు, దునియా విజయ్ లాంటి స్టార్స్ ని తీసుకునే సరికి అంచనాలు కాస్త ఏర్పడ్డాయి. ఇన్ స్టా వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న నిహారికని ఇప్పుడు హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్.తొలుత విజయ్ సరసన రాధిక ఆప్టే నటిస్తుందని రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఫైనల్ గా నిహారిక ఆ పాత్రలో నటించనుందని సమాచారం. ఇన్ స్టాలో ఈమెకు 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మేజర్ సినిమాని నిర్మించిన మహేశ్ బాబు తో కలిసి ప్రమోషన్ చేయడంతో ఈమె ఫేమస్ అయింది. తర్వాత తమిళంలో ఇదయం మురళి, పెరుసు చిత్రాల్లో నటించింది. అలా ఇప్పుడు పూరీ కొత్త మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నిహారిక లక్ తోక తొక్కినట్లే.(ఇదీ చదవండి: అభిమానులకు షాకిచ్చిన ఛార్మి.. ఇలా మారిపోయిందేంటి?) -
అభిమానులకు షాకిచ్చిన ఛార్మి.. ఇలా మారిపోయిందేంటి?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఛార్మి కౌర్. ప్రస్తుతం నిర్మాతగా మారిపోయింది. గతేడాది పూరి జగన్నాధ్తో కలిసి డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూడు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. నీ తోడు కావాలి అనే మూవీతో టాలీవుడ్కు పరిచయమైన ఛార్మి.. మాస్ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్నెస్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరమైనా తర్వాత మరింత బొద్దుగా తయారైన ఛార్మి సడన్కు అభిమానులకు షాకిచ్చింది. తాను ప్రస్తుతం 9 కేజీల బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరింత బరువు తగ్గుతానని తెలిపింది. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతుందని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సూపర్బ్ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur)